ఓంశాంతి. తెలివైన పిల్లలెవరైతే ఉన్నారో వారు ఈ భావాన్ని బాగా అర్థం చేసుకుంటారు, ఎవరి బుద్ధియోగమైతే శాంతిధామం మరియు స్వర్గం వైపు ఉంటుందో వారికే తుఫానులు వస్తాయి. తండ్రి అయితే ఇప్పుడు మీ ముఖాన్ని తిప్పుతున్నారు. అజ్ఞానకాలంలో కూడా పాత ఇంటి నుండి ముఖాన్ని తిప్పుకుని కొత్త ఇల్లు ఎప్పుడు తయారవుతుందని స్మృతి చేస్తూ ఉంటారు. ఎప్పుడు మా స్వర్గం స్థాపనవుతుంది, మళ్ళీ ఎప్పుడు సుఖధామంలోకి వస్తాము - అని ఇప్పుడు పిల్లలైన మీకు కూడా ధ్యాస ఉంది. ఈ దుఃఖధామం నుండి అయితే అందరూ వెళ్ళాల్సిందే. మొత్తం సృష్టిలోని మనుష్యులందరికీ తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు - పిల్లలూ, ఇప్పుడు స్వర్గ ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ఇప్పుడు మీ బుద్ధియోగం స్వర్గం వైపుకు వెళ్ళాలి. స్వర్గంలోకి వెళ్ళేవారిని పవిత్రులని అంటారు. నరకంలోకి వెళ్ళేవారిని అపవిత్రులని అంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా బుద్ధియోగం స్వర్గం వైపు ఉంచాలి. తండ్రి బుద్ధియోగం స్వర్గం వైపు మరియు పిల్లలది నరకం వైపు ఉన్నట్లయితే ఇరువురూ ఒకే ఇంట్లో ఎలా ఉండగలరు. హంస మరియు కొంగ కలిసి ఉండలేవు. చాలా కష్టము. వారి బుద్ధియోగం ఉన్నదే పంచ వికారాల వైపు. వీరు స్వర్గం వైపు వెళ్ళేవారు, వారు నరకం వైపు వెళ్ళేవారు, ఇద్దరూ కలిసి ఉండలేరు. చాలా గొప్ప గమ్యం. నా పిల్లల ముఖం నరకం వైపు ఉంది అని తండ్రి చూస్తారు, నరకం వైపు వెళ్ళకుండా ఉండలేరు, అప్పుడేం చేయాలి! ఇంట్లో తప్పకుండా గొడవలు జరుగుతాయి. ఇది కూడా ఒక జ్ఞానమేనా అని అంటారు. కుమారుడు వివాహం చేసుకోకూడదా...! గృహస్థ వ్యవహారంలో అయితే చాలా మంది ఉన్నారు కదా. పిల్లల ముఖం నరకం వైపు ఉంది, వారు నరకంలోకి వెళ్ళాలని అనుకుంటున్నారు. నరకం వైపు బుద్ధియోగాన్ని పెట్టుకోకండి అని తండ్రి చెప్తున్నారు. కాని తండ్రి చెప్పింది కూడా ఒప్పుకోరు. మరి ఏం చేయాలి? ఇందులో చాలా నష్టోమోహా స్థితి కావాలి. ఈ జ్ఞానమంతా ఆత్మలో ఉంది. వీరిని నేనే సృష్టించాను, నేను చెప్పింది వినడం లేదు అని తండ్రి ఆత్మ చెప్తుంది. కొంతమందికైతే బ్రాహ్మణులైన తర్వాత కూడా బుద్ధి నరకం వైపుకి వెళ్తుంది. అలాంటివారు ఒక్కసారిగా పాతాళంలోకి వెళ్ళిపోయినట్లు అవుతుంది.
ఇది జ్ఞాన సాగరుని దర్బారు అని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. భక్తిమార్గంలో ఇంద్ర దర్బారు అని కూడా గాయనం చేస్తారు. పుష్యరాగము, నీలమణి, మాణిక్యము, ఎన్నో పేర్లు పెట్టి ఉన్నాయి ఎందుకంటే జ్ఞాన నాట్యం చేస్తారు కదా. అనేక రకాల దేవ కన్యలున్నారు. వారు కూడా పవిత్రమైనవారు కావాలి. ఎవరైనా అపవిత్రులను తీసుకువచ్చినట్లయితే శిక్ష పడుతుంది. ఇందులో చాలా పావనమైనవారు కావాలి. ఈ గమ్యం ఎంతో ఉన్నతమైనది కావున ఈ వృక్షం త్వర-త్వరగా వృద్ధి చెందడం జరగదు. తండ్రి ఏ జ్ఞానాన్నైతే ఇస్తున్నారో, దాని గురించి ఎవ్వరికీ తెలియదు. శాస్త్రాలలో కూడా ఈ జ్ఞానం లేదు కావున కొద్దిగా నిశ్చయం కలిగిన వెంటనే మాయ ఒకే చెంపదెబ్బతో కింద పడేస్తుంది. తుఫాను కదా. చిన్న దీపం, దాన్ని అయితే తుఫాను ఒకే దెబ్బతో కింద పడేస్తుంది. ఇతరులను వికారాలలో పడిపోవడం చూసి స్వయం కూడాకింద పడిపోతారు. ఇందులో అయితే అర్థం చేసుకునేందుకు పెద్ద బుద్ధి కావాలి. అబలలపై అత్యాచారం జరిగిందన్న గాయనం కూడా ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, కామం మహాశత్రువు, దీనిపట్ల అయితే మీకు చాలా ద్వేషం కలగాలి. బాబా ఇప్పుడు చాలా ద్వేషం కలిగిస్తారు, ఇంతకుముందు ఈ విషయం లేదు. నరకం అయితే ఇప్పుడు ఉంది కదా. ద్రౌపది పిలిచారు అనేది ఇప్పటి విషయమే. ఎంత బాగా అర్థం చేయిస్తున్నారు, అయినా కూడా బుద్ధిలో కూర్చోవడం లేదు.
ఈ సృష్టిచక్రం యొక్క చిత్రం చాలా బాగుంది - గేట్ వే టు హెవెన్ (స్వర్గానికి దారి). ఈ సృష్టి చక్రం చిత్రం ద్వారా చాలా బాగా అర్థం చేసుకోగలరు. దీని ద్వారా ఎంతైతే అర్థం చేసుకుంటామో మెట్ల చిత్రం ద్వారా అంత అర్థం చేసుకోలేము. రోజు-రోజుకూ కరెక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ రోజు మీకు పూర్తిగా కొత్త డైరెక్షన్ ఇస్తానని తండ్రి చెప్తున్నారు. ముందు నుండే అన్ని డైరెక్షన్లు లభించవు కదా. ఇది ఎలాంటి ప్రపంచం, ఇందులో ఎంత దుఃఖముంది. పిల్లలపై ఎంత మోహముంటుంది. కొడుకు మరణిస్తే ఒక్కసారిగా పిచ్చివారిగా అయిపోతారు, అపారమైన దుఃఖము ఉంది. ధనవంతులుగా ఉన్నారు కావున సుఖంగా ఉంటారని కాదు. అనేక రకాల వ్యాధులు ఉంటూ ఉంటాయి. ఆసుపత్రులలో పడి ఉంటారు. పేదవారు జనరల్ వార్డులలో పడి ఉంటారు, ధనవంతులకు వేరుగా స్పెషల్ గదులు లభిస్తాయి. కాని దుఃఖం అయితే ధనవంతులకి ఎలా ఉంటుందో పేదవారికీ అలానే ఉంటుంది. కేవలం వారికి స్థానం మంచిది లభిస్తుంది. సంభాళన బాగా జరుగుతుంది. స్వయంగా తండ్రి మనల్ని చదివిస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రి అనేకసార్లు చదివించారు. మేము చదువుతున్నామా లేదా? ఎంతమందిని చదివిస్తున్నాము? అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. ఒకవేళ చదివించకపోతే ఏ పదవి లభిస్తుంది! ఈ రోజు ఎవ్వరికీ దుఃఖమునివ్వలేదు కదా? అని ప్రతిరోజూ చార్టును చూసుకోండి. ఎవ్వరికీ దుఃఖమునివ్వకండి మరియు అందరికీ మార్గాన్ని తెలియజేయండి అని శ్రీమతం చెప్తుంది. ఎవరైతే మన వంశానికి చెందినవారుంటారో వారికి వెంటనే టచ్ అవుతుంది. దీనికి బంగారు పాత్ర కావాలి, అందులోనే అమృతం నిలుస్తుంది. సింహం పాలు కొరకు బంగారు పాత్ర కావాలని అంటారు కదా, ఎందుకంటే ఆ పాలు చాలా గొప్ప శక్తి కలిగినవి. సింహానికి తన పిల్లలపట్ల మోహముంటుంది. ఎవరినైనా చూసినట్లయితే వారిపై ఎగిరిపడుతుంది. పిల్లలను చంపేస్తారేమో అని భావిస్తుంది. ఇక్కడ కూడా తమ పతి, పిల్లలు మొదలైనవారిపై మోహం ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని పిల్లలైన మీకు తెలుసు. శ్రీకృష్ణుని చిత్రంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఈ యుద్ధం తర్వాత స్వర్గ ద్వారాలు తెరచుకుంటాయి. అక్కడ మనుష్యులు చాలా కొద్దిమంది ఉంటారు. మిగిలిన వారందరూ ముక్తిధామానికి వెళ్ళిపోతారు. చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. ఒక్కొక్క జన్మలో చేసిన పాపాలను సాక్షాత్కారం చేయిస్తారు, శిక్షలు తింటూ ఉంటారు. తర్వాత చాలా చిన్నపదవి పొందుతారు. స్మృతిలో ఉండని కారణంగా వికర్మలు వినాశనమవ్వవు.
చాలామంది పిల్లలు మురళీని కూడా మిస్ చేస్తారు, చాలామంది పిల్లలు ఇందులో నిర్లక్ష్యంగా ఉంటారు. మేము చదవకపోతే ఏమవుతుంది, మేమైతే దాటేసాము అని అనుకుంటారు. మురళీని లెక్క చేయరు. ఇటువంటి దేహాభిమానులు చాలా మంది ఉన్నారు, వారు స్వయానికే ఎంతో నష్టం కలుగజేసుకుంటున్నారు. బాబాకు తెలుసు, కావున ఇక్కడికి వచ్చినప్పుడు, చాలా మురళీలు చదివి ఉండరు కదా అని అడుగుతూ ఉంటాను. అందులో ఏమైనా మంచి పాయింట్లు ఉండవచ్చేమో తెలియదు. పాయింట్లు అయితే రోజూ వెలువడుతూ ఉంటాయి కదా. ఇలాంటివారు కూడా చాలామంది సేవాకేంద్రాలకు వస్తారు. కాని వారికి ధారణ ఏ మాత్రమూ లేదు, జ్ఞానమూ లేదు. శ్రీమతంపై నడవకపోతే పదవి లభించదు. సత్యమైన తండ్రిని, సత్యమైన టీచరును నిందింపజేస్తే వారికి ఎప్పుడూ ఉన్నతస్థానం లభించదు. కాని అందరూ రాజులుగా అయితే అవ్వరు. ప్రజలు కూడా తయారవుతారు. నెంబరువారీగా పదవులుంటాయి కదా. అంతా స్మృతిపైనే ఆధారపడి ఉంది, ఏ తండ్రి ద్వారా విశ్వరాజ్యం లభిస్తుందో, వారిని స్మృతి చేయలేరా. అదృష్టంలోనే లేకపోతే పురుషార్థం ఏం చేస్తారు. స్మృతియాత్ర ద్వారానే పాపాలు భస్మమవుతాయి, మరి పురుషార్థం చేయాలి కదా అని తండ్రి చెప్తున్నారు. ఆహార పానీయాలు మానేయమని అయితే బాబా చెప్పడం లేదు. ఇది హఠయోగం ఏమీ కాదు. నడుస్తూ-తిరుగుతూ అన్ని కర్మలు చేస్తూ, ఎలా అయితే ప్రేయసి, ప్రియుడ్ని స్మృతి చేస్తుందో, అలాగే స్మృతిలో ఉండండి. వారికి నామ రూపాల ప్రేమ ఉంటుంది. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి యజమానులుగా ఎలా అయ్యారు? ఎవ్వరికీ తెలియదు. ఇది నిన్నటి విషయమే అని మీరంటారు. వీరు రాజ్యం చేసేవారు, మనుష్యులైతే లక్షల సంవత్సరాలని అంటారు. మాయ మనుష్యులను పూర్తిగా రాతి బుద్ధికలవారిగా చేసేసింది. మీరిప్పుడు రాతిబుద్ధి నుండి బంగారుబుద్ధి కలవారిగా తయారవుతున్నారు. పారసనాథుని మందిరం కూడా ఉంది. కాని వారెవరు, ఇది ఎవ్వరికీ తెలియదు. మనుష్యులు పూర్తిగా గాఢాంధకారంలో ఉన్నారు. ఇప్పుడు తండ్రి ఎన్ని మంచి-మంచి విషయాలను అర్థం చేయిస్తున్నారు. అర్థం చేసుకోవడమనేది మళ్ళీ ప్రతి ఒక్కరి బుద్ధిపై ఆధారపడి ఉంది. చదివించేవారైతే ఒక్కరే, చదివేవారు పెరుగుతూ ఉంటారు. వీధి-వీధిలో మీ పాఠశాల ఏర్పడుతుంది. గేట్ వే టు హెవెన్ (స్వర్గానికి దారి). మేము నరకంలో ఉన్నామని అర్థం చేసుకునే మనిషి ఒక్కరు కూడా లేరు. అందరూ పూజారులేనని తండ్రి అర్థం చేయిస్తారు. పూజ్యులు సత్యయుగంలోనే ఉంటారు. పూజారులు కలియుగంలో ఉంటారు. భగవంతుడే పూజ్యంగా, భగవంతుడే పూజారిగా అవుతారని మనుష్యులు భావిస్తారు. మీరే భగవంతుడు, మీరే ఈ ఆటంతా ఆడుతున్నారు. నీవూ భగవంతుడివే, నేనూ భగవంతుడినే. ఏమీ అర్థం చేసుకోరు, ఇది ఉన్నదే రావణరాజ్యం. మీరు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా అవుతున్నారు. పిల్లలకు ఎంతో నషా ఉండాలి. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పుణ్యాత్మలుగా అవుతారని మాత్రమే తండ్రి చెప్తున్నారు.
తండ్రి పిల్లలకు పుణ్యాత్మలుగా అయ్యేందుకు యుక్తి తెలియజేస్తున్నారు - పిల్లలూ, ఈ పాత ప్రపంచానికి ఇది అంతిమం. నేను ఇప్పుడు ప్రత్యక్షంగా వచ్చి ఉన్నాను, ఇది చివరి దానం, ఒక్కసారిగా సమర్పితం అయిపోండి. బాబా, ఇదంతా మీదే. తండ్రి అయితే ఇచ్చేందుకే చేయిస్తున్నారు, వీరికి కొంత భవిష్యత్తు తయారవ్వాలని. మనుష్యులు ఈశ్వరార్థం దాన-పుణ్యాలు చేస్తారు, అవి ఇన్ డైరెక్ట్ (పరోక్షమైనవి). వాటి ఫలం తర్వాత జన్మలో లభిస్తుంది. ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడి ఉంది. ఇప్పుడు నేను డైరెక్ట్ గా (ప్రత్యక్షంగా) ఉన్నాను. ఇప్పుడు మీరు చేసేదానికి బదులుగా పదమాల రెట్లు లభిస్తుంది. సత్యయుగంలో దాన-పుణ్యాల మాటే ఉండదు. ఇక్కడ ఎవరివద్దనైనా ధనముంటే, అచ్ఛా, మీరు వెళ్ళి సేవాకేంద్రం తెరవండి అని బాబా చెప్తారు. ప్రదర్శినీలు ఏర్పాటు చేయండి. పేదవారికైతే, అచ్ఛా, మీ ఇంటిలో కేవలం - గేట్ వే టు హెవెన్ (స్వర్గానికి దారి) అనే బోర్డును ఏర్పాటు చేయమని చెప్తారు. స్వర్గం మరియు నరకం ఉన్నాయి కదా. ఇప్పుడు మేము నరకవాసులమని కూడా ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. ఒకవేళ స్వర్గానికి వెళ్తే వారిని మళ్ళీ నరకంలోకి ఎందుకు పిలుస్తారు. స్వర్గంలో స్వర్గస్థులయ్యారని ఎవరూ అనరు. వారైతే ఉన్నదే స్వర్గంలో. పునర్జన్మ స్వర్గంలోనే లభిస్తుంది. ఇక్కడ పునర్జన్మ నరకంలోనే లభిస్తుంది. ఈ విషయాలను కూడా మీరు అర్థం చేయించవచ్చు. భగవానువాచ - నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, ఎందుకంటే వారే పతితపావనులు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పూజారుల నుండి పూజ్యులుగా తయారవుతారు. భలే స్వర్గంలో అందరూ సుఖంగా ఉంటారు కానీ పదవులు నంబరువారీగా ఉంటాయి. ఇది చాలా పెద్ద గమ్యం. కుమారీలకైతే సేవ చేయాలనే ఉత్సాహం చాలా కలగాలి. మేము భారత్ ను స్వర్గంగా చేసి చూపిస్తాము. కుమారీలు అనగా 21 కులాలను ఉద్ధరించేవారు అనగా 21 జన్మల కోసం ఉద్ధరించగలరు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఇది పాత ప్రపంచం యొక్క అంతిమం, తండ్రి డైరెక్ట్ గా వచ్చారు కావున ఒక్కసారిగా సమర్పితం అవ్వాలి, బాబా ఇదంతా మీదే... ఈ యుక్తితో పుణ్యాత్మలుగా అవుతారు.
2. మురళీని ఎప్పుడూ మిస్ చేయకూడదు, మురళీపట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. మేము చదవకపోతే ఏమవుతుంది, మేమైతే దాటేసాము అని కాదు. ఇది దేహాభిమానం. మురళీని తప్పనిసరిగా చదవాలి.