ఓంశాంతి. ఆత్మిక పిల్లలు పాట విన్నారు, అర్థం తెలుసుకున్నారు. ప్రపంచంలో ఎవ్వరికీ అర్థం తెలియదు. పరమపిత పరమాత్మతో ఆత్మలైన మా యొక్క ప్రేమ ఉందని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఆత్మ తన తండ్రి అయిన పరమపిత పరమాత్మను పిలుస్తుంది. ప్రేమ ఆత్మపై ఉందా లేక శరీరంపై ఉందా? ప్రేమ ఆత్మపై ఉండాలని ఇప్పుడు తండ్రి నేర్పిస్తున్నారు. శరీరమైతే వినాశనమవ్వనున్నది. ప్రేమ ఆత్మపై ఉంది. మీ ప్రేమ పరమాత్మ తండ్రిపై ఉండాలి, శరీరాలపై కాదని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మనే తన తండ్రిని, పుణ్యాత్మల ప్రపంచంలోకి తీసుకెళ్ళండి అని పిలుస్తుంది. మేము పాపాత్ములుగా ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ పుణ్యాత్మలుగా అవుతున్నాము - అని మీరు అర్థం చేసుకున్నారు. బాబా మిమ్మల్ని యుక్తితో పుణ్యాత్మలుగా చేస్తున్నారు. తండ్రి చెప్పినప్పుడే పిల్లలకు అనుభవమయ్యి, మేము తండ్రి ద్వారా తండ్రి స్మృతితో పవిత్ర పుణ్యాత్మలుగా అవుతున్నామని అర్థం చేసుకుంటారు. యోగబలంతో మా పాపాలు భస్మమవుతున్నాయి. గంగ మొదలైన వాటిలో పాపాలు కడగడం జరగదు. మనుష్యులు గంగా స్నానం చేస్తారు, శరీరానికి మట్టి పూసుకుంటారు, కానీ దీని ద్వారా పాపాలు నశించవు. ఆత్మలోని పాపాలు యోగబలంతోనే తొలగిపోతాయి. మలినాలు తొలగుతున్నాయని పిల్లలకు మాత్రమే తెలుసు, అలాగే మేము బాబాను స్మృతి చేస్తేనే మా పాపాలు భస్మమవుతాయని నిశ్చయముంది. నిశ్చయముంటే పురుషార్థం చేయాలి కదా. ఈ పురుషార్థంలోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. రుస్తుం (యోధుడు) తో మాయ కూడా మంచి రీతిలో యొధునిగా అయి పోరాడుతుంది. కచ్చాగా ఉన్నవారితో ఏం పోరాడుతుంది? మేము మాయాజీతులుగా, జగజ్జీతులుగా అవ్వాలనే ధ్యాస పిల్లలకు సదా ఉండాలి. మాయాజీతులే జగజ్జీతులు - దీని అర్థం కూడా ఎవ్వరికీ అర్థం కాదు. మీరు మాయపై విజయం ఎలా పొందాలి అని ఇప్పుడు పిల్లలైన మీకు అర్థం చేయించడం జరుగుతుంది. మాయ కూడా సమర్థమైనది కదా. పిల్లలకు గురువు లభించారు. ఆ గురువు కూడా నంబరువారుగా ఎవరో కొద్ది మందికి మాత్రమే తెలుసు. తెలుసుకున్నవారికి సంతోషం కూడా ఉంటుంది. పురుషార్థం కూడా స్వయం చేస్తారు. సర్వీసు కూడా చాలా చేస్తారు. అమరనాథ్ కు చాలా మంది వెళ్తారు.
ఇప్పుడు విశ్వంలో శాంతి ఎలా స్థాపించబడుతుంది అని మనుష్యులంతా అడుగుతారు. సత్యయుగంలో సుఖ-శాంతులు ఎలా ఉండేవో మీరిప్పుడు అందరికీ ఋజువు చేసి చెప్పగలరు. విశ్వమంతటా శాంతి ఉండేది. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది, అప్పుడు ఇతర ఏ ధర్మమూ ఉండేది కాదు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం సత్యయుగముండేది, తర్వాత సృష్టి అయితే తప్పకుండా చక్రం తిరగాలి. చిత్రాల ద్వారా మీరు పూర్తి స్పష్టంగా తెలియజేస్తారు, కల్పక్రితం కూడా ఇటువంటి చిత్రాలు తయారుచేశారు. రోజురోజుకూ ప్రగతి అవుతూ ఉంటుంది. అక్కడక్కడ పిల్లలు చిత్రాలలో తిథి-తారీఖులు వ్రాయడం మర్చిపోతారు. లక్ష్మీనారాయణుల చిత్రంలో తిథి-తారీఖులు తప్పకుండా ఉండాలి. మనం స్వర్గవాసులుగా ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ అలా అవ్వాలని పిల్లలైన మీ బుద్ధిలో కూర్చుంది కదా. ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తారో అంత పదవిని పొందుతారు. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు జ్ఞానపు అథారిటీగా అయ్యారు. భక్తి ఇప్పుడు సమాప్తమవ్వనున్నది. సత్య, త్రేతా యుగాలలో భక్తి ఉండదు. తర్వాత అర్ధకల్పం భక్తి నడుస్తుంది. ఇది కూడా ఇప్పుడే పిల్లలకు అర్థమవుతుంది. అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. మొత్తం ఆటంతా భారతవాసులపైనే ఉంది. 84 యొక్క చక్రం కూడా భారతదేశం పైననే ఉంది. భారతదేశమే అవినాశి ఖండం, ఇది కూడా ఇంతకుముందు తెలియదు. లక్ష్మీనారాయణులను దేవీ-దేవతలు అని అంటారు కదా. ఎంత శ్రేష్ఠమైన పదవి, చదువు ఎంత సహజం. ఈ 84 యొక్క చక్రాన్ని పూర్తి చేసి మళ్ళీ మనం తిరిగి వెళ్తాము. 84 యొక్క చక్రం అంటూనే బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం అన్నీ గుర్తున్నాయి. సూక్ష్మవతనం ఏమిటో ఇంతకుముందు తెలిసేది కాదు. అక్కడ సైగలతో ఎలా సంభాషిస్తారో ఇప్పుడు మీకు తెలుసు. మూవీ బయోస్కోప్ (మూగ సినిమా) కూడా వచ్చింది. మీకు అర్థం చేయించేందుకు సహజమవుతుంది. సైలెన్స్, మూవీ, టాకీ. లక్ష్మీనారాయణుల రాజ్యం నుండి ఇప్పటి వరకు మొత్తం చక్రమంతా బుద్ధిలో ఉందని మీకు తెలుసు.
గృహస్థ వ్యవహారంలో ఉంటూ మేము పావనంగా అవ్వాల్సిందే అన్న చింత మీకు ఉండాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా ఈ పాత ప్రపంచంపై మమకారాన్ని తొలగించండి. పిల్లలు మొదలైనవారిని భలే సంభాళించండి. కానీ బుద్ధి తండ్రి వైపు ఉండాలి. చేతులతో పని చేస్తున్నా బుద్ధి తండ్రి వైపే ఉండాలి - అని అంటారు కదా. పిల్లలకు తినిపించండి, తాగించండి, స్నానం చేయించండి కానీ బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి, ఎందుకంటే ఆత్మపై పాప భారం చాలా ఉందని మీకు తెలుసు, కావున బుద్ధి తండ్రి వైపే ఉండాలి. ఆ ప్రియుడ్ని చాలా-చాలా స్మృతి చెయ్యాలి. ప్రియతముడైన తండ్రి ఆత్మలందరికీ చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి, ఈ పాత్ర కూడా ఇప్పుడు నడుస్తుంది, తిరిగి 5 వేల సంవత్సరాల తర్వాత నడుస్తుంది. తండ్రి ఎంత సహజ యుక్తిని తెలియజేస్తారు. ఎటువంటి కష్టం లేదు. మేము ఇది చేయలేము, మాకు చాలా కష్టమనిపిస్తుంది, స్మృతి యాత్ర చాలా కష్టం అని కొంతమంది అంటారు. అరే, మీరు బాబాను స్మృతి చేయలేరా! తండ్రిని అస్సలు మర్చిపోకూడదు. తండ్రిని మంచి రీతిలో స్మృతి చేయాలి, అప్పుడే వికర్మలు వినాశనమవుతాయి, మీరు ఎవర్ హెల్దీ (సదా ఆరోగ్యవంతులు) గా అవుతారు. లేకపోతే అవ్వలేరు. మీకు చాలా మంచి నెంబర్ వన్ స్థిరమైన సలహా లభిస్తుంది. స్థిరమైన ఔషధం ఉంటుంది కదా. ఈ యోగబలంతో మీరు 21 జన్మలకు ఎప్పుడూ రోగగ్రస్థులుగా అవ్వరు అని గ్యారెంటీ ఇస్తున్నాను. కేవలం తండ్రిని స్మృతి చేయండి, ఎంత సహజమైన యుక్తి. భక్తిమార్గంలో తెలియకుండా స్మృతి చేసేవారు. ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, కల్పక్రితం కూడా మేము మీ వద్దకు వచ్చాము, పురుషార్థం చేశామని మీకు పక్కా నిశ్చయమైపోయింది. మేమే రాజ్యం చేసేవారము, తర్వాత మేమే రాజ్యం పోగొట్టుకున్నాము, ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చి ఉన్నారు, వారి నుండి రాజ్య భాగ్యాన్ని తీసుకోవాలి. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి, రాజ్యాన్ని స్మృతి చేయండి. మన్మనాభవ. అంత మతి సో గతి అవుతుంది (అంతిమ సమయంలో ఎటువంటి స్మృతి ఉంటే, అటువంటి గతి (జన్మ) లభిస్తుంది). ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది, తిరిగి వెళ్ళిపోతాము. అందరినీ తీసుకెళ్ళేందుకు బాబా వచ్చారు. ఎలా అయితే వరుడు వధువును తీసుకెళ్ళేందుకు వస్తారో, అలా. అత్తవారింటికి వెళ్తున్నానని వధువుకు చాలా సంతోషం ఉంటుంది. మీరందరూ ఒక్క రాముని సీతలు. మిమ్మల్ని రావణుని జైలు నుండి విడిపించి రాముడే తీసుకెళ్తారు. లిబరేటర్ (ముక్తి దాత) ఒక్కరే, వారు రావణ రాజ్యం నుండి ముక్తులుగా చేస్తారు. ఇది రావణ రాజ్యమని కూడా చెప్తారు, కానీ యథార్థంగా అర్థం చేసుకోరు. ఇప్పుడు పిల్లలకు అర్థం చేయించబడుతుంది, ఇతరులకు అర్థం చేయించేందుకు చాలా మంచి-మంచి పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది. బాబా అర్థం చేయించారు - విశ్వంలో శాంతిని కల్పక్రితం వలె తండ్రి స్థాపన చేస్తున్నారని వ్రాయండి. బ్రహ్మా ద్వారా స్థాపన అవుతుంది. విష్ణువు రాజ్యం ఉన్నప్పుడు విశ్వంలో శాంతి ఉండేది కదా. విష్ణువు అనగా లక్ష్మీనారాయణులు, ఇది కూడా ఎవరూ అర్థం చేసుకోరు. విష్ణువు, లక్ష్మీనారాయణులు, రాధా-కృష్ణులను వేరు వేరుగా భావిస్తారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, స్వదర్శన చక్రధారులు కూడా మీరే. శివబాబా వచ్చి సృష్టిచక్రం యొక్క జ్ఞానాన్ని ఇస్తున్నారు. వారి ద్వారా ఇప్పుడు మనం మాస్టర్ జ్ఞాన సాగరులుగా అయ్యాము. మీరు జ్ఞాన నదులు కదా. ఇవి పిల్లల యొక్క పేర్లే.
భక్తిమార్గంలో మనుష్యులు ఎన్నో స్నానాలు చేస్తూ ఉంటారు, ఎంతో వెతుకుతూ ఉంటారు. ఎన్నెన్నో దాన-పుణ్యాలు మొదలైనవి చేస్తూ ఉంటారు, ధనవంతులు ఎన్నో దానాలు చేస్తూ ఉంటారు. బంగారాన్ని కూడా దానం చేస్తారు. ఎంతగా వెతికామో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనం హఠయోగులము కాదు, మనం రాజయోగులము. పవిత్ర గృహస్థ ఆశ్రమంలో ఉండేవారము, తర్వాత రావణ రాజ్యంలో అపవిత్రంగా అయ్యాము. డ్రామానుసారంగా తండ్రి మళ్ళీ గృహస్థ ధర్మాన్ని తయారుచేస్తున్నారు, ఇతరులెవ్వరూ తయారుచెయ్యలేరు. మీరందరూ పవిత్రంగా అయితే ప్రపంచం ఎలా నడుస్తుంది అని మనుష్యులు ప్రశ్నిస్తారు. ఎంతో మంది సన్యాసులు పవిత్రంగా ఉన్నా ప్రపంచం ఆగిపోయిందా అని మీరు వారిని ప్రశ్నించండి. అరే, సృష్టి ఎంతగానో వృద్ధి చెందింది, తినేందుకు ధాన్యం కూడా లేదు, సృష్టిని ఇంకా ఏం వృద్ధి చేస్తారు. తండ్రి మన సన్ముఖంలో ప్రత్యక్షంగా ఉన్నారని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు, కానీ వారిని ఈ కళ్ళతో చూడలేము. బుద్ధి ద్వారా తెలుసుకున్నాము, బాబా ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారు, వారు ప్రత్యక్షంగా మన ముందున్నారు.
ఎవరైతే విశ్వశాంతి గురించి మాట్లాడతారో, వారికి మీరు చెప్పండి - విశ్వంలో శాంతిని తండ్రి స్థాపన చేయిస్తున్నారు. అందుకే పాత ప్రపంచ వినాశనం ఎదురుగా నిలబడి ఉంది, 5 వేల సంవత్సరాల క్రితం కూడా వినాశనం జరిగింది. ఇప్పుడు కూడా వినాశనం ఎదురుగా నిలబడి ఉంది, తర్వాత మళ్ళీ విశ్వంలో శాంతి ఏర్పడుతుంది. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నవే ఈ విషయాలు. ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియవు. ఈ విషయాలు బుద్ధిలో ఉండేవారెవ్వరూ లేరు. సత్యయుగంలో మొత్తం విశ్వంపై శాంతి ఉండేదని మీకు తెలుసు. ఒక్క భారత ఖండం తప్ప ఏ ఇతర ఖండమూ లేదు. ఇతర ఖండాలన్నీ తర్వాత వచ్చాయి. ఇప్పుడు ఎన్ని ఖండాలున్నాయి. ఇప్పుడు ఈ ఆట కూడా సమాప్తమవుతుంది. భగవంతుడు తప్పకుండా ఉంటారని కూడా అంటారు, కానీ భగవంతుడు ఎవరో, ఏ రూపంలో వస్తారో, అది వారికి తెలియదు. కృష్ణుడైతే అవ్వరు. ప్రేరణతోనో లేక శక్తితోనో కార్యం చేయించలేరు. తండ్రి అత్యంత ప్రియమైనవారు, వారి ద్వారా వారసత్వం లభిస్తుంది. తండ్రియే స్వర్గ స్థాపన చేస్తున్నారు, కనుక తప్పకుండా పాత ప్రపంచ వినాశనం కూడా వారు చేయిస్తారు. సత్యయుగంలో ఈ లక్ష్మీనారాయణులు ఉండేవారని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ స్వ పురుషార్థం ద్వారా ఇలా తయారవుతున్నారు. నషా ఉండాలి కదా. భారతదేశంలో రాజ్యం చేసేవారు. శివబాబా రాజ్యమిచ్చి వెళ్ళారు, శివబాబా రాజ్యం చేసి వెళ్ళారని అనరు. లేదు. భారతదేశానికి రాజ్యమిచ్చి వెళ్ళారు. లక్ష్మినారాయణులు రాజ్యపాలన చేసేవారు కదా. తిరిగి రాజ్యం ఇచ్చేందుకు బాబా వచ్చారు. మధురాతి మధురమైన పిల్లలూ! మీరు నన్ను స్మృతి చేయండి, చక్రాన్ని స్మృతి చేయండి - అని చెప్తున్నారు. మీరే 84 జన్మలు తీసుకున్నారు. తక్కువ పురుషార్థం చేస్తున్నారంటే వారు తక్కువ భక్తి చేశారని అర్థం చేసుకోండి. ఎక్కువ భక్తి చేసినవారు, పురుషార్థం కూడా ఎక్కువగా చేస్తారు. ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తున్నారు కాని బుద్ధిలో కూర్చున్నప్పుడు కదా.
మీ కర్తవ్యం పురుషార్థం చేయించడం. భక్తి తక్కువగా చేసి ఉంటే యోగం కుదరదు. శివబాబా స్మృతి బుద్ధిలో నిలవదు. పురుషార్థంలో ఎప్పుడూ చల్లబడకూడదు. మాయను పహల్వాన్ (వస్తాదు)గా చూసి హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు. మాయ తుఫానులైతే చాలా వస్తాయి. ఆత్మనే అంతా చేస్తుందని కూడా పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. శరీరమైతే సమాప్తమైపోతుంది. ఆత్మ వెళ్ళిపోయినట్లయితే, శరీరం మట్టిగా అయిపోతుంది. అది మళ్ళీ లభించదు. మరి దానిని స్మృతి చేసి ఏడ్వడం మొదలైన వాటి వల్ల లాభమేముంది? ఆ వస్తువు మళ్ళీ లభిస్తుందా? ఆత్మ అయితే వెళ్ళి వేరే శరీరాన్ని తీసుకుంది. ఇప్పుడు మీరు ఎంతో గొప్ప సంపాదన చేసుకుంటారు. మీది మాత్రమే జమ అవుతుంది, మిగిలినవారిది అవ్వదు.
బాబా భోళా వ్యాపారి, అందుకే మీకు పిడికెడు అటుకులకు బదులుగా 21 జన్మలకు మహళ్ళు ఇస్తారు, ఎంత వడ్డీ ఇస్తున్నారు. భవిష్యత్తు కొరకు మీకెంత కావాలో అంత జమ చేసుకోండి. అలాగని చివర్లో వచ్చి మాది జమ చేయండి అంటే, ఆ సమయంలో మీ వద్ద తీసుకుని ఏం చేస్తారు. తెలివిలేని వ్యాపారి కాదు కదా. అవసరం లేకుండా తీసుకొని మీకు వడ్డీ కట్టివ్వాల్సి వస్తుంది. అటువంటి వారిది అస్సలు తీసుకోరు. మీకు పిడికెడు అటుకులకు బదులుగా 21 జన్మలకు మహళ్ళు లభిస్తాయి. ఎంత వడ్డీ లభిస్తుంది. నెంబర్ వన్ భోళా నేనే అని బాబా చెప్తున్నారు. చూడండి, మీకు విశ్వ చక్రవర్తి పదవిని ఇస్తాను, మీరు కేవలం నా పిల్లలుగా అయి సేవ చేయండి. భోళానాథుడు కావున వారిని అందరూ స్మృతి చేస్తారు. మీరిప్పుడు జ్ఞాన మార్గంలో ఉన్నారు. ఇప్పుడు తండ్రి శ్రీమతాన్ని అనుసరించండి, చక్రవర్తి పదవిని తీసుకోండి. బాబా, మేము రాజ్యాధికారం తీసుకునేందుకు వచ్చామని అంటారు కూడా. అది కూడా సూర్యవంశంలో. అచ్ఛా. మీ నోరు తీపిగా అవ్వాలి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. శ్రీమతాన్ని అనుసరించి విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకోవాలి. పిడికెడు అటుకులిచ్చి 21 జన్మలకు మహళ్ళు తీసుకోవాలి. భవిష్యత్తు కొరకు సంపాదన జమ చేసుకోవాలి.
2. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ పాత ప్రపంచం నుండి మోహం తొలగించి సంపూర్ణ పావనంగా అవ్వాలి. అన్నీ చేస్తున్నా బుద్ధి తండ్రి వైపే ఉండాలి.