ఓంశాంతి. దుర్భాగ్యశాలి మరియు సౌభాగ్యశాలి - అని రెండు పదాలు గాయనం చేయబడతాయి. సౌభాగ్యము పోతే దుర్భాగ్యమని అంటారు. స్త్రీ యొక్క పతి మరణించినట్లయితే దాన్ని కూడా దుర్భాగ్యమని అంటారు. ఆమె ఒంటరిగా అయిపోతారు. ఇప్పుడు మనము సదా కోసం సౌభాగ్యశాలిగా అవుతామని మీకు తెలుసు. అక్కడ దుఃఖమనే విషయమే ఉండదు. మృత్యువు పేరే ఉండదు. విధవ అనే పేరే ఉండదు. విధవకు దుఃఖము ఉంటుంది, ఏడుస్తూ ఉంటారు. సాధు-సన్యాసులకు ఎలాంటి దుఃఖము ఉండదని కాదు. కొంతమంది పిచ్చివారిగా అయిపోతారు, అనారోగ్యం చేసిన రోగులుగా కూడా ఉంటారు. ఇది ఉన్నదే రోగీ ప్రపంచము. సత్యయుగము నిరోగి ప్రపంచము. మనము శ్రీమతంపై భారతదేశాన్ని మళ్ళీ నిరోగిగా చేస్తామని పిల్లలైన మీకు తెలుసు. ఈ సమయంలో మనుష్యుల క్యారెక్టర్లు చాలా పాడైపోయాయి. ఇప్పుడు క్యారెక్టర్లను సరిదిద్దే డిపార్టమెంట్ కూడా తప్పకుండా ఉంటుంది. స్కూళ్ళలో కూడా విద్యార్థుల యొక్క రిజిస్టరు పెట్టడం జరుగుతుంది. దాని ద్వారా వారి క్యారెక్టర్లు గురించి తెలుస్తుంది, అందుకే బాబా కూడా రిజిస్టరు పెట్టించారు. ప్రతి ఒక్కరు తమ రిజిస్టరును పెట్టుకోండి. నేను ఏ తప్పు చేయడం లేదు కదా అని క్యారెక్టర్ ను పరిశీలించుకోవాలి. మొదటి విషయం అయితే తండ్రిని స్మృతి చేయడము. దీని ద్వారానే మీ క్యారెక్టర్ బాగుపడుతుంది. ఆ ఒక్కరి స్మృతి ద్వారా ఆయుష్షు కూడా పెరుగుతుంది. ఇవైతే జ్ఞానరత్నాలు. స్మృతిని రత్నమని అనరు. స్మృతి ద్వారానే మీ క్యారెక్టర్ బాగుపడుతుంది. ఈ 84 జన్మల చక్రమును మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థము చేయించలేరు. విష్ణు మరియు బ్రహ్మా - దీని గురించే అర్థము చేయించాలి. శంకరుని విషయంలో క్యారెక్టర్ అని అనరు. బ్రహ్మా మరియు విష్ణువులకు పరస్పరంలో ఏం సంబంధముందో పిల్లలైన మీకు తెలుసు. ఈ లక్ష్మీ-నారాయణులు విష్ణువు యొక్క రెండు రూపాలు. వారే మళ్ళీ 84 జన్మలు తీసుకుంటారు. 84 జన్మలలో మీరే పూజ్యులుగా మరియు మీరే పూజారులుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మా అయితే తప్పకుండా ఇక్కడే ఉండాలి కదా. సాధారణ తనువు కావాలి. చాలా వరకు ఈ విషయంలోనే తికమకపడతారు. బ్రహ్మాయే పతితపావనుడైన తండ్రి రథము. దూరదేశంలో నివసించేవారు పరాయి దేశానికి వచ్చారని..... కూడా అంటారు. పావన ప్రపంచాన్ని తయారుచేసే పతితపావనుడైన తండ్రి పతిత ప్రపంచంలోకి వచ్చారు. పతిత ప్రపంచంలో పావనమైన వారు ఒక్కరు కూడా ఉండరు. మనము 84 జన్మలెలా తీసుకుంటాము అనేది ఇప్పుడు పిల్లలైన మీరు అర్థము చేసుకున్నారు. ఎవరో ఒకరు అయితే తీసుకుంటారు కదా. ఎవరైతే మొట్టమొదట వస్తారో వారికే 84 జన్మలుంటాయి. సత్యయుగంలోకి దేవీదేవతలు మాత్రమే వస్తారు. 84 జన్మలెవరు తీసుకుంటారు అని మనుష్యులకు ఏ మాత్రం ఆలోచన రాదు. ఇది అర్థం చేసుకునే విషయము. పునర్జన్మలనైతే అందరూ అంగీకరిస్తారు. 84 పునర్జన్మలు ఉంటాయని చాలా యుక్తిగా అర్థము చేయించాలి. అందరూ 84 జన్మలు తీసుకోరు కదా. అందరూ ఒకేసారి రారు మరియు ఒకేసారి శరీరం విడిచిపెట్టరు. మీకు మీ జన్మల గురించి తెలియదని భగవానువాచ కూడా ఉంది, భగవంతుడే కూర్చొని అర్థం చేయిస్తారు. ఆత్మలైన మీరు 84 జన్మలు తీసుకుంటారు. తండ్రి కూర్చొని పిల్లలైన మీకు ఈ 84 జన్మల కథను వినిపిస్తారు. ఇది కూడా ఒక చదువు. 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవడం చాలా సహజము. ఇతర ధర్మాలవారు ఈ విషయాలను అర్థము చేసుకోరు. మీలో కూడా అందరూ ఏమీ 84 జన్మలు తీసుకోరు. అందరికీ 84 జన్మలుంటే అందరూ ఒకేసారి రావాలి. అలా కూడా జరగదు. ఆధారమంతా చదువు మరియు స్మృతిపైనే ఉంది. అందులో కూడా నంబరువన్ స్మృతి. కష్టమైన సబ్జెక్టుకు మార్కులు ఎక్కువ లభిస్తాయి. దాని ప్రభావము కూడా ఉంటుంది. ఉత్తమ, మధ్యమ, కనిష్ట సబ్జెక్టులుంటాయి కదా. వీటిలో ముఖ్యమైనవి రెండు. నన్ను స్మృతి చేసినట్లయితే సంపూర్ణ నిర్వికారిగా అయిపోతారు మరియు విజయమాలలో స్మరింపబడతారు అని తండ్రి చెప్తారు. ఇది రేస్. నేనెంతవరకు ధారణ చేస్తున్నాను? ఎంత స్మృతి చేస్తున్నాను? నా క్యారెక్టర్ ఎలా ఉంది? అని మొదట స్వయాన్ని పరిశీలించుకోవాలి. ఒకవేళ నాలోనే ఏడ్చే అలవాటుంటే ఇతరులనెలా సంతోషపరచగలను? ఎవరైతే ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారని తండ్రి అంటారు. ఏమి జరిగినా కానీ ఏడ్చే అవసరం లేదు. అనారోగ్యంలో కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని ఈ మాత్రం అయితే సంతోషంగా చెప్పవచ్చు. అనారోగ్యంలోనే స్థితి యొక్క పరిశీలన జరుగుతుంది. కష్టంలో, మూలుగుతున్న శబ్దం కొద్దిగా వెలువడుతుంది కానీ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి, సందేశాన్నిచ్చారు. సందేశకులు-మెసెంజర్ ఒక్క శివబాబా మాత్రమే, ఇతరులెవ్వరూ కారు. మిగిలినవారంతా భక్తిమార్గంలోని విషయాలను వినిపిస్తారు. ఈ ప్రపంచములోని వస్తువులన్నీ వినాశనమయ్యేవి, ఇప్పుడు మిమ్మల్ని ఏదీ విరిగిపోనటువంటి స్థానానికి తీసుకువెళ్తాను. అక్కడ విరగడమనే పేరే లేనటువంటి మంచి వస్తువులు తయారవుతాయి. ఇక్కడ సైన్సు ద్వారా ఎన్ని వస్తువులు తయారవుతాయి, అక్కడ కూడా సైన్సు తప్పకుండా ఉంటుంది ఎందుకంటే మీ కొరకు చాలా సుఖం కావాలి. పిల్లలైన మీకు ఏమీ తెలియదు అని తండ్రి అంటారు. భక్తిమార్గము ఎప్పుడు ప్రారంభమయింది, మీరెంత దుఃఖాన్ని చూసారు - ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. దేవతలను సర్వగుణ సంపన్నులు...... అని అంటారు. మరి ఆ కళలు ఎలా తగ్గిపోయాయి? ఇప్పుడైతే ఏ కళ మిగలలేదు. చంద్రునికి కూడా నెమ్మది-నెమ్మదిగా కళలు తగ్గిపోతాయి కదా.
ఈ ప్రపంచం కూడా మొదట కొత్తదిగా ఉన్నప్పుడు అక్కడ ప్రతి వస్తువు సతోప్రధానంగా, ఫస్ట్ క్లాసుగా ఉంటుందని మీకు తెలుసు. తర్వాత పాతదిగా అవుతూ-అవుతూ కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఈ లక్ష్మీనారాయణులు సర్వగుణ సంపన్నులు కదా. ఇప్పుడు తండ్రి మీకు సత్యాతి-సత్యమైన సత్యనారాయణ కథను వినిపిస్తున్నారు. ఇప్పుడిది రాత్రి, తర్వాత పగలు వస్తుంది. మీరు సంపూర్ణంగా అయితే మీ కోసం సృష్టి కూడా అటువంటిదే కావాలి. పంచ తత్వాలు కూడా సతోప్రధానం (16 కళా సంపూర్ణం)గా అవుతాయి, అందుకే మీ శరీరాలు కూడా సహజంగా సుందరంగా ఉంటాయి. సతోప్రధానంగా ఉంటాయి. ఈ ప్రపంచమంతా 16 కళా సంపూర్ణంగా అయిపోతుంది. ఇప్పుడైతే ఏ కళ లేదు, ఈ తండ్రి యొక్క జ్ఞానం గొప్ప గొప్ప వారు మరియు మహాత్ములు మొదలైనవారి భాగ్యములో లేదు. వారికి వారి అహంకారమే ఉంటుంది. చాలా వరకు పేదవారి భాగ్యంలోనే ఉంటుంది. కొంతమంది అంటారు - వీరు ఇంత ఉన్నతమైన తండ్రి, వీరు ఎవరైనా పెద్ద రాజు లేదా పవిత్రమైన ఋషి మొదలైనవారి శరీరంలో రావాలి, సన్యాసులే పవిత్రంగా ఉంటారు, పవిత్రమైన కన్య శరీరంలో రావాలి అని. నేను ఎవరిలో వస్తాను అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఎవరైతే ఒక్క రోజు కూడా తక్కువ కాకుండా పూర్తి 84 జన్మలు తీసుకుంటారో, నేను వారిలోనే వస్తాను. కృష్ణుడు జన్మించినప్పుడు, ఆ సమయంలో 16 కళా సంపూర్ణంగా ఉంటారు. తర్వాత సతో, రజో, తమోలలోకి వస్తారు. ప్రతి వస్తువు మొదట సతోప్రధానంగా, తర్వాత సతో, రజో తమోలలోకి వస్తుంది. సత్యయుగంలో కూడా అలాగే ఉంటుంది. బాలుడు సతోప్రధానంగా ఉంటాడు, పెద్దవారైన తర్వాత ఇప్పుడు నేను ఈ శరీరాన్ని వదిలి సతోప్రధానమైన బాలునిగా అవుతానని అంటారు. పిల్లలైన మీకంత నషా లేదు. సంతోషము యొక్క పాదరసం ఎక్కదు. బాగా శ్రమ చేసేవారికి సంతోషం యొక్క పాదరసం ఎక్కుతూ ఉంటుంది. వారి ముఖము కూడా సంతోషంగా ఉంటుంది. మున్ముందు మీకు సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. ఇంటికి సమీపంగా చేరుకున్నప్పుడు ఆ ఇల్లు వాకిలి మొదలైనవి గుర్తుకొస్తాయి కదా. ఇది కూడా అటువంటిదే. పురుషార్థము చేస్తూ-చేస్తూ మీ ప్రారబ్ధము సమీపించినప్పుడు చాలా సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. సంతోషంలో ఉంటారు. ఫెయిల్ అయ్యే వారు సిగ్గుతో మునిగిపోతారు. మీకు కూడా బాబా ముందే చెప్తారు, తర్వాత చాలా పశ్చాత్తాపపడవలసి వస్తుంది. నేను ఏమవుతాను అని మీ భవిష్యత్తు యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. ఈ-ఈ వికర్మలు మొదలైనవి చేశారని బాబా చూపిస్తారు. పూర్తిగా చదువుకోలేదు, ద్రోహిగా అయ్యారు, కనుక ఈ శిక్ష లభిస్తుంది. అన్నీ సాక్షాత్కారమవుతాయి. సాక్షాత్కారము లేకుండా శిక్ష ఎలా ఇస్తారు? కోర్టులో కూడా నీవు ఇవి-ఇవి చేశావు, ఇది దాని శిక్ష అని చెప్తారు. కర్మాతీత స్థితిని చేరుకునేంత వరకు ఏవో కొన్ని గుర్తులు మిగిలి ఉంటాయి. ఆత్మ పవిత్రంగా అయిపోతే ఇక శరీరాన్ని వదలవలసి వస్తుంది. ఇక ఇక్కడ ఉండలేదు. ఈ స్థితిని మీరు ధారణ చేయాలి. ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వచ్చేందుకు తయారీ చేసుకుంటారు. మనం త్వరత్వరగా వెళ్ళి, మళ్ళీ త్వరత్వరగా రావాలి అనేదే మీ పురుషార్థము. పిల్లలను ఆటలో పరుగెత్తిస్తారు కదా. లక్ష్యం వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి. మీరు కూడా త్వర-త్వరగా వెళ్ళాలి, మళ్ళీ కొత్త ప్రపంచంలో మొదటి నంబరులో రావాలి. ఇది మీ రేస్. స్కూల్లో కూడా రేస్ చేయిస్తారు కదా. మీది ప్రవృత్తిమార్గము. మొట్టమొదట మీది పవిత్ర గృహస్థ ధర్మముగా ఉండేది, ఇప్పుడు వికారీగా ఉన్నారు, తర్వాత నిర్వికారీ ప్రపంచము తయారవుతుంది. ఈ విషయాలను మీరు స్మరణ చేస్తూ ఉన్నా కూడా చాలా సంతోషం ఉంటుంది. మనమే రాజ్యము తీసుకుంటాము, మళ్ళీ పోగొట్టుకుంటాము. హీరో-హీరోయిన్ అని అంటారు కదా. వజ్రం వంటి జన్మ తీసుకొని మళ్ళీ గవ్వ వంటి జన్మలోకి వస్తారు.
మీరు గవ్వల వెనుక సమయాన్ని వృథా చేసుకోకండి అని ఇప్పుడు తండ్రి చెప్తారు. నేను కూడా సమయాన్ని వృథా చేసేవాడినని వీరు అంటారు. ఇప్పుడు నీవు నా వాడిగా అయ్యి ఈ ఆత్మిక వ్యాపారము చేయు అని నాకు కూడా చెప్పారు. కనుక వెంటనే అన్నీ వదిలేశాను. ధనాన్ని అయితే ఎవ్వరూ పారేయరు. ధనము పనికొస్తుంది. ధనము లేకుండా ఇళ్ళు మొదలైనవేవీ లభించవు. మున్ముందు గొప్ప-గొప్ప ధనవంతులు వస్తారు. మీకు సహాయము చేస్తూ ఉంటారు. ఒక రోజున మీరు ఈ సృష్టిచక్రమెలా తిరుగుతుంది అని పెద్ద పెద్ద కాలేజీలకు, యూనివర్సిటీలకు కూడా వెళ్ళి భాషణ చేయవలసి ఉంటుంది. ఆది నుండి అంతము వరకు చరిత్ర పునరావృతమవుతుంది. బంగారు యుగము నుండి ఇనుప యుగము వరకు సృష్టి యొక్క చరిత్ర-భూగోళాలను మనము తెలుపగలము. క్యారెక్టర్ల గురించైతే మీరు చాలా అర్థం చేయించగలరు. ఈ లక్ష్మీనారాయణులను మహిమ చేయండి. భారతదేశము ఎంత పావనంగా ఉండేది, దైవీ క్యారెక్టర్లు ఉండేవి. ఇప్పుడైతే వికారీ క్యారెక్టర్లు ఉన్నాయి. చక్రము తప్పకుండా మళ్ళీ రిపీట్ అవుతుంది. మేము ప్రపంచ చరిత్ర-భూగోళాలను వినిపించగలము. అక్కడకు మంచి-మంచి వారు వెళ్ళాలి. ఉదారహణకు థియోసాఫికల్ సొసైటీలో మీరు భాషణ చేయండి. కృష్ణుడైతే దేవత, సత్యయుగంలో ఉండేవారు. మొట్టమొదట శ్రీకృష్ణుడు ఉంటారు, తర్వాత నారాయణునిగా అవుతారు. మేము మీకు శ్రీకృష్ణుని 84 జన్మల కథను వినిపిస్తాము, ఇది ఇంకెవ్వరూ వినిపించలేరు. ఇది ఎంత పెద్ద టాపిక్. తెలివైనవారే భాషణ చేయాలి.
మేము విశ్వానికి యజమానులుగా అవుతామని ఇప్పుడు మీ మనసుకు అనిపిస్తుంది, మరి ఎంత సంతోషముండాలి. లోపల కూర్చొని ఈ జపాన్ని జపించండి, అప్పుడు మీకు ఈ ప్రపంచంలో ఏదీ ఇష్టమనిపించదు. పరమపిత పరమాత్మ ద్వారా విశ్వానికి యజమానులుగా అయ్యేందుకే మీరిక్కడకు వస్తారు. ఈ ప్రపంచాన్నే విశ్వమని అంటారు. బ్రహ్మాలోకాన్ని మరియు సూక్ష్మవతనాన్ని విశ్వమని అనరు. నేను విశ్వానికి యజమానిగా అవ్వను, పిల్లలైన మిమ్మల్ని ఈ విశ్వానికి యజమానులుగా చేస్తాను అని తండ్రి చెప్తారు. ఇవి ఎంత గుహ్యమైన విషయాలు. మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తాను. మీరు మళ్ళీ మాయకు దాసిగా అవుతారు. ఇక్కడ యోగంలో ఎదురుగా కూర్చోబెట్టినప్పుడు కూడా, ఆత్మాభిమానిగా అయి కూర్చోండి, తండ్రిని స్మృతి చేయండి అని స్మృతినిప్పించాలి, 5 నిముషాల తర్వాత మళ్ళీ చెప్పండి. మీ యోగం ప్రోగ్రాములు నడుస్తాయి కదా. చాలా మంది బుద్ధి బయటకు వెళ్ళిపోతుంది కనుక 5-10 నిముషాల తర్వాత మళ్ళీ సావధానపరచాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చున్నారా? తండ్రిని స్మృతి చేస్తున్నారా? అప్పుడు స్వయానికి కూడా అటెన్షన్ ఉంటుంది. బాబా ఈ యుక్తులన్నీ తెలియజేస్తారు. పదే పదే సావధానపరచండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ శివబాబా స్మృతిలో కూర్చున్నారా? ఎవరి బుద్ధియోగమైతే భ్రమిస్తూ ఉంటుందో, వారు అలెర్ట్ అయిపోతారు. పదే-పదే ఇది స్మృతినిప్పిస్తూ ఉండాలి. బాబా స్మృతి ద్వారానే మీరు ఆ తీరానికి వెళ్తారు. నావికుడా, నా నావను తీరానికి చేర్చండి అని పాడుతారు కూడా. కానీ దీని అర్థము తెలియదు. ముక్తిధామానికి వెళ్ళేందుకు అర్థకల్పము భక్తి చేశారు. నన్ను స్మృతి చేసినట్లయితే ముక్తిధామానికి వెళ్ళిపోతారని ఇప్పుడు తండ్రి చెప్తారు. పాపాలు తొలగించుకునేందుకే మీరు కూర్చున్నారు కనుక పాపాలు చేయకూడదు. లేకపోతే పాపాలు మిగిలిపోతాయి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి - ఇది నంబరువన్ పురుషార్థము. ఇలా సావధానపరుస్తూ ఉన్నట్లయితే మీకు కూడా అటెన్షన్ ఉంటుంది. స్వయాన్ని కూడా సావధానపరచుకోవాలి. స్వయం కూడా స్మృతిలో కూర్చున్నప్పుడే ఇతరులను కూర్చోబెట్టగలరు. మనము ఆత్మలము, మన ఇంటికి వెళ్ళిపోతాము. మళ్ళీ వచ్చి రాజ్యం చేస్తాము. స్వయాన్ని శరీరంగా భావించడం - ఇది కూడా ఒక కఠినమైన రోగము, అందుకే అందరూ రసాతలంలోకి (పాతాళముకు) వెళ్ళిపోయారు. వారికి మళ్ళీ ముక్తిని అందించాలి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మీ సమయాన్ని ఆత్మిక వ్యాపారంలో సఫలము చేసుకోవాలి. వజ్రతుల్యమైన జీవితాన్ని తయారుచేసుకోవాలి. స్వయాన్ని సావధానపరచుకుంటూ ఉండాలి. స్వయాన్ని శరీరమని భావించే కఠినమైన రోగం నుండి రక్షించుకునే పురుషార్థము చేయాలి.
2. ఎప్పుడూ మాయకు దాసిగా అవ్వకూడదు, నేను ఆత్మను అని లోపల కూర్చుని జపము జపించాలి. నేను నిరుపేద నుండి రాకుమారునిగా అవుతున్నాననే సంతోషముండాలి.