29-10-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీరిప్పుడు ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యారు, మీరు అందరికీ సదా సుఖమునివ్వాలి, మీరు ఎవ్వరికీ దుఃఖమునివ్వలేరు”

ప్రశ్న:-

మంచి ఫస్ట్ క్లాస్ పురుషార్థీ పిల్లలు ఏ మాటలను హృదయపూర్వకంగా చెప్తారు?

జవాబు:-

బాబా, మేమైతే పాస్ విత్ ఆనర్ గా అయి చూపిస్తాము. మీరు నిశ్చింతగా ఉండండి. వారి రిజిస్టరు కూడా బాగుంటుంది. మేమిప్పుడు ఇంకా పురుషార్థులమే అనే మాటలు వారి నోటి నుండి ఎప్పుడూ రావు. పురుషార్థము చేసి ఎటువంటి మహావీరులుగా అవ్వాలంటే, ఇక మాయ కొద్దిగా కాడా కదిలించకూడదు.

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి ద్వారా చదువుకుంటున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. నిరాకార తండ్రి యొక్క నిరాకారీ పిల్లలము, ఆత్మలైన మనము చదువుకుంటున్నాము. ప్రపంచంలో సాకారీ టీచర్లే చదివిస్తారు. ఇక్కడ నిరాకార తండ్రి, నిరాకార టీచరు ఉన్నారు, ఇకపోతే ఇతనికి విలువేమీ లేదు. అనంతమైన తండ్రి అయిన శివబాబా వచ్చి వీరికి విలువనిస్తారు. అత్యంత విలువైనవారు శివబాబా, వారు స్వర్గస్థాపన చేస్తారు. ఎంత ఉన్నతమైన కార్యము చేస్తారు. తండ్రి ఎంత ఉన్నతాతి ఉన్నతమైనవారిగా గాయనం చేయబడుతున్నారో, పిల్లలు కూడా అంత ఉన్నతంగా తయారవ్వాలి. తండ్రి అందరికన్నా ఉన్నతమైనవారని మీకు తెలుసు. ఇప్పుడు స్వర్గ రాజ్యము స్థాపనౌతుందని, ఇది సంగమయుగమని మీ బుద్ధిలో ఉంది. సత్యయుగానికి మరియు కలియుగానికి మధ్యలో, ఇది పురుషోత్తములుగా తయారయ్యే సంగమయుగము. పురుషోత్తమ అనే పదానికి అర్థము కూడా మనుష్యులకు తెలియదు. ఉన్నతాతి ఉన్నతంగా, మళ్ళీ నీచాతి నీచంగా అయ్యారు. పతితులకు మరియు పావనులకు ఎంత తేడా ఉంది. దేవతల పూజారులు స్వయంగా, మీరు సర్వ గుణసంపన్నులు...... విశ్వానికి యజమానులు అని వర్ణిస్తారు. మనం విషయ వైతరణి నదిలో మునకలు వేసేవారమని కేవలం నామమాత్రం అంటారు, అర్థము చేసుకోరు. డ్రామా విచిత్రమైనది, అద్భుతమైనది. ఇలాంటి విషయాలను మీరు కల్ప-కల్పము వింటారు. తండ్రి వచ్చి అర్థము చేయిస్తారు. ఎవరికైతే తండ్రిపై పూర్తి ప్రేమ ఉంటుందో, వారికి చాలా ఆకర్షణ కలుగుతుంది. ఇప్పుడు ఆత్మ తండ్రిని ఎలా కలుసుకోవాలి? సాకారంలో కలుసుకోవడం జరుగుతుంది, నిరాకారీ ప్రపంచంలోనైతే ఆకర్షణ అనే మాటే ఉండదు. అక్కడైతే అందరూ పవిత్రంగానే ఉంటారు. తుప్పు తొలగించబడి ఉంటుంది. ఆకర్షణ అనే మాటే ఉండదు. ప్రేమ అనేది ఇక్కడే ఉంటుంది. ఇటువంటి తండ్రిని పూర్తిగా పట్టుకోండి. బాబా, మీరైతే అద్భుతం చేస్తారు. మీరు మా జీవితాన్ని ఇలా తయారుచేస్తారు. చాలా ప్రేమ ఉండాలి. ప్రేమ ఎందుకు ఉండదు? ఎందుకంటే తుప్పు పట్టి ఉంది. స్మృతియాత్రతో తప్ప తుప్పు తొలగిపోదు, అంత ప్రియంగా కాలేరు. పుష్పాలైన మీరు ఇక్కడే వికసించాలి, పుష్పాలుగా అవ్వాలి. అప్పుడు అక్కడ మళ్ళీ జన్మ-జన్మాంతరాలకు పుష్పాలుగా అవుతారు. మేము ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నాము అని ఎంత సంతోషం ఉండాలి. పుష్పాలు సదా అందరికీ సుఖాన్నిస్తాయి. పుష్పాలను అందరూ తమ కళ్ళకద్దుకుంటారు, వాటి ద్వారా సుగంధాన్ని తీసుకుంటారు. పుష్పాలతో సెంటును తయారుచేస్తారు. గులాబి జలాన్ని తయారుచేస్తారు. తండ్రి మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారుచేస్తారు. మరి పిల్లలైన మీకు ఎందుకు సంతోషం ఉండదు! బాబాకైతే ఆశ్చర్యమనిపిస్తుంది. శివబాబా మనల్ని స్వర్గములో పుష్పాలుగా తయారుచేస్తారు! పుష్పాలు కూడా పాతవిగా అయిపోయినప్పుడు పూర్తిగా వాడిపోతాయి. మనమిప్పుడు మనుష్యుల నుండి దేవతలు అవుతున్నామని మీ బుద్ధిలో ఉంది. తమోప్రధాన మనుష్యులకు మరియు సతోప్రధాన దేవతలకు ఎంత తేడా ఉంది. ఇది కూడా తండ్రి తప్ప మరెవ్వరూ అర్థము చేయించలేరు.

మేము దేవతలుగా అయ్యేందుకు చదువుకుంటున్నామని మీకు తెలుసు. చదువులో నషా ఉంటుంది కదా. మేము బాబా ద్వారా చదువుకుని విశ్వానికి యజమానులుగా అవుతామని మీకు కూడా తెలుసు. మీ చదువు భవిష్యత్తు కోసం ఉంది. భవిష్యత్తు కోసం చదువు అని ఎప్పుడైనా విన్నారా? మేము కొత్త ప్రపంచం కోసం, కొత్త జన్మ కోసం చదువుకుంటున్నామని మీరే అంటారు. కర్మ-అకర్మ-వికర్మల గతిని కూడా తండ్రి అర్థం చేయిస్తారు. ఇది గీతలో కూడా ఉంది కానీ దాని అర్థము గీతను చదివేవారికి తెలియదు. సత్యయుగములో కర్మ, అకర్మగా అవుతుందని, తర్వాత రావణరాజ్యములో కర్మ, వికర్మగా అవ్వడం ప్రారంభమౌతుందని ఇప్పుడు తండ్రి ద్వారా మీరు తెలుసుకున్నారు. 63 జన్మలుగా మీరు ఇలాంటి కర్మలు చేస్తూ వచ్చారు. వికర్మల భారం తలపై చాలా ఉంది. అందరూ పాపాత్ములుగా అయిపోయారు. ఇప్పుడు ఆ గతం యొక్క వికర్మలు ఎలా కట్ అవుతాయి. మొదట సతోప్రధానంగా ఉండేవారము, తర్వాత 84 జన్మలు తీసుకున్నామని మీకు తెలుసు. బాబా డ్రామా పరిచయమునిచ్చారు. ఎవరైతే మొట్టమొదట వస్తారో, ఎవరి రాజ్యమైతే మొట్టమొదట ఉంటుందో, వారే 84 జన్మలు తీసుకుంటారు. తర్వాత తండ్రి వచ్చి రాజ్యభాగ్యాన్నిస్తారు. మీరిప్పుడు రాజ్యాన్ని తీసుకుంటున్నారు. మనం 84 జన్మల చక్రములో ఎలా తిరిగాము అనేది మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అవ్వాలి. బాబాను స్మృతి చేస్తూ-చేస్తూ ఆత్మ పవిత్రంగా అయిపోతుంది, తర్వాత ఈ పాత శరీరము సమాప్తమైపోతుంది. పిల్లలకు అపారమైన సంతోషముండాలి. తండ్రి, తండ్రి కూడా, టీచర్ కూడా, గురువు కూడా అన్న మహిమను ఎప్పుడూ ఎక్కడా వినలేదు. ముగ్గురూ ఉన్నతాతి ఉన్నతమైనవారు. సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సద్గురువు, ముగ్గురూ ఒక్కరే. ఇప్పుడు మీకు అనుభూతి కలుగుతుంది. జ్ఞానసాగరుడైన తండ్రి, ఆత్మలందరికీ తండ్రి, వారు మనల్ని చదివిస్తున్నారు. యుక్తులను రచిస్తున్నారు. మ్యాగజైన్ లో కూడా మంచి-మంచి పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. రంగుల చిత్రాలతో కూడా మ్యాగజైన్ తయారుచేసే అవకాశముంది. కేవలం పదాలు చిన్నవైపోతాయి. చిత్రాలైతే తయారై ఉన్నాయి. ఎక్కడైనా ఎవరైనా తయారుచేయవచ్చు. పై నుండి మొదలుకొని ప్రతి ఒక్క చిత్రము యొక్క చరిత్ర మీకు తెలుసు. శివబాబా కర్తవ్యం కూడా మీకు తెలుసు. పిల్లలు తండ్రి కర్తవ్యాన్ని తప్పకుండా తండ్రి ద్వారానే తెలుసుకుంటారు కదా. ఇంతకుముందు మీకు కూడా ఏమీ తెలియదు. చిన్న బిడ్డకు చదువు గురించి ఏం అర్థమౌతుంది. 5 సంవత్సరాల తర్వాత చదవడం ప్రారంభిస్తారు. తర్వాత చదువుకుంటూ-చదువుకుంటూ పెద్ద పరీక్షను పాస్ అయ్యేందుకు చాలా సంవత్సరాలు పడుతుంది. మీరు ఎంత సాధారణంగా ఉన్నారు కానీ ఎలా తయారవుతారు! విశ్వానికి యజమానులుగా తయారవుతారు. మీకు ఎంత అలంకారణ జరుగుతుంది. గోల్డన్ స్పూన్ ఇన్ మౌత్ (నోటిలో బంగారు చెంచా) ఉంటుంది. ఈ గాయనం అక్కడిదే. ఇప్పుడు కూడా మంచి పిల్లలెవరైనా శరీరాన్ని విడిచిపెడితే, వారు చాలా మంచి ఇంటిలో జన్మ తీసుకుంటారు. అప్పుడు నోటిలో బంగారు చెంచా లభిస్తుంది. కొంతమంది ముందుగానే ఎవరి వద్దకైనా వెళ్తారు కదా. నిర్వికారుల వద్దనైతే మొట్టమొదట శ్రీ కృష్ణుడే జన్మ తీసుకోవాలి. మిగిలినవారు ఎవరు వెళ్ళినా వారు వికారుల వద్దనే జన్మ తీసుకుంటారు కానీ గర్భములో ఇన్ని శిక్షలను అనుభవించరు. చాలా మంచి ఇళ్ళలో జన్మ తీసుకుంటారు. శిక్షలైతే తొలగిపోతాయి, కొద్దిగా మిగిలి ఉంటాయి. ఇంత దుఃఖముండదు. మున్ముందు మీ వద్దకు చాలా పెద్ద పెద్ద ఇంటి పిల్లలైన రాకుమార-రాకుమారీలు ఎలా వస్తారో చూడండి. తండ్రి ఎంతగా మీ మహిమను చేస్తారు. ఎలాగైతే లౌకిక తండ్రి పిల్లలను సుఖవంతులుగా తయారుచేస్తారో, అలా నేను మిమ్మల్ని నా కన్నా ఉన్నతంగా తయారుచేస్తాను. 60 సంవత్సరాల తర్వాత ఇక స్వయం వానప్రస్థంలోకి వెళ్ళిపోతారు, భక్తిలో నిమగ్నమైపోతారు. జ్ఞానాన్ని అయితే ఎవ్వరూ ఇవ్వలేరు. నేను జ్ఞానము ద్వారా సర్వులకు సద్గతినిస్తాను. మీ కారణంగా అందరి కళ్యాణం జరుగుతుంది ఎందుకంటే మీ కొరకు తప్పకుండా కొత్త ప్రపంచం కావాలి. మీరు ఎంత సంతోషిస్తారు. ఇప్పుడు వెజిటేరియన్ కాన్ఫరెన్స్ లో కూడా పిల్లలైన మీకు ఆహ్వానం లభించింది. ధైర్యము వహించండి అని బాబా అయితే చెప్తూ ఉంటారు. ఢిల్లీ లాంటి నగరాలలోనైతే శబ్దం పూర్తిగా వ్యాపించాలి. ప్రపంచంలో అంధ శ్రద్ధలతో కూడిన భక్తి చాలా ఉంది. సత్య-త్రేతా యుగాలలో భక్తి యొక్క విషయమేదీ ఉండదు. ఆ డిపార్టమెంట్ వేరుగా ఉంటుంది. అర్థకల్పము జ్ఞానం యొక్క ప్రారబ్ధముంటుంది. మీకు అనంతమైన తండ్రి ద్వారా 21 జన్మల వారసత్వము లభిస్తుంది. తర్వాత 21 తరాలు మీరు సుఖంగా ఉంటారు. వృద్ధాప్యం వరకు కూడా దుఃఖము పేరే ఉండదు. పూర్తి ఆయువు సుఖంగా ఉంటారు. వారసత్వాన్ని పొందే పురుషార్థము ఎంతగా చేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. కనుక పురుషార్థము పూర్తిగా చేయాలి. మాల నంబరువారుగా ఎలా తయారవుతుందో మీరు చూస్తారు. పురుషార్థానుసారంగానే తయారవుతుంది. మీరు అద్భుతమైన విద్యార్థులు. స్కూలులో కూడా పిల్లలను గమ్యము వరకు పరిగెత్తిస్తారు కదా. మీరు కూడా గమ్యం వరకు పరుగెత్తి మళ్ళీ ఇక్కడకే రావాలి అని బాబా కూడా చెప్తారు. స్మృతియాత్ర ద్వారా మీరు పరుగెత్తి వెళ్ళండి, తర్వాత మీరు నెంబరువన్ లోకి వచ్చేస్తారు. ముఖ్యమైనది స్మృతియాత్ర. బాబా, మేము మర్చిపోతున్నామని అంటారు. అరే, తండ్రి మిమ్మల్ని ఇంతగా విశ్వానికి యజమానులుగా తయారుచేస్తున్నారు, వారిని మీరు మర్చిపోతారా. తుఫానులైతే వస్తాయి. తండ్రి ధైర్యాన్ని ఇస్తారు కదా. ఇంకా, ఇది యుద్ధ స్థలమని కూడా చెప్తారు. వాస్తవానికి యుద్ధము నేర్పించే తండ్రినే యుధిష్టురుడని అనాలి. మీరు మాయతో ఎలా యుద్ధము చేయవచ్చు అనేది యుధిష్టరుడైన తండ్రి నేర్పిస్తారు. ఇది ఈ సమయంలో యుద్ధ మైదానం కదా. కామము మహాశత్రువు, దీనిని జయిస్తే మీరు జగత్ జీతులుగా అవుతారు అని తండ్రి చెప్తారు. మీరు నోటితో ఏమీ జపించవలసిన అవసరము లేదు, నిశ్శబ్దముగా ఉండాలి. భక్తిమార్గంలో ఎంతగా శ్రమిస్తారు. లోపల రామ-రామ అని జపిస్తూ ఉంటారు, దానినే నవవిధ భక్తి అని అంటారు. బాబా మనల్ని తన మాలలోని వారిగా తయారుచేస్తున్నారని మీకు తెలుసు. మీరు రుద్ర మాలలోని మణులుగా అయ్యేటటువంటివారు, దానినే తర్వాత పూజిస్తారు. రుద్రమాల మరియు రుండమాల తయారవుతుంది. విష్ణుమాలను రుండమాల అని అంటారు. మీరు విష్ణు మెడలోని హారంగా అవుతారు. ఎలా అవుతారు? పరుగులో గెలిచినప్పుడు అవుతారు. తండ్రిని స్మృతి చేయాలి మరియు 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవాలి. తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమౌతాయి. మీరు ఎటువంటి లైట్ హౌస్ లు. ఒక కంటిలో ముక్తిధామము, మరొక కంటిలో జీవన్ముక్తిధామము. ఈ చక్రాన్ని తెలుసుకోవడంతో మీరు చక్రవర్తి రాజులుగా, సుఖధామానికి యజమానులుగా అవుతారు. ఇప్పుడు ఆత్మలైన మేము మా ఇంటికి వెళ్తాము అని మీ ఆత్మ అంటుంది. ఇంటిని స్మృతి చేస్తూ- స్మృతి చేస్తూ చేస్తూ వెళ్ళిపోతారు. ఇది స్మృతియాత్ర. మీ యాత్ర ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉందో చూడండి. మనమిలా కూర్చుని-కూర్చుని క్షీరసాగరములోకి వెళ్ళిపోతామని బాబాకు తెలుసు. విష్ణువును క్షీరసాగరములో చూపిస్తారు కదా. తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ క్షీరసాగరములోకి వెళ్ళిపోతారు. ఇప్పుడైతే క్షీరసాగరము లేదు. ఎవరైతే కొలనును తయారుచేసారో, వారు తప్పకుండా అందులో క్షీరాన్ని (పాలు) పోసి ఉంటారు. ఇదివరకు పాలు చాలా చౌకగా లభించేవి. ఒక్క పైసాకు లోటా నిండుగా లభించేవి. మరి కొలను ఎందుకు నిండి ఉండదు. ఇప్పుడు పాలు ఎక్కడ ఉన్నాయి. అంతా నీరు నీరుగా అయిపోయింది. బాబా నేపాల్ లో చూశారు - చాలా పెద్ద విష్ణువు చిత్రము ఉంది. దానిని నల్లగానే తయారుచేసారు. ఇప్పుడు మీరు స్మృతియాత్ర ద్వారా మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పడం ద్వారా విష్ణుపురికి యజమానులుగా అవుతున్నారు. దైవీగుణాలను కూడా ఇక్కడే ధారణ చేయాలి. ఇది పురుషోత్తమ సంగమయుగము. చదువుకుంటూ-చదువుకుంటూ మీరు పురుషోత్తములుగా అయిపోతారు. ఆత్మ కనిష్టత తొలగిపోతుంది. బాబా ప్రతిరోజూ అర్థం చేయిస్తారు - నషా ఎక్కాలి. బాబా, పురుషార్థము చేస్తున్నామని అంటారు. అరే, బాబా, మేము పాస్ విత్ ఆనర్ గా అయ్యి చూపిస్తాము, మీరు చింతించకండి అని హృదయపూర్వకంగా చెప్పండి కదా. ఫస్ట్ క్లాస్ పిల్లలు ఎవరైతే బాగా చదువుకుంటారో, వారి రిజిస్టరు కూడా బాగుంటుంది. బాబా, మీరు నిశ్చింతగా ఉండండి, మేము ఇలా తయారై చూపిస్తాము అని బాబాకు చెప్పండి. బాబాకు కూడా తెలుసు కదా, చాలామంది టీచర్లు చాలా ఫస్ట్ క్లాసుగా ఉన్నారు. అందరూ ఫస్ట్ క్లాసుగా అవ్వలేరు. మంచి-మంచి టీచర్లకు పరస్పరం ఒకరికొకరు తెలుసు. అందరినీ మహారథుల లైనులో తీసుకురాలేము. మంచి-మంచి పెద్ద-పెద్ద సెంటర్లు తెరిచినట్లయితే పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. కల్పక్రితం కూడా హుండి నిండింది. సావల్షాహ్ (సర్వలు మనోకామనలు తీర్చేవారు) అయిన బాబా హుండీని తప్పకుండా నింపుతారు. ఇద్దరు తండ్రులు పిల్లలు గల వారు. ప్రజాపిత బ్రహ్మాకు ఎంతమంది పిల్లలున్నారు. కొందరు పేదవారు, కొందరు సాధారణమైనవారు, కొందరు షావుకార్లు ఉన్నారు, కల్పక్రితము కూడా వీరి ద్వారానే రాజ్యము స్థాపనయ్యింది, దానిని దైవీ రాజస్థాన్ అని అంటారు. ఇప్పుడిది ఆసురీ రాజస్థాన్. విశ్వమంతా దైవీ రాజస్థాన్ గా ఉండేది, ఇన్ని ఖండాలుండేవి కావు. ఇదే ఢిల్లీ యమునా నదీ తీరములో ఉండేది, దానిని పరిస్తాన్ అని అంటారు. అక్కడ నదులు మొదలైనవి పొంగవు. ఇప్పుడైతే ఎంతగా ఉప్పొంగుతున్నాయి, ఆనకట్టలు తెగిపోతాయి. ప్రకృతికి మనము దాసుల వలె అయిపోయాము. తర్వాత మీరు యజమానులుగా అవుతారు. అక్కడ మీ పరువు తీసేందుకు మాయకు శక్తి ఉండదు. భూమికి కంపించేందుకు శక్తి ఉండదు. మీరు కూడా మహావీరులుగా అవ్వాలి. హనుమంతుడిని మహావీరుడని అంటారు కదా. మీరందరూ మహావీరులు అని బాబా అంటారు. మహావీర పిల్లలు ఎప్పుడూ చలించరు. మహావీర, మహావీరనీల మందిరాలు నిర్మించబడి ఉన్నాయి. అందరి చిత్రాలు పెట్టలేము కదా. మోడల్ రూపంలో తయారుచేసారు. ఇప్పుడు మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారుచేస్తున్నారు కనుక ఎంత సంతోషముండాలి. ఎన్ని మంచి గుణాలండాలి. అవగుణాలను తొలగించుకుంటూ వెళ్ళండి. సదా హర్షితంగా ఉండాలి. తుఫానులు అయితే వస్తాయి. తఫానులు వస్తేనే మహావీరని యొక్క శక్తి కనిపిస్తుంది. మీరు ఎంతగా దృఢంగా అవుతారో, అంతగా తుఫానులు వస్తాయి. ఇప్పుడు మీరు పురుషార్థము చేసి నంబరువారు పురుషార్థానుసారంగా మహావీరులుగా అవుతున్నారు. జ్ఞానసాగరుడు తండ్రి మాత్రమే. మిగిలిన శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తిమార్గము యొక్క సామాగ్రి. మీ కొరకు - ఇది పురుషోత్తమ సంగమయుగము. కృష్ణుని ఆత్మ ఇక్కడే కూర్చుని ఉంది. వీరు భగీరథుడు. అలాగే మీరందరూ భగీరథులు, భాగ్యశాలులు కదా. భక్తిమార్గములో తండ్రి ఎవరికైనా సాక్షాత్కారము చేయించగలరు. ఈ కారణంచేత మనుష్యులు సర్వవ్యాపి అనేశారు, ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. పిల్లలైన మీరు చాలా ఉన్నతమైన చదువు చదువుతున్నారు. అచ్ఛా!

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఆత్మపై ఏర్పడిన తుప్పును స్మృతియాత్రతో తొలగించి చాలా-చాలా ప్రియంగా అవ్వాలి. తండ్రి పట్ల ఆకర్షణ సదా ఉండే విధంగా మీ ప్రేమ ఉండాలి.

2. మాయ తుఫానులకు భయపడకూడదు, మహావీరులుగా అవ్వాలి. తమ అవగుణాలను తొలగించుకుంటూ వెళ్ళాలి, సదా హర్షితంగా ఉండాలి. ఎప్పుడూ చలించకూడదు.

వరదానము:-

తమ అధికారపు శక్తి ద్వారా త్రిమూర్తి రచనను సహయోగిగా చేసుకునే మాస్టర్ రచయిత భవ

త్రిమూర్తి శక్తులు (మనసు, బుద్ధి మరియు సంస్కారము) మాస్టర్ రచయిత అయిన మీ యొక్క రచన. వీటిని మీ అధికారపు శక్తి ద్వారా సహయోగిగా చేసుకోండి. ఏ విధంగా రాజు పనులు చేయరు, చేయిస్తారు, రాజ్య కార్యవ్యవహారాలు చేసేవారు వేరుగా ఉంటారు. అదే విధంగా ఆత్మ కూడా చేయించేది, చేసేవి ఈ విశేష త్రిమూర్తి శక్తులు. కనుక మాస్టర్ రచయిత అనే వరదానాన్ని స్మృతిలో ఉంచుకొని త్రిమూర్తి శక్తులను మరియు సాకార కర్మేంద్రియాలను సరైన మార్గంలో నడిపించండి.

స్లోగన్:-

అవ్యక్త పాలన వరదానం యొక్క అధికారాన్ని తీసుకునేందుకు స్పష్టవాదులుగా అవ్వండి.