28-10-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీరు స్వర్గానికి పాస్ పోర్ట్ తీసుకునేందుకు ఈ పాఠశాలకు వచ్చారు, ఆత్మాభిమానులుగా అయి మీ పేరును రిజిస్టరులో నోట్ చేయిస్తే స్వర్గములోకి వచ్చేస్తారు”

ప్రశ్న:-

ఏ స్మృతి లేని కారణంగా పిల్లలు తండ్రి పట్ల గౌరవమును ఉంచరు?

జవాబు:-

ఎవరినైతే మొత్తం ప్రపంచం పిలుస్తూ ఉందో, స్మృతి చేస్తూ ఉందో, ఆ ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి పిల్లలైన మన సేవలో ఉపస్థితులై ఉన్నారని చాలామంది పిల్లలకు గుర్తుండదు. ఈ నిశ్చయం నెంబరువారుగా ఉంది, ఎవరికి ఎంత నిశ్చయముంటుందో, అంత గౌరవముంచుతారు.

గీతము:-

ఎవరైతే ప్రియునితో ఉన్నారో...... (జో పియాకే సాథ్ హై......)

ఓంశాంతి. పిల్లలందరూ జ్ఞానసాగరునితో పాటే ఉన్నారు. ఇంతమంది పిల్లలు ఒకేచోట ఉండలేరు. ఎవరైతే తోడుగా ఉన్నారో, వారు సమీపంగా డైరెక్ట్ జ్ఞానమును వింటారు మరియు ఎవరైతే దూరంగా ఉన్నారో, వారికి ఆలస్యంగా లభిస్తుంది. అలాగని తోడుగా ఉన్నవారు ఎక్కువ ఉన్నతిని పొందుతారని మరియు దూరంగా ఉన్నవారు తక్కువ ఉన్నతిని పొందుతారని కాదు. ఎవరైతే దూరంగా ఉన్నారో వారు ఎక్కువగా చదువుకుంటారు మరియు ఉన్నతిని పొందుతారు అనేది ప్రాక్టికల్ గా చూడడం జరిగింది. అనంతమైన తండ్రి తప్పకుండా ఇక్కడే ఉన్నారు. బ్రాహ్మణ పిల్లలలో కూడా నెంబరువారుగా ఉన్నారు. పిల్లలు దైవీగుణాలను కూడా ధారణ చేయాలి. కొంతమంది పిల్లల ద్వారా పెద్ద-పెద్ద తప్పులు జరుగుతాయి. అనంతమైన తండ్రి ఎవరినైతే మొత్తం సృష్టి స్మృతి చేస్తుందో, వారు మన సేవలో ఉపస్థితులై ఉన్నారు మరియు మనకు ఉన్నతాతి ఉన్నతంగా అయ్యే మార్గాన్ని తెలియజేస్తున్నారని కూడా తెలుసు. వారు చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు, అయినా అంతగా గౌరవాన్ని ఇవ్వరు. బంధనంలో ఉన్నవారు ఎన్ని దెబ్బలు తింటారు, ఎంత తపిస్తారు, అయినా స్మృతిలో ఉంటూ జ్ఞానాన్ని బాగా తీసుకుంటారు. వారి పదవి కూడా ఉన్నతంగా అవుతుంది. ఇది బాబా అందరి గురించి చెప్పడం లేదు, నెంబరువారు పురుషార్థనుసారంగానే ఉన్నారు. తండ్రి పిల్లలను సావధానపరుస్తారు, అందరూ ఒకే విధంగా ఉండరు. బంధనాలలో ఉండేవారు బయట ఉంటూ కూడా చాలా సంపాదన చేసుకుంటారు. ఈ పాట భక్తిమార్గంలోని వారిచే తయారుచేయబడింది. కానీ మీరు అర్థం చేసుకునే విధంగా ఉంది, ప్రియుడు ఎవరో, ఎవరికి ప్రియుడో, వారికేమి తెలుసు. ఆత్మకు స్వయం గురించే తెలియకపోకే ఇక తండ్రిని ఎలా తెలుసుకోగలదు. వారు కూడా ఆత్మనే కదా. నేను ఎవరిని, ఎక్కడ నుండి వచ్చాను అనేది కూడా తెలియదు. అందరూ దేహాభిమానులుగా ఉన్నారు. ఆత్మాభిమానులుగా ఎవ్వరూ లేరు. ఒకవేళ ఆత్మాభిమానులుగా అయినట్లయితే ఆత్మకు తన తండ్రి గురించి కూడా తెలిసి ఉండాలి. దేహాభిమానములో ఉన్న కారణంగా ఆత్మ గురించి గానీ, పరమపిత పరమాత్మ గురించి గానీ తెలియదు. ఇక్కడ పిల్లలైన మీకు తండ్రి సన్ముఖంలో కూర్చొని అర్థం చేయిస్తారు. ఇది అనంతమైన పాఠశాల. ఇక్కడ ఒకటే లక్ష్యము-ఉద్దేశ్యము ఉంది - స్వర్గ రాజ్యాధికారాన్ని ప్రాప్తి చేసుకోవడము. స్వర్గంలో కూడా చాలా పదవులుంటాయి. కొంతమంది రాజా-రాణులు, కొంతమంది ప్రజలు ఉంటారు. నేను మిమ్మల్ని మళ్ళీ ద్వికిరీటధారులుగా చేసేందుకు వచ్చాను అని తండ్రి చెప్తారు. అందరూ ద్వికిరీటధారులుగా అవ్వలేరు. ఎవరైతే బాగా చదువుకుంటారో, వారు స్వయం మేము ఈ విధంగా అవ్వగలమని లోపల భావిస్తారు. వారు సరెండర్ కూడా అవుతారు, నిశ్చయం కూడా ఉంటుంది. వీరి ద్వారా ఇటువంటి ఛీ-ఛీ పని ఏదీ జరగదని అందరూ అర్థం చేసుకుంటారు. కొందరిలో చాలా అవగుణాలుంటాయి. మేము ఇంత ఉన్నతమైన పదవిని పొందుతామని వారు అనుకోరు, అందుకే ఇక పురుషార్థమే చేయరు. మేము ఈ విధంగా అవ్వగలమా అని తండ్రిని అడిగితే, తండ్రి వెంటనే చెప్తారు. స్వయాన్ని చూసుకున్నట్లయితే, నేను తప్పకుండా ఉన్నత పదవిని పొందలేనని వెంటనే అర్థం చేసుకుంటారు. లక్షణాలు కూడా కావాలి కదా. సత్య-త్రేతా యుగాలలో ఇలాంటి విషయాలేవీ ఉండవు. అక్కడ ప్రారబ్ధం ఉంటుంది. ఆ తర్వాత వచ్చే రాజులు ఎవరైతే ఉంటారో, వారు కూడా ప్రజలను చాలా ప్రేమిస్తారు. వీరు మీ తల్లిదండ్రులు. ఇది కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. వీరు అనంతమైన తండ్రి, వీరు మొత్తం ప్రపంచాన్ని రిజిస్టరు చేసేవారు. మీరు కూడా రిజిస్టరు చేస్తారు కదా. పాస్ పోర్ట్ ఇస్తున్నారు. స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు ఇక్కడే మీకు పాస్ పోర్ట్ లభిస్తుంది. బాబా చెప్పారు - వైకుంఠానికి యోగ్యులుగా ఉన్నవారందరి ఫోటోలు ఉండాలి ఎందుకంటే మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. పక్కన కిరీటధారిగా, సింహాసనధారిగా ఉన్న మీ ఫోటో ఉండాలి. మేము ఈ విధంగా తయారవుతున్నాము. ప్రదర్శినీలు మొదలైన వాటిలో కూడా ఈ శాంపల్ పెట్టాలి - ఇదే రాజయోగము. ఎవరైనా బారిస్టర్ గా అయినట్లయితే, వారు ఒకవైపు సాధారణ డ్రస్సులో ఉండాలి, ఒకవైపు బ్యారిస్టర్ డ్రస్సులో ఉండాలి. అలాగే మీరు ఒకవైపు సాధారణంగా, ఒకవైపు ద్వికిరీటధారులుగా ఉండాలి. మీ చిత్రం ఒకటి ఉంది కదా - అందులో, మీరు ఏమి కావాలని అనుకుంటున్నారు అని ప్రశ్నిస్తారు. ఈ బ్యారిస్టర్ మొదలైనవారిగా అవ్వాలా లేక రాజులకే రాజుగా అవ్వాలా. ఇటువంటి చిత్రాలుండాలి. బ్యారిస్టర్, జడ్జ్ మొదలైనవారైతే ఇక్కడ ఉండేవారు. మీరు కొత్త ప్రపంచంలో రాజులకే రాజుగా అవ్వనున్నారు. లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా ఉంది. మనమిలా తయారవుతున్నాము. ఎంత బాగా అర్థం చేయించడం జరుగుతుంది. చిత్రాలు కూడా చాలా బాగా ఫుల్ సైజులో ఉండాలి. వారు బ్యారిస్టరీ చదువుతారు కనుక యోగము బ్యారిస్టర్ తో ఉంటుంది. బ్యారిస్టర్లుగానే అవుతారు. వీరి యోగము పరమపిత పరమాత్మునితో ఉంది కనుక ద్వికిరీటధారులుగా అవుతారు. ఇప్పుడు పిల్లలు కర్మల్లోకి రావాలి అని తండ్రి అర్థం చేయిస్తారు. లక్ష్మీనారాయణుల చిత్రము గురించి అర్థము చేయించడం చాలా సహజముగా ఉంటుంది. మనము ఈ విధంగా తయారవుతున్నాము కనుక మన కొరకు తప్పకుండా కొత్త ప్రపంచం ఉండాలి. నరకం తర్వాత స్వర్గం ఉంటుంది.

ఇప్పుడిది పురుషోత్తమ సంగమయుగము. ఈ చదువు ఎంత ఉన్నతంగా తయారు చేసేటటువంటిది, ఇందులో ధనము మొదలైనవాటి అవసరం ఉండదు. చదువు పట్ల అభిరుచి ఉండాలి. ఒక వ్యక్తి చాలా పేదవానిగా ఉండేవారు, అతని వద్ద చదువుకునేందుకు ధనం లేదు. వారు తర్వాత చదువుకుంటూ-చదువుకుంటూ కష్టపడుతూ ఎంత షావుకారుగా అయ్యారంటే, క్వీన్ విక్టోరియాకు మినిస్టర్ గా అయ్యారు. మీరు కూడా ఇప్పుడు ఎంత పేదవారు. తండ్రి ఎంత ఉన్నతంగా చదివిస్తారు. ఇక్కడ కేవలం బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయాలి. దీపాలు మొదలైనవి వెలిగించే అవసరం కూడా లేదు. ఎక్కడ కూర్చుని ఉన్నా స్మృతి చేయండి. కానీ మాయ ఎటువంటిదంటే తండ్రి స్మృతిని మరిపింపజేస్తుంది. స్మృతిలోనే విఘ్నాలు కలుగుతాయి. ఇదే యుద్ధము కదా. ఆత్మ తండ్రిని స్మృతి చేయడం ద్వారానే పవిత్రంగా అవుతుంది. చదువులో మాయ ఏమీ చేయదు. చదువు కన్నా స్మృతి యొక్క నషా ఉన్నతమైనది, అందుకే ప్రాచీన యోగం గాయనం చేయబడింది. యోగము మరియు జ్ఞానము అని అంటారు. యోగము కొరకు ఇలా-ఇలా స్మృతి చేయండి అని జ్ఞానము లభిస్తుంది. ఇంకా సృష్టిచక్ర జ్ఞానము కూడా ఉంది. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాలు ఇంకెవ్వరికీ తెలియవు. భారతదేశపు ప్రాచీన యోగము నేర్పిస్తారు. కొత్త ప్రపంచాన్ని ప్రాచీనమని అంటారు. దానిని వారు లక్షల సంవత్సరాలుగా చూపించారు. కల్పం ఆయుష్షు కూడా అనేక రకాలుగా చెప్తారు. కొందరు ఒకలా చెప్తారు, మరికొందరు మరోలా చెప్తారు. ఇక్కడ మిమ్మల్ని ఒక్క తండ్రియే చదివిస్తున్నారు. మీరు బయటకు (విదేశాలకు) వెళ్ళినా, మీకు చిత్రాలు లభిస్తాయి. వీరు వ్యాపారి కదా. బట్టపై కూడా ముద్రించవచ్చు అని బాబా అంటారు. ఒకవేళ ఎవరి వద్దనైనా పెద్ద స్క్రీన్ ప్రెస్ లేకపోతే, సగం-సగం చేయండి, ఆ తర్వాత గుర్తుపట్టలేని విధంగా కలుపుతారు. అనంతమైన తండ్రి, పెద్ద గవర్నమెంట్ చెప్తున్నారు, ఎవరైనా ముద్రించి చూపిస్తే నేను వారి పేరును ప్రసిద్ధము చేస్తాను. ఎవరైనా ఈ చిత్రాలను బట్టపై ముద్రించి విదేశాలకు తీసుకువెళ్తే మీకు ఒక్కొక్క చిత్రానికి 5-10 వేలు కూడా ఇచ్చేస్తారు. అక్కడ చాలా ధనముంది. అలాంటి చిత్రాలు తయారుచేయవచ్చు, అంత పెద్ద-పెద్ద ప్రెస్ లు ఉన్నాయి. పట్టణాలలో సీన్ సీనరీలను ఎలా ముద్రిస్తారంటే, ఇక అడగకండి. అలాగే వీటిని కూడా ముద్రించవచ్చు. ఇది చాలా ఫస్టుక్లాస్ వస్తువు - సత్యమైన జ్ఞానము అయితే వీటిలోనే ఉంది, ఇంకెవ్వరి వద్ద లేదు, ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు అని అంటారు. ఇంగ్లీషులో అర్థము చేయించేవారు కూడా తెలివైనవారుగా ఉండాలి. ఇంగ్లీషు అయితే అందరికీ తెలుసు. వారికి కూడా సందేశమైతే ఇవ్వాలి కదా. వారే వినాశనం కొరకు డ్రామానుసారంగా నిమిత్తంగా అయ్యారు. బాబా చెప్పారు, వారి వద్ద బాంబులు మొదలైనవి ఎటువంటివి ఉన్నాయంటే, ఒకవేళ వారిద్దరు పరస్పరంలో కలిసిపోతే మొత్తం విశ్వానికి యజమానులుగా అవ్వగలరు. కానీ ఈ డ్రామా ఏ విధంగా రచింపబడి ఉందంటే మీరు యోగబలం ద్వారానే విశ్వ రాజ్యాధికారం తీసుకుంటారు. ఆయుధాలు మొదలైనవాటితో విశ్వానికి యజమానులుగా అవ్వలేరు. అది సైన్సు, మీది సైలెన్స్. కేవలం తండ్రిని మరియు చక్రాన్ని స్మృతి చేయండి, తమ సమానంగా తయారుచేయండి.

పిల్లలైన మీరు యోగబలంతో విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటున్నారు. వారు తప్పకుండా పరస్పరంలో కొట్లాడుకుంటారు, మధ్యలో వెన్న మీకు లభిస్తుంది. కృష్ణుని నోటిలో వెన్న ముద్దను చూపిస్తారు. ఇద్దరు పరస్పరం కొట్లాడుకుంటారు, మధ్యలో మూడవవారు వెన్న తినేస్తారు అన్నట్లుగా చెప్పకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. మొత్తం విశ్వరాజ్యం అనే వెన్న మీకు లభిస్తుంది కనుక మీకు ఎంత సంతోషముండాలి. వాహ్ బాబా, ఈ అద్భుతమంతా మీదే. ఈ జ్ఞానము అంతా మీదే. మీరు చాలా బాగా అర్థం చేయించారు. ఆదిసనాతన దేవీదేవతా ధర్మమువారు విశ్వ రాజ్యాన్ని ఎలా ప్రాప్తి చేసుకున్నారు అనేది ఎవ్వరికీ ఆలోచనలో కూడా రాదు. ఆ సమయంలో వేరే ఏ ఖండము ఉండదు. నేను విశ్వానికి యజమానిగా అవ్వను, మిమ్మల్ని తయారుచేస్తాను అని తండ్రి చెప్తారు. మీరు చదువు ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతారు. పరమాత్మనైన నేను అశరీరిని. మీ అందరికీ శరీరాలున్నాయి. మీరు దేహధారులు. బ్రహ్మా-విష్ణు-శంకరులకు కూడా సూక్ష్మ శరీరాలున్నాయి. ఏ విధంగా మీరు ఆత్మలో, అదే విధంగా నేను కూడా పరమ ఆత్మను. నా జన్మ దివ్యమైనది మరియు అలౌకికమైనది, ఇతరులెవ్వరూ ఇటువంటి జన్మ తీసుకోరు. ఇది నిశ్చితము. ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది. ఎవరైనా ఇప్పుడు చనిపోతే, ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. డ్రామా గురించి ఎంత జ్ఞానం లభిస్తుంది. నెంబరువారుగా అర్థము చేసుకుంటారు. కొందరు మందబుద్ధికలవారుగా ఉంటారు. మూడు గ్రేడులుంటాయి కదా. చివరి గ్రేడు వారిని మందబుద్ధికలవారు అని అంటారు. వీరు ఫస్టు గ్రేడులో ఉన్నారు, వీరు సెకండు గ్రేడులో ఉన్నారని స్వయం కూడా అర్థము చేసుకుంటారు. ప్రజలలో కూడా ఇలాగే ఉంటారు. చదువైతే ఒక్కటే. ఇది చదువుకుని మేము డబల్ కిరీటధారులుగా అవుతామని పిల్లలకు తెలుసు. మనం ద్వికిరీటధారులుగా ఉండేవారము, తర్వాత సింగిల్ కిరీటధారులుగా, తర్వాత కిరీటము లేనివారిగా అయ్యాము. ఎటువంటి కర్మలో, అటువంటి ఫలము అని అంటారు. సత్యయుగంలో ఇలా అనరు. ఇక్కడ మంచి కర్మలు చేసినట్లయితే, ఒక్క జన్మ కోసం మంచి ఫలము లభిస్తుంది. కొందరు ఎలాంటి కర్మలు చేస్తారంటే, పుట్టుకతోనే రోగగ్రస్థులుగా ఉంటారు. ఇది కూడా కర్మభోగమే కదా. పిల్లలకు కర్మ, అకర్మ, వికర్మల గురించి కూడా అర్థము చేయించారు. ఇక్కడ ఎలాంటి కర్మ చేస్తారో, దానిబట్టి మంచి లేక చెడు ఫలము పొందుతారు. ఎవరైనా షావుకార్లుగా అయ్యారంటే, వారు తప్పకుండా మంచి కర్మలు చేసి ఉంటారు. ఇప్పుడు మీరు జన్మ-జన్మాంతరాల ప్రారబ్ధాన్ని తయారుచేసుకుంటారు. ఇప్పటి పురుషార్థానుసారంగా అక్కడ పేదవారు-షావుకార్ల మధ్యన వ్యత్యాసముంటుంది కదా. అది 21 జన్మల కొరకు అవినాశీ ప్రారబ్ధము. ఇక్కడ అల్పకాలానికి లభిస్తుంది. కర్మలైతే జరుగుతాయి కదా. ఇది కర్మక్షేత్రము. సత్యయుగము స్వర్గపు కర్మక్షేత్రము. అక్కడ వికర్మలే జరగవు. ఈ విషయాలన్నీ బుద్ధిలో ధారణ చేయాలి. సదా పాయింట్లు వ్రాస్తూ ఉండేవారు ఎవరో అరుదుగా ఉంటారు. చార్టు కూడా వ్రాస్తూ-వ్రాస్తూ ఇక అలసిపోతారు. పిల్లలైన మీరు పాయింట్లు వ్రాయాలి. ఇవి చాలా సూక్ష్మాతి-సూక్ష్మమైన పాయింట్లు. వీటినన్నింటినీ మీరు ఎప్పుడూ జ్ఞాపకముంచుకోలేరు, ఇవి జారిపోతాయి. ఈ పాయింటును నేను మర్చిపోయానే అని తర్వాత పశ్చాత్తాపపడతారు. అందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది. చాలామంది మర్చిపోతూ ఉంటారు, తర్వాత మరునాడు గుర్తుకొస్తాయి. పిల్లలు తమ ఉన్నతి కొరకు ఆలోచించాలి. ఎవరో అరుదుగా యథార్థ రీతిగా వ్రాస్తూ ఉంటారని బాబాకు తెలుసు. బాబా వ్యాపారి కూడా కదా. అది వినాశీ రత్నాల వ్యాపారము. ఇది జ్ఞానరత్నాల వ్యాపారము. యోగములోనే చాలా మంది పిల్లలు ఫెయిలవుతారు. ఏక్యురేట్ స్మృతిలో ఎంతో కష్టంగా గంట గంటన్నర ఉండగలుగుతారు. 8 గంటలైతే పురుషార్థము చేయాలి. పిల్లలైన మీరు శరీర నిర్వహణ కూడా చేసుకోవాలి. బాబా ప్రేయసీ-ప్రియుని ఉదాహరణ కూడా ఇచ్చారు. కూర్చుని-కూర్చునే గుర్తు చేసుకుంటారు మరియు వెంటనే ఎదురుగా వచ్చేస్తారు. ఇది కూడా ఒక రకమైన సాక్షాత్కారమే. వారు వీరిని స్మృతి చేస్తారు, వీరు వారిని స్మృతి చేస్తారు. ఇక్కడ ప్రియుడు ఒక్కరే, మీరంతా ప్రేయసులు. ఆ సుందరమైన ప్రియుడు అయితే సదా సుందరంగా ఉంటారు, సదా పవిత్రంగా ఉంటారు. యాత్రికుడినైన నేను సదా సుందరంగా ఉంటాను, మిమ్మల్ని కూడా సుందరంగా చేస్తాను అని తండ్రి అంటారు. ఈ దేవతలది సహజ సౌందర్యము. ఇక్కడ ఎలాంటి ఫ్యాషన్లు చేస్తారు. రకరకాల డ్రస్సులు ధరిస్తారు. అక్కడైతే ఏకరసమైన సహజ సౌందర్యముంటుంది. అటువంటి ప్రపంచంలోకి మీరిప్పుడు వెళ్తారు. నేను పాత పతిత దేశము, పతిత శరీరంలోకి వస్తాను అని తండ్రి అంటారు. ఇక్కడ పావన శరీరము ఉండదు. నేను వీరి అనేక జన్మల అంతిమంలో ప్రవేశించి ప్రవృత్తి మార్గాన్ని స్థాపిస్తాను అని తండ్రి అంటారు. మున్ముందు మీరు సర్వీసబుల్ గా అవుతూ ఉంటారు. పురుషార్థము చేస్తారు, తర్వాత అర్థం చేసుకుంటారు. ఇంతకుముందు కూడా ఇలాంటి పురుషార్థము చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. పురుషార్థము చేయకుండా ఏమీ లభించదు. మనం నరుని నుండి నారాయణునిగా అయ్యే పురుషార్థము చేస్తున్నామని మీకు తెలుసు. కొత్త ప్రపంచపు రాజధాని ఉండేది, ఇప్పుడు లేదు, మళ్ళీ ఉంటుంది. ఇనుప యుగము తర్వాత మళ్ళీ బంగారు యుగము తప్పకుండా ఉంటుంది. కల్పక్రితము వలె రాజధాని స్థాపన జరగాల్సిందే. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సరెండర్ అవ్వడంతో పాటు నిశ్చయబుద్ధి కలవారిగా అవ్వాలి. ఎలాంటి ఛీ-ఛీ పనినీ చేయకూడదు. లోపల ఎటువంటి అవగుణము ఉండకూడదు, అప్పుడే మంచి పదవి లభిస్తుంది.

2. జ్ఞాన రత్నాల వ్యాపారం చేసేందుకు బాబా ఏవైతే మంచి-మంచి పాయింట్లు వినిపిస్తారో, వాటిని నోట్ చేసుకోవాలి. తర్వాత వాటిని గుర్తుంచుకొని ఇతరులకు వినిపించాలి. సదా తమ ఉన్నతి గురించి ఆలోచించాలి.

వరదానము:-

వైర్ లెస్ సెట్ ద్వారా వినాశన కాలంలో అంతిమ డైరెక్షన్లను క్యాచ్ చేసే వైస్ లెస్ భవ

వినాశన సమయంలో అంతిమ డైరెక్షన్లను క్యాచ్ చేసేందుకు వైస్ లెస్ (నిర్వికారీ) బుద్ధి కావాలి. ఆ మనుష్యులు వైర్ లెస్ సెట్ ద్వారా ఒకచోటి నుండి మరొకచోటికి ధ్వనిని చేరుస్తారు. ఇక్కడ ఉన్నది వైస్ లెస్ అనే వైర్ లెస్. ఈ వైర్ లెస్ ద్వారా మీకు ఈ సురక్షిత స్థానానికి చేరుకోండి అని శబ్దము వినిపిస్తుంది. ఏ పిల్లలైతే తండ్రి స్మృతిలో వైస్ లెస్ గా ఉంటారో, ఎవరికైతే అశరీరిగా అయ్యే అభ్యాసముంటుందో, వారు వినాశనంలో వినాశనమవ్వరు కానీ స్వేచ్ఛతో శరీరాన్ని విడిచిపెడతారు.

స్లోగన్:-

యోగాన్ని పక్కన పెట్టి కర్మలో బిజీగా అవ్వడం - ఇదే నిర్లక్ష్యము.