ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. ఆత్మలు ఈ శారీరిక కర్మేంద్రియాల ద్వారా పాట విన్నారు. పాటలో మొదటి భాగము సరిగ్గానే ఉంది. చివరిలో భక్తిలోని పదాలున్నాయి. మీ చరణాల ధూళి అని అంటారు, ఇప్పుడు పిల్లలు చరణాల ధూళి కాదు. ఇది తప్పు. తండ్రి పిల్లలకు రైట్ పదాలు అర్థం చేయిస్తారు. పిల్లలెక్కడ నుండైతే వస్తారో తండ్రి కూడా అక్కడి నుండే వస్తారు, అది నిర్వాణధామము. అందరూ ఎలా వస్తారు అన్న సమాచారాన్ని పిల్లలకు వినిపించారు. నేను ఎలా వస్తాను, వచ్చి ఏం చేస్తాను అని స్వయం గురించి కూడా వినిపించారు. రామరాజ్యము స్థాపన చేసేందుకు రావణునిపై విజయం ప్రాప్తింపజేస్తారు. రామరాజ్యము మరియు రావణరాజ్యము ఈ భూమి పైనే ఉన్నాయని అంటారని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. భూమి, ఆకాశము, సూర్యుడు మొదలైనవన్నీ మీ చేతిలోకి వచ్చేస్తాయి. అందుకే, రావణ రాజ్యము మొత్తం విశ్వంపై ఉంది మరియు రామరాజ్యము కూడా మొత్తం విశ్వముపై ఉందని అంటారు. రావణ రాజ్యంలో ఎన్ని కోట్లమంది ఉన్నారు, రామరాజ్యంలో కొంతమందే ఉంటారు, తర్వాత నెమ్మది-నెమ్మదిగా వృద్ధి చెందుతారు. రావణరాజ్యంలో చాలా వృద్ధి జరుగుతుంది, ఎందుకంటే మనుష్యులు వికారీగా అయిపోతారు. రామరాజ్యంలో నిర్వికారులుంటారు. ఇది మనుష్యుల కథే. కనుక రాముడు కూడా అనంతమైన యజమాని, రావణుడు కూడా అనంతమైన యజమాని. ఇప్పుడు అనేక ధర్మాలున్నాయి. అనేక ధర్మాల వినాశనమని గాయనము ఉంది. బాబా వృక్షము గురించి కూడా అర్థం చేయించారు.
ఇప్పుడు దసరా జరుపుకుంటారు, రావణుడిని కాలుస్తారు. ఇది హద్దుకు సంబంధించిన కాల్చడం. మీది అనంతమైన విషయము. రావణుడిని కూడా కేవలం భారతవాసులే కాలుస్తారు, విదేశాలలో కూడా ఎక్కడెక్కడైతే భారతవాసులు ఎక్కువగా ఉంటారో అక్కడ కూడా కాలుస్తారు. అది హద్దుకు సంబంధించిన దసరా. లంకలో రావణుడు రాజ్యం చేసేవాడు, సీతను అపహరించి లంకకు తీసుకెళ్ళాడని చూపిస్తారు. ఇవన్నీ హద్దుకు సంబంధించిన విషయాలు, ఇప్పుడు విశ్వమంతటిపై రావణ రాజ్యముందని తండ్రి చెప్తారు. ఇప్పుడు రామరాజ్యము లేదు. రామరాజ్యమంటే ఈశ్వరుడు స్థాపించినటువంటిది. సత్యయుగాన్ని రామరాజ్యమని అంటారు. మాలను స్మరిస్తారు, రఘుపతి రాఘవ రాజారాం అని అంటారు కానీ రాజు అయిన రాముడిని స్మరించరు, ఎవరైతే విశ్వమంతటి సేవ చేస్తారో, వారి మాలను స్మరిస్తారు.
భారతవాసులు దసరా తర్వాత దీపావళిని జరుపుకుంటారు. దీపావళిని ఎందుకు జరుపుకుంటారు? ఎందుకంటే దేవతల పట్టాభిషేకం జరుగుతుంది. పట్టాభిషేకం రోజున దీపాలు మొదలైనవి చాలా వెలిగిస్తారు. ఒకటి పట్టాభిషేకము, మరొకటి ఇంటింటిలోనూ దీపావళి అని అంటారు. ప్రతి ఒక్క ఆత్మ జ్యోతి వెలుగుతుంది. ఇప్పుడు ఆత్మలందరి జ్యోతులు ఆరిపోయాయి. ఇది ఇనుప యుగము అనగా అంధకారము. అంధకారమనగా భక్తి మార్గము. భక్తి చేస్తూ-చేస్తూ జ్యోతి తగ్గిపోతూ ఉంటుంది. ఇక ఆ దీపమాల అయితే కృత్రిమమైనది. అలాగని పట్టాభిషేకము జరిగినప్పుడు బాణాసంచా కాలుస్తారని కాదు. దీపావళినాడు లక్ష్మిని పిలుస్తారు. పూజిస్తారు. ఇది భక్తి మార్గములోని ఉత్సవము. ఏ రాజైతే సింహాసనముపై కూర్చుంటారో, వారి పట్టాభిషేకపు రోజును వైభవంగా జరుపుతారు. ఇవన్నీ హద్దుకు సంబంధించినవి. ఇప్పుడు అనంతమైన వినాశనము, సత్యాతి-సత్యమైన దసరా జరగనున్నది. అందరి జ్యోతులను వెలిగించేందుకు తండ్రి వచ్చారు. మా జ్యోతి పెద్ద జ్యోతితో కలిసిపోతుందని మనుష్యులు భావిస్తారు. బ్రహ్మ సమాజము వారి మందిరంలో జ్యోతి సదా వెలుగుతూ ఉంటుంది. ఎలాగైతే దీపపు పురుగులు జ్యోతి చుట్టూ తిరిగి కాలిపోతాయో, అదే విధంగా మన ఆత్మ కూడా ఇప్పుడు పెద్ద జ్యోతిలో కలిసిపోతుందని భావిస్తారు. దీనిని ఉదాహరణగా చూపిస్తారు. ఇప్పుడు మీరు అర్థకల్పము యొక్క ప్రేయసులు. మీరు వచ్చి ఆ ఒక్క ప్రియునిపై బలిహారమయ్యారు, కాలిపోయే విషయమైతే లేదు. ఆ ప్రేయసీ - ప్రియుడు ఒకరి పై ఒకరు ప్రేమ కలిగి ఉంటారు. ఇక్కడ వారొక్కరే ప్రియుడు, మిగిలినవారంతా ప్రేయసులు. ప్రేయసులు భక్తి మార్గంలో ఆ ప్రియుడిని స్మృతి చేస్తూ ఉంటారు. ప్రియతముడా, మీరు వస్తే మేము మీకు బలిహారమవుతాము. మేము మిమ్మల్ని తప్ప ఇతరులెవ్వరిని స్మృతి చేయము. ఇది మీ దైహిక ప్రేమ కాదు. ఆ ప్రేయసి-ప్రియులకు దైహిక ప్రేమ ఉంటుంది. ఒకరినొకరు కేవలం చూసుకుంటూ ఉంటారు, చూడడంలోనే తృప్తి చెందుతారు. ఇక్కడైతే ప్రియుడు ఒక్కరే, మిగిలిన వారంతా ప్రేయసులు. అందరూ తండ్రిని స్మృతి చేస్తారు. కొంతమంది ప్రకృతిని మొదలైనవాటిని కూడా గౌరవిస్తారు. అయినా, ఓ గాడ్, ఓ భగవంతుడా అని నోటి నుండి తప్పకుండా వస్తుంది. మా దుఃఖాన్ని దూరము చేయండి అని అందరూ వారిని పిలుస్తారు. భక్తిమార్గంలో ప్రేయసీ-ప్రియులు చాలామంది ఉంటారు, కొందరు కొందరిని, ఇంకొందరు ఇంకొందరిని ప్రేమిస్తూ ఉంటారు. హనుమంతునికి ఎంతమంది ప్రేయసులుంటారు? అందరూ తమ-తమ ప్రియుని చిత్రాన్ని తయారుచేసుకొని పరస్పరము కలిసి కూర్చొని వారిని పూజిస్తారు. పూజించి మళ్ళీ ప్రియుడిని ముంచేస్తారు. అర్థమేమీ ఉండదు. ఇక్కడ అటువంటి విషయము లేవు. మీ ఈ ప్రియుడు సదా సుందరమైనవారు, ఎప్పుడూ నల్లగా అవ్వరు. యాత్రికుడైన తండ్రి వచ్చి అందరినీ సుందరంగా చేస్తారు. మీరు కూడా యాత్రికులే కదా. దూరదేశము నుండి వచ్చి ఇక్కడ పాత్రను అభినయిస్తున్నారు. మీలో కూడా నంబరువారు పురుషార్థానుసారంగా అర్థము చేసుకుంటారు. ఇప్పుడు మీరు త్రికాలదర్శులుగా అయిపోయారు. రచయిత మరియు రచనల ఆది-మధ్య-అంతాలు తెలుసు కనుక మీరు త్రికాలదర్శీ బ్రహ్మాకుమార-కుమారీలు. ఎలాగైతే వారికి జగద్గురు మొదలైన టైటిల్స్ కూడా లభిస్తాయి కదా. మీకు ఈ టైటిల్ లభిస్తుంది. మీకు స్వదర్శన చక్రధారి అని అన్నిటికన్నా మంచి టైటిల్ లభిస్తుంది. బ్రాహ్మణులైన మీరే స్వదర్శన చక్రధారులా లేక శివబాబా కూడానా? (శివబాబా కూడా) అవును, ఎందుకంటే ఆత్మ శరీరముతో పాటు స్వదర్శన చక్రధారిగా అవుతుంది కదా. తండ్రి కూడా వీరిలోకి వచ్చి అర్థం చేయిస్తారు. శివబాబా స్వదర్శన చక్రధారి కాకపోతే మిమ్మల్ని ఎలా తయారుచేస్తారు. వారు అందరికన్నా సుప్రీమ్, ఉన్నతాతి ఉన్నతమైన ఆత్మ. దేహమును అలా అనరు. ఆ సుప్రీమ్ తండ్రియే వచ్చి మిమ్మల్ని సుప్రీమ్ గా తయారుచేస్తారు. స్వదర్శన చక్రధారిగా ఆత్మలు తప్ప ఇంకెవ్వరూ అవ్వలేరు. ఏ ఆత్మలు? బ్రాహ్మణ ధర్మములో ఉండేవారు. శూద్ర ధర్మములో ఉన్నప్పుడు మీకు తెలియదు. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు తెలుసుకున్నారు. ఇవి ఎంత మంచి-మంచి విషయాలు. మీరు మాత్రమే వింటారు మరియు సంతోషిస్తారు. బయటి వారు ఈ విషయాలు వింటే ఓహో, ఇది చాలా ఉన్నతమైన జ్ఞానమని ఆశ్చర్యపోతారు. అచ్ఛా, మీరు కూడా ఇటువంటి స్వదర్శన చక్రధారులుగా అయినట్లయితే చక్రవర్తి రాజులుగా, విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇక్కడ నుండి బయటకు వెళ్తే సమాప్తం. మాయ ఎంత బలిశాలి, ఇక్కడ విన్నది ఇక్కడే ఉండిపోతుంది. గర్భంలో శిశువు ప్రతిజ్ఞ చేసి బయటకు వస్తాడు, అయినా అక్కడిది అక్కడే ఉండిపోతుంది. మీరు ప్రదర్శిని మొదలైనవాటిలో అర్థం చేయించినప్పుడు చాలా బాగుంది-చాలా బాగుంది అని అంటారు. జ్ఞానము చాలా బాగుంది, నేను ఇటువంటి పురుషార్థము చేస్తాను, ఇది చేస్తాను,..... అని అంటారు. బయటకు రాగానే, అక్కడిది అక్కడే ఉండిపోతుంది. కానీ ఎంతో కొంత ప్రభావముంటుంది. అలాగని వారు మళ్ళీ రారని కాదు. వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. వృక్షము వృద్ధి చెందినట్లయితే అందరినీ ఆకర్షిస్తుంది. ఇప్పుడైతే ఇది రౌరవ నరకము. గరుడ పురాణములో కూడా ఇటువంటి ఆసక్తి కలిగించే విషయాలను వ్రాసారు, అవి మనుష్యులకు వినిపించిప్పుడు కొంచెం భయపడతారని రాసారు. మనుష్యులు పాములు, తేళ్లు మొదలైనవిగా అవుతారని దాని నుండే వెలువడింది. నేను మిమ్మల్ని విషయ వైతరణి నది నుండి బయటకు తీసి క్షీర సాగరములోకి పంపిస్తానని తండ్రి అంటారు. నిజానికి మీరు శాంతిధామ నివాసులుగా ఉండేవారు. తర్వాత పాత్ర అభినయించేందుకు సుఖధామంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మనము శాంతిధామానికి మరియు సుఖధామానికి వెళ్తాము. ఈ ధామాలను గుర్తు చేసుకుంటారు కదా. నీవే తల్లివి-తండ్రివి...... అని కూడా పాడుతారు. సత్యయుగంలో ఆ అపారమైన సుఖముంటుంది. ఇప్పుడు ఇది సంగమయుగము. అంతిమంలో ఇక్కడ దుఃఖములో రక్షణ కొరకు అలమటిస్తారు ఎందుకంటే అతి దుఃఖముంటుంది. తర్వాత సత్యయుగంలో అతి సుఖముంటుంది. అతి సుఖము మరియు అతి దుఃఖముల ఈ ఆట తయారుచేయబడింది. విష్ణువు అవతారమును కూడా చూపిస్తారు. లక్ష్మీనారాయణుల జంట పై నుండి వచ్చినట్లుగా చూపిస్తారు. ఇప్పుడు పై నుండి శరీరధారులెవ్వరూ రారు. ప్రతి ఒక్క ఆత్మ పై నుండి వస్తుంది. కానీ ఈశ్వరుని అవతరణ చాలా విచిత్రమైనది, వారే వచ్చి భారతదేశమును స్వర్గంగా తయారుచేస్తారు. వారి పండుగ అయిన శివజయంతిని జరుపుకుంటారు. పరమపిత పరమాత్మ శివుడే ముక్తి-జీవన్ముక్తుల వారసత్వమునిస్తారని ఒకవేళ తెలిస్తే, ఇక విశ్వమంతటా గాడ్ ఫాదర్ పండుగను జరుపుకుంటారు. శివబాబాయే ముక్తిదాత, గైడ్ అని అర్థము చేసుకున్నప్పుడు అనంతమైన తండ్రి స్మృతిచిహ్నమును జరుపుకుంటారు. వారు భారతదేశములోనే జన్మిస్తారు. శివజయంతిని కూడా భారతదేశములోనే జరుపుకుంటారు. కానీ పూర్తి పరిచయము లేకపోవడంతో సెలవు కూడా ఇవ్వరు. సర్వులకు సద్గతిని ఇచ్చే ఆ తండ్రి యొక్క జన్మభూమిలో, వారు అలౌకిక కర్తవ్యము చేసే భూమిలో వారి జన్మ దినాన్ని మరియు తీర్థ యాత్రలను చాలా ఎక్కువగా జరుపుకోవాలి. మీ స్మృతిచిహ్న మందిరాలు కూడా ఇక్కడే ఉన్నాయి. కానీ శివబాబాయే వచ్చి ముక్తిదాతగా, గైడ్ గా అవుతారని ఎవ్వరికీ తెలియదు. అన్ని దుఃఖాల నుండి విడిపించి సుఖధామంలోకి తీసుకువెళ్ళమని అందరూ అంటారు కానీ అర్థము చేసుకోరు. భారతదేశము చాలా ఉన్నతాతి ఉన్నతమైన ఖండము. భారతదేశ మహిమ అపారమైనదని గాయనం చేయబడింది. అక్కడే శివబాబా జన్మ జరుగుతుంది, వారిని ఎవ్వరూ గౌరవించరు. వారి స్టాంపును తయారుచేయరు. ఇతరుల స్టాంపులైతే చాలా తయారుచేస్తూ ఉంటారు. వీరి మహత్వము అందరికీ తెలిసేలా ఇప్పుడు ఎలా అర్థం చేయించాలి. సన్యాసులు మొదలైనవారు విదేశాలకు కూడా వెళ్ళి భారతదేశపు ప్రాచీన యోగమును నేర్పిస్తారు, మీరు ఈ రాజయోగాన్ని తెలియజేస్తే మీకు చాలా పేరు వస్తుంది. రాజయోగాన్ని ఎవరు నేర్పించారో ఎవ్వరికీ తెలియదని చెప్పండి. కృష్ణుడు కూడా హఠయోగమైతే నేర్పించలేదు. ఈ హఠయోగము సన్యాసులది. చాలా బాగా చదువుకున్నవారు, ఎవరైతే స్వయాన్ని ఫిలాసఫర్లుగా పిలిపించుకుంటారో, వారు ఈ విషయాలను అర్థము చేసుకుని పరివర్తన అవ్వాలి. మేము కూడా శాస్త్రాలు చదివాము కానీ ఇప్పుడు తండ్రి ఏదైతే వినిపిస్తున్నారో, అది రైట్, మిగిలినదంతా రాంగ్ అని చెప్పాలి. తండ్రి వచ్చే ఈ స్థానమే తప్పకుండా అన్నిటికన్నా గొప్ప తీర్థ స్థానమని కూడా వారు అర్థము చేసుకోవాలి. దీనిని ధర్మ భూమి అని అంటారని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడున్నంత మంది ధర్మాత్మలు ఇంకెక్కడా ఉండరు. మీరు ఎన్ని దాన-పుణ్యాలు చేస్తారు. తండ్రిని తెలుసుకుని, తనువు-మనస్సు-ధనము అన్నిటినీ ఈ సేవలో ఉపయోగిస్తారు. తండ్రియే అందరికీ ముక్తినిస్తారు. అందరినీ దుఃఖము నుండి విడిపిస్తారు. ఇతర ధర్మస్థాపకులెవ్వరూ దుఃఖము నుండి విడిపించరు. ఆ ధర్మాలకు చెందినవారు ధర్మస్థాపకుల వెనుక వస్తారు. అందరూ నంబరువారుగా పాత్రను అభినయించేందుకు వస్తారు. పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ తమోప్రధానంగా అయిపోతారు. మళ్ళీ తండ్రి వచ్చి సతోప్రధానంగా చేస్తారు. కనుక ఈ భారతదేశము ఎంత గొప్ప తీర్థస్థానము. భారతదేశము అన్నిటికన్నా నంబరువన్ ఉన్నతమైన భూమి. ఇది నా జన్మ భూమి అని తండ్రి చెప్తారు. నేను వచ్చి అందరికీ సద్గతినిస్తాను. భారతదేశాన్ని స్వర్గంగా తయారుచేస్తాను.
తండ్రి స్వర్గానికి యజమానులుగా చేసేందుకు వచ్చారని పిల్లలైన మీకు తెలుసు. అటువంటి తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయండి. మిమ్మల్ని చూసి ఇతరులు కూడా అటువంటి కర్మలు చేస్తారు. వీటినే అలౌకిక దివ్య కర్మలు అని అంటారు. ఎవ్వరూ తెలుసుకోరని అనుకోకండి. ఈ మీ చిత్రాలు కూడా తీసుకువెళ్ళేవారు వస్తారు. మంచి-మంచి చిత్రాలు తయారుచేస్తే స్టీమరు నిండా తీసుకువెళ్తారు. స్టీమరు ఎక్కడెక్కడైతే ఆగుతుందో, అక్కడ ఈ చిత్రాలను తగిలిస్తారు. మీ సేవ ఎంతగానో జరుగనున్నది. హుండీని నింపే చాలా ఉదారచిత్తులైన మహారాజులు కూడా ఎంతోమంది వెలువడుతారు, వారు ఇటువంటి పనులు చేయడం మొదలుపెడతారు. ఈ పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేవారెవరో అందరికీ తద్వారా అర్థమవుతుంది. మీరు కూడా మొదట తుచ్ఛ బుద్ధికలవారిగానే ఉండేవారు, ఇప్పుడు మీరు ఎంత స్వచ్ఛ బుద్ధికలవారిగా అయ్యారు. మనము ఈ జ్ఞానము మరియు యోగబలము ద్వారా విశ్వాన్ని స్వర్గంగా చేస్తాము అని మీకు తెలుసు. మిగిలిన వారందరూ ముక్తిధామానికి వెళ్ళిపోతారు. మీరు కూడా అథారిటీలుగా అవ్వాలి. అనంతమైన తండ్రికి పిల్లలు కదా. స్మృతి ద్వారా శక్తి లభిస్తుంది. తండ్రిని వరల్డ్ ఆల్మైటీ అథారిటీ (సర్వశక్తివంతుడు) అని అంటారు. వేద శాస్త్రాలన్నిటి సారాన్ని తెలియజేస్తారు. కనుక పిల్లలకు సేవ యొక్క ఉత్సాహం ఎంత ఉండాలి. నోటి ద్వారా జ్ఞానరత్నాలు తప్ప ఇంకేమీ వెలువడకూడదు. మీలో ప్రతి ఒక్కరూ రూప్-బసంతులు (జ్ఞానీ-యోగీలు). ప్రపంచమంతా సస్యశ్యామలంగా తయారవ్వడం మీరు చూస్తారు. అంతా కొత్తదిగా అవుతుంది, అక్కడ దుఃఖమనే పేరే ఉండదు. పంచ తత్వాలు కూడా మీ సేవలో హాజరై ఉంటాయి. ఇప్పుడవి డిస్-సర్వీస్ చేస్తాయి ఎందుకంటే మనుష్యులు అర్హులుగా లేరు. తండ్రి ఇప్పుడు అర్హులుగా చేస్తారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. రూప్-బసంతులుగా అయి నోటి ద్వారా సదా జ్ఞానరత్నాలనే ఉచ్ఛరించాలి. సేవ ఉత్సాహములో ఉండాలి. స్మృతిలో ఉండాలి మరియు అందరికీ తండ్రి స్మృతినిప్పించాలి - ఈ దివ్య అలౌకిక కార్యమునే చేయాలి.
2. సత్యాతి-సత్యమైన ప్రేయసులై ఒక్క ప్రియునిపై బలిహారమవ్వాలి అనగా బలి అవ్వాలి, అప్పుడే సత్యమైన దీపావళి జరుగుతుంది.