11-11-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీరిప్పుడు వరల్డ్ సర్వెంట్లు, మీకు ఏ విషయములోనూ దేహాభిమానము రాకూడదు”

ప్రశ్న:-

ఈశ్వరీయ నియమాలకు విరుద్ధమైన ఏ ఒక్క అలవాటు వలన చాలా నష్టము జరుగుతుంది?

జవాబు:-

ఏవైనా సినిమా కథలను వినడం లేదా చదవడం, నవలలు చదవడం...... ఈ అలవాట్లు పూర్తిగా నియమ విరుద్ధమైనవి, వీటి వలన చాలా నష్టము జరుగుతుంది. పిల్లలూ, మీరు ఇటువంటి పుస్తకాలేవీ చదవకూడదు అని బాబా నిషేధిస్తారు. ఒకవేళ ఎవరైనా బి.కె.లు ఇటువంటి పుస్తకాలు చదువుతున్నట్లయితే మీరు పరస్పరములో సావధాన పరచుకోండి.

గీతము:-

ముఖాన్ని చూసుకో ప్రాణీ...... (ముఖడా దేఖ్ లే ప్రాణీ......)

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి చెప్తున్నారు - మేము స్మృతి యాత్ర ద్వారా తమోప్రధానము నుండి సతోప్రధానము వైపుకు ఎంతగా ముందుకెళ్తున్నాము అని స్వయాన్ని చెక్ చేసుకోండి ఎందుకంటే ఎంతెంతగా స్మృతి చేస్తారో, అంతగా పాపాలు నశిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ పదాలు శాస్త్రాలు మొదలైనవాటిలో ఎక్కడైనా వ్రాయబడి ఉన్నాయా? ఎందుకంటే ఎవరెవరైతే ధర్మ స్థాపన చేశారో, వారు ఏదైతే అర్థం చేయించారో, అది శాస్త్రాలుగా తయారు చేయబడింది, తర్వాత వాటిని కూర్చొని చదువుతారు. పుస్తకాలను పూజిస్తారు. దేహ సహితముగా దేహపు సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి అని వ్రాసి ఉన్నప్పుడు, మరి ఇది అర్థం చేసుకోవలసిన విషయము. పిల్లలైన మీరు మొట్టమొదట అశరీరులుగా వచ్చారు, అక్కడైతే పవిత్రంగానే ఉంటారు అని తండ్రి స్మృతినిప్పిస్తారు. ముక్తి-జీవన్ముక్తులలోకి పతిత ఆత్మలెవరూ వెళ్ళలేరు. అది నిరాకారీ, నిర్వికారీ ప్రపంచము. దీనిని సాకారీ, వికారీ ప్రపంచమని అంటారు. ఇదే మళ్ళీ సత్యయుగంలో నిర్వికారీ ప్రపంచంగా అవుతుంది. సత్యయుగంలో ఉండే దేవతలకైతే చాలా మహిమ ఉంటుంది. మంచి రీతిగా ధారణ చేసి ఇతరులకు అర్థము చేయించండి అని ఇప్పుడు పిల్లలకు అర్థం చేయించడం జరిగుతుంది. ఆత్మలైన మీరు ఎక్కడ నుండైతే వచ్చారో, అక్కడ నుండి పవిత్రంగానే వచ్చారు. ఇక్కడకు వచ్చి మళ్ళీ తప్పకుండా అపవిత్రంగా కూడా అవ్వాలి. సత్యయుగాన్ని నిర్వికారీ ప్రపంచమని, కలియుగాన్ని వికారీ ప్రపంచమని అంటారు. మమ్మల్ని పావనంగా, నిర్వికారులుగా చేసేందుకు మీరు వికారీ ప్రపంచములో, వికారీ శరీరములోకి రండి అని మీరిప్పుడు పతిత-పావనుడైన తండ్రిని స్మృతి చేస్తారు. దాదాను ఎందుకు కూర్చోబెట్టారు అని బ్రహ్మా చిత్రం గురించే తికమకపడతారు అని తండ్రి స్వయంగా కూర్చుని అర్థం చేయిస్తారు. వీరు భగీరథుడు అని అర్థం చేయించాలి. శివ భగవానువాచ - నేను ఈ రథాన్ని తీసుకున్నాను ఎందుకంటే నాకు తప్పకుండా ప్రకృతి యొక్క ఆధారము కావాలి. లేకపోతే నేను మిమ్మల్ని పతితుల నుండి పావనంగా ఎలా చేస్తాను. ప్రతిరోజూ చదివించడం కూడా తప్పనిసరి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే స్మృతి చేయండి అని ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి చెప్తారు. ఆత్మలందరూ తమ తండ్రిని స్మృతి చేయాలి. కృష్ణుడిని ఆత్మలందరి తండ్రి అని అనరు. వారికి తమ శరీరముంది. ఈ తండ్రి చాలా సహజంగా అర్థం చేయిస్తున్నారు - మీరు ఎవరికైనా అర్థము చేయించేటప్పుడు ఇలా చెప్పండి - మీరు అశరీరులుగా వచ్చారు, ఇప్పుడు అశరీరులుగా అయి వెళ్ళాలి అని తండ్రి చెప్తున్నారు. అక్కడ నుండి పవిత్ర ఆత్మలే వస్తాయి. రేపు ఎవరైనా వచ్చినా కూడా, వారు పవిత్రంగా ఉంటారు కనుక వారికి తప్పకుండా మహిమ జరుగుతుంది. సన్యాసులు, గృహస్థులు మొదలైనవారు ఎవరైతే ప్రసిద్ధి చెందుతారో, తప్పకుండా వారికిది మొదట జన్మ కదా. వారు ధర్మస్థాపన చేసేందుకు రావాల్సిందే. బాబా గురునానక్ కోసం అర్థం చేయిస్తారు. ఇప్పుడు గురు అనే పదం కూడా ఉపయోగించవలసి ఉంటుంది ఎందుకంటే నానక్ అనే పేరు అయితే చాలామందికి ఉంటుంది కదా. ఎవరినైనా మహిమ చేసేటప్పుడు, అర్థం సహితంగా చేయడం జరుగుతుంది. అలా చేయకపోతే బాగుండదు. వాస్తవానికి ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ గురువు కాదని పిల్లలకు అర్థం చేయించారు. సద్గురు అకాల్...... అని ఎవరి పేరునైతే గాయనం చేస్తారో, వారు అకాలమూర్తులు అనగా వారిని మృత్యువు కబళించదు, వారు ఆత్మ, అందుకే ఈ కథలు మొదలైనవి కూర్చుని తయారుచేశారు. సినిమా కథల పుస్తకాలు, నవలలు మొదలైనవి కూడా చాలా మంది చదువుతారు. బాబా పిల్లలను అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పుడూ నవలలు మొదలైనవేవి చదవకూడదు. కొంతమందికి అలవాటు ఉంటుంది. ఇక్కడైతే మీరు సౌభాగ్యశాలిగా అవుతారు. కొంతమంది బి.కె.లు కూడా నవలలు చదువుతారు, అందుకే తండ్రి పిల్లలందరికీ చెప్తారు, ఎప్పుడైనా ఎవరైనా నవలలు చదవడం చూసినట్లయితే వెంటనే తీసుకుని చింపేయండి, ఇందులో భయపడవద్దు. మాకు ఎవ్వరూ శాపము ఇవ్వకూడదు లేదా మాపై కోపగించుకోకూడదు అని అనుకోకండి, అలాంటి విషయాలేవీ ఉండవు. ఒకరినొకరు సావధానపర్చుకోవడం - మీ పని. సినిమా కథలు వినడం లేదా చదవడం నియమ విరుద్ధము. నియమ విరుద్ధమైన నడవడిక ఏదైనా ఉంటే వెంటనే రిపోర్టు చేయండి. లేకపోతే ఎలా బాగుపడతారు? స్వయాన్ని నష్టపర్చుకుంటూ ఉంటారు. స్వయంలోనే యోగబలము లేకపోతే ఇక్కడ కూర్చొని ఏం నేర్పిస్తారు. బాబా అంగీకరించరు. ఒకవేళ అలాంటి పనులు చేసినట్లయితే, లోపల తప్పకుండా మనసు తింటూ ఉంటుంది, స్వయం నష్టపోతారు, కావున ఎవరిలోనైనా ఏదైనా అవగుణము చూసినట్లయితే వ్రాయాలి. ఎటువంటి నియమ విరుద్ధమైన నడవడిక నడుచుకోవడం లేదు కదా? ఎందుకంటే ఈ సమయంలో బ్రాహ్మణులు సర్వెంట్లు కదా. బాబా కూడా పిల్లలూ, నమస్తే అని అంటారు. అర్థ సహితంగా అర్థం చేయిస్తారు. చదివించే పిల్లలలో దేహాభిమానం ఉండకూడదు. టీచర్ కూడా విద్యార్థులకు సర్వెంట్ గా ఉంటారు కదా. గవర్నర్ మొదలైనవారు కూడా లెటర్ వ్రాస్తారు, నేను విధేయత గల సేవాధారిని అని వ్రాసి క్రింద సంతకము చేస్తారు. దాని ఎదురుగా పేరు రాస్తారు. మిగిలినది క్లర్క్ తన చేతితో వ్రాస్తాడు. ఎప్పుడూ వారి గొప్పతనం గురించి వ్రాయరు. ఈ రోజులలో గురువులు తమకు తామే శ్రీ-శ్రీ అని వ్రాసుకుంటారు. ఇక్కడ కూడా కొంతమంది - శ్రీ ఫలానా అని వ్రాస్తారు. వాస్తవానికి అలా కూడా వ్రాయకూడదు. అలానే, స్త్రీలు శ్రీమతి అని వ్రాయకూడదు. శ్రీ-శ్రీ స్వయంగా వచ్చి మతము ఇచ్చినప్పుడు శ్రీమతం లభిస్తుంది. తప్పకుండా వీరు ఎవరో ఒకరి మతము ద్వారానే దేవతలుగా అయ్యారు కదా అని మీరు అర్థం చేయించవచ్చు. వీరు ఇంత ఉన్నతంగా, విశ్వానికి యజమానులుగా ఎలా అయ్యారు అనేది భారతదేశంలో ఎవ్వరికీ తెలియదు. మీకు ఈ నషా ఎక్కాలి. లక్ష్యము ఉద్దేశ్యం ఉన్న ఈ చిత్రాన్ని సదా హృదయముపై తగిలించి ఉండాలి. మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు, దానితో మేము విశ్వానికి మహారాజుగా అవుతామని - ఎవరికైనా చెప్పండి. తండ్రి ఈ రాజ్యాన్ని స్థాపన చేసేందుకు వచ్చారు. ఈ పాత ప్రపంచ వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. చిన్న-చిన్న కుమార్తెలు చిలుక పలుకుల భాషలో ఎవరికైనా అర్థం చేయించవచ్చు. పెద్ద-పెద్ద కాన్ఫరెంస్ లు మొదలైనవి జరిగినప్పుడు, వాటికి మిమ్మల్ని పిలుస్తారు. మీరు ఈ చిత్రాలను తీసుకువెళ్ళండి మరియు అక్కడ కూర్చొని అర్థము చేయించండి. భారతదేశములో వీరి రాజ్యం మళ్ళీ స్థాపనవుతుంది. మీరు ఎక్కడైనా పెద్ద సభలో అర్థము చేయించవచ్చు. రోజంతా సేవ యొక్క నషాయే ఉండాలి. భారతదేశంలో వీరి రాజ్య స్థాపన జరుగుతుంది. బాబా మనకు రాజయోగము నేర్పిస్తున్నారు. శివభగవానువాచ - ఓ పిల్లలూ, మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి. అప్పుడు మీరు 21 తరాలకు ఈ విధంగా తయారవుతారు. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఇప్పుడైతే అందరివీ ఆసురీ గుణాలు. శ్రేష్ఠంగా తయారుచేసేవారు ఒక్క శ్రీ శ్రీ శివబాబా మాత్రమే. ఆ ఉన్నతాతి ఉన్నతమైన తండ్రియే మనల్ని చదివిస్తున్నారు. శివభగవానువాచ, మన్మనాభవ. భగీరథుడు అయితే ప్రసిద్ధి చెందినవారు. భగీరథుడినే బ్రహ్మా అని అంటారు, వారిని మహావీర్ అని కూడా అంటారు. ఇక్కడ దిల్వాడా మందిరంలో కూర్చుని ఉన్నారు కదా. ఈ మందిరాన్ని నిర్మించిన జైనులు మొదలైనవారెవరికీ తెలియదు. చిన్న-చిన్న కుమార్తెలైన మీరు ఎవరినైనా కలవచ్చు. ఇప్పుడు మీరు చాలా శ్రేష్ఠంగా తయారవుతున్నారు. ఇది భారత దేశం యొక్క లక్ష్యము ఉద్దేశ్యం కదా. ఎంత నషా ఎక్కాలి. ఇక్కడ బాబా మంచి రీతిలో నషా ఎక్కిస్తారు. మేము లక్ష్మీనారాయణులుగా అవుతాము అని అందరూ అంటారు. సీతా-రాములుగా అయ్యేందుకు ఎవ్వరూ చెయ్యి ఎత్తరు. ఇప్పుడు మీరు అహింసకులు, క్షత్రియులు. అహింసక క్షత్రియులైన మీ గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు ఇది అర్థము చేసుకున్నారు. గీతలో కూడా మన్మనాభవ అనే పదము ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇది అర్థము చేసుకోవలసిన విషయము కదా, ఇతరులెవ్వరూ అర్థము చేసుకోలేరు. తండ్రి కూర్చుని పిల్లలకు శిక్షణనిస్తున్నారు - పిల్లలూ, ఆత్మాభిమానులుగా అవ్వండి. ఈ మీ అలవాటు తర్వాత 21 జన్మలు కొనసాగుతుంది. మీకు 21 జన్మల కొరకు శిక్షణ లభిస్తుంది.

స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి అనే ముఖ్యమైన విషయాన్ని బాబా పదే-పదే అర్థం చేయిస్తారు. పరమాత్మ తండ్రి కూర్చుని ఆత్మలైన మనకు అర్థం చేయిస్తారు - మీరు పదే-పదే దేహాభిమానములోకి వచ్చేస్తారు, అప్పుడు ఇల్లు-వాకిలి మొదలైనవి గుర్తుకొస్తాయి. ఇది ఇలా జరుగుతుంది. భక్తి మార్గములో కూడా భక్తి చేస్తూ-చేస్తూ బుద్ధి మరోవైపుకు వెళ్ళిపోతుంది. కేవలం నవ విధ భక్తి చేసేవారే ఏకరసంగా కూర్చోగలరు, దానినే తీవ్ర భక్తి అని అంటారు. పూర్తిగా లవలీనులైపోతారు. అప్పుడప్పుడు మీరు స్మృతిలో కూర్చున్నపుడు పూర్తిగా అశరీరిగా అయిపోతారు. ఎవరైతే మంచి పిల్లలు ఉంటారో, వారే ఇటువంటి స్థితిలో కూర్చుంటారు. దేహ భానం తొలగిపోతుంది. అశరీరిగా అయి ఆ ఆనందంలో కూర్చుండిపోతారు. ఇది అలవాటైపోతుంది. సన్యాసులు, తత్వ జ్ఞానులు లేక బ్రహ్మ జ్ఞానులు. మేము లీనమైపోతాము, ఈ పాత శరీరాన్ని వదిలి బ్రహ్మతత్వములో లీనమైపోతామని వారంటారు. అందరికీ వారి-వారి ధర్మలుంటాయి కదా. ఇతర ధర్మాలను ఎవ్వరూ అంగీకరించరు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారు కూడా తమోప్రధానమైపోయారు. గీతా భగవంతుడు ఎప్పుడు వచ్చారు? గీతా యుగము ఎప్పుడు ఉండేది? ఇవి ఎవ్వరికీ తెలియదు. ఈ సంగమయుగములోనే తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారని, తమోప్రధానము నుండి సతోప్రధానంగా చేస్తారని మీకు తెలుసు. ఇది భారత దేశ విషయమే. తప్పకుండా అనేక ధర్మాలుండేవి. ఏక ధర్మ స్థాపన, అనేక ధర్మాల వినాశనము అని గాయనముంది. సత్యయుగంలో ఒకే ధర్మముండేది. ఇప్పుడు కలియుగంలో అనేక ధర్మాలున్నాయి. మళ్ళీ ఏక ధర్మ స్థాపన జరుగుతుంది. ఒకే ధర్మము ఉండేది, ఇప్పుడు లేదు. మిగిలినవన్నీ ఇంకా ఉన్నాయి. మర్రి వృక్షము ఉదాహరణ పూర్తిగా సరైనది. పునాది ఉండదు, మిగిలిన వృక్షమంతా నిలబడి ఉంటుంది. అలాగే, ఇందులో కూడా దేవీ దేవతా ధర్మము లేదు. కాండమైన ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఇప్పుడు ప్రాయః లోపమైపోయింది. తండ్రి మళ్ళీ స్థాపన చేస్తారు. మిగిలిన ఈ ధర్మాలన్నీ వెనుక వచ్చాయి, చక్రము మళ్ళీ తప్పుకుండా రిపీట్ అవ్వాలి అనగా పాత ప్రపంచము నుండి మళ్ళీ కొత్త ప్రపంచం తయారవ్వాలి. కొత్త ప్రపంచములో వీరి రాజ్యముండేది. మీ వద్ద పెద్ద చిత్రాలు కూడా ఉన్నాయి, చిన్నవి కూడా ఉన్నాయి. పెద్ద వస్తువు అయితే దానిని చూసి మీరేమి పట్టుకున్నారు అని అడుగుతారు. మనుష్యులు నిరుపేద నుండి రాకుమారునిగా అయ్యే చిత్రాన్ని మేము పట్టుకున్నామని చెప్పండి. మనసులో చాలా ఉత్సాహము, చాలా సంతోషము ఉండాలి. ఆత్మలైన మనము భగవంతుని సంతానము. ఆత్మలను భగవంతుడు చదివిస్తున్నారు. బాబా మనల్ని నయనాలపై కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తారు. ఈ ఛీ-ఛీ ప్రపంచంలో మనము ఉండేదే లేదు. మున్ముందు దుఃఖంలో రక్షణ కొరకు ఎంతగానో అలమటిస్తారు, ఇక అడగకండి. కోట్లాది మనుష్యులు మరణిస్తారు. ఇది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఈ కళ్ళతో మనము ఏవైతే చూస్తున్నామో, అవేవీ ఉండవు. ఇక్కడ మనుష్యులు ముళ్ళ వలె ఉన్నారు. సత్యయుగం పుష్పాల తోట. తర్వాత మన కళ్ళు శీతలంగా అయిపోతాయి. తోటలోకి వెళ్ళడంతోనే కళ్ళు చల్లగా, శీతలంగా అయిపోతాయి కదా. మీరిప్పుడు పదమాపదమ భాగ్యశాలిగా అవుతున్నారు. బ్రాహ్మణులుగా అయినవారి అడుగులలో పదమాలు ఉంటాయి. మేము ఈ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము, అందుకే బాబా బ్యాడ్జి తయారుచేయించారు అని పిల్లలైన మీరు అర్థం చేయించాలి. తెల్ల చీర ధరించి, బ్యాడ్జి పెట్టుకుంటే, దీనితో స్వతహాగానే సేవ జరుగుతూ ఉంటుంది. ఆత్మ పరమాత్మ చాలాకాలము వేరుగా ఉన్నారు...... అని మనుష్యులు పాడుతారు కానీ చాలా కాలము యొక్క అర్థము ఎవ్వరికీ తెలియదు. చాలా కాలము, అనగా 5 వేల సంవత్సరాల తర్వాత పిల్లలైన మీరు తండ్రిని కలుసుకుంటారని తండ్రి మీకు చెప్పారు. ఈ సృష్టిలో అందరికన్నా ప్రసిద్ధి చెందినవారు ఈ రాధా-కృష్ణులని కూడా మీకు తెలుసు. వీరు సత్యయుగం యొక్క మొదటి రాకుమారీ, రాకుమారుడు. వీరు ఎక్కడి నుండి వచ్చారు అనేది ఎప్పుడూ ఎవ్వరి ఆలోచనలో కూడా రాదు. సత్యయుగము కన్నా ముందు తప్పనిసరిగా కలియుగముంటుంది. విశ్వానికి యజమానులుగా అయ్యే విధంగా వారు ఏ కర్మలు చేసారు. వీరు విశ్వానికి యజమానులు అని భారతవాసులెవ్వరూ అర్థం చేసుకోరు. వీరి రాజ్యమున్నప్పుడు భారతదేశంలో వేరే ధర్మమేదీ లేదు. తండ్రి మనకు రాజయోగము నేర్పిస్తున్నారని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. ఇది మన లక్ష్యం ఉద్దేశ్యం. మందిరాలలో వారి చిత్రాలు మొదలైనవి ఉన్నాయి. కానీ ఈ సమయంలో ఈ స్థాపన జరుగుతుందని వారికి తెలియదు. మీలో కూడా నంబరువారుగా అర్థము చేసుకుంటారు. కొంతమంది అయితే పూర్తిగా మర్చిపోతారు. నడవడిక పూర్వము ఏ విధంగా ఉండేదో, అలా అయిపోతుంది. ఇక్కడ చాలా బాగా అర్థము చేసుకుంటారు, ఇక్కడ నుండి బయటకు వెళ్ళగానే సమాప్తమైపోతుంది. సేవ పట్ల ఆసక్తి ఉండాలి. అందరికీ ఈ సందేశమునిచ్చే యుక్తిని రచించాలి, శ్రమ చేయాలి. నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయని శివబాబా చెప్తున్నారు అని నషాతో చెప్పాలి. మేము ఒక్క శివబాబాను తప్ప ఇతరులెవ్వరినీ స్మృతి చేయము. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. లక్ష్యము ఉద్దేశ్యము ఉన్న చిత్రాన్ని సదా మీతో పాటు ఉంచుకోవాలి. ఇప్పుడు మేము శ్రీమతంపై విశ్వానికి యజమానులుగా అవుతున్నామనే నషా ఉండాలి. మన నయనాలు శీతలంగా అయ్యేటటువంటి పుష్పాల తోటలోకి మనము వెళ్తాము.

2. సేవ పట్ల చాలా-చాలా అభిరుచి ఉంచుకోవాలి. పెద్ద మనసుతో మరియు ఉత్సాహంతో పెద్ద-పెద్ద చిత్రాలతో సేవ చేయాలి. నిరుపేదల నుండి రాకుమారులుగా తయారుచేయాలి.

వరదానము:-

యజ్ఞ సేవ ద్వారా సర్వ ప్రాప్తుల ప్రసాదాన్ని పాప్తి చేసుకునే ఆల్ రౌండ్ సేవాధారి భవ

సంగమయుగంలో ఆల్ రౌండ్ సేవ చేసేందుకు ఛాన్స్ లభించడం - ఇది కూడా డ్రామాలో ఒక లిఫ్ట్, ఎవరైతే ప్రేమగా యజ్ఞం యొక్క ఆల్ రౌండ్ సేవ చేస్తారో, వారికి సర్వ ప్రాప్తుల ప్రసాదం స్వతహాగా ప్రాప్తిస్తుంది. వారు నిర్విఘ్నంగా ఉంటారు. ఒక్కసారి సేవ చేశారంటే వేయిసార్లు సేవా ఫలం ప్రాప్తిస్తుంది. సదా స్థూలమైన, సూక్ష్మమైన లంగర్లు వేసి ఉండాలి. ఎవరినైనా సంతుష్టపరచడం - ఇది అన్నిటికన్నా పెద్ద సేవ. అతిథి మర్యాదలు చేయడం, ఇది అన్నిటికన్నా గొప్ప భాగ్యము.

స్లోగన్:-

స్వమానంలో స్థితులై ఉన్నట్లయితే అనేక రకాల అభిమానం స్వతహాగా సమాప్తమైపోతుంది.