ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థము చేయిస్తున్నారు. మొట్టమొదట మీరందరూ ఆత్మలు. ఈ నిశ్చయము పక్కాగా ఉంచుకోవాలి. ఆత్మలమైన మేము ఇక్కడ శరీరాలు తీసుకుని పాత్రను అభినయించేందుకు, పరంధామము నుండి వస్తామని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మయే పాత్రను అభినయిస్తుంది. మనుష్యులైతే శరీరమే పాత్రను అభినయిస్తుందని భావిస్తారు. ఇది అన్నిటికన్నా పెద్ద పొరపాటు. దీని కారణంగా ఆత్మ గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ రాకపోకలలో ఆత్మలైన మేము వస్తూ-వెళ్తూ ఉంటాము అన్న విషయాన్ని మర్చిపోతారు, అందుకే తండ్రియే వచ్చి ఆత్మాభిమానులుగా చేయవలసి ఉంటుంది. ఈ విషయము కూడా ఎవ్వరికీ తెలియదు. ఆత్మ పాత్రను ఎలా అభినయిస్తుంది అనేది తండ్రే అర్థము చేయిస్తారు. మనుష్యులు ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు, తక్కువలో తక్కువ 1-2 జన్మలు తీసుకుంటారు. ఆత్మ పునర్జన్మలనైతే తీసుకుంటూనే ఉండాలి. ఎక్కువ జన్మలు తీసుకునేవారు ఎక్కువ పునర్జన్మలు తీసుకుంటారని దీనితో ఋజువవుతుంది. తక్కువ జన్మలు తీసుకునేవారు తక్కువ పునర్జన్మలను తీసుకుంటారు. నాటకంలో కొందరికి ప్రారంభము నుండి చివరి వరకు పాత్ర ఉంటుంది, మరి కొందరి పాత్ర తక్కువగా ఉంటుంది. దీని గురించి మనుష్యులెవ్వరికీ తెలియదు. ఆత్మకు స్వయం గురించే తెలియనప్పుడు, ఇక తండ్రి గురించి ఎలా తెలుస్తుంది. ఇది ఆత్మకు సంబంధించిన విషయము కదా. తండ్రి అనగా ఆత్మలకు తండ్రి. కృష్ణుడు ఆత్మలకు తండ్రి కాదు. కృష్ణుడిని నిరాకారుడని అనరు. అతడిని సాకారములోనే గుర్తించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిలోనూ ఆత్మ ఉంటుంది. ప్రతి ఒక్క ఆత్మలోనూ పాత్ర నిశ్చితమై ఉంది. మీలో కూడా ఈ విషయాలను అర్థము చేయించగలిగేవారు నంబరువారు పురుషార్థం అనుసారముగానే ఉన్నారు. ఆత్మలైన మనమెలా 84 జన్మలను తీసుకున్నాము అన్నది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అంతేకానీ ఆత్మయే పరమాత్మ అని కాదు. ఆత్మలైన మనము మొదట దేవతలుగా అవుతామని తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు పతితముగా, తమోప్రధానంగా ఉన్నారు, మళ్ళీ సతోప్రధానంగా, పావనంగా అవ్వాలి. సృష్టి పాతదిగా అయినప్పుడే తండ్రి వస్తారు. తండ్రి వచ్చి పురాతన ప్రపంచాన్ని కొత్తదిగా తయారుచేస్తారు. కొత్త సృష్టిని స్థాపన చేస్తారు. కొత్త ప్రపంచంలో ఆది సనాతన దేవీదేవతా ధర్మము మాత్రమే ఉంటుంది. వారే ఇంతకుముందు కలియుగ శూద్ర ధర్మము వారిగా ఉండేవారు. ఇప్పుడు మీరు ప్రజాపిత బ్రహ్మా ముఖవంశావళిగా అయ్యి బ్రాహ్మణులుగా అయ్యారు, బ్రాహ్మణ కులములోకి వస్తారు. బ్రాహ్మణ కులము వారి వంశము ఉండదు. బ్రాహ్మణ కులము వారు రాజ్యపాలన చేయరు. ఈ సమయంలో భారతదేశంలో బ్రాహ్మణ కులము వారూ రాజ్యము చేయరు, శూద్ర కులము వారూ రాజ్యం చేయరు. ఇరువురికీ రాజ్యము లేదు. కానీ ప్రజల పై ప్రజల రాజ్యము నడుస్తుంది. బ్రాహ్మణులైన మీకు ఏ రాజ్యమూ లేదు. విద్యార్థులైన మీరు చదువుకుంటున్నారు. ఈ 84 జన్మల చక్రమెలా తిరుగుతుంది అనేది తండ్రి మీకే అర్థము చేయిస్తారు. సత్యయుగము, త్రేతాయుగము...... తర్వాత సంగమయుగము ఉంటుంది. ఈ సంగమయుగానికున్న మహిమ వేరే ఏ యుగానికీ లేదు. ఇది పురుషోత్తమ సంగమయుగము. సత్యయుగము నుండి త్రేతాయుగములోకి వస్తారు, రెండు కళలు తగ్గిపోతాయి, మరి వారినేమని మహిమ చేయాలి! క్రింద పడేవారి మహిమ జరగదు. కలియుగాన్ని పాత ప్రపంచమని అంటారు. ఇప్పుడు కొత్త ప్రపంచము స్థాపన అవ్వనున్నది, అక్కడ దేవీదేవతల రాజ్యముంటుంది. వారు పురుషోత్తములుగా ఉండేవారు. తర్వాత కళలు తగ్గిపోతూ తగ్గిపోతూ కనిష్ఠంగా, శూద్ర బుద్ధికలవారిగా అవుతారు. వారిని రాతి బుద్ధి కలవారని కూడా అంటారు. ఎవరినైతే పూజిస్తున్నారో, వారి జీవిత కథను కూడా తెలుసుకోలేనంత రాతి బుద్ధి కలవారిగా తయారవుతారు. పిల్లలు తమ తండ్రి జీవితము గురించి తెలుసుకోకపోతే వారసత్వము ఎలా లభిస్తుంది? ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి జీవితము గురించి తెలుసుకున్నారు. వారి నుండి మీకు వారసత్వం లభిస్తూ ఉంది. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. నీవే తల్లి-తండ్రి..... అని అంటున్నారంటే తప్పకుండా తండ్రి వచ్చి అపారమైన సుఖాన్ని ఇచ్చి ఉంటారు కదా. నేను వచ్చాను, పిల్లలైన మీకు తరగనటువంటి సుఖాన్నిస్తాను అని తండ్రి చెప్తున్నారు.
ఈ జ్ఞానము పిల్లల బుద్ధిలో బాగా నిలిచి ఉండాలి, ఈ విధంగా మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. మీకిప్పుడు జ్ఞానమనే మూడవ నేత్రము లభించింది. హమ్ సో (మనమే) దేవతలుగా అవుతామని మీకు తెలుసు. ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. కలియుగ బ్రాహ్మణులు కూడా ఉన్నారు కదా. ఆ బ్రాహ్మణులకు వారి ధర్మము లేక కులము ఎప్పుడు స్థాపనయ్యిందో తెలియదు, ఎందుకంటే వారు కలియుగములోని వారు. మీరిప్పుడు డైరెక్టుగా ప్రజాపిత బ్రహ్మా సంతానంగా అయ్యారు మరియు మీరు అందరికంటే ఉన్నత శ్రేణికి చెందినవారు. తండ్రి కూర్చుని మిమ్మల్ని చదివించే సేవను, సంభాళించే సేవను మరియు అలంకరించే సేవను చేస్తారు. మీరు కూడా ఈశ్వరీయ సేవలో ఉన్నారు. నేను పిల్లలందరికీ సేవ చేసేందుకు వచ్చాను అని గాడ్ ఫాదర్ కూడా చెప్తున్నారు. నేను పిల్లలకు సుఖమునిచ్చే మార్గాన్ని తెలియజేయాలి. ఇప్పుడు ఇంటికి పదండి అని తండ్రి అంటున్నారు. మనుష్యులు ముక్తి కోసమే భక్తి చేస్తారు. జీవితంలో తప్పకుండా బంధనముంది. తండ్రి వచ్చి ఈ దుఃఖాల నుండి విడిపిస్తారు. అయ్యో-అయ్యో అని అంటారని పిల్లలైన మీకు తెలుసు. హాహాకారాల తర్వాత జయజయకారాలు జరుగుతాయి. ప్రాకృతిక వైపరీత్యాలు మొదలైనవి వచ్చినప్పుడు ఎంతగా అయ్యో-అయ్యో అని అంటూ రోధిస్తారు అన్నది ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మరొకవైపు యూరోప్ నివాసులైన యాదవులు కూడా ఉన్నారు, యూరోప్ వాసులను యాదవులని అంటారని తండ్రి అర్థం చేయించారు. కడుపు నుండి ముసలము (రోకలి) వెలువడి శాపమిచ్చినట్లుగా చూపిస్తారు. ఇప్పుడు శాపము మొదలైనవాటి మాటే లేదు. ఇది డ్రామా. తండ్రి వారసత్వమునిస్తారు, రావణుడు శాపమునిస్తాడు. ఇదొక తయారుచేయబడిన ఆట. శాపమునిచ్చే మనుష్యులు వేరుగా ఉంటారు. ఆ శాపాన్ని తొలగించేవారు కూడా ఉంటారు. గురువులు మొదలైనవారు ఎక్కడ శపిస్తారో అని మనుష్యులు చాలా భయపడతారు. వాస్తవానికి జ్ఞాన మార్గములో ఎవ్వరూ శాపము ఇవ్వలేరు. జ్ఞాన మార్గము మరియు భక్తి మార్గములో శాపము అనే మాటే లేదు. ఎవరైతే మంత్ర-తంత్రాలు మొదలైనవి నేర్చుకుంటారో, వారు శాపాలిస్తారు, మనుష్యులకు చాలా దుఃఖాన్ని కలుగజేస్తారు, ధనాన్ని కూడా చాలా సంపాదిస్తారు. భక్తులు ఇటువంటి పనులు చేయరు.
సంగమము అన్న పదంతోపాటు పురుషోత్తమ అన్న పదాన్ని తప్పకుండా వ్రాయమని కూడా తండ్రి అర్థం చేయించారు. త్రిమూర్తి అనే పదము కూడా తప్పకుండా వ్రాయాలి మరియు ప్రజాపిత అనే పదము కూడా అవసరము, ఎందుకంటే బ్రహ్మా అన్న పేరు కూడా చాలామందికి ఉంటుంది. ప్రజాపిత అనే పదమును వ్రాసినప్పుడు వారు సాకారంలో ఉన్నారనేది అర్థము చేసుకోగలరు. కేవలం బ్రహ్మా అని వ్రాస్తే సూక్ష్మవతన నివాసి అని భావిస్తారు. బ్రహ్మా-విష్ణు-శంకరులను భగవంతుడని అనేస్తారు. ప్రజాపిత అని అంటే ప్రజాపిత ఇక్కడే ఉన్నారని అర్థము చేయించవచ్చు. వారు సూక్ష్మవతనంలో ఎలా ఉండగలరు. బ్రహ్మా నాభి నుండి విష్ణువు వెలువడినట్లుగా చూపిస్తారు. పిల్లలైన మీకు కూడా జ్ఞానము లభించింది. నాభి మొదలైనవాటి విషయమేమీ లేదు. బ్రహ్మా విష్ణువుగా, విష్ణువు బ్రహ్మాగా ఎలా అవుతారు అని, పూర్తి చక్రమంతటి జ్ఞానాన్ని మీరు ఈ చిత్రాల ద్వారా అర్థము చేయించవచ్చు. చిత్రాలు లేకుండా అర్థము చేయించడంలో శ్రమ కలుగుతుంది. బ్రహ్మాయే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మాగా అవుతారు. లక్ష్మీనారాయణులు 84 జన్మల చక్రములో తిరిగి మళ్ళీ బ్రహ్మా-సరస్వతులుగా అవుతారు. బాబా మొదటి నుండే పేర్లు పెట్టారు, భట్టీ ప్రారంభమైనప్పుడు పేర్లు పెట్టడం జరిగింది. తర్వాత ఎంతమంది వెళ్ళిపోయారు, అందుకే బ్రాహ్మణుల మాల తయారవ్వదు, ఎందుకంటే బ్రాహ్మణులు పురుషార్థులు అని అర్థం చేయించారు. ఒక్కోసారి కనిష్ఠము, ఒక్కోసారి ఉన్నతమైన స్థితిలో ఉంటారు. గ్రహచారము కూర్చుంటుంది. బాబా అయితే రత్నాల వ్యాపారిగా ఉండేవారు. ముత్యాలు మొదలైనవాటి మాల ఎలా తయారవుతుందో, ఇతనికి అనుభవముంది. బ్రాహ్మణుల మాల చివర్లో తయారవుతుంది. బ్రాహ్మణులైన మనమే దైవీ గుణాలను ధారణ చేసి దేవతలుగా అవుతాము. మళ్ళీ మెట్లు దిగాల్సిందే. లేకపోతే 84 జన్మలు ఎలా తీసుకుంటారు? 84 జన్మల లెక్కతో దీన్ని లెక్కించగలము. మీ అర్థ సమయము పూర్తయిన తర్వాత ఇతర ధర్మాల వారు కలుస్తూ ఉంటారు. మాలను తయారుచేయడంలో చాలా శ్రమ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ముత్యాలను కదలకుండా ఉండే విధంగా టేబుల్ పై పెడతారు. తర్వాత సూదితో దారంలో కూర్చుతారు. ఎక్కడైనా సరిగ్గా కూర్చబడలేదంటే మళ్ళీ మాలను తెంచాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద మాల. మేము కొత్త ప్రపంచము కొరకు చదువుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుంచి దేవతలుగా ఎలా అవుతారో, వచ్చి తెలుసుకోండి అని ఇటువంటి స్లోగన్లను తయారుచేయమని బాబా అర్థం చేయించారు. ఈ చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. స్వర్గాధిపతులుగా అవుతారు. ఇటువంటి స్లోగన్లను తయారుచేసి పిల్లలకు నేర్పించాలి. బాబా అనేక యుక్తులు తెలుపుతారు. వాస్తవానికి మీకు ఎంతో విలువ ఉంది. మీకు హీరో-హీరోయిన్ పాత్ర లభిస్తుంది. మీరు వజ్రము వలె అవుతారు, మళ్ళీ 84 జన్మల చక్రములోకి వచ్చి గవ్వ సమానంగా అయిపోతారు. ఇప్పుడు వజ్రసమానమైన జీవితము లభించిన తర్వాత కూడా గవ్వల వెనుక ఎందుకు పడతారు. అలాగని ఇళ్ళు-వాకిళ్ళను వదలమని కూడా కాదు. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి, సృష్టి చక్ర జ్ఞానాన్ని తెలుసుకుని, దైవీ గుణాలను కూడా ధారణ చేస్తే, మీరు వజ్ర సమానంగా అవుతారని బాబా చెప్తున్నారు. భారతదేశము 5 వేల సంవత్సరాల క్రితము తప్పకుండా వజ్ర సమానంగా ఉండేది. ఈ చిత్రాన్ని (లక్ష్మీనారాయణుల చిత్రాన్ని) చాలా గౌరవించాలి. పిల్లలైన మీరు ప్రదర్శని, మ్యూజియంలలో చాలా సేవ చేయాలి. విహంగ మార్గపు సేవ చేయకుండా మీరు ప్రజలనెలా తయారుచేస్తారు? ఈ జ్ఞానాన్ని అనేకులు విన్నా కానీ ఉన్నతమైన పదవిని చాలా తక్కువ మందే పొందగలరు. వారి గురించే కోట్లలో ఏ ఒక్కరో అని అంటారు. స్కాలర్షిప్ కూడా కొంతమందే తీసుకుంటారు. 40-50 మంది విద్యార్థులు స్కూల్లో ఉన్నప్పటికీ, వారిలో ఏ ఒక్కరో అరుదుగా స్కాలర్షిప్ తీసుకుంటారు, ఎవరైనా కొద్దిమంది ప్లస్ లోకి వస్తే వారికి కూడా ఇస్తారు. ఇది కూడా అలాంటిదే. ప్లస్ లో చాలామంది ఉన్నారు. 8 రత్నాలున్నారు, వారు కూడా నంబరువారుగానే ఉన్నారు కదా. వారు మొట్టమొదట రాజ్య సింహాసనముపై కూర్చుంటారు. తర్వాత కళలు తగ్గిపోతూ ఉంటాయి, నంబరువన్ చిత్రము ఈ లక్ష్మీనారాయణులది. వారి వంశము కూడా నడుస్తుంది కానీ లక్ష్మీనారాయణుల చిత్రమును మాత్రమే చూపించారు. ఇక్కడ చిత్రాలు మారిపోతూ ఉంటాయని మీకు తెలుసు. ఆ చిత్రాలను చూపించడం వలన లాభమేమిటి. నామ, రూప, దేశ, కాలాలన్నీ మారిపోతాయి.
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థము చేయిస్తారు. కల్పక్రితము కూడా తండ్రి అర్థం చేయించారు. అలాగని, కృష్ణుడు గోప-గోపికలకు వినిపించారని కాదు. కృష్ణునికి గోప-గోపికలుండరు, వాళ్ళకు జ్ఞానాన్ని నేర్పించడం కూడా జరగదు, కృష్ణుడు సత్యయుగానికి రాకుమారుడు. అక్కడ రాజయోగాన్ని ఎలా నేర్పిస్తారు లేదా పతితులను పావనంగా ఎలా చేస్తారు. ఇప్పుడు మీరు మీ తండ్రిని స్మృతి చేయండి. ఈ తండ్రే టీచరు కూడా. టీచరును విద్యార్థి ఎప్పుడూ మర్చిపోలేడు. తండ్రిని పిల్లలు మర్చిపోలేరు, గురువును కూడా మర్చిపోరు. జన్మించినప్పటి నుండే తండ్రి ఉంటారు. టీచరు 5 సంవత్సరాల తర్వాత లభిస్తారు. తర్వాత, గురువు వానప్రస్థంలో లభిస్తారు. జన్మించినప్పటి నుండే గురువులను ఆశ్రయించడం వలన లాభమేమీ లేదు. గురువు ఒడిని తీసుకున్న మరుసటి రోజే మరణిస్తారు. అప్పుడు గురువేమి చేస్తారు? సద్గురువు లేకుండా గతిని పొందలేరని గాయనం కూడా చేస్తారు. సద్గురువును పక్కనపెట్టి వారు కేవలం గురువు అని అంటారు. గురువులైతే అనేకమంది ఉన్నారు. పిల్లలూ, మీరిప్పుడు ఏ దేహధారినీ గురువుగా చేసుకునే అవసరం లేదు, మీరు ఎవ్వరినీ ఏదీ అడగకూడదు. యాచించడం కంటే మరణించడం మేలు అని అంటారు. మేము మా ధనాన్ని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలని అందరికీ చింత ఉంటుంది. వారు మరుసటి జన్మ కొరకు ఈశ్వరార్థము దాన-పుణ్యాలు చేస్తారు, దానికి ఫలితంగా ఈ పాత ప్రపంచంలో అల్పకాలం కోసం లభిస్తుంది. ఇక్కడ మీదంతా కొత్త ప్రపంచములోకి మరియు రాబోయే 21 జన్మల కొరకు ట్రాన్స్ఫర్ అవుతుంది. తనువు-మనస్సు-ధనములను ప్రభువు ముందు అర్పణ చేయాలి. అయితే వారొచ్చినప్పుడు మాత్రమే అర్పణ చేయగలరు కదా. ప్రభువు గురించి ఎవ్వరికీ తెలియనందుకు గురువును పట్టుకుంటారు. ధనము మొదలైనవి గురువులకు అర్పిస్తారు. వారసులు లేకపోతే అంతా గురువులకే ఇచ్చేస్తారు. ఈ రోజుల్లో నియమానుసారంగా ఈశ్వరార్థం కూడా ఎవ్వరూ ఇవ్వడం లేదు. నేను పేదల పెన్నిధిని, అందుకే నేను భారతదేశములోనే వస్తానని తండ్రి అర్థం చేయిస్తున్నారు. నేను వచ్చి మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తాను. ప్రత్యక్షానికి, పరోక్షానికి ఎంత తేడా ఉంది. వారికేమీ తెలియదు. కేవలం ఈశ్వరార్పణం చేస్తున్నామని అంటారు. అదంతా తెలివితక్కువతనమే. పిల్లలైన మీకిప్పుడు జ్ఞానము లభించడం వలన మీరు తెలివితక్కువవారి నుండి తెలివైనవారిగా అయ్యారు. తండ్రి అద్భుతం చేస్తారనే జ్ఞానము బుద్ధిలో ఉంది. తప్పకుండా అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వమే లభించాలి. దాదా ద్వారా మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. దాదా కూడా వారి నుండే వారసత్వము తీసుకుంటున్నారు. వారసత్వమునిచ్చేది వారొక్కరే కనుక వారినే స్మృతి చేయాలి. పిల్లలూ, నేను ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో వస్తాను, ఇతనిలో ప్రవేశించి ఇతనిని కూడా పావనంగా చేస్తాను, ఆ తర్వాత వీరు ఫరిస్తాగా అవుతారు అని తండ్రి చెప్తున్నారు. బ్యాడ్జ్ పై మీరు మంచి సేవ చేయవచ్చు. మీ బ్యాడ్జ్ లన్నీ అర్థ సహితంగా ఉన్నాయి. ఇవి ప్రాణదానానిచ్చే చిత్రాలు. వీటి విలువ గురించి ఎవ్వరికీ తెలియదు, బాబాకు సదా పెద్ద వస్తువంటే ఇష్టమనిపిస్తుంది, దూరము నుండే ఎవరైనా చదవగలిగేలా ఉండాలి. అచ్ఛా.
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు డైరెక్టుగా మీ తనువు, మనసు, ధనాలను ఈశ్వరుని ఎదుట అర్పణ చేయడంలో తెలివైనవారిగా అవ్వాలి. తమ సర్వస్వాన్ని 21 జన్మల కోసం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
2. తండ్రి ఎలాగైతే చదివించే, సంభాళించే మరియు అలంకరించే సేవను చేస్తారో, అలా తండ్రి సమానంగా సేవ చేయాలి. జీవన బంధనము నుండి బయటకు తీసి అందరినీ జీవన్ముక్తిలోకి తీసుకువెళ్ళాలి.