ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు మనము శివబాబా మతముపై నడుస్తున్నామని పిల్లలకు తెలుసు. వారి మతము ఉన్నతాతి ఉన్నతమైనది. ఉన్నతాతి ఉన్నతమైన శివబాబా ఎలా తమ పిల్లలను శ్రేష్ఠంగా తయారుచేసేందుకు శ్రేష్ఠ మతమునిస్తున్నారు అన్నది ప్రపంచానికి తెలియదు. ఈ రావణరాజ్యంలో మనుష్యులెవ్వరూ మనుష్యులకు శ్రేష్ఠ మతమును ఇవ్వలేరు. మీరిప్పుడు ఈశ్వరీయ మతముకు చెందినవారిగా అవుతారు. ఈ సమయంలో పతితుల నుండి పావనంగా అయ్యేందుకు పిల్లలైన మీకు ఈశ్వరీయ మతము లభిస్తుంది. మేము విశ్వానికి యజమానులుగా ఉండేవారమని ఇప్పుడు మీకు తెలిసింది. వీరు (బ్రహ్మా), యజమానిగా ఉండేవారు, కానీ వీరకి కూడా తెలియదు. విశ్వం యొక్క యజమానులు మళ్ళీ పూర్తిగా పతితులుగా అయిపోతారు. ఈ ఆటను బుద్ధి ద్వారా బాగా అర్థం చేసుకోవాలి. రైట్-రాంగ్ ఏమిటి, ఇందులోనే బుద్ధిలో యుద్ధం నడుస్తుంది. పూర్తి ప్రపంచమంతా రాంగ్. ఒక్క తండ్రి మాత్రమే రైట్, సత్యం చెప్పేవారు. వారు మిమ్మల్ని సత్యఖండానికి యజమానులుగా చేస్తున్నారు కనుక వారి మతమును తీసుకోవాలి. మీ మతానుసారముగా నడుచుకుంటే మోసపోతారు. కానీ వారు గుప్తము. వారు నిరాకారుడు. చాలామంది పిల్లలు పొరపాటు చేస్తారు - ఇది దాదా మతమని భావిస్తారు. మాయ శ్రేష్ఠ మతమును తీసుకోనివ్వదు. శ్రీమతముపై నడవాలి కదా. బాబా, మీరు ఏదైతే చెప్తారో, అది మేము తప్పకుండా అంగీకరిస్తాము. కానీ అనేకమంది అంగీకరించరు. నంబరువారి పురుషార్థనుసారముగా మతమును అనుసరిస్తున్నారు, మిగిలినవారు తమ మతమును నడిపిస్తారు. శ్రేష్ఠ మతమును ఇచ్చేందుకు బాబా వచ్చారు. ఇటువంటి తండ్రిని క్షణ-క్షణము మర్చిపోతారు. మాయ మతమును తీసుకోనివ్వదు. శ్రీమతము అయితే చాలా సహజము కదా. మనము తమోప్రధానంగా ఉన్నామని ప్రపంచములో ఎవ్వరికీ జ్ఞానము లేదు. నా మతము ప్రసిద్ధి చెందినది, శ్రీమద్భగవద్గీత. భగవంతుడు ఇప్పుడు చెప్తున్నారు, నేను ప్రతి 5 వేల సంవత్సరముల తర్వాత వస్తాను, వచ్చి భారతదేశానికి శ్రీమతమునిచ్చి శ్రేష్ఠాతి శ్రేష్ఠంగా తయారుచేస్తాను. తండ్రి అయితే సావధానపరుస్తారు, పిల్లలు శ్రీమతమును అనుసరించరు. తండ్రి ప్రతి రోజూ అర్థం చేయిస్తూ ఉంటారు - పిల్లలూ, శ్రీమతమును అనుసరించడం మర్చిపోకండి. ఇది ఇతను (బ్రహ్మా) చెప్పే మాట కాదు. వారి మాటగా భావించండి. వారే ఇతని ద్వారా మతమునిస్తారు. అర్థం చేయించేది వారే. నేను ఆహార-పానీయాలు సేవించను, నేను అభోక్తను అని చెప్తున్నారు. పిల్లలైన మీకు శ్రీమతమునిస్తాను. నంబర్ వన్ మతమునిస్తారు, నన్ను స్మృతి చేయండి. ఎటువంటి వికర్మలు చేయకండి. ఎంత పాపం చేశాను అని తమ హృదయాన్ని ప్రశ్నించుకోండి. అందరి పాపాల కుండ నిండిందని మీకు తెలుసు. ఈ సమయంలో అందరూ రాంగ్ మార్గములో ఉన్నారు. ఇప్పుడు మీకు తండ్రి ద్వారా రైట్ మార్గము లభించింది. మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. గీతలో ఏదైతే జ్ఞానం ఉండాలో, అది లేదు. అది తండ్రి ద్వారా తయారయింది కాదు. ఇది కూడా భక్తిమార్గంలో ఫిక్స్ అయి ఉంది. భగవంతుడు వచ్చి భక్తికి ఫలమును ఇస్తారని చెప్తారు. జ్ఞానము వలన సద్గతి కలుగుతుందని పిల్లలకు అర్థం చేయించబడింది. అందరికీ సద్గతి కూడా కలుగుతుంది, అందరి దుర్గతి కూడా జరుగుతుంది. ఈ ప్రపంచమే తమోప్రధానంగా ఉంది. సతోప్రధానంగా ఎవ్వరూ లేరు. పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ ఇప్పుడు చివరికి చేరుకున్నారు. ఇప్పుడు మృత్యువు ఎదురుగా తలపై నిలబడి ఉంది. భారతదేశ విషయమే. గీత కూడా దేవీ దేవతా ధర్మశాస్త్రము. మరి ఇతర ధర్మాలలోకి వెళ్ళడం వలన మీకేం లాభము. ప్రతి ఒక్కరూ తమ-తమ ఖురాన్, బైబిల్ మొదలైనవే చదువుతారు. వారికి తమ ధర్మము గురించి తెలుసు. ఒక్క భారతవాసులు మాత్రమే ఇతర అన్ని ధర్మాలలోకి వెళ్ళిపోతారు. మిగిలినవారంతా వారి-వారి ధర్మాలలో పక్కాగా ఉన్నారు. ప్రతి ధర్మము వారి ముఖకవళికలు మొదలైనవి వేరు వేరుగా ఉంటాయి. తండ్రి స్మృతి కలిగిస్తున్నారు - పిల్లలూ, మీరు మీ దేవీ-దేవతా ధర్మమును మర్చిపోయారు. మీరు స్వర్గములో దేవతలుగా ఉండేవారు, హమ్ సో అర్థమును తండ్రి భారతవాసులకు వినిపించారు. అంతేకానీ ఆత్మయే పరమాత్మ కాదు. ఈ విషయాలు భక్తిమార్గములోని గురువులు తయారుచేశారు. గురువులు కూడా కోట్ల లెక్కలో ఉంటారు. స్త్రీకి పతియే నీ గురువు, ఈశ్వరుడు అని చెప్తారు. పతియే పరమేశ్వరుడు అయినప్పుడు మళ్ళీ ఓ భగవంతుడా, ఓ రామ అని ఎందుకంటారు? మనుష్యుల బుద్ధి పూర్తిగా రాతి బుద్ధిగా అయిపోయింది. నేను కూడా అలాగే ఉండేవాడినని స్వయంగా ఇతను కూడా చెప్తున్నారు. వైకుంఠానికి యజమాని అయిన శ్రీకృష్ణుడు ఎక్కడ, అతడిని పల్లెటూరి పిల్లవాడు అని చెప్పడము ఎక్కడ. శ్యామ-సుందరుడు అని అంటారు. వారికి దాని అర్థము తెలియదు. ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయించారు, నెంబర్ వన్ సుందరంగా ఉన్నవారే లాస్ట్ నెంబర్ తమోప్రధానంగా నల్లగా అయిపోయారు. మీకు తెలుసు, మనము సుందరంగా ఉండేవారిమి, తర్వాత నల్లగా అయిపోయాము, 84 జన్మల చక్రము పూర్తి చేసుకుని ఇప్పుడు నలుపు నుండి సుందరముగా అయ్యేందుకు తండ్రి ఒక్కటే ఔషధమునిస్తారు, నన్ను స్మృతి చేయండి. మీ ఆత్మ పతితం నుండి పావనంగా అయిపోతుంది. మీ జన్మ-జన్మల పాపాలు వినాశనమైపోతాయి.
రావణుడు వచ్చినప్పటి నుండి మీరు కిందకు పడిపోతూ-పడిపోతూ పాపాత్మలుగా అయిపోయారని మీకు తెలుసు. ఈ ప్రపంచమే పాపాత్మల ప్రపంచము. ఒక్కరు కూడా సుందరమైనవారు లేరు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ సుందరంగా తయారుచేయలేరు. మీరు స్వర్గవాసులుగా, సుందరంగా అయ్యేందుకు వచ్చారు. ఇప్పుడు నరకవాసులుగా, నల్లగా ఉన్నారు ఎందుకంటే కామచితిపై కూర్చొని నల్లగా అయ్యారు. తండ్రి చెప్తున్నారు, కామము మహాశత్రువు. దీనిపై ఎవరైతే విజయం పొందుతారో, వారే జగత్ జీతులుగా అవుతారు. నంబర్ వన్ కామము. వారిని పతితులని అంటారు. క్రోధీలను పతితులని అనరు. మీరు వచ్చి పతితము నుండి పావనంగా తయారుచేయండి అని కూడా పిలుస్తారు. కావున ఇప్పుడు తండ్రి వచ్చి ఈ అంతిమ జన్మలో పావనంగా అవ్వండి అని చెప్తున్నారు. రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి వచ్చినట్లు, సంగమయుగము తర్వాత మళ్ళీ సత్యయుగము వస్తుంది. ఈ చక్రము తిరగాల్సిందే. అంతేకాని ఆకాశములో లేక పాతాళములో మరే ప్రపంచము లేదు. సృష్టి అయితే ఇదే. సత్యయుగము, త్రేతా..... ఇక్కడే ఉన్నాయి. వృక్షము కూడా ఒక్కటే, ఇంకేదీ ఉండదు. అనేక ప్రపంచాలున్నాయని అనడము వ్యర్థ ప్రలాపాలు. ఇవన్నీ భక్తిమార్గములోని విషయాలు అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు తండ్రి సత్యమైన విషయాలను వినిపిస్తున్నారు. మేము ఎంతవరకు శ్రీమతమును అనుసరిస్తూ సతోప్రధానంగా అనగా పుణ్యాత్మలుగా అవుతున్నాము అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. సతోప్రధానులని పుణ్యాత్మలని, తమోప్రధానులని పాపాత్మలని అంటారు. వికారాలలోకి వెళ్ళడం పాపము. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు పవిత్రంగా అవ్వండి. నావారిగా అయ్యారు కనుక నా శ్రీమతమును అనుసరించాలి. ముఖ్యమైన విషయము, మీరు ఏ పాపము చేయకండి. నెంబర్ వన్ పాపము, వికారాలలోకి వెళ్ళడం. ఇంకా చాలా పాపాలు జరుగుతూ ఉంటాయి. దొంగతనము, మోసము మొదలైనవి చాలా చేస్తారు. అనేకమందిని ప్రభుత్వం పట్టుకుంటుంది కూడా. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు, మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి - మేమేమీ పాపాలు చేయడం లేదు కదా? మేము దొంగతనము చేసినా, లంచము తీసుకున్నా, ఈ బాబా జానీజాననహార్ (అన్నీ తెలిసినవారు), వీరికి అన్ని తెలుసని భావించకండి. జానీజాననహార్ (అన్నీ తెలిసినవారు) అంటే అర్థము ఇది కాదు. సరే, ఎవరైనా దొంగతనము చేస్తే, తండ్రికి తెలుస్తుంది అనుకుందాం, తర్వాత ఏమిటి? చేసిన దొంగతనానికి వంద రెట్లు శిక్ష అవ్వనే అవుతుంది. చాలా-చాలా శిక్షలు అనుభవిస్తారు. పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఇటువంటి పనులు చేస్తే శిక్షలు అనుభవించవలసి వస్తుందని తండ్రి చెప్తున్నారు. ఎవరైనా ఈశ్వరుని పిల్లలుగా అయి దొంగతనం చేస్తే, శివబాబా ద్వారా ఇంత వారసత్వము లభిస్తుంటే, వారి భండాగారము నుండి దొంగతనము చేస్తే, ఇది చాలా పెద్ద పాపము. కొందరిలో దొంగతనం చేసే అలవాటు ఉంటుంది, వారిని జైలు పక్షులని అంటారు. ఇది ఈశ్వరుని ఇల్లు. సర్వమూ ఈశ్వరునిదే కదా. తండ్రి నుండి వారసత్వము తీసుకునేందుకు ఈశ్వరుని ఇంటికి వస్తారు. కానీ కొంతమందికి అలవాటైపోతుంది, వారి శిక్ష వంద రెట్లు అవుతుంది. శిక్షలు కూడా చాలా లభిస్తాయి మరియు జన్మ-జన్మలకు డర్టీ (నీచమైన) ఇంటిలో జన్మ తీసుకుంటారు, అంటే తమకు తామే నష్టము చేసుకున్నారు కదా! స్మృతిలో అస్సలు ఉండనివారు చాలామంది ఉంటారు. ఏమీ వినరు. బుద్ధిలో దొంగతనం మొదలైన ఆలోచనలే నడుస్తూ ఉంటాయి. ఇటువంటి చాలామంది సత్సంగాలకు వెళ్తారు. చెప్పులు దొంగతనం చేస్తారు, వారికి ఇదే పని ఉంటుంది. ఎక్కడ సత్సంగము జరిగినా అక్కడకెళ్లి చెప్పులు దొంగలిస్తూ ఉంటారు. ప్రపంచం పూర్తి మురికిగా ఉంది. ఇది ఈశ్వరుని ఇల్లు. దొంగతనం చేసే అలవాటు చాలా చెడ్డది. ఒక్క పైసా దొంగతనము చేసినా లక్ష రూపాయలు దొంగతనం చేసినదానితో సమానము. స్వయాన్ని ప్రశ్నించుకోండి - మేము ఎంత పుణ్యాత్మలుగా అయ్యాము? ఎంత తండ్రిని స్మృతి చేస్తున్నాము? ఎంతగా మేము స్వదర్శన చక్రధారులుగా అవుతున్నాము? ఎంత సమయము ఈశ్వరీయ సర్వీసులో ఉంటున్నాము? ఎన్ని పాపాలు తొలగిపోతున్నాయి? అని ప్రతి రోజూ మీ లెక్కను చూసుకోండి. ఎంత పుణ్యము చేశాము, ఎంతగా యోగములో ఉన్నాము? ఎంతమందికి మార్గము చూపాము? ఉద్యోగ వ్యవహారాలు భలే చేసుకోండి. మీరు కర్మయోగులు. కర్మలు భలే చేయండి. బాబా ఈ బ్యాడ్జిలను తయారుచేయిస్తూ ఉంటారు. దీనిపై మంచి-మంచి వారికి అర్థం చేయించండి. ఈ మహాభారత యుద్ధము ద్వారానే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటున్నాయి. కృష్ణుని చిత్రములో క్రింద చాలా ఫస్ట్ క్లాస్ గా వ్రాయబడి ఉంది. కానీ పిల్లలు ఇప్పుడు ఇంకా ఇంత విశాలమైన బుద్ధిగలవారిగా అవ్వలేదు. కొంత ధనం లభిస్తే చాలు వెంటనే నాట్యము చేయడం ప్రారంభిస్తారు. ఎవరికైనా చాలా ఎక్కువ ధనముంటే, మాలాంటివారు ఇంకెవ్వరూ లేరు అని భావిస్తారు. ఏ పిల్లలైతే తండ్రిని నిర్లక్ష్యం చేస్తారో, వారికి ఇంత అవినాశి జ్ఞానరత్నాల ఖజానా ఇస్తున్న తండ్రిపై కూడా గౌరవముండదు. బాబా ఒకటి చెప్తే, వారు మరొకటి చేస్తారు. గౌరవం లేని కారణంగా చాలా పాపాలు చేస్తూ ఉంటారు. శ్రీమతమును అనుసరించరు. అందువలన క్రింద పడిపోతారు. ఇది కూడా డ్రామా అని తండ్రి అంటారు. వారి అదృష్టంలో లేదు. బాబాకు తెలుసు కదా. చాలా పాపాలు చేస్తూ ఉంటారు, ఒకవేళ తండ్రి చదివిస్తున్నారన్న నిశ్చయముంటే, చాలా సంతోషము ఉండాలి. మేము భవిష్య కొత్త ప్రపంచములో రాకుమారుడు-రాకుమారీలుగా అవుతామని మీకు తెలుసు కనుక ఎంత సంతోషంగా ఉండాలి. కాని పిల్లలు ఇంకా ఇప్పటివరకు వాడిపోతూ ఉంటారు. ఆ స్థితి నిలవదు.
తండ్రి అర్థం చేయించారు - వినాశనము కొరకు రిహార్సల్ కూడా జరుగుతుంది. ప్రకృతి వైపరిత్యాలు కూడా సంభవిస్తాయి. అవి భారతదేశమును బలహీనపరుస్తూ ఉంటాయి. తండ్రి స్వయంగా చెప్తున్నారు - ఇవన్నీ జరగాల్సిందే. లేదంటే వినాశనము ఎలా జరుగుతుంది? మంచు వర్షము కురిస్తే పంట పొలాలు మొదలైనవాటి గతి ఏమవుతుంది? లక్షల మంది మరణిస్తూ ఉంటారు, ఎవ్వరూ తెలపరు. కావున తండ్రి ముఖ్యమైన విషయము తెలియజేస్తున్నారు, ఈ విధంగా మీలో మీరు పరిశీలించుకోండి, నేను తండ్రిని ఎంత స్మృతి చేస్తున్నాను. బాబా, మీరు చాలా మధురమైనవారు, ఇది మీ అద్భుతము. మీ ఆజ్ఞ ఏమిటంటే, నన్ను స్మృతి చేస్తే 21 జన్మలకు ఎప్పుడూ రోగులుగా అవ్వరు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే నేను గ్యారెంటీ ఇస్తున్నాను, సన్ముఖములో తండ్రి మీకు చెప్తున్నారు, మీరు తిరిగి ఇతరులకు వినిపిస్తారు. తండ్రి చెప్తున్నారు, తండ్రినైన నన్ను స్మృతి చేయండి, చాలా ప్రేమించండి. పతితుల నుండి పావనంగా అయ్యేందుకు మీకు ఎంత సహజమైన మార్గమును తెలియజేస్తాను. మేము చాలా పాపాత్మలమని కొందరు చెప్తారు. అచ్ఛా, మళ్ళీ ఇటువంటి పాపాలు చేయకండి, నన్ను స్మృతి చేస్తూ ఉండండి, అప్పుడు జన్మ-జన్మల పాపాలు ఈ స్మృతి ద్వారా భస్మమవుతూ ఉంటాయి. స్మృతియే ముఖ్యమైనది. దీనినే సహజ స్మృతి అని అంటారు, యోగము అనే పదమును కూడా తీసేయండి. సన్యాసుల హఠయోగాలు రకరకాలు ఉన్నాయి. అనేక ప్రకారాల యోగాలు నేర్పిస్తుంటారు. ఈ బాబా అనేకమంది గురువులను ఆశ్రయించారు కదా. ఇప్పుడు అనంతమైన తండ్రి చెప్తున్నారు - వీరందరినీ వదలండి. వీరందరినీ కూడా నేను ఉద్ధరించాలి. ఇలా చెప్పే శక్తి మరెవ్వరికీ లేదు. తండ్రే చెప్తున్నారు - నేను ఈ సాధువులను కూడా ఉద్ధరిస్తాను. మరి వీరు గురువులుగా ఎలా అవుతారు. కావున ముఖ్యమైన విషయం తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీ హదయాన్ని ప్రశ్నించుకోండి, మేము ఏ పాపము చేయడం లేదు కదా? ఎవ్వరికీ దుఃఖము ఇవ్వడము లేదు కదా? ఇందులో ఏ కష్టమూ లేదు. లోపల చెక్ చేసుకోవాలి, రోజంతటిలో ఎంత పాపము చేశాను? ఎంత స్మృతి చేశాను? స్మృతి ద్వారానే పాపము భస్మం అవుతుంది. ప్రయత్నము చెయ్యాలి. ఇది చాలా కష్టముతో కూడిన పని. జ్ఞానము ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. ముక్తి-జీవన్ముక్తులకు మార్గమును తండ్రే తెలియజేస్తారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి ఇచ్చే అవినాశి జ్ఞాన రత్నాల ఖజానాపై గౌరవముంచాలి. నిర్లక్ష్యం చేసి పాప కర్మలు చెయ్యకూడదు. భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారన్న నిశ్చయముంటే అపారమైన సంతోషములో ఉండాలి.
2. ఈశ్వరుని ఇంటిలో ఎప్పుడూ దొంగతనము మొదలైనవి చేసే ఆలోచన రాకూడదు. ఈ అలవాటు చాలా చెడ్డది. ఒక్క పైసా దొంగతనము చేసినా లక్ష రూపాయలు దొంగతనం చేసినదానితో సమానము. మేము ఎంత పుణ్యాత్మగా అయ్యాము అని మీలో మీరే ప్రశ్నించుకోండి.