23-10-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - శ్రేష్ఠాతి శ్రేష్ఠంగా అయ్యేందుకు స్వయం భగవంతుడు మీకు శ్రేష్ఠ మతాన్నిస్తున్నారు, దీని ద్వారా మీరు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతారు”

ప్రశ్న:-

దేవతలుగా అయ్యే పిల్లలు విశేషంగా ఏ విషయాలపై ధ్యానముంచాలి?

జవాబు:-

ఎప్పుడూ ఏ విషయములోనూ అలగకూడదు, ముఖాన్ని శవం వలె చేసుకోకూడదు. ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు. దేవతగా అవ్వాలంటే నోటి నుండి సదా పుష్పాలే వెలువడాలి. ఒకవేళ ముళ్ళు లేక రాళ్ళు వెలువడితే ఇక మీరు రాళ్ళుగానే ఉండిపోతారు. చాలా మంచి గుణాలు ధారణ చేయాలి. ఇక్కడే సర్వ గుణసంపన్నులుగా అవ్వాలి. శిక్షలు అనుభవిస్తే ఇక మంచి పదవి లభించదు.

ఓంశాంతి. కొత్త విశ్వానికి లేక కొత్త ప్రపంచానికి యజమానులుగా అయ్యే ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. అనంతమైన వారసత్వమునిచ్చేందుకు తండ్రి వచ్చారని పిల్లలకు తెలుసు. మనము యోగ్యులుగా ఉండేవారిమి కాదు. ఓ ప్రభూ, నేను యోగ్యుడిని కాను, నన్ను యోగ్యునిగా తయారుచేయండి అని అంటారు. మీరూ మనుష్యులే, ఈ దేవతలు కూడా మనుష్యులే కానీ వీరిలో దైవీ గుణాలున్నాయి అని తండ్రి పిల్లలకు అర్థము చేయిస్తారు. వీరిని సత్యాతి-సత్యమైన మనుష్యులని అంటారు. మనుష్యులలో ఆసురీ గుణాలున్నప్పుడు వారి నడవడిక జంతువుల వలె అయిపోతుంది. దైవీ గుణాలు లేకపోతే, వారిని ఆసురీ గుణాలు ఉన్నవారని అంటారు. ఇప్పుడు తండ్రి వచ్చి మళ్ళీ మిమ్మల్ని శ్రేష్ఠమైన దేవతలుగా తయారుచేస్తారు. సత్య ఖండములో ఉండే సత్యాతి-సత్యమైన మనుష్యులు ఈ లక్ష్మీనారాయణులు, వీరిని దేవతలని అంటారు. వీరిలో దైవీగుణాలున్నాయి. ఓ పతితపావనా, రండి అని కూడా పాడుతారు కానీ పావన రాజులుగా ఎలా అవుతారు, మళ్ళీ పతిత రాజులుగా ఎలా అవుతారు అనే ఈ రహస్యము ఎవ్వరికీ తెలియదు. అది భక్తి మార్గము. జ్ఞానము అయితే ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయిస్తారు మరియు ఆ విధంగా తయారుచేస్తారు. ఈ దేవతలు కూడా సత్యయుగంలో కర్మలు చేస్తారు కానీ పతిత కర్మలు చేయరు. వారిలో దైవీ గుణాలున్నాయి. ఛీ-ఛీ పనులు చేయనివారే స్వర్గవాసులుగా అవుతారు. నరకవాసులతో మాయ ఛీ-ఛీ పనులు చేయిస్తుంది. ఇప్పుడు భగవంతుడు కూర్చుని శ్రేష్ఠ కర్మలు చేయిస్తారు మరియు ఇటువంటి ఛీ-ఛీ పనులు చేయకండి అని శ్రేష్ఠ మతాన్నిస్తారు. శ్రేష్ఠాతి శ్రేష్ఠంగా అయ్యేందుకు శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన మతమునిస్తారు. దేవతలు శ్రేష్ఠమైనవారు కదా. వారు కొత్త ప్రపంచమైన స్వర్గములో ఉంటారు. ఇది కూడా మీకు నంబరువారు పురుషార్థానుసారంగా తెలుసు, అందుకే 8, 108 మరియు 16,108 మాలలు తయారవుతాయి, అలా అయినా కూడా ఎంతమంది తయారవుతారు. ఇన్ని కోట్లమంది మనుష్యులున్నారు, ఇందులో 16 వేల మంది వెలువడడం అంటే ఎంత మంది తయారైనట్లు. 1/4 శాతము కూడా లేరు. తండ్రి పిల్లలను ఎంత ఉన్నతంగా తయారుచేస్తారు, ఎటువంటి వికర్మలు చేయకండి అని రోజూ పిల్లలకు అర్థం చేయిస్తారు. మీకు ఇటువంటి తండ్రి లభించారు కనుక మీకు చాలా సంతోషముండాలి. మమ్మల్ని అనంతమైన తండ్రి దత్తత తీసుకున్నారు, మేము వారికి చెందినవారిగా అయ్యామని మీరు భావిస్తారు. తండ్రి స్వర్గ రచయిత. మరి అటువంటి స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు యోగ్యంగా, సర్వగుణ సంపన్నులుగా అవ్వాల్సి ఉంటుంది. ఈ లక్ష్మీనారాయణులు సర్వగుణ సంపన్నలుగా ఉండేవారు. వీరి యోగ్యతలను మహిమ చేయడం జరుగుతుంది, మళ్ళీ 84 జన్మల తర్వాత అయోగ్యులుగా అవుతారు. ఒక జన్మ క్రిందికి దిగినా కానీ కొంత కళ తగ్గిపోయినట్లే. అలా నెమ్మది-నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి. డ్రామా కూడా పేను వలె నడుస్తుంది కదా. మీరు కూడా నెమ్మది-నెమ్మదిగా కిందకి దిగిపోతారు, అప్పుడు 1250 సంవత్సరాలలో రెండు కళలు తగ్గిపోతాయి. ఇక తర్వాత రావణరాజ్యంలో చాలా వేగంగా కళలు తగ్గిపోతాయి. గ్రహణము పడుతుంది. సూర్య-చంద్రులకు కూడా గ్రహణము పడుతుంది కదా. అలాగని చంద్రునికి, నక్షత్రాలకు గ్రహణము పట్టదని కాదు, అందరికీ పూర్తిగా గ్రహణము పట్టి ఉంది. స్మృతి ద్వారానే గ్రహణము తొలగిపోతుంది అని ఇప్పుడు తండ్రి చెప్తారు. ఏ పాపమూ చేయకండి. మొదటి నంబరు పాపము దేహాభిమానంలోకి రావడం. ఇది కఠినమైన పాపము. పిల్లలకు ఈ ఒక్క జన్మ కోసమే శిక్షణ లభిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ప్రపంచము పరివర్తనవ్వాలి. ఇక మళ్ళీ ఇటువంటి శిక్షణ ఎప్పుడూ లభించదు. బ్యారిస్టరీ మొదలైనవాటి శిక్షణలు మీరు జన్మ-జన్మాంతరాలుగా తీసుకుంటూ వచ్చారు. పాఠశాల మొదలైనవైతే సదా ఉంటాయి. ఈ జ్ఞానము కేవలం ఒక్కసారే లభిస్తుంది. జ్ఞానసాగరుడైన తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. వారు స్వయం మరియు తమ రచన యొక్క ఆదిమధ్యాంతాల పూర్తి జ్ఞానాన్నిస్తారు. ఆత్మలైన మీరు పాత్రధారులని తండ్రి ఎంత సహజంగా అర్థము చేయిస్తారు. ఆత్మలు తమ ఇంటి నుండి వచ్చి ఇక్కడ పాత్రను అభినయిస్తాయి. దానిని ముక్తిధామమని అంటారు. స్వర్గము జీవన్ముక్తి. ఇక్కడ ఉండేది జీవనబంధనము. ఈ పదాలను కూడా యథార్థంగా గుర్తుంచుకోవాలి. మోక్షము ఎప్పుడూ లభించదు. మనుష్యులు మోక్షము లభించాలని కోరుకుంటారు అనగా రాకపోకల నుండి విముక్తులవ్వాలని అనుకుంటారు. కానీ పాత్ర నుండి ముక్తులు కాలేరు. ఇది అనాది తయారై తయారవుతున్న ఆట. ప్రపంచ చరిత్ర-భూగోళాలు యథావిధిగా రిపీట్ అవుతాయి. సత్యయుగంలో మళ్ళీ ఆ దేవతలే వస్తారు. తర్వాత వారి వెనుక ఇస్లాములు, బౌద్ధులు మొదలైనవారంతా వస్తారు. ఈ మానవ వృక్షము తయారవుతుంది. దీని బీజము పైన ఉంది. తండ్రి మనుష్య సృష్టికి బీజరూపుడు. మనుష్య సృష్టి అయితే ఎప్పుడూ ఉంటుంది కానీ సత్యయుగంలో చాలా చిన్నదిగా ఉంటుంది, తర్వాత నెమ్మది-నెమ్మదిగా చాలా వృద్ధి చెందుతూ ఉంటుంది. అచ్ఛా, మళ్ళీ చిన్నదిగా ఎలా అవుతుంది? తండ్రి వచ్చి పతితుల నుండి పావనంగా చేస్తారు. చాలా కొద్దిమంది మాత్రమే పావనంగా అవుతారు. కోటిలో ఎవరో ఒక్కరు వెలువడుతారు. అర్ధకల్పము చాలా కొద్ది మందే ఉంటారు. అర్ధకల్పంలో ఎంత వృద్ధి జరుగుతుంది. అందరికన్నా ఎక్కువగా ఈ దేవతా సంప్రదాయము వారే ఉండాలి ఎందుకంటే మొట్టమొదట వీరే వస్తారు, కానీ తండ్రినే మర్చిపోయారు కనుక వారు ఇతర ధర్మాలలోకి వెళ్ళిపోతారు. ఇది ఒకే పొరపాటు గల ఆట. మర్చిపోవడంతో నిరుపేదగా అయిపోతారు. మర్చిపోతూ- మర్చిపోతూ పూర్తిగా మర్చిపోయారు. భక్తి కూడా మొదట ఒక్కరికే చేస్తారు ఎందుకంటే సర్వుల సద్గతి చేసేవారు ఒక్కరే, మరి ఇంకెవరికైనా ఎందుకు భక్తి చేయాలి. ఈ లక్ష్మీనారాయణులను కూడా తయారుచేసేవారు శివుడే కదా. కృష్ణుడెలా తయారుచేస్తారు. అది జరగదు. రాజయోగాన్ని నేర్పించేవారు కృష్ణుడు ఎలా అవుతారు. వారు సత్యయుగంలో రాకుమారుడు. ఎంత పొరపాటు చేసేశారు. బుద్ధిలో కూర్చోదు. నన్ను స్మృతి చేయండి మరియు దైవీ గుణాలు ధారణ చేయండి అని ఇప్పుడు తండ్రి అంటారు. ఆస్తికి సంబంధించిన గొడవలు మొదలైనవి ఏవైనా ఉంటే వాటిని సమాప్తము చేయండి. లేదంటే కొట్లాడుతూ-కొట్లాడుతూ ప్రాణాలు కూడా పోతాయి. వీరు (బ్రహ్మాబాబా) విడిచిపెట్టినప్పుడు ఏ గొడవ చేయలేదు అని తండ్రి అర్థం చేయిస్తారు. తక్కువ లభించినా వదిలేయండి, దానికి బదులుగా ఎంత రాజ్యం లభించింది. నాకు వినాశనము మరియు రాజ్యము యొక్క సాక్షాత్కారమైనప్పుడు ఎంతో సంతోషము కలిగింది అని బాబా చెప్తారు. నాకు విశ్వ రాజ్యాధికారమే లభిస్తుంటే ఇవన్నీ ఎంత. ఆకలితో ఎవ్వరూ మరణించరు. ధనము లేని వారు కూడా కడుపు నింపుకుంటారు కదా. మమ్మా ఏమైనా తీసుకొచ్చారా. మమ్మాను ఎంతగా గుర్తు చేసుకుంటారు. బాబా అంటారు, గుర్తు చేసుకుంటూ ఉండటం సరే కానీ మమ్మా నామ-రూపాలను గుర్తు చేయకూడదు. మేము కూడా మమ్మా వలె ధారణ చేయాలి. మేము కూడా మమ్మా వలె మంచిగా తయారై సింహాసనానికి యోగ్యులుగా తయారవ్వాలి. కేవలం మమ్మాను మహిమ చేయడంతో ఇలా తయారవ్వరు. నన్నొక్కరినే స్మృతి చేయండి, స్మృతి యాత్రలో ఉండాలి అని తండ్రి చెప్తారు. మమ్మా వలె జ్ఞానము వినిపించాలి. మీరు కూడా అటువంటి మహిమాయోగ్యులుగా తయారై చూపించినప్పుడే మమ్మా మహిమను ఋజువు చేసినట్లు. కేవలం మమ్మా-మమ్మా అని అంటే కడుపు నిండదు సరికదా ఇంకా కడుపు వీపుకు అంటుకుంటుంది. శివబాబాను స్మృతి చేస్తే కడుపు నిండుతుంది. ఈ దాదాను స్మృతి చేసినా కడుపు నిండదు. ఒక్కరినే స్మృతి చేయాలి. బలిహారం ఒక్కరిదే. సేవ కోసం యుక్తులు రచించాలి. సదా నోటి నుండి పుష్పాలే వెలువడాలి. ఒకవేళ ముళ్ళు, రాళ్ళు వెలువడినట్లయితే రాళ్ళుగానే ఉండిపోతారు. చాలా మంచి గుణాలు ధారణ చేయాలి. మీరిక్కడ సర్వ గుణసంపన్నులుగా అవ్వాలి. శిక్షలను అనుభవిస్తే తర్వాత మంచి పదవి లభించదు. తండ్రి నుండి డైరెక్టుగా వినేందుకు పిల్లలు ఇక్కడకు వస్తారు. ఇక్కడ తండ్రి తాజా-తాజా నషాను ఎక్కిస్తారు. సెంటర్లో నషా ఎక్కుతుంది, తర్వాత ఇంటికి వెళ్ళి సంబంధీకులు మొదలైనవారిని చూస్తే సమాప్తమైపోతుంది. ఇక్కడ, మేము తండ్రి పరివారంలో కూర్చున్నామని మీరు భావిస్తారు. అక్కడ ఆసురీ పరివారముంటుంది. ఎన్ని కొట్లాటలు మొదలైనవి ఉంటాయి. అక్కడకు వెళ్తూనే బురదలోకి వెళ్ళి పడతారు. ఇక్కడైతే మీరు తండ్రిని మర్చిపోకూడదు. ప్రపంచంలో సత్యమైన శాంతి ఎవ్వరికీ లభించదు. పవిత్రత, సుఖము, శాంతి, సంపదలను తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. అలాగని తండ్రి ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ అని ఆశీర్వదిస్తారు అని కాదు. ఆశీర్వాదాల వలన ఏమీ లభించదు. ఇది మనుష్యుల పొరపాటు. సన్యాసులు మొదలైనవారు కూడా ఆశీర్వాదాలివ్వలేరు. ఈ రోజు ఆశీర్వాదాలిచ్చి, రేపు వారే మరణిస్తారు. పోప్ లు కూడా ఎంత మంది ఉండి వెళ్ళిపోయారో చూడండి. గురువుల సింహాసనము కొనసాగుతూ ఉంటుంది, గురువులు చిన్నతనములో మరణిస్తే, తర్వాత వేరొకరిని నియమిస్తారు లేదా ఒక చిన్న శిష్యుడిని గురువుగా చేస్తారు. ఇక్కడ బాప్ దాదా ఇచ్చేటటువంటివారు. వారు మన వద్ద తీసుకుని ఏం చేస్తారు. తండ్రి అయితే నిరాకారుడు కదా. సాకారులు తీసుకుంటారు. ఇది కూడా అర్థము చేసుకునే విషయము. మేము శివబాబాకు ఇస్తున్నామని ఎప్పుడూ అనకూడదు. మనము శివబాబా నుండి పదమాలు తీసుకున్నాము, ఇవ్వలేదు. బాబా అయితే మీకు లెక్కలేనంత ఇస్తారు. శివబాబా దాత, మీరు వారికెలా ఇస్తారు? నేను ఇచ్చానని భావిస్తే దేహాభిమానము వచ్చేస్తుంది. మనము శివబాబా నుండి తీసుకుంటున్నాము. బాబా వద్దకు ఎంత మంది పిల్లలు వస్తారు, వారు వచ్చి ఉంటారు కావున ఏర్పాట్లు కావాలి కదా. అంటే మీరు మీ కోసమే ఇస్తున్నారు. బాబా స్వయం కోసం ఏమీ చేసుకోరు. రాజధాని కూడా మీకే ఇస్తారు కనుక మీరే చేస్తారు. మిమ్మల్ని నా కన్నా ఉన్నతంగా తయారుచేస్తాను. ఇటువంటి తండ్రిని మీరు మర్చిపోతారు. అర్ధకల్పము పూజ్యులుగా, అర్ధకల్పము పూజారులుగా అవుతారు. పూజ్యులుగా అవ్వడం వలన మీరు సుఖధామానికి యజమానులుగా అవుతారు, మళ్ళీ పూజారులుగా అవ్వడం వలన దుఃఖధామానికి యజమానులుగా అవుతారు. తండ్రి వచ్చి స్వర్గ స్థాపన ఎప్పుడు చేస్తారో ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాలు సంగమయుగీ బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. బాబా ఎంత మంచిరీతిగా అర్థం చేయిస్తారు, అయినా బుద్ధిలో కూర్చోదు. బాబా ఎలా అర్థం చేయిస్తారో, అలా యుక్తిగా అర్థం చేయించాలి. పురుషార్థము చేసి అంత శ్రేష్ఠంగా అవ్వాలి. పిల్లలలో చాలా మంచి దైవీ గుణాలుండాలి అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. ఏ విషయములోనూ అలగకూడదు, ముఖం శవము వలె చేసుకోకూడదు. ఇప్పుడిటువంటి పనులేవీ చేయకండి అని తండ్రి అంటారు. చండీ దేవీకి కూడా మేళా జరుగుతుంది. తండ్రి మతంపై నడవనివారిని చండిక అని అంటారు. దుఃఖమునిచ్చే అటువంటి చండికలకు కూడా మేళా జరుగుతుంది. మనుష్యులు అజ్ఞానులు కదా, అర్థము తెలుసుకోరు. ఎవరిలోనూ శక్తి లేదు, వారు లోపల పూర్తిగా ఖాళీగా ఉన్నారు. మీరు బాబాను మంచి రీతిగా స్మృతి చేస్తారు కనుక తండ్రి ద్వారా మీకు శక్తి లభిస్తుంది. కానీ ఇక్కడ ఉంటున్నా కూడా చాలామంది బుద్ధి బయట భ్రమిస్తూ ఉంటుంది కనుక ఈ చిత్రాల ఎదురుగా కూర్చున్నట్లయితే మీ బుద్ధి వాటిలోనే బిజీగా ఉంటుందని తండ్రి అంటారు. సృష్టిచక్రము, మెట్ల చిత్రాలను గురించి ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు - సత్యయుగంలో చాలా తక్కువ మంది మనుష్యులుంటారు, ఇప్పుడు అనేకమంది మనుష్యులున్నారని చెప్పండి. నేను బ్రహ్మా ద్వారా కొత్త ప్రపంచ స్థాపన చేయిస్తున్నాను, పాత ప్రపంచాన్ని వినాశనము చేయిస్తాను అని తండ్రి అంటారు. కూర్చొని ఈ విధంగా అభ్యాసం చేయాలి. మీ అంతట మీరే నోరు తెరవగలరు. లోపల ఏదైతే నడుస్తుందో అది బయటకు కూడా రావాలి. మూగవారైతే కాదు కదా. ఇంట్లో అరవడానికి నోరు తెరుచుకుంటుంది, జ్ఞానము వినిపించేందుకు తెరుచుకోదా! చిత్రాలైతే అందరికీ లభిస్తాయి, మీ ఇంటివారి కళ్యాణము చేసే ధైర్యము పెట్టాలి. మీ గదిని చిత్రాలతో అలంకరించినట్లయితే మీరు బిజీగా ఉంటారు. అది మీ లైబ్రరీగా అయిపోతుంది. ఇతరుల కళ్యాణము చేసేందుకు చిత్రాలు మొదలైనవి తగిలించి ఉండాలి. ఎవరు వచ్చినా వారికి అర్థము చేయించండి. మీరు చాలా సేవ చేయవచ్చు. కొద్దిగా విన్నా ప్రజలుగా అయిపోతారు. బాబా, ఉన్నతి కోసం ఇన్ని యుక్తులను తెలియజేస్తున్నారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమౌతాయి కానీ గంగలోకి వెళ్ళి పూర్తిగా మునిగినా కూడా వికర్మలు వినాశనమవ్వవు. ఇదంతా అంధశ్రద్ధ. హరిద్వార్ లో పట్టణములోని మురికి అంతా వచ్చి గంగలోనే కలుస్తుంది. సాగరములోకి ఎంత మురికి చేరుతుంది. నదులలోకి కూడా చెత్త చేరుకుంటూ ఉంటుంది, మరి వాటి ద్వారా పావనంగా ఎలా అవుతారు. మాయ అందరినీ పూర్తిగా తెలివిహీనులుగా చేసేసింది.

నన్ను స్మృతి చేయండి అని తండ్రి పిల్లలకే చెప్తారు. ఆత్మలైన మీరే ఓ పతితపావనా రండి అని పిలుస్తారు కదా. మీ శరీరానికి లౌకిక తండ్రైతే ఉన్నారు. పతితపావనుడు ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు మనల్ని పావనంగా తయారుచేసే ఆ తండ్రిని స్మృతి చేస్తాము. జీవన్ముక్తి దాత ఒక్కరే, ఇతరులెవ్వరూ కాదు. ఇంత సహజమైన విషయం యొక్క అర్థాన్ని కూడా ఎవ్వరూ తెలుసుకోరు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. నోటి నుండి జ్ఞానరత్నాలు వెలువడే అభ్యాసము చేయాలి. ఎప్పుడూ నోటి నుండి ముళ్ళు లేక రాళ్ళు వెలువడకూడదు. మీ కళ్యాణము మరియు ఇంటివారి కళ్యాణము చేసేందుకు ఇంటిని చిత్రాలతో అలంకరించాలి, వాటిపై విచార సాగర మథనము చేసి ఇతరులకు అర్థం చేయించాలి. బిజీగా ఉండాలి.

2. తండ్రి నుండి ఆశీర్వాదాలు అడిగేందుకు బదులుగా వారి శ్రేష్ఠ మతంపై నడవాలి. శివబాబాకే బలిహారము కనుక వారినే స్మృతి చేయాలి. మేము తండ్రికి ఇంత ఇచ్చామనే అభిమానము రాకూడదు.

వరదానము:-

విశ్వ కళ్యాణకారి అనే ఉన్నతమైన స్థితిలో స్థితులై వినాశ లీలను చూసే సాక్షీ ద్రష్టా భవ

అంతిమ వినాశ లీలను చూసేందుకు విశ్వకళ్యాణకారి అనే ఉన్నతమైన స్థితి కావాలి. ఈ స్థతిలో స్థితులవ్వటం వలన దేహం యొక్క సర్వ ఆకర్షణలు అనగా సంబంధాలు, పదార్థాలు, సంస్కారాలు, ప్రకృతి అలజడుల యొక్క ఆకర్షణలు సమాప్తమైపోతాయి. అటువంటి స్థితి ఏర్పడినప్పుడు సాక్షీద్రష్టగా అయి పైన స్థితిలో స్థితులై శాంతి యొక్క, శక్తి యొక్క కిరణాలను సర్వాత్మలకు ఇవ్వగలరు.

స్లోగన్:-

ఈశ్వరీయ శక్తులతో శక్తివంతులుగా అయినట్లయితే మాయ యొక్క ఫోర్సు సమాప్తమైపోతుంది.