ఓంశాంతి. మధురాతి-మధురమైన పిల్లలు ఆత్మిక తండ్రి వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. రిఫ్రెష్ అయ్యి తిరిగి వెళ్ళిన తర్వాత తప్పకుండా ఏదైనా చేసి చూపించాలి. ఒక్కొక్క బిడ్డ సేవకు ఋజువునివ్వాలి. సెంటరు తెరవాలనిపిస్తుంది అని కొందరు పిల్లలు అంటారు. గ్రామాలలో కూడా సేవ చేస్తారు కదా. కనుక భవిష్య 21 జన్మలకు తండ్రి నుండి ఫలము లభించే విధంగా మేము మనసా-వాచా-కర్మణా, తనువు-మనస్సు-ధనముల ద్వారా సేవ చేయాలని పిల్లలకు సదా ఈ ఆలోచన ఉండాలి. ఇదే చింత ఉండాలి. మేము ఏమైనా చేస్తున్నామా? ఎవరికైనా జ్ఞానాన్ని ఇస్తున్నామా? రోజంతా ఈ సంకల్పాలు వస్తూ ఉండాలి. సెంటరు తెరిస్తే తెరవచ్చు కానీ ఇంట్లో స్త్రీ-పురుషులకు మనస్పర్థలు ఉండకూడదు. ఎటువంటి గొడవలు ఉండకూడదు. సన్యాసులు ఇంట్లోని గొడవల నుండి బయటకు వెళ్ళిపోతారు. డోంట్ కేర్ చేసి (ఖాతరు చేయకుండా) వెళ్ళిపోతారు. మరి గవర్నమెంట్ వారినేమైనా ఆపుతుందా ఏమిటి? అక్కడైతే కేవలం పురుషులు మాత్రమే వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో కొందరు మాతలు కూడా వెళ్తున్నారు, ఎవరికైతే నాథులెవరూ ఉండరో లేదా వైరాగ్యము వస్తుందో, వారికి కూడా ఆ సన్యాసి పురుషులు కూర్చుని నేర్పిస్తారు. వారి ద్వారా తమ వ్యాపారం నడిపిస్తారు. ధనము మొదలైనవన్నీ వారి వద్దనే పెట్టుకుంటారు. వాస్తవానికి ఇళ్ళు-వాకిళ్ళను వదిలిన తర్వాత ధనము పెట్టుకునే అవసరం ఉండదు. కనుక తండ్రి పిల్లలైన మీకిప్పుడు అర్థం చేయిస్తున్నారు. నేను తండ్రి పరిచయమివ్వాలని ప్రతి ఒక్కరి బుద్ధిలోకి రావాలి. మనుష్యులకైతే ఏమీ తెలియదు, తెలివితక్కువవారిగా ఉన్నారు. మధురాతి-మధురమైన పిల్లలూ, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి, కేవలం పండితులుగా అవ్వకండి అన్నది పిల్లలైన మీకు తండ్రి ఇచ్చే ఆజ్ఞ. స్వకళ్యాణము కూడా చేసుకోవాలి. స్మృతి ద్వారా సతోప్రధానంగా అవ్వాలి. చాలా పురుషార్థము చేయాలి. లేకపోతే చాలా పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. బాబా, మేము పదే-పదే మర్చిపోతున్నాము, వేరే సంకల్పాలు వచ్చేస్తాయి అని అంటారు. అవైతే వస్తాయి, మీరు తండ్రి స్మృతిలో ఉంటూ సతోప్రధానంగా అవ్వాలి అని బాబా అంటారు. అపవిత్రంగా ఉన్న ఆత్మ పరమపిత పరమాత్మనే స్మృతి చేసి పవిత్రంగా అవ్వాలి. తండ్రియే పిల్లలకు డైరెక్షన్ ఇస్తారు - ఓ ఆజ్ఞాకారి పిల్లలూ, మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు నశిస్తాయి. మొట్టమొదట ఈ విషయాన్నే వినిపించండి - నన్ను స్మృతి చేయండి, నేను పతిత పావనుడను అని నిరాకార శివబాబా చెప్తున్నారు. నా స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమౌతాయి, ఇంకే ఉపాయమూ లేదు, ఇంకే ఉపాయమునూ ఎవ్వరూ చెప్పలేరు. చాలామంది సన్యాసులు ఉన్నారు, వారు మిమ్మల్ని యోగ కాన్ఫరెన్స్ లకు వచ్చి పాల్గొనమని ఆహ్వానిస్తారు. వాళ్ళ హఠయోగముతోనైతే ఎవ్వరి కళ్యాణము జరగదు. అనేక యోగాశ్రమాలున్నాయి, వారికి ఈ రాజయోగము గురించి ఏ మాత్రమూ తెలియదు. తండ్రి గురించే తెలియదు. అనంతమైన తండ్రియే వచ్చి సత్యాతి-సత్యమైన యోగాన్ని నేర్పిస్తారు. తండ్రి, పిల్లలైన మిమ్మల్ని తమ సమానంగా తయారుచేస్తారు. నేను నిరాకారుడను. తాత్కాలికంగా ఈ శరీరంలోకి వచ్చాను. భాగ్యశాలి రథమనేది తప్పకుండా మనుష్యులదే ఉంటుంది. ఎద్దునైతే అలా అనలేము. వేరే గుర్రపు రథము మొదలైనవాటి విషయమూ లేదు, అలానే యుద్ధము విషయము కూడా లేదు. మనము మాయతోనే యుద్ధము చేయాలని మీకు తెలుసు. మాయతో ఓడిపోతే ఓటమి..... అని గాయనం కూడా చేయబడుతుంది. మీరు చాలా బాగా అర్థం చేయించగలరు కానీ ఇప్పుడు నేర్చుకుంటున్నారు. కొందరు నేర్చుకుంటూ-నేర్చుకుంటూ ఒక్కసారిగా కింద పడిపాతారు. ఏదో ఘర్షణ జరుగుతుంది. పరస్పరంలో ఇద్దరు సోదరీలకు కూడా పడదు, ఉప్పునీరుగా అయిపోతారు. మీకు పరస్పరంలో ఎటువంటి ఘర్షణలు ఉండకూడదు. ఒకవేళ ఘర్షణలుంటే, వీరేమి సేవ చేస్తారని తండ్రి అంటారు. చాలా మంచి-మంచి వారికి కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమయంలో మాలను తయారుచేసినట్లయితే దానిని డిఫెక్టెడ్ మాల అని అంటారు. పిల్లల్లో ఇంకా ఈ-ఈ అవగుణాలున్నాయి. డ్రామా ప్లాన్ అనుసారంగా బాబా, సేవను కూడా చేయిస్తూ ఉంటారు. డైరెక్షన్లు ఇస్తూ ఉంటారు. ఢిల్లీని నలువైపులా సేవతో చుట్టుముట్టండి. ఇది కేవలం ఒక్కరు మాత్రమే చేయాలని కాదు, పరస్పరములో కలిసి సలహాలు తీసుకోవాలి. అందరూ ఏకమతంగా ఉండాలి. బాబా ఒక్కరే, కానీ సహాయకులైన పిల్లలు లేకుండా పని చేయరు. మీరు సెంటర్లు తెరిచి అభిప్రాయాలను తీసుకుంటారు. మీరు సహాయము చేసేవారేనా అని బాబా అడుగుతారు. అవును బాబా అని అంటారు. ఒకవేళ సహాయము చేసేవారు లేకపోతే ఏమీ చేయలేరు. ఇంటికి కూడా మిత్ర-సంబంధీకులు మొదలైనవారు వస్తారు కదా. వారు మిమ్మల్ని నిందిస్తారు, ఎత్తిపొడుస్తూ ఉంటారు. మీరు వాటిని లెక్క చేయకూడదు.
పిల్లలైన మీరు పరస్పరములో కూర్చుని చర్చించుకోవాలి. సెంటర్లు తెరిచినప్పుడు కూడా అందరూ కలిసి - బాబా, మేము బ్రాహ్మణి సలహాతో ఇదంతా చేస్తున్నామని వ్రాస్తారు. సింధీ భాషలో - బ త బారా (ఒకటితో రెండు కలిస్తే 12 అవుతుంది) అని అంటారు, 12 మంది ఉంటే ఇంకా మంచి సలహా వెలువడుతుంది. అక్కడక్కడ ఇతరుల నుండి సలహాలు తీసుకోరు. ఇలా అయితే ఏమైనా పని అవ్వగలదా? పరస్పరంలో మీ సంగఠన ఉండనంతవరకు మీరు ఇంత పెద్ద కార్యాన్ని ఎలా చేయగలరు అని బాబా అంటారు. చిన్న దుకాణాలు, పెద్ద దుకాణాలు ఉంటాయి కదా. వారు పరస్పరములో కలుసుకుని సంగఠనలు ఏర్పాటు చేసుకుంటారు. బాబా, మీరు సహాయము చేయండి అని ఈ విధంగా ఎవరూ అడగరు. ముందు సహాయకులను తయారుచేయాలి, తర్వాత పిల్లలు ధైర్యము చేస్తే తండ్రి సహాయం చేస్తారు అని బాబా అంటారు. మొదట మీకు మీరు సహాయకులను తయారుచేయండి. బాబా, మేమింత చేస్తున్నాము, మిగిలినది మీరు సహాయము చేయండి. అంతేకానీ, ముందు మీరు సహాయము చేయండి అని కాదు. ధైర్యం వహించాలి...... దీని అర్థము కూడా తెలుసుకోరు. ముందు పిల్లలకు ధైర్యముండాలి. ఎవరెవరు ఏమేమి సహాయము చేస్తారు? ఫలానావారు ఫలానా సహాయము చేస్తారని లెక్కాపత్రమంతా వ్రాస్తారు. నియమానుసారంగా వ్రాసి ఇస్తారు. అంతేకానీ ఒక్కొక్కరు మేము సెంటరు తెరుస్తాము, మీరు సహాయం చేయండి అని ఈ విధంగా అనరు. అలాంటప్పుడు బాబా తెరవలేరా? కానీ అలా జరగదు. కమిటీవారు పరస్పరంలో కలవాలి. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు కదా. కొందరు ఏమీ అర్థము చేసుకోరు. కొందరు చాలా హర్షితంగా ఉంటారు. ఈ జ్ఞానంలో చాలా సంతోషముండాలి అని బాబా భావిస్తారు. ఒక్కరే తండ్రి, టీచరు, సద్గురువుగా లభించినప్పుడు సంతోషముండాలి కదా. ప్రపంచంలో ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. శివబాబాయే జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు, సర్వుల సద్గతిదాత. అందరి తండ్రి కూడా ఒక్కరే. ఇది ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండదు. వారే జ్ఞాన సాగరుడు, ముక్తి దాత, మార్గదర్శకులని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. కనుక తండ్రి మతంపై నడవాల్సి ఉంటుంది. పరస్పరంలో కలిసి చర్చించుకోవాలి, ఖర్చు చేయలి. ఒక్కరి డైరెక్షన్ పైనే నడవలేరు. అందరూ సహాయకులుగా కావాలి. ఈ బుద్ధి కూడా కావాలి కదా. పిల్లలైన మీరు ఇంటింటికీ సందేశమునివ్వాలి. వివాహానికి ఆహ్వానం లభించింది, వెళ్ళొచ్చా అని అడుగుతారు. ఎందుకు వెళ్ళకూడదు, వెళ్ళండి, వెళ్ళి మీ సేవను చేయండి అని బాబా అంటారు. అనేకుల కళ్యాణము చేయండి. భాషణ కూడా చేయవచ్చు. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది, నన్నొక్కరినే స్మృతి చేయండి అని బాబా అంటారు. ఇక్కడ అందరూ పాపాత్ములు. తండ్రినే నిందిస్తూ ఉంటారు. తండ్రి నుండి మిమ్మల్ని విముఖము చేసేస్తారు. వినాశకాలే విపరీత బుద్ధి అని గాయనము కూడా ఉంది. ఈ మాట ఎవరు అన్నారు? నాతో ప్రీతి బుద్ధి లేదు అని స్వయంగా తండ్రి చెప్పారు. వినాశకాలే విపరీతబుద్ధి. నా గురించి తెలియనే తెలియదు. ఎవరికైతే ప్రీతి బుద్ధి ఉందో, ఎవరైతే నన్ను స్మృతి చేస్తారో, వారే విజయము పొందుతారు. ప్రీతి ఉన్నా కానీ స్మృతి చేయకపోతే తక్కువ పదవిని పొందుతారు. తండ్రి పిల్లలకు డైరెక్షన్ ఇస్తారు. ముఖ్యమైన విషయము - అందరికీ సందేశమునివ్వాలి. తండ్రిని స్మృతి చేసినట్లయితే పావనంగా అయి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. డ్రామానుసారంగా బాబా వృద్ధ శరీరాన్నే తీసుకోవలసి ఉంటుంది. వానప్రస్థములో ప్రవేశిస్తారు. మనుష్యులు వానప్రస్థ స్థితిలోనే భగవంతుడిని కలుసుకోవడానికి శ్రమిస్తారు. భక్తిలో జప-తపాలు మొదలైనవన్నీ భగవంతుడిని కలిసే మార్గాలుగా భావిస్తారు. ఎప్పుడు లభిస్తారు అనేది ఏమీ తెలియదు. జన్మ-జన్మాంతరాలుగా భక్తి చేస్తూ వచ్చారు. భగవంతుడైతే ఎవ్వరికీ లభించరు. పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేయాల్సి వచ్చినప్పుడే బాబా వస్తారని అర్థము చేసుకోరు. తండ్రియే రచయిత, చిత్రమైతే ఉంది కానీ త్రిమూర్తి చిత్రంలో శివుడిని చూపించరు. శివబాబా లేకుండా బ్రహ్మా-విష్ణు-శంకరులను చూపించారు, తలను తీసేసినట్లు అయ్యింది. తండ్రి లేకపోతే అనాథలుగా అయిపోతారు. నేను వచ్చి మిమ్మల్ని ఆ నాథునికి చెందినవారిగా చేస్తాను అని తండ్రి చెప్తారు. 21 జన్మలు మీరు సనాథలుగా అవుతారు. ఎటువంటి కష్టమూ ఉండదు. బాబా లభించనంతవరకు, మేము కూడా పూర్తిగా అనాథలుగా, తుచ్ఛబుద్ధి కలవారిగా ఉండేవారమని మీరు కూడా అంటారు. పతిత-పావన అని అంటారు కానీ వారెప్పుడు వస్తారు అనేది తెలియదు. కొత్త ప్రపంచమే పావన ప్రపంచము. తండ్రి ఎంత సులువుగా అర్థం చేయిస్తారు. మేము తండ్రికి చెందినవారిగా అయ్యాము, తప్పకుండా స్వర్గానికి యజమానులుగా అవుతాము అని మీకు కూడా అర్థమౌతుంది. శివబాబా అనంతమైన యజమాని. తండ్రియే వచ్చి సుఖ-శాంతుల వారసత్వమునిచ్చారు. సత్యయుగంలో సుఖముండేది, మిగిలిన ఆత్మలంతా శాంతిధామంలో ఉండేవారు. ఇప్పుడు మీరు ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. శివబాబా ఎందుకు వచ్చి ఉంటారు? తప్పకుండా కొత్త ప్రపంచాన్ని రచించేందుకు, పతితులను పావనంగా చేసేందుకు వచ్చి ఉంటారు, ఉన్నతమైన కార్యాన్ని చేసి ఉంటారు. మనుష్యులు పూర్తిగా ఘోరమైన అంధకారంలో ఉన్నారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది అని తండ్రి చెప్తారు. పిల్లలైన మిమ్మల్ని తండ్రి కూర్చొని మేల్కొల్పుతారు. కొత్త ప్రపంచం మళ్ళీ పాతదిగా ఎలా అవుతుంది అని మీకిప్పుడు ఈ మొత్తం డ్రామా గురించి తెలుసు. అన్నీ వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు. మనకు ఎవ్వరి పట్ల ద్వేషము లేదు. ఈ విషయాన్ని అర్థము చేయించవలసి ఉంటుంది. డ్రామానుసారంగా మాయా రాజ్యము కూడా ఉండాలి. మధురాతి మధురమైన పిల్లలూ, ఇప్పుడు ఈ చక్రము పూర్తవుతుందని బాబా మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతము లభిస్తుంది, దానిపై నడుచుకోవాలి. ఇప్పుడు పంచ వికారాల మతముపై నడవకూడదు. అర్థకల్పము మీరు మాయ మతంపై నడిచి తమోప్రధానంగా అయ్యారు. ఇప్పుడు నేను మిమ్మల్ని సతోప్రధానంగా తయారుచేసేందుకు వచ్చాను. ఇది సతోప్రధానము, తమోప్రధానం యొక్క ఆట. నింద యొక్క విషయమేమీ లేదు. భగవంతుడు ఈ రాకపోకల నాటకాన్ని ఎందుకు రచించారు అని అంటారు. ఎందుకు అనే ప్రశ్నే తలెత్తదు. ఇది డ్రామా చక్రము, ఇది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. డ్రామా అనాది. ఇప్పుడిది కలియుగము, సత్యయుగము గడిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు. బాబా-బాబా అని అంటూ ఉన్నట్లయితే కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇవి అతి గుహ్యమైన రమణీకమైన విషయాలు అని బాబా అంటారు. పులి పాలు కోసం బంగారు పాత్ర కావాలని అంటారు. బంగారు బుద్ధిగా ఎలా తయారవుతుంది? ఆత్మలోనే బుద్ధి ఉంది కదా. నా బుద్ధి ఇప్పుడు బాబా వైపు ఉంది, నేను బాబాను చాలా స్మృతి చేస్తాను అని ఆత్మ అంటుంది. కూర్చుని-కూర్చునే వేరే వైపుకు వెళ్ళిపోతుంది కదా. బుద్ధిలో వ్యాపార వ్యవహారాలు గుర్తుకొస్తూ ఉంటాయి. కావున మీ మాట విననట్లు ఉంటుంది. శ్రమ ఉంటుంది. ఎంతెంతగా మృత్యువు సమీపంగా వస్తూ ఉంటుందో, అంతగా మీరు స్మృతిలో చాలా ఉంటారు. మరణించే సమయంలో అందరూ భగవంతుడిని స్మృతి చేయమని చెప్తారు. నన్ను స్మృతి చేయండి అని ఇప్పుడు తండ్రి స్వయంగా చెప్తారు. మీ అందరిదీ వానప్రస్థ స్థితి. తిరిగి వెళ్ళాలి కనుక ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. వేరే విషయాలేవీ వినకండి. జన్మ-జన్మాంతరాల పాపాల భారము మీ తలపై ఉంది. ఈ సమయంలో అందరూ అజామిల్ వలె ఉన్నారని శివబాబా అంటారు. ముఖ్యమైన విషయము స్మృతియాత్ర, దీని ద్వారా మీరు పావనంగా అవుతారు, పరస్పరములో ప్రేమ కూడా ఉండాలి. ఇతరుల నుండి సలహాలను తీసుకోవాలి. తండ్రి ప్రేమసాగరుడు కదా. కావున మీరు కూడా పరస్పరంలో చాలా ప్రియంగా ఉండాలి. దేహీ-అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేయాలి. సోదరీ-సోదరుల సంబంధాన్ని కూడా తెంచి వేయాల్సి వస్తుంది. సోదరీ-సోదరులతో కూడా యోగము పెట్టుకోకండి. ఒక్క తండ్రితోనే యోగము పెట్టుకోండి. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికారీ దృష్టి సమాప్తమైపోతుంది అని తండ్రి ఆత్మలకు చెప్తారు. కర్మేంద్రియాలతో ఏ వికర్మ చేయకూడదు. మనస్సులో తుఫానులు తప్పకుండా వస్తాయి. ఇది పెద్ద గమ్యము. బాబా అంటారు - చూడండి, కర్మేంద్రియాలు మోసము చేస్తాయి కనుక అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ తప్పుడు పని చేసినట్లయితే ఇక సమాప్తం. ఎక్కితే వైకుంఠానికి యజమానులు...... శ్రమ లేకుండా ఏమీ లభించదు. చాలా శ్రమ ఉంటుంది. దేహ సహితంగా దేహము యొక్క...... కొందరికి బంధనాలు లేకపోయినా కూడా చిక్కుకుని ఉంటారు. తండ్రి శ్రీమతంపై నడవరు. ఒకటి రెండు లక్షలుండొచ్చు, పెద్ద కుటుంబమైనా కూడా ఎక్కువగా వ్యాపారాలు మొదలైనవాటిలో చిక్కుకోకండి, వానప్రస్థీగా అయిపోండి అని తండ్రి చెప్తారు. ఖర్చులు మొదలైనవి తగ్గించండి. పేదవారు ఎంత సాధారణంగా ఉంటారు. ఇప్పుడు ఎలాంటి వస్తువులు వెలువడ్డాయంటే ఇక అడగకండి. షావుకార్లు ఖర్చులు చేస్తూనే ఉంటారు. లేదంటే అసలు కడుపుకు ఏమి కావాలి? ఒక పావు అంత పిండి అంతే. చాలు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. పరస్పరంలో చాలా చాలా ప్రియంగా అవ్వాలి కానీ సోదరీ సోదరులతో యోగము పెట్టుకోకూడదు. కర్మేంద్రియాలతో ఏ వికర్మ చేయకూడదు.
2. ఒక్క ఈశ్వరీయ మతంపై నడుచుకొని సతోప్రధానంగా అవ్వాలి. మాయా మతమును వదిలేయాలి. పరస్పరంలో సంగఠనను దృఢంగా చేసుకోవాలి, ఒకరికొకరు సహాయకులుగా అవ్వాలి.