ఓంశాంతి. పాపాత్మల ప్రపంచం మరియు పుణ్యాత్మల ప్రపంచం, పేరు ఆత్మలదే ఉంచడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో దుఃఖముంది అందుకే పిలుస్తారు. పుణ్యాత్మల ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని పిలువరు. ఏ పండితుడు లేక సన్యాసి, శాస్త్రవాదులు మొదలైనవారు ఎవరూ వినిపించడం లేదని పిల్లలైన మీకు తెలుసు. ఇతను స్వయంగా కూడా చెప్తారు - ఇంతకుముందు నాకు ఈ జ్ఞానం తెలియదు, రామాయణం మొదలైన శాస్త్రాలనైతే చాలా చదివేవాడిని. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని నేను మీకు వినిపిస్తున్నాను. ఇతను కూడా వింటున్నారు. ఇప్పుడిది పాపాత్మల ప్రపంచం. పుణ్యాత్మలు కొరకు కేవలం, ఒకప్పుడు వీరు ఉండి వెళ్ళారని అంటారు. అంతే, పూజ చేసి వచ్చేస్తారు, శివునికి పూజ చేసి వస్తారు. పిల్లలైన మీరిప్పుడు ఎవరిని పూజిస్తారు? ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు శివుడు, వారు విధేయుడైన తండ్రి, టీచర్, విధేయుడైన బోధకుడు అని మీకు తెలుసు. తోడుగా తీసుకు వెళ్తాననే గ్యారంటీ ఇతర ఏ గురువులు మొదలైనవారు చేయలేరు. అయినా వారెవ్వరూ అందరినీ తీసుకువెళ్ళలేరు. మీరిప్పుడు సన్ముఖంలో కూర్చుని ఉన్నారు, ఇక్కడి నుండి మీ ఇంటికి వెళ్ళిన వెంటనే మీరు మర్చిపోతారు. ఇక్కడ సన్ముఖంలో వినడంతో మజా (ఆనందం) కలుగుతుంది. తండ్రి పదే-పదే చెప్తున్నారు - పిల్లలూ, మంచి రీతిగా చదవండి. ఇందులో నిర్లక్ష్యం చేయకండి, చెడు సాంగత్యంలో చిక్కు కోకండి. లేదంటే ఇంకా తుచ్ఛబుద్ధి కలవారిగా అయిపోతారు. ఇంతకుముందు ఎలా ఉండేవారో, ఏ ఏ పాపాలు చేశారో పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మనం ఈ దేవతలుగా అవుతున్నాము, ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది, మరి ఈ భవనాలు మొదలైనవాటిని ఎందుకు లెక్క చేయాలి. ఈ ప్రపంచంలో ఉన్న వాటినన్నిటినీ మర్చిపోవాలి. లేదంటే అవి ఆటంకాలు కలుగజేస్తాయి. వీటి పట్ల మనస్సు ఉండదు. మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళి వజ్ర వైఢూర్యాలతో కూడిన మన మహళ్ళను తయారుచేసుకుంటాము. ఈ పాత ప్రపంచంలోని ధనం మొదలైన వస్తువులేమైనా బాగున్నాయనిపిస్తే శరీరం వదిలే సమయంలో వాటి పట్ల మోహం కలుగుతుంది. నాది-నాది అని అంటూ ఉంటే చివర్లో అదే ఎదురుగా వస్తుంది. ఇవన్నీ ఇక్కడ సమాప్తం అయిపోతాయి. మనం మన రాజధానిలోకి వెళ్ళిపోతాము, వీటి పట్ల ఏమి మనస్సు పెట్టుకుంటాము. అక్కడ చాలా సుఖముంటుంది. దాని పేరే స్వర్గం. ఇప్పుడు మనం మన వతనానికి వెళ్ళిపోతాము, ఇది అయితే రావణుని వతనం, మనది కాదు. దీని నుండి విడుదల అయ్యేందుకు పురుషార్థం చేయాలి. పాత ప్రపంచపు ఆధారముల నుండి ముక్తులుగా చేస్తారు. అందుకే తండ్రి చెప్తున్నారు, ఏ వస్తువు పట్లా మమకారం పెట్టుకోకండి. కడుపు ఎక్కువేమీ అడగదు, వ్యర్థ వస్తువులపై ఖర్చు చాలా అవుతుంది. పిల్లలైన మీకు సేవ చేయాలనే ఉత్సాహం కలగాలి. చాలామంది పిల్లలకు గ్రామ-గ్రామాలలో సేవ చేయాలనే అభిరుచి ఉంది. ఎవరికైతే సేవ యొక్క అభిరుచి ఉండదో, వారు దేనికి పనికొస్తారు. ఎలా అయితే తండ్రి ఉంటారో పిల్లలు అలా తయారవ్వాలి. తండ్రి పరిచయమే ఇవ్వాలి. తండ్రిని స్మృతి చేయండి మరియు తండ్రి నుండి వారసత్వం తీసుకోండి. పిల్లలకు అభిరుచి ఉంటుంది - మేము తండ్రి సేవకు వెళ్తాము అని. అయితే తండ్రి కూడా ధైర్యాన్ని పెంచుతారు. తండ్రి సేవ కోసం వచ్చారు, సేవ కోసం అన్నీ ఉన్నాయి. అందరికీ తండ్రి పరిచయమివ్వాలి. తండ్రి ఒక్కరే. భారత్ లో వచ్చారు, భారత్ లో దేవతల రాజ్యం ఉండేది. ఇది నిన్నటి మాట, లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది, తర్వాత సీతా-రాముల రాజ్యం ఉండేది. తర్వాత వామమార్గంలో పడిపోయారు. రావణరాజ్యం ప్రారంభమయింది, మెట్లు కిందకు దిగారు, ఇప్పుడు మళ్ళీ ఎక్కేకళ సెకండు యొక్క విషయం.
ఒకటేమో సత్యమైన ప్రేమ, రెండవది కృత్రిమమైన ప్రేమ. స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడే తండ్రి పట్ల సత్యమైన ప్రేమ ఉంటుంది. ఈ ప్రపంచం పట్ల పిల్లలైన మీకిప్పుడు కృత్రిమమైన ప్రేమ ఉంది. ఇదైతే సమాప్తం అవ్వనున్నది. సేవ చేసేవారు ఎప్పుడూ ఆకలితో మరణించరు. కనుక సేవ చెయ్యాలని పిల్లలు అభిరుచి పెట్టుకోవాలి. మీ ఈశ్వరీయ సంస్థ చాలా సహజమైనది. ధర్మం ఎలా స్థాపనవుతుందో ఎవ్వరికీ తెలియదు. క్రీస్తు వచ్చారు, క్రైస్తవ ధర్మాన్ని స్థాపించారు, ధర్మం వృద్ధి అవుతూ వెళ్ళింది. వారి మతానుసారంగా నడుస్తూ-నడుస్తూ కిందకు పడుతూ వచ్చారు, ఇప్పుడు పిల్లలైన మీరు దేహీ అభిమానులుగా అవ్వాలి. అర్ధకల్పం రావణరాజ్యంలో మనం తండ్రిని మర్చిపోయాము, ఇప్పుడు తండ్రి వచ్చి జాగృతం చేశారు. తండ్రి చెప్తున్నారు, డ్రామనుసారంగా మీరు పడిపోయేదే ఉంది. ఇందులో మీ దోషం కూడా లేదు. రావణరాజ్యంలో ప్రపంచ పరిస్థితి ఇలా అయిపోతుంది. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు నేను మిమ్మల్ని చదివించేందుకు వచ్చాను. మీరు మళ్ళీ మీ రాజ్యం తీసుకోండి. నేను ఇంకే కష్టమూ ఇవ్వను. ఒకటేమో బజారులోని ఛీ-ఛీ మురికి పదార్థాలను తినకండి మరియు నన్నోక్కరినే స్మృతి చేయండి. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు - ఇది డ్రామా చక్రము, ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. మీ బుద్ధిలో డ్రామా ఆదిమధ్యాంతాల జ్ఞానముంది. మీరు ఎవ్వరికైనా అర్థం చేయించవచ్చు. మొదటయితే తండ్రి స్మృతి ఉండాలి. సేవ కోసం పరస్పరంలో కలిసి సహచరులను తయారుచేసుకోవాలి. మాతలు కూడా తయారవ్వాలి. ఇందులో భయపడే విషయమేదీ లేదు. చిత్రాలు మొదలైనవన్నీ మీకు లభిస్తాయి. మీ సేవ ఎక్కువ అవుతుంది. మీరు వెళ్ళిపోతే మరి మాకు ఎవరు నేర్పిస్తారు అని అడుగుతారు. మీరు చెప్పండి, మేము సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాము, ఇల్లు మొదలైనవి ఏర్పాటు చెయ్యండి. అనేకుల కళ్యాణము కోసం నిమిత్తంగా అయిపోతారు. బాబా, సేవ చేసేందుకు ఉల్లాసాన్ని కలిగిస్తున్నారు. పిల్లల్లో ధైర్యం ఉంటే సేవ కూడా పెరగుతుంది. ఇది మేళా ఏమీ కాదు, ఏదో 10-15 రోజులు నడిచి తర్వాత సమాప్తం అవ్వడానికి. ఈ మేళా అయితే జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఆత్మ-పరమాత్మల మిలనం జరుగుతుంది, దీనినే సత్యమైన మేళా అని అంటారు. అది ఇప్పుడు జరుగుతూనే ఉంది. ఎప్పుడైతే సేవ పూర్తవుతుందో, అప్పుడు మేళా సమాప్తమవుతుంది. డ్రామానుసారంగా పిల్లలకు సేవ చేయాలనే అభిరుచి చాలా ఉండాలి. అనంతమైన తండ్రిలో ఏ జ్ఞానమైతే ఉందో, అది పిల్లల బుద్ధిలో ఉంది. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి ద్వారా మేము ఎంత ఉన్నతంగా అవుతూ వచ్చాము.... ఇలా స్వయంతో స్వయమే మాట్లాడుకోవాలి. పరస్పరంలో సెమినార్ చేసుకోవాలి. బాబా నుండి సలహా తీసుకొని సేవలో నిమగ్నమవ్వండి. ఏదైనా సహాయం అవసరమైనట్లయితే పెద్ద హృదయం కలిగిన బాబా కూర్చొని ఉన్నారు. ఇదంతా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. చింతించే అవసరమే లేదు. లేదంటే స్థాపన ఎలా జరుగుతుంది. మరొక విషయమేమిటంటే ఎవరైతే చేస్తారో, వారు పొందుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు రాతిబుద్ధి నుండి వజ్ర సమానంగా అవుతున్నారు. తండ్రి జ్ఞానంతో ఎంతగా సరిదిద్దుతారు, మాయ మళ్ళీ ముక్కును పట్టుకొని మీరు వెనుకకు తిరిగేలా చేస్తుంది.
పిల్లలైన మీరు చాలా మంచి సాంగత్యం చేయాలి. చెడు సాంగత్యపు రంగు అంటుకోవడంతో కింద పడతారు. బాబా సినిమా మొదలైనవి చూసేందుకు ఒప్పుకోరు. ఎవరికైతే సినిమా అలవాటైపోతుందో వారు పతితులుగా అవ్వకుండా ఉండలేరు. ఇక్కడ ప్రతి ఒక్కరి పని మురికిగా ఉంది, దీని పేరే వేశ్యాలయం. తండ్రి శివాలయాన్ని స్థాపన చేస్తున్నారు. వేశ్యాలయానికి పూర్తిగా అగ్ని అంటుకోనున్నది. కుంభకర్ణునిలా ఆసురీ నిద్రలో నిద్రిస్తున్నారు. మేము శివాలయానికి వెళ్తున్నామని మీరు అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు మేము కూడా కోతుల వలె ఉండేవారము, దీని గురించి రామాయణంలో కూడా కథ ఉంది. ఇప్పుడు మీరు తండ్రికి సహాయకులుగా అయ్యారు. మీరు మీ శక్తి ద్వారా రాజ్య స్థాపన చేస్తున్నారు. తర్వాత ఈ రావణరాజ్యం సమాప్తమవుతుంది. పిల్లలైన మీకు అనేక రకాల యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. ఎవ్వరికీ దానం చేయకపోతే ఫలం కూడా ఎలా లభిస్తుంది? మొట్టమొదట 10-15 మందికి మార్గాన్ని తెలియజేయాలి, తర్వాతనే భోజనం చేయాలి. మొదట శుభకార్యం చేసి రండి, ఇందులోనే మీ కళ్యాణముంది. ఏ దేహధారినీ స్మృతి చేయకండి. ఇది అయితే పతిత ప్రపంచం. పతితపావనులైన తండ్రి ఒక్కరినే స్మృతి చేసినట్లయితే పావన ప్రపంచానికి యజమానులుగా అయిపోతారు. అంతిమతి సోగతి అవుతుంది. కావున ఎవరో ఒకరికి సందేశం వినిపించి వచ్చిన తర్వాతనే భోజనం చేయాలి. తండ్రిని స్మృతి చేసినట్లయితో ఇంత ఉన్నతంగా అవుతారని మీరు అందరికీ తెలియజేస్తూ ఉండండి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
రాత్రిక్లాసు (17-03-1968) -
ఎప్పుడైనా ఏదైనా ఉపన్యాసం మొదలైనవి చేయాల్సి వచ్చినప్పుడు పరస్పరంలో కలుసుకొని 2-4 సార్లు రిహార్సల్ చేయండి, పాయింట్లలో మార్పులు-చేర్పులు చేసి తయారుచేస్తే, రిఫైన్ గా ఉపన్యసించగలరు. ముఖ్యంగా ఒక విషయం పైన (గీతా భగవానుడు గురించి) మీరు విజయం పొందితే తర్వాత అన్ని విషయాలలో విజయులుగా అవుతారు, దీనికొరకు కాన్ఫరెన్స్ అయితే జరుగుతుంది కదా. వృక్షం యొక్క వృద్ధి అయితే తప్పకుండా జరుగుతుందని అనుకుంటూ ఉంటారు. మాయ తుఫానులు అయితే అందరికీ వస్తాయి. తరచుగా - "బాబా, మేము కామం యొక్క చెంపదెబ్బ తిన్నాము” అని వ్రాస్తారు. దీనినే సంపాదనంతా సమాప్తం చేసుకోవడమని అంటారు. క్రోధం మొదలైనవాటి వలన కొద్దిగా నష్టం కలిగిందని అంటారు. దీని కొరకు అర్థం చేయించవలసి వస్తుంది, కామముపై విజయం పొంది జగత్ జీతులుగా అవుతారు అని. కామముతో ఓడిపోతే ఓటమి పొందుతారు. కామముతో ఓడిపోయేవారి సంపాదనంతా సమాప్తమైపోతుంది, శిక్షలు పడతాయి. గమ్యము చాలా పెద్దది, కనుక చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. 5000 సంవత్సరాల క్రితం కూడా మాకు సామ్రాజ్యం లభించిందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ దైవీ రాజధాని స్థాపనవుతూ ఉంది. ఈ చదువుతో మేము ఆ రాజధానిలోకి వెళ్తాము, అంతా చదువుపైనే ఆధారపడి ఉంది. చదువు మరియు ధారణతోనే తండ్రి సమానంగా అవుతారు. ఎంతమందిని తమ సమానంగా తయారుచేశారో తెలుసుకునేందుకు రిజిస్టర్ కూడా కావాలి కదా. ఎంత ఎక్కువగా ధారణ చేస్తారో అంత మధురంగా అవుతారు. చాలా ప్రియమైన పిల్లలు కావాలి. ముక్తిలోకి వెళ్ళేందుకు మనుష్యులు చాలా ప్రయత్నం చేస్తారు, పిల్లలైన మీ కోసమే ఆ రోజు వచ్చింది. తండ్రి అందరికీ కలిపే ముక్తి-జీవన్ముక్తులను ఇస్తారు. ఎవరైతే దేవతగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారో వారే జీవన్ముక్తిలోకి వెళ్తారు. మిగిలినవారంతా ముక్తిలోకి వెళ్తారు. లెక్క ఖచ్చితంగా తీయలేము. కొంతమంది మిగిలి ఉంటారు కూడా. వినాశనం సాక్షాత్కారం అవుతుంది. ఈ మనోహరమైన సమయాన్ని కూడా చూస్తారు. ప్రతి విషయానికి పురుషార్థం చేయవలసి ఉంటుంది. స్మృతిలో కూర్చున్నట్లైతే పని అయిపోతుంది, ఇల్లు లభిస్తుంది అని కూడా కాదు, డ్రామాలో ఏముందో అదే జరుగుతుంది, ఆశ పెట్టుకోకూడదు. పురుషార్థం చేయవలసి ఉంటుంది. అయినా డ్రామాలో ఏది నిశ్చయింపబడి ఉందో అదే జరుగుతుంది. ముందు-ముందు మీ వృత్తి కూడా భాయి-భాయి (సోదర వృత్తి)గా అయిపోతుంది. ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా ఆ వృత్తి ఉంటుంది. మేము అశరీరులుగా వచ్చాము. 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాము. ఇప్పుడు కర్మాతీత స్థితిలోకి వెళ్ళాలని తండ్రి చెప్తున్నారు.
వాస్తవానికి మీరు ఎవ్వరితోనూ శాస్త్రాలు మొదలైనవాటి గురించి వాదోపవాదాలు చేసే అవసరం లేదు. ముఖ్యమైన విషయమే స్మృతి మరియు సృష్టి యొక్క ఆది-మధ్య-అంత్యాలను అర్థం చేసుకోవడం. చక్రవర్తి రాజులుగా అవ్వాలి. కేవలం ఈ చక్రాన్ని అర్థం చేసుకోవాలి. దీని గురించే సెకండులో జీవన్ముక్తి అని గాయనం ఉంది. అర్ధకల్పం భక్తి నడుస్తుంది, కొద్దిగా కూడా జ్ఞానముండదు అని పిల్లలకు ఆశ్చర్యము కలుగవచ్చు. జ్ఞానం తండ్రి దగ్గర మాత్రమే ఉంది. తండ్రి ద్వారానే తెలుసుకోవాలి. ఈ తండ్రి ఎంత అసాధారణమైనవారు, అందుకే కోటికొక్కరే వెలువడతారు. ఆ టీచర్లు ఇలా చెప్పరు. వీరు తండ్రి, టీచర్, గురువు నేనే అని చెప్తారు. ఇది విని మనుష్యులు ఆశ్చర్యపోతారు. భారతదేశాన్ని మదర్ కంట్రీ (మాతృభూమి) అని అంటారు ఎందుకంటే అంబ పేరు చాలా ప్రసిద్ధంగా ఉంది. అంబకు చాలా మేళాలు కూడా జరుగుతాయి. అంబ అనే పదం చాలా మధురమైనది. చిన్నపిల్లలు కూడా తల్లిని ప్రేమిస్తారు కదా ఎందుకంటే తల్లి తినిపిస్తుంది, తాగిస్తుంది, సంభాళన చేస్తుంది. ఇప్పుడు అంబకు తండ్రి కూడా కావాలి కదా. ఈ కుమార్తె దత్త పుత్రిక, ఈమెకు పతి అయితే లేరు. ఇది కొత్త విషయం కదా. ప్రజాపిత బ్రహ్మా తప్పకుండా దత్తత తీసుకొని ఉంటారు. ఈ విషయాలన్నీ తండ్రే వచ్చి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. ఎన్ని మేళాలు చేస్తారు, ఎన్ని పూజలు జరుగుతాయి, ఎందుకంటే పిల్లలైన మీరు సేవ చేస్తారు. మమ్మా ఎంతమందినైతే చదివించి ఉంటారో, అంతమందిని ఇంకెవ్వరూ చదివించలేరు. మమ్మాకు పేరు ప్రఖ్యాతులు చాలా ఉన్నాయి, మేళాలు కూడా చాలా జరుగుతాయి. తండ్రియే వచ్చి రచన యొక్క ఆదిమధ్యాంతాల పూర్తి రహస్యాన్ని పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మీకు తండ్రి ఇంటి గురించి కూడా తెలిసింది. తండ్రిపట్ల మాత్రమే ప్రేమ ఉంది, ఇంటిపట్ల కూడా ప్రేమ ఉంది. ఈ జ్ఞానం మీకు ఇప్పుడు లభిస్తుంది. ఈ చదువు ద్వారా ఎంత సంపాదన జరుగుతుంది. కావున సంతోషం కలగాలి కదా. మీరు పూర్తిగా సాధారణంగా ఉన్నారు. తండ్రి వచ్చి ఈ జ్ఞానం వినిపిస్తున్నారని ప్రపంచానికి తెలియదు. తండ్రియే వచ్చి కొత్త కొత్త విషయాలన్నీ పిల్లలకు వినిపిస్తారు. కొత్త ప్రపంచం అనంతమైన చదువుతో తయారవుతుంది. పాత ప్రపంచంపట్ల వైరాగ్యం కలుగుతుంది. పిల్లలైన మీ లోపల జ్ఞానం యొక్క సంతోషం ఉంటుంది. తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయాలి. ఇంటికైతే అందరూ వెళ్ళాల్సిందే. పిల్లలూ, నేను మీకు ముక్తి-జీవన్ముక్తుల వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చానని తండ్రి అయితే అందరికీ చెప్తారు కదా. మరి ఎందుకు మర్చిపోతారు. నేను మీ అనంతమైన తండ్రిని, మీకు రాజయోగము నేర్పించేందుకు వచ్చాను. మరి మీరు శ్రీమతంపై నడవరా? లేకుంటే చాలా నష్టం కలుగుతుంది. ఇది అనంతమైన నష్టం. తండ్రి చెతిని వదిలేస్తే సంపాదనలో నష్టం ఏర్పడుతుంది. అచ్ఛా, గుడ్ నైట్.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ పాత ప్రపంచంలో ఏదైతే ఉందో దానిని మర్చిపోవాలి. తండ్రి సమానంగా విధేయులుగా అయ్యి సేవ చేయాలి. అందరికీ తండ్రి పరిచయమునివ్వాలి.
2. ఈ పతిత ప్రపంచంలో మిమ్మల్ని మీరు చెడు సాంగత్యం నుండి రక్షించుకోవాలి. బజారులోని అశుద్ధ భోజనమును తినకూడదు, సినిమాలు చూడకూడదు.