ఓంశాంతి. దూరదేశములో నివసించేదెవరు? ఇది ఎవ్వరికీ తెలియదు. పరాయి దేశములో వచ్చేందుకు వారికి తమ స్వంత దేశము లేదా? వారు తమ దేశములోకి రారు. ఈ రావణ రాజ్యము వారికి పరాయి దేశము కదా. శివబాబా తమ దేశంలోకి రారా? అచ్ఛా, రావణునికి పరదేశమేది? దేశము ఏది? శివబాబాకు స్వంత దేశమేది, పరాయి దేశమేది? తండ్రి పరాయి దేశములో వస్తారు, అయితే వారి దేశమేది? తమ దేశమును స్థాపన చేసేందుకు వస్తారు కాని వారు తమ దేశంలోకి స్వయంగా వస్తారా? (ఒకరిద్దరు వినిపించారు). అచ్ఛా, దీనిపై అందరూ విచార సాగర మథనము చేయండి. ఇది చాలా అర్థము చేసుకునే విషయము. రావణుని పరాయి దేశమేదో చెప్పడం చాలా సులభము. రామరాజ్యములో రావణుడు ఎప్పుడూ రారు. తండ్రి రావణ దేశములోకి రావలసి వస్తుంది, ఎందుకంటే రావణ రాజ్యమును పరివర్తన చేయవలసి వస్తుంది. ఇది సంగమయుగము. వారు సత్యయుగములోనూ రారు, కలియుగములోనూ రారు. సంగమయుగములోనే వస్తారు. కనుక ఇది రాముని దేశము, రావణుని దేశము కూడా. ఈ తీరములో రాముని దేశము, ఆ తీరములో రావణుని దేశము ఉంది. ఇది సంగమయుగము కదా. ఇప్పుడు పిల్లలైన మీరు సంగమయుగములో ఉన్నారు. ఇటువైపూ లేరు, అటువైపూ లేరు. స్వయాన్ని సంగమయుగములో ఉన్నామని భావించాలి. మనకు అటువైపుతో సంబంధము లేదు. బుద్ధి ద్వారా పాత ప్రపంచం నుండి సంబంధము తెంచుకోవలసి వస్తుంది. ఉండేదైతే ఇక్కడే. కానీ ఈ పాత ప్రపంచమంతా సమాప్తమవుతుందని బుద్ధి ద్వారా తెలుసు. ఇప్పుడు నేను సంగమయుగములో ఉన్నానని ఆత్మ చెప్తుంది. తండ్రి వచ్చి ఉన్నారు, వారిని నావికుడని కూడా అంటారు. ఇప్పుడు మనము వెళ్తున్నాము. ఎలా? యోగము ద్వారా. యోగము కొరకు కూడా జ్ఞానముంది. జ్ఞానము కొరకు కూడా జ్ఞానముంది. యోగము కొరకు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని చెప్పడం జరుగుతుంది. ఇది కూడా జ్ఞానమే కదా. జ్ఞానమనగా వివరణ. తండ్రి మతమును ఇచ్చేందుకు వచ్చారు. స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్తున్నారు. ఆత్మనే 84 జన్మలు తీసుకుంటుంది. తండ్రి కూర్చుని పిల్లలకు మాత్రమే విస్తారంగా వినిపిస్తారు. ఇప్పుడీ రావణరాజ్యము సమాప్తమవ్వనున్నది. ఇక్కడ కర్మ బంధనముంది, అక్కడ కర్మ సంబంధముంటుంది. బంధనమనగా దుఃఖం యొక్క పేరు. సంబంధము సుఖము యొక్క పేరు. ఇప్పుడు కర్మ బంధనాన్ని తెంచివేయాలి. మనమిప్పుడు బ్రాహ్మణ సంబంధములో ఉన్నాము, తర్వాత దైవీ సంబంధములోకి వెళ్తామని బుద్ధిలో ఉంది. బ్రాహ్మణ సంబంధము ఈ ఒక్క జన్మలో మాత్రమే ఉంటుంది. తర్వాత 8 మరియు 12 జన్మలు దైవీ సంబంధములో ఉంటారు. ఈ జ్ఞానము బుద్ధిలో ఉంది, కనుక కలియుగ ఛీ-ఛీ కర్మ బంధనాలను నింద చేస్తూ ఉంటారు. ఈ ప్రపంచపు కర్మ బంధనాలలో ఇప్పుడిక ఉండకూడదు. ఇవన్నీ ఆసురీ కర్మ బంధనాలు - అని బుద్ధి లభిస్తుంది. మనము కూడా గుప్తంగా ఒక యాత్రలో ఉన్నాము. ఈ తండ్రి మనకు యాత్ర చేయడం నేర్పించారు, తర్వాత ఈ కర్మ బంధనాలతో అతీతమై కర్మాతీతులుగా అవుతాము. ఈ కర్మ బంధనాలిప్పుడు తెగిపోవాల్సిందే. పవిత్రంగా అయి చక్రమును అర్థము చేసుకొని చక్రవర్తి రాజులుగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేస్తాము. చదువుతున్నాము, మరి దానికి ఒక లక్ష్యము-ఉద్దేశ్యం, ప్రాలబ్ధము కూడా కావాలి కదా. మనల్ని చదివించేవారు అనంతమైన తండ్రి అని మీకు తెలుసు. అనంతమైన తండ్రి మనల్ని 5 వేల సంవత్సరాల క్రితము చదివించారు. ఇది డ్రామా కదా. ఎవరినైతే కల్ప క్రితము చదివించారో వారినే చదివిస్తారు. వస్తూ ఉంటారు, వృద్ధి చెందుతూ ఉంటారు. అందరూ అయితే సత్యయుగములోకి రారు. మిగిలిన వారంతా తిరిగి ఇంటికి వెళ్తారు. ఈ తీరములో నరకము, ఆ తీరములో స్వర్గము ఉంది. ఆ చదువులో అయితే మనము ఇక్కడ చదవుకొని, ప్రాలబ్ధము కూడా ఇక్కడే పొందుతామని అర్థం చేసుకుంటారు. ఇక్కడ మనము సంగమయుగములో చదువుకుంటున్నాము, దీని ప్రాలబ్ధము మనకు కొత్త ప్రపంచములో లభిస్తుంది. ఇది కొత్త విషయము. ప్రపంచములో దీని ప్రాలబ్ధము మాకు మరుసటి జన్మలో లభిస్తుందని ఎవ్వరూ చెప్పరు. ఈ జన్మలో చదివిన చదువుకు తర్వాత జన్మలో ప్రాలబ్ధము పొందడం కేవలం ఈ సంగమయుగములో మాత్రమే జరుగుతుంది. తండ్రి కూడా సంగమయుగములోనే వస్తారు. మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు చదువుకుంటున్నారు. జ్ఞానసాగరులైన భగవంతుడు వచ్చి, నూతన ప్రపంచము అమరపురి కొరకు ఒక్కసారి మాత్రమే చదివిస్తారు. ఇది కలియుగము, మృత్యులోకము. మనము సత్యయుగము కొరకు చదువుకుంటున్నాము. నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు. ఇది పరాయి దేశము, అది మన దేశము. ఆ స్వదేశములోకి తండ్రి వచ్చే అవసరము లేదు. ఆ దేశము పిల్లల కొరకు మాత్రమే. అక్కడ సత్యయుగంలో రావణుడు రాడు, రావణుడు మాయమైపోతాడు. మళ్ళీ ద్వాపరయుగంలో వస్తాడు. కనుక తండ్రి కూడా మాయమైపోతారు. సత్యయుగంలో వారి గురించి ఎవ్వరికీ తెలియదు. కావున స్మృతి కూడా ఎందుకు చేస్తారు. సుఖ ప్రాలబ్ధము పూర్తి అయినట్లయితే రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. దీనిని పరాయి దేశమని అంటారు.
ఇప్పుడు మనము సంగమయుగములో ఉన్నామని, మనకు దారి చూపించే తండ్రి లభించారని మీరు అర్థం చేసుకున్నారు. మిగిలినవారంతా ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. ఎవరైతే చాలా అలసిపోయి ఉంటారో, కల్పక్రితము ఈ దారిలో నడిచి ఉంటారో, వారు వస్తూ ఉంటారు. మీరు మార్గదర్శకులుగా అయి అందరికీ దారి చూపిస్తారు, ఇది ఆత్మిక యాత్రకు దారి. నేరుగా సుఖధామానికి వెళ్ళిపోతారు. మీరు పాండవ సంప్రదాయానికి చెందిన మార్గదర్శకులు. పాండవ రాజ్యమని అనరు. రాజ్యము పాండవులకూ లేదు, కౌరవులకూ లేదు. ఇరువురికీ కిరీటము లేదు. భక్తిమార్గములో ఇరువురికీ కిరీటాలిచ్చేశారు. ఒకవేళ ఇచ్చినా కౌరవులకు లైట్ కిరీటమునివ్వరు. పాండవులకు కూడా లైట్ ను ఇవ్వలేరు ఎందుకంటే ఇప్పుడింకా పురుషార్థము చేస్తున్నారు. నడుస్తూ-నడుస్తూ క్రిందపడిపోతారు, అప్పుడెవరికి ఇవ్వాలి, కనుక ఈ గుర్తులన్నీ విష్ణువుకిచ్చారు ఎందుకంటే వారు పవిత్రమైనవారు. సత్యయుగములో అందరూ పవిత్రంగా, సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు. పవిత్రతా ప్రకాశ కిరీటముంది. ఇప్పుడెవ్వరూ పవిత్రంగా లేరు. సన్యాసులు మేము పవిత్రులము అని అంటారు. కానీ ప్రపంచమైతే పవిత్రంగా లేదు కదా. వారు వికారి ప్రపంచములోనే మళ్ళీ జన్మ తీసుకుంటారు. ఇది రావణుని పతిత రాజ్యము. కొత్త ప్రపంచమైన సత్యయుగాన్ని పావన రాజ్యమని అంటారు. ఇప్పుడు పిల్లలైన మిమ్ములను తోట యజమాని అయిన తండ్రి ముళ్ళ నుండి పుష్పాలుగా తయారుచేస్తారు. వారు పతితపావనులు, నావికులు, తోట యజమాని కూడా. తోట యజమాని ముళ్ళ అడవిలోకి వచ్చారు, మీ కమాండర్ ఒక్కరే. యాదవుల చీఫ్ కమాండర్ను శంకరుడని అంటామా? వాస్తవానికి శంకరుడేమీ వినాశనము చేయించరు. సమయము ఆసన్నమైనప్పుడు యుద్ధము ప్రారంభమవుతుంది. శంకరుని ప్రేరణతో మిస్సైల్స్ మొదలైనవి తయారుచేస్తారని అంటారు. ఈ కథలన్నీ కూర్చుని తయారుచేసినవి. పాత ప్రపంచము సమాప్తమయ్యే తీరాలి. ఇల్లు పాతదైపోతే దానంతటదే క్రింద పడిపోతుంది. మనుష్యులు మరణిస్తారు. ఈ పాత ప్రపంచము కూడా సమాప్తమవ్వనున్నది. వీరందరూ అణిగిపోయి మరణిస్తారు, కొంతమంది మునిగిపోయి మరణిస్తారు. కొంతమంది షాక్ లో మరణిస్తారు. బాంబుల నుండి వచ్చిన విష వాయువులు కూడా చంపుతాయి. ఇప్పుడు వినాశనమయ్యేదే ఉందని పిల్లల బుద్ధిలో ఉంది. మనము ఆవలి తీరానికి వెళ్తున్నాము. కలియుగము పూర్తయి, సత్యయుగము స్థాపన జరిగే తీరాలి. తర్వాత అర్ధకల్పము యుద్ధాలే జరగవు.
ఇప్పుడు పురుషార్థము చేయించేందుకు తండ్రి వచ్చారు, ఇది ఆఖరి ఛాన్స్. ఆలస్యము చేస్తే అకస్మాత్తుగా మరణిస్తారు. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. అకస్మాత్తుగా కూర్చుని-కూర్చునే మనుష్యులు మరణిస్తారు. మరణించేందుకు ముందే స్మృతి యాత్ర చేయండి. ఇప్పుడు పిల్లలైన మీరు ఇంటికి వెళ్ళాలి అందుకే - పిల్లలూ, ఇంటిని స్మృతి చేయండి, దీని ద్వారా అంతమతి సోగతి అవుతుంది (అంతిమ సమయములో ఎటువంటి ఆలోచనలతో చనిపోతారో, అలాంటి గతి (జన్మ) లభిస్తుంది). ఇంటికి వెళ్ళిపోతారు అని తండ్రి చెప్తున్నారు. కానీ కేవలం ఇంటిని స్మృతి చేస్తే పాపాలు నశించవు. తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు వినాశనమై మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారు, కనుక తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. చార్టు పెట్టుకున్నట్లయితే, మొత్తం రోజంతటిలో మేము ఏం చేశాము అన్నది తెలుస్తుంది. 5-6 సంవత్సరాల వయసు నుండి మీ జీవితములో ఏమేమి చేశారో..... అది కూడా గుర్తు ఉంటుంది. అలాగని మొత్తము సమయమంతా వ్రాయాల్సి వస్తుందని కాదు. గమనముంటుంది, తోటలో కూర్చుని బాబాను స్మృతి చేసాను, దుకాణములో ఎవ్వరూ గ్రాహకులు లేనప్పుడు స్మృతిలో కూర్చున్నాను. లోపల నోట్ అవుతుంది కదా. అంతా వ్రాయాలనుకుంటే డైరీ పెట్టవలసి వస్తుంది. ఇదే ముఖ్యమైన విషయము. మనము తమోప్రధానము నుండి సతోప్రధానంగా ఎలా అవ్వాలి! పవిత్ర ప్రపంచానికి అధికారులుగా ఎలా అవ్వాలి! పతితుల నుండి పావనులుగా ఎలా అవ్వాలి! తండ్రి వచ్చి ఈ జ్ఞానమును ఇస్తున్నారు. తండ్రి ఒక్కరే జ్ఞానసాగరులు. ఇప్పుడు మీరు - బాబా, మేము మీ వారము, సదా మీ వారమే, కేవలము మర్చిపోయి దేహాభిమానులుగా అయిపోయాము, ఇప్పుడు మీరు చెప్పారు కావున మేము తిరిగి దేహీ-అభిమానులుగా అవుతాము అని అంటారు. సత్యయుగములో మనము దేహీ అభిమానులుగా ఉండేవారము. సంతోషంగా ఒక శరీరమును వదిలి మరో శరీరమును తీసుకునేవారము, కనుక పిల్లలైన మీరు ఇవన్నీ ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించేందుకు అర్హులుగా అవ్వాలి, అప్పుడు అనేకుల కళ్యాణము జరుగుతుంది. డ్రామానుసారముగా నంబరువారు పురుషార్థానుసారముగా సేవాధారులుగా అవుతున్నారని బాబాకు తెలుసు. అచ్ఛా, మీరు ఎవరైనా కల్పవృక్షము మొదలైనవి అర్థము చేయించలేకపోతే - "మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి" అని ఎవ్వరికైనా చెప్పడమైతే సహజం కదా. ఇది చాలా సహజము. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయని ఈ తండ్రి మాత్రమే చెప్తారు అని బ్రాహ్మణులైన మీరు తప్ప ఈ విషయము ఇతరులెవ్వరూ చెప్పలేరు. ఇతర మనుష్యులెవ్వరికీ ఆత్మ గురించి గానీ, పరమాత్మ తండ్రి గురించి గానీ తెలియదు. కేవలం పరమాత్మ అని చెప్తే ఎవ్వరికీ బాణము తగలదు. భగవంతుని రూపము తెలుసుకోవలసి వస్తుంది. వీరందరూ నాటకములోని పాత్రధారులు. ప్రతి ఆత్మ శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తుంది. ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకొని మళ్ళీ పాత్రను అభినయిస్తుంది. ఆ పాత్రధారులు వస్త్రాలను మార్చుకుంటూ రకరకాల పాత్రలను అభినయిస్తారు. అయితే మీరు శరీరాలను మార్చుకుంటారు. వారు స్త్రీ లేక పురుషుల వస్త్రాలను అల్పకాలము కొరకు ధరిస్తారు. ఇక్కడ పురుషుల శరీరము తీసుకుంటే మొత్తం ఆయువంతా పురుషునిగానే ఉంటారు. అది హద్దు యొక్క డ్రామా, ఇది అనంతమైన డ్రామా. మొట్టమొదటి ముఖ్యమైన విషయము - నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. యోగము అనే పదము కూడా ఉపయోగించకండి ఎందుకంటే అనేక రకాల యోగాలు నేర్చుకుంటారు. అవన్నీ భక్తి మార్గమునకు చెందినవి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి మరియు ఇంటిని స్మృతి చేయండి, అప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోతారు. శివబాబా వీరిలోకి వచ్చి శిక్షణనిస్తారు. తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ మీరు పావనమైపోతారు, తర్వాత పవిత్ర ఆత్మ ఎగిరిపోతుంది. ఎంతెంతగా స్మృతి చేసి ఉంటారో, సేవ చేసి ఉంటారో, అంతగా ఉన్నతమైన పదవిని పొందుతారు. స్మృతిలోనే ఎన్నో విఘ్నాలు వస్తాయి. పవిత్రంగా అవ్వకపోతే ధర్మరాజపురిలో శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. గౌరవము పోతుంది, పదవి కూడా భ్రష్టమైపోతుంది. చివర్లో అన్ని సాక్షాత్కారాలు జరుగుతాయి. కానీ అప్పుడు ఏమీ చేయలేరు. ఇంతగా చెప్పినా నన్ను స్మృతి చేయలేదు, పాపాలు ఉండిపోయాయి, ఇప్పుడు శిక్షలను అనుభవించు అని సాక్షాత్కారము చేయిస్తారు. అప్పుడు చదువుకునేందుకు సమయము ఉండదు. అయ్యో నేనేం చేశాను! అని బాధపడ్తారు. అనవసరంగా సమయాన్ని వృధా చేసుకున్నానని పశ్చాత్తాపపడ్తారు. కానీ శిక్షలైతే అనుభవించవలసి వస్తుంది. అప్పుడిక ఏమీ చేయలేరు. పాస్ అవ్వకపోతే ఇక అవ్వనట్లే. మళ్ళీ చదువుకునే మాటే ఉండదు. ఆ చదువులో అయితే పాస్ అవ్వకపోతే మళ్ళీ చదువుకుంటారు, ఇక్కడ చదువే పూర్తయిపోతుంది. అంతిమ సమయములో పశ్చాత్తాపపడకుండా ఉండాలంటే తండ్రి సలహానిస్తున్నారు - పిల్లలూ, బాగా చదువుకోండి. వ్యర్థ విషయాలలో మీ సమయము వృథా చేసుకోకండి. లేకపోతే చాలా పశ్చాత్తాపపడవలసి వస్తుంది. మాయ చాలా తప్పుడు పనులు చేయిస్తుంది. ఎప్పుడూ దొంగతనము చేసి ఉండరు, అది కూడా చేయిస్తుంది. మాయ నన్ను మోసం చేసింది అని తరువాత గుర్తొస్తుంది. మొదట ఫలానా వస్తువు తీసుకుందాము అని మనసులో సంకల్పము వస్తుంది. ఇది రైటా లేక రాంగా అనే బుద్ధి అయితే లభించింది. ఆ వస్తువు తీసుకుంటే రాంగ్ అవుతుంది, తీసుకోకపోతే రైట్ అవుతుంది. ఇప్పుడేం చేయాలి? పవిత్రంగా ఉండడం మంచిది కదా. సాంగత్యం వలన లూజ్ అవ్వకూడదు. మనమంతా సోదరీ-సోదరులము, కావున నామ రూపాలలో ఎందుకు చిక్కుకోవాలి. దేహాభిమానములోకి రాకూడదు. కానీ మాయ చాలా శక్తివంతమైనది. మాయ రాంగ్ పనులు చేయించే సంకల్పాలు కలిగిస్తుంది. మీరు తప్పుడు పనులు చేయకూడదని తండ్రి చెప్తారు. యుద్ధము జరుగుతుంది, క్రింద పడిపోతారు, తర్వాత రైట్ బుద్ధి రానే రాదు. మనము రైట్ పని చేయాలి. అంధులకు చేతికర్రగా అవ్వాలి. ఇది అన్నిటికంటే మంచి పని. శరీర నిర్వహణకైతే సమయముంది. రాత్రివేళ నిద్రించాలి కూడా. ఆత్మ అలసిపోతే నిదురిస్తుంది. శరీరము కూడా నిదురిస్తుంది. ఇప్పుడు శరీర నిర్వహణ కొరకు, విశ్రాంతి కొరకు సమయమైతే ఉంది. మిగిలిన సమయం నా సేవలో నిమగ్నమవ్వండి. స్మృతి చార్టును పెట్టండి. వ్రాస్తారు కూడా, మళ్ళీ నడుస్తూ-నడుస్తూ ఫెయిల్ అయిపోతారు. తండ్రిని స్మృతి చేయకపోతే, సేవ చేయకపోతే రాంగ్ కర్మలు జరుగుతూ ఉంటాయి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. వ్యర్థ విషయాలలో తమ సమయాన్ని వృథా చేసుకోకూడదు. మాయ ఎటువంటి తప్పుడు కర్మ చేయించకుండా అటెన్షన్ పెట్టాలి. సాంగత్య దోషములోకి వచ్చి ఎప్పుడూ లూజ్ అవ్వకూడదు. దేహాభిమానములోకి వచ్చి ఎవరి నామ రూపాలలో చిక్కుకోకూడదు.
2. ఇంటి యొక్క స్మృతితో పాటు తండ్రిని కూడా స్మృతి చేయాలి. స్మృతి చార్టు యొక్క డైరీని తయారుచేయాలి. రోజంతటిలో ఏమేమి చేశాను? తండ్రి స్మృతిలో ఎంత సమయము ఉన్నాను? అని నోట్ చేయాలి.