22-10-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - అన్నిటికన్నా మధురమైన పదము "బాబా”, మీ నోటి నుండి సదా బాబా-బాబా అని వెలువడుతూ ఉండాలి, అందరికీ శివబాబా పరిచయమిస్తూ ఉండండి”

ప్రశ్న:-

సత్యయుగంలో మనుష్యులే కాదు, జంతువులు కూడా రోగగ్రస్థులుగా అవ్వవు, ఎందుకు ?

జవాబు:-

ఎందుకంటే సంగమయుగములో బాబా సర్వాత్మలకు మరియు అనంతమైన సృష్టికి రోగం యొక్క నామ రూపాలే ఉండనటువంటి ఆపరేషన్ చేస్తారు. తండ్రి అవినాశీ సర్జన్. ఇప్పుడు మొత్తం సృష్టి రోగగ్రస్థంగా ఉంది, ఈ సృష్టిలో ఇక దుఃఖానికి నామ రూపాలే ఉండవు. ఇక్కడి దుఃఖాల నుండి రక్షించుకునేందుకు చాలా-చాలా ధైర్యవంతులుగా అవ్వాలి.

గీతము:-

మిమ్మల్ని పొంది మేము ప్రపంచాన్నే పొందాము...... (తుమ్హే పాకే హమ్ నే......)

ఓంశాంతి. డబల్ ఓం శాంతి, రెండు సార్లు కూడా అనవచ్చు. ఆత్మ తన పరిచయాన్నిస్తుంది. ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని. నా నివాస స్థానము శాంతిధామములో ఉంది మరియు మనమంతా తండ్రికి సంతానము. ఆత్మలన్నీ ఓం అని అంటాయి, అక్కడ మనమంతా సోదరులము, మళ్ళీ ఇక్కడ సోదరీ-సోదరులుగా అవుతాము. ఇప్పుడు సోదరీ-సోదరుల సంబంధముతో ప్రారంభమౌతుంది. అందరూ నా సంతానం, బ్రహ్మాకు కూడా మీరు సంతానమే, కావున సోదరీ-సోదరులు అవుతారని తండ్రి అర్థం చేయిస్తారు. మీకు ఇక ఏ సంబంధమూ లేదు. ప్రజాపిత సంతానము బ్రహ్మాకుమార-కుమారీలు. పాత ప్రపంచాన్ని పరివర్తన చేసేందుకు తండ్రి ఈ సమయములోనే వస్తారు. తండ్రి బ్రహ్మా ద్వారానే మళ్ళీ కొత్త సృష్టిని రచిస్తారు. బ్రహ్మాతో కూడా సంబంధముంది కదా. ఇది ఎంత మంచి యుక్తి. అందరూ బ్రహ్మాకుమార-కుమారీలు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి మరియు పరస్పరంలో సోదరీ-సోదరులుగా భావించాలి. అపవిత్ర దృష్టి ఉండకూడదు, ఇక్కడైతే కుమారీ-కుమారులు పెద్దవారైతే దృష్టి అపవిత్రంగా అవుతూ ఉంటుంది, ఇక తర్వాత అపవిత్రమైన కర్మలు చేస్తూ ఉంటారు. అపవిత్ర కర్మలు రావణ రాజ్యములో జరుగుతాయి. సత్యయుగంలో అపవిత్ర కర్మలు జరగవు. అపవిత్రత అన్న పదమే ఉండదు. ఇక్కడైతే అపవిత్ర కర్మలు చాలా జరుగుతాయి. వారి కోసం కోర్టులు మొదలైనవి కూడా ఉంటాయి. అక్కడ కోర్టులు మొదలైనవి ఉండవు. ఆశ్చర్యం కదా. జైళ్ళు ఉండవు, పోలీసులు ఉండరు, దొంగలు మొదలైనవారుండరు. ఇవన్నీ దుఃఖపు విషయాలు, ఇక్కడ జరుగుతూ ఉన్నాయి, కావున ఇది సుఖము మరియు దుఃఖము, గెలుపు మరియు ఓటమి యొక్క ఆట అని పిల్లలకు అర్థం చేయించారు. దీనిని కూడా మీరు మాత్రమే అర్థము చేసుకుంటారు. మాయతో ఓడిపోతే ఓటమి అని గాయనము ఉంది, తండ్రి వచ్చి అర్థకల్పం కోసం మాయపై విజయాన్ని అందిస్తారు. మళ్ళీ అర్థకల్పము ఓడిపోవలసి వస్తుంది. ఇది కొత్త విషయమేమీ కాదు. ఇదైతే సాధారణమైన పైసాకు విలువ చేసే ఆట, మళ్ళీ మీరు నన్ను స్మృతి చేసి అర్థకల్పము కొరకు మీ రాజ్యభాగ్యాన్ని తీసుకుంటారు. రావణరాజ్యంలో నన్ను మర్చిపోతారు. రావణుడు శత్రువు, అతడిని ప్రతి సంవత్సరం భారతవాసులే కాలుస్తారు. ఏ దేశములోనైతే చాలామంది భారతవాసులుంటారో అక్కడ కూడా కాలుస్తూ ఉంటారు. ఇది భారతవాసీయుల ధర్మ ఉత్సవమని అంటారు. దసరా జరుపుకునేటప్పుడు - అది హద్దు యొక్క విషయమని పిల్లలు అర్థము చేయించాలి. ఇప్పుడు విశ్వమంతటిపై రావణ రాజ్యముంది. కేవలం లంకపై మాత్రమే లేదు. విశ్వము అయితే చాలా పెద్దది కదా. ఈ సృష్టి అంతా సాగరముపై నిలబడి ఉంది అని తండ్రి అర్థం చేయించారు. భూమి క్రింద ఒక నంది లేక ఆవు ఉందని, దాని కొమ్ముపై సృష్టి నిలబడి ఉందని, అది అలసిపోతే కొమ్ము మార్చుతుందని మనుష్యులంటారు. ఇప్పుడు ఇటువంటి విషయమేమీ లేదు. భూమి అయితే నీటిపై నిలబడి ఉంది, నలువైపులా నీరే నీరుంది. ఇప్పుడు ప్రపంచమంతా రావణ రాజ్యముంది, రామరాజ్యము లేక ఈశ్వరీయ రాజ్యాన్ని మళ్ళీ స్థాపన చేసేందుకు తండ్రి రావలసి వస్తుంది. కేవలం ఈశ్వర అని అనడంతోనే, ఈశ్వరుడు సర్వశక్తివంతుడు, అన్నీ చేయగలరు అని అంటారు. ఇది అనవసరమైన మహిమ అవుతుంది. అంతటి ప్రేమ ఉండదు. ఇక్కడ ఈశ్వరుడిని తండ్రి అని అంటారు. తండ్రి అనడం ద్వారా వారసత్వము లభించే విషయం ఉంటుంది. సదా బాబా-బాబా అంటూ ఉండాలి అని శివబాబా చెప్తారు. ఈశ్వరుడు లేక ప్రభువు మొదలైన పదాలు మర్చిపోవాలి. నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్పారు. ప్రదర్శిని మొదలైన వాటిలో కూడా అర్థం చేయించేటప్పుడు పదే-పదే శివబాబా పరిచయమివ్వండి. శివబాబా ఒక్కరే ఉన్నతాతి ఉన్నతమైనవారు, వారిని గాడ్ ఫాదర్ అని అంటారు. బాబా అన్న పదము అన్నిటికన్నా మధురమైనది. శివబాబా, శివబాబా అని నోటి నుండి వెలువడుతుంది. నోరు అయితే మనుష్యులదే కదా. గోముఖము అయ్యేందుకు వీలు లేదు. మీరు శివశక్తులు. మీ ముఖ కమలం నుండి జ్ఞానామృతము వెలువడుతుంది. మీ పేరును ప్రసిద్ధము చేసేందుకు గోముఖము అని అన్నారు. గంగ కోసం అలా అనరు. ముఖ కమలము నుండి అమృతము ఇప్పుడే వెలువడుతుంది. జ్ఞానామృతము తాగిన తర్వాత విషాన్ని తాగలేరు. అమృతము తాగడంతో మీరు దేవతలుగా అవుతారు. ఇప్పుడు అసురులను దేవతలుగా చేసేందుకు నేను వచ్చాను. ఇప్పుడు మీరు దైవీ సంప్రదాయస్థులుగా అవుతున్నారు. సంగమయుగము ఎప్పుడు ఉంటుందో, ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మాకుమార-కుమారీలైన మనం పురుషోత్తమ సంగమయుగవాసులమని మీకు తెలుసు. మిగిలినవారంతా కలియుగానికి చెందినవారు. మీరు ఎంత తక్కువమంది ఉన్నారు. మీకు వృక్షం యొక్క జ్ఞానము కూడా ఉంది. వృక్షము మొదట చిన్నదిగా ఉంటుంది, తర్వాత వృద్ధి చెందుతుంది. పిల్లలు జన్మించడాన్ని ఎలా తగ్గించాలని ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. కానీ నరుడు ఒకటి కోరుకుంటే, జరిగేది వేరొకటి. అందరి మృత్యువు జరగాల్సిందే. ఇప్పుడు పంటలు బాగా పండుతాయి, వర్షము కురిస్తే ఎంత నష్టము జరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాలను ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. దేని పైనా నమ్మకము లేదు. ఎక్కడైనా పంటలు పండిన తర్వాత వడగళ్ళు కురిస్తే ఎంత నష్టము జరుగుతుంది. వర్షము కురవకపోయినా నష్టమే, వీటినే ప్రకృతి ఆపదలని అంటారు. ఇవైతే చాలా జరిగేది ఉంది, వీటి నుండి రక్షించుకునేందుకు చాలా ధైర్యవంతులుగా అవ్వాలి. ఎవరికైనా ఆపరేషన్ జరుగుతుంటే, చాలా మంది అది చూడలేరు, చూడడంతోనే స్పృహ కోల్పోతారు. ఇప్పుడు ఈ మొత్తం ఛీ-ఛీ సృష్టికి ఆపరేషన్ జరుగుతుంది. నేను వచ్చి అందరికీ ఆపరేషన్ చేస్తాను అని తండ్రి అంటారు. సృష్టి అంతా రోగగ్రస్థంగా ఉంది. తండ్రికే అవినాశీ సర్జన్ అని పేరు కూడా ఉంది. వారు విశ్వమంతటికీ ఆపరేషన్ చేస్తారు, ఇక తర్వాత విశ్వములో ఉండేవారికి ఎప్పుడూ దుఃఖముండదు. ఎంత గొప్ప సర్జన్. వారు ఆత్మలకు కూడా ఆపరేషన్ చేస్తారు, అనంతమైన సృష్టికి కూడా ఆపరేషన్ చేసేవారు. అక్కడ మనుష్యులే కాదు, జంతువులు కూడా రోగగ్రస్థంగా ఉండవు. తమ పాత్ర మరియు పిల్లల పాత్ర ఏమిటో తండ్రి అర్థం చేయిస్తారు. దీనినే రచన ఆదిమధ్యాంతాల జ్ఞానమని అంటారు, ఇది మీరు మాత్రమే తీసుకుంటున్నారు. పిల్లలకు మొట్టమొదట ఈ సంతోషం ఉండాలి.

ఈ రోజు సద్గురువారము, ఎప్పుడూ సత్యమే మాట్లాడాలి. వ్యాపారములో కూడా సత్యము చెప్పండి, మోసము చేసే మాటలు మాట్లాడకండి అని అంటారు కదా. అయినా లోభములోకి వచ్చి కొంచెం ఎక్కువ ధర చెప్పి వ్యాపారము చేస్తారు. సత్యము అయితే ఎవ్వరూ ఎప్పుడూ చెప్పరు. అసత్యమే అసత్యము చెప్తారు, అందుకే సత్యమును స్మృతి చేస్తారు. సత్యము యొక్క నామము తోడుగా ఉండాలని అంటారు కదా. సత్యమైన బాబా మాత్రమే ఆత్మలైన మనతో పాటు వస్తారని మీకిప్పుడు తెలుసు. ఇప్పుడు సత్యముతో ఆత్మలైన మీకు సాంగత్యము ఏర్పడింది, అందువలన మీరు మాత్రమే తోడుగా వెళ్తారు. శివబాబా వచ్చేసారని, వారిని ట్రూత్ అంటారని పిల్లలైన మీకు తెలుసు. వారు ఆత్మలైన మనల్ని పవిత్రంగా చేసి ఒకేసారి తమతో పాటు తీసుకువెళ్తారు. సత్యయుగంలో రామ నామము తోడుగా ఉండాలి లేక సత్యము యొక్క నామము తోడుగా ఉండాలని అనరు. ఇప్పుడు నేను పిల్లలైన మీ వద్దకు వచ్చాను, నయనాలపై కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తాను అని బాబా అంటారు. ఇవి కళ్ళు కాదు, మూడవ నేత్రము. ఈ సమయంలో తండ్రి వచ్చారు, తోడుగా తీసుకువెళ్తారని మీకు తెలుసు. శంకరుని ఊరేగింపు కాదు, ఇది శివుని పిల్లల ఊరేగింపు. వారు పతులకే పతి కూడా. మీరంతా వధువులు, నేను వరుడను, మీరంతా ప్రేయసులు, నేను ప్రియుడ్ని అని అంటారు. ప్రియుడు ఒక్కరే ఉంటారు కదా. మీరు ప్రియుడినైన నాకు అర్థకల్పము నుండి ప్రేయసులు. అందరూ భక్తులే, ఇప్పుడు నేను వచ్చాను. భక్తులను రక్షించేవారు భగవంతుడు. ఆత్మ శరీరముతో పాటు భక్తి చేస్తుంది. సత్య-త్రేతా యుగాలలో భక్తి ఉండదు. భక్తికి ఫలమును సత్యయుగంలో అనుభవిస్తారు, దానిని ఇప్పుడు పిల్లలకిస్తున్నాను. వారు మీ ప్రియుడు, వారు మిమ్మల్ని తోడుగా తీసుకువెళ్తారు, తర్వాత మీరు మీ పురుషార్థానుసారంగా వెళ్ళి రాజ్య-భాగ్యము తీసుకుంటారు. ఇది ఎక్కడా రాసి లేదు. శంకరుడు పార్వతికి అమరకథను వినిపించారని అంటారు. మీరంతా పార్వతులు. నేను కథను వినిపించే అమరనాథుడను. అమరనాథుడని ఒక్కరినే అంటారు. తండ్రి ఉన్నతాతి ఉన్నతమైనవారు, వారికి తమ దేహము లేదు, అమరనాథుడినైన నేను పిల్లలైన మీకు అమరకథను వినిపిస్తున్నాను అని అంటారు. శంకరుడు-పార్వతి ఇక్కడకు ఎక్కడ నుండి వచ్చారు. వారు సూక్ష్మవతనంలోనే ఉంటారు, అక్కడ సూర్య-చంద్రుల ప్రకాశము కూడా ఉండదు.

సత్యమైన తండ్రి ఇప్పుడు మీకు సత్యమైన కథను వినిపిస్తున్నారు. తండ్రి తప్ప సత్యమైన కథను ఎవ్వరూ వినిపించలేరు. వినాశనమయ్యేందుకు సమయం పడుతుందని కూడా మీకు తెలుసు. ఎంత పెద్ద ప్రపంచం, ఎన్ని భవనాలు మొదలైనవన్నీ పడిపోయి నాశనమైపోతాయి. భూకంపాలలో ఎంత నష్టము జరుగుతుంది. ఎంతోమంది మరణిస్తారు. మీ చిన్న వృక్షము మిగిలి ఉంటుంది. ఢిల్లీ పరిస్తాన్ గా అవుతుంది. ఒక్క పరిస్తాన్ లో మాత్రమే లక్ష్మీనారాయణుల రాజ్యము నడుస్తుంది. ఎన్ని పెద్ద-పెద్ద భవనాలు తయారవుతూ ఉండవచ్చు. అనంతమైన ఆస్తి లభిస్తుంది. మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరమేమీ ఉండదు. వీరి (బ్రహ్మా) జీవితంలోనే ధాన్యము ఎంత చౌకగా ఉండేది అని తండ్రి అంటారు. మరి సత్యయుగంలో ఎంత చౌకగా ఉంటుంది. ఒక్కొక్కరి ఇల్లు మరియు భూమి మొదలైనవి ఢిల్లీ అంత ఉంటాయి. మధురమైన నదులపై మీ రాజ్యం నడుస్తుంది. ఒక్కొక్కరికీ లేనిదంటూ ఏమీ ఉండదు. సదా అన్నం లభిస్తూనే ఉంటుంది. అక్కడి ఫలాలు-పుష్పాలు కూడా ఎంతో పెద్ద-పెద్దవిగా ఉండడం చూస్తారు. మీరు శూబీ రసము తాగి వస్తారు. అక్కడ తోటమాలి ఉన్నారని చెప్తారు. ఇప్పుడు తోటమాలి అయితే తప్పకుండా వైకుంఠములో లేక నదీ తీరములో ఉంటారు. అక్కడ ఎంత తక్కువ మంది ఉంటారు. ఇప్పటి ఇన్ని కోట్లమంది ఎక్కడ, 9 లక్షల మంది ఎక్కడ మరియు అన్నీ మీవిగానే ఉంటాయి. తండ్రి ఇచ్చే రాజ్యాన్ని ఎవ్వరూ మన నుండి లాక్కోలేరు. ఆకాశము, భూమి మొదలైనవాటన్నిటికీ మీరు యజమానిగా ఉంటారు. పాట కూడా పిల్లలు విన్నారు. ఇటువంటి పాటలు 6-8 ఉన్నాయి, వాటిని వినడంతోనే సంతోషము యొక్క పాదరసం ఎక్కుతుంది. ఒకవేళ స్థితిలో ఏదైనా అలజడి ఉన్నట్లయితే, పాటలు వినండి. ఇవి సంతోషము కలిగించే పాటలు. మీకు వాటి అర్థము కూడా తెలుసు. స్వయాన్ని హర్షితముఖులుగా చేసుకునేందుకు తండ్రి చాలా యుక్తులను తెలియజేస్తున్నారు. బాబా, అంత సంతోషం ఉండడం లేదు అని బాబాకు వ్రాస్తారు. మాయ తుఫానులు వస్తాయి. అరే, మాయ తుఫానులు వస్తే - మీరు పాటలు వినండి. సంతోషము కోసం పెద్ద-పెద్ద మందిరాలలో కూడా ద్వారాల వద్ద భజంత్రీలు మ్రోగుతూ ఉంటాయి. బొంబాయిలో మాధవబాగ్ లో లక్ష్మీనారాయణ మందిరం యొక్క ద్వారం వద్ద కూడా భజంత్రీలు మ్రోగుతూ ఉంటాయి. ఈ సినిమా పాటలు ఎందుకు పెడుతున్నారు అని మిమ్మల్ని అడుగుతారు. ఇవి కూడా డ్రామానుసారంగా ఉపయోగపడే వస్తువులేనని వారికేమి తెలుసు. వీటి అర్థము పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇవి విన్నా కూడా సంతోషంలోకి వచ్చేస్తారు. కానీ పిల్లలు మర్చిపోతారు. ఇంటిలో ఎవరికైనా దుఃఖము కలిగితే కూడా పాటలు విని సంతోషిస్తారు. ఇవి చాలా విలువైన వస్తువులు. ఎవరి ఇంట్లోనైనా గొడవ జరిగితే ఇలా చెప్పండి, భగవానువాచ - కామము మహాశత్రువు. దీనిపై విజయము పొందితే మనము విశ్వానికి యజమానులుగా అవుతాము, తర్వాత పుష్పాల వర్షము కురుస్తుంది, జయజయకారాలు జరుగుతాయి. బంగారు పుష్పాల వర్షము కురుస్తుంది. ఇప్పుడు మీరు ముళ్ళ నుండి బంగారు పుష్పాలుగా అవుతున్నారు కదా. మళ్ళీ మీ అవతరణ జరుగుతుంది, పుష్పాలు కురుస్తాయని కాదు కానీ మీరే పుష్పాలుగా అయి వస్తారు. మనుష్యులు బంగారు పుష్పాలు కురుస్తాయని భావిస్తారు. ఒక రాకుమారుడు విదేశాలకు వెళ్ళారు, అక్కడ పార్టీ ఇచ్చారు, అందరి కోసం బంగారు పుష్పాలు తయారు చేయించారు. అందరి పైనా వర్షింపజేసారు. అతని సంతోషం కారణంగా ఇంత ఆతిధ్యాన్నిచ్చారు. సత్యాతి-సత్యమైన బంగారు పుష్పాలు తయారు చేయించారు. బాబాకు వారి రాష్ట్రము మొదలైన వాటి గురించి కూడా బాగా తెలుసు. వాస్తవానికి మీరు పుష్పాలుగా అయి వస్తారు. బంగారు పుష్పాలైన మీరు పై నుండి దిగుతారు. విశ్వ రాజ్యాధికారమనే లాటరీ పిల్లలైన మీకు ఎంతగా లభిస్తుంది. ఏ విధంగా లౌకిక తండ్రి, మీ కోసం ఇది తెచ్చానని పిల్లలతో చెప్పినప్పుడు పిల్లలు ఎంతగా సంతోషిస్తారు. బాబా కూడా మీ కోసం స్వర్గము తెచ్చాను అని అంటారు. మీరు అక్కడ రాజ్యము చేస్తారు కనుక ఎంత సంతోషముండాలి. ఎవరికైనా చిన్న బహుమతినిస్తే బాబా, మీరైతే మాకు విశ్వరాజ్యాధికారాన్నే ఇస్తున్నారు, ఈ బహుమతి ఎంత అని అంటారు. అరే, శివబాబా స్మృతిచిహ్నము తోడుగా ఉన్నట్లయితే శివబాబా స్మృతి ఉంటుంది మరియు మీకు పదమాలు లభిస్తాయి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సత్యమైనవారి సాంగత్యంలో తిరిగి వెళ్ళాలి కనుక సదా సత్యంగా ఉండాలి. ఎప్పుడూ అసత్యము చెప్పకూడదు.

2. మనము బ్రహ్మా తండ్రికి పిల్లలము, పరస్పరము సోదరీ-సోదరులము, కనుక అపవిత్ర కర్మలేవీ చేయకూడదు. సోదర సంబంధం మరియు సోదర-సోదరీల సంబంధం తప్ప ఇంకే సంబంధాల భానము ఉండకూడదు.

వరదానము:-

లోక్ పసంద్ సభకు టికెట్ బుక్ చేసుకునే రాజ్య సింహాసనాధికారీ భవ

ఏ సంకల్పమునైనా లేక ఆలోచననైనా చేసేటప్పుడు, ఈ ఆలోచన లేక సంకల్పము తండ్రికి ఇష్టమైనదేనా అని మొదట చెక్ చేసుకోండి. ఏదైతే తండ్రికి ఇష్టమైనదో, అది స్వతహాగా లోకానికి ఇష్టమైనదిగా అవుతుంది. ఒకవేళ ఏ సంకల్పంలోనైనా స్వార్థముంటే, దానిని మన్ పసంద్ (మనస్సుకు ఇష్టమైనది) అని అంటారు మరియు విశ్వకళ్యాణార్థమైతే దానిని లోక్ పసంద్ లేక ప్రభు పసంద్ అని అంటారు. లోక్ పసంద్ సభకు మెంబరుగా అవ్వడం అనగా లా అండ్ ఆర్డర్ యొక్క రాజ్యాధికారము లేక రాజ్య సింహాసనాన్ని ప్రాప్తి చేసుకోవడం.

స్లోగన్:-

పరమాత్మ తోడును అనుభవం చేసినట్లయితే అన్నీ సహజంగా అనుభవం చేస్తూ సురక్షితంగా ఉంటారు.