25-11-2020    ప్రాత:మురళి ఓంశాంతి      "బాప్ దాదా"     మధువనం


“మధురమైనపిల్లలూ -
ఉన్నతాతి ఉన్నతమైన పదవిని పొందాలంటే స్మృతియాత్రలో ఆనందంగా నిమగ్నమై ఉండండి - ఇదే ఆత్మిక ఉరికంభం, బుద్ధి తమ ఇంటిలోనే వేలాడుతూ ఉండాలి”

ప్రశ్న:-
ఎవరి బుద్ధిలోనైతే జ్ఞాన ధారణ జరగదో, వారి గుర్తులేమిటి?

జవాబు:-
వారు చిన్న-చిన్న విషయాలలో కలత చెందుతూ ఉంటారు. ఎవరి బుద్ధిలో ఎంతగా జ్ఞాన ధారణ జరుగుతుందో, అంతగా వారికి సంతోషముంటుంది. ఇప్పుడిక ప్రపంచం కిందకు దిగజారవలసిందే, ఇందులో నష్టమే జరుగుతుంది అనే జ్ఞానము ఒకవేళ బుద్ధిలో ఉన్నట్లయితే ఎప్పుడూ కలత చెందరు. సదా సంతోషం ఉంటుంది.

ఓంశాంతి.
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. భగవంతుడిని ఉన్నతాతి ఉన్నతమైన వారు అని అంటారని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఆత్మ బుద్ధియోగము ఇంటి వైపుకు వెళ్ళాలి. కానీ ఈ విషయం బుద్ధిలో ఉన్న మనుష్యులు ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు. సన్యాసులు కూడా బ్రహ్మతత్వాన్ని ఇల్లు అని భావించరు, వారు మేము బ్రహ్మములో లీనమైపోతామని అంటారు, అంటే అది ఇల్లు కాదు. ఇంటిలో నివసించడం జరుగుతుంది. పిల్లలైన మీ బుద్ధి అక్కడ ఉండాలి. ఉరికంభము పైకి ఎక్కుతారు కదా, అలా మీరిప్పుడు ఆత్మిక ఉరికంభంపై ఎక్కి ఉన్నారు. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి వచ్చి మమ్మల్ని ఉన్నాతాతి ఉన్నతమైన ఇంటికి తీసుకువెళ్తారని లోపల ఉంది. ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలి. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి మనకు మళ్ళీ ఉన్నతాతి ఉన్నతమైన పదవిని ప్రాప్తింపజేస్తారు. రావణ రాజ్యములో అందరూ నీచంగా ఉన్నారు. వారు ఉన్నతమైనవారు, వీరు నీచమైనవారు. వారికి ఉన్నతమైనవారి గురించి తెలియనే తెలియదు. ఉన్నతమైన వారికి కూడా నీచమైన వారి గురించి తెలియదు. ఉన్నతాతి ఉన్నతమైనవారు అని ఒక్క భగవంతుడినే అంటారని మీరిప్పుడు అర్థం చేసుకుంటారు. బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. వారు పరంధామంలోనే ఉంటారు. ఆత్మలైన మనము కూడా అక్కడ ఉండేవారమని ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఇక్కడకు కేవలం పాత్రను అభినయించేందుకు వస్తాము. ఇది ఎవ్వరి ఆలోచనలోనూ ఉండదు. తమ వ్యాపార వ్యవహారాలలోనే నిమగ్నమై ఉంటారు. స్మృతియాత్రలో ఆనందంగా నిమగ్నమై ఉన్నప్పుడే ఉన్నతాతి ఉన్నతమైనవారిగా అవుతారని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. స్మృతి ద్వారానే ఉన్నత పదవిని పొందాలి. మీకు నేర్పించే జ్ఞానము, మర్చిపోయేది కాదు. చిన్న పిల్లలు కూడా వర్ణిస్తారు. ఇకపోతే, యోగము విషయాన్ని పిల్లలు అర్థము చేసుకోలేరు. స్మృతియాత్రను పూర్తిగా అర్థం చేసుకోని పిల్లలు చాలా మంది ఉన్నారు. మనమెంత ఉన్నతాతి ఉన్నతంగా వెళ్తాము. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము...... ఇక్కడ పంచ తత్వాలున్నాయి. సూక్ష్మవతనము, మూలవతనములో ఇవి ఉండవు. ఈ జ్ఞానము బాబా మాత్రమే ఇస్తారు కావున వారిని జ్ఞానసాగరుడని అంటారు. అనేక శాస్త్రాలు మొదలైనవి చదవడమే జ్ఞానమని మనుష్యులు భావిస్తారు. ఎంత ధనము సంపాదిస్తారు. శాస్త్రాలు చదివేవారికి ఎంత గౌరవము లభిస్తుంది. కానీ ఇందులో గొప్పతనమేమీ లేదని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఉన్నతాతి ఉన్నతమైనవారు ఒక్క భగవంతుడు మాత్రమే. వారి ద్వారానే మనము ఉన్నతాతి ఉన్నతమైన స్వర్గములో రాజ్యం చేసేవారిగా అవుతాము. స్వర్గమంటే ఏమిటి? నరకమంటే ఏమిటి? 84 జన్మల చక్రము ఎలా తిరుగుతుంది? ఈ సృష్టిలో మీకు తప్ప ఇతరులెవ్వరికీ ఈ విషయాలు తెలియవు, ఇదంతా కల్పన (ఊహ) అని అంటారు. ఇటువంటివారు మన కులానికి చెందినవారు కాదని భావించాలి. నిరుత్సాహపడకూడదు. వారి పాత్ర లేదు, అందుకే ఏమీ అర్థము చేసుకోలేరని భావించడం జరుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీ తల చాలా పైకి ఎత్తి ఉంది. మీరు ఉన్నతమైన ప్రపంచంలో ఉన్నప్పుడు మీకు నీచ ప్రపంచము గురించి తెలియదు. నీచ ప్రపంచములోని వారికి ఉన్నతమైన ప్రపంచము గురించి తెలియదు. దానినే స్వర్గమని అంటారు. విదేశీయులు స్వరములోకి వెళ్ళరు కానీ హెవెన్, ప్యారడైజ్ అని పేర్లు అయితే తీసుకుంటారు. ముస్లింలు కూడా బహిశ్త్ అని అంటారు. కానీ అక్కడకు ఎలా వెళ్ళాలి అనేది వారికి తెలియదు. ఇప్పుడు మీకు ఎంత వివేకం లభిస్తుంది, ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి ఎంత జ్ఞానాన్నిస్తారు. ఈ డ్రామా ఎంత అద్భుతంగా తయారుచేయబడింది. ఎవరికైతే డ్రామా రహస్యము గురించి తెలియదో, వారు దీన్ని కల్పన అని అంటారు.

ఇది ఉన్నదే పతిత ప్రపంచమని పిల్లలైన మీకు తెలుసు, అందుకే ఓ పతితపావనా, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని ఆర్తనాదాలు చేస్తారు. తండ్రి అంటారు - ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత చరిత్ర రిపీట్ అవుతుంది, పాత ప్రపంచము కొత్తదిగా అవుతుంది, అందుకే నేను రావలసి ఉంటుంది. కల్ప-కల్పము వచ్చి పిల్లలైన మిమ్మల్ని ఉన్నతాతి ఉన్నతంగా తయారుచేస్తాను. పావనమైన వారిని ఉన్నతులని మరియు పతితమైన వారిని నీచులని అంటారు. ఈ ప్రపంచమే కొత్తగా, పావనంగా ఉండేది, ఇప్పుడు పతితంగా ఉంది. ఈ విషయాలను అర్థము చేసుకున్నవారు మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. ఎవరి బుద్ధిలోనైతే ఈ విషయాలుంటాయో వారు సదా సంతోషంగా ఉంటారు. బుద్ధిలో లేకపోతే, ఎవరైనా ఏమైనా అన్నా, ఏదైనా నష్టము జరిగినా కలత చెందుతారు. ఇప్పుడు ఈ నీచ ప్రపంచం యొక్క అంతము రావాలి అని బాబా అంటారు. ఇది పాత ప్రపంచము. మనుష్యులు ఎంత నీచంగా అయిపోతారు. కానీ మేము నీచమైనవారిమని ఎవ్వరూ అర్థం చేసుకోరు. భక్తులు ఎల్లప్పుడూ తల వంచి నమస్కరిస్తారు, అయితే నీచుల ఎదురుగా తల వంచడం జరగదు. పవిత్రమైనవారి ఎదురుగా తల వంచడం జరుగుతుంది. సత్యయుగంలో ఎప్పుడూ ఇలా జరగదు. భక్తులే ఇలా చేస్తారు. తల వంచి నడవండి అని తండ్రి అలా అనరు. ఇది చదువు. గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీలో మీరు చదువుకుంటున్నారు. కనుక ఎంత నషా ఉండాలి. అంతేకానీ, కేవలం యూనివర్సిటీలో ఉన్నప్పుడు నషా ఉండి, ఇంట్లో తగ్గిపోవడం కాదు. ఇంట్లోనూ నషా ఉండాలి. ఇక్కడ శివబాబా మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. నేను జ్ఞానసాగరుడిని కాను అని వీరు అంటారు. ఈ బాబా జ్ఞానసాగరుడు కాదు. సాగరము నుండి నదులు వెలువడుతాయి కదా. సాగరం అయితే ఒక్కటే, బ్రహ్మపుత్ర అన్నింటికన్నా పెద్ద నది. చాలా పెద్ద స్టీమర్లు వస్తాయి. బయట కూడా చాలా నదులున్నాయి. పతితపావని గంగ అని కేవలం ఇక్కడ మాత్రమే అంటారు. బయట ఏ నదిని ఇలా అనరు. ఒకవేళ నది పతితపావని అయితే ఇక గురువు అవసరమే ఉండదు. నదులలో, చెరువులలో ఎంతగా భ్రమిస్తారు. అక్కడక్కడా చెరువులు ఎంత అశుద్ధంగా ఉంటాయంటే, ఇక అడగకండి. వాటి మట్టి తీసుకొని దేహానికి పూసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కిందకు దిగజారే మార్గాలని ఇప్పుడు బుద్ధిలోకి వచ్చింది. వారు ఎంత ప్రేమగా వెళ్తారు. ఈ జ్ఞానంతో మా కళ్ళు తెరచుకున్నాయని ఇప్పుడు మీరు అర్థము చేసుకున్నారు. జ్ఞానం యొక్క మీ మూడవ నేత్రము తెరుచుకుంది. ఆత్మకు మూడవ నేత్రము లభిస్తుంది, అందుకే త్రికాలదర్శి అని అంటారు. ఆత్మలో మూడు కాలాల జ్ఞానముంటుంది. ఆత్మ అయితే బిందువు, అందులో నేత్రము ఎలా ఉంటుంది. ఇవన్నీ అర్థము చేసుకునే విషయాలు. జ్ఞానం యొక్క మూడవ నేత్రముతో మీరు త్రికాలదర్శులుగా, త్రిలోకనాథులుగా అవుతారు. నాస్తికుల నుండి ఆస్తికులుగా అవుతారు. ఇదివరకు మీకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి తెలియదు. ఇప్పుడు తండ్రి ద్వారా రచన యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకోవడంతో మీకు వారసత్వము లభిస్తుంది. ఇది జ్ఞానము కదా. చరిత్ర-భూగోళము కూడా ఉంది, లెక్క ఉంది కదా. అచ్ఛా, చురుకైన బిడ్డ అయితే మనం ఎన్ని జన్మలు తీసుకుంటాము, ఈ లెక్కన ఇతర ధర్మాలవారికి ఎన్ని జన్మలుంటాయి అని లెక్క తీయండి. కానీ ఈ విషయాలన్నిటిలో ఎక్కువగా తల బాదుకునే అవసరం లేదు అని తండ్రి అంటారు. సమయం వృథా అయిపోతుంది. ఇక్కడ అన్ని మర్చిపోవాలి. ఇది వినిపించే అవసరము లేదు. మీరు రచయిత అయిన తండ్రి పరిచయాన్నిస్తారు, వారి గురించి ఎవ్వరికీ తెలియదు. శివబాబా భారతదేశంలోనే వస్తారు. తప్పకుండా ఏదో చేసే వెళ్తారు, అందుకే వారి జయంతిని జరుపుకుంటారు కదా. గాంధి లేక ఎవరైనా సాధువు మొదలైనవారు ఉండి వెళ్ళిపోతే, వారి స్టాంపులు తయారుచేస్తూ ఉంటారు. కుటుంబ నియంత్రణ స్టాంపులు తయారుచేస్తారు. మనది పాండవ గవర్నమెంట్, ఆల్మైటీ బాబా యొక్క గవర్నమెంట్ అని ఇప్పుడు మీకు నషా ఉంది. ఇది మీ కోట్ ఆఫ్ ఆర్మ్స్ (రాజముద్ర). ఇతరులెవ్వరికీ ఈ కోట్ ఆఫ్ ఆర్మ్స్ గురించి తెలియదు. వినాశన కాలంలో ప్రీతి బుద్ధి మనదేనని మీకు తెలుసు. తండ్రిని మనము చాలా స్మృతి చేస్తాము. తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ ప్రేమలో కన్నీళ్ళు వచ్చేస్తాయి. బాబా, మీరు మమ్మల్ని అర్థకల్పము కోసం దుఃఖములన్నిటి నుండి దూరము చేస్తారు. ఇంకే గురువులు లేదా మిత్ర-సంబంధీకులు మొదలైనవారెవ్వరినీ స్మృతి చేసే అవసరము లేదు. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి. ఉదయం సమయం చాలా మంచిది. బాబా, మీదైతే చాలా అద్భుతము. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత మీరు మమ్మల్ని మేల్కొలుపుతారు. మనుష్యమాత్రులందరూ కుంభకర్ణుని ఆసురీ నిద్రలో నిద్రించి ఉన్నారు అనగా అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. ఇది భారతదేశ ప్రాచీన యోగమని ఇప్పుడు మీకు తెలుసు, ఇక మిగిలిన హఠయోగాలు మొదలైనవి ఏవైతే నేర్పస్తారో, అవన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు వ్యాయామాలు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానముంది కనుక సంతోషం ఉంటుంది. ఇక్కడకు వస్తారు, బాబా రిఫ్రెష్ చేస్తారని భావిస్తారు. కొంతమంది ఇక్కడ రిఫ్రెష్ అయ్యి బయటకు వెళ్తారు, ఆ నషా సమాప్తమైపోతుంది. నంబరువారుగా ఉన్నారు కదా. ఇది పతిత ప్రపంచము అని బాబా అర్థం చేయిస్తారు. ఓ పతితపావనా రండి అని కూడా పిలుస్తారు కానీ స్వయాన్ని పతితులమని భావించరు, అందుకే పాపాలను కడుక్కునేందుకు వెళ్తారు. కానీ శరీరానికి పాపం అంటుకోదు. తండ్రి వచ్చి మిమ్మల్ని పావనంగా తయారుచేస్తారు మరియు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమౌతాయని అంటారు. ఈ జ్ఞానము మీకిప్పుడు లభించింది. భారతదేశము స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంగా ఉంది. పిల్లలైన మీరిప్పుడు సంగమయుగంలో ఉన్నారు. ఎవరైనా వికారాలలోకి పడిపోతే ఫెయిల్ అయిపోతారు అంటే నరకంలోకి వెళ్ళి పడిపోయినట్లు. 5 అంతస్థుల నుండి కింద పడిపోతారు, తర్వాత 100 రెట్లు శిక్షలు అనుభవించవలసి వస్తుంది. కనుక భారతదేశము ఎంత ఉన్నతంగా ఉండేది, ఇప్పుడు ఎంత నీచంగా ఉంది అని తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు ఎంత తెలివైనవారిగా అవుతారు. మనుష్యులు ఎంత తెలివిహీనులుగా ఉన్నారు. బాబా ఇక్కడ మీకు ఎంతగా నషా ఎక్కిస్తారు, మళ్ళీ బయటకు వెళ్ళడంతో నషా తగ్గిపోతుంది, సంతోషం ఎగిరిపోతుంది. విద్యార్థులు ఏదైనా పెద్ద పరీక్షను పాస్ అయితే, ఎప్పుడైనా నషా తగ్గుతుందా? చదువుకొని పాస్ అవుతారు, తర్వాత ఏమేమి అవుతారు. ఇప్పుడు ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి వచ్చి మిమ్మల్ని చదివిస్తారు. వారు నిరాకారుడు. ఆత్మలైన మీరు కూడా నిరాకారులే. ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చారు. ఈ డ్రామా రహస్యాన్ని తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు. ఈ సృష్టి చక్రాన్ని డ్రామా అని కూడా అంటారు. ఆ నాటకంలో ఎవరైనా రోగగ్రస్థులుగా అయితే బయటకు వెళ్ళిపోతారు. ఇది అనంతమైన నాటకము. ఇది యథార్థ రీతిగా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది, మనం ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తామని మీకు తెలుసు. మనము అనంతమైన పాత్రధారులము. ఇక్కడ శరీరము తీసుకొని పాత్రను అభినయిస్తాము, బాబా వచ్చేసారు - ఇవన్నీ బుద్ధిలో ఉండాలి. అనంతమైన డ్రామా ఎంతగా బుద్ధిలో ఉండాలి. అనంతమైన విశ్వం యొక్క రాజ్యాధికారం లభిస్తుందంటే దాని కోసం అటువంటి మంచి పురుషార్థము కూడా చేయాలి కదా. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండండి కానీ పవిత్రంగా ఉండండి. విదేశాలలో చాలా మంది వృద్ధులుగా అయినప్పుడు కంపానియన్షిప్ (తోడు) కోసం మళ్ళీ వివాహం చేసుకుంటారు...... సంభాళించేందుకు మళ్ళీ విల్లు వ్రాస్తారు. కొంత సంభాళించే వారికి, కొంత దానధర్మాలకు (చారిటీలకు) విల్లు వ్రాస్తారు. వికారాల విషయము ఉండదు. ప్రేయసీ-ప్రియులు కూడా వికారాల కోసం బలిహారం అవ్వరు. కేవలం శారీరక ప్రేమ ఉంటుంది. మీరు ఆత్మిక ప్రేయసులు, ఒకే ప్రియుడిని స్మృతి చేస్తారు. ప్రేయసులందరికీ ఒక్కరే ప్రియుడు. అందరూ ఒక్కరినే స్మృతి చేస్తారు. వారు ఎంత శోభనీయంగా ఉంటారు. ఆత్మ సుందరంగా ఉంటుంది కదా. వారు సదా సుందరమైనవారు. మీరైతే నల్లగా అయిపోయారు, వారు మిమ్మల్ని నలుపు నుండి తెల్లగా చేస్తారు. తండ్రి మమ్మల్ని తెల్లగా చేస్తారని మీకు తెలుసు. ఇక్కడ చాలా మంది ఏయే ఆలోచనలతో కూర్చొని ఉన్నారు అనేది ఎవ్వరికీ తెలియదు. స్కూలులో అలాగే ఉంటుంది - కూర్చుని-కూర్చునే బుద్ధి బయోస్కోప్ వైపు, మిత్రులు మొదలైనవారివైపు వెళ్ళిపోతుంది. సత్సంగాలలో కూడా అలాగే జరుగుతుంది. ఇక్కడ కూడా అలాగే ఉంటారు, బుద్ధిలో కూర్చోదు కనుక నషాయే ఎక్కదు, ఇతరుల చేత చేయించే విధంగా ధారణ కూడా జరగదు. చాలా మంది మాతలు వస్తారు, వారికి ఇక్కడ సేవలో నిమగ్నమైపోవాలని మనసు కలుగుతుంది కానీ వారికి చిన్న-చిన్న పిల్లలుంటారు. ఆ పిల్లలను సంభాళించేందుకు ఎవరైనా ఆయాలను పెట్టండి అని బాబా అంటారు. మీరు ఎంతోమందికి కళ్యాణము చేస్తారు. తెలివైనవారైతే ఆత్మిక సేవలో ఎందుకు నిమగ్నమవ్వకూడదు. 5-6 పిల్లలను సంభాళించేందుకు ఎవరైనా ఆయాలను పెట్టండి. ఇప్పుడు ఈ మాతల వంతు కదా. మీకు చాలా నషా ఉండాలి. నా భార్య అయితే సన్యాసులను కూడా జయించిందని పురుషులు చూస్తారు, ఇది మున్ముందు జరుగుతుంది. ఈ మాతలు లౌకిక మరియు పారలౌకిక పేరును ప్రసిద్ధము చేసి చూపిస్తారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.


ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మీరు బుద్ధి ద్వారా అంతా మర్చిపోవాలి. ఏ విషయాలలోనైతే సమయం వృథా అవుతుందో, వాటిని వినే-వినిపించే అవసరము లేదు.

2. చదువుకునే సమయంలో బుద్ధియోగము ఒక్క తండ్రి పైనే నిమగ్నమై ఉండాలి, బుద్ధి ఎక్కడా భ్రమించకూడదు. నిరాకార తండ్రి మనల్ని చదివిస్తున్నారు అనే నషాలో ఉండాలి.

వరదానము:-
అనంతమైన స్థితిలో స్థితులై, సేవ పట్ల మోహము నుండి అతీతంగా మరియు ప్రియంగా ఉండే విశ్వ సేవాధారి భవ

విశ్వసేవాధారి అంటే అనంతమైన స్థితిలో స్థితులై ఉండేవారు. అటువంటి సేవాధారులు సేవ చేస్తూ కూడా అతీతంగా మరియు సదా తండ్రికి ప్రియంగా ఉంటారు. సేవ పట్ల మోహంలోకి రారు ఎందుకంటే సేవ పట్ల మోహం కూడా బంగారు సంకెళ్ళు. ఈ బంధనము అనంతం నుండి హద్దులోకి తీసుకొస్తుంది, అందుకే దేహపు స్మృతి నుండి, ఈశ్వరీయ సంబంధము నుండి, సేవ యొక్క సాధనాల మోహం నుండి అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా అయినట్లయితే, విశ్వసేవాధారి అనే వరదానం ప్రాప్తిస్తుంది మరియు సదా సఫలత లభిస్తూ ఉంటుంది.

స్లోగన్:-
వ్యర్థ సంకల్పాలను ఒక సెకండులో స్టాప్ చేసే రిహార్సల్ చేసినట్లయితే శక్తిశాలిగా అవుతారు.