19-05-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - మీరిప్పుడు శాంతిధామానికి, సుఖధామానికి వెళ్ళేందుకు ఈశ్వరీయ ధామంలో కూర్చుని ఉన్నారు. ఇది సత్యమైన సాంగత్యం, ఇక్కడ మీరు పురుషోత్తములుగా అవుతున్నారు"

ప్రశ్న:-

పిల్లలైన మీరు తండ్రికంటే ఉన్నతమైనవారు, తక్కువవారు కాదు - ఎలా ?

జవాబు:-

బాబా చెప్తున్నారు - పిల్లలూ! నేను విశ్వానికి యజమానిగా అవ్వను, మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తాను అంతేకాక బ్రహ్మాండానికి కూడా యజమానులుగా చేస్తాను. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రినైన నేను పిల్లలైన మీకు నమస్కరిస్తాను, అందువలన మీరు నా కంటే కూడా ఉన్నతమైనవారు. నేను యజమానులైన మీకు సలాం చేస్తున్నాను. మీరు మళ్ళీ ఈ విధంగా తయారుచేసే తండ్రికి సలాం చేస్తారు.

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు నమస్తే. బాబా నమస్తే - అని బదులు కూడా చెప్పరు. ఎందుకంటే బాబా మనల్ని బ్రహ్మాండానికి యజమానులుగానే కాక విశ్వానికి కూడా యజమానులుగా చేస్తారని పిల్లలకు తెలుసు. తండ్రి కేవలం బ్రహ్మాండానికి మాత్రమే యజమానిగా అవుతారు, విశ్వానికి యజమానిగా అవ్వరు. పిల్లలను బ్రహ్మాండానికి, విశ్వానికి రెండిటికీ యజమానులుగా చేస్తారు. కనుక గొప్పవారు ఎవరో చెప్పండి? పిల్లలే గొప్పవారు కదా. అందుకే పిల్లలు మళ్ళీ నమస్కరిస్తారు - "బాబా, మమ్మల్ని మీరే ఇంత గొప్పవారిగా, బ్రహ్మాండానికి, విశ్వానికి యజమానులుగా చేస్తున్నారు కనుక మీకు నమస్తే. ముస్లింలు కూడా మాలేకం సలాం, సలాం మాలేకం అని అంటారు కదా. నిశ్చయమున్న పిల్లలకు ఈ సంతోషం ఉంటుంది. నిశ్చయం లేకపోతే ఇక్కడకు ఎవరూ రాలేరు కూడా. ఇక్కడకు ఎవరైతే వచ్చారో వారికి, మేము మనుష్య గురువుల వద్దకు రాలేదని తెలుసు. మనుష్య తండ్రి, టీచర్ లేక మనుష్య గురువు వద్దకు వెళ్ళడం లేదని మీకు తెలుసు. మీరు ఆత్మిక తండ్రి, ఆత్మిక టీచర్, ఆత్మిక సద్గురువు వద్దకు వచ్చారు. ఆ మనుష్యులైతే అనేకమంది ఉన్నారు. కాని వీరైతే ఒక్కరు మాత్రమే ఉన్నారు. వీరి పరిచయం ఇంతకుముందు ఎవ్వరికీ లేదు. రచయిత-రచనల గురించి ఎవ్వరికీ తెలియదని భక్తి మార్గంలోని శాస్త్రాలలో కూడా ఉంది. తెలియని కారణంగానే వారిని అనాథలని అంటారు. ఆత్మలైన మనందరి తండ్రి ఒక్క నిరాకారుడేనని బాగా చదువుకున్నవారైతే అర్థం చేసుకోగలరు. వారు వచ్చి తండ్రి-టీచర్-సద్గురువుగా కూడా అవుతారు. గీతలో కృష్ణుని పేరు ప్రసిద్ధమయ్యింది. గీత సర్వశాస్త్ర శిరోమణి, ఉత్తమోత్తమమైనది. గీతనే మాత-పిత అని అంటారు. ఇతర ఏ శాస్త్రాలను మాత-పిత అని అనరు. శ్రీమద్భగవద్గీత మాత అని మహిమ చేయబడుతుంది. భగవంతుని ముఖ కమలం నుండి వెలువడిన గీతా జ్ఞానం. ఉన్నతాతి ఉన్నతమైనవారు తండ్రి కనుక ఉన్నతాతి ఉన్నతమైనవారు వినిపించిన గీతనే తప్పకుండా రచయిత అవుతుంది. మిగిలిన శాస్త్రాలన్నీ ఆ గీత యొక్క ఆకులు, రచన. రచన ద్వారా ఎప్పుడూ వారసత్వం లభించదు. లభించినా అల్పకాలానికి మాత్రమే. ఇతర శాస్త్రాలు చాలా ఉన్నాయి. వాటిని చదవడం వలన అల్పకాలిక సుఖం ఒక్క జన్మకు మాత్రమే లభిస్తుంది. వాటిని మనుష్యులే మనుష్యులకు చదివిస్తారు. ఎన్ని రకాల చదువులున్నాయో అవన్నీ మనుష్యులు మనుష్యులకు అల్పకాలం కొరకు చదివిస్తారు. అల్పకాలిక సుఖం లభిస్తుంది. మరుసటి జన్మలో మరొక చదువు చదవవలసి వస్తుంది. ఇక్కడ ఒక్క నిరాకార తండ్రి మాత్రమే 21 జన్మలకు వారసత్వమునిస్తారు. దీనిని మనుష్యులెవ్వరూ ఇవ్వలేరు. వారు పైసకు కొరగాకుండా తయారుచేస్తారు. తండ్రి పౌండుగా (విలువైనవారిగా) తయారుచేస్తారు. ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. మీరందరూ ఈశ్వరుని పిల్లలే కదా. సర్వవ్యాపి అన్నందుకు ఏమీ అర్థం చేసుకోలేరు. అందరిలో పరమాత్మ ఉంటే, ఫాదర్ హుడ్ (పితృత్వము) అయిపోతుంది. అందరూ తండ్రులే అయితే వారసత్వం ఎక్కడ నుండి లభిస్తుంది? ఎవరి దుఃఖాన్ని ఎవరు హరిస్తారు. తండ్రినే దుఃఖహర్త - సుఖకర్త అని అంటారు. తండ్రినే తండ్రి దుఃఖాన్ని పొగట్టారంటే, ఏ అర్థమూ రాదు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడిది రావణ రాజ్యం. ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయింది. అందుకే చిత్రాలలో కూడా స్పష్టం చేసి చూపించారు.

మనం పురుషోత్తమ సంగమయుగములో ఉన్నామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తండ్రి పురుషోత్తములుగా చేసేందుకు వచ్చారు. బ్యారిస్టరీ, డాక్టరీ మొదలైనవి చదవడం ద్వారా పదవులు పొందుతారు. ఈ చదువు ద్వారా మేము ఫలానాగా అవుతామని భావిస్తారు. ఇక్కడ మీరు సత్యమైనవారి సాంగత్యంలో కూర్చుని ఉన్నారు. దీని వలన మీరు సుఖధామంలోకి వెళ్తారు. సత్యమైన ధామాలు కూడా రెండున్నాయి. 1. సుఖధామం 2. శాంతిధామం. ఇది ఈశ్వరుని ధామం. తండ్రి రచయిత కదా. ఎవరైతే తండ్రి ద్వారా అర్థం చేసుకుని తెలివికలవారిగా అవుతారో వారి కర్తవ్యం - సేవ చేయడం. తండ్రి అంటున్నారు - ఇప్పుడు మీరు అర్థం చేసుకొని తెలివికలవారిగా అయ్యారు కనుక శివాలయానికి వెళ్ళి అర్థం చేయించండి, వీరిపై ఫలాలు, పుష్పాలు, వెన్న, నెయ్యి, ఉమ్మెత్త పూలు, గులాబి పూలు మొదలైన వెరైటీలు ఎందుకు అర్పిస్తారో వారికి చెప్పండి. కృష్ణుని మందిరంలో ఉమ్మెత్త పూలు అర్పించరు. అక్కడకు చాలా మంచి సువాసన కల పుష్పాలను తీసుకు వెళ్తారు. శివుని ముందు ఉమ్మెత్త పూలనూ, గులాబి పూలను కూడా అర్పిస్తారు. దీని అర్థమైతే ఎవ్వరికీ తెలియదు. ఈ సమయంలో పిల్లలైన మిమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు. మనుష్యులెవ్వరూ చదివించరు. మిగిలిన ప్రపంచమంతటా మనుష్యులే మనుష్యులను చదివిస్తారు. మిమ్మల్ని భగవంతుడే చదివిస్తారు. ఏ మనిషినీ భగవంతుడని ఎన్నటికీ అనరు. లక్ష్మినారాయణులను కూడా భగవంతుడని అనరు. వారిని దేవీ దేవతలని అంటారు. బ్రహ్మా-విష్ణు-శంకరులను కూడా దేవతలని అంటారు. భగవంతుడు ఒక్క తండ్రి మాత్రమే. వారు సర్వాత్మల తండ్రి. అందరూ ఓ పరమపిత పరమాత్మ! అని అంటారు. వారి సత్యాతి సత్యమైన పేరు శివ, పిల్లలైన మీరు సాలిగ్రామాలు. పండితులు రుద్ర యజ్ఞాన్ని రచించినప్పుడు శివలింగాన్ని పెద్దదిగా చేస్తారు. సాలిగ్రామాలను చిన్న-చిన్నవిగా చేస్తారు. ఆత్మలను సాలిగ్రామాలని అంటారు. శివుడు అనగా పరమాత్మ, వారు అందరికీ తండ్రి, మనమంతా భాయి-భాయి (సోదరులము), బ్రదర్ హుడ్ (సోదరత్వము) అని కూడా అంటారు. తండ్రి పిల్లలమైన మనమంతా సోదరులం. అయితే సోదరీ-సోదరులుగా ఎలా అయ్యారు? ప్రజాపిత బ్రహ్మా నోటి ద్వారా ప్రజలు రచింపబడ్డారు. వారు బ్రాహ్మణులు, బ్రాహ్మణీలు. మనం ప్రజాపిత బ్రహ్మా సంతానం. కనుక బి.కె.లని అంటారు. అచ్ఛా. బ్రహ్మాకు జన్మను ఇచ్చిందెవరు? భగవంతుడు. బ్రహ్మా, విష్ణు, శంకరులు..... వీరందరూ రచన. సూక్ష్మవతనాన్ని కూడా రచించడం జరిగింది. బ్రహ్మా ముఖ కమలం ద్వారా పిల్లలైన మీరు వెలువడ్డారు. బ్రాహ్మణ-బ్రాహ్మణీలని పిలువబడ్డారు. మీరు బ్రహ్మా ముఖవంశావళి దత్తత తీసుకోబడినవారు. ప్రజాపిత బ్రహ్మా పిల్లలకు ఎలా జన్మనిస్తారు, తప్పకుండా దత్తత తీసుకుంటారు. ఎలాగైతే గురువు అనుచరులను దత్తత తీసుకుంటారు, వారిని శిష్యులని అంటారు. కనుక ప్రజాపిత బ్రహ్మా మొత్తం ప్రపంచానికంతా తండ్రి అయ్యారు. వారిని గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. ప్రజాపిత బ్రహ్మా అయితే ఇక్కడ ఉండాలి కదా. సూక్ష్మవతనంలో కూడా బ్రహ్మా ఉన్నారు. బ్రహ్మా-విష్ణు-శంకరులని గాయనం చేయబడింది కాని సూక్ష్మవతనంలో అయితే ప్రజలుండరు. ప్రజాపిత బ్రహ్మా ఎవరు మొదలైన విషయాలన్నీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఆ బ్రాహ్మణులు కూడా స్వయాన్ని బ్రహ్మా సంతానమని చెప్పుకుంటారు. ఇప్పుడు బ్రహ్మా ఎక్కడ ఉంటారు? మీరైతే ఇక్కడ కూర్చుని ఉన్నారని అంటారు. వారైతే, ఒకప్పుడు ఉండి వెళ్ళారని అంటారు. వారు మళ్ళీ తమను తాము పూజారి బ్రాహ్మణులుగా చెప్పుకుంటారు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మా పిల్లలు పరస్పరంలో సోదరీ-సోదరులవుతారు. బ్రహ్మాను శివబాబా దత్తత తీసుకున్నారు. నేను ఈ వృద్ధ శరీరంలో ప్రవేశించి మీకు రాజయోగం నేర్పిస్తానని చెప్తున్నారు. మనుష్యులను దేవతలుగా చేయడమనేది మనుష్యుల పని కాదు. రచయిత అని తండ్రినే అంటారు. భారతీయులకు తెలుసు, శివజయంతిని కూడా జరుపుకుంటారు. శివుడు అందరికీ తండ్రి. దేవీ దేవతలకు ఈ రాజ్యాన్ని ఎవరు ఇచ్చారో కూడా మనుష్యులకు తెలియదు. స్వర్గ రచయిత పరమాత్మ, వారిని పతితపావనుడని అంటారు. వాస్తవానికి ఆత్మ పవిత్రంగా ఉంటుంది. తర్వాత సతో, రజో, తమోలోకి వస్తుంది. ఈ సమయం కలియుగంలో ఉన్నవారంతా తమోప్రధానులు, సత్యయుగంలో సతోప్రధానంగా ఉండేవారు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. 2500 సంవత్సరాలు దేవతా వంశం కొనసాగింది. వారి పిల్లలు కూడా రాజ్యం చేశారు కదా. లక్ష్మీ నారాయణ ది ఫస్ట్, ది సెకండ్..... ఇలా కొనసాగుతూ వస్తుంది. మనుష్యులకు ఈ విషయాల గురించి కొంచెం కూడా తెలియదు. ఈ సమయంలో అందరూ తమోప్రధాన, పతితులుగా ఉన్నారు. ఇక్కడ ఒక్క మనిషి కూడా పావనంగా ఉండరు. అందరూ ఓ పతితపావనా రండి అని పిలుస్తారు. కనుక ఇది పతిత ప్రపంచమే కదా. దీనినే కలియుగ నరకమని అంటారు. కొత్త ప్రపంచాన్ని స్వర్గమని, పావన ప్రపంచమని అంటారు. మళ్ళీ పతితులుగా ఎలా అయ్యామని ఎవ్వరికీ తెలియదు. భారతదేశంలో తమ 84 జన్మల గురించి తెలిసిన మనిషి ఒక్కరు కూడా లేరు. మనుష్యులు ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు తీసుకుంటారు, తక్కువలో తక్కువ ఒక్క జన్మ తీసుకుంటారు.

భారతదేశాన్ని అవినాశీ ఖండమని అంటారు. ఎందుకంటే ఇక్కడే శివబాబా అవతరణ జరుగుతుంది. భారతఖండం ఎప్పుడూ వినాశనమవ్వదు. మిగిలిన ఖండాలన్నీ వినాశనమవుతాయి. ఈ సమయంలో ఆదిసనాతన దేవీ దేవతా ధర్మం ప్రాయః లోపమైపోయింది. ఎవ్వరూ స్వయాన్ని దేవతలుగా పిలుచుకోలేరు. ఎందుకంటే దేవతలు సతోప్రధానంగా, పావనంగా ఉండేవారు. ఇప్పుడందరూ పతితంగా, పూజారులుగా అయిపోయారు. ఇది కూడా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. భగవానువాచ కదా. భగవంతుడు అందరికీ తండ్రి, వారు ఒక్కసారి మాత్రమే భారతదేశంలో వస్తారు. ఎప్పుడు వస్తారు? పురుషోత్తమ సంగమయుగంలో వస్తారు. ఈ సంగమయుగాన్నే పురుషోత్తమ యుగమని అంటారు. ఇది సంగమయుగం, కలియుగం నుండి సత్యయుగంగా, పతితం నుండి పావనంగా అయ్యే యుగం. కలియుగంలో పతిత మనుష్యులుంటారు, సత్యయుగంలో పావన దేవతలుంటారు. కనుక దీనిని పురుషోత్తమ సంగమయుగమని అంటారు. ఈ సమయంలో తండ్రి వచ్చి పతితుల నుండి పావనంగా చేస్తారు. మీరు మనుష్యుల నుండి దేవతలుగా, పురుషోత్తములుగా అయ్యేందుకు వచ్చారు. ఆత్మలమైన మనం నిర్వాణధామంలో ఉండేవారమని కూడా మనుష్యులకు తెలియదు. అక్కడ నుండి పాత్రను అభినయించేందుకు వస్తారు. ఈ నాటకం ఆయువు 5 వేల సంవత్సరాలు. మనం ఈ అనంతమైన నాటకంలో పాత్రను అభినయిస్తున్నాము. ఈ మనుష్యులందరూ పాత్రధారులు. ఈ డ్రామా చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడూ ఆగదు. మొట్టమొదట ఈ నాటకంలో సత్యయుగంలో పాత్రను అభినయించేందుకు దేవీ దేవతలు వస్తారు. త్రేతాయుగంలో క్షత్రియులుంటారు. ఈ నాటకం గురించి కూడా తెలుసుకోవాలి కదా. ఇది ముళ్ళ అడవి. మనుష్యులందరూ దుఃఖంలోనే ఉన్నారు. కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది. కలియుగంలో అనేకమంది మనుష్యులున్నారు. సత్యయుగంలో ఎంతమంది ఉంటారు? చాలా కొద్దిమందే ఉంటారు. ఆది సనాతన సూర్యవంశీ దేవీ దేవతలే ఉంటారు. ఈ పాత ప్రపంచం ఇప్పుడు మారుతుంది. మనుష్య సృష్టి నుండి మళ్ళీ దేవతల సృష్టిగా మారుతుంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మముండేది. కాని ఇప్పుడు స్వయాన్ని దేవీదేవతలని పిలుచుకోరు. తమ ధర్మమునే మర్చిపోయారు. కేవలం భారతీయులు మాత్రమే తమ ధర్మాన్ని మర్చిపోయారు. హిందుస్థాన్ లో ఉన్నందున హిందూ ధర్మమని అంటారు. దేవతలు పావనంగా ఉండేవారు, ఇక్కడుండేవారు పతితులు. కనుక స్వయాన్ని దేవతలమని చెప్పుకోలేరు. దేవతలను పూజిస్తూ ఉంటారు. స్వయాన్ని పాపులము, నీచులము అని అనుకుంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీరే పూజ్యులుగా ఉండేవారు. తర్వాత మీరే పతిత పూజారులుగా అయ్యారు. హంసో కు అర్థం కూడా అర్థం చేయించారు. వారు ఆత్మనే పరమాత్మ అని అంటారు. ఇది అసత్యమైన అర్థం. అసత్య శరీరం, అసత్య మాయ..... సత్యయుగంలో ఇలా అనరు. తండ్రి సత్య ఖండాన్ని స్థాపన చేస్తారు. రావణుడు మళ్ళీ అసత్య ఖండంగా చేస్తాడు. ఇది కూడా తండ్రినే వచ్చి అర్థం చేయిస్తారు. ఆత్మ అనగా ఏమిటి, పరమాత్మ అనగా ఏమిటి - ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు - మీరు ఆత్మ బిందువు, మీలో 84 జన్మల పాత్ర నింపబడి ఉంది. ఆత్మలైన మనం ఎలా ఉంటామో కూడా ఎవ్వరికీ తెలియదు. నేను బ్యారిష్టరును, ఫలానా అని మాత్రం తెలుసు. ఆత్మ గురించి ఒక్కరికి కూడా తెలియదు. తండ్రి వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. మీ ఆత్మలో 84 జన్మల అవినాశి పాత్ర నిండి ఉంది. అది ఎప్పుడూ నాశనమవ్వదు. ఈ భారతదేశమే పుష్పాలతోటగా ఉండేది. సుఖమే సుఖముండేది. ఇప్పుడు దుఃఖమే దుఃఖముంది. ఈ తండ్రి జ్ఞానాన్ని ఇస్తున్నారు.

పిల్లలైన మీరిప్పుడు తండ్రి ద్వారా కొత్త-కొత్త విషయాలు వింటారు. అన్నిటికంటే కొత్త విషయం - మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే చదువును ఏ మనుష్యులూ చదివించలేరు, భగవంతుడు చదివిస్తారు. ఆ భగవంతుడిని సర్వవ్యాపి అనడం నిందించడం అవుతుంది. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేను ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా చేస్తాను. రావణుడు నరకంగా చేస్తాడు. ఈ విషయాలు ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియదు. తండ్రి వచ్చి మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా చేస్తారు. మలిన వస్త్రాలను శుభ్రపరిచారని గాయనం కూడా ఉంది (మూత్ పలీతీ కపడ్ ధోయే). అక్కడ వికారాలే ఉండవు. అది సంపూర్ణ నిర్వికారీ ప్రపంచం. ఇప్పుడిది వికారీ ప్రపంచము. పతితపావనా రండి, మమ్మల్ని రావణుడు పతితులుగా చేశాడని పిలుస్తూ ఉంటారు. కానీ రావణుడు ఎప్పుడు వచ్చాడో, ఏం జరిగిందో తెలియదు. రావణుడు ఎంత నిరుపేదలుగా చేసేశాడు. భారతదేశం 5 వేల సంవత్సరాల క్రితం చాలా సంపన్న దేశంగా ఉండేది. బంగారు, వజ్ర వైఢూర్యాల మహళ్ళు ఉండేవి. ఎంత ధనం ఉండేది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది! ఒక్క తండ్రి తప్ప ఎవ్వరూ కిరీటధారులుగా చేయలేరు. శివబాబా భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారని ఇప్పుడు మీరు చెప్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మృత్యువు మీ ఎదురుగా నిలబడి ఉంది. మీరు వానప్రస్థులు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి కనుక స్వయాన్ని ఆత్మగా భావించి నన్నొక్కరినే స్మృతి చేస్తే పాపాలు భస్మమైపోతాయి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మేము బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులము, స్వయం భగవంతుడు మమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా చేసే చదువు చదివిస్తున్నారు. ఈ నషా మరియు సంతోషంలో ఉండాలి. పురుషోత్తమ సంగమయుగంలో పురుషోత్తమంగా అయ్యే పురుషార్థం చేయాలి.

2. ఇప్పుడు మనది వానప్రస్థ అవస్థ. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. తిరిగి ఇంటికి వెళ్ళాలి..... కనుక తండ్రి స్మృతి ద్వారా అన్ని పాపాలను భస్మం చేసుకోవాలి.

వరదానము:-

"ఆత్మిక యాత్రికుడను” అనే స్మృతి ద్వారా సదా ఉపరామంగా, అతీతంగా మరియు నిర్మోహీ భవ

ఆత్మిక యాత్రికులు సదా స్మృతియాత్రలో ముందుకు సాగుతూ ఉంటారు, ఈ యాత్ర సదా సుఖమునిచ్చేది. ఎవరైతే ఆత్మిక యాత్రలో తత్పరులై ఉంటారో వారికి ఏ ఇతర యాత్ర చేసే అవసరం లేదు. ఈ యాత్రలో అన్ని యాత్రలు ఇమిడి ఉన్నాయి. మనసు మరియు శరీరంతో భ్రమించడం సమాప్తమైపోతుంది. కనుక సదా మేము ఆత్మిక యాత్రికులము అనే స్మృతి ఉండాలి. యాత్రికులకు ఎవ్వరిపైనా మోహముండదు. వారికి సహజంగానే ఉపరామంగా, అతీతంగా మరియు నిర్మోహులుగా అయ్యే వరదానము లభిస్తుంది.

స్లోగన్:-

సదా వాహ్ బాబా, వాహ్ భాగ్యము మరియు వాహ్ మధురమైన పరివారము - ఇదే పాట పాడుతూ ఉండండి.