27-11-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీకు డ్రామా ఆట గురించి తెలుసు కావున కృతజ్ఞతలను తెలపవలసిన విషయం కూడా లేదు”

ప్రశ్న:-

సర్వీసబుల్ పిల్లలలో ఏ అలవాటు అసలు ఉండకూడదు?

జవాబు:-

యాచించే (అడిగే) అలవాటు ఉండకూడదు. మీరు తండ్రిని ఆశీర్వాదాలు లేక కృప మొదలైనవి అడగవలసిన అవసరం లేదు. మీరెవ్వరినీ ధనం కూడా అడగకూడదు. అడగడం కన్నా మరణించడం మేలు. డ్రామా అనుసారముగా కల్పక్రితము ఎవరైతే బీజాన్ని నాటి ఉంటారో వారే నాటుతారని మీకు తెలుసు, ఎవరికైతే తమ భవిష్య పదవిని ఉన్నతంగా తయారుచేసుకునేది ఉంటుందో, వారు తప్పకుండా సహయోగిగా అవుతారు అని మీకు తెలుసు. సేవ చేయడమే మీ పని. మీరు ఎవ్వరినీ ఏమీ అడగకూడదు. భక్తిలో అడగడం జరుగుతుంది, జ్ఞానములో అలా జరగదు.

గీతము:-

నాకు ఆధారాన్ని ఇచ్చేవారు..... (ముజ్ కో సహారా దేనేవాలే.....)

ఓంశాంతి. తండ్రి-టీచరు-గురువు పట్ల పిల్లలకు లోపల నుండి కృతజ్ఞత అనే పదం వెలువడకూడదు ఎందుకంటే ఈ ఆట తయారుచేయబడిందని పిల్లలకు తెలుసు. కృతజ్ఞతలు మొదలైనవాటి విషయమే లేదు. ఇది కూడా పిల్లలకు డ్రామానుసారంగా తెలుసు. డ్రామా అనే పదము కూడా పిల్లలైన మీ బుద్ధిలోకి వస్తుంది. ఆట అనే పదం అనగానే మొత్తం ఆట మీ బుద్ధిలోకి వచ్చేస్తుంది అనగా మీకు మీరే స్వదర్శన చక్రధారులుగా అయిపోతారు. మూడు లోకాలు కూడా మీ బుద్ధిలోకి వచ్చేస్తాయి. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము. ఆట ఇప్పుడు పూర్తవుతుందని కూడా మీకు తెలుసు. తండ్రి వచ్చి మిమ్మల్ని త్రికాలదర్శులుగా తయారుచేస్తారు. మూడు కాలాలు, మూడు లోకాలు, ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థము చేయిస్తారు. కాలము అని సమయాన్ని అంటారు. ఈ విషయాలన్నీ నోట్ చేసుకోకుండా గుర్తుంచుకోలేరు. పిల్లలైన మీరు చాలా పాయింట్లు మర్చిపోతారు. డ్రామా యొక్క వ్యవధి కూడా మీకు తెలుసు. మీరు త్రినేత్రి, త్రికాలదర్శులుగా అవుతారు, జ్ఞానం యొక్క మూడవ నేత్రము లభిస్తుంది. మీరు ఆస్తికులుగా అయిపోతారు అన్నది అన్నిటికన్నా గొప్ప విషయము, లేదంటే ఇంతవరకు అనాథలుగా ఉండేవారు. ఈ జ్ఞానము పిల్లలైన మీకు లభిస్తుంది. విద్యార్థి బుద్ధిలో సదా జ్ఞాన మథనము జరుగుతుంది. ఇది కూడా జ్ఞానం కదా. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రియే డ్రామానుసారంగా జ్ఞానాన్నిస్తారు. డ్రామా అనే పదము కూడా మీ నోటి నుండే వెలువడగలదు. అది కూడా సేవలో తత్పరులై ఉన్న పిల్లల నోటి నుండే వెలువడుతుంది. మనము అనాథలుగా ఉండేవారమని మీకిప్పుడు తెలుసు. ఇప్పుడు అనంతమైన తండ్రి అయిన ఆ నాథుడు లభించారు కనుక ఆ నాథుడికి చెందినవారిగా అయ్యాము. ఇదివరకు మీరు అనంతమైన అనాథలుగా ఉండేవారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖమునిచ్చేవారు, ఇటువంటి సుఖమునిచ్చే తండ్రి ఇంకెవ్వరూ ఉండరు. కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము, ఇవన్నీ పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నాయి. కానీ ఇతరులకు కూడా యథార్థ రీతిలో అర్థము చేయించి, ఈ ఈశ్వరీయ వ్యాపారంలో నిమగ్నమవ్వాలి. ప్రతి ఒక్కరి పరిస్థితులు ఎవరివి వారివి ఉంటాయి. ఎవరైతే స్మృతియాత్రలో ఉంటారో వారే అర్థము చేయించగలరు. స్మృతి ద్వారా బలము లభిస్తుంది కదా. తండ్రి పదును గల ఖడ్గము వంటివారు. పిల్లలైన మీరు పదును నింపుకోవాలి. యోగబలము ద్వారా విశ్వ రాజ్యాధికారం పొందుతారు. యోగము ద్వారా బలము లభిస్తుంది, జ్ఞానము ద్వారా లభించదు. జ్ఞానము సంపాదనకు ఆధారము అని పిల్లలకు అర్థము చేయించారు. యోగాన్ని బలము అని అంటారు. రాత్రి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు జ్ఞానము మంచిదా లేక యోగము మంచిదా? యోగమే ప్రసిద్ధి చెందింది. యోగము అనగా తండ్రి స్మృతి. ఈ స్మృతి ద్వారానే మీ పాపాలు తొలగిపోతాయి అని తండ్రి అంటారు. దీని పైనే తండ్రి జోరునిస్తారు. జ్ఞానము అయితే సహజము. భగవానువాచ - నేను మీకు సహజ జ్ఞానాన్ని వినిపిస్తాను. 84 జన్మల చక్ర జ్ఞానాన్ని వినిపిస్తాను. అందులో అన్నీ వచ్చేస్తాయి. చరిత్ర-భూగోళాలు కదా. జ్ఞానము మరియు యోగము, రెండూ క్షణం యొక్క విషయాలు. నేను ఆత్మను, నేను తండ్రిని స్మృతి చేయాలి, అంతే. ఇందులో శ్రమ ఉంది. స్మృతియాత్రలో ఉండడం ద్వారా శరీరం యొక్క విస్మృతి జరుగుతూ ఉంటుంది. ఒక గంట అయినా ఇలా పూర్తిగా అశరీరిగా అయి కూర్చుంటే ఎంత పావనంగా అయిపోతారు. మనుష్యులు రాత్రివేళలో కొందరు 6 గంటలు, కొందరు 8 గంటలు నిద్రించినప్పుడు అశరీరిగా అయిపోతారు కదా. ఆ సమయంలో ఏ వికర్మలూ జరగవు. ఆత్మ అలసిపోయి నిద్రిస్తుంది. అలాగని పాపాలేవి వినాశనం అవుతాయని కాదు. అది నిద్ర. వికర్మలేవీ జరగవు. నిద్రించకపోతే పాపాలే చేస్తూ ఉంటారు. కనుక నిద్ర కూడా ఒక రక్షణ. ఆత్మ రోజంతా సేవ చేసి, నేనిప్పుడు నిద్రిస్తాను, అశరీరిగా అయిపోతాను అని అంటుంది. మీరు శరీరంలో ఉంటూ అశరీరిగా అవ్వాలి. ఆత్మనైన నేను ఈ శరీరము నుండి అతీతమైన శాంతి స్వరూపాన్ని. ఆత్మ మహిమను ఎప్పుడూ విని ఉండరు. ఆత్మ సత్ చిత్ ఆనంద స్వరూపము. పరమాత్మకు సత్యము, చైతన్యము అన్న మహిమను పాడుతారు. వారు సుఖ-శాంతుల సాగరుడు. ఇప్పుడు మిమ్మల్ని మాస్టర్ అని అంటారు, పిల్లలను మాస్టర్ అని కూడా అంటారు. కనుక తండ్రి యుక్తులు కూడా తెలియజేస్తూ ఉంటారు. అలాగని రోజంతా నిద్రించమని కూడా కాదు. మీరు స్మృతిలో ఉంటూ పాపాలను వినాశనము చేసుకోవాలి. ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేయాలి. అలాగని తండ్రి మన పట్ల దయ లేక కృప చూపిస్తారని కూడా కాదు. దయాహృదయులైన చక్రవర్తి అని వారికి గాయనం ఉంది. తమోప్రధానము నుండి సతోప్రధానముగా చేయడం - ఇది కూడా వారి పాత్ర. భక్తులు మహిమను పాడుతారు, మీరు కేవలం మహిమను పాడకూడదు. రోజురోజుకు ఈ పాటలు మొదలైనవి కూడా నిలిపివేయబడుతూ ఉంటాయి. స్కూలులో ఎప్పుడైనా పాటలుంటాయా? పిల్లలు శాంతిగా కూర్చొని ఉంటారు. టీచరు వచ్చినప్పుడు లేచి నిలబడతారు, తర్వాత కూర్చుంటారు. నాకు చదివించే పాత్ర లభించింది కనుక చదివించాల్సిందే అని ఈ తండ్రి అంటారు. పిల్లలైన మీరు లేచి నిలబడే అవసరము లేదు. ఆత్మ కూర్చొని వినాలి. మీ విషయమే ప్రపంచానికి అతీతమైనది. మీరు లేచి నిలబడండి అని పిల్లలని అంటారా. అది భక్తిమార్గములో చేస్తారు, ఇక్కడ కాదు. తండ్రి స్వయంగా లేచి నమస్కరిస్తారు. ఒకవేళ పిల్లలు స్కూల్ కు ఆలస్యంగా వచ్చినట్లయితే, టీచరు, అయితే రూల్ పెడతారు లేక బయట నిలబెడతారు, అందుకే సమయానికి చేరుకోవాలనే భయముంటుంది. ఇక్కడైతే భయపడే విషయమే లేదు. మురళీలు లభిస్తూ ఉంటాయి అని తండ్రి అర్థము చేయిస్తూ ఉంటారు. వాటిని రెగ్యులర్ గా చదువుకోవాలి. మురళీని చదువుకున్నట్లయితే మీకు ప్రెజంట్ మార్కు (హాజరు) పడుతుంది. లేకపోతే ఆబ్సెంట్ పడుతుంది ఎందుకంటే మీకు గుహ్యాతి-గుహ్యమైన విషయాలు వినిపిస్తానని తండ్రి చెప్తారు. ఒకవేళ మీరు మురళీని మిస్ చేసినట్లయితే ఆ పాయింట్లు మిస్ అయిపోతాయి. ఇవి కొత్త విషయాలు, వీటి గురించి ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. మీ చిత్రాలను చూస్తూనే ఆశ్చర్యపోతారు. ఇవి ఏ శాస్త్రాలలో కూడా లేవు. భగవంతుడు ఈ చిత్రాలను తయారుచేశారు. మీ ఈ చిత్రశాల కొత్తది. బ్రాహ్మణ కులానికి చెందినవారు, ఎవరైతే దేవతలుగా అవ్వబోతున్నారో, వారి బుద్ధిలోనే కూర్చుంటుంది. ఇది రైట్ అని అంటారు. కల్పక్రితము కూడా మనము చదువుకున్నాము, తప్పకుండా భగవంతుడు చదివిస్తారు.

భక్తిమార్గములోని శాస్త్రాలలో మొదటి నంబరులో గీతయే ఉంది, ఎందుకంటే ఇదే మొదటి ధర్మము. మళ్ళీ అర్థకల్పము తర్వాత, అది కూడా చాలా కాలము తర్వాత, ఇతర శాస్త్రాలు తయారౌతాయి. మొదట ఇబ్రహీం వచ్చారు, అప్పుడు వారు ఒక్కరే ఉన్నారు. తర్వాత ఒకరి నుండి ఇద్దరు, ఇద్దరి నుండి నలుగురు అయ్యారు. ధర్మము వృద్ధి చెందుతూ-చెందుతూ లక్ష-లక్షన్నర మంది అయినప్పుడు శాస్త్రాలు మొదలైనవి తయారవుతాయి. అది కూడా అర్థ సమయము తర్వాతనే తయారుచేసి ఉంటారు, లెక్క తీయడం జరుగుతుంది కదా. తండ్రి నుండి మాకు వారసత్వము లభిస్తుందని పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. తండ్రి మాకు సృష్టిచక్ర జ్ఞానమంతా అర్థము చేయిస్తారని మీకు తెలుసు. ఇది అనంతమైన చరిత్ర-భూగోళము. ఇక్కడ ప్రపంచ చరిత్ర-భూగోళాలు అర్థం చేయించడం జరుగుతుందని అందరికీ చెప్పండి, ఇది ఇతరులెవ్వరూ నేర్పించలేరు. ప్రపంచ చిత్రపటాన్ని (మ్యాప్) తయారుచేస్తారు. కానీ అందులో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యము ఎప్పుడు ఉండేది, ఎంత సమయం నడిచింది అనేది ఎక్కడ చూపించారు. ప్రపంచమైతే ఒక్కటే. వారు భారతదేశములోనే రాజ్యం చేసి వెళ్ళారు, ఇప్పుడు వారు లేరు. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. వారైతే కల్పము ఆయుష్షును లక్షల సంవత్సరాలని ఎక్కవచేసి చెప్తారు. మధురాతి-మధురమైన పిల్లలైన మీకు ఎక్కువ కష్టమేమీ ఇవ్వను. పావనంగా అవ్వాలని తండ్రి చెప్తారు. పావనంగా అయ్యేందుకు మీరు భక్తిమార్గములో ఎన్ని ఎదురుదెబ్బలు తింటారు. ఎదురుదెబ్బలు తింటూ-తింటూ 2500 సంవత్సరాలు గడిచిపోయాయని ఇప్పుడు తెలుసుకున్నారు. రాజ్యభాగ్యాన్ని ఇచ్చేందుకు ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చారు. మీకు ఈ స్మృతియే ఉంటుంది. ప్రపంచము పాతది నుండి కొత్తదిగా మరియు కొత్తది నుండి పాతదిగా తప్పకుండా అవుతుంది. ఇప్పుడు మీరు పాత భారతదేశానికి యజమానులు కదా. మళ్ళీ కొత్తదానికి యజమానులుగా అవుతారు. ఒకవైపు భారతదేశం యొక్క మహిమను చాలా పాడుతూ ఉంటారు, మరోవైపు మళ్ళీ చాలా నింద చేస్తూ ఉంటారు. ఆ పాటలు కూడా మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏమేమి జరుగుతుందో మీరు అర్థము చేయిస్తారు. ఈ రెండు పాటలు కూడా వినిపించాలి. రామ రాజ్యము ఎక్కడ, ఇది ఎక్కడ...... అని మీరు తెలియజేయవచ్చు.

తండ్రి పేదల పెన్నిధి. పేదవారి కుమార్తెలే బాబా దగ్గరకు వస్తారు. షావుకార్లకు తమ నషా ఉంటుంది. కల్పక్రితము వచ్చినవారే వస్తారు. చింతించవలసిన విషయమేమీ లేదు. శివబాబాకు ఎప్పుడూ ఎటువంటి చింత ఉండదు, దాదాకు ఉంటుంది. నేను నంబరువన్ పావనంగా అవ్వాలని, వీరికి స్వయం యొక్క చింత కూడా ఉంది. ఇందులో గుప్త పురుషార్థముంది. చార్టును పెట్టడం ద్వారా వీరి పురుషార్థము ఎక్కువగా ఉందని అర్థమవుతుంది. డైరీ వ్రాయమని తండ్రి ఎప్పుడూ అర్థం చేయిస్తూ ఉంటారు. చాలా మంది పిల్లలు వ్రాస్తారు కూడా, చార్టు వ్రాయడం ద్వారా చాలా బాగుపడ్డారు. ఈ యుక్తి చాలా బాగుంటుంది కనుక అందరూ చేయాలి. డైరీ పెట్టడం ద్వారా మీకు చాలా లాభము ఉంటుంది. డైరీ పెట్టడం అనగా తండ్రిని స్మృతి చేయడం. అందులో తండ్రి స్మృతి గురించి వ్రాయాలి. డైరీ కూడా సహాయము చేస్తుంది, పురుషార్థము జరుగుతుంది. మీరు నోట్ చేసుకోవడం కోసం ఎన్ని లక్షల, కోట్ల డైరీలు తయారౌతాయి. నోట్ చేసుకోవడమే అన్నిటికన్నా ముఖ్యమైన విషయము. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. అప్పటికప్పుడే డైరీలో వ్రాయాలి. రాత్రికి పూర్తి లెక్కాపత్రం వ్రాయాలి. అప్పుడు నాకు నష్టము కలుగుతుందని తెలుస్తుంది, ఎందుకంటే జన్మ-జన్మాంతరాల వికర్మలు భస్మము చేసుకోవాలి.

తమపై తాము దయ లేక కృప చూపించుకోవాలని తండ్రి మార్గము తెలియజేస్తారు. టీచరు అయితే చదివిస్తారు, ఆశీర్వదించరు. ఆశీర్వాదాలు, కృప, దయ మొదలైనవి అడగడం కన్నా మరణించడం మేలు. ఎవ్వరినీ ధనము కూడా అడగకూడదు. పిల్లలకు ఇది పూర్తిగా నిషేధించబడింది. డ్రామానుసారంగా, ఎవరైతే కల్పక్రితము బీజాన్ని నాటారో, వారసత్వాన్ని పొందారో, వారు తమకు తామే చేసుకుంటారు అని తండ్రి చెప్తారు. మీరు ఏ పని కోసమూ అడగకండి. చేయకపోతే వారు పొందరు. మనుష్యులు దాన-పుణ్యాలు చేస్తారు కావున రిటర్న్ లో లభిస్తుంది కదా. రాజుల ఇళ్ళలో లేక షావుకార్ల వద్ద జన్మ జరుగుతుంది. ఎవరైతే చేసేది ఉంటుందో, వారు తమంతట తామే చేస్తారు, మీరు అడగకూడదు. కల్పక్రితము ఎవరు ఎంత చేశారో, డ్రామా వారి ద్వారా అలా చేయిస్తుంది. అడగవలసిన అవసరమేముంది. సేవ కోసం హుండి నిండుతూనే ఉంటుంది అని బాబా అయితే చెప్తూ ఉంటారు. ధనము ఇవ్వమని నేను పిల్లలకు చెప్పను. భక్తిమార్గంలోని విషయాలు జ్ఞానమార్గంలో ఉండవు. ఎవరైతే కల్పక్రితము సహాయము చేశారో, వారు చేస్తూనే ఉంటారు, మీ అంతట మీరు ఎప్పుడూ అడగకూడదు. పిల్లలూ, మీరు చందాలు వసూలు చేయకూడదు, అది సన్యాసులు చేస్తారు అని బాబా చెప్తారు. భక్తిమార్గములో కొద్దిగా ఇచ్చినా కూడా దానికి రిటర్న్ లో ఒక జన్మకు లభిస్తుంది. ఇదైతే జన్మ జన్మాంతరాల కోసం ఉంటుంది. జన్మ-జన్మాంతరాల కోసమైతే అంతా ఇచ్చేయడం మంచిదే కదా. వీరి పేరు అయితే భోళా భండారి. మీరు పురుషార్థము చేసినట్లయితే విజయమాలలో స్మరింపబడతారు, భండారా నిండుగా ఉంటే కరువు-కాటకాలు దూరంగా ఉంటాయి. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువు జరగదు. ఇక్కడ మనుష్యులు మృత్యువు గురించి ఎంతగా భయపడతారు. కొద్దిగా ఏమైనా జరిగినా, మృత్యువే గుర్తొస్తుంది. అక్కడ ఈ ఆలోచనే ఉండదు, మీరు అమరపురిలోకి వెళ్తారు. ఇది ఛీ-ఛీ మృత్యులోకము. భారతదేశమే అమరలోకంగా ఉండేది, ఇప్పుడు మృత్యులోకంగా ఉంది.

మీ అర్థకల్పము చాలా ఛీ-ఛీ గా గడిచింది. కిందకు పడిపోతూనే వచ్చారు. జగన్నాథపురిలో చాలా అశుద్ధమైన చిత్రాలున్నాయి. బాబా అయితే అనుభవజ్ఞులు కదా. నలువైపులా తిరిగి వచ్చినవారు. వీరు సుందరం నుండి నల్లగా అయ్యారు. గ్రామంలో ఉండేవారు. వాస్తవానికి ఈ భారతదేశమంతా ఒక గ్రామము. మీరు పల్లెటూరి పిల్లలు. మేము విశ్వానికి యజమానులుగా అవుతామని మీకిప్పుడు తెలుసు. మేమైతే బొంబాయిలో నివసించేవారిమి అని భావించకండి. బొంబాయి కూడా స్వర్గము ముందు ఏ పాటిది! అసలు ఏమీ కాదు. ఒక రాయి అంత కూడా కాదు. పల్లెటూరి పిల్లలైన మనము అనాథలుగా అయిపోయాము, ఇప్పుడు మళ్ళీ స్వర్గానికి యజమానులుగా అవుతున్నాము కనుక సంతోషముండాలి. దాని పేరే స్వర్గము. మహళ్ళలో ఎన్ని వజ్ర-వైఢూర్యాలు పొదగబడి ఉంటాయి. సోమనాథ మందిరమే ఎన్ని వజ్ర-వైఢూర్యాలతో నిండి ఉండేది. మొట్టమొదట శివుని మందిరాన్నే తయారుచేస్తారు. మీరు ఎంత షావుకార్లుగా ఉండేవారు. ఇప్పుడైతే భారతదేశము గ్రామము వంటిది. సత్యయుగంలో చాలా సంపన్నంగా ఉండేది. ఈ విషయాలు ప్రపంచంలో మీకు తప్ప ఎవ్వరికీ తెలియవు. నిన్న మేము చక్రవర్తులుగా ఉండేవారము, నేడు ఫకీరులుగా అయ్యాము, మళ్ళీ విశ్వానికి యజమానులుగా అవుతామని మీరంటారు. పిల్లలైన మీరు మీ భాగ్యము పట్ల కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మేము పదమాపదమ భాగ్యశాలులము. అచ్ఛా!

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. వికర్మల నుండి రక్షించుకునేందుకు ఈ శరీరములో ఉంటూ అశరీరిగా అయ్యే పురుషార్థము చేయాలి. శరీర విస్మృతి కలిగే విధంగా స్మృతి యాత్ర ఉండాలి.

2. జ్ఞాన మథనము చేసి ఆస్తికులుగా అవ్వాలి. మురళీని ఎప్పుడూ మిస్ చేయకూడదు. మీ ఉన్నతి కోసం డైరీలో స్మృతి యొక్క చార్టును నోట్ చేయాలి.

వరదానము:-

జ్ఞానం రూపీ తాళంచెవి ద్వారా తరగని భాగ్యపు ఖజానాను ప్రాప్తి చేసుకునే సుసంపన్న భవ

సంగమయుగంలో పిల్లలందరికీ భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు జ్ఞానమనే తాళంచెవి లభిస్తుంది. ఈ తాళంచెవిని ఉపయోగించండి మరియు ఎంత కావాలనుకుంటే అంత భాగ్యపు ఖజానాను తీసుకోండి. తాళంచెవి లభించింది మరియు సంపన్నంగా అయిపోయారు. ఎవరు ఎంత సంపన్నంగా అవుతారో, అంతగా సంతోషము స్వతహాగా ఉంటుంది. సంతోషపు ప్రవాహం ఆగకుండా, అవినాశీగా ప్రవహిస్తూనే ఉంది అని అనుభవమవుతుంది. వారు సర్వ ఖజానాలతో నిండుగా, సుసంపన్నంగా కనిపిస్తారు. వారి వద్ద ఏ రకమైన అప్రాప్తి ఉండదు.

స్లోగన్:-

తండ్రితో కనెక్షన్ సరిగ్గా ఉంచుకున్నట్లయితే సర్వ శక్తుల కరెంటు లభిస్తూ ఉంటుంది.