ఓంశాంతి. చదువు యొక్క లక్ష్యము అయితే పిల్లల ఎదురుగా ఉంది. తండ్రి సాధారణ శరీరములో ఉన్నారు, అది కూడా వృద్ధ శరీరములో ఉన్నారని పిల్లలకు తెలుసు. అక్కడ భలే వృద్ధులుగా ఉంటారు కానీ మళ్లీ మేము చిన్న పిల్లలుగా అవుతామని సంతోషముంటుంది. వీరికి కూడా తెలుసు, వీరికి నేను ఇలా తయారయ్యేది ఉంది అని సంతోషముంటుంది. పిల్లల వంటి నడవడిక అయిపోతుంది. పిల్లల వలె సరళంగా ఉంటారు. అహంకారం మొదలైనవేవీ ఉండవు. జ్ఞానం యొక్క బుద్ధి ఉంటుంది. వీరిది ఎలా ఉందో, పిల్లలైన మీది కూడా అలాగే ఉండాలి. బాబా మనల్ని చదివించేందుకు వచ్చారు, మనము ఇలా తయారవుతాము. కావున పిల్లలైన మీకు లోపల ఈ సంతోషముండాలి కదా - మేము ఈ శరీరం వదిలి వెళ్ళి ఇలా అవుతామని. రాజయోగము నేర్చుకుంటున్నారు. చిన్న పిల్లలైనా లేక పెద్దవారైనా అందరూ శరీరాలను వదిలేస్తారు. అందరి కోసం చదువు ఒక్కటే. వీరు కూడా అంటారు, నేను రాజయోగము నేర్చుకుంటున్నాను. తిరిగి నేను వెళ్ళి రాకుమారునిగా అవుతాను. మేము రాకుమార-రాకుమారీలుగా అవుతామని మీరు కూడా అంటారు. రాకుమార-రాకుమారీలుగా అయ్యేందుకు మీరు చదువుకుంటున్నారు. అంతమతి సోగతి జరుగుతుంది (అంతిమ సమయంలో ఎటువంటి ఆలోచనలతో చనిపోతారో, అలాంటి గతి (జన్మ) లభిస్తుంది). మేము బికారి నుండి రాకుమారులుగా తయారవుతామని బుద్ధిలో ఈ నిశ్చయముంది. ఈ బికారి ప్రపంచమే సమాప్తమయ్యేది ఉంది. పిల్లలకు చాలా సంతోషము ఉండాలి. బాబా పిల్లలను కూడా తమ సమానంగా తయారుచేస్తారు. శివబాబా చెప్తున్నారు, నేను రాకుమార-రాకుమారీగా తయారవ్వను. నేను అయితే తయారయ్యేది ఉంది కదా అని ఈ బాబా అంటారు. ఇలా తయారయ్యేందుకు నేను చదువుకుంటున్నాను. ఇది రాజయోగము కదా. మేము రాకుమార-రాకుమారీలుగా అవుతామని పిల్లలు కూడా అంటారు. ఇది చాలా రైట్, మీ నోట్లో గులాబ్ జామూన్ అని తండ్రి అంటారు. ఇది రాకుమార-రాకుమారీలుగా తయారయ్యే పరీక్ష. జ్ఞానమైతే చాలా సహజము. తండ్రిని స్మృతి చేయాలి మరియు భవిష్య వారసత్వాన్ని స్మృతి చేయాలి. ఈ స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది. ఈ స్మృతిలో ఉంటే అంతమతి సోగతి జరుగుతుంది. సన్యాసులు ఉదాహరణ ఇస్తూ ఉంటారు, ఎవరో నేను ఎద్దు అని అంటే... నిజంగానే అలా అనుకోవడం మొదలుపెట్టాడు. అవన్నీ వ్యర్థ విషయాలు. ఇక్కడ ఉండేది ధర్మం యొక్క విషయము. కావున తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, జ్ఞానమైతే చాలా సహజము కానీ స్మృతిలో శ్రమ ఉంది. బాబా తరచుగా అంటారు - మీరు బేబీలు. అప్పుడు పిలల్ల ఫిర్యాదులు వస్తాయి, మేము బేబీలమా? బాబా చెప్తారు - అవును, బేబీలే. భలే జ్ఞానమైతే చాలా బాగుంది, ప్రదర్శనిలో సర్వీసు చాలా బాగా చేస్తారు, రాత్రింబవళ్ళు సర్వీసులో నిమగ్నమైపోతారు, అయినా బేబీ అనే అంటాను. ఇతను (బ్రహ్మా) కూడా బేబీనే. ఈ బాబా చెప్తున్నారు, మీరు నా కంటే పెద్దవారు, వీరిపై అయితే అనేక బాధ్యతలు ఉన్నాయి. ఎవరి తలపై బాధ్యతలు ఉంటాయో.... వారికి అన్ని ఆలోచనలు ఉంటాయి. బాబా వద్దకు ఎన్ని సమాచారాలు వస్తుంటాయి, అందుకే ఉదయమే కూర్చుని స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తారు. వారసత్వమైతే వారి నుండే పొందాలి. కనుక తండ్రిని స్మృతి చెయ్యాలి. పిల్లలందరికీ రోజూ అర్థం చేయిస్తాను. మధురమైన పిల్లలూ, మీరు స్మృతియాత్రలో చాలా బలహీనంగా ఉన్నారు. జ్ఞానములో అయితే భలే బాగా ఉన్నారు కానీ ప్రతి ఒక్కరు తమ హృదయాన్ని ప్రశ్నించుకోండి - నేను బాబా స్మృతిలో ఎంత ఉంటున్నాను? అచ్ఛా, పగలు చాలా పనులు మొదలైన వాటిలో బిజీగా ఉంటారు, వాస్తవానికి పనులు చేస్తున్నా స్మృతిలో ఉండవచ్చు. ఒక సూక్తి కూడా ఉంది, హస్తం కార్యమగ్నం, హృదయం ఈశ్వరమగ్నం (చేతులతో కర్మలు చేస్తూ బుద్ధి అక్కడ జోడించబడి ఉండాలి). ఎలా అయితే భక్తి మార్గంలో భలే పూజ చేస్తున్నా, బుద్ధి ఎక్కడెక్కడో వ్యాపారాలు మొదలైనవాటి వైపు వెళ్ళపోతూ ఉంటుంది, ఎవరైనా ఒక స్త్రీ యొక్క పతి విదేశములో ఉంటే ఆమె బుద్ధి అక్కడికి వెళ్ళిపోతుంది, ఎవరితో ఎక్కువ కనెక్షన్ ఉంటుందో, అటు. కావున సేవ బాగా చేస్తున్నా, బేబీ బుద్ధి అని బాబా అంటారు. చాలామంది పిల్లలు - మేము బాబా స్మృతిని మర్చిపోతున్నామని వ్రాస్తారు. అరే, తండ్రిని బేబీ కూడా మర్చిపోదు, మీరైతే బేబీ కంటే బేబీలా ఉన్నారు. ఏ తండ్రి ద్వారా మీరు రాకుమార-రాకుమారీలుగా అవుతారో, వారు మీ తండ్రి, టీచరు, గురువు, మీరు వారిని మర్చిపోతారు!
ఏ పిల్లలైతే తమ పూర్తి లెక్కను తండ్రికి పంపిస్తారో, బాబా వారికే తమ సలహానిస్తారు. బాబాను ఎలా స్మృతి చేస్తున్నాము? ఎప్పుడు స్మృతి చేస్తున్నాము? అని పిల్లలు తెలియజేయాలి. అప్పుడు తండ్రి సలహానిస్తారు. వీరికి ఈ ఉద్యోగముంది, దీని అనుసారంగా వీరికి ఎంత తీరిక ఉండవచ్చు అని బాబా అర్థం చేసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులకు చాలా తీరిక ఉంటుంది. పని కొంచెము తేలికైనంతనే తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. నడుస్తూ-తిరుగుతూ కూడా తండ్రి స్మృతి ఉండాలి. బాబా సమయాన్ని కూడా ఇస్తారు. అచ్ఛా, రాత్రి 9 గంటలకు నిద్రపోండి, తర్వాత 2 - 3 గంటలకు లేచి స్మృతి చేయండి. ఇక్కడకు వచ్చి కూర్చోండి. కాని బాబా కేవలం ఇలా కూర్చునే అలవాటును చేయించరు, స్మృతి అయితే నడుస్తూ-తిరుగుతూ కూడా చేయవచ్చు. ఇక్కడైతే పిల్లలకు చాలా తీరిక ఉంటుంది. ఇంతకుముందు మీరు ఏకాంతములో పర్వతాల పైకి వెళ్ళి కూర్చునేవారు. తండ్రిని తప్పనిసరిగా స్మృతి చేయాలి. లేదంటే వికర్మలు ఎలా వినాశనమవుతాయి. తండ్రిని స్మృతి చేయలేకపోతే బేబీ కంటే బేబీగా అయినట్లు కదా. అంతా స్మృతిపైనే ఆధారపడి ఉంది. పతితపావనులైన తండ్రిని స్మృతి చేసే శ్రమ. జ్ఞానమైతే చాలా సహజము. కల్పక్రితము ఇక్కడకు వచ్చి అర్థం చేసుకున్నవారే మళ్ళీ వస్తారని కూడా మీకు తెలుసు. పిల్లలకు డైరెక్షన్లు లభిస్తూ ఉంటాయి. మేము తమోప్రధానము నుండి సతోప్రధానంగా ఎలా అవ్వాలని ఇదే ప్రయత్నము ఉండాలి. తండ్రి స్మృతి తప్ప వేరే ఉపాయమేదీ లేదు. బాబా, నేను ఈ వ్యాపారం ఉన్న కారణంగా లేక ఈ కార్యం ఉన్న కారణంగా స్మృతి చేయలేకపోతున్నాను అని బాబాకు చెప్పవచ్చు. బాబా వెంటనే, అలా కాదు ఇలా చేయండి అని సలహా ఇస్తారు. మీదంతా స్మృతిపైనే ఆధారపడి ఉంది. మంచి-మంచి పిల్లలు జ్ఞానమునైతే చాలా బాగా ఇస్తారు, అందరినీ సంతోషపెడతారు కాని యోగము లేదు. తండ్రిని స్మృతి చేయాలి. ఈ విషయం అర్ధం చేసుకున్నా కూడా మళ్ళీ మర్చిపోతారు, ఇందులోనే శ్రమ ఉంది. అలవాటు అయిపోతే విమానము లేక రైలులో కూర్చున్నా తమ రాగములోనే ఉంటారు. మేము బాబా ద్వారా భవిష్య రాకుమార-రాకుమారీలుగా అవుతున్నామని లోపల సంతోషముంటుంది. ఉదయము లేచి ఇటువంటి తండ్రి స్మృతిలో కూర్చోండి. తర్వాత అలసిపోతారు. అచ్ఛా, పడుకుని స్మృతి చేయండి. బాబా యుక్తులు చెప్తారు. నడుస్తూ-తిరుగుతూ స్మృతి చేయలేకపోతే రాత్రికి నిష్ఠలో కూర్చోండి, ఎంతో కొంత మీ జమ అవుతుంది. కాని ఒకే చోట బలవంతంగా కూర్చోవడం హఠయోగమైపోతుంది. మీది సహజ మార్గము. రొట్టె తింటున్నా తండ్రిని స్మృతి చేయండి. మేము బాబా ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతున్నాము. నేను ఈ చదువు ద్వారా ఇలా అవుతున్నానని మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. చదువు పట్ల పూర్తి అటెన్షన్ ఇవ్వాలి. మీ సబ్జెక్టులు కూడా చాలా తక్కువే. బాబా ఎంత కొద్దిగా అర్థం చేయిస్తారు, ఏదైనా విషయం అర్థము కాకుంటే బాబాను అడగండి. స్వయాన్ని ఆత్మగా భావించాలి, ఈ శరీరమైతే పంచభూతాలతో తయారుచేయబడింది. నేను శరీరమని భావించడం అనగా స్వయాన్ని భూతంగా భావించడము. ఇది ఉన్నదే ఆసురీ ప్రపంచము, అది దైవీ ప్రపంచము. ఇక్కడ అందరూ దేహాభిమానులుగా ఉన్నారు. తమ ఆత్మ గురించి ఎవ్వరికీ తెలియదు. రాంగ్ మరియు రైట్ అయితే జరుగుతూ ఉంటాయి కదా. నేను ఆత్మను అవినాశి - ఇలా భావించడం రైట్. స్వయాన్ని వినాశి శరీరంగా భావించడం రాంగ్ అయిపోతుంది. దేహము యొక్క అహంకారము చాలా ఉంది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - దేహాన్ని మర్చిపోండి, ఆత్మాభిమానులుగా అవ్వండి. ఇందులో శ్రమ ఉంది. మీరు 84 జన్మలు తీసుకుంటారు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. మీకే ఇది సులభమనిపిస్తుంది, 84 జన్మలు మీరే తీసుకున్నారు. సూర్యవంశీ దేవతా ధర్మము వారికే 84 జన్మలు ఉంటాయి, ఇది కరెక్ట్ చేసి వ్రాయాలి. పిల్లలు చదువుతూ ఉంటారు, కరెక్షన్లు అవుతూ ఉంటాయి. ఆ చదువులో కూడా నంబరువారుగా ఉంటారు కదా. తక్కువగా చదువుకుంటే జీతము కూడా తక్కువగానే లభిస్తుంది. మీరిప్పుడు నరుడి నుండి సత్యాతి-సత్యమైన నారాయణుడిగా అయ్యే అమరకథను వినేందుకు బాబా వద్దకు వచ్చారు. ఈ మృత్యులోకమిప్పుడు సమాప్తమవుతుంది. మనము అమరలోకానికి వెళ్ళాలి. మేము తమోప్రధానము నుండి సతోప్రధానంగా, పతితుల నుండి పావనంగా అవ్వాలని పిల్లలైన మీకు ఇప్పుడు ఈ చింత ఎర్పడాలి. పతితపావనులైన తండ్రి పిల్లలందరికీ ఒకే యుక్తిని తెలియజేస్తారు - కేవలం తండ్రిని స్మృతి చేయండి, చార్టు వ్రాయండి, అలా చేస్తే చాలా సంతోషము కలుగుతుంది. మీకిప్పుడు జ్ఞానముంది, ప్రపంచమైతే గాఢాంధకారములో ఉంది. మీకిప్పుడు ప్రకాశము లభిస్తుంది. మీరు త్రినేత్రి, త్రికాలదర్శులుగా అవుతున్నారు. జ్ఞానము ఎక్కడైనా దొరుకుతుందని, ఇది కొత్తదేమీ కాదు అని భావించే మనుష్యులు కూడా చాలామంది ఉన్నారు. అరే, ఈ జ్ఞానము ఎవ్వరికీ లభించదు. ఒకవేళ ఈ జ్ఞానం లభించినా, ఏమీ ఆచరించరు. నరుడి నుండి నారాయణుడిగా అయ్యే పురుషార్థము ఎవరైనా చేస్తున్నారా? ఏమీ లేదు. కనుక తండ్రి పిల్లలకు చెప్తున్నారు, ఉదయము సమయము చాలా మంచిది. చాలా ఆనందము కలుగుతుంది, అంతా శాంతిగా అయిపోతుంది, వాయుమండలం చాలా బాగుంటుంది. రాత్రి 10 గంటల నుండి 12 గంటల వరకు అన్నిటికంటే చెడు వాయుమండలం ఉంటుంది. అందుకే ఉదయం సమయం చాలా మంచిది. రాత్రి త్వరగా పడుకోండి, మళ్ళీ 2-3 గంటలకు లేవండి. ప్రశాంతంగా కూర్చోండి. బాబాతో మాట్లాడండి. ప్రపంచ భూగోళము-చరిత్రను స్మృతి చేయండి. శివబాబా చెప్తున్నారు - నాలో రచయిత, రచనల జ్ఞానముంది కదా. నేను టీచరుగా అయి మిమ్మల్ని చదివిస్తాను. ఆత్మలైన మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. భారతదేశపు ప్రాచీన యోగము ప్రసిద్ధమైనది. యోగము ఎవరితో? ఇది కూడా వ్రాయాలి. ఆత్మకు పరమాత్మతో యోగముంది అంటే స్మృతి ఉంది. మేము ఆల్ రౌండర్, పూర్తి 84 జన్మలు తీసుకుంటామని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. బ్రాహ్మణ కులానికి చెందినవారే ఇక్కడకు వస్తారు. మనము బ్రాహ్మణులము. ఇప్పుడు మనము దేవతలుగా అయ్యేవారము. సరస్వతి కూడా కూతురు కదా. నేను వృద్ధుడను కూడా, ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి రాజు కుటుంబములో జన్మ తీసుకుంటానని చాలా సంతోషమనిపిస్తుంది. నేను చదువుకుంటున్నాను. తర్వాత నా నోటిలో బంగారు స్పూను ఉంటుంది. ఇది మన అందరి ముఖ్య లక్ష్యము. సంతోషము ఎందుకు ఉండకూడదు. మనుష్యులు ఏమన్నా, మీ సంతోషము ఎందుకు మాయమవ్వాలి? తండ్రిని స్మృతినే చేయకపోతే నరుడి నుండి నారాయణునుడిగా ఎలా అవుతారు? ఉన్నతంగా తయారవ్వాలి కదా. ఇటువంటి పురుషార్థం చేసి చూపించండి, ఎందుకు తికమకపడుతారు? అందరూ రాజులుగా అవ్వరు కదా అని ఎందుకు నిరాశపడతారు? ఈ ఆలోచన వస్తే ఫెయిల్ అవుతారు. పాఠశాలలో బ్యారిస్టరీ, ఇంజినీరింగ్ మొదలైనవి చదువుకుంటారు. అందరూ బ్యారిస్టర్లుగా ఏమైనా అవుతారా అని అంటారా? చదవకపోతే ఫెయిల్ అవుతారు. పూర్తి మాల 16,108 మందిది. మొట్టమొదట ఎవరొస్తారు? ఎవరు ఎంత పురుషార్ధం చేస్తే అంత. పరస్పరంలో ఒకరి కంటే మరొకరు తీవ్ర పురుషార్థమైతే చేస్తారు కదా. ఇప్పుడు మేము ఈ పాత శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళాలని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇది స్మృతి ఉన్నా పురుషార్థం తీవ్రమవుతుంది. ముక్తి-జీవన్ముక్తి దాత ఒక్క తండ్రేనని పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. ఈ రోజు ప్రపంచంలో ఎన్ని కోట్లమంది మనుష్యులున్నారు. మీరు 9 లక్షలుంటారు. అది కూడా సుమారుగా అని చెప్తారు. సత్యయుగములో ఇంకా ఎంత మంది ఉంటారు. రాజ్యములో కొంత మంది మనుష్యులయితే కావాలి కదా. ఇప్పుడు రాజధాని స్థాపన అవుతుంది. సత్యయుగములో చాలా అందమైన చిన్న వృక్షముంటుందని బుద్ధి చెప్తుంది. దాని పేరే స్వర్గము ప్యారడైజ్. పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం చక్రమంతా తిరుగుతూ ఉంటుంది. ఇది కూడా సదా తిరుగుతూ ఉంటే చాలా మంచిది. ఈ దగ్గు మొదలైనవి ఉంటాయి, ఇది కర్మ భోగము, ఇది పాత చెప్పు. కొత్తది ఇక్కడ లభించేదే లేదు. నేనైతే పునర్జన్మలు తీసుకోను. ఎవరి గర్భంలోకి వెళ్ళను. నేనైతే సాధారణ శరీరంలో ప్రవేశిస్తాను. ఇది వానప్రస్థ అవస్థ, ఇప్పుడు వాణి నుండి అతీతంగా శాంతిధామానికి వెళ్ళాలి. ఎలాగైతే రాత్రి నుండి పగలుగా, పగలు నుండి రాత్రిగా తప్పకుండా అవుతుందో, అలానే ఈ పాత ప్రపంచము తప్పకుండా వినాశనమవుతుంది. ఈ సంగమయుగము తప్పకుండా పూర్తి అయ్యి మళ్ళీ సత్యయుగము వస్తుంది. పిల్లలు స్మృతియాత్రపై చాలా శ్రద్ధ పెట్టాలి, అది ఇప్పుడు చాలా తక్కువగా ఉంది, అందుకే బాబా, బేబీ అని అంటారు. బేబీతనం (చిన్నతనం) చూపిస్తారు. బాబాను స్మృతి చేయలేకపోతున్నాను అని అంటారు, మరి బేబీ అనే అంటారు కదా. తండ్రిని మర్చిపోయేందుకు మీరేమైనా చిన్న బేబీలా? మధురాతి మధురమైన తండ్రి, టీచరు, గురువు, అర్ధకల్పం యొక్క అతి ప్రియమైనవారు, వారిని మర్చిపోతారు. అర్ధకల్పము దుఃఖములో మీరు వారిని ఓ భగవంతుడా! అని స్మృతి చేస్తూ వచ్చారు. ఆత్మ శరీరం ద్వారా అంటుంది కదా. ఇప్పుడు నేను వచ్చాను, మంచి రీతిలో నన్ను స్మృతి చేయండి. అనేకులకు మార్గము తెలియజేయండి. మున్ముందు చాలా వృద్ధి పొందుతూ ఉంటారు. ధర్మము యొక్క వృద్ధి అయితే అవుతుంది కదా. అరవింద్ ఘోష్ యొక్క ఉదాహరణ ఉంది కదా. ఈ రోజు వారి కేంద్రాలెన్ని ఉన్నాయి. అదంతా భక్తి మార్గమని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మీకు జ్ఞానము లభిస్తుంది. పురుషోత్తములుగా తయారయ్యే జ్ఞానమిది. మీరు మానవుల నుండి దేవతలుగా అవుతారు. తండ్రి వచ్చి అందరి మురికి వస్త్రాలను శుభ్రం చేస్తారు. మహిమ అంతా వారిదే. ముఖ్యమైనది స్మృతి. జ్ఞానమైతే చాలా సహజమైనది. మురళి చదివి వినిపించండి. స్మృతి చేస్తూ ఉండండి. స్మృతి చేస్తూ-చేస్తూ ఆత్మ పవిత్రంగా అవుతుంది. పెట్రోలు నిండుతూ ఉంటుంది. తర్వాత ఆత్మ తన ఇంటికి పరుగెడ్తుంది. దీనిని శివబాబా ఊరేగింపు అనండి లేక పిల్లలనండి. తండ్రి చెప్తున్నారు, మిమ్మల్ని కామ చితిపై నుండి దించి యోగచితిపై కూర్చోబెట్టేందుకు నేను వచ్చాను. యోగముతో ఆరోగ్యం, జ్ఞానముతో ఐశ్వర్యం లభిస్తుంది. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. లక్ష్యాన్ని ముందుంచుకొని సంతోషంగా ఉండాలి. ఎప్పుడూ నిరాశపడకూడదు. అందరూ రాజులుగా అవ్వరు కదా అనే ఆలోచన ఎప్పుడూ రాకూడదు. పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందాలి.
2. మధురాతి మధురమైన తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయాలి, ఇందులో బేబీగా అవ్వకూడదు. స్మృతి చేసేందుకు ఉదయము సమయము మంచిది. ప్రశాంతంగా శాంతిలో కూర్చొని స్మృతి చేయండి.