05-11-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - పిల్లలైన మీకు సుఖ-శాంతుల వారసత్వమునిచ్చేందుకు తండ్రి వచ్చారు, మీ స్వధర్మమే శాంతి కావున మీరు శాంతి కొరకు భ్రమించరు”

ప్రశ్న:-

ఇప్పుడు పిల్లలైన మీరు 21 జన్మల కొరకు తరగని ఖజానాలతో తూకం వేసేందుకు యోగ్యులుగా అవుతారు - ఎందుకు?

జవాబు:-

ఎందుకంటే తండ్రి కొత్త సృష్టిని రచించినప్పుడు పిల్లలైన మీరు వారికి సహాయకులుగా అవుతారు. తమదంతా వారి కార్యములో సఫలం చేస్తారు, కావున తండ్రి దానికి ప్రతిఫలంగా 21 జన్మలకు మిమ్మల్ని తరగని ఖాజానాలతో ఎలా తూకము వేస్తారంటే ఆ ధనము ఎప్పటికీ తరగదు, దుఃఖము కూడా కలగదు, అకాల మృత్యువు కూడా జరగదు.

గీతము:-

నాకు ఆధారమునిచ్చేవారు...... ( ముజ్ కో సహారా దేనే వాలా.....)

ఓంశాంతి. మధురాతి మధురమైన పిల్లలకు "ఓం” యొక్క అర్థాన్ని వినిపించాము. కొంతమంది కేవలం ఓం అని అంటారు కానీ ఓం శాంతి అని అనాలి. కేవలం ఓం అని అంటే దాని అర్థము ఓం భగవాన్. ఓం శాంతి అనగా నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. నేను ఆత్మను, ఇది నా శరీరము. మొదట ఆత్మ, తర్వాత శరీరము. ఆత్మ శాంతి స్వరూపము, ఆత్మలు నివాసించే స్థానము శాంతిధామము. అంతేకానీ అడవులకు వెళ్ళినట్లయితే సత్యమైన శాంతి లభించదు. సత్యమైన శాంతి ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే లభిస్తుంది. రెండవది - ఎక్కడైతే అశాంతి ఉంటుందో, అక్కడ శాంతి కావాలి అని కోరుకుంటారు. అశాంతిగా ఉన్న ఈ దుఃఖధామము వినాశనమైపోతుంది, తర్వాత శాంతి ఏర్పడుతుంది. పిల్లలైన మీకు శాంతి యొక్క వారసత్వము లభిస్తుంది. అక్కడ ఇంట్లో గానీ, బయట రాజధానిలో గానీ అశాంతి ఉండదు. దానిని శాంతి రాజ్యమని అంటారు, ఇక్కడ ఉండేది అశాంతి రాజ్యము ఎందుకంటే ఇది రావణరాజ్యము. అది ఈశ్వరుని ద్వారా స్థాపించబడిన రాజ్యము. మళ్ళీ ద్వాపరయుగము తర్వాత ఆసురీ రాజ్యంగా అయిపోతుంది, అసురులకు ఎప్పుడూ శాంతి ఉండదు. ఇంట్లో, దుకాణములో ఎక్కడ చూస్తే అక్కడ అశాంతియే అశాంతి ఉంటుంది. 5 వికారాల రూపీ రావణుడు అశాంతిని వ్యాపింపజేస్తాడు. రావణుడంటే ఏమిటి అన్నది విద్వాంసులకు గానీ, పండితులకు గానీ, ఎవ్వరికీ తెలియదు. మేము రావణుడిని ప్రతి సంవత్సరం ఎందుకు హతమారుస్తున్నాము అన్నది అర్థం చేసుకోరు. సత్య-త్రేతాయుగాలలో ఈ రావణుడు ఉండనే ఉండడు. అది ఉన్నదే దైవీ రాజ్యము. ఈశ్వరుడైన బాబా మీ ద్వారా దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తారు. వారొక్కరే చేయరు. మధురాతి-మధురమైన పిల్లలైన మీరు ఈశ్వరునికి సహాయకులు. ఇంతకుముందు రావణుడికి సహాయకులుగా ఉండేవారు. ఇప్పుడు ఈశ్వరుడు వచ్చి సర్వుల సద్గతి చేస్తున్నారు. పవిత్రత, సుఖ-శాంతులను స్థాపన చేస్తారు. పిల్లలైన మీకిప్పుడు జ్ఞానమనే మూడవ నేత్రము లభించింది. సత్య-త్రేతాయుగాలలో దుఃఖమనే మాటే ఉండదు. అక్కడ ఎవ్వరూ నిందించరు. మురికి పదార్థాలను తినరు. ఇక్కడ ఎంత మురికి పదార్థాలను తింటారో చూడండి. కృష్ణునికి ఆవులు చాలా ప్రియంగా అనిపించేవి అని చూపిస్తారు. అలాగని కృష్ణుడు గోవులను చూసుకునే గోవుల కాపరి అని కాదు. అక్కడి ఆవులకు, ఇక్కడి ఆవులకు చాలా తేడా ఉంటుంది. అక్కడి ఆవులు చాలా సుందరంగా, సతోప్రధానంగా ఉంటాయి. దేవతలెంత సుందరంగా ఉంటారో, ఆవులు కూడా అంత సుందరంగా ఉంటాయి. చూడడంతోనే మనసుకు సంతోషం కలుగుతుంది. అది స్వర్గము. ఇది నరకము. అందరూ స్వర్గాన్ని స్మృతి చేస్తూ ఉంటారు. స్వర్గానికి, నరకానికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. రాత్రి అనగా చీకటి, పగలు ప్రకాశముంటుంది. బ్రహ్మాకు పగలు అనగా బ్రహ్మా వంశీయులకు కూడా పగలే ఉంటుంది. మొదట మీరు కూడా ఘోర అంధకారమయమైన రాత్రిలో ఉండేవారు. ఈ సమయంలో భక్తి తీవ్రత ఎంతగా ఉంది, మహాత్ములు మొదలైనవారిని బంగారంతో తూకము వేస్తూ ఉంటారు, ఎందుకంటే వారు శాస్త్రాలలో గొప్ప విద్వాంసులు. వారి ప్రభావము ఇంత ఎక్కువగా ఎందుకుంది? ఇది కూడా బాబా అర్థం చేయించారు. వృక్షములో కొత్త-కొత్త ఆకులు వచ్చినప్పుడు సతోప్రధానంగా ఉంటాయి. పై నుండి కొత్త ఆత్మలు వస్తే వారి ప్రభావము అల్పకాలానికి తప్పకుండా ఉంటుంది కదా. వాళ్ళను బంగారం లేక వజ్రాలతో తూకం వేస్తారు, కానీ అవన్నీ సమాప్తమవ్వనున్నాయి. మనుష్యుల వద్ద ఎన్ని లక్షల విలువ గల భవనాలు ఉన్నాయి. మేము చాలా ధనవంతులమని భావిస్తారు. ఇలా షావుకారులుగా ఉండటం అనేది ఇక కొద్ది సమయానికి మాత్రమే అని పిల్లలైన మీకు తెలుసు. ఇదంతా మట్టిలో కలిసిపోతుంది. కొందరిది మట్టిలో కలిసిపోతుంది...... అని గాయనముంది. తండ్రి స్వర్గ స్థాపన చేస్తారు, ఈ కార్యములో ఎవరైతే తమవద్ద ఉన్నది ఉపయోగిస్తారో వారికి 21 జన్మల కోసం వజ్రవైఢూర్యాల మహళ్ళు లభిస్తాయి. ఇక్కడైతే ఒక జన్మకు మాత్రమే లభిస్తుంది. అక్కడ 21 జన్మల వరకు కొనసాగుతుంది. ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నారో, దేహ సహితంగా అంతా భస్మమైపోతుంది. పిల్లలైన మీకు దివ్యదృష్టి ద్వారా సాక్షాత్కారము కూడా జరుగుతుంది. వినాశనం అయిన తర్వాత ఈ లక్ష్మీనారాయణుల రాజ్యము ఉంటుంది. మనము మన రాజ్య భాగ్యాన్ని మళ్ళీ స్థాపన చేసుకుంటున్నామని మీకు తెలుసు. 21 తరాలు రాజ్యము చేశాము, ఆ తర్వాత రావణుని రాజ్యము నడిచింది. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు. భక్తిమార్గంలో అందరూ తండ్రినే స్మృతి చేస్తారు. దుఃఖములో అందరూ స్మృతి చేస్తారు...... అని గాయనము కూడా ఉంది. తండ్రి సుఖము యొక్క వారసత్వమునిస్తారు, తర్వాత ఇక స్మృతి చేసే అవసరం ఉండదు. నీవే తల్లి-తండ్రి...... ఇప్పుడు తల్లిదండ్రులు వారి పిల్లలకు తల్లిదండ్రులు అవుతారు. కానీ ఇది పారలౌకిక తల్లిదండ్రుల విషయము. మీరిప్పుడు లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు చదువుతున్నారు. పాఠశాలలో పిల్లలు బాగా పాస్ అయినట్లయితే టీచర్ కు బహుమతినిస్తారు. మరి మీరిప్పుడు వారికి ఏ బహుమతినిస్తారు? మీరు గారడితో వారిని తమ పుత్రునిగా చేసుకుంటారు. కృష్ణుని నోటిలో వెన్నముద్దను తల్లి చూసినట్లుగా చూపిస్తారు. ఇప్పుడు కృష్ణుడు సత్యయుగంలో జన్మ తీసుకున్నారు. వారు వెన్న మొదలైనవి తినరు. వారు విశ్వానికి యజమాని. మరి ఈ విషయము ఎప్పటిది? ఇది ఇప్పటి సంగమయుగంలోని విషయము. మేము ఈ శరీరాన్ని వదిలి, చిన్న బిడ్డగా అవుతాము, విశ్వానికి యజమానులుగా అవుతాము అని మీకు తెలుసు. క్రైస్తవులిరువురూ పరస్పరంలో కొట్లాడుకుంటారు, పిల్లలైన మీకు వెన్న లభిస్తుంది. రాజ్యము లభిస్తుంది కదా. భారతదేశంలోని వారు పరస్పరంలో గొడవ పడేలా చేసి, వాళ్ళు వెన్నను తినేసారు. క్రైస్తవ రాజ్యము 3 వంతులు ఉండేది. తర్వాత మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. పూర్తి విశ్వముపై మీరు తప్ప ఇంకెవ్వరూ రాజ్యం చేయలేరు. మీరిప్పుడు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. ఇప్పుడు మీరు ఈ బ్రహ్మాండానికి మరియు విశ్వానికి యజమానులుగా అవుతారు. విశ్వంలో బ్రహ్మాండం కలవదు. సూక్ష్మవతనంలో కూడా రాజ్యముండదు. సత్యయుగం, త్రేతాయుగం...... ఈ చక్రము ఇక్కడ స్థూల వతనములో ఉంటుంది. ధ్యానములో ఆత్మ ఎక్కడికీ వెళ్ళదు. ఆత్మ వెళ్ళిపోతే శరీరము సమాప్తమైపోతుంది. ఇవన్నీ సాక్షాత్కారాలు, రిద్ధి-సిద్ధి (మంత్ర తంత్రాలు) ద్వారా కూడా ఇటువంటి సాక్షాత్కారాలు జరుగుతాయి, ఇక్కడ కూర్చునే విదేశాలలోని పార్లమెంటు మొదలైనవి చూడవచ్చు. బాబా చేతిలో దివ్యదృష్టి అనే తాళంచెవి ఉంది. మీరిక్కడ కూర్చునే లండన్ చూడవచ్చు. దీనికోసం వేరే పరికరాలు మొదలైనవి కొనే అవసరము లేదు. డ్రామాలో ఏదైతే ముందు నుండి నిర్ణయింపబడి ఉందో, డ్రామానుసారంగా ఆ సమయానికి అదే సాక్షాత్కారమవుతుంది. భగవంతుడు అర్జునుడికి సాక్షాత్కారము చేయించినట్లు చూపిస్తారు కదా. డ్రామానుసారంగా వారికి సాక్షాత్కారము అవ్వవలసి ఉంది. ఇది కూడా నిర్ణయింపబడి ఉంది. ఇందులో ఎవరి గొప్పతనమూ లేదు. ఇదంతా డ్రామానుసారంగా జరుగుతుంది. కృష్ణుడు విశ్వానికి రాకుమారునిగా అవుతారు అనగా వెన్న లభిస్తుంది. విశ్వమని దేనినంటారో, బ్రహ్మాండమని దేనినంటారో కూడా ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మాండములో ఆత్మలైన మీరు నివసిస్తారు. సూక్ష్మవతనానికి వెళ్ళడం-రావడం, సాక్షాత్కారాలు జరగడం మొదలైనవి ఇప్పుడు జరుగుతాయి, మళ్ళీ 5 వేల సంవత్సరాల వరకు సూక్ష్మవతనము యొక్క పేరే ఉండదు. బ్రహ్మా దేవతాయ నమః అని అంటారు, తర్వాత శివ పరమాత్మాయ నమః అని అంటారు, అనగా వారు అందరికంటే ఉన్నతమైనవారు అయినట్లు కదా. వారిని భగవంతుడు అని అంటారు. ఆ దేవతలు కూడా మనుష్యులే కానీ దైవీ గుణాలు కలవారు. అంతేకానీ 4-8 భుజాలు గల మనుష్యులెవ్వరూ ఉండరు. అక్కడ కూడా 2 భుజాల మనుష్యులే ఉంటారు, కానీ వారు సంపూర్ణ పవిత్రంగా ఉంటారు, అపవిత్రత అనే మాటే ఉండదు. అకాలమృత్యువు ఎప్పుడూ జరగదు. కావున పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. ఆత్మలైన మనము ఈ శరీరము ద్వారా బాబానైతే చూసాము. చూసేందుకు శరీరమే కనిపిస్తుంది, పరమాత్మను గానీ, ఆత్మను గానీ చూడలేము. ఆత్మను, పరమాత్మను తెలుసుకోవలసి ఉంటుంది. చూసేందుకు దివ్యదృష్టి లభిస్తుంది. మిగిలిన వస్తువులన్నీ దివ్యదృష్టితో పెద్దవిగా కనిపిస్తాయి. రాజధాని కూడా పెద్దదిగానే కనిపిస్తుంది. కానీ ఆత్మ కేవలం ఒక బిందువు. బిందువును చూస్తే మీకు ఏమీ అర్థము కాదు. ఆత్మ చాలా సూక్ష్మమైనది. ఆత్మను పట్టుకునేందుకు చాలామంది డాక్టర్లు మొదలైనవారు ప్రయత్నించారు కానీ ఎవ్వరికీ తెలియనే తెలియదు. అక్కడ వారైతే బంగారంతో, వజ్రాలతో తూకం వేస్తారు. మీరు జన్మ-జన్మాంతరాలకు పదమపతులుగా అవుతారు. మీకు బాహ్య ఆడంబరం కొద్దిగా కూడా ఉండదు. నేను సాధారణ రీతిలో ఈ రథంలో కూర్చుని చదివిస్తాను. వీరి పేరు భగీరథుడు. ఇది పతిత పురాతనమైన రథము, ఇందులోకి తండ్రి వచ్చి ఉన్నతోన్నతమైన సేవ చేస్తారు. నాకు నా స్వంత శరీరము లేదు అని తండ్రి అంటున్నారు. నేను జ్ఞానసాగరుడను, ప్రేమసాగరుడను...... నేను మీకు వారసత్వాన్ని ఎలా ఇవ్వాలి! పై నుండి అయితే ఇవ్వను. ప్రేరణ ద్వారా చదివిస్తానా? తప్పకుండా రావాల్సి ఉంటుంది కదా. భక్తిమార్గంలో నన్ను పూజిస్తారు, నేను అందరికీ ప్రియమనిపిస్తాను. గాంధీ, నెహ్రూల చిత్రాలు ప్రియంగా అనిపిస్తాయి, వారి శరీరాలను స్మృతి చేస్తారు. అవినాశీ అయిన ఆత్మ వెళ్ళి మరో జన్మ తీసుకుంది. వారి వినాశీ చిత్రాలను స్మృతి చేస్తూ ఉంటారు. అది భూత పూజ అయినట్లు కదా. సమాధి కట్టి దానిపై పుష్పాలు మొదలైనవి సమర్పిస్తారు. ఇది స్మృతిచిహ్నము. శివుని మందిరాలు ఎన్ని ఉన్నాయి, అన్నిటికంటే పెద్ద స్మృతిచిహ్నము శివునిదే కదా. సోమనాథ మందిరానికి గాయనముంది. మహమ్మద్ గజనవీ వచ్చి దానిని దోచుకున్నాడు. మీ వద్ద అంత ధనముండేది. బాబా పిల్లలైన మిమ్మల్ని రత్నాలతో తూకం వేస్తారు. నేను స్వయానికి తూకం వేయించుకోను. నేను అంత ధనవంతునిగా అవ్వను కానీ మిమ్మల్ని ధనవంతులుగా తయారుచేస్తాను. అక్కడైతే ఈ రోజు వాళ్ళను తూకం వేస్తారు, రేపు మరణించవచ్చు. ధనము దేనికీ పనికిరాదు. ఒకవేళ శ్రీమతమనుసారంగా నడుచుకున్నట్లయితే, 21 జన్మలు మీతోనే ఉండే విధంగా తరగని ఖజానాలతో తండ్రి మిమ్మల్ని తూకం వేస్తారు. అక్కడ దుఃఖమనే మాటే ఉండదు, ఎప్పుడూ అకాలమృత్యువు జరగదు. మృత్యువంటే భయపడరు. ఇక్కడ ఎంత భయపడతారు, ఏడుస్తారు. మీరు వెళ్ళి యువరాజులుగా అవుతారు, అక్కడ ఎంత సంతోషముంటుంది. ఇంద్రజాలికుడు, వ్యాపారి, రత్నాకరుడని శివపరమాత్మను అంటారు. ఇటువంటి రాకుమారులుగా అవుతారని మీకు కూడా సాక్షాత్కారము చేయిస్తారు. ఈరోజుల్లో సాక్షాత్కారాల పాత్రను బాబా ఆపివేశారు. దాని వల్ల నష్టము కలుగుతుంది. ఇప్పుడు జ్ఞానము ద్వారా తండ్రి మీ సద్గతి చేస్తారు. మీరు మొదట సుఖధామంలోకి వెళ్తారు. ఇప్పుడిది దుఃఖధామము. ఆత్మయే జ్ఞానాన్ని ధారణ చేస్తుందని మీకు తెలుసు, కనుక స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి చెప్తున్నారు. ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి. ఒకవేళ సంస్కారాలు శరీరములోనే ఉంటే, శరీరముతో పాటు అవి కూడా భస్మమైపోవాలి. శివబాబా, ఆత్మలైన మేము ఈ శరీరము ద్వారా చదువుకుంటున్నామని మీరంటారు. ఇది కొత్త విషయము కదా. ఆత్మలైన మనందరినీ శివబాబా చదివిస్తున్నారు. ఈ విషయము పక్కాగా గుర్తుండాలి. ఆత్మలైన మనందరికీ వారు తండ్రి కూడా, టీచర్ కూడా. నాకు నా స్వంత శరీరము లేదు అని తండ్రి స్వయంగా చెప్తున్నారు. నేను కూడా ఆత్మనే కానీ నన్ను పరమాత్మ అని అంటారు. ఆత్మయే అన్నీ చేస్తుంది. శరీరాల పేర్లు మారుతూ ఉంటాయి. ఆత్మ ఆత్మనే. నేను పరమాత్మను, మీ వలె పునర్జన్మలు తీసుకోను. డ్రామాలో నా పాత్రయే ఈ విధంగా ఉంది, నేను వీరిలో ప్రవేశించి మీకు వినిపిస్తాను కనుక వీరిని భాగ్యశాలి రథమని అనడం జరుగుతుంది. వీరిని పాత చెప్పు అని కూడా అంటారు. శివబాబా కూడా పాత లాంగ్ బూట్ వేసుకున్నారు. నేను ఇతని అనేక జన్మల అంతిమంలో ప్రవేశించాను అని తండ్రి అంటున్నారు. మొట్టమొదట వీరు తతత్వమ్ గా అవుతారు. మీరు యువత అని బాబా అంటున్నారు. నా కంటే బాగా చదువుకుని ఉన్నత పదవిని పొందాలి, కానీ నాతో పాటు బాబా ఉన్నారు కావున నాకు పదే-పదే వారి స్మృతి కలుగుతుంది. బాబా నాతో పాటు పడుకుంటారు కూడా, కానీ బాబా నన్ను ఆలింగనం చేసుకోలేరు. మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటారు. మీరు భాగ్యశాలురు కదా. శివబాబా అప్పుగా తీసుకున్న ఈ శరీరాన్ని మీరు ఆలింగనం చేసుకోగలరు. నేను ఎలా ఆలింగనం చేసుకోగలను! నాకు ఆ భాగ్యము లేదు, అందుకే మీరు లక్కీ సితారలని గాయనము చేయబడ్డారు.

పిల్లలు సదా భాగ్యశాలురుగా ఉంటారు. తండ్రి తన ధనాన్ని పిల్లలకు ఇచ్చేస్తారు, అంటే మీరు లక్కీ సితారలు అయినట్లు కదా. మీరు నా కంటే భాగ్యశాలురని శివబాబా కూడా అంటారు, మిమ్మల్ని చదివించి విశ్వానికి యజమానులుగా చేస్తాను, నేను విశ్వానికి యజమానిగా అవ్వను కదా. మీరు బ్రహ్మాండానికి కూడా యజమానులుగా అవుతారు, ఇకపోతే నా వద్ద దివ్యదృష్టి అనే తాళంచెవి ఉంది. నేను జ్ఞానసాగరుడను. మిమ్మల్ని కూడా మాస్టర్ జ్ఞానసాగరులుగా తయారుచేస్తాను. మీరు ఈ పూర్తి చక్రాన్ని తెలుసుకుని చక్రవర్తి మహారాజ-మహారాణులుగా అవుతారు. నేను అలా అవ్వను. వృద్ధాప్యము వచ్చినప్పుడు వీలునామా వ్రాసి పిల్లలకు ఇచ్చి స్వయం వానప్రస్థములోకి వెళ్ళిపోతారు. పూర్వము ఇలా జరిగేది. ఈరోజుల్లో వారికి పిల్లలపై మోహముంటుంది. నేను ఇతనిలో ప్రవేశించి పిల్లలైన మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా, విశ్వాధిపతులుగా చేసి, అర్ధకల్పం కోసం సదా సుఖవంతులుగా తయారుచేసి, నేను వానప్రస్థములోకి వెళ్ళి కూర్చుంటాను అని పారలౌకిక తండ్రి చెప్తున్నారు. ఈ విషయాలన్నీ శాస్త్రాలలో లేవు. సన్యాసులు శాస్త్రాలలోని విషయాలను వినిపిస్తారు. తండ్రి అయితే జ్ఞానసాగరుడు. ఈ వేద-శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తిమార్గములోని సామాగ్రి అని తండ్రి స్వయంగా చెప్తారు. నేను మాత్రమే జ్ఞానసాగరుడను. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శరీర సహితంగా ఈ కళ్ళకు కనిపించేదంతా భస్మమైపోతుంది కావున తమ సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి.

2. తండ్రి నుండి పూర్తి వారసత్వము తీసుకునేందుకు చదువు చదువుకోవాలి. సదా మీ అదృష్టాన్ని స్మృతిలో ఉంచుకొని బ్రహ్మాండానికి మరియు విశ్వానికి అధిపతులుగా అవ్వాలి.

వరదానము:-

మాయ యొక్క రాయల్ రూపంలోని బంధనాల నుండి ముక్తులయ్యే విశ్వజీత్, జగత్ జీత్ భవ

నా పురుషార్థము, నా ఆవిష్కరణ, నా సేవ, నా టచింగ్, నా గుణాలు చాలా బాగున్నాయి, నా నిర్ణయ శక్తి చాలా బాగుంటుంది, ఈ మేరాపన్ (నాది అని అనడమే) మాయ యొక్క రాయల్ రూపము. మాయ ఎటువంటి ఇంద్రజాలం చేస్తుందంటే, అది నీది అన్నదానిని కూడా నాదిగా చేసేస్తుంది, కావున ఇప్పుడు ఇటువంటి అనేక బంధనాల నుండి ముక్తులుగా అయి ఒక్క తండ్రి సంబంధములోకి వస్తే మాయాజీతులుగా అవుతారు. మాయాజీతులే ప్రకృతిజీత్, విశ్వజీత్ మరియు జగత్ జీతులుగా అవుతారు. వారే ఒక సెకండు యొక్క అశరీరి భవ అనే డైరెక్షన్ ను సహజంగా మరియు స్వతహాగా కార్యములో ఉపయోగించగలరు.

స్లోగన్:-

ఇతరుల నెగటివ్ ను పాజిటివ్ గా మార్చే వారే విశ్వపరివర్తకులు.