18-05-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీరు మళ్ళీ మీ స్థానానికి చేరుకున్నారు, మీరు తండ్రి ద్వారా రచయిత మరియు రచనలను తెలుసుకున్నారు కావున సంతోషంలో మీ రోమ-రోమాలు పులకరించిపోవాలి"

ప్రశ్న:-

ఈ సమయంలో తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఎందుకు అలంకరిస్తున్నారు?

జవాబు:-

ఎందుకంటే ఇప్పుడు మనం అలంకరించబడి విష్ణుపురికి (అత్తవారింటికి) వెళ్ళాలి. మనం ఈ జ్ఞానంతో అలంకరింపబడి విశ్వం యొక్క మహారాజా-మహారాణిగా అవుతాము. ఇప్పుడు సంగమయుగంలో ఉన్నాము, బాబా పుట్టింటి నుండి అత్తవారింటికి తీసుకెళ్ళేందుకు టీచరుగా అయ్యి చదివిస్తున్నారు.

గీతము:-

చివరికి నేడు ఆ రోజు వచ్చింది..... (ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్.....)

ఓంశాంతి. మధురాతి-మధురమైన స్వీట్ చిల్డ్రన్, మధురాతి-మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు పాట విన్నారు. అర్థకల్పం ఏ ప్రియుడినైతే గుర్తు చేశామో, చివరికి వారు లభించారని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మనం అర్థకల్పం భక్తి చేస్తామని, ప్రియుడైన తండ్రిని పిలుస్తామని ప్రపంచంలోని వారికి తెలియదు. మేము ప్రేయసులము, వారు ప్రియుడు - ఇది కూడా ఎవరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు, రావణుడు మిమ్మల్ని పూర్తిగా తుచ్ఛబుద్ధికలవారిగా చేసేశాడు, అందులోనూ విశేషంగా భారతవాసీయులను. మీరు దేవీ-దేవతలుగా ఉండేవారు అని కూడా మర్చిపోయారు కనుక తుచ్ఛబుద్ధికలవారిగా అయ్యారు. తమ ధర్మమును మర్చిపోవడం, ఇది తుచ్ఛబుద్ధికలవారి పని. ఇప్పుడిది మీకు మాత్రమే తెలుసు. భారతవాసీయులమైన మనం స్వర్గవాసులుగా ఉండేవారము. ఈ భారత్ స్వర్గంగా ఉండేది. కొంత సమయమే గడిచింది. 1250 సంవత్సరాలు సత్యయుగముండేది మరియు 1250 సంవత్సరాలు రామరాజ్యం నడిచింది. ఆ సమయంలో అపారమైన సుఖముండేది. సుఖాన్ని గుర్తు చేసుకొని రోమ-రోమాలు పులకరించిపోవాలి. సత్యయుగం, త్రేతా..... ఇవి గడిచిపోయాయి. సత్యయుగం యొక్క ఆయుష్షు ఎంత ఉండేదో, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. లక్షల సంవత్సరాలెలా ఉంటుంది. మిమ్మల్ని మాయ ఎంత తుచ్ఛబుద్ధికలవారిగా తయారుచేసిందో - ఇప్పుడు తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. ప్రపంచంలోని ఎవరూ స్వయాన్ని తుచ్ఛబుద్ధికలవారిగా భావించరు. మనం నిన్న తుచ్ఛబుద్ధికలవారిగా ఉండేవారమని మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి మనకు రచయిత మరియు రచన యొక్క ఆది-మధ్య-అంత్యాలను తెలుసుకునేటంత బుద్ధి ఇచ్చారు. నిన్న మనకు తెలియదు, ఈ రోజు తెలుసుకున్నాము. ఎంతెంతగా తెలుసుకుంటూ ఉంటామో, అంతగా సంతోషంతో పులకరించిపోతారు. మనం మళ్ళీ మన స్థానానికి చేరుకుంటాము. తండ్రి మనకు స్వర్గం యొక్క రాజ్యాన్నిచ్చారు, మళ్ళీ మనం పోగొట్టుకున్నాము. ఇప్పుడు పతితులుగా అయిపోయాము. సత్యయుగాన్ని పతిత యుగమని అనరు. అది ఉన్నదే పావన ప్రపంచం. మనుష్యులు ఓ పతిత-పావనా రండి అని అంటారు. రావణరాజ్యంలో పావనమైన ఉన్నతమైనవారు ఎవ్వరూ ఉండనే ఉండరు. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రికి పిల్లలుగా అయ్యారంటే, ఉన్నతంగా కూడా అయినట్లు. పిల్లలైన మీరు తండ్రిని తెలుసుకున్నారు, అది కూడా నంబరువారు పురుషార్థానుసారంగా తెలుసుకున్నారు. ఉదయమే లేచి తమ హృదయాన్ని ప్రశ్నించుకోండి, అమృతవేళ సమయం మంచిది. ఉదయం అమృతవేళలో కూర్చొని ఈ విధంగా ఆలోచించండి. బాబా మనకు తండ్రి కూడా, టీచర్ కూడా. ఓ గాడ్ ఫాదర్, ఓ పరమపిత పరమాత్మా అని అయితే అంటూనే ఉంటారు. ఓ భగవంతుడా, అని ఎవరినైతే స్మృతి చేస్తున్నారో వారు మనకిప్పుడు లభించారు అని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. మనం మళ్ళీ అనంతమైన వారసత్వం తీసుకుంటున్నాము. వారు లౌకిక తండ్రి, వీరు అనంతమైన తండ్రి. మీ లౌకిక తండ్రి కూడా ఆ అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. కనుక తండ్రులకే తండ్రి, పతులకే పతిగా వారు అయ్యారు. ఈ మాట అనేది కూడా భారతవాసీయులే ఎందుకంటే ఇప్పుడు నేను తండ్రులకే తండ్రి, పతులకే పతిగా అవుతాను. ఇప్పుడు నేను మీకు తండ్రిని కూడా. మీరు పిల్లలుగా అయ్యారు. బాబా-బాబా అని అంటూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని విష్ణుపురిలోకి అత్తవారింటికి తీసుకెళ్తాను. ఇది మీ తండ్రి ఇల్లు, తర్వాత అత్తవారింటికి వెళ్తారు. మనం చాలా బాగా అలంకరించబడుతున్నామని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మీరు పుట్టింట్లో ఉన్నారు కదా. మిమ్మల్ని చదివించడం జరుగుతుంది కూడా. మీరు ఈ జ్ఞానంతో అలంకరింపబడి విశ్వం యొక్క మహారాజా-మహారాణులుగా అవుతారు. మీరు విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు ఇక్కడకు వచ్చారు. సత్యయుగమున్నప్పుడు భారతవాసీయులైన మీరే విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు మీరు మేము విశ్వానికి యజమానులము అని అనరు. భారత్ యొక్క యజమానులు కలియుగములోని వారని, మనం సంగమయుగంలోని వారమని ఇప్పుడు మీకు తెలుసు. మళ్ళీ మనం సత్యయుగంలో విశ్వమంతటికీ యజమానులుగా అవుతాము. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలోకి రావాలి. విశ్వం యొక్క రాజ్యం ఇచ్చేవారు వచ్చారని తెలుసు. వారిప్పుడు సంగమయుగంలో వచ్చారు. జ్ఞానదాత ఒక్క తండ్రి మాత్రమే. తండ్రిని తప్ప ఏ మనిషినీ జ్ఞానదాత అని అనరు ఎందుకంటే తండ్రి వద్ద ఎటువంటి జ్ఞానం ఉందంటే దానితో విశ్వం యొక్క సద్గతి జరుగుతుంది. తత్వాల సహితంగా అందరి సద్గతి జరుగుతుంది. మనుష్యుల వద్ద సద్గతినిచ్చే జ్ఞానం లేదు.

ఈ సమయంలో తత్వాల సహితంగా ప్రపంచమంతా తమోప్రధానంగా ఉంది. ఇందులో ఉండేవారు కూడా తమోప్రధానంగా ఉన్నారు. కొత్త ప్రపంచమే సత్యయుగం. అక్కడ దేవతలే నివసించేవారు, తర్వాత రావణుడు గెలుపొందాడు. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు. మేము బాప్ దాదా వద్దకు వెళ్తామని పిల్లలైన మీరంటారు. తండ్రి మనకు దాదా ద్వారా స్వర్గ రాజ్యం యొక్క వారసత్వం ఇస్తారు. తండ్రైతే స్వర్గ రాజ్యమిస్తారు, ఇంకేమిస్తారు. పిల్లలైన మీ బుద్ధిలోకి ఇది రావాలి కదా. కాని మాయ మరపింపజేస్తుంది. స్థిరమైన సంతోషం ఉండనివ్వదు. ఎవరైతే మంచి రీతిగా చదువుకుంటూ-చదివిస్తారో వారే ఉన్నత పదవి పొందుతారు. సెకండులో జీవన్ముక్తి అని గాయనం కూడా ఉంది. వారిని ఒక్కసారే గుర్తించాలి కదా. ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే, ఆ ఆత్మలందరి తండ్రి వచ్చి ఉన్నారు. కానీ అందరూ కలవలేరు కూడా. అసాధ్యము. తండ్రి చదివించేందుకు వస్తారు. మీరు అందరూ కూడా టీచర్లే. గీతాపాఠశాల అని అంటారు కదా. ఇది కూడా సాధారణ పదమే. కృష్ణుడు గీతను వినిపించారని అంటారు. అయితే ఇది కృష్ణుని పాఠశాల కాదు. కృష్ణుని ఆత్మ చదువుకుంటుంది. సత్యయుగంలో ఏదైనా గీతా పాఠశాలలో చదువుకుని చదివిస్తారా? కృష్ణుడైతే సత్యయుగంలోనే ఉంటారు, తర్వాత 84 జన్మలు తీసుకుంటారు. ఒక్క శరీరం కూడా మరోదాని వలె ఉండదు. డ్రామా ప్లాన్ అనుసారంగా ప్రతి ఆత్మలో తమ 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఒక సెకండు మరో సెకండుతో కలవదు. మీరు 5 వేల సంవత్సరాలు పాత్రను అభినయిస్తారు. ఒక సెకండు యొక్క పాత్ర మరో సెకండుతో కలవదు. ఇది ఎంత అర్థం చేసుకోవలసిన విషయము. డ్రామా కదా. పాత్ర పునరావృతమవుతూ ఉంటుంది. అయితే ఆ శాస్త్రాలన్నీ భక్తిమార్గానికి సంబంధించినవి. అర్ధకల్పం భక్తి నడుస్తుంది, తర్వాత నేనే వచ్చి సర్వులకు సద్గతినిస్తాను. 5 వేల సంవత్సరాల క్రితం రాజ్యం చేసేవారని మీకు తెలుసు. సద్గతిలో ఉండేవారము. దుఃఖమనే పేరు లేదు. ఇప్పుడైతే దుఃఖమే దుఃఖముంది. దీనిని దుఃఖధామమని అంటారు. శాంతిధామం, సుఖధామం మరియు దుఃఖధామం. భారతవాసీయులకు మాత్రమే వచ్చి సుఖధామానికి మార్గాన్ని తెలియజేస్తాను. కల్ప-కల్పం మళ్ళీ నేను రావలసి వస్తుంది. అనేకసార్లు వచ్చాను, వస్తూనే ఉంటాను. దీనికి అంతం ఉండదు. మీరు చక్రం తిరిగి దుఃఖధామంలోకి వస్తారు, నేను మళ్ళీ రావలసి వస్తుంది. ఇప్పుడు మీకు 84 జన్మల చక్రం స్మృతిలోకి వచ్చింది. ఇప్పుడు తండ్రిని రచయిత అని అంటారు. అయితే డ్రామాను రచించారని కాదు. రచయిత అనగా ఈ సమయంలో వచ్చి సత్యయుగాన్ని రచిస్తారు. సత్యయుగంలో ఎవరిదైతే రాజ్యముండేదో, వారు పోగొట్టుకున్నారు, వారిని మాత్రమే కూర్చుని చదివిస్తాను. పిల్లలను దత్తత తీసుకుంటాను. మీరు నా పిల్లలు కదా. మిమ్మల్ని సాధు-సత్పురుషులు మొదలైనవారెవ్వరూ చదివించరు. చదివించేవారు ఒక్క తండ్రి, అందరూ వారినే స్మృతి చేస్తారు. ఎవరినైతే స్మృతి చేస్తారో వారు తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు వస్తారు కదా. స్మృతి ఎందుకు చేస్తారో కూడా ఎవ్వరికీ తెలియదు. కావున పతిత-పావనులైన తండ్రి తప్పకుండా వస్తారు. మళ్ళీ రండి అని ఈ విధంగా క్రీస్తును పిలవరు. వారు లీనమైపోయారని భావిస్తారు. కనుక మళ్ళీ వచ్చే విషయమే లేదు. ఆత్మలైన మాకు మళ్ళీ వారసత్వమివ్వండి అని పతిత-పావనుడినే మళ్ళీ స్మృతి చేస్తారు. బాబా వచ్చారని, కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారని ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతి కలిగింది. వారు (ఇతర ధర్మ స్థాపకులు) మళ్ళీ తమ సమయంలో రజో, తమోలోనే వస్తారు. మనం మాస్టర్ జ్ఞానస్వరూపులుగా అవుతున్నామని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు.

పిల్లలైన మిమ్మల్ని చదివించి విశ్వానికి యజమానులుగా తయారుచేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారు స్వయంగా అలా అవ్వరు, అందుకే వారిని నిష్కామ సేవాధారి అని అంటారు. మేము ప్రతిఫలాన్ని ఆశించమని, నిష్కామ సేవ చేస్తున్నామని మనుష్యులు అంటారు. కానీ అలా జరగదు. ఎటువంటి సంస్కారాన్ని తీసుకెళ్తారో, దాని అనుసారంగానే జన్మ లభిస్తుంది. కర్మ ఫలితం తప్పకుండా లభిస్తుంది. సన్యాసులు కూడా గృహస్థుల వద్దకు వెళ్ళి తర్వాత సంస్కారమనుసారంగా సన్యాస ధర్మంలోకి వెళ్ళిపోతారు. బాబా యుద్ధం చేసేవారి ఉదాహరణ కూడా ఇస్తారు. ఎవరైతే యుద్ధ మైదానంలో మరణిస్తారో వారు స్వర్గంలోకి వెళ్తారని గీతలో వ్రాయబడినట్లు చెప్తారు, కానీ స్వర్గం యొక్క సమయం కూడా కావాలి కదా. స్వర్గం లక్షల సంవత్సరాలు ఉంటుందని అంటారు. ఇప్పుడు తండ్రి ఏం అర్థం చేయిస్తున్నారో, గీతలో ఏం వ్రాశారో మీకిప్పుడు తెలుసు. భగవానువాచ, నేను సర్వవ్యాపి అని అంటారు. తండ్రి చెప్తున్నారు, నన్ను నేను సర్వవ్యాపినని, కుక్కలో-పిల్లిలో అన్నిటిలో ఉన్నానని ఈ విధంగా ఎలా నిందించుకుంటాను. నన్ను అయితే జ్ఞాన సాగరుడని అంటారు. నన్ను నేను మళ్ళీ ఈ విధంగా ఎలా చెప్పుకుంటాను? ఎంత అసత్యం. ఎవ్వరిలోనూ జ్ఞానం లేదు. సన్యాసులు మొదలైనవారికి ఎంత గౌరవం ఉంటుంది, ఎందుకంటే పవిత్రంగా ఉంటారు. సత్యయుగంలో గురువులెవ్వరూ ఉండరు. ఇక్కడ స్త్రీకి నీ పతియే గురువు ఈశ్వరుడు, ఇక ఏ ఇతర గురువును ఆశ్రయించవద్దని చెప్తారు. భక్తి కూడా సతోప్రధానంగా ఉండే సమయంలో ఆ విధంగా అర్థం చేయించేవారు. సత్యయుగంలో అయితే గురువులుండరు. భక్తి ప్రారంభమైనప్పుడు కూడా గురువులుండరు. పతియే సర్వస్వం. గురువులను ఆశ్రయించరు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు.

చాలామంది బ్రహ్మాకుమార్-బ్రహ్మాకుమారీల పేరు వింటూనే భయపడిపోతారు ఎందుకంటే వీరు సోదరీ-సోదరులుగా చేస్తారని భావిస్తారు. అరే, ప్రజాపిత బ్రహ్మా సంతానంగా అవ్వడం మంచిదే కదా. బి.కె.లు మాత్రమే స్వర్గం యొక్క వారసత్వం తీసుకుంటారు. మీరు ఇప్పుడు తీసుకుంటున్నారు. మీరు బి.కె.లుగా అయ్యారు. మేము సోదరీ-సోదరులము అని ఇద్దురూ అంటారు. శరీర భానం, వికారాల దుర్గంధం తొలగిపోతుంది. మనం ఒకే తండ్రి పిల్లలము, సోదరీ-సోదరులము, వికారాల్లోకి ఎలా వెళ్తాము. ఇది చాలా పెద్ద పాపం. పవిత్రంగా ఉండేందుకే ఈ యుక్తి డ్రామాలో ఉంది. సన్యాసులది నివృత్తి మార్గం. మీరు ప్రవృత్తి మార్గంలోనివారు. ఇప్పుడు మీరు ఈ ఛీ-ఛీ ప్రపంచంలోని ఆచార-పద్ధతులను విడిచిపెట్టి ఈ ప్రపంచాన్నే మర్చిపోవాలి. మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు మళ్ళీ రావణుడు ఎంత ఛీ-ఛీగా తయారుచేశాడు. ఇది కూడా బాబా అర్థం చేయించారు, కొందరు మేము 84 జన్మలు తీసుకున్నామని ఎలా అంగీకరించాలని అడుగుతారు. 84 జన్మలు తీసుకున్నారని మనం మంచే చెప్తాము కదా. 84 జన్మలు తీసుకోకపోతే ఇక్కడ నిలవనే నిలవరు. వారు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు కాదు, స్వర్గంలోకి రాలేరు అని అర్థమవుతుంది. ప్రజల్లో కూడా తక్కువ పదవిని తీసుకుంటారు. ప్రజల్లో కూడా మంచి పదవులు, తక్కువ పదవులు ఉంటాయి కదా. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. భగవంతుడు వచ్చి రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. శ్రీకృష్ణుడైతే వైకుంఠానికి యజమానిగా ఉండేవారు. తండ్రి స్థాపన చేస్తారు. తండ్రి వినిపించిన గీత ద్వారా ఈ పదవి పొందుతారు, తర్వాత చదువుకునే మరియు చదివించే అవసరమే లేదు. మీరు చదువుకుని పదవి పొందుతారు. తర్వాత గీతా జ్ఞానాన్ని చదవరు. జ్ఞానం ద్వారా సద్గతి లభించింది, ఎంతగా పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. కల్పక్రితం ఎంత పురుషార్థమైతే చేశారో, అంతే చేస్తూ ఉంటారు. సాక్షీగా అయ్యి చూడాలి. టీచర్ ను కూడా చూడాలి, వీరు మమ్మల్ని చదివించారు, మనం వీరి కంటే కూడా తెలివైనవారిగా అవ్వాలి. చాలా మార్జిన్ (అవకాశం) ఉంది. ఉన్నతాతి ఉన్నతంగా అయ్యేందుకు ప్రయత్నించాలి. తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వడమే ముఖ్యమైన విషయం. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి, తండ్రిని స్మృతి చేస్తే పావనంగా అవుతారు. ఇక్కడ అందరూ పతితులుగా ఉన్నారు, ఇక్కడ దుఃఖమే దుఃఖముంది. సుఖవంతమైన రాజ్యం ఎప్పుడుండేదో ఎవ్వరికీ తెలియదు. దుఃఖంలో ఓ భగవంతుడా, ఓ రామా, ఈ దుఃఖం ఎందుకిచ్చారు అని అంటారు. ఇప్పుడు భగవంతుడైతే ఎవ్వరికీ దుఃఖమివ్వరు. దుఃఖమిచ్చేది రావణుడు, మన రాజ్యంలో ఇతర ధర్మమేదీ ఉండదని ఇప్పుడు మీకు తెలుసు. తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి. భలే మీరు ఎక్కడికైనా వెళ్ళండి. చదువు తోడుగా ఉంది, మన్మనాభవ లక్ష్యమైతే లభించింది, తండ్రిని స్మృతి చేయండి. తండ్రి నుండి మనం స్వర్గం యొక్క వారసత్వం తీసుకుంటున్నాము. ఇది కూడా స్మృతి చేయలేరు. ఈ స్మృతి పక్కాగా ఉండాలి. అప్పుడు అంతమతి సో గతి అయిపోతుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఉదయముదయాన్నే అమృతవేళలో లేచి - బాబా మనకు తండ్రి కూడా, టీచర్ కూడా, ఇప్పుడు బాబా మనల్ని జ్ఞాన రత్నాలతో అలంకరించేందుకు వచ్చారు. వారు తండ్రులకు తండ్రి, పతులకు పతి, ఈ విధంగా ఆలోచిస్తూ అపారమైన సంతోషాన్ని అనుభవం చేయాలి.

2. ప్రతి ఒక్కరి పురుషార్థాన్ని సాక్షీగా అయ్యి చూడాలి, ఉన్నత పదవి పొందేందుకు మార్జిన్ (అవకాశం) ఉంది కావున తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలి.

వరదానము:-

సంగమయుగంలో ప్రత్యక్ష ఫలం ద్వారా శక్తిశాలిగా తయారయ్యే సదా సమర్థ ఆత్మా భవ

సంగమయుగంలో ఏ ఆత్మలైతే అనంతమైన సేవకు నిమిత్తమవుతారో వారికి నిమిత్తంగా అయినందుకు ప్రత్యక్ష ఫలంగా శక్తి ప్రాప్తిస్తుంది. ఈ ప్రత్యక్ష ఫలమే శ్రేష్ఠ యుగం యొక్క ఫలం. ఇటువంటి ఫలాన్ని తినేటటువంటి శక్తిశాలీ ఆత్మలు ఎటువంటి పరిస్థితిపైనైనా సహజంగానే విజయం పొందుతారు. వారు సమర్థుడైన తండ్రితోపాటు ఉన్న కారణంగా సహజంగా వ్యర్థం నుండి ముక్తులుగా అవుతారు. విష సర్పం సమానమైన పరిస్థితులపై కూడా వారికి విజయం లభిస్తుంది, దీనికి స్మృతిచిహ్నంగానే శ్రీకృష్ణుడు సర్పం శిరస్సుపై నాట్యం చేసినట్లు చూపిస్తారు.

స్లోగన్:-

పాస్ విత్ హానర్ గా (గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులై) అయి గతాన్ని దాటేయండి మరియు సదా తండ్రికి సమీపంగా ఉండండి.