13-10-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
“మధురమైన పిల్లలూ -
మీకు ఇంటి యొక్క మార్గము చూపించేందుకు తండ్రి
వచ్చారు, మీరు ఆత్మాభిమానులుగా ఉన్నట్లయితే ఈ మార్గము సహజంగా కనిపిస్తుంది”
ప్రశ్న:-
సంగమయుగములో ఏ జ్ఞానము లభించిన కారణముగా సత్యయుగములో దేవతలు మోహాన్ని
జయించినవారిగా పిలువబడతారు ?
జవాబు:-
సంగమయుగములో తండ్రి మీకు అమరకథను వినిపించి అమరమైన ఆత్మ యొక్క జ్ఞానాన్నిచ్చారు.
ఇది అవినాశీ తయారై-తయారవుతున్న డ్రామా అనే జ్ఞానము లభించింది, ప్రతి ఒక్క ఆత్మ
తమ-తమ పాత్రను అభినయిస్తుంది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది,
ఇందులో ఏడ్వవలసిన విషయం లేదు. ఈ జ్ఞానము కారణముగా సత్యయుగీ దేవతలను మోహజీత్ లని
అంటారు. అక్కడ మృత్యువు యొక్క పేరు ఉండదు. సంతోషంగా పాత శరీరాన్ని వదిలి కొత్తది
తీసుకుంటారు.
గీతము:-
నయనహీనులకు దారి చూపించండ
ఓంశాంతి.
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి చెప్తున్నారు, నేను మార్గాన్నైతే
చూపిస్తాను కానీ మొదట స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుని కూర్చోండి. దేహీ
అభిమానులుగా అయి కూర్చున్నట్లయితే మీకు మార్గము చాలా సహజంగా కనిపిస్తుంది.
భక్తిమార్గంలో అర్థకల్పము దెబ్బలు తిన్నారు. భక్తిమార్గములో లెక్కలేనంత సామాగ్రి
ఉంది. అనంతమైన తండ్రి ఒక్కరు మాత్రమే అని ఇప్పుడు తండ్రి అర్థము చేయించారు. మీకు
మార్గమును తెలియజేస్తున్నానని తండ్రి చెప్తున్నారు. వారు ఎటువంటి మార్గమును
తెలియజేస్తున్నారో కూడా ప్రపంచానికి తెలియదు. ముక్తి-జీవన్ముక్తుల, గతి-సద్గతుల
మార్గము తెలియజేస్తున్నారు. శాంతిధామాన్ని ముక్తి అని అంటారు. శరీరము లేకుండా
ఆత్మ ఏమీ మాట్లాడలేదు. కర్మేంద్రియాల ద్వారానే శబ్దము వస్తుంది, నోటి ద్వారా
శబ్దము వస్తుంది. నోరు లేకపోతే శబ్దము ఎక్కడ నుండి వస్తుంది. కర్మలు చేసేందుకు
ఆత్మకు ఈ కర్మేంద్రియాలు లభించాయి. రావణరాజ్యంలో మీరు వికర్మలు చేస్తారు. ఈ
వికర్మలు ఛీ-ఛీ కర్మలుగా అవుతాయి. సత్యయుగంలో రావణుడే ఉండడు కనుక కర్మలు
అకర్మలుగా ఉంటాయి. అక్కడ పంచ వికారాలుండవు. దానిని స్వర్గమని అంటారు. భారతవాసులు
స్వర్గవాసులుగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ నరకవాసులని అంటారు. విషయ వైతరిణీ నదిలో
మునకలు వేస్తూ ఉంటారు. అందరూ ఒకరికొకరు దుఃఖమునిచ్చుకుంటూ ఉంటారు. బాబా, దుఃఖము
యొక్క పేరే లేని స్థానానికి తీసుకువెళ్ళండి అని ఇప్పుడు అంటారు. భారతదేశము
స్వర్గంగా ఉన్నప్పుడు దుఃఖమనే పేరే ఉండదు. స్వర్గము నుండి నరకములోకి వచ్చారు,
ఇప్పుడు మళ్ళీ స్వర్గములోకి వెళ్ళాలి. ఇది ఆట. తండ్రియే కూర్చుని పిల్లలకు అర్థం
చేయిస్తారు. ఇది సత్యాతి-సత్యమైన సత్సంగము. ఇక్కడ మీరు సత్యమైన తండ్రిని స్మృతి
చేస్తారు, వారే ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు. వారు రచయిత, వారి నుండి వారసత్వము
లభిస్తుంది. తండ్రియే పిల్లలకు వారసత్వమునిస్తారు. హద్దు తండ్రి ఉన్నా కూడా
మళ్ళీ ఓ భగవంతుడా, ఓ పరమపిత పరమాత్మా, దయ చూపించండి అని స్మృతి చేస్తారు. భక్తి
మార్గంలో ఎదురుదెబ్బలు తింటూ-తింటూ విసిగిపోయారు. 'ఓ బాబా, మాకు సుఖ-శాంతుల
వారసత్వమునివ్వండి అని అంటారు. ఇది తండ్రి మాత్రమే ఇవ్వగలరు, అది కూడా 21 జన్మల
కోసం ఇస్తారు. లెక్క వేయాలి. సత్యయుగంలో వీరి రాజ్యమున్నప్పుడు తప్పకుండా
కొద్దిమంది మనుష్యులే ఉంటారు. ఒకే ధర్మము ఉండేది, ఒకే రాజ్యముండేది. దానిని
స్వర్గము, సుఖధామము అని అంటారు. కొత్త ప్రపంచాన్ని సతోప్రధానమని అంటారు,
పాతదానిని తమోప్రధానమని అంటారు. ప్రతి ఒక్క వస్తువు మొదట సతోప్రధానంగా ఉంటుంది,
తర్వాత సతో-రజో-తమోలోకి వస్తుంది. చిన్నపిల్లలను సతోప్రధానమని అంటారు. చిన్న
పిల్లలను మహాత్ముల కన్నా ఉన్నతమైనవారని అంటారు. మహాత్ములు అయితే జన్మ తీసుకున్న
తర్వాత పెద్దవారై వికారాలను అనుభవించి ఇల్లు-వాకిలి వదిలి పారిపోతారు. చిన్న
పిల్లలకైతే వికారాల గురించి తెలియదు. చాలా అమాయకంగా ఉంటారు, అందుకే వారిని
మహాత్ముల కన్నా ఉన్నతమైనవారని అంటారు. దేవతలను సర్వ గుణసంపన్నులని...... మహిమ
పాడుతారు. సాధువులను ఇలా ఎప్పుడూ మహిమ చేయరు. హింస మరియు అహింసల అర్థాన్ని
తండ్రి అర్థం చేయించారు. ఎవరినైనా కొట్టడాన్ని హింస అని అంటారు. అన్నిటికన్నా
పెద్ద హింస కామ ఖడ్గాన్ని నడిపించడం. దేవతలు హింసకులుగా ఉండరు. కామ ఖడ్గాన్ని
నడిపించరు. ఇప్పుడు నేను మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసేందుకు
వచ్చాను అని తండ్రి చెప్తున్నారు. దేవతలు సత్యయుగములో ఉంటారు. ఇక్కడ స్వయాన్ని
దేవతలమని ఎవ్వరూ చెప్పుకోలేరు. మేము నీచులము, పాపులము, వికారులమని భావిస్తారు.
అటువంటప్పుడు స్వయాన్ని దేవతలమని ఎలా చెప్పుకుంటారు, అందుకే హిందూ ధర్మమని
అన్నారు. వాస్తవానికి ఆది సనాతన దేవీదేవతా ధర్మముండేది. హిందువు అనేది
హిందుస్తాన్ నుండి తీసారు. వారు హిందూ ధర్మమని అనేసారు. మేము దేవతా ధర్మానికి
చెందినవారమని మీరు చెప్పినా కూడా హిందువులలో కలిపేస్తారు. మా వద్ద హిందూ ధర్మమనే
కాలమ్ మాత్రమే ఉందని అంటారు. పతితంగా అయిన కారణంగా స్వయాన్ని దేవతలమని
చెప్పుకోలేరు.
మేము పూజ్య దేవతలుగా ఉండేవారము, ఇప్పుడు పూజారులుగా అయ్యాము అని మీకిప్పుడు
తెలుసు. మొదట కేవలం శివుడిని మాత్రమే పూజించేవారు, తర్వాత వ్యభిచారి పూజారులుగా
అయ్యారు. తండ్రి ఒక్కరే, వారి నుండే వారసత్వము లభిస్తుంది. ఆపై అనేక రకాల దేవీలు
మొదలైనవారు ఉన్నారు. వారి నుండి ఎలాంటి వారసత్వము లభించదు. ఈ బ్రహ్మా నుండి కూడా
మీకు వారసత్వము లభించదు. ఒకరు నిరాకారీ తండ్రి, మరొకరు సాకారీ తండ్రి. సాకారీ
తండ్రి ఉన్నా కూడా ఓ భగవంతుడా, ఓ పరమపితా అని అంటూ ఉంటారు. లౌకిక తండ్రిని ఈ
విధంగా పిలువరు. కనుక వారసత్వము తండ్రి నుండి లభిస్తుంది. పతి మరియు పత్ని హాఫ్
పార్ట్నర్ గా ఉంటారు కనుక వారికి సగభాగం లభించాలి. మొదట ఆమెకు సగభాగం తీసి
మిగిలిన సగము పిల్లలకివ్వాలి. కానీ ఈ రోజుల్లో పిలల్లకే ధనమంతా ఇస్తున్నారు.
కొంతమందికి మోహము ఎక్కువగా ఉంటుంది, నేను మరణించిన తర్వాత పిల్లలే హక్కుదారులుగా
ఉంటారని భావిస్తారు. ఈరోజుల్లో పిల్లలు తండ్రి పోయిన తర్వాత తల్లిని అసలు అడగను
కూడా అడగరు. కొంతమంది మాతృ-స్నేహులుగా ఉంటారు. కొంతమంది మళ్ళీ మాతృద్రోహులుగా
ఉంటారు. ఈ రోజుల్లో చాలామంది మాతృ ద్రోహులుగానే ఉన్నారు. ధనమంతటినీ ఖర్చు
చేసేస్తారు. దత్తత తీసుకోబడిన పిల్లలలో కూడా కొంతమంది చాలా విసిగించేవారుంటారు.
ఇప్పుడు పిల్లలు పాట విన్నారు, బాబా, మాకు ప్రశాంతత ఉండేటటువంటి సుఖము యొక్క
మార్గాన్ని తెలియజేయండి అని అంటారు. రావణరాజ్యములోనైతే సుఖముండదు.
భక్తిమార్గములోనైతే శివుడు వేరు, శంకరుడు వేరు అన్నది కూడా అర్థము చేసుకోరు.
కేవలం తల వంచి నమస్కరిస్తూ ఉంటారు, శాస్త్రాలు చదువుతూ ఉంటారు. అచ్ఛా, దీని వలన
ఏం లభిస్తుంది, ఏమీ తెలియదు. సర్వుల శాంతి దాత, సుఖ దాత ఒక్క తండ్రి మాత్రమే.
సత్యయుగములో సుఖము కూడా ఉంటుంది, శాంతి కూడా ఉంటుంది. భారతదేశములో
సుఖశాంతులుండేవి, ఇప్పుడు లేవు, అందుకే భక్తి చేస్తూ ప్రతి ద్వారంలో ఎదురు
దెబ్బలు తింటూ ఉంటారు. శాంతిధామము, సుఖధామములోకి తీసుకువెళ్ళేవారు ఒక్క తండ్రి
మాత్రమేనని మీకిప్పుడు తెలుసు. బాబా, మేము కేవలం మిమ్మల్ని మాత్రమే స్మృతి
చేస్తాము, మీ నుండే వారసత్వము తీసుకుంటాము. దేహ సహితంగా దేహం యొక్క సర్వ
సంబంధాలను మర్చిపోవాలని తండ్రి చెప్తున్నారు. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి.
ఆత్మ ఇక్కడే పవిత్రంగా అవ్వాలి. స్మృతి చేయకపోతే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది.
పదవి కూడా భ్రష్ఠమైపోతుంది, అందుకే స్మృతి యొక్క శ్రమ చేయండి అని తండ్రి
అంటున్నారు. ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. ఇంకే సత్సంగాలు మొదలైనవాటిలో, హే
ఆత్మిక పిల్లలూ అని ఇలా పిలవరు. ఇది ఆత్మిక జ్ఞానము, ఇది పిల్లలకు ఆత్మిక తండ్రి
నుండే లభిస్తుంది. రూహ్ అనగా నిరాకార. శివుడు కూడా నిరాకారుడే కదా. మీ ఆత్మ కూడా
ఒక బిందువు, చాలా చిన్నది. దివ్యదృష్టితో తప్ప దానిని ఎవ్వరూ చూడలేరు.
దివ్యదృష్టిని తండ్రి మాత్రమే ఇస్తారు. భక్తులు కూర్చుని హనుమంతుడు, గణేశుడు
మొదలైనవారిని పూజిస్తారు, ఇప్పుడు వారి సాక్షాత్కారము ఎలా జరుగుతుంది. నేనే
దివ్యదృష్టి దాతను, ఎవరైతే చాలా భక్తి చేస్తారో, వారికి నేనే సాక్షాత్కారము
చేయిస్తాను అని తండ్రి అంటున్నారు. కానీ దీని వలన లాభమేమీ ఉండదు. కేవలం
సంతోషపడతారు. పాపాలైతే మళ్ళీ చేస్తారు, ఏమీ లభించదు. చదువు లేకుండా ఏమీ అవ్వలేరు.
దేవతలు సర్వగుణ సంపన్నులు. మీరు కూడా ఇలా తయారవ్వాలి కదా. మిగిలినవన్నీ
భక్తిమార్గము యొక్క సాక్షాత్కారాలు. నిజంగా కృష్ణునితో ఊయల ఊగండి, స్వర్గములో
వారితో ఉండండి. అది చదువుపై ఆధారపడి ఉంది. ఎంతగా శ్రీమతంపై నడుస్తారో, అంతగా
ఉన్నత పదవిని పొందుతారు. భగవంతుని శ్రీమతము గాయనం చేయబడింది. కృష్ణుని శ్రీమతము
అని అనరు. పరమపిత పరమాత్ముని శ్రీమతము ద్వారా కృష్ణుని ఆత్మ ఈ పదవిని పొందింది.
మీ ఆత్మ కూడా దేవతా ధర్మములో ఉండేది అనగా కృష్ణుని వంశంలో ఉండేది. రాధా-కృష్ణులు
పరస్పరములో ఏమవుతారో భారతవాసీయులకు తెలియదు. ఇద్దరూ వేర్వేరు రాజ్యాలకు
చెందినవారు. స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఈ విషయాలన్నీ తండ్రి
మాత్రమే వచ్చి అర్థం చేయిస్తారు. స్వర్గం యొక్క రాకుమారులు-రాకుమారీలుగా
అయ్యేందుకు మీరిప్పుడు చదువుతున్నారు. రాకుమారుడు-రాకుమారికి స్వయంవరం
జరిగినప్పుడు పేర్లు మారుతాయి. కనుక ఒకవేళ తండ్రి యొక్క శ్రీమతంపై నడిస్తే,
తండ్రి పిల్లలను ఇటువంటి దేవతలుగా తయారుచేస్తారు. మీరు ముఖవంశావళి, వారు
కుఖవంశావళి. ఆ బ్రాహ్మణులు కామచితిపై కూర్చోబెట్టేందుకు కంకణం కడతారు. ఇప్పుడు
సత్యాతి-సత్యమైన బ్రాహ్మణీలైన మీరు కామచితి నుండి దించి జ్ఞానచితిపై
కూర్చోబెట్టేందుకు కంకణం కడతారు. కనుక దానిని వదిలిపెట్టాల్సి ఉంటుంది. ఇక్కడి
పిల్లలైతే కొట్లాడుతూ-గొడవపడుతూ ధనాన్ని కూడా మొత్తం నాశనం చేస్తారు. నేటి
ప్రపంచంలో చాలా అశుద్ధత ఉంది. అన్నిటికన్నా చెడ్డ రోగం బయోస్కోప్. మంచి పిల్లలు
కూడా బయోస్కోప్ కి వెళ్ళడం వలన పాడైపోతారు కావున బి.కె.లు బయోస్కోప్ కు వెళ్ళడం
నిషిద్ధం. అవును, ఎవరైతే దృఢంగా ఉంటారో, వారికి బాబా అక్కడ కూడా మీరు సేవ చేయండి
అని చెప్తారు. ఇది హద్దు యొక్క బయోస్కోప్, ఒక అనంతమైన బయోస్కోప్ కూడా ఉంది అని
వారికి అర్థం చేయించండి. అనంతమైన బయోస్కోప్ నుండే ఈ హద్దు యొక్క అసత్యమైన
బయోస్కోప్ లు వెలువడ్డాయి.
ఆత్మలన్నీ మూలవతనములో ఉంటాయి, తర్వాత మధ్యలో సూక్ష్మవతనము ఉంటుంది, ఇది సాకార
వతనము అని ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు అర్థము చేయించారు. ఆట అంతా ఇక్కడే
నడుస్తుంది. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. బ్రాహ్మణ పిల్లలైన మీరే స్వదర్శన
చక్రధారులుగా అవ్వాలి. దేవతలు కాదు. కానీ బ్రాహ్మణులకు ఈ అలంకారాన్నివ్వరు
ఎందుకంటే వారు పురుషార్థీలు. ఈ రోజు బాగా నడుచుకుంటారు, రేపు పడిపోతారు, అందుకే
దేవతలకే చూపిస్తారు. కృష్ణుడు స్వదర్శన చక్రముతో అకాసురుడు-బకాసురుడు
మొదలైనవారిని వధించారని చూపిస్తారు. వారిని అహింసా పరమో ధర్మము అన్నట్లు ఉంటారని
అంటారు, మరి హింస ఎలా చేస్తారు! ఇదంతా భక్తిమార్గం యొక్క సామాగ్రి. ఎక్కడకు
వెళ్ళినా, శివలింగాలే ఉంటాయి. కేవలం పేర్లు మాత్రం వేర్వేరుగా ఎన్ని పెట్టారు.
మట్టితో ఎన్ని దేవతలను తయారుచేస్తారు. అలంకరిస్తారు, వేలాది రూపాయలు ఖర్చు
చేస్తారు. ఉత్పత్తి చేసి మళ్ళీ పూజిస్తారు, పాలన చేసి మళ్ళీ వెళ్ళి ముంచేస్తారు.
బొమ్మల పూజలకు ఎంత ఖర్చు చేస్తారు. ఏమీ లభించదు. ఇదంతా ధనము వృథా చేసే భక్తి,
మెట్లు దిగుతూనే వచ్చారు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి వచ్చినప్పుడు
అందరిదీ ఎక్కే కళ జరుగుతుంది. అందరినీ శాంతిధామము-సుఖధామములోకి తీసుకువెళ్తారు.
ధనము వృథా చేసే మాట లేదు. మళ్ళీ భక్తిమార్గములో మీరు ధనాన్ని వృథా చేస్తూ-చేస్తూ
నిరుపేదగా అయిపోయారు. ధనవంతులుగా, నిరుపేదలుగా అయ్యే కథను తండ్రి కూర్చుని
అర్థము చేయిస్తారు. మీరు ఈ లక్ష్మీనారాయణుల రాజ్యానికి చెందినవారు కదా. ఇప్పుడు
తండ్రి మీకు నరుని నుండి నారాయణుడిగా అయ్యే శిక్షణనిస్తారు. వారు మూడవ నేత్రం
యొక్క కథను, అమర కథను వినిపిస్తారు. అదంతా అసత్యము. ఇదే మూడవ నేత్రం యొక్క కథ,
దీని ద్వారా ఆత్మ జ్ఞానము యొక్క మూడవ నేత్రము తెరుచుకుంటుంది. చక్రమంతా
బుద్ధిలోకి వచ్చేస్తుంది. మీకు జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభిస్తుంది, అమరకథను
కూడా వింటున్నారు. అమరుడైన బాబా మీకు కథను వినిపిస్తున్నారు - అమరపురికి
యజమానులుగా చేస్తారు. అక్కడ ఎప్పుడూ మీరు మృత్యువును పొందరు. ఇక్కడ మృత్యువంటే
మనుష్యులకు ఎంత భయం ఉంటుంది. అక్కడ భయపడే విషయం కానీ, ఏడ్చే విషయం కానీ ఉండదు.
సంతోషంగా పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకుంటారు. ఇక్కడ మనుష్యులు ఎంతగా
ఏడుస్తారు. ఇది ఉన్నదే ఏడ్చేటటువంటి ప్రపంచం. ఇది తయారై-తయారవుతున్న డ్రామా అని
తండ్రి చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ-తమ పాత్రను అభినయిస్తూ ఉంటారు. ఈ దేవతలు
మోహజీతులు కదా. ఇక్కడైతే ప్రపంచములో అనేకమంది గురువుల ద్వారా అనేక మతాలు
లభిస్తాయి. ప్రతి ఒక్కరిది ఎవరి మతము వారిది. సంతోషీ దేవీ కూడా ఒకరు ఉన్నారు,
వారికి పూజ జరుగుతుంది. ఇప్పుడు సంతోషీ దేవీలైతే సత్యయుగంలోనే ఉంటారు, ఇక్కడ ఎలా
ఉంటారు. సత్యయుగంలో దేవతలు సదా సంతుష్టులుగా ఉంటారు. ఇక్కడైతే ఏదో ఒక ఆశ ఉంటుంది.
అక్కడ ఎటువంటి ఆశా ఉండదు. తండ్రి అందరినీ సంతుష్టపరుస్తారు. మీరు పదమాపతులుగా
అవుతారు. ప్రాప్తి గురించి చింత కలిగే విధంగా అప్రాప్తి వస్తువేదీ ఉండదు. అక్కడ
చింత అనేది ఉండనే ఉండదు. నేనే సర్వుల సద్గతిదాతను అని తండ్రి చెప్తున్నారు.
పిల్లలైన మీకు 21 జన్మల కోసం సంతోషమే సంతోషమునిస్తాను. ఇటువంటి తండ్రిని స్మృతి
కూడా చేయాలి కదా. స్మృతి ద్వారానే మీ పాపాలు భస్మమవుతాయి మరియు మీరు
సతోప్రధానంగా అవుతారు. ఇవి అర్థము చేసుకునే విషయాలు. ఇతరులకు ఎంత ఎక్కువగా అర్థం
చేయిస్తారో, అంతగా ప్రజలు తయారవుతూ ఉంటారు మరియు ఉన్నత పదవిని పొందుతారు. ఇది
సాధువులు మొదలైనవారి కథేమి కాదు. భగవంతుడు కూర్చొని వీరి నోటి ద్వారా అర్థం
చేయిస్తారు. ఇప్పుడు మీరు సంతుష్ట దేవీ దేవతలుగా తయారవుతున్నారు. ఇప్పుడు మీరు
సదా పవిత్రంగా ఉండే వ్రతమును కూడా పెట్టుకోవాలి ఎందుకంటే పావన ప్రపంచములోకి
వెళ్ళాలి కనుక పతితంగా అవ్వకూడదు. తండ్రి ఈ వ్రతాన్ని నేర్పించారు. మనుష్యులు
అనేక రకాల వ్రతాలు తయారుచేశారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఒక్క తండ్రి మతముపైనే నడుస్తూ సదా సంతుష్టంగా ఉంటూ సంతోషీ దేవీలుగా అవ్వాలి.
ఇక్కడ ఎటువంటి ఆశను పెట్టుకోకూడదు. తండ్రి నుండి సర్వ ప్రాప్తులను పొంది
పదమపతులుగా అవ్వాలి.
2. అన్నిటికన్నా అశుద్ధంగా తయారుచేసేది బయోస్కోప్ (సినిమా). మీరు బయోస్కోప్
చూడడం నిషిద్ధము. మీరు ధైర్యవంతులైతే హద్దు మరియు అనంతమైన బయోస్కోప్ యొక్క
రహస్యాన్ని అర్థం చేసుకొని ఇతరులకు అర్థము చేయించండి. సేవ చేయండి.
వరదానము:-
ఫుల్ స్టాప్ యొక్క స్టేజ్ ద్వారా ప్రకృతి అలజడిని స్టాప్ చేసే ప్రకృతిపతి భవ
వర్తమాన సమయం అలజడి పెరిగే సమయము. ఫైనల్ పేపర్లో ఒకవైపు ప్రకృతి మరియు రెండవవైపు
పంచ వికారాల భయంకర రూపం ఉంటుంది. తమోగుణీ ఆత్మల దాడి మరియు పాత సంస్కారాలు......
అన్నీ చివరి సమయంలో తమ ఛాన్సు తీసుకుంటాయి. ఇటువంటి సమయంలో సర్దుకునే శక్తి
ద్వారా ఇప్పుడిప్పుడే సాకారీ, ఇప్పుడిప్పుడే ఆకారీ మరియు ఇప్పుడిప్పుడే నిరాకారీ
స్థితిలో స్థితులయ్యే అభ్యాసం కావాలి. చూస్తూ కూడా చూడకండి, వింటూ కూడా వినకండి.
ఎప్పుడైతే ఇటువంటి ఫుల్ స్టాప్ యొక్క స్టేజ్ ఉంటుందో అప్పుడు ప్రకృతిపతిగా అయి
ప్రకృతి అలజడిని స్టాప్ చేయగలరు.
స్లోగన్:-
నిర్విఘ్న రాజ్యాధికారులుగా అయ్యేందుకు నిర్విఘ్న
సేవాధారులుగా అవ్వండి.
|
|