ఓంశాంతి. మిలిటరీ వారిని మొట్టమొదట అటెన్షన్ ప్లీజ్ అని సావధానపరచడం జరుగుతుంది. తండ్రి కూడా పిల్లలను స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకుని తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నారా అని అడుగుతారు. తండ్రి ఈ జ్ఞానాన్ని ఈ సమయంలోనే ఇవ్వగలరని పిల్లలకు అర్థం చేయించారు. తండ్రియే చదివిస్తారు. భగవానువాచ కదా - భగవంతుడు ఎవరు అన్నది ముఖ్యమైన విషయం. ఎవరు చదివిస్తారు? ఈ విషయం మొదట అర్థం చేసుకుని, నిశ్చయం ఏర్పర్చుకోవలసి ఉంటుంది. ఇంకా, అతీంద్రియ సుఖంలో కూడా ఉండాలి. మాకు అనంతమైన తండ్రి లభించారని ఆత్మకు ఎంతో సంతోషం కలగాలి. వారసత్వం ఇచ్చేందుకు తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి కలుస్తారు. దేని వారసత్వం? 5 వేల సంవత్సరాల క్రితము వలె విశ్వ రాజ్యాధికారపు వారసత్వాన్నిస్తారు. తండ్రి వచ్చి ఉన్నారని పక్కా నిశ్చయముంది. మళ్ళీ సహజ రాజయోగం నేర్పిస్తారు, నేర్పించాల్సి ఉంటుంది. పిల్లలకు ఏమీ నేర్పించడం జరగదు. దానంతటదే నోటి నుండి అమ్మ-నాన్న అని వస్తుంది, ఎందుకంటే పదాలనైతే వింటారు కదా. వీరు ఆత్మిక తండ్రి. ఆత్మకు ఆంతరికమైన గుప్త నషా ఉంటుంది. ఆత్మయే చదువుకోవాలి. పరమపిత పరమాత్మ అయితే నాలెడ్జ్ ఫుల్. వారేమీ చదువుకోలేదు. వారిలో నాలెడ్జ్ ఉండనే ఉంది, ఏ నాలెడ్జ్? ఇది కూడా మీ ఆత్మ అర్థం చేసుకుంటుంది. తండ్రిలో మొత్తం సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానం ఉంది. ఒక్క ధర్మ స్థాపన మరియు అనేక ధర్మాల వినాశనం ఎలా జరుగుతుందో, ఇవన్నీ వారికి తెలుసు - అందుకే వారిని అన్నీ తెలిసినవారు అని అంటారు. అన్నీ తెలిసినవారు అంటే అర్థమేమిటి? ఇది ఎవ్వరికీ ఏ మాత్రం తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు, మనుష్యులై ఉండి ఒకవేళ సృష్టికర్త మరియు రచనల ఆదిమధ్యాంతాల వ్యవధి, పునరావృతం గురించి తెలియకపోతే ఏమనాలి...... ఈ స్లోగన్ కూడా తప్పకుండా వేయించండి, పునరావృతము అనే ఈ పదము కూడా చాలా అవసరము. కరెక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది కదా. గీతా భగవంతుడు ఎవరు...... ఈ చిత్రం చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంది. మొత్తం ప్రపంచములో ఇదే అన్నిటికన్నా నంబర్ వన్ తప్పు. పరమపిత పరమాత్మను తెలుసుకోని కారణంగా అందరూ భగవంతుని రూపాలే అని అంటారు. ఎలాగైతే చిన్న పిల్లలను, మీరు ఎవరి పిల్లలు అని అడగడం జరుగుతుంది. ఫలానా వారి పిల్లలము అని చెప్తారు. ఫలానావారు ఎవరి అబ్బాయి అని అడిగితే ఫలానా వారి అబ్బాయి అని చెప్తారు. ఇంకా అతను మా అబ్బాయి అని అంటారు. అలాగే ఇక్కడ కూడా భగవంతుడిని తెలుసుకోనందుకు మేమే భగవంతుడు అని అంటారు. ఎంతో పూజ కూడా చేస్తారు కానీ అర్థం చేసుకోరు. బ్రహ్మా రాత్రి అంటే తప్పకుండా బ్రాహ్మణ-బ్రాహ్మణీలకు కూడా రాత్రి అవుతుంది అని గాయనం జరుగుతుంది. ఇవన్నీ ధారణ చేయాల్సిన విషయాలు. ఎవరైతే యోగంలో ఉంటారో, వారికే ఈ ధారణ జరుగుతుంది. స్మృతినే బలం అని అంటారు. జ్ఞానం సంపాదనకు ఆధారం. స్మృతి ద్వారా శక్తి లభిస్తుంది, దానితో వికర్మలు వినాశనం అవుతాయి. మీరు బుద్ధియోగాన్ని తండ్రితో జోడించాలి. ఈ జ్ఞానం తండ్రి ఇప్పుడు మాత్రమే ఇస్తారు, మళ్ళీ ఎప్పుడూ లభించదు. తండ్రి తప్ప ఎవ్వరూ ఇవ్వలేరు. మిగిలినవన్నీ భక్తిమార్గపు శాస్త్రాలు, కర్మ-కాండల క్రియలు. వాటిని జ్ఞానమని అనరు. స్పిరిచ్యుయల్ నాలెడ్జ్ (ఆధ్యాత్మిక జ్ఞానం) ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది మరియు వారు బ్రాహ్మణులకు మాత్రమే ఇస్తారు. ఇంకెవరి వద్ద ఆధ్యాత్మిక జ్ఞానం ఉండదు. ప్రపంచంలో ఎన్ని ధర్మాలు, మఠాలు, సంప్రదాయాలున్నాయి, ఎన్ని అభిప్రాయాలున్నాయి. పిల్లలకు అర్థం చేయించడానికి ఎంత శ్రమ కలుగుతుంది. ఎన్ని తుఫానులు వస్తాయి. నా నావను తీరానికి చేర్చు - అని కూడా పాడుతారు. అందరి నావలు తీరానికి చేరలేవు. కొన్ని మునిగిపోతాయి కూడా, కొన్ని నిలిచి ఉంటాయి. చాలా వాటి గురించి 2-3 సంవత్సరాలు వరకు కూడా తెలియదు. కొన్నైతే ముక్కలు ముక్కలుగా అయిపోతాయి. కొన్ని అక్కడే నిలబడిపోతాయి, ఇందులో చాలా శ్రమ ఉంది. ఆర్టిఫీషియల్ యోగాలు కూడా ఎన్ని వెలువడ్డాయి. ఎన్ని యోగ ఆశ్రమాలున్నాయి. ఆత్మిక యోగ ఆశ్రమం ఏదీ ఉండదు. తండ్రే వచ్చి ఆత్మలకు ఆత్మిక యోగం నేర్పిస్తారు. ఇది చాలా సహజ యోగమని తండ్రి చెప్తారు. దీనంత సహజమైనది ఇంకేదీ లేదు. ఆత్మయే శరీరములోకి వచ్చి పాత్రను అభినయిస్తుంది. ఎక్కువలో ఎక్కువ 84 జన్మలుంటాయి, మిగిలిన వారికి తగ్గిపోతూ ఉంటాయి. ఈ విషయాలు కూడా పిల్లలైన మీలో కొందరి బుద్ధిలోనే ఉన్నాయి. బుద్ధిలో చాలా కష్టంగా ధారణ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదట తండ్రి పరిచయం ఇవ్వండి అన్నది తండ్రి అర్థం చేయించే మొదటి విషయం. తండ్రి పరిచయం ఎలా ఇవ్వాలి, దీనికోసం యుక్తులు రచించబడ్డాయి. వారికి నిశ్చయం ఏర్పడినప్పుడు తండ్రి సత్యము అని అర్థము చేసుకుంటారు. తండ్రి తప్పకుండా సత్యమైన విషయాలే చెప్తూ ఉండవచ్చు. ఇందులో సంశయం రాకూడదు. స్మృతిలోనే శ్రమ ఉంది, ఇందులో మాయ అప్పోజిషన్ (వ్యతిరేకిస్తుంది) చేస్తుంది. పదే-పదే స్మృతిని మరపింపజేస్తుంది, అందుకే చార్టు వ్రాయండి అని తండ్రి అంటారు. అప్పుడు ఎవరు ఎంత స్మృతి చేస్తారు అన్నది తండ్రి కూడా చూస్తారు. పావు వంతు మంది కూడా చార్టు పెట్టరు. కొంతమంది మేమైతే రోజంతా స్మృతిలోనే ఉంటామని అంటారు. ఇదైతే చాలా కష్టమని తండ్రి అంటారు. బంధనాలలో ఉంటూ దెబ్బలు తినేవారు రాత్రింబవళ్ళు పూర్తిగా స్మృతిలో ఉండవచ్చు, శివబాబా, మేము ఈ సంబంధీకుల నుండి ఎప్పుడు విడుదలవుతాము? బాబా, మేము బంధనం నుండి ఎలా విడుదలవ్వాలి అని ఆత్మ పిలుస్తుంది. ఒకవేళ ఎవరైనా బాగా స్మృతిలో ఉంటే తండ్రికి చార్టు పంపించండి. రోజూ రాత్రి మీ లెక్కాపత్రం పెట్టండి, డైరీ రాయండి అని డైరెక్షన్ లభిస్తుంది. డైరీ పెట్టినట్లయితే, మాకు నష్టము కలగకూడదు అన్న భయం ఉంటుంది. బాబా చూస్తే ఏమంటారు - ఇంత అతి ప్రియమైన తండ్రిని ఇంత సమయమే స్మృతి చేస్తారా! లౌకిక తండ్రిని, స్త్రీని మీరు గుర్తు చేస్తారు, నన్ను ఇంత కొంచెం కూడా స్మృతి చెయ్యరా. చార్టు రాస్తే మీకే సిగ్గుగా అనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో నేను పదవిని పొందలేను, అందుకే బాబా చార్టుపై జోరునిస్తున్నారు. తండ్రిని మరియు 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయాలి, అప్పుడు చక్రవర్తీ రాజులుగా అవుతారు. తమ సమానంగా చేసినప్పుడే ప్రజలపై రాజ్యం చేస్తారు. ఇది నరుని నుండి నారాయణునిగా అయ్యే రాజయోగము. ఇదే లక్ష్యము-ఉద్దేశ్యము. ఎలాగైతే ఆత్మను చూడడం జరగదు, అర్థం చేసుకోవడం జరుగుతుంది. వీరిలో ఆత్మ ఉంది, ఇది కూడా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఈ లక్ష్మీనారాయణులకు తప్పకుండా రాజధాని ఉంటుంది. వీరు అందరికన్నా ఎక్కువ శ్రమ చేశారు, అప్పుడే స్కాలర్షిప్ పొందారు. వీరికి తప్పకుండా అనేకమంది ప్రజలుంటారు. ఉన్నతాతి ఉన్నతమైన పదవిని పొందారు, తప్పకుండా ఎంతో యోగం చేశారు, అప్పుడే పాస్ విత్ ఆనర్ గా అయ్యారు. మాకు యోగం ఎందుకు కుదరడం లేదు? దీనికి కారణం కూడా తెలుసుకోవాలి. వ్యాపారాలు మొదలైన జంజాటాలలోకి బుద్ధి చాలా వెళ్ళిపోతూ ఉంటుంది. దాని నుండి సమయం తీసి ఇటు వైపు ఎక్కువగా ధ్యానం పెట్టాలి. కొంచెం సమయం తీసి తోటలో ఏకాంతంగా కూర్చోవాలి. స్త్రీలు అయితే వెళ్ళలేరు. వారైతే ఇంటిని సంభాళించాలి. పురుషులకు సహజము. కల్పక్రితపు భాగ్యశాలులకే ఇది టచ్ అవుతుంది. చదువు చాలా మంచిది. అయితే ప్రతి ఒక్కరి బుద్ధి ఎవరిది వారిది. ఎలాగైనా సరే తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. తండ్రి డైరెక్షన్లు అన్నీ ఇస్తారు. చెయ్యడం అయితే పిల్లలే చెయ్యాలి. తండ్రి జనరల్ డైరెక్షన్లు ఇస్తారు. ఒక్కొక్కరు పర్సనల్ గా వచ్చి అడిగినా కూడా వారికి సలహా ఇవ్వగలరు. తీర్థయాత్రలలో పెద్ద-పెద్ద పర్వతాలపైకి వెళ్ళినప్పుడు పండాలు సావధానపరుస్తూ ఉంటారు. చాలా కష్టంగా వెళ్తారు. పిల్లలైన మీకైతే తండ్రి చాలా సహజమైన యుక్తిని తెలియజేస్తారు. తండ్రిని స్మృతి చేయాలి. శరీర భానాన్ని సమాప్తం చేయాలి. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు. తండ్రి వచ్చి నాలెడ్జ్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఆత్మ వంటి వేగవంతమైన రాకెట్ ఇంకేదీ ఉండదు. వారు చంద్రుడు మొదలైన వాటి పైకి వెళ్ళేందుకు ఎంత టైమ్ వేస్ట్ చేస్తారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఈ సైన్స్ కళ కూడా వినాశనంలో సహాయం చేస్తుంది. అది సైన్స్, మీది సైలెన్స్. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యాలి - ఇది డెడ్ సైలెన్స్. నేను ఆత్మను శరీరం నుండి వేరుగా ఉన్నాను. ఈ శరీరము పాత చెప్పు. సర్పము, తాబేలు వంటి ఉదాహరణలు కూడా మీ కోసమే, మీరే పురుగుల వంటి మనుష్యులను భూ-భూ చేసి మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు. విషయసాగరం నుండి క్షీరసాగరంలోకి తీసుకువెళ్ళడం మీ పని. సన్యాసులు ఈ యజ్ఞ తపాదులు మొదలైనవేవీ చేయనవసరం లేదు. భక్తి మరియు జ్ఞానం గృహస్థుల కోసమే ఉన్నాయి. సన్యాసులైతే సత్యయుగంలోకి వచ్చేదే లేదు. ఈ విషయాలు వారికేమి తెలుసు. ఈ నివృత్తి మార్గం వారిది కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారో - వారే డ్రామా అనుసారంగా వస్తూ ఉంటారు. ఇందులో కూడా నంబరువారుగా వెలువడుతూ ఉంటారు. మాయ చాలా శక్తివంతమైనది. కళ్ళు చాలా అశుద్ధమైనవి. జ్ఞానం యొక్క మూడవ నేత్రం లభించడంతో కళ్ళు సివిల్ గా(పవిత్రంగా) అవుతాయి, ఇక మళ్ళీ అర్థకల్పం ఎప్పుడూ క్రిమినల్ గా అవ్వవు. ఇవి చాలా మోసగిస్తాయి. మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, కర్మేంద్రియాలు అంతగా శీతలమవుతాయి. మళ్ళీ 21 జన్మలు కర్మేంద్రియాలు చంచలతలోకి రావు. అక్కడ కర్మేంద్రియాలలో చంచలత ఉండదు. కర్మేంద్రియాలన్నీ శాంతిగా, సతోగుణీగా ఉంటాయి. దేహాభిమానం తర్వాతే అసురత్వమంతా వస్తుంది. తండ్రి మిమ్మల్ని దేహీ-అభిమానులుగా తయారుచేస్తారు. అర్థకల్పం కోసం మీకు వారసత్వం లభిస్తుంది. ఎవరెంతగా శ్రమ చేస్తారో, అంతగా ఉన్నత పదవిని పొందుతారు. దేహీ-అభిమానులుగా అయ్యే శ్రమ చెయ్యాలి, తర్వాత కర్మేంద్రియాలు మోసం చెయ్యవు. చివరి వరకు యుద్ధం నడుస్తూనే ఉంటుంది. కర్మాతీత అవస్థ పొందినప్పుడు ఆ యుద్ధము కూడా మొదలవుతుంది. రోజు రోజుకూ శబ్దం వెలువడుతూ ఉంటుంది, మృత్యువు గురించి భయపడతారు.
ఈ జ్ఞానము అందరి కోసం అని తండ్రి చెప్తారు. కేవలం తండ్రి పరిచయమివ్వాలి. ఆత్మలైన మనమంతా సోదరులము. అందరూ ఒక్క తండ్రిని స్మృతి చేస్తారు. గాడ్ ఫాదర్ అని అంటారు. ప్రకృతిని గౌరవించేవారు కొందరుంటారు. కానీ గాడ్ అయితే ఉన్నారు కదా. ముక్తి-జీవన్ముక్తుల కొరకు వారిని స్మృతి చేస్తారు. మోక్షం అయితే ఉండదు. ప్రపంచ చరిత్ర-భూగోళం రిపీట్ అవ్వాలి. సత్యయుగం ఉన్నప్పుడు ఒక్క భారతదేశమే ఉండేదని బుద్ధి కూడా చెప్తుంది. మనుష్యులకైతే ఏమీ తెలియదు. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది కదా. లక్షల సంవత్సరాల విషయం ఉండడం జరగదు. లక్షల సంవత్సరాలైతే జన సంఖ్య ఎంతగా పెరిగిపోతుంది. ఇప్పుడు కలియుగం పూర్తయ్యి సత్యయుగ స్థాపన జరుగుతోంది అని తండ్రి చెప్తారు. వారు కలియుగం ఇంకా బాల్యంలోనే ఉంది, ఇన్ని వేల సంవత్సరాల ఆయుష్షు ఉందని భావిస్తారు. ఈ కల్పం 5 వేల సంవత్సరాలదని పిల్లలైన మీకు తెలుసు. భారతదేశంలోనే ఈ స్థాపన జరుగుతుంది. భారతదేశమే ఇప్పుడు స్వర్గంగా అవుతుంది. ఇప్పుడు మనము శ్రీమతంపై ఈ రాజ్య స్థాపన చేస్తున్నాము. ఇప్పుడు నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తారు. మొట్టమొదట ఈ పదమే చెప్పండి. తండ్రి పట్ల నిశ్చయం ఏర్పడనంతవరకు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇంకా ఏదైనా విషయానికి సమాధానం లభించకపోతే, వీరికేమీ తెలియదు కానీ భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారని చెప్తారు అని భావిస్తారు, కనుక మొట్టమొదట ఈ ఒక్క విషయాన్నే పట్టుకోండి. తప్పకుండా ఆత్మలందరి తండ్రి ఒక్కరే మరియు వారే రచయిత అని మొదట తండ్రి పట్ల నిశ్చయం ఏర్పరచాలి. కనుక వారు తప్పకుండా సంగమయుగంలోనే వస్తారు. నేను యుగ-యుగంలో రాను, కల్పం యొక్క సంగమయుగంలోనే వస్తాను అని తండ్రి చెప్తారు. నేను ఉన్నదే కొత్త సృష్టి రచయితను. కనుక మధ్యలో ఎలా వస్తాను. నేను పాత మరియు కొత్త యుగానికి మధ్యలోనే వస్తాను. దీనిని పురుషోత్తమ సంగమయుగమని అంటారు. మీరు పురుషోత్తములుగా కూడా ఇక్కడే అవుతారు. లక్ష్మీనారాయణులు అందరికన్నా పురుషోత్తములు. లక్ష్యం-ఉద్దేశ్యం ఎంత సహజమైనది. ఇది స్థాపన అవుతుందని అందరికీ చెప్పండి. పురుషోత్తమ అనే పదము తప్పకుండా రాయండి అని తండ్రి చెప్పారు ఎందుకంటే ఇక్కడ మీరు కనిష్టుల నుండి పురుషోత్తములుగా అవుతారు. ఇటువంటి ముఖ్యమైన విషయాలు మర్చిపోకూడదు. మరియు శకం యొక్క తారీఖులు కూడా తప్పకుండా రాయాలి. ఇక్కడ మీ రాజ్యం మొదటి నుండే ప్రారంభమౌతుంది, ఇతరుల రాజ్యం మొదటి నుండి ఉండదు. అక్కడ ధర్మస్థాపకులు వచ్చినప్పుడు వారి వెనుక వారి ధర్మం వృద్ధి చెందుతుంది. కోట్ల మంది తయారైనప్పుడు రాజ్యం నడుస్తుంది. మీకైతే సత్యయుగం మొదటి నుండే రాజ్యం ఉంటుంది. సత్యయుగంలో ఇంతటి రాజ్యం ఎక్కడి నుండి వచ్చిందో ఎవరి బుద్ధిలోకి రాదు. కలియుగాంతంలో ఇన్ని లెక్కలేనన్ని ధర్మాలున్నాయి, మళ్ళీ సత్యయుగంలో ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఎలా ఏర్పడింది? ఎన్ని వజ్ర-వైఢూర్యాల మహళ్ళున్నాయి. భారతదేశం ఎలా ఉండేదంటే, దానిని ప్యారడైజ్ అనేవారు. ఇది 5 వేల సంవత్సరాల విషయం. లక్షల సంవత్సరాల లెక్క ఎక్కడి నుండి వచ్చింది. మనుష్యులు ఎంతగా తికమక పడిపోయారు. ఇప్పుడు వారికి ఎవరు అర్థం చేయిస్తారు. మేము అసురుల రాజ్యంలో ఉన్నామని వారు అర్థం చేసుకోరు. వీరికి (దేవతలకు) సర్వగుణ సంపన్నులు...... అని మహిమ ఉంది, వీరిలో పంచ వికారాలు ఉండవు ఎందుకంటే దేహీ-అభిమానులుగా ఉంటారు, అందుకే ముఖ్యమైన విషయము స్మృతి అని తండ్రి చెప్తారు. 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ మీరు పతితంగా అయ్యారు, ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అవ్వాలి. ఇది డ్రామా చక్రం. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. జ్ఞానంతో మూడవ నేత్రాన్ని ధారణ చేసి మోసగించే మీ కనులను సివిల్ గా (పవిత్రంగా) చేసుకోవాలి. స్మృతి ద్వారానే కర్మేంద్రియాలు శీతలంగా, సతోగుణీగా అవుతాయి కనుక ఇదే శ్రమ చెయ్యాలి.
2. వ్యాపారము మొదలైనవాటి నుండి టైమ్ తీసి ఏకాంతంలోకి వెళ్ళి స్మృతిలో కూర్చోవాలి. మాకు యోగము ఎందుకు కుదరడం లేదు అని కారణం చూసుకోవాలి. తప్పకుండా మీ చార్టును పెట్టాలి.