26-10-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
“మధురమైనపిల్లలూ - శ్రీమతంపై భారతదేశాన్ని స్వర్గంగా
తయారుచేసే సేవ చేయాలి, మొదట స్వయాన్ని నిర్వికారిగా తయారుచేసుకోవాలి, తర్వాత
ఇతరులకు చెప్పాలి”
ప్రశ్న:-
మహావీర పిల్లలైన మీరు ఏ విషయాన్ని లెక్క చేయకూడదు? కేవలం ఏ చెకింగ్ చేసుకుంటూ
స్వయాన్ని సంభాళించుకోవాలి?
జవాబు:-
ఒకవేళ ఎవరైనా పవిత్రంగా అవ్వడంలో విఘ్నము వేసినట్లయితే, మీరు దానిని
లెక్కచేయకూడదు. నేను మహావీరునిగా అయ్యానా? నన్ను నేను మోసం చేసుకోవడం లేదు కదా?
నాకు అనంతమైన వైరాగ్యముందా? నేను నా సమానంగా తయారుచేస్తున్నానా? నాలో క్రోధము
అయితే లేదు కదా? ఇతరులకు ఏదైతే చెప్తున్నానో, అది స్వయం కూడా చేస్తున్నానా? అని
చెక్ చేసుకోండి.
గీతము:-
మిమ్మల్ని పొంది మేము మొత్తం విశ్వాన్ని పొందాము
ఓంశాంతి.
ఇందులో మాట్లాడవల్సినదేమీ లేదు, ఇది అర్థము చేసుకోవలసిన విషయము. మేము మళ్ళీ
దేవతలుగా అవుతున్నామని, సంపూర్ణ నిర్వికారులుగా అవుతున్నామని మధురాతి-మధురమైన
ఆత్మిక పిల్లలు అర్థము చేసుకుంటున్నారు. పిల్లలూ, కామమును జయించండి అనగా
పవిత్రంగా అవ్వండి అని తండ్రి వచ్చి చెప్తారు. పిల్లలు పాట విన్నారు. ఇప్పుడు
పిల్లలకు మళ్ళీ స్మృతి కలిగింది - మేము అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం
తీసుకుంటున్నాము, దీనినెవ్వరూ లాక్కోలేరు, అక్కడ లాక్కునే వారెవ్వరూ ఉండరు.
దానిని అద్వైత రాజ్యమని అంటారు. తర్వాత రావణరాజ్యము, ఇతరుల రాజ్యము వస్తుంది.
ఇప్పుడు మీరు అర్థము చేసుకుంటున్నారు. ఇతరులకు కూడా ఇలా అర్థము చేయించాలి. మనము
శ్రీమతంపై భారతదేశాన్ని మళ్ళీ నిర్వికారీగా తయారుచేస్తున్నాము. భగవంతుడు
ఉన్నతాతి ఉన్నతమైనవారని అందరూ అంటారు. వారినే తండ్రి అని అంటారు. కనుక సంపూర్ణ
నిర్వికారీ స్వర్గంగా ఉండే భారతదేశము ఇప్పుడు వికారీ నరకంగా అయిపోయిందని కూడా
అర్థం చేయించాలి మరియు వ్రాయాలి కూడా. మనము శ్రీమతంపై భారతదేశాన్ని మళ్ళీ
స్వర్గంగా తయారుచేస్తున్నాము. తండ్రి ఏదైతే చెప్తారో, దానిని నోట్ చేసుకుని,
దానిపై విచార సాగర మథనము చేసి వ్రాయడంలో సహాయం చేయాలి. భారతదేశము తప్పకుండా
స్వర్గంగా ఉండేది అని మనుష్యులు అర్థము చేసుకునే విధంగా ఏమి వ్రాయాలి? అప్పుడు
రావణరాజ్యము ఉండేది కాదు. ఇప్పుడు భారతవాసులైన మనల్ని తండ్రి నిర్వికారులుగా
తయారుచేస్తున్నారని పిల్లల బుద్ధిలో ఉంది. నేను నిర్వికారీగా అయ్యానా? నేను
ఈశ్వరుడిని మోసము చేయడం లేదు కదా? అని మొదట స్వయాన్ని పరిశీలించుకోవాలి.
ఈశ్వరుడు మనల్ని చూడరని కాదు, మీ నోటి నుండి ఈ మాటలు రాకూడదు. పవిత్రంగా
చేసేవారు పతితపావనుడైన ఒక్క తండ్రి మాత్రమే అని మీకు తెలుసు. భారతదేశము
నిర్వికారీగా ఉన్నప్పుడు స్వర్గంగా ఉండేది. ఈ దేవతలు సంపూర్ణ నిర్వికారులు కదా.
యథా రాజా రాణి తథా ప్రజలు ఉంటారు, అందుకే మొత్తం భారతదేశాన్ని స్వర్గమని అంటారు
కదా. ఇప్పుడిది నరకము. ఈ 84 జన్మల మెట్ల చిత్రము చాలా మంచిది. ఎవరైనా మంచివారికి
దీనిని కానుకగా కూడా ఇవ్వవచ్చు. గొప్పవారికి గొప్ప కానుక లభిస్తుంది కదా. కనుక
మీరు కూడా ఎవరు వచ్చినా, వారికి అర్థము చేయించి ఇలాంటి కానుకలు ఇవ్వవచ్చు.
ఎవరికైనా ఇచ్చేందుకు వస్తువులు ఎప్పుడూ తయారుగా ఉండాలి. మీ వద్ద కూడా జ్ఞానము
తయారుగా ఉండాలి. మెట్ల చిత్రములో పూర్తి జ్ఞానముంది. మనమెలా 84 జన్మలను
తీసుకున్నాము అనేది గుర్తుండాలి. ఇది అర్థము చేసుకోవలసిన విషయము కదా. ఎవరైతే
మొదట వచ్చారో వారే తప్పకుండా 84 జన్మలు తీసుకున్నారు. తండ్రి 84 జన్మల గురించి
తెలియజేసిన తర్వాత, వీరి అనేక జన్మల అంతిమంలో సాధారణ తనువులో ప్రవేశిస్తాను అని
చెప్తారు. తర్వాత వీరికి బ్రహ్మా అని పేరు పెడతాను. వీరి ద్వారా బ్రాహ్మణులను
రచిస్తాను. లేకపోతే బ్రాహ్మణులను ఎక్కడి నుండి తీసుకువస్తాను. బ్రహ్మా తండ్రి
గురించి ఎప్పుడైనా విన్నారా? తప్పకుండా భగవంతుడే అని అంటారు. బ్రహ్మా మరియు
విష్ణువులను సూక్ష్మవతనంలో చూపిస్తారు. నేను వీరి 84 జన్మల అంతిమంలో
ప్రవేశిస్తానని తండ్రి చెప్తారు. దత్తత తీసుకున్నప్పుడు పేరు మార్చడం జరుగుతుంది.
సన్యాసము కూడా చేయించడం జరుగుతుంది. సన్యాసులు కూడా సన్యాసము చేసినప్పుడు వెంటనే
అన్నీ మర్చిపోరు, తప్పకుండా గుర్తుంటాయి. మీకు కూడా గుర్తుంటాయి కానీ మీకు వాటి
పట్ల వైరాగ్యము ఉంది ఎందుకంటే ఇదంతా శ్మశానవాటికగా అవుతుందని మీకు తెలుసు, కనుక
మనము వాటిని ఎందుకు గుర్తు చేయాలి. జ్ఞానము ద్వారా అంతా బాగా అర్థము చేసుకోవాలి.
వారు కూడా జ్ఞానము ద్వారానే ఇళ్ళు వాకిళ్ళను వదిలేస్తారు. ఇళ్ళు వాకిళ్ళు ఎలా
వదిలారని వారిని అడిగితే చెప్పరు. ఇక వారిని యుక్తిగా అడగడం జరుగుతుంది - మీకు
వైరాగ్యము ఎలా వచ్చిందో మాకు వినిపిస్తే మేము కూడా అలాగే చేస్తాము. మీరు అందరికీ
పవిత్రంగా అవ్వండి అని ప్రేరణనిస్తారు, ఇకపోతే మీకు అన్నీ గుర్తున్నాయి. బాల్యము
నుండి మొదలుకొని అన్నీ చెప్పగలరు. ఈ డ్రామాలోని పాత్రధారులందరూ ఎలా
పాత్రనభినయిస్తూ వచ్చారు అనే జ్ఞానం మీ బుద్ధిలో పూర్తిగా ఉంది. ఇప్పుడు అందరి
కలియుగీ కర్మ బంధనాలు తెగిపోనున్నాయి. తర్వాత శాంతిధామానికి వెళ్ళిపోతాము.
అక్కడి నుండి మళ్ళీ అందరికీ కొత్త సంబంధాలు జోడించబడతాయి. అర్థము చేయించేందుకు
బాబా మంచి-మంచి పాయింట్లు కూడా ఇస్తూ ఉంటారు. ఈ భారతవాసులు ఆదిసనాతన దేవీ దేవతా
ధర్మమువారిగా ఉన్నప్పుడు నిర్వికారీగా ఉండేవారు, మళ్ళీ 84 జన్మల తర్వాత వికారీగా
అయ్యారు. ఇప్పుడు మళ్ళీ నిర్వికారులుగా అవ్వాలి. కానీ పురుషార్థము చేయించేవారు
కావాలి. ఇప్పుడు మీకు తండ్రి తెలియజేసారు. మీరు ఆ పిల్లలే కదా అని తండ్రి అంటారు.
పిల్లలు కూడా బాబా మీరు ఆ తండ్రినే కదా అని అంటారు. కల్పక్రితము కూడా మిమ్మల్ని
చదివించి రాజ్యభాగ్యమునిచ్చాను అని తండ్రి అంటారు. కల్ప-కల్పము ఇలా చేస్తూనే
ఉంటాను. డ్రామాలో ఏదైతే జరిగిందో, విఘ్నాలు వచ్చాయో, అవి మళ్ళీ వస్తాయి.
జీవితంలో ఏమేమి జరుగుతుందో గుర్తుంటుంది కదా. వీరికైతే అన్నీ గుర్తున్నాయి.
పల్లెటూరి పిల్లవానిగా ఉండేవాడిని, తర్వాత వైకుంఠానికి యజమానిగా అయ్యానని కూడా
చెప్తారు. వైకుంఠంలో పల్లెటూరు ఎలా ఉంటుంది అనేది మీకిప్పుడు తెలుసు. ఈ సమయంలో
మీ కొరకు ఈ పాత ప్రపంచము కూడా పల్లెటూరే కదా. వైకుంఠమెక్కడ, ఈ నరకమెక్కడ. పెద్ద
పెద్ద మహళ్ళు, బిల్డింగులు మొదలైనవి చూసి ఇదే స్వర్గమని మనుష్యులు భావిస్తారు.
ఇదంతా మట్టి, రాళ్ళు, వీటికి ఏ విలువ లేదని బాబా అంటారు. అన్నిటికన్నా ఎక్కువ
విలువ వజ్రాలకు ఉంటుంది. సత్యయుగంలో మీ బంగారు మహళ్ళు ఎలా ఉండేవో ఆలోచించండి అని
బాబా అంటారు. అక్కడ గనులన్నీ నిండుగా ఉంటాయి. లెక్కలేనంత బంగారముంటుంది. మరి
పిల్లలకెంత సంతోషం ఉండాలి. ఎప్పుడైనా వాడిపోయినట్లైతే, మిమ్మల్ని వెంటనే
సంతోషంలోకి తీసుకొచ్చేటటువంటి రికార్డులు (పాటలు) చాలా ఉన్నాయని బాబా అర్థము
చేయించారు. జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. బాబా మమ్మల్ని విశ్వానికి
యజమానులుగా చేస్తున్నారని భావిస్తారు. దానినెప్పుడూ ఎవ్వరూ లాక్కోలేరు.
అర్థకల్పము కొరకు మనము సుఖధామానికి యజమానులుగా అవుతాము. రాజు కొడుకు, నేను ఈ
హద్దు రాజ్యానికి వారసుడినని భావిస్తాడు. మేము అనంతమైన తండ్రికి వారసులమని
మీకెంత నషా ఉండాలి. తండ్రి స్వర్గస్థాపన చేస్తున్నారు, మనము 21 జన్మలకు
వారసులుగా అవుతాము. ఎంత సంతోషముండాలి. ఎవరికైతే వారసులుగా అవుతామో, వారిని కూడా
తప్పకుండా స్మృతి చేయాలి. స్మృతి చేయకపోతే వారసులుగా అవ్వలేరు. స్మృతి చేస్తేనే
పవిత్రంగా అవుతారు, అప్పుడే వారసులుగా అవ్వగలరు. మనము శ్రీమతంపై విశ్వానికి
యజమానులుగా, డబల్ కిరీటధారులుగా అవుతామని మీకు తెలుసు. జన్మజన్మాంతరాలు మనము
రాజ్యం చేస్తాము. మనుష్యులు భక్తిమార్గములో వినాశీ దాన-పుణ్యాలు చేస్తారు. మీది
అవినాశీ జ్ఞాన ధనము. మీకు ఎంత గొప్ప లాటరీ లభిస్తుంది. కర్మల అనుసారంగా ఫలము
లభిస్తుంది కదా. ఎవరైనా గొప్ప రాజుకు కుమారునిగా అయితే, అది హద్దులోని పెద్ద
లాటరి అని అంటారు. సింగిల్ కిరీటము వారు పూర్తి విశ్వానికి యజమానులుగా అవ్వలేరు.
మీరు డబల్ కిరీటధారులుగా, విశ్వానికి యజమానులుగా అవుతారు. ఆ సమయంలో ఇతరుల
రాజ్యమేదీ ఉండదు. ఇతర ధర్మాలు తర్వాత వస్తాయి. అవి వృద్ధి పొందేసరికి ముందు
వచ్చిన రాజులు వికారులుగా అయిన కారణంగా అభిప్రాయభేదాలతో రాజ్యాన్ని
ముక్కలు-ముక్కలుగా వేరు చేసేస్తారు. మొదట్లో విశ్వమంతటిపై ఒకే రాజ్యముండేది. ఇది
పూర్వజన్మ కర్మల ఫలమని అక్కడ ఎవ్వరూ అనరు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు
శ్రేష్ఠ కర్మలు నేర్పిస్తున్నారు. ఎవరెవరు ఎలాంటి కర్మలు చేస్తారో, సేవ చేస్తారో,
దానికి రిటర్న్ కూడా అలాగే లభిస్తుంది. మంచి కర్మలే చేయాలి. ఏదైనా అర్థం కాని
కర్మ చేయవలసి ఉంటే, దాని కోసం శ్రీమతము తీసుకోవాలి. లెటర్స్ ద్వారా పదే-పదే
అడుగుతూ ఉండాలి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టరుకు ఎన్ని పోస్టులు వస్తూ ఉంటాయో మీకు
తెలుసు. కానీ వారొక్కరే ఏమీ చదవరు. వారికి చాలామంది సెక్రెటరీలు ఉంటారు, వారు
పోస్టులన్నీ చూస్తారు. ఏవైతే చాలా ముఖ్యమైనవి ఉంటాయో, వాటిని వారు అనుమతించాక
ప్రైమ్ మినిస్టరు టేబుల్ పై పెడతారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ముఖ్యమైన
లెటర్స్ కు వెంటనే జవాబులు ఇస్తారు. మిగిలినవాటికి ప్రియస్మృతులు వ్రాస్తారు.
ఒక్కొక్కరికి విడిగా కూర్చుని జవాబులు వ్రాయడం వీలుపడదు, అది చాలా కష్టము.
పిల్లలకెంత సంతోషం కలుగుతుంది - ఓహో! ఈ రోజు అనంతమైన తండ్రి నుండి లెటర్
వచ్చింది. శివబాబా బ్రహ్మా ద్వారా జవాబునిస్తారు. పిల్లలకు చాలా సంతోషము
కలుగుతుంది. అందరికన్నా ఎక్కువగా బంధనములో ఉన్నవారు పులకరించిపోతారు. ఓహో! మేము
బంధనములో ఉన్నాము, అయినా అనంతమైన తండ్రి మాకు లెటర్ వ్రాశారు. కళ్ళకద్దుకుంటారు.
అజ్ఞానకాలంలో కూడా పతిని పరమాత్మగా భావించేవారికి పతి నుండి లెటర్ వస్తే వారు
దానిని ముద్దు పెట్టుకుంటారు. మీలో కూడా కొంతమంది పిల్లలకు బాప్ దాదా లెటర్
చూస్తే ఒక్కసారిగా రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ప్రేమ అశ్రువులు వచ్చేస్తాయి,
ముద్దు పెట్టుకుంటారు, కళ్ళకద్దుకుంటారు. చాలా ప్రేమగా ఆ ఉత్తరాన్ని చదువుతారు.
బంధనములో ఉన్నవారు ఏమైనా తక్కువా. కొంతమంది పిల్లలపై మాయ విజయము పొందుతుంది.
మేమైతే తప్పకుండా పవిత్రంగా అవ్వాలని కొంతమంది భావిస్తారు. భారతదేశము
నిర్వికారీగా ఉండేది కదా, ఇప్పుడు వికారీగా ఉంది. ఇప్పుడు ఎవరైతే నిర్వికారీగా
అవ్వవలసి ఉందో, వారే కల్పక్రితము వలె పురుషార్థము చేస్తారు. పిల్లలైన మీకు అర్థం
చేయించడం చాలా సహజము. మీ ప్లాను కూడా ఇదే కదా. గీతాయుగము నడుస్తుంది. గీతా యుగమే
పురుషోత్తమ యుగమని గాయనము చేయబడుతుంది. ఇది గీత యొక్క పురుషోత్తమ యుగమని కూడా
మీరు వ్రాయండి. ఇప్పుడు పాత ప్రపంచము మారి కొత్తదిగా అవుతుంది. అనంతమైన తండ్రి
మాకు టీచరు కూడా, వారి నుండి మేము రాజయోగము నేర్చుకుంటున్నామని మీ బుద్ధిలో ఉంది.
బాగా చదువుకుంటే డబల్ కిరీటధారులుగా అవుతారు. ఇది ఎంత పెద్ద స్కూలు. రాజ్యము
స్థాపనవుతుంది. ప్రజలు కూడా తప్పకుండా అనేక రకాలుగా ఉంటారు. రాజ్యము వృద్ధి
చెందుతూ ఉంటుంది. జ్ఞానము తక్కువగా తీసుకున్నవారు వెనుక వస్తారు. ఎవరు ఎంతగా
పురుషార్థము చేస్తారో, వారు అంతగా ముందు వస్తూ ఉంటారు. ఇదంతా తయారై-తయారవుతున్న
ఆట. ఈ డ్రామా చక్రము రిపీట్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు తండ్రి నుండి వారసత్వము
తీసుకుంటున్నారు. పవిత్రంగా అవ్వండి అని తండ్రి అంటారు. ఇందులో ఎవరైనా విఘ్నాలు
కలిగిస్తే, వాటిని లెక్కచేయకండి. రొట్టెముక్క అయితే లభిస్తుంది కదా. పిల్లలు
పురుషార్థము చేయాలి, అప్పుడు స్మృతి ఉంటుంది. బాబా భక్తిమార్గములోని ఉదాహరణ
తెలియజేస్తున్నారు - పూజా సమయంలో బుద్ధియోగం బయటకు వెళ్తే తమ చెవిని
పట్టుకునేవారు, చెంపదెబ్బ వేసుకునేవారు. ఇప్పుడిది జ్ఞానము. ఇందులో కూడా
ముఖ్యమైన విషయము స్మృతి. స్మృతి ఉండటం లేదు అంటే స్వయానికి చెంపదెబ్బ వేసుకోవాలి.
మాయ నా పై ఎందుకు విజయం పొందుతుంది. నేను అంత కచ్చా (అపరిపక్వం) గా ఉన్నానా.
నేను అయితే దీనిపై విజయం పొందాలి. స్వయాన్ని బాగా సంభాళించుకోవాలి. నేనంతటి
మహావీరునిగా ఉన్నానా? అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. ఇతరులను కూడా మహావీరులుగా
చేసే పురుషార్థము చేయాలి. ఎంతగా అనేకులను తమ సమానంగా తయారుచేస్తారో, అంత ఉన్నత
హోదా ఉంటుంది. మీ రాజ్యభాగ్యాన్ని తీసుకునేందుకు రేస్ చేయాలి. ఒకవేళ నాలోనే
క్రోధముంటే, ఇతరులను క్రోధం చేయకండి అని ఎలా చెప్పగలరు. అది సత్యత కాదు కదా.
సిగ్గు కలగాలి. ఇతరులకు అర్థం చేయిస్తే వారు ఉన్నత పదవిని పొంది, నేను క్రిందనే
ఉండిపోతే, ఇదేమైనా పురుషార్థమా! (పండితుని కథ) తండ్రిని స్మృతి చేస్తూ మీరు ఈ
విషయసాగరము నుండి క్షీరసాగరములోకి వెళ్ళిపోతారు. ఈ ఉదాహరణలన్నీ తండ్రి కూర్చొని
అర్థం చేయిస్తారు, ఇవి మళ్ళీ భక్తి మార్గములో రిపీట్ చేస్తారు. భ్రమరి ఉదాహరణ
కూడా ఉంది. మీరు బ్రాహ్మణీలు కదా - బి.కె.లు సత్యాతి-సత్యమైన బ్రాహ్మణులు.
ప్రజాపిత బ్రహ్మా ఎక్కడ ఉన్నారు? తప్పకుండా ఇక్కడే ఉంటారు కదా. అక్కడ ఉండరు.
పిల్లలైన మీరు చాలా తెలివివైనవారిగా అవ్వాలి. మనుష్యులను దేవతలుగా చేయడం బాబా
ప్లాను. ఈ చిత్రాలు కూడా అర్థము చేయించేందుకు ఉన్నాయి. వీటిలో కూడా ఈ విధంగా
రాసి ఉండాలి. ఇది గీతా భగవంతుని ప్లాను కదా. బ్రాహ్మణులైన మనము పిలక వంటి వారము.
ఇది ఒక్కరి విషయం కాదు. ప్రజాపిత బ్రహ్మా ఉన్నారు కనుక బ్రాహ్మణులు పిలక వంటి
వారు కదా. బ్రహ్మా బ్రాహ్మణుల తండ్రి. ఈ సమయంలో చాలా పెద్ద కుటుంబము ఉంటుంది కదా.
తర్వాత మీరు దైవీ కుటుంబములోకి వస్తారు. ఈ సమయంలో మీకు చాలా సంతోషం ఉంటుంది
ఎందుకంటే లాటరీ లభిస్తుంది. మీకు చాలా పేర్లున్నాయి. వందేమాతరం, శివశక్తి సైన్యం
మీరే కదా. అవన్నీ అసత్యమైనవి. చాలామంది ఉన్న కారణంగా తికమకపడతారు, అందుకే
రాజధాని స్థాపన చేయడంలో శ్రమ కలుగుతుంది. ఈ డ్రామా తయారుచేయబడింది అని తండ్రి
అంటారు. ఇందులో నా పాత్ర కూడా ఉంది. నేను సర్వశక్తివంతుడను. నన్ను స్మృతి చేస్తే
మీరు పవిత్రంగా అయిపోతారు. అందరికన్నా పెద్ద అయస్కాంతము శివబాబా, వారే ఉన్నతాతి
ఉన్నతంగా ఉంటారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మేము 21 జన్మలకు అనంతమైన తండ్రికి వారసులుగా అయ్యాము అనే నషాలో మరియు
సంతోషంలో సదా ఉండాలి, ఎవరికైతే వారసులుగా అయ్యారో, వారిని స్మృతి కూడా చేయాలి
మరియు పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి.
2. తండ్రి ఏవైతే శ్రేష్ఠ కర్మలు నేర్పిస్తున్నారో, ఆ కర్మలే చేయాలి. శ్రీమతం
తీసుకుంటూ ఉండాలి.
వరదానము:-
మనసుపై పూర్తి అటెన్షన్ ను ఉంచే, ఎక్కేకళ యొక్క అనుభవీ
విశ్వపరివర్తక భవ
ఇప్పుడు చివరి సమయంలో మనసు ద్వారానే విశ్వపరివర్తనకు నిమిత్తంగా అవ్వాలి, కనుక
ఇప్పుడు మనసు ద్వారా ఒక్క సంకల్పము వ్యర్థమైనా కూడా చాలా పోగొట్టుకున్నట్లు,
ఒక్క సంకల్పాన్ని కూడా సాధారణ విషయంగా భావించకండి, వర్తమాన సమయంలో సంకల్పాల
అలజడి కూడా పెద్ద అలజడిగా లెక్కించబడుతుంది ఎందుకంటే ఇప్పుడు సమయం మారిపోయింది,
పురుషార్థపు వేగం కూడా మారిపోయింది కనుక సంకల్పాలలోనే ఫుల్ స్టాప్ అవసరము.
మనసుపై అంత అటెన్షన్ ఉన్నప్పుడు ఎక్కేకళ ద్వారా విశ్వపరివర్తకులుగా అవ్వగలరు.
స్లోగన్:-
కర్మలో యోగము అనుభవమవ్వడమనగా కర్మయోగీగా అవ్వడం.
|
|