ఓంశాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మరియు శిక్షణనిస్తున్నారు, చదివిస్తున్నారు. చదివించే తండ్రి సదా దేహీ-అభిమాని అని పిల్లలకు తెలుసు. వారు ఉన్నదే నిరాకారుడు, దేహాన్ని తీసుకోనే తీసుకోరు. వారు పునర్జన్మలలోకి రారు. పిల్లలైన మీరు నా సమానంగా స్వయాన్ని ఆత్మగా భావించాలి అని తండ్రి అర్థం చేయిస్తారు. నేను పరమపితను. పరమపితకు దేహముండదు. వారిని దేహీ-అభిమాని అని కూడా అనరు. వారు నిరాకారుడు. తండ్రి అంటారు - నాకు నా దేహము లేదు. మీకైతే దేహము లభిస్తూ వచ్చింది. ఇప్పుడు నా సమానంగా దేహము నుండి అతీతంగా అయి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఒకవేళ విశ్వానికి యజమానిగా అవ్వాలంటే, ఇక వేరే కష్టమైన విషయమేమీ లేదు. దేహాభిమానాన్ని వదిలి నా సమానంగా అవ్వండి అని తండ్రి అంటారు. నేను ఆత్మను, నన్ను బాబా చదివిస్తున్నారు అని బుద్ధిలో సదా స్మృతి ఉండాలి. తండ్రి అయితే నిరాకారుడు, కానీ మనల్ని ఎలా చదివిస్తారు? అందుకే బాబా ఈ తనువులోకి వచ్చి చదివిస్తారు. గోముఖాన్ని చూపిస్తారు కదా. ఇప్పుడు గోముఖము నుండైతే గంగ వెలువడదు. మాతను కూడా గోమాత అని అంటారు. మీరందరూ గోవులు. ఈ (బ్రహ్మా) గోవు కారు. నోటి ద్వారా జ్ఞానము లభిస్తుంది. తండ్రికి గోవు లేదు కదా - ఎద్దుపైన కూడా స్వారీ చేసినట్లు చూపిస్తారు. వారైతే శివ-శంకరులు ఒక్కరే అని అంటారు. శివ-శంకరులు ఒక్కరు కాదని పిల్లలైన మీరిప్పుడు అర్థము చేసుకున్నారు. శివుడు అయితే ఉన్నతాతి ఉన్నతమైనవారు, తర్వాత బ్రహ్మా-విష్ణు-శంకరులు. బ్రహ్మా సూక్ష్మవతనవాసి. పిల్లలైన మీరు విచార సాగర మథనము చేసి పాయింట్లు తీసి అర్థము చేయించవలసి ఉంటుంది, మరియు నిర్భయులుగా కూడా అవ్వాలి. పిల్లలైన మీకే సంతోషముంటుంది. మేము ఈశ్వరుని విద్యార్థులము, మమ్మల్ని బాబా చదివిస్తారు అని మీరంటారు. భగవానువాచ కూడా ఉంది - ఓ పిల్లలూ, నేను మిమ్మల్ని రాజులకే రాజుగా తయారుచేసేందుకు చదివిస్తాను. ఎక్కడికి వెళ్ళినా, సెంటర్లకు వెళ్ళినా, బాబా మమ్మల్ని చదివిస్తున్నారని బుద్ధిలో ఉంటుంది. ఏదైతే మనమిప్పుడు సెంటర్లలో వింటామో, ఆ మురళీని బాబా నడిపిస్తారు. బాబా, బాబా అని అంటూ ఉండండి. ఇది కూడా మీ యాత్రే అవుతుంది. యోగమనే పదము శోభించదు. మనుష్యులు అమరనాథ్, బద్రీనాథ్ యాత్రలకు కాలి నడకన వెళ్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు మీ ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ అనంతమైన నాటకము పూర్తవుతుందని మీకు తెలుసు. మనల్ని యోగ్యులుగా తయారుచేసి తీసుకువెళ్ళేందుకు బాబా వచ్చారు. మేము పతితులమని మీరు స్వయంగా అంటారు. పతితులు ముక్తిని పొందలేరు. ఓ ఆత్మలూ, మీరు పతితంగా అయ్యారు అని బాబా అంటారు. వారు శరీరాన్ని పతితమని భావించి గంగలో స్నానము చేసేందుకు వెళ్తారు. వారు ఆత్మను నిర్లేపిగా భావిస్తారు. ముఖ్యమైన విషయము ఆత్మకు సంబంధించినది అని తండ్రి అర్థం చేయిస్తారు. పాపాత్మ, పుణ్యాత్మ అని కూడా అంటారు. ఈ పదాలను బాగా గుర్తుంచుకోండి. అర్థము చేసుకోవాలి మరియు అర్థము చేయించాలి. మీరే భాషణ మొదలైనవి చేయాలి. తండ్రి అయితే పల్లె-పల్లెకు, వీధి-వీధికి వెళ్ళరు. మీరు ఇంటింటిలోనూ ఈ చిత్రాలను పెట్టుకోండి. 84 జన్మల చక్రము ఎలా తిరుగుతుంది అనేది మెట్ల చిత్రంలో చాలా స్పష్టంగా ఉంది. సతోప్రధానంగా అవ్వండి అని ఇప్పుడు తండ్రి చెప్తారు. మీ ఇంటికి వెళ్ళాలి, పవిత్రంగా అవ్వకుండా ఇంటికి వెళ్ళరు. ఇదే చింత ఉండాలి. బాబా, మాకు చాలా తుఫాన్లు వస్తాయి, మనస్సులో చాలా చెడు ఆలోచనలు వస్తాయి, ఇంతకుముందు వచ్చేవి కావు అని చాలా మంది పిల్లలు వ్రాస్తారు.
మీరు అలా ఆలోచించకండి అని బాబా చెప్తారు. ఇంతకుముందు మీరేమీ యుద్ధ మైదానంలో లేరు. ఇప్పుడు మీరు తండ్రి స్మృతిలో ఉంటూ మాయపై విజయం పొందాలి. ఇది పదే-పదే గుర్తు చేసుకుంటూ ఉండండి. కొంగు ముడి వేసుకోండి. మాతలు కొంగు ముడి వేసుకుంటారు, పురుషులైతే నోట్ బుక్ లో వ్రాసుకుంటారు. మీ ఈ బ్యాడ్జ్ మంచి గుర్తు. మనము రాకుమారులుగా అవుతాము, ఇది నిరుపేద నుండి రాకుమారులుగా అయ్యే గాడ్లీ యూనివర్శిటీ (ఈశ్వరీయ విశ్వవిద్యాలయము). మీరు రాకుమారులుగా ఉండేవారు కదా. శ్రీకృష్ణుడు విశ్వానికి రాకుమారునిగా ఉండేవారు. ఇంగ్లాండులో రాకుమారుడిని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అని అంటారు. అవి హద్దు యొక్క విషయాలు, రాధా-కృష్ణులైతే చాలా ప్రసిద్ధమైనవారు. వారు స్వర్గంలో రాకుమార-రాకుమారీలుగా ఉండేవారు కదా, అందునే వారిని అందరూ ప్రేమిస్తారు. శ్రీకృష్ణుడినైతే చాలా ప్రేమిస్తారు. వాస్తవానికి ఇద్దరినీ ప్రేమించాలి. మొదట రాధను ప్రేమించాలి. కానీ కొడుకులపై ఎక్కువ ప్రేమ ఉంటుంది ఎందుకంటే వారు వారసులుగా అవుతారు. స్త్రీకు కూడా పతి పట్ల ప్రేమ ఉంటుంది. వీరు నీ గురువు, ఈశ్వరుడు అని పతి కోసమే అంటారు. స్త్రీ కోసం అలా చెప్పరు. సత్యయుగంలోనైతే మాతలకు మహిమ ఉంటుంది. మొదట లక్ష్మి, తర్వాత నారాయణుడు. అంబను ఎంత గౌరవిస్తారు. వారు బ్రహ్మాకు పుత్రిక. బ్రహ్మాకు అంత మహిమ లేదు, బ్రహ్మా మందిరం అజ్మేరులో ఉంది. అక్కడ మేళాలు మొదలైనవి జరుగుతాయి. అంబ మందిరాలలో కూడా మేళాలు జరుగుతాయి. వాస్తవానికి ఈ మేళాలన్నీ మైలపరచడం కోసమే ఉన్నాయి. మీ ఈ మేళా స్వచ్ఛంగా చేసేటటువంటిది. స్వచ్ఛంగా అయ్యేందుకు మీరు స్వచ్ఛమైన తండ్రిని స్మృతి చేయాలి. నీటి ద్వారా పాపాలేవీ నాశనమవ్వవు. గీతలో కూడా భగవానువాచ - మన్మనాభవ అని ఉంది. ఆది మరియు అంతిమములో ఈ పదముంది. మొట్టమొదట మనమే భక్తిని ప్రారంభించామని పిల్లలైన మీకు తెలుసు. సతోప్రధాన భక్తి, తర్వాత సతో-రజో-తమో భక్తి అవుతుంది. ఇప్పుడు చూడండి, మట్టి, రాళ్ళు మొదలైనవాటన్నిటికీ భక్తి చేస్తారు. ఇదంతా అంధశ్రద్ధ. ఈ సమయములో మీరు సంగమములో కూర్చున్నారు. ఇది తలక్రిందులుగా ఉన్న వృక్షము కదా. పైన బీజముంది. నేను ఈ మనుష్య సృష్టికి బీజమును, రచయితను అని బాబా చెప్తారు. ఇప్పుడు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాను. అంటు కడతారు కదా. వృక్షములోని పాత ఆకులు రాలిపోతాయి. కొత్త-కొత్త ఆకులు వెలువడుతాయి. ఇప్పుడు బాబా దేవీదేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. మిక్స్ అయిన ఆకులు చాలా ఉన్నాయి. స్వయాన్ని హిందువులమని చెప్పుకుంటారు. వాస్తవానికి హిందువులు అంటే ఆదిసనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. వాస్తవానికి హిందుస్తాన్ పేరు భారత్, అక్కడ దేవతలు నివసించేవారు. ఇంకే దేశం పేరూ మారదు, దీని పేరును మార్చేశారు. హిందుస్తాన్ అని అనేస్తారు. బౌద్ధులు, మా ధర్మము జపాన్ లేక చైనా ధర్మం అని అనరు. వారు తమ ధర్మాన్ని బౌద్ధ ధర్మమనే అంటారు. మీలో ఎవ్వరూ కూడా తమను తాము ఆది సనాతన దేవీదేవతా ధర్మానికి చెందినవారిమి అని అనరు. ఒకవేళ ఎవరైనా అన్నా కూడా, ఆ ధర్మాన్ని ఎప్పుడు మరియు ఎవరు స్థాపన చేసారు అని అడగండి. వారు ఏమీ చెప్పలేరు. కల్పము ఆయుష్షును కూడా చాలా ఎక్కువగా చేసేశారు, దీనినే అజ్ఞానాంధకారమని అంటారు. ఒకటేమో, తమ ధర్మము గురించి తెలియదు, రెండవది, లక్ష్మీనారాయణుల రాజ్యాన్ని చాలా దూరంగా తీసుకువెళ్ళిపోయారు, అందుకే ఘోరమైన అంధకారమని అంటారు. జ్ఞానం మరియు అజ్ఞానంలో ఎంత తేడా ఉంది. జ్ఞానసాగరుడు ఒక్క శివబాబా మాత్రమే. వారి నుండి ఒక లోటా అంత మాత్రమే ఇస్తున్నట్లు. ఒకవేళ ఎవరికైనా, శివబాబాను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమౌతాయని కేవలం ఇది మాత్రమే వినిపిస్తే, ఇది దోసిలి అంత నీరు అందించినట్లు కదా. (గంగాజలంలో) కొందరు స్నానం చేస్తారు, కొందరు కుండ నింపుకొని తీసుకువెళ్తారు. కొందరు చిన్న చిన్న చెంబులతో తీసుకువెళ్తారు. ప్రతిరోజూ ఒక్కొక్క నీటి చుక్కను కుండలో వేసి దానిని జ్ఞానజలమని భావించి త్రాగుతారు. విదేశాలకు కూడా వైష్ణవులు గంగాజలాన్ని కుండలలో నింపుకుని తీసుకువెళ్తారు. మళ్ళీ తెప్పించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ నీరంతా పర్వతాల నుండే వస్తుంది. పై నుండి కూడా నీళ్ళు పడతాయి. ఈ రోజుల్లో చూడండి, భవనాలు కూడా ఎంత ఎత్తుగా 100 అంతస్తుల వరకు తయారుచేస్తారు. సత్యయుగంలో ఇలా ఉండదు. అక్కడ మీకు ఎంత భూమి లభిస్తుందో, ఇక అడగకండి. ఇక్కడ నివసించేందుకు స్థలము లేదు, అందుకే ఇన్ని అంతస్తులు నిర్మిస్తారు. అక్కడ ధాన్యము కూడా లెక్కలేనంత పండుతుంది. అమెరికాలో ధాన్యం ఎక్కువగా ఉంటే కాల్చేస్తారు. ఇది మృత్యులోకము. అది అమరలోకము. అర్థకల్పము మీరు అక్కడ సుఖంగా ఉంటారు. కాలుడు లోపలకు దూరలేడు. దీని గురించి ఒక కథ కూడా ఉంది. ఇది అనంతమైన విషయము. అనంతమైన విషయాల నుండి మళ్ళీ హద్దు యొక్క కథలను కూర్చుని తయారుచేశారు. గ్రంథ్ మొదట ఎంత చిన్నదిగా ఉండేది. ఇప్పుడు ఎంత పెద్దదిగా చేసేశారు. శివబాబా ఎంత చిన్నగా ఉంటారు, వారి ప్రతిమను కూడా ఎంత పెద్దదిగా తయారుచేశారు. బుద్ధుని చిత్రమును, పాండవుల చిత్రాలను పెద్ద-పెద్దవిగా, పొడువుగా తయారుచేశారు. ఆ విధంగా ఎవ్వరూ ఉండరు. పిల్లలైన మీరు ఈ లక్ష్యం-ఉద్దేశ్యం యొక్క చిత్రాన్ని ప్రతి ఇంటిలోనూ పెట్టుకోవాలి. మనము చదువుకొని ఇలా తయారౌతున్నాము. కావున ఏడ్వకూడదు. ఎవరైతే ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు. దేహాభిమానంలోకి వచ్చేస్తారు. పిల్లలైన మీరు ఆత్మాభిమానిగా అవ్వాలి, ఇందులోనే శ్రమ అనిపిస్తుంది. ఆత్మాభిమానిగా అవ్వడంతోనే సంతోషం యొక్క పాదరసం ఎక్కుతుంది. మధురమైన బాబా గుర్తుకొస్తారు. బాబా నుండి మనము స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నాము. బాబా ఈ భాగ్యశాలి రథంలోకి వచ్చి మనల్ని చదివిస్తారు. రాత్రింబవళ్ళు బాబా-బాబా అని స్మృతి చేస్తూ ఉండండి. మీరు అర్థకల్పము యొక్క ప్రేయసులు. భక్తులు భగవంతుడిని స్మృతి చేస్తారు. భక్తులు అనేకమంది ఉన్నారు. జ్ఞానంలో అందరూ ఒక్క తండ్రినే స్మృతి చేస్తారు. వారే అందరికీ తండ్రి. జ్ఞానసాగరుడైన తండ్రి మనల్ని చదివిస్తారు, పిల్లలైన మీకైతే రోమాలు నిక్కబొడుచుకోవాలి. మాయా తుఫానులైతే తప్పకుండా వస్తాయి. బాబా అంటారు - అందరికన్నా ఎక్కువ తుఫానులు నాకు వస్తాయి ఎందుకంటే అందరికన్నా ముందు నేను ఉన్నాను. నా వద్దకు వస్తాయి కావుననే పిల్లల వద్దకు ఎన్ని వస్తూ ఉండవచ్చు అనేది అర్థం చేసుకుంటాను. తికమకపడుతూ ఉండవచ్చు. అజ్ఞానకాలంలో కూడా ఎప్పుడూ రానటువంటి అనేక రకాల తుఫానులు వస్తూ ఉంటాయి, అటువంటివి కూడా వస్తాయి. ముందు నాకే రావాలి, లేదంటే నేను పిల్లలకు ఎలా అర్థం చేయిస్తాను. వీరు ఫ్రంటులో ఉన్నారు. వీరు రుస్తుమ్ కనుక మాయ కూడా రుస్తుమ్ తో రుస్తుమ్ అయ్యి యుద్ధం చేస్తుంది. మల్ల యుద్ధంలో అందరూ ఒకేలా ఉండరు. ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్లు ఉంటాయి. బాబా వద్దకు అందరికన్నా ఎక్కువ తుఫానులు వస్తాయి, అందుకే బాబా ఈ తుఫానులకు భయపడకండి అని చెప్తారు. కేవలం కర్మేంద్రియాలతో ఎటువంటి వికర్మ చేయకండి. జ్ఞానములోకి వచ్చిన తర్వాత ఎందుకిలా జరుగుతుంది, దీనికన్నా జ్ఞానము తీసుకోకపోతేనే బాగుండేది, ఇటువంటి సంకల్పాలు వచ్చేవి కావు అని కొంతమంది అంటారు. అరే, ఇది యుద్ధము కదా. స్త్రీ ఎదురుగా ఉన్నా కూడా పవిత్రమైన దృష్టి ఉండాలి, మేము శివబాబా పిల్లలము, పరస్పరంలో సోదరులమని భావించాలి, తర్వాత ప్రజాపిత బ్రహ్మా సంతానముగా అవ్వడంతో సోదరీ-సోదరులుగా అయ్యాము. ఇక వికారాలు ఎక్కడ నుండి వస్తాయి. బ్రాహ్మణులు ఉన్నతమైన పిలక వంటివారు. వారే తర్వాత దేవతలుగా అవుతారు. కనుక మనము పరస్పరంలో సోదరీ-సోదరులము. మీరు ఒక్క తండ్రి పిల్లలు, కుమార-కుమారీలు. ఒకవేళ ఇద్దరూ కుమార-కుమారీగా అయ్యి ఉండకపోతే ఇక గొడవలౌతాయి. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. నా భార్య పూతన వలె ఉందని పురుషులు కూడా వ్రాస్తారు. చాలా శ్రమ ఉంది. యవ్వనంలో ఉన్నవారికైతే చాలా శ్రమ కలుగుతుంది మరియు ఎవరైతే గంధర్వ వివాహము చేసుకొని కలిసి ఉంటారో, వారిదైతే అద్భుతము. వారికి చాలా ఉన్నతమైన పదవి లభిస్తుంది కానీ అటువంటి స్థితిని ధారణ చేసి జ్ఞానంలో చురుకుగా అయినప్పుడు లభిస్తుంది. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మాయ తుఫానులకు భయపడకూడదు మరియు తికమకపడకూడదు. కేవలం కర్మేంద్రియాలతో ఏ వికర్మ జరగకుండా ధ్యానముంచాలి. జ్ఞానసాగరుడైన తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు - ఈ సంతోషంలో ఉండాలి.
2. సతోప్రధానంగా అయ్యేందుకు ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి, జ్ఞానాన్ని విచార సాగర మథనము చేయాలి, స్మృతి యాత్రలో ఉండాలి.