24-11-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీరు దుఃఖాన్ని సహనం చేయడంలో చాలా సమయాన్ని వ్యర్థము చేసారు, ఇప్పుడు ప్రపంచము మారుతుంది, మీరు తండ్రిని స్మృతి చేయండి, సతోప్రధానంగా అవ్వండి, అప్పుడు సమయము సఫలమవుతుంది”

ప్రశ్న:-

21 జన్మల కోసం లాటరీ ప్రాప్తి చేసుకునే పురుషార్థము ఏమిటి?

జవాబు:-

21 జన్మల లాటరీని తీసుకోవాలంటే మోహజీతులుగా అవ్వండి. ఒక్క తండ్రిపై పూర్తిగా బలిహారమవ్వండి. ఇప్పుడు ఈ పాత ప్రపంచము పరివర్తనవుతుంది, మనము కొత్త ప్రపంచములోకి వెళ్తున్నాము అనే స్మృతిలో సదా ఉండాలి. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకూడదు. సుదాముని వలె పిడికెడు అటుకులను సఫలము చేసుకొని సత్యయుగీ రాజ్యాధికారాన్ని తీసుకోవాలి.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థము చేయిస్తున్నారు, ఇది పిల్లలు అర్థం చేసుకుంటారు. ఆత్మిక పిల్లలనగా ఆత్మలు. ఆత్మిక తండ్రి అనగా ఆత్మల తండ్రి. దీనినే ఆత్మ మరియు పరమాత్మల మిలనమని అంటారు. ఈ మిలనము ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఈ విషయాలన్నీ పిల్లలైన మీకు తెలుసు. ఇది విచిత్రమైన విషయము. విచిత్రుడైన తండ్రి విచిత్రమైన ఆత్మలకు అర్థం చేయిస్తారు. వాస్తవానికి ఆత్మ విచిత్రమైనది, ఇక్కడకు వచ్చి చిత్రధారిగా అవుతుంది. చిత్రము ద్వారా పాత్రను అభినయిస్తుంది. అందరిలోనూ ఆత్మ ఉంది కదా. జంతువులలో కూడా ఆత్మ ఉంటుంది. 84 లక్షలు అని అంటారు, ఇందులో జంతువులన్నీ వచ్చేస్తాయి కదా. ఎన్నో జంతువులు మొదలైనవి ఉన్నాయి కదా. ఈ విషయాలలో సమయాన్ని వ్యర్థము చేసుకోవద్దు అని తండ్రి అర్థం చేయిస్తారు. ఈ జ్ఞానము లేకపోతే మనుష్యుల సమయము వ్యర్థమవుతూ ఉంటుంది. ఈ సమయంలో తండ్రి కూర్చుని పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు, తర్వాత అర్థకల్పము మీరు ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. అక్కడ మీకు ఎటువంటి కష్టమూ ఉండదు. దుఃఖము సహనం చేయడంలోనే మీ సమయము వ్యర్థమవుతుంది. ఇక్కడైతే దుఃఖమే దుఃఖముంది, అందుకే దుఃఖములో మా సమయము వ్యర్థమవుతుంది, దీని నుండి బయటకు తీయండి అని అందరూ తండ్రిని స్మృతి చేస్తారు. సుఖంలో ఎప్పుడూ సమయము వ్యర్థమవుతుందని అనరు. ఈ సమయములో మనుష్యులకు ఎటువంటి విలువ లేదని కూడా మీరు అర్థం చేసుకుంటారు. మనుష్యులను చూడండి, అకస్మాత్తుగా మరణిస్తారు. ఒక్క తుఫానులోనే ఎంత మంది మరణిస్తారు. రావణ రాజ్యంలో మనుష్యులకు ఎటువంటి విలువ లేదు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఎంత విలువైనవారిగా తయారుచేస్తారు. పైసా అంత విలువ కూడా లేని వారి నుండి విలువైనవారిగా తయారుచేస్తారు. వజ్రతుల్యమైన జన్మ అమూల్యమైనదని గాయనం కూడా చేయబడుతుంది. ఈ సమయంలో మనుష్యులు గవ్వల వెనుక పడుతున్నారు. ఒకవేళ అయితే, లక్షాధిపతులుగా, కోటీశ్వరులుగా, పదమపతులుగా అవుతారు, వారి బుద్ధి అంతా అందులోనే ఉంటుంది. వీటన్నిటినీ మరచి ఒక్క తండ్రినే స్మృతి చేయమని వారికి చెప్పినా కానీ స్వీకరించరు. కల్పక్రితం కూడా ఎవరి బుద్ధిలోనైతే కూర్చుందో, వారి బుద్ధిలోనే కూర్చుంటుంది. లేదంటే ఎంతగా అర్థము చేయించినా కూడా, ఎప్పటికీ బుద్ధిలో కూర్చోదు. ఈ ప్రపంచము మారుతుందని మీకు కూడా నంబరువారుగా తెలుసు. ప్రపంచము మారుతుందని మీరు బయట వ్రాసినా కూడా, మీరు ఎవరికైనా అర్థము చేయించనంత వరకు అర్థము చేసుకోలేరు. అచ్ఛా, ఎవరైనా అర్థము చేసుకుంటే, అప్పుడు వారికి - తండ్రిని స్మృతి చేయండి, సతోప్రధానంగా అవ్వండి అని అర్థం చేయించవలసి ఉంటుంది. జ్ఞానమైతే చాలా సహజము. వీరు సూర్య వంశీయులు-చంద్ర వంశీయులు...... ఇప్పుడు ఈ ప్రపంచము మారుతుంది, మార్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇది కూడా మీకు యథార్థ రీతిగా తెలుసు, అది కూడా నంబరువారు పురుషార్థానుసారంగా తెలుసు. మాయ పురుషార్థము చెయ్యనివ్వదు, ఇక డ్రామానుసారంగా ఇంతటి పురుషార్థము జరగదని భావిస్తారు. శ్రీమతము ద్వారా మేము మా కోసం ఈ ప్రపంచాన్ని పరివర్తన చేస్తున్నామని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. శ్రీమతము ఒక్క శివబాబాది మాత్రమే. శివబాబా, శివబాబా అని అనడం అయితే చాలా సహజం, ఇంకెవ్వరికీ శివబాబా గురించి గానీ, వారసత్వము గురించి గానీ తెలియదు. బాబా అంటేనే వారసత్వము. సత్యమైన శివబాబా కావాలి కదా. ఈ రోజుల్లోనైతే మేయరును కూడా ఫాదర్ అని అనేస్తారు. గాంధీని కూడా ఫాదర్ అని అంటారు, కొందరిని మళ్ళీ జగద్గురువు అని అంటారు. ఇప్పుడు జగత్తు అనగా మొత్తము సృష్టికి గురువు. మనుష్యులెవ్వరైనా అలా ఎలా అవ్వగలరు! పతిత పావనుడు, సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి అయితే నిరాకారుడు, మరి వారు ముక్తినెలా ఇస్తారు? ప్రపంచము పరివర్తనవుతుంది కనుక వారు తప్పకుండా కర్తవ్యములోకి వస్తారు, అప్పుడు తెలుస్తుంది. ప్రళయం జరుగుతుంది, తర్వాత తండ్రి కొత్త సృష్టిని రచిస్తారని కాదు. చాలా పెద్ద ప్రళయము జరుగుతుంది, తర్వాత రావి ఆకుపై కృష్ణుడు వస్తారని శాస్త్రాలలో చూపించారు. కానీ అలా జరగదని తండ్రి అర్థం చేయిస్తారు. ప్రపంచ చరిత్ర-భూగోళాలు రిపీట్ అవుతాయని గాయనమున్నప్పుడు ఇక ప్రళయము జరగదు. ఇప్పుడు ఈ పాత ప్రపంచము మారుతుందని మీ మనుసులో ఉంది. ఈ విషయాలన్నీ తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. ఈ లక్ష్మీనారాయణులు కొత్త ప్రపంచానికి యజమానులు, పాత ప్రపంచానికి రావణుడు యజమాని అని మీరు చిత్రాలలో కూడా చూపిస్తారు. రామరాజ్యము మరియు రావణరాజ్యమని గాయనము చేయబడుతుంది కదా. బాబా పాత ఆసురీ ప్రపంచాన్ని సమాప్తం చేసి కొత్త దైవీ ప్రపంచాన్ని స్థాపన చేయిస్తున్నారనే విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి. నేను ఎవరిని, ఎలా ఉంటాను అనేది ఎవరో అరుదుగా అర్థం చేసుకుంటారని తండ్రి అంటారు. ఇది కూడా మీకు నంబరువారు పురుషార్థానుసారంగా తెలుసు. ఎవరైతే మంచి పురుషార్థీలు ఉంటారో, వారికి చాలా మంచి నషా ఉంటుంది. స్మృతి యొక్క పురుషార్థీలకు నిజమైన నషా ఎక్కుతుంది. స్మృతియాత్రలో ఎక్కినంత నషా, 84 జన్మల చక్రం యొక్క జ్ఞానాన్ని అర్థం చేయించడంలో ఎక్కదు. ముఖ్యమైన విషయము, పావనంగా అవ్వడము. మీరు వచ్చి పావనంగా చేయండి అని కూడా పిలుస్తారు. మీరు వచ్చి విశ్వరాజ్యాధికారం ఇవ్వండి అని పిలవరు. భక్తిమార్గంలో కూడా ఎన్ని కథలు వింటారు. సత్యాతి-సత్యమైన సత్యనారాయణుని కథ అయితే ఇదే. ఆ కథలైతే జన్మ-జన్మాంతరాలుగా వింటూ-వింటూ క్రిందకే పడిపోతూ వచ్చారు. భారతదేశంలోనే ఇటువంటి కథలు వినే పద్ధతి ఉంది, ఇతర ఏ ఖండములోనూ కథలు మొదలైనవి ఉండవు. భారతదేశాన్నే ధార్మికంగా భావిస్తారు. భారతదేశంలోనే అనేక మందిరాలున్నాయి. క్రిస్టియన్లకైతే ఒకే చర్చి ఉంటుంది. ఇక్కడైతే రక-రకాల మందిరాలు ఎన్నో ఉన్నాయి. వాస్తవానికి శివబాబా మందిరము ఒక్కటే ఉండాలి. పేరు కూడా ఒక్కరిదే ఉండాలి. ఇక్కడైతే అనేక పేర్లున్నాయి. విదేశీయులు కూడా ఇక్కడి మందిరాలను చూసేందుకు వస్తారు. పాపం వారికి ప్రాచీన భారతదేశమెలా ఉండేదో తెలియదు. 5 వేల సంవత్సరాల కన్నా పాత వస్తువేదీ ఉండదు. లక్షల సంవత్సరాల నాటి పురాతన వస్తువులు లభించాయని వారు భావిస్తారు. ఈ మందిరాలలో ఉన్న చిత్రాలు మొదలైనవి తయారై 2500 సంవత్సరాలు అయ్యింది అని తండ్రి అర్థం చేయిస్తారు. మొట్టమొదట శివుని పూజ మాత్రమే జరుగుతుంది. అది అవ్యభిచారి పూజ. అలాగే అవ్యభిచారి జ్ఞానమని కూడా అంటారు. మొదట అవ్యభిచారి పూజ, తర్వాత వ్యభిచారి పూజ జరుగుతుంది. ఇప్పుడైతే నీటిని, మట్టిని కూడా పూజిస్తూ ఉన్నారు చూడండి.

భక్తిమార్గంలో మీరు ఎంత ధనాన్ని పోగొట్టుకున్నారు అని ఇప్పుడు అనంతమైన తండ్రి అంటున్నారు. లెక్కలేనన్ని శాస్త్రాలు, అనేక చిత్రాలు ఉన్నాయి. గీతలు లెక్కలేనన్ని ఉంటాయి. వీటన్నిటిపై ఖర్చు చేస్తూ-చేస్తూ మీరెలా అయిపోయారో చూడండి. నిన్న మిమ్మల్ని ద్వికిరీటధారులుగా చేశాను, మీరు మళ్ళీ ఎంత నిరుపేదగా అయిపోయారు. ఇది నిన్నటి విషయమే కదా. మనమే 84 జన్మల చక్రంలో తిరిగామని కూడా మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ మనం ఇలా తయారవుతున్నాము. బాబా నుండి వారసత్వము తీసుకుంటున్నాము. బాబా పదే-పదే పురుషార్థము చేయిస్తూ ఉంటారు. గీతలో కూడా మన్మనాభవ అనే పదముంది. ఏవో కొన్ని పదాలు సరైనవి ఉన్నాయి. ప్రాయః లోపమైపోయిందని అంటారు కదా, అనగా దేవీ దేవతా ధర్మము ఇప్పుడు లేదు, చిత్రాలు మిగిలి ఉన్నాయి. మీ స్మృతి చిహ్నాలు ఎంత బాగా తయారుచేయబడ్డాయో చూడండి. ఇప్పుడు మనము మళ్ళీ స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. తర్వాత భక్తిమార్గములో మన స్మృతిచిహ్నాలే ఏక్యురేట్ గా తయారౌతాయి. భూకంపాలు మొదలైనవి జరుగుతాయి, అప్పుడు అన్నీ సమాప్తమైపోతాయి. మళ్ళీ మీరు అక్కడ అన్నీ కొత్తగా తయారుచేస్తారు. అక్కడ నైపుణ్యం ఉంటుంది కదా. వజ్రాలను కోయడం కూడా ఒక కళ. ఇక్కడ కూడా వజ్రాలను కోసి తర్వాత తయారుచేస్తారు. వజ్రాలను కోసేవారు కూడా గొప్ప నిపుణులుగా ఉంటారు. వారు మళ్ళీ అక్కడకు వెళ్తారు. ఈ కళలన్నీ అక్కడకు వెళ్తాయి. అక్కడ ఎంత సుఖముంటుందో మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది కదా. దాని పేరే స్వర్గము. 100 శాతము సంపన్నముగా ఉంటుంది. ఇప్పుడు నిరుపేదగా ఉంది. భారతదేశంలో నగల ఫ్యాషన్ చాలా ఉంటుంది, ఇది పరంపరగా నడుస్తూ వస్తుంది. కనుక పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి. ఈ ప్రపంచం మారుతుంది, ఇప్పుడు స్వర్గంగా అవుతుంది అని మీకు తెలుసు. దీని కోసం మనము తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. దైవీగుణాలను కూడా ధారణ చేయాలి, అందుకే బాబా చార్టు తప్పకుండా వ్రాయండి అని అంటారు. ఆత్మనైన నేను ఎలాంటి ఆసురీ కర్మలు చేయలేదు కదా? స్వయాన్ని ఆత్మ అని పక్కాగా భావించండి. ఈ శరీరం ద్వారా వికర్మలేవీ చేయలేదు కదా? ఒకవేళ చేసి ఉంటే రిజిస్టరు పాడైపోతుంది. ఇది 21 జన్మల లాటరీ. ఇది కూడా రేస్. గుర్రపు పందెములుంటాయి కదా. దీనిని రాజస్వ అశ్వమేధ...... అని అంటారు, స్వరాజ్యము కోసం అశ్వము అనగా ఆత్మలైన మీరు పరుగు తీయాలి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. దానిని స్వీట్ సైలెన్స్ హోమ్ అని అంటారు. ఈ పదమును మీరిప్పుడే వింటారు. పిల్లలూ, బాగా శ్రమ చేయండి అని ఇప్పుడు తండ్రి అంటారు. రాజ్యం లభిస్తుంది, ఇది చిన్న విషయమేమి కాదు. నేను ఆత్మను, నేను ఇన్ని జన్మలు తీసుకున్నాను. మీ 84 జన్మలు పూర్తయ్యాయి, ఇప్పుడు మళ్ళీ మొదటి నంబరు నుండి ప్రారంభించాలి అని తండ్రి అంటారు. కొత్త మహళ్ళలో తప్పకుండా పిల్లలే కూర్చుంటారు. పాతవాటిలోనైతే కూర్చోరు. స్వయం పాతవాటిలో కూర్చుని, కొత్తవాటిలో కిరాయివారిని కూర్చోబెట్టడం కాదు. మీరు ఎంతగా శ్రమ చేస్తారో, అంతగా కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు. కొత్త ఇల్లు తయారైనప్పుడు పాతదానిని వదిలి కొత్తదానిలో కూర్చోవాలని మనసుకు అనిపిస్తుంది. మొదటి ఇల్లు పాతదైనప్పుడు తండ్రి పిల్లల కోసం కొత్త ఇల్లును నిర్మిస్తారు. అక్కడైతే కిరాయికు ఇచ్చే విషయమే ఉండదు. ఎలాగైతే వారు చంద్రునిపై ప్లాట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తారో, అలా మీరు స్వర్గంలో ప్లాట్ తీసుకుంటున్నారు. ఎంతెంతగా జ్ఞానం మరియు యోగంలో ఉంటారో, అంతంతగా పవిత్రంగా అవుతారు. ఇది రాజయోగము, ఎంత గొప్ప రాజ్యం లభిస్తుంది. ఇకపోతే, చంద్రుడు మొదలైనవాటిపై ప్లాట్ వెతుకుతూ ఉండటమంటే అదంతా వ్యర్థము. సుఖమునిచ్చే ఈ వస్తువులే మళ్ళీ వినాశనము చేసేందుకు, దుఃఖమునిచ్చేవిగా అవుతాయి. మున్ముందు సైన్యము మొదలైనవన్నీ తగ్గిపోతాయి. బాంబులతోనే త్వరత్వరగా పని జరిగిపోతూ ఉంటుంది. ఈ డ్రామా తయారుచేయబడింది, సమయానికి అకస్మాత్తుగా వినాశనం జరుగుతుంది. తర్వాత సిపాయిలు మొదలైనవారు కూడా మరణిస్తారు. చూడడంలో ఆనందమనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఫరిస్తాలుగా అవుతున్నారు. మన కోసమే వినాశనము జరుగుతుందని మీకు తెలుసు. పాత ప్రపంచము సమాప్తమైపోతుంది, డ్రామాలో ఈ పాత్ర ఉంది. ఎవరు ఎలాంటి కర్మలు చేస్తారో, అలానే అనుభవించాలి కదా. సన్యాసులు మంచివారు కావచ్చు కానీ జన్మ అయితే మళ్ళీ గృహస్థుల వద్దనే తీసుకుంటారు కదా. మీకు శ్రేష్ఠ జన్మ అయితే కొత్త ప్రపంచంలోనే లభిస్తుంది, అయినా కూడా సంస్కారాల అనుసారంగా అలా అవుతారు. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచము కోసం సంస్కారాలను తీసుకువెళ్తారు. జన్మ కూడా తప్పకుండా భారతదేశములోనే తీసుకుంటారు. చాలా మంచి ధార్మిక బుద్ధికలవారి వద్ద జన్మ తీసుకుంటారు ఎందుకంటే మీరు అలాంటి కర్మలే చేస్తారు. సంస్కారాలనుసారంగా జన్మ ఉంటుంది. మీరు వెళ్ళి చాలా ఉన్నతమైన కులములో జన్మ తీసుకుంటారు. మీవంటి కర్మలు చేసేవారైతే ఎవ్వరూ ఉండరు. ఎటువంటి చదువో, ఎటువంటి సేవనో, అటువంటి జన్మ లభిస్తుంది. చాలామంది మరణించేది ఉంది. రిసీవ్ చేసుకునేవారు కూడా ముందు వెళ్ళాలి. ఇప్పుడు ఈ ప్రపంచము మారుతుందని తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి అయితే సాక్షాత్కారము చేయించారు. బాబా తన ఉదాహరణను కూడా తెలియజేస్తారు. 21 జన్మల కోసం రాజ్యం లభిస్తుంది, దాని ముందు ఈ 10-20 లక్షలు ఏ పాటివని చూసారు. అల్ఫ్ కు రాజ్యాధికారం లభించింది, బే కు గాడిద చాకిరి లభించింది. ఏం కావాలో అది తీసుకోమని భాగస్థునికి చెప్పేసారు. ఎటువంటి కష్టము కలగలేదు. పిల్లలకు కూడా అర్థం చేయించడం జరుగుతుంది - బాబా నుండి మీరు ఏం తీసుకుంటారు? స్వర్గ రాజ్యాధికారం. ఎంత వీలైతే అంత సెంటర్లు తెరుస్తూ వెళ్ళండి. అనేకుల కళ్యాణము చేయండి. మీకు 21 జన్మల సంపాదన జరుగుతుంది. ఇక్కడైతే లక్షాధికార్లు, కోటీశ్వరులు చాలా మంది ఉన్నారు. వాస్తవానికి వాళ్ళందరూ నిరుపేదలు. మీ వద్దకు కూడా చాలా మంది వస్తారు. ప్రదర్శనీకి ఎంత మంది వస్తారు, ప్రజలు తయారవ్వడం లేదని అనుకోకండి. చాలా మంది ప్రజలు తయారవుతారు. బాగుంది-బాగుంది అని చాలా మంది అంటారు కానీ మాకు తీరిక లేదని అంటారు. కొద్దిగా విన్నా ప్రజల్లోకి వచ్చేస్తారు. అవినాశీ జ్ఞానము వినాశనం అవ్వదు. బాబా పరిచయమివ్వడం చిన్న విషయమేమీ కాదు. కొంతమంది రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఒకవేళ ఉన్నత పదవిని పొందాలంటే పురుషార్థము చేయడం మొదలుపెడతారు. బాబా ఎవరి వద్ద ధనము మొదలైనవి తీసుకోరు. పిల్లల యొక్క ఒక్కొక్క బిందువుతో సరోవరము తయారవుతుంది. కొంతమంది ఒక్క రూపాయిని కూడా పంపిస్తారు. బాబా, ఒక్క ఇటుకను పెట్టండి. సుదాముని పిడికెడు అటుకులకు గాయనముంది కదా. ఈ వజ్ర వైఢూర్యాలు మీవే అని బాబా అంటారు. అందరి జన్మలు వజ్రం వలె అవుతాయి. మీరు భవిష్యత్తు కోసం తయారుచేసుకుంటున్నారు. ఇక్కడ ఈ కళ్ళతో చూసేదంతా పాత ప్రపంచమని మీకు తెలుసు. ఈ ప్రపంచం మారిపోతుంది. ఇప్పుడు మీరు అమరపురికి యజమానులుగా అవుతున్నారు. మోహజీతులుగా తప్పకుండా అవ్వాల్సి ఉంటుంది. బాబా, మీరు వస్తే మేము బలిహారమైపోతాము అని మీరు అంటూ వచ్చారు, ఈ వ్యాపారము అయితే బాగుంది కదా. వ్యాపారస్థుడు, రత్నాకరుడు, ఇంద్రజాలికుడు అనే పేర్లు ఎందుకు వచ్చాయో మనుష్యులకు తెలియదు. వారు రత్నాకరుడు కదా, అవినాశీ జ్ఞానరత్నలు ఒక్కొక్కటి అమూల్యమైన మహావాక్యాలు. దీనిపై రూపబసంతుల కథ ఉంది కదా. మీరు రూప్ కూడా, బసంత్ కూడా (జ్ఞానులు, యోగులు). అచ్ఛా!

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇప్పుడు ఈ శరీరము ద్వారా ఎలాంటి వికర్మలూ చేయకూడదు. రిజిస్టరు పాడైయ్యే విధంగా ఎటువంటి ఆసురీ కర్మలు జరగకూడదు.

2. ఒక్క తండ్రి స్మృతి యొక్క నషాలో ఉండాలి. పావనంగా అయ్యే ముఖ్యమైన పురుషార్థము తప్పకుండా చేయాలి. గవ్వల వెనుక మీ అమూల్యమైన సమయాన్ని పాడు చేసుకోకుండా శ్రీమతము ద్వారా జీవితాన్ని శ్రేష్ఠంగా చేసుకోవాలి.

వరదానము:-

స్వయాన్ని మౌల్డ్ చేసుకొని (మలచుకొని) రియల్ గోల్డ్ గా అయ్యి ప్రతి కార్యంలోనూ సఫలతను పొందే స్వ పరివర్తక భవ

ఎవరైతే ప్రతి పరిస్థితిలోనూ స్వయాన్ని పరివర్తన చేసుకుని స్వ పరివర్తకులుగా అవుతారో, వారు సదా సఫలతను పొందుతారు కనుక స్వయాన్ని మార్చుకునే లక్ష్యము పెట్టుకోండి. ఇతరులు మారితే నేను మారుతాను - అలా కాదు. ఇతరులు మారినా, మారకపోయినా నేను మారాలి. హే అర్జునునిగా నేనే అవ్వాలి. పరివర్తన చేసుకోవడంలో సదా ముందు నేను. ఇందులో ఎవరైతే మొదట నేను అంటారో, వారే ఫస్ట్ నంబరుగా అవుతారు ఎందుకంటే స్వయాన్ని మౌల్డ్ చేసుకునేవారే (మలచుకునేవారే) రియల్ గోల్డ్. రియల్ గోల్డ్ కే విలువ ఉంటుంది.

స్లోగన్:-

మీ శ్రేష్ఠ జీవితం యొక్క ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయండి.