29-05-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - ఏ శివుడినైతే అందరూ పూజిస్తున్నారో, వారు మాకిప్పుడు తండ్రిగా అయ్యారు, మేము వారి సన్ముఖంలో కూర్చున్నాము అని మీకు నషా ఉండాలి"

ప్రశ్న:-

మనుష్యులు భగవంతుడిని క్షమించమని ఎందుకు వేడుకుంటారు? వారికి క్షమాపణ లభిస్తుందా?

జవాబు:-

మేము చేసిన పాపకర్మలకు భగవంతుడు ధర్మరాజు ద్వారా శిక్షలు ఇప్పిస్తారని మనుష్యులు అనుకుంటారు కావున భగవంతుడిని క్షమించమని వేడుకుంటారు. కాని వారు తమ కర్మల శిక్షలను కర్మభోగం రూపంలో తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది, భగవంతుడు వారికి ఎటువంటి మందునూ ఇవ్వరు. గర్భజైలులో కూడా శిక్షలు అనుభవించాలి, మీరు ఇవి-ఇవి చేసారని అన్నీ సాక్షాత్కారమవుతాయి. ఈశ్వరీయ ఆజ్ఞానుసారంగా నడుచుకోలేదు కావున ఈ శిక్ష తప్పదు అని సాక్షాత్కారమవుతుంది.

గీతము:-

నీవు నిదురించి రాత్రిని పోగొట్టుకున్నావు...... (తూనే రాత్ గవాయి.....)

ఓంశాంతి. ఇది ఎవరన్నారు? ఆత్మిక తండ్రి అన్నారు. వారు ఉన్నతాతి-ఉన్నతమైనవారు. మనుష్యులందరికన్నా, ఆత్మలందరికన్నా ఉన్నతమైనవారు. అందరిలో ఉండేది ఆత్మనే కదా. శరీరం కేవలం పాత్రను అభినయించేందుకు లభించింది. సన్యాసులు మొదలైన వారి శరీరాలకు కూడా ఎంత గౌరవముందో ఇప్పుడు మీరు చూస్తున్నారు. తమ గురువులు మొదలైనవారిని ఎంత మహిమ చేస్తారు. ఈ అనంతమైన తండ్రి గుప్తమైనవారు. శివబాబా ఉన్నతాతి-ఉన్నతమైనవారు, వారికంటే ఉన్నతమైనవారు ఎవ్వరూ లేరని పిల్లలైన మీరు భావిస్తారు. ధర్మరాజు కూడా వారితో పాటు ఉన్నారు ఎందుకంటే భక్తిమార్గంలో క్షమాపణ అడుగుతారు - ఓ భగవంతుడా, క్షమించండి. ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తారు? ఇక్కడి ప్రభుత్వమైతే జైలులో వేస్తుంది. అక్కడ ధర్మరాజు గర్భజైలులో శిక్షను ఇస్తారు. ఆ శిక్షలు అనుభవించాల్సి వస్తుంది, దీనిని కర్మభోగమని అంటారు. ఇప్పుడు కర్మభోగాన్ని అనుభవించేది ఎవరో మీకు తెలుసా? ఏమవుతుంది? ఓ ప్రభూ, క్షమించండి, దుఃఖాన్ని దూరం చేయండి, సుఖాన్ని ఇవ్వండి అని అంటారు. ఇప్పుడు భగవంతుడు మందేమైనా ఇస్తారా? వారు ఏమీ చేయలేరు. మరి భగవంతుడిని ఎందుకు అడుగుతారు? ఎందుకంటే భగవంతునితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. చెడు కర్మలు చేస్తే ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. గర్భజైలులో శిక్ష కూడా లభిస్తుంది. అన్నీ సాక్షాత్కారమవుతాయి. సాక్షాత్కారాలు చేయించకుండా శిక్షలు లభించవు. గర్భజైలులో మందులు మొదలైనవేవీ ఉండవు. అక్కడ శిక్షను అనుభవించాల్సి వస్తుంది. దుఃఖం కలిగినప్పుడు, భగవంతుడా, మమ్మల్ని ఈ జైలు నుండి విడిపించండి అని అంటారు.

ఇప్పుడు పిల్లలైన మీరు ఎవరి ఎదురుగా కూర్చొని ఉన్నారు? ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి, కానీ వారు గుప్తంగా ఉన్నారు. ఇతరులందరి శరీరాలు కనిపిస్తాయి, ఇక్కడ శివబాబాకు తమ చేతులు, కాళ్ళు ఏమీ లేవు. పుష్పాలు మొదలైనవి కూడా ఎవరు తీసుకుంటారు? ఒకవేళ కావాలనుకుంటే, ఇతని చేతుల ద్వారానే తీసుకోవలసి వస్తుంది. కాని ఎవ్వరి నుండి తీసుకోరు. మమ్మల్ని ఎవ్వరూ ముట్టుకోవద్దని శంకరాచార్యులు ఎలాగైతే అంటారో, అలాగే పతితుల నుండి ఏదైనా ఎలా తీసుకుంటాను అని తండ్రి అంటున్నారు. నాకు పుష్పాలు మొదలైనవాటి అవసరమే లేదు. భక్తిమార్గంలో సోమనాథుని మందిరం నిర్మించి పుష్పాలను అర్పిస్తారు. కాని నాకు శరీరమే లేదు. ఆత్మను ఎవరైనా ఎలా ముట్టుకోగలరు! నేను పతితుల నుండి పుష్పాలను ఎలా స్వీకరించాలి అని అంటారు. నన్ను ఎవ్వరూ ముట్టుకోలేరు. పతితులను ముట్టుకోనివ్వరు. ఈ రోజు ‘బాబా’ అని అంటారు, రేపు మళ్ళీ వెళ్ళి నరకవాసులుగా అవుతారు. అటువంటి వారిని కనీసం చూడను కూడా చూడను. నేను ఉన్నతాతి ఉన్నతమైనవాడిని అని తండ్రి చెప్తున్నారు. ఈ సన్యాసులు మొదలైన వారందరిని కూడా డ్రామానుసారంగా నేనే ఉద్ధరించవలసి వస్తుంది. నా గురించి ఎవ్వరికీ తెలియదు. శివుడిని పూజిస్తారు కాని వారు గీతా భగవంతుడని, వారు ఇక్కడికి వచ్చి జ్ఞానాన్ని ఇస్తారని ఎవ్వరికీ తెలియదు. గీతలో కృష్ణుని పేరు వేసేశారు. కృష్ణుడు జ్ఞానాన్ని ఇచ్చినట్లయితే, శివుడు ఏం చేస్తూ ఉండవచ్చు! కనుక శివుడు రానే రారని మనుష్యులు భావిస్తారు. అరే, పతితపావనుడు అని కృష్ణుడిని అనడం జరగదు. పతితపావనుడని కేవలం నన్ను మాత్రమే అంటారు కదా! మీలో కూడా కొద్దిమంది మాత్రమే బాబా పట్ల అంతటి గౌరవాన్ని ఉంచగలరు. ఎంత సాధారణంగా ఉంటారు, ఈ సాధువులు మొదలైన వారందరికీ కూడా నేను తండ్రినని అర్థం చేయిస్తారు. శంకరాచార్యులు మొదలైనవారందరి ఆత్మలకూ తండ్రిని నేనే అని బాబా అంటారు. శారీరాలకు తండ్రి అయితే ఉండనే ఉన్నారు, నేను సర్వాత్మలకు తండ్రిని. నన్ను అందరూ పూజిస్తారు. ఇప్పుడు వారు ఇక్కడ సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. కాని ఎవరి ముందు కూర్చొని ఉన్నామనే విషయం అందరూ అర్థం చేసుకోరు.

ఆత్మలు జన్మ-జన్మాంతరాలుగా దేహాభిమానానికి అలవాటు పడినందుకు తండ్రిని స్మృతి చేయలేరు. దేహమునే చూస్తూ ఉంటారు. దేహీ అభిమానులుగా ఉన్నట్లయితే ఆ తండ్రినే స్మృతి చేస్తారు మరియు వారి శ్రీమతంపై నడుస్తారు. నన్ను తెలుసుకునేందుకు అందరూ పురుషార్థం చేస్తున్నారు. చివరిలో పూర్తిగా దేహీ అభిమానులుగా అయ్యేవారే ఉత్తీర్ణులవుతారు. మిగిలిన వారందరిలో కొద్ది కొద్దిగా దేహాభిమానం ఉంటుంది. తండ్రైతే గుప్తంగా ఉన్నారు. వారికి ఏమీ ఇవ్వలేరు. కుమారీలు శివాలయానికి కూడా వెళ్ళి అర్థం చేయించవచ్చు. కుమారీలే శివబాబా పరిచయాన్నిచ్చారు. కుమార-కుమారీలు ఇరువురూ ఉన్నారు. కుమారులు కూడా పరిచయం ఇచ్చి ఉండవచ్చు. మాతలు పురుషులకంటే ఎక్కువ సేవ చేసినందుకు విశేషంగా మాతలను పైకెత్తుతారు. కావున పిల్లల్లో సేవ చేయాలనే అభిరుచి ఉండాలి. ఆ చదువుపై కూడా చాలా అభిరుచి ఉంటుంది కదా. అది దైహికమైన చదువు, ఇది ఆత్మికమైన చదువు. ఆ దైహిక చదువును చదువుతారు, ఆ డ్రిల్ మొదలైనవి చేస్తారు కానీ వాటి ద్వారా ఏమీ లభించదు. ఎవరికైనా బిడ్డ జన్మిస్తే, చాలా వైభవంగా, అట్టహాసంగా వారి ఛఠీ (శిశువు జన్మించిన ఆరవ రోజు చేసే స్నాన పూజాదులు) మొదలైన వాటిని జరుపుతారు, కాని వారు ఏం పొందుతారు! ఏదైనా పొందేందుకు అంత సమయం కూడా లేదు. ఇక్కడినుండి వెళ్ళి ఎక్కడో అక్కడ జన్మ తీసుకున్నా వారు కూడా ఏమీ అర్థం చేసుకోలేరు. ఇక్కడ ఎవరైనా అన్నీ నేర్చుకొని శరీరం వదిలేస్తే దాని అనుసారంగా చిన్న వయస్సులోనే శివబాబాను స్మృతి చేస్తూ ఉండవచ్చు. ఇది మంత్రం కదా. చిన్న పిల్లలకు నేర్పించినా వారు ఈ బిందువు మొదలైనవేమీ అర్థం చేసుకోలేరు. కేవలం శివబాబా-శివబాబా అని అంటూ ఉంటారు. శివబాబాను స్మృతి చేస్తే, స్వర్గ వారసత్వాన్ని పొందుతారు. ఇలా వారికి అర్థం చేయిస్తే వారు కూడా స్వర్గంలోకి వచ్చేస్తారు. కాని ఉన్నతమైన పదవిని పొందలేరు. ఇలా శివబాబా-శివబాబా అనే పిల్లలు చాలామంది వస్తారు. తర్వాత అంతమతి సోగతి అయిపోతుంది. రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఇప్పుడు మనుష్యులు శివునికి పూజలు చేస్తారు కాని వారికి ఏమీ తెలియదు. ఎలాగైతే చిన్న పిల్లలు శివ-శివ అని అంటూ ఉంటారు కానీ అర్థం చేసుకోరో అలా, ఇక్కడ కూడా పూజలు చేస్తారు కానీ కొద్దిగా కూడా శివుని పరిచయం లేదు. కావున వారికి మీరు అర్థం చేయించాలి. మీరు ఎవరినైతే పూజిస్తున్నారో వారే జ్ఞానసాగరుడు, గీతా భగవానుడు. వారు మనల్ని చదివిస్తున్నారు. శివబాబా మాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని చెప్పేవారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఇది మీకు మాత్రమే తెలుసు, అయినా మీరు మర్చిపోతారు. భగవానువాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. భగవానువాచ, కామము మహాశత్రువు, దీని పై విజయం పొందండి అని ఇలా ఎవరు అన్నారు. పాత ప్రపంచాన్ని సన్యసించండి. హఠయోగులు, హద్దులోని సన్యాసులు. వారు శంకరాచార్యులు, వీరు శివాచార్యులు. వారు మనకు నేర్పిస్తారు. కృష్ణ ఆచార్య అని అనరు. అతడు చిన్న బాలుడు. సత్యయుగంలో జ్ఞానం అవసరం ఉండదు.

శివుని మందిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, అక్కడ పిల్లలైన మీరు మంచి సేవ చేయవచ్చు. శివాలయాలకు వెళ్ళండి. మాతలు వెళ్తే బాగుంటుంది, కన్యలు వెళ్తే ఇంకా మంచిది. ఇప్పుడు మనం బాబా నుండి రాజ్యభాగ్యాన్ని తీసుకోవాలి. తండ్రి మనల్ని చదివిస్తారు, దాని ద్వారా మనం మహారాజులుగా, మహారాణులుగా అవుతాము. ఉన్నతాతి ఉన్నతమైనవారు తండ్రియే, ఇటువంటి శిక్షణను మనుష్యులెవ్వరూ ఇవ్వలేరు. ఇది కలియుగం. సత్యయుగంలో వీరి రాజ్యముండేది. వీరు రాజా-రాణులుగా ఎలా అయ్యారు, సత్యయుగానికి యజమానులుగా తయారయ్యేందుకు వీరికి రాజయోగాన్ని ఎవరు నేర్పించారు? మీరు ఎవరినైతే పూజిస్తారో, వారు మనల్ని చదివించి సత్యయుగానికి యజమానులుగా చేస్తారు. బ్రహ్మా ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన... పతిత ప్రవృత్తి మార్గంలో ఉన్నవారే పావన ప్రవృత్తి మార్గంలోకి వెళ్తారు. బాబా, పతితులైన మమ్మల్ని పావనంగా చేయండి, పావనంగా చేసి ఇటువంటి దేవతలుగా చేయండి అని కూడా అంటారు. అది ప్రవృత్తి మార్గం. బాబా నివృత్తి మార్గంలో ఉన్నవారికి గురువుగా అవ్వనే అవ్వరు. ఎవరైతే పవిత్రంగా అవుతారో, వారికి గురువుగా అవ్వవచ్చు. ఈ విధంగా చాలామంది ఇలా కంపానియన్లుగా (ఒకరికొకరు తోడుగా) ఉంటారే కానీ వికారాల కొరకు వివాహం చేసుకోరు. పిల్లలైన మీరు ఈ విధంగా సేవ చేయవచ్చు. మీకు లోలోపల అభిరుచి ఉండాలి. మేము బాబాకు సుపుత్రులమై సేవ ఎందుకు చేయకూడదు. పాత ప్రపంచ వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. ఇప్పుడు శివబాబా చెప్తున్నారు - కృష్ణుడు ఇక్కడ ఉండలేరు. వారు ఒకేసారి సత్యయుగంలో ఉంటారు. ఇతర జన్మలలో అదేవిధమైన ముఖకవళికలు, పేరు ఉండదు. 84 జన్మలలో 84 ముఖకవలళికలు. కృష్ణుడు ఈ జ్ఞానాన్ని ఎవ్వరికీ నేర్పించలేరు. ఆ కృష్ణుడు ఇక్కడకు ఎలా రాగలరు. ఇప్పుడు మీరు ఈ విషయాలు అర్థం చేసుకుంటారు. అర్ధకల్పం మంచి జన్మలు లభిస్తాయి తర్వాత రావణరాజ్యం ప్రారంభమవుతుంది. మనుష్యులు పూర్తిగా జంతువుల వలె అయిపోతారు. పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు, అంటే రావణుని జన్మ జరిగింది కదా. అంతేకానీ 84 లక్షల జన్మలు లేవు. ఇన్ని వెరైటీలు ఉన్నాయి. ఇన్ని జన్మలు ఎవ్వరూ తీసుకోరు. ఈ తండ్రి కూర్చొని ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. వారు సర్వ శ్రేష్ఠమైన భగవంతుడు, వారు చదివిస్తారు, వారి తర్వాత ఇతను కూడా ఉన్నారు కదా. చదవకపోతే ఎవరి వద్దకైనా వెళ్ళి దాస దాసీలుగా తయారవుతారు. శివబాబా వద్ద దాస దాసీలుగా అవుతారా? చదవకపోతే సత్యయుగంలో వెళ్ళి దాస దాసీలుగా అవుతారు అని శివబాబా అంటారు. ఎవరైతే సేవ చేయకుండా, కేవలం తింటూ, తాగుతూ, నిదురిస్తూ ఉంటారో, వారు ఏమవుతారు! ఏమవుతారనేది బుద్ధిలోకి వస్తుంది కదా! నేనైతే మహారాజుగా అవుతాను, అటువంటివారు నా ఎదురుగా కూడా రాలేరు. తాము అలా తయారవుతామని వారు కూడా అర్థం చేసుకుంటారు. అయినాకానీ వారికి సిగ్గే కలగదు. మేము మా ఉన్నతి చేసుకుని ఎంతోకొంత పొందాలని అర్థమే చేసుకోరు. ఈ బ్రహ్మా చెప్తున్నారని ఎప్పుడూ అనుకోకండి, ఎప్పుడూ శివబాబానే చెప్తున్నారని భావించండి. శివబాబాను గౌరవించాలి కదా. వారితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. లేకపోతే ధర్మరాజు శిక్షలను కూడా చాలా అనుభవిస్తారు. కుమారీలు చాలా తెలివిగా ఉండాలి. ఇక్కడ విని, బయటకి వెళ్ళగానే సమాప్తమవ్వడం కాదు. భక్తిమార్గానికి సంబంధించి ఎంతో సామాగ్రి ఉంది. విషాన్ని విడిచిపెట్టండని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. స్వర్గవాసులుగా అవ్వండి. ఇటువంటి నినాదాలను తయారుచేయండి. ధైర్యం గల సింహాలుగా అవ్వండి. అనంతమైన తండ్రి లభించిన తర్వాత, ఇక చింత ఎందుకు. ప్రభుత్వం ఈ ధర్మాన్నే అంగీకరించకపోతే మరి వారంతా మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఎలా వస్తారు. మేము ఏ ధర్మాన్ని అంగీకరించము అని వారు చెప్తారు. మాకందరూ ఒక్కటే అని అంటారు. మరి పరస్పరం ఎందుకు గొడవపడుతూ ఉంటారు? అంతా అసత్యమే అసత్యం, సత్యం గురిగింజంత కూడా లేదు. మొట్టమొదట ఈశ్వరుడు సర్వవ్యాపి అనడంతోనే అసత్యం ప్రారంభమవుతుంది. హిందూ ధర్మమనేదే లేదు. క్రైస్తవులది తమ ధర్మమే కొనసాగుతూ వస్తోంది. వారు తమను మార్చుకోరు. ఈ ఒక్క ధర్మం వారే తమ ధర్మాన్ని మార్చుకొని హిందువులమని చెప్పుకుంటారు, అంతేకాక ఎటువంటి పేర్లు పెట్టుకుంటూ ఉంటారో చూడండి, శ్రీ శ్రీ ఫలానా..... ఇప్పుడు శ్రీ అనగా శ్రేష్ఠంగా ఎక్కడున్నారు. ఎవ్వరిదీ శ్రీమతం కాదు. ఇవన్నీ వారి ఇనుప యుగపు మతాలు. వాటిని శ్రీమతమని ఎలా అంటారు. ఇప్పుడు కుమారీలైన మీరు నిలబడి ఎవరికైనా అర్థం చేయించగలరు. కాని యోగయుక్తమైన మంచి తెలివైన పిల్లలు కావాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మీ ఉన్నతి కొరకు తండ్రి సేవలో తత్పరులై ఉండాలి. కేవలం తినడం, త్రాగడం, నిద్రపోవడం - ఇది పదవిని పోగొట్టుకోవడమే అవుతుంది.

2. తండ్రిని మరియు చదువును గౌరవించాలి. దేహీ అభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. తండ్రి శిక్షణలను పూర్తిగా ధారణ చేసి సుపుత్రులుగా అవ్వాలి.

వరదానము:-

స్వయాన్ని విశ్వసేవకు అర్పించి మాయను దాసిగా చేసుకునే సహజ సంపన్న భవ

ఇప్పుడు మీ సమయాన్ని, సర్వ ప్రాప్తులను, జ్ఞానాన్ని, గుణాలను మరియు శక్తులను విశ్వ సేవార్థం సమర్పించండి. ఏ సంకల్పం ఉత్పన్నమైనా, అది విశ్వ సేవ కొరకు ఉన్నదేనా అని చెక్ చేసుకోండి. ఇలా సేవ కొరకు అర్పితమైతే స్వయం సహజంగా సంపన్నమవుతారు. సేవ చేయాలనే తపన ఉన్నట్లయితే చిన్న-పెద్ద పరీక్షలు స్వతహాగానే సమర్పణ అయిపోతాయి. అప్పుడు మాయకు భయపడరు, సదా విజయులుగా అయిన సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. మాయను తమ దాసిగా అనుభవం చేస్తారు. స్వయం సేవలో సరెండర్ అయితే మాయ స్వతహాగా సరెండర్ అయిపోతుంది.

స్లోగన్:-

అంతర్ముఖత ద్వారా నోటిని మూసుకున్నట్లయితే క్రోధం సమాప్తమయిపోతుంది.