20-10-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీరు ఆధ్యాత్మిక, ఆత్మిక గుప్త ముక్తిదళం, మీరు మొత్తం ప్రపంచానికి ముక్తినిప్పించాలి, మునిగిపోయిన నావలను తీరానికి చేర్చాలి”

ప్రశ్న:-

సంగమయుగంలో తండ్రి కల్పమంతటిలోనూ లేని ఏ విశ్వవిద్యాలయమును తెరుస్తారు?

జవాబు:-

రాజ్యాన్ని ప్రాప్తి చేసుకోవడం కోసం చదువుకునేందుకు గాడ్ ఫాదర్లీ యూనివర్సిటి లేక కాలేజిని సంగమయుగంలో తండ్రి మాత్రమే తెరుస్తారు. ఇటువంటి యూనివర్సిటి మొత్తం కల్పంలో ఉండదు. ఈ యూనివర్సిటీలో చదువు చదువుకొని మీరు డబల్ కిరీటధారులుగా, రాజులకే రాజుగా అవుతారు.

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలను మొట్టమొదట తండ్రి అడుగుతున్నారు, ఇక్కడకు వచ్చి కూర్చున్నప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తున్నారా? ఎందుకంటే మీకు ఇక్కడ ఎటువంటి వ్యాపార వ్యవహారాలు లేవు, మిత్ర-సంబంధీకులు మొదలైనవారు కూడా లేరు. మేము అనంతమైన తండ్రిని కలుసుకునేందుకు వెళ్తున్నామన్న ఆలోచనతో మీరు వస్తారు. ఎవరు అంటారు? ఆత్మ శరీరము ద్వారా అంటుంది. పారలౌకిక తండ్రి ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నారు, వీరి ద్వారా అర్థము చేయిస్తారు. ఇదొక్కసారి మాత్రమే అనంతమైన తండ్రి వచ్చి నేర్పిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ నావ తీరానికి చేరుతుంది. ప్రతి ఒక్కరి నావ మునిగిపోయి ఉంది, ఎవరు ఎంతగా పురుషార్థము చేస్తారో, అంతగా నావ తీరానికి చేరుతుంది. ఓ నావికుడా, నా నావను తీరానికి చేర్చు అని పాడుతారు కదా. వాస్తవానికి ప్రతి ఒక్కరూ తమ పురుషార్థముతో తీరానికి చేరాలి. ఏ విధంగా ఈత నేర్పిస్తే, అది నేర్చుకున్న తర్వాత తమకు తామే ఈదుతారు. అవన్నీ దైహిక విషయాలు. ఇవి ఆత్మిక విషయాలు. ఆత్మ ఇప్పుడు బురద ఊబిలో చిక్కుకుని ఉందని మీకు తెలుసు. దీని గురించి జింక ఉదాహరణ కూడా ఇస్తారు. నీరు అనుకుని వెళ్తుంది, కానీ అది బురద, కావున అందులో చిక్కుకుంటుంది. అప్పుడప్పుడు స్టీమర్లు, కార్లు మొదలైనవి కూడా బురదలో చిక్కుకుంటాయి. తర్వాత వాటిని బయటకు తీస్తారు. అలా తీసేవారిని సాల్వేషన్ ఆర్మీ (ముక్తి దళం) అని అంటారు. మీరు ఆత్మిక ముక్తి దళం. అందరూ మాయ యొక్క ఊబిలో చాలా చిక్కుకుని ఉన్నారని మీకు తెలుసు, దీనిని మాయ ఊబి అని అంటారు. దీని నుండి మీరు బయటకి ఎలా రావచ్చో తండ్రి వచ్చి అర్థము చేయిస్తారు. వారు కూడా రక్షిస్తారు, అక్కడ మనుష్యులకు మనుష్యుల సహాయము అవసరమవుతుంది. ఇక్కడైతే ఆత్మ వెళ్ళి ఊబిలో చిక్కుకుంది. దీని నుండి మీరు బయటకు ఎలా రావచ్చు అనే మార్గాన్ని తండ్రి తెలియజేస్తారు. తర్వాత ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేయవచ్చు. మీ నావ ఈ విషయ సాగరము నుండి క్షీర సాగరములోకి ఎలా వెళ్ళగలదు అని స్వయానికి మరియు ఇతరులకు మార్గాన్ని తెలియజేయాలి. సత్యయుగాన్ని క్షీరసాగరము అనగా సుఖసాగరమని అంటారు. ఇది దుఃఖ సాగరము. రావణుడు దుఃఖ సాగరంలో ముంచేస్తాడు. తండ్రి వచ్చి సుఖ సాగరములోకి తీసుకువెళ్తారు. మిమ్మల్ని ఆత్మిక ముక్తి దళమని అంటారు. మీరు శ్రీమతంపై అందరికీ మార్గాన్ని తెలియజేస్తారు. ఇద్దరు తండ్రులున్నారు, ఒకరు హద్దు తండ్రి, మరొకరు అనంతమైన తండ్రి అని ప్రతి ఒక్కరికి అర్థము చేయిస్తారు. లౌకిక తండ్రి ఉన్నా కూడా అందరూ పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు కానీ వారి గురించి ఏ మాత్రం తెలియదు. బాబా నింద చేయడం లేదు కానీ డ్రామా రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఈ సమయంలో మనుష్యమాత్రులందరూ పంచ వికారాల రూపీ ఊబిలో చిక్కుకుని ఆసురీ సంప్రదాయస్థులుగా ఉన్నారని ఇది కూడా అర్థము చేయించేందుకు మాత్రమే చెప్తారు. దైవీ సంప్రదాయస్థుల వద్దకు వెళ్ళి ఆసురీ సంప్రదాయస్థులు నమస్కరిస్తారు ఎందుకంటే వారు సంపూర్ణ నిర్వికారులు. సన్యాసులకు కూడా నమస్కరిస్తారు, వారు కూడా ఇళ్ళు-వాకిళ్ళు వదిలి వెళ్ళిపోతారు. పవిత్రంగా ఉంటారు. ఈ సన్యాసులకు మరియు దేవతలకు రాత్రి-పగలుకున్నంత తేడా ఉంది. దేవతల జన్మ కూడా యోగబలంతో జరుగుతుంది. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. ఈశ్వరుని గతి మతి అతీతమైనది, ఈశ్వరుని అంతము పొందలేము అని అందరూ అంటారు. కేవలం ఈశ్వరుడు లేక భగవంతుడు అని అంటే అంత ప్రేమ అనుభవమవ్వదు. అన్నిటికన్నా మంచి పదము "బాప్” అనగా తండ్రి. మనుష్యులకు అనంతమైన తండ్రి గురించి తెలియదు అంటే అనాథల వలె ఉన్నారు.

మనుష్యులు ఏమంటారు మరియు భగవంతుడు ఏమంటారు, అని మ్యాగజైన్లో కూడా వెలువడింది. తండ్రి ఎవ్వరినీ నిందించడం లేదు, పిల్లలకు అర్థము చేయిస్తారు, ఎందుకంటే తండ్రికి అందరి గురించి తెలుసు కదా. వీరిలో ఆసురీ గుణాలున్నాయి, పరస్పరంలో కొట్లాడుకుంటూ ఉంటారని అర్థం చేయించేందుకు చెప్తారు. ఇక్కడైతే కొట్లాడే అవసరమే లేదు. వారు కౌరవులు అనగా ఆసురీ సంప్రదాయస్థులు. ఇది దైవీ సంప్రదాయము. ముక్తి లేక జీవన్ముక్తి కోసం మనుష్యులు, మనుష్యులకు రాజయోగాన్ని నేర్పించడం జరగదు అని తండ్రి అర్థం చేయిస్తారు. ఈ సమయంలో తండ్రియే ఆత్మలైన మీకు నేర్పిస్తున్నారు. దేహాభిమానము, దేహీ అభిమానములో ఎంత తేడా ఉందో చూడండి. దేహాభిమానము వలన మీరు పడిపోతూ వచ్చారు. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి మిమ్మల్ని దేహీ అభిమానులుగా చేస్తారు. అలాగని మీకు సత్యయుగంలో దేహంతో సంబంధముండదని కాదు. అక్కడ, నేను ఆత్మను, పరమపిత పరమాత్మ సంతానాన్ని అన్న జ్ఞానముండదు. ఈ జ్ఞానము ఇప్పుడు మాత్రమే మీకు లభిస్తుంది, తర్వాత ప్రాయః లోపమైపోతుంది. మీరు మాత్రమే శ్రీమతంపై నడుచుకొని ప్రారబ్ధాన్ని పొందుతారు. తండ్రి రాజయోగాన్ని నేర్పించేందుకే వస్తారు. ఇటువంటి చదువు ఇంకేదీ ఉండదు. డబల్ కిరీటధారులైన రాజులు సత్యయుగంలో ఉంటారు, తర్వాత సింగల్ కిరీటధారుల రాజ్యముంటుంది, ఇప్పుడు ఆ రాజ్యము లేదు, ప్రజల పై ప్రజా రాజ్యముంది. ఇప్పుడు పిల్లలైన మీరు రాజ్యం కోసం చదువుతున్నారు, దీనిని గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ అని అంటారు. మీ పేరు కూడా వ్రాయబడి ఉంది. వారు గీతా పాఠశాల అని పేరు పెట్టుకుంటారు. చదివించేదెవరు? శ్రీ కృష్ణ భగవానువాచ అని అంటారు. ఇప్పుడు కృష్ణుడైతే చదివించలేరు. కృష్ణుడు స్వయం పాఠశాలలో చదువుకోవడానికి వెళ్తారు. రాకుమారి-రాకుమారులు పాఠశాలకెలా వెళ్తారు, అక్కడి భాషనే వేరుగా ఉంటుంది. అలాగని సంస్కృతములో గీత వినిపించారని కాదు. ఇక్కడైతే అనేక భాషలున్నాయి. ఎలాంటి రాజులుంటారో, వారు తమ భాషలను నడిపిస్తారు. సంస్కృత భాష రాజులెవ్వరికీ లేదు. బాబా సంస్కృతాన్ని నేర్పించరు. తండ్రి సత్యయుగము కోసం రాజయోగాన్ని నేర్పిస్తారు.

కామము మహాశత్రువు, దీనిపై విజయం పొందండి అని తండ్రి చెప్తారు. ప్రతిజ్ఞ చేయిస్తారు, ఇక్కడకు ఎవరు వచ్చినా కూడా వారి చేత ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుంది. కామంపై విజయాన్ని పొందితే మీరు జగత్ జీతులుగా అవుతారు. ఇదే ముఖ్యమైన వికారము. ఈ హింస ద్వాపరము నుండి కొనసాగుతూ వస్తుంది, దీని ద్వారానే వామమార్గము ప్రారంభమయింది. దేవతలు వామమార్గములోకి ఎలా వెళ్తారో చూపించే మందిరాలు కూడా ఉన్నాయి. అక్కడ చాలా ఛీ-ఛీ చిత్రాలు తయారుచేశారు. అయితే, వామమార్గంలోకి ఎప్పుడు వెళ్ళారో, ఆ తిథి-తారీఖులు లేవు. కామచితిపై కూర్చోవడంతో నల్లగా అవుతారని ఋజువవుతుంది కానీ నామ-రూపాలైతే మారిపోతాయి కదా. కామచితిపై ఎక్కడంతో ఇనుప యుగం వారిగా అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు పంచతత్వాలు కూడా తమోప్రధానంగా ఉన్నాయి కదా, కావున శరీరము కూడా ఆ విధంగా తమోప్రధానంగానే తయారవుతుంది. జన్మతోనే ఒకరు ఒక విధంగా, మరొకరు మరొక విధంగా అవుతారు. అక్కడైతే పూర్తిగా సుందరమైన శరీరాలుంటాయి. ఇప్పుడు తమోప్రధానంగా ఉన్న కారణంగా శరీరము కూడా అలాగే ఉంది. మనుష్యులు, ఈశ్వరా, ప్రభు మొదలైన రకరకాల పేర్లతో స్మృతి చేస్తారు కానీ పాపం వారికి అసలు తెలియదు. ఓ బాబా, వచ్చి శాంతినివ్వండి అని ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది. ఇక్కడైతే కర్మేంద్రియాలతో పాత్రను అభినయిస్తుంది కనుక శాంతి ఎలా లభిస్తుంది. విశ్వంలో లక్ష్మీనారాయణుల రాజ్యమున్నప్పుడు శాంతి ఉండేది. కానీ కల్పము ఆయుష్షు లక్షల సంవత్సరాలన్నారు కావున పాపం మనుష్యులు ఇక ఎలా అర్థము చేసుకుంటారు. వీరి (దేవతల) రాజ్యమున్నప్పుడు ఒకే రాజ్యము, ఒకే ధర్మముండేది, ఇంకే ఖండములోనూ ఒకే ధర్మము, ఒకే రాజ్యముంది అని అనరు. ఇక్కడ ఆత్మ ఒకే రాజ్యముండాలని కోరుకుంటుంది. ఇప్పుడు మనము ఒకే రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని ఆత్మలైన మీకు తెలుసు. అక్కడ మనమే మొత్తం విశ్వానికి యజమానులుగా ఉంటాము. తండ్రి మనకు అంతా ఇచ్చేస్తారు. మన నుండి రాజ్యాన్ని ఎవ్వరూ లాక్కోలేరు. మనము మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతాము. విశ్వంలో సూక్ష్మవతనము, మూలవతనము, ఏమీ ఉండవు. ఈ సృష్టిచక్రము ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. రచయిత అయిన తండ్రికి మాత్రమే దీని గురించి తెలుసు. అలాగని రచనను రచిస్తారని కాదు. పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచముగా తయారు చేసేందుకు తండ్రి సంగమయుగంలోనే వస్తారు. బాబా దూరదేశము నుండి వచ్చారు, కొత్త ప్రపంచము మన కోసమే తయారవుతుందని మీకు తెలుసు. బాబా ఆత్మలైన మనల్ని అలంకరిస్తున్నారు. వాటితో పాటు మళ్ళీ శరీరాల అలంకరణ కూడా జరుగుతుంది. ఆత్మ పవిత్రంగా అయినందుకు మళ్ళీ శరీరము కూడా సతోప్రధానమైనది లభిస్తుంది. సతోప్రధాన తత్వాలతో శరీరము తయారవుతుంది. వీరిది సతోప్రధాన శరీరము కదా కనుక సహజ సౌందర్యం ఉంటుంది. ధర్మములో శక్తి ఉంటుంది అని గాయనం కూడా జరుగుతుంది. ఇప్పుడు శక్తి ఎక్కడ నుండి లభిస్తుంది? ఒక్క దేవీ దేవతల ధర్మము నుండే శక్తి లభిస్తుంది. ఈ దేవతలే మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు, ఇతరులెవ్వరూ విశ్వానికి యజమానులుగా అవ్వరు. మీకు ఎంత శక్తి లభిస్తుంది. శివబాబా బ్రహ్మా ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారని వ్రాసి కూడా ఉంది. ఈ విషయాలు ప్రపంచములో ఎవ్వరికీ తెలియవు. నేను బ్రాహ్మణ కులాన్ని స్థాపన చేస్తాను, తర్వాత వీరిని సూర్యవంశీ రాజ్యంలోకి తీసుకొస్తాను అని తండ్రి అంటారు. ఎవరైతే బాగా చదువుకుంటారో, వారు పాస్ అయి సూర్యవంశములోకి వస్తారు. ఇవన్నీ జ్ఞానం యొక్క విషయాలు. వారు స్థూల బాణాలు, ఆయుధాలు మొదలైనవి చూపించారు. బాణాలు వేయడం కూడా నేర్చుకుంటారు. చిన్న పిల్లలకు కూడా తుపాకీ పేల్చడం నేర్పిస్తారు. మీది యోగ బాణము. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమౌతాయి అని తండ్రి అంటారు. హింస యొక్క విషయమేదీ లేదు. మీ చదువు కూడా గుప్తమైనది. మీరు ఆధ్యాత్మిక, ఆత్మిక ముక్తి దళము. ఆత్మిక సైన్యమెలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. మీరు గుప్తమైన ఆధ్యాత్మిక, ఆత్మిక, ముక్తి దళము. మీరు మొత్తం ప్రపంచానికి ముక్తినిప్పిస్తారు. అందరి నావలు మునిగిపోయి ఉన్నాయి. అంతేకానీ బంగారు లంక ఏదీ లేదు. బంగారు ద్వారక కిందకు వెళ్ళిపోయింది, అది బయటకు వస్తుందని కాదు. ద్వారకలో కూడా వీరి రాజ్యముండేది కానీ అది సత్యయుగంలో ఉండేది. సత్యయుగీ రాజుల డ్రస్సు పూర్తిగా వేరుగా ఉంటుంది, త్రేతాయుగంలో వారిది వేరొక విధంగా ఉంటుంది. రకరకాల డ్రస్సులు, రకరకాల ఆచారాలు పద్ధతులు ఉంటాయి. ప్రతి ఒక్క రాజు యొక్క ఆచార పద్ధతులు, ఎవరివి వారివి ఉంటాయి, సత్యయుగము పేరు వింటూనే మనస్సు సంతోషిస్తుంది. దానిని స్వర్గము, ప్యారడైజ్ అని అంటారు కానీ మనుష్యులకు ఏమీ తెలియదు. ముఖ్యమైనది ఈ దిల్వాడా మందిరము. ఇది యథావిధిగా ఉన్న మీ స్మృతిచిహ్నము. మోడల్స్ సదా చిన్నవిగానే తయారుచేస్తారు కదా. ఇవి పూర్తిగా ఆక్యూరేట్ మోడల్స్. శివబాబా కూడా ఉన్నారు, ఆదిదేవ్ కూడా ఉన్నారు, పైన వైకుంఠాన్ని చూపించారు. శివబాబా ఉన్నప్పుడు తప్పకుండా రథము కూడా ఉంటుంది. ఆదిదేవ్ కూర్చుని ఉన్నారని కూడా ఎవ్వరికీ తెలియదు. ఇది శివబాబా రథము. మహావీరులే రాజ్యం ప్రాప్తి చేసుకుంటారు. ఆత్మలో శక్తి ఎలా వస్తుందో కూడా మీరు ఇప్పుడే అర్థము చేసుకున్నారు. పదే-పదే స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలైన మనం సతోప్రధానంగా ఉన్నప్పుడు పవిత్రంగా ఉండేవారము. శాంతిధామము, సుఖధామములో తప్పకుండా పవిత్రంగానే ఉంటాము. ఇది ఎంతో సహజమైన విషయమని ఇప్పుడు బుద్ధిలోకి వస్తుంది. భారతదేశము సత్యయుగంలో పవిత్రంగా ఉండేది. అక్కడ అపవిత్ర ఆత్మలు ఉండలేవు. ఇంతమంది పతితాత్మలు పైకి ఎలా వెళ్తాయి. తప్పకుండా పవిత్రంగా అయ్యే వెళ్తాయి. నిప్పు అంటుకుంటుంది, అప్పుడు ఆత్మలన్నీ వెళ్ళిపోతాయి. శరీరాలు ఉండిపోతాయి. ఈ గుర్తులన్నీ కూడా ఉన్నాయి. హోలికకు అర్థము ఎవ్వరికీ తెలియదు. ప్రపంచమంతా ఇందులో స్వాహా అవ్వాలి. ఇది జ్ఞాన యజ్ఞము. జ్ఞానమనే పదాన్ని తీసేసి వారు రుద్ర యజ్ఞము అని అంటారు. వాస్తవానికి ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. ఇది బ్రాహ్మణుల ద్వారానే రచింపబడుతుంది. మీరే సత్యాతి-సత్యమైన బ్రాహ్మణులు. ప్రజాపిత బ్రహ్మాకు అందరూ సంతానమే కదా. బ్రహ్మా ద్వారానే మనుష్య సృష్టి రచింపబడుతుంది. బ్రహ్మాను గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు, వారి వంశ వృక్షముంటుంది కదా. ఏ విధంగా వేర్వేరు వంశ వృక్షాలుంటాయి కదా. మూలవతనంలో ఆత్మల వంశము, నియమానుసారము ఉంటుందని మీ బుద్ధిలో ఉంది. శివబాబా, తర్వాత బ్రహ్మా-విష్ణు-శంకరులు, తర్వాత లక్ష్మీనారాయణులు మొదలైనవారంతా మనుష్యుల వంశ వృక్షానికి చెందినవారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఆత్మిక ముక్తి దళంగా అయి స్వయానికి మరియు సర్వులకు సరైన మార్గాన్ని తెలియజేయాలి. మొత్తం ప్రపంచానికి విషయ సాగరము నుండి ముక్తినిప్పించేందుకు తండ్రికి పూర్తిగా సహాయకులుగా అవ్వాలి.

2. జ్ఞాన-యోగాలతో పవిత్రంగా అయి ఆత్మను అలంకరించుకోవాలి, శరీరాలను కాదు. ఆత్మ పవిత్రంగా అయితే శరీరం స్వతహాగానే అలంకరింపబడుతుంది.

వరదానము:-

మనసు-బుద్ధిని మన్మతం నుండి ఫ్రీ చేసుకుని సూక్ష్మ వతనాన్ని అనుభవం చేసే డబల్ లైట్ భవ

కేవలం సంకల్ప శక్తిని అనగా మనసు మరియు బుద్ధిని సదా మన్మతము నుండి ఖాళీగా ఉంచుకున్నట్లయితే ఇక్కడ ఉంటూ కూడా వతనంలోని అన్ని దృశ్యాలు, ప్రపంచంలోని ఏ దృశ్యమైనా ఎలాగైతే స్పష్టంగా కనిపిస్తుందో, అలా స్పష్టంగా అనుభవం చేస్తారు. ఈ అనుభూతి కోసం ఏ విధమైన భారాన్ని మీపై ఉంచుకోకండి, భారమంతటినీ తండ్రికిచ్చి డబల్ లైట్ గా అవ్వండి. మనసు-బుద్ధి ద్వారా సదా శుద్ధ సంకల్పాల భోజనం చేయండి. ఎప్పుడూ వ్యర్థ సంకల్పాలు లేక వికల్పాల అశుద్ధ భోజనం చేయకండి అప్పుడు భారం నుండి తేలికగా అయి ఉన్నత స్థితిని అనుభవం చేయగలరు.

స్లోగన్:-

వ్యర్థానికి ఫుల్ స్టాప్ పెట్టండి మరియు శుభ భావనల స్టాకును ఫుల్ గా ఉంచుకోండి.