30-05-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - జ్ఞానం పాయింట్లను స్మృతిలో ఉంచుకుంటే సంతోషంగా ఉంటారు, మీరిప్పుడు స్వర్గ ద్వారం ఎదురుగా నిలబడి ఉన్నారు, బాబా ముక్తి-జీవన్ముక్తుల మార్గం చూపిస్తున్నారు"

ప్రశ్న:-

తమ రిజిస్టరును సరిగ్గా ఉంచుకునేందుకు ఏ అటెన్షన్ తప్పకుండా ఉండాలి ?

జవాబు:-

మనసా-వాచా-కర్మణా ఎవ్వరికీ దుఃఖమివ్వలేదు కదా అని అటెన్షన్ ఉండాలి. తమ స్వభావం చాలా ఫస్ట్ క్లాస్ గా, మధురంగా ఉండాలి. మాయ ముక్కు-చెవులను పట్టుకొని ఇతరులకు దుఃఖాన్నిచ్చే ఏ పనీ చేయించకూడదు. ఒకవేళ దుఃఖం కలిగిస్తే చాలా పశ్చాత్తాపపడవలసి వస్తుంది. రిజిస్టరు పాడైపోతుంది.

గీతము:-

నయనహీనులకు మార్గం చూపించు ప్రభూ..... (నయన్ హీన్ కో రాహ్ దిఖావో.....)

ఓంశాంతి. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. చాలా సహజమైన మార్గాన్ని అర్థం చేయించినా కూడా పిల్లలు దెబ్బలు తింటూనే ఉంటారు. తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు, శాంతిధామానికి వెళ్ళే మార్గాన్ని తెలియజేస్తున్నారని ఇక్కడ కూర్చున్నప్పుడు భావిస్తారు. ఇది చాలా సహజమైనది. రాత్రింబవళ్ళు ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండండని తండ్రి చెప్తున్నారు. ఆ భక్తిమార్గపు యాత్రలు కాలినడకన చేస్తారు. చాలా ఎదురుదెబ్బలు తినవలసి వస్తుంది. ఇక్కడ మీరు కూర్చుని కూడా స్మృతియాత్రలో ఉన్నారు. దైవీ గుణాలను ధారణ చేయాలని కూడా తండ్రి అర్థం చేయించారు. ఆసురీ అవగుణాలను సమాప్తం చేస్తూ వెళ్ళండి. ఆసురీ కర్మలేవీ చేయకండి, వాటితో వికర్మలు తయారవుతాయి. పిల్లలైన మిమ్మల్ని సదా సుఖవంతులుగా తయారుచేసేందుకే తండ్రి వచ్చారు. చక్రవర్తి కుమారుడు తన తండ్రిని మరియు రాజ్యాన్ని చూసి సంతోషిస్తాడు కదా. రాజ్యం ఉండవచ్చు కానీ శరీరక రోగాలు మొదలైనవి ఉంటూనే ఉంటాయి. శివబాబా వచ్చి ఉన్నారు, వారు మమ్మల్ని చదివిస్తున్నారు అని ఇక్కడ పిల్లలైన మీకు నిశ్చయముంది. తర్వాత మనం స్వర్గానికి వెళ్ళి రాజ్యం చేస్తాము. అక్కడ ఏ విధమైన దుఃఖమూ ఉండదు. మీ బుద్ధిలో రచయిత మరియు రచనల ఆదిమధ్యాంత జ్ఞానముంది. ఈ జ్ఞానం ఇతర మనుష్యమాత్రులెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఇదివరకు మనలో జ్ఞానం ఉండేది కాదు, తండ్రి గురించి మనకు తెలియదు అని పిల్లలైన మీరు కూడా ఇప్పుడు తెలుసుకున్నారు. మనుష్యులు భక్తిని చాలా ఉత్తమమని భావిస్తారు, రకరకాల భక్తిని చేస్తారు. అందులో అన్నీ స్థూలమైన విషయాలే ఉంటాయి. సూక్ష్మమైన విషయాలేవీ ఉండవు. ఇప్పుడు అమరనాథ యాత్రకు స్థూలంగా వెళ్తారు కదా. అక్కడ కూడా అదే లింగముంది. తాము ఎవరి వద్దకు వెళ్తున్నారో కూడా మనుష్యులకు ఏమాత్రమూ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు ఎదురుదెబ్బలు తినేందుకు ఎక్కడికీ వెళ్ళరు. మనం కొత్త ప్రపంచం కోసమే చదువుతున్నామని మీకు తెలుసు. అక్కడ ఈ వేద-శాస్త్రాలు మొదలైనవేవీ ఉండవు. సత్యయుగంలో భక్తి ఉండదు. అక్కడ సుఖమే ఉంటుంది. ఎక్కడైతే భక్తి ఉంటుందో అక్కడ దుఃఖముంటుంది. ఈ సృష్టిచక్ర చిత్రం చాలా బాగుంది. ఇందులో స్వర్గ ద్వారం గురించి చాలా స్పష్టంగా ఉంది. ఇది బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు మనం స్వర్గ ద్వారం వద్ద కూర్చుని ఉన్నాము. చాలా సంతోషం ఉండాలి. జ్ఞానం పాయింట్లను గుర్తు చేసుకుంటూ పిల్లలైన మీరు చాలా సంతోషంగా ఉండగలరు. ఇప్పుడు మనం స్వర్గ ద్వారంలోకి వెళ్తున్నామని మీకు తెలుసు. అక్కడ చాలా కొద్ది మంది మనుష్యులు మాత్రమే ఉంటారు. ఇక్కడ ఎంతమంది మనుష్యులున్నారు. ఎన్నో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. దాన-పుణ్యాలు చేయడం, సాధువుల వెంట తిరగడం మొదలైనవి ఎన్ని ఉన్నా, మళ్ళీ - ఓ ప్రభూ, నయనహీనులకు దారి చూపించండని పిలుస్తుంటారు..... ఎల్లప్పుడూ ముక్తి-జీవన్ముక్తుల దారినే కోరుకుంటారు. ఇది పాత దుఃఖమయ ప్రపంచం, ఇది కూడా మీకు తెలుసు. మనుష్యులకు తెలియనే తెలియదు. కలియుగం యొక్క ఆయుష్షు వేల సంవత్సరాలుందని చెప్తారు అంటే పాపం వారు అంధకారంలో ఉన్నారనే కదా. మా బాబా మాకు రాజయోగం నేర్పిస్తున్నారని తెలిసినవారు మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. ఉదాహరణకు బ్యారిస్టరి యోగం, ఇంజనీర్ యోగం ఉంటాయి కదా. చదివేవారికి టీచర్ స్మృతే ఉంటుంది. బ్యారిస్టరి జ్ఞానం ద్వారా మనుష్యులు బ్యారిస్టరుగా అవుతారు. ఇది రాజయోగం. మన బుద్ధియోగం పరమపిత పరమాత్మతో ఉంది. ఇందులో సంతోషమనే పాదరసం పూర్తిగా పైకెక్కిపోవాలి. చాలా మధురంగా అవ్వాలి. స్వభావం చాలా ఫస్ట్ క్లాస్ గా ఉండాలి. ఎవ్వరికీ దుఃఖం కలగకూడదు. ఎవ్వరికీ దుఃఖమివ్వకూడదని కూడా అనుకుంటారు. కాని మాయ ముక్కు-చెవులను పట్టుకుని పొరపాటు చేయిస్తుంది. తర్వాత, మేము అనవసరంగా వారికి దుఃఖమిచ్చామని లోలోపల పశ్చాత్తాపపడతారు. కాని రిజిస్టర్ అయితే పాడయింది కదా. మనసా, వాచా, కర్మణా ఎవ్వరికీ దుఃఖమివ్వకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. మనల్ని అటువంటి దేవతలుగా తయారుచేసేందుకే తండ్రి వస్తారు. దేవతలు ఎప్పుడైనా ఎవరికైనా దుఃఖమిస్తారా. లౌకిక టీచర్ చదివిస్తారు, దుఃఖమైతే ఇవ్వరు కదా. అవును, పిల్లలు చదువుకోకపోతే ఏదో ఒక శిక్ష మొదలైనవి ఇస్తారు. ఈ రోజుల్లో కొట్టకూడదని కూడా చట్టాలు వెలువడ్డాయి. మీరు ఆత్మిక టీచర్లు, చదివించడం మరియు దానితో పాటు నడవడికను నేర్పించడం మీ కర్తవ్యం. అలా చదువుకోవడం-వ్రాసుకోవడం చేస్తే ఉన్నత పదవిని పొందుతారు. చదువుకోకపోతే మీరే ఫెయిల్ అవుతారు. ఈ తండ్రి కూడా రోజూ వచ్చి చదివిస్తారు, నడవడిక నేర్పిస్తారు. నేర్పించేందుకు ప్రదర్శినీలు మొదలైనవి ఏర్పాటు చేస్తారు. అందరూ ప్రదర్శినీలు మరియు ప్రొజెక్టర్ కావాలని అడుగుతారు. ప్రొజెక్టర్లు కూడా వేలాదిమంది తీసుకుంటారు. ప్రతి ఒక్క విషయాన్ని తండ్రి చాలా సహజం చేసి తెలియజేస్తారు. అమరనాథ్ సేవ కూడా సహజమైనది. చిత్రాలను చూపించి మీరు అర్థం చేయించవచ్చు. జ్ఞానం మరియు భక్తి అనగా ఏమిటి? ఇటువైపు జ్ఞానం, అటువైపు భక్తి. దీని ద్వారా స్వర్గం, దాని ద్వారా నరకం - ఇది చాలా స్పష్టంగా ఉంది. పిల్లలైన మీరిప్పుడు చదివేదంతా చాలా సహజం, బాగా చదివిస్తారు కూడా, కాని స్మృతియాత్ర లేదు. ఇదంతా బుద్ధి యొక్క విషయము. మనం తండ్రిని స్మృతి చేయాలి, ఇందులోనే మాయ ఇబ్బంది పెడుతుంది. ఒక్కసారిగా యోగాన్ని తెంచేస్తుంది. మీరందరూ యోగంలో చాలా బలహీనంగా ఉన్నారని తండ్రి చెప్తున్నారు. మంచి-మంచి మహారథులు కూడా చాలా బలహీనంగా ఉన్నారు. వీరిలో ఈ జ్ఞానం చాలా బాగుంది కనుక మహారథులని భావిస్తారు. వారు గుర్రపుస్వారీ చేసేవారు, పాదచారులు అని బాబా అంటారు. ఎవరైతే స్మృతిలో ఉంటారో వారు మహారథులు. లేస్తూ-కూర్చుంటూ స్మృతిలో ఉంటే వికర్మలు వినాశనమవుతాయి, పావనంగా అవుతారు. లేకపోతే శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది మరియు పదవి కూడా భ్రష్టమవుతుంది. కావున మీ చార్టు పెట్టుకుంటే మీకే తెలుస్తుంది, నేను కూడా పురుషార్థం చేస్తున్నానని బాబా స్వయంగా చెప్తున్నారు. పదే పదే బుద్ధి వేరే వైపుకు వెళ్ళిపోతుంది. బాబాకు అనేక చింతలుంటాయి కదా. మీరు తొందరగా వెళ్ళగలుగుతారు. దానితో పాటు మీ నడవడికను కూడా తీర్చిదిద్దుకోవాలి. పవిత్రంగా అయి మళ్ళీ వికారాల్లో పడిపోతే సంపాదనంతా నష్టమైపోతుంది. ఎవరిపైనైనా క్రోధం చేస్తే, ఉప్పునీరుగా అయితే, అసురులుగా అయిపోతారు. అనేక రకాలుగా మాయ వస్తుంది. సంపూర్ణంగా అయితే ఎవ్వరూ అవ్వలేదు. బాబా పురుషార్థం చేయిస్తూ ఉంటారు. కుమారీలకైతే చాలా సహజం, ఇందులో మీ దృఢత్వం కావాలి. ఆంతరిక సత్యత కావాలి. ఒకవేళ ఎవరిపైనైనా మనసు లగ్నమై ఉంటే జ్ఞానంలో కొనసాగలేరు. కుమారీలు, మాతలైతే భారత్ ను స్వర్గంగా తయారుచేసే సేవలో నిమగ్నమైపోవాలి. ఇందులోనే శ్రమ ఉంది. శ్రమ లేకుండా ఏమీ లభించదు. 21 జన్మలకు మీకు రాజ్యం లభిస్తుందంటే ఎంత శ్రమ చేయాలి. ఇందులో పక్కా అయ్యేంతవరకు ఆ చదువును చదవమని బాబా అంటారు. అలా కాకపోతే రెండు లోకాలకు దూరమైపోతారు (ఎటూ కాకుండా అయిపోతారు). ఎవరి నామ-రూపాల్లోనైనా చిక్కుకుంటే, మరణించి సమాప్తమైపోతారు.

అదృష్టవంతులైన పిల్లలు మాత్రమే శరీర భానాన్ని మర్చిపోయి స్వయాన్ని అశరీరిగా భావించి తండ్రిని స్మృతి చేసే పురుషార్థం చేయగలరు. తండ్రి ప్రతి రోజూ అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, మీరు శరీర భానాన్ని విడిచిపెట్టండి. అశరీరి ఆత్మలమైన మనమిప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము, ఈ శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టాలి, నిరంతరం తండ్రి స్మృతిలో ఉంటూ కర్మాతీతులుగా అయినప్పుడే శరీరం విడిచిపెడతారు. ఇది బుద్ధితో అర్థం చేసుకునే విషయం కాని అదృష్టంలో లేకపోతే పురుషార్థం ఏం చేస్తారు. మేము అశరీరులుగా వచ్చాము, ఆ తర్వాత సుఖం యొక్క కర్మసంబంధంలో బంధింపబడి, మళ్ళీ ఆ తర్వాత రావణరాజ్యంలో వికారీ బంధనంలో చిక్కుకున్నామని బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు అశరీరులుగా అయి వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి. ఆత్మనే పతితంగా అయిపోయింది. ఓ పతిత-పావనా రండి అని ఆత్మ పిలుస్తుంది. ఇప్పుడు మీకు పతితుల నుండి పావనంగా అయ్యే యుక్తిని కూడా తెలియజేస్తూనే ఉంటారు. ఆత్మ అవినాశి. ఆత్మలైన మీరు ఇక్కడ పాత్రను అభినయించేందుకు శరీరంలోకి వచ్చారు. ఎవరికైతే కల్పక్రితం అర్థంచేయించారో, వారే వస్తూ ఉంటారని కూడా ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, కలియుగంలోని సంబంధాలను మర్చిపోండి. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి, ఈ ప్రపంచమే సమాప్తమవ్వనున్నది. ఇందులో సారమేమీ లేదు, అందుకే ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. భగవంతుడిని కలుసుకునేందుకు భక్తి చేస్తారు. భక్తి చాలా మంచిది, చాలా భక్తి చేస్తే భగవంతుడు లభిస్తారు మరియు సద్గతిలోకి తీసుకెళ్తారని భావిస్తారు. ఇప్పుడు మీ భక్తి పూర్తవుతుంది. మీ నోటి నుండి ఓ రామా, ఓ భగవంతుడా అనే భక్తిమార్గంలోని పదాలు కూడా వెలువడకూడదు. ఇవి సమాప్తమైపోవాలి. నన్ను స్మృతి చేయండి అని మాత్రమే తండ్రి చెప్తున్నారు. ఈ ప్రపంచమే తమోప్రధానంగా ఉంది. సత్యయుగంలో సతోప్రధానంగా ఉంటుంది. సత్యయుగం ఎక్కే కళ, తర్వాత దిగే కళ జరుగుతుంది. వాస్తవానికి త్రేతా యుగాన్ని కూడా స్వర్గమని అనరు. కేవలం సత్యయుగాన్నే స్వర్గమని అంటారు. పిల్లలైన మీ బుద్ధిలో ఆది-మధ్య-అంత్యముల జ్ఞానముంది. ఆది అంటే ప్రారంభం, మధ్య అంటే సగము, తర్వాత అంత్యము. మధ్యలో రావణరాజ్యం ప్రారంభమవుతుంది. తండ్రి భారత్ లోనే వస్తారు. కేవలం భారత్ పతితంగా మరియు పావనంగా అవుతుంది. 84 జన్మలు కూడా భారతవాసీయులే తీసుకుంటారు. మిగిలిన ధర్మాలవారు నంబరువారుగా వస్తారు. వృక్షం వృద్ధి చెందుతుంది, మళ్ళీ అదే సమయంలో వస్తారు. ఈ విషయాలు ఇతరులెవ్వరి బుద్ధిలోనూ ఉండవు. మీలో కూడా అందరూ ధారణ చేయలేరు. ఈ 84 జన్మల చక్రం బుద్ధిలో ఉన్నా కూడా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు మనల్ని తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారు. సత్యాతి-సత్యమైన ప్రియుడు వచ్చేసారు, భక్తిమార్గంలో మనం ఎవరినైతే చాలా స్మృతి చేసేవారిమో వారు ఆత్మలమైన మనల్ని తిరిగి తీసుకువెళ్ళేందుకు వచ్చారు. శాంతి అని దేన్ని అంటారో కూడా మనుష్యులకు తెలియదు, ఆత్మ శాంతి స్వరూపమే. ఈ ఇంద్రియాలు లభించినప్పుడే కర్మలు చేయవలసి వస్తుంది. శాంతిసాగరుడైన తండ్రి, అందరినీ తీసుకువెళ్తారు. అప్పుడు అందరికీ శాంతి లభిస్తుంది. సత్యయుగంలో మీకు శాంతి ఉంటుంది, సుఖం కూడా ఉంటుంది. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామానికి వెళ్ళిపోతాయి. తండ్రిని మాత్రమే శాంతిసాగరుడని అంటారు. ఇది కూడా చాలా మంది పిల్లలు మర్చిపోతారు ఎందుకంటే దేహ-అభిమానంలో ఉంటారు, దేహీ-అభిమానిగా అవ్వరు. తండ్రి అందరికీ శాంతినిస్తారు కదా. చిత్రంలో సంగమయుగాన్ని చూపించండి. ఈ సమయంలో అందరూ అశాంతిగా ఉన్నారు. సత్యయుగంలో ఇన్ని ధర్మాలుండవు. అందరూ శాంతిలోకి వెళ్ళిపోతారు. అక్కడ సంపూర్ణ శాంతి లభిస్తుంది. రాజ్యంలో మీకు శాంతి ఉంటుంది, సుఖం కూడా ఉంటుంది. సత్యయుగంలో మీకు పవిత్రత, సుఖం, శాంతి అన్నీ ఉంటాయి. స్వీట్ హెూమ్ ను ముక్తిధామం అని అంటారు. అక్కడ పతితులు, దుఃఖితులు ఉండరు. దుఃఖం-సుఖం యొక్క మాటే ఉండదు. శాంతికి అర్థమే తెలియదు. రాణి యొక్క హారం కథను ఉదాహరణగా చెప్తారు కదా. ఇప్పుడు శాంతి-సుఖం అన్నీ తీసుకోండి అని తండ్రి చెప్తున్నారు. ఆయుష్మాన్ భవ.... అక్కడ కొడుకు కూడా నియమానుసారంగా లభిస్తాడు. కొడుకు లభించేందుకు ఏ పురుషార్థం చేయాల్సిన అవసరం ఉండదు. శరీరం విడిచిపెట్టే సమయానికి సాక్షాత్కారం జరుగుతుంది మరియు సంతోషంగా శరీరాన్ని విడిచిపెడతారు. శరీరం విడిచిపెట్టి నేను ఇలా అవుతాను, ఇప్పుడు చదువుకుంటున్నాను అని ఈ బాబాకు కూడా సంతోషముంటుంది కదా. మనం సత్యయుగంలోకి వెళ్తామని మీకు కూడా తెలుసు. సంగమయుగంలో మాత్రమే మీ బుద్ధిలో ఇది ఉంటుంది. మరి ఎంత సంతోషంగా ఉండాలి. ఎంత ఉన్నతమైన చదువో అంత సంతోషం ఉంటుంది. మనల్ని భగవంతుడు చదివిస్తున్నారు. లక్ష్యం ఉద్దేశ్యం ఎదురుగా ఉంటే ఎంత సంతోషం ఉండాలి. కానీ నడుస్తూ-నడుస్తూ కింద పడిపోతారు.

కుమారీలు మైదానంలోకి వచ్చినప్పుడు మీ సేవ వృద్ధి అవుతుంది. పరస్పరంలో ఉప్పునీరుగా అవ్వకండి అని తండ్రి చెప్తున్నారు. అక్కడ సింహం-మేక కలిసే నీరు తాగుతాయి, మనం అటువంటి ప్రపంచంలోకి వెళ్తున్నామని మీకు తెలుసు, అక్కడైతే ప్రతి వస్తువునూ చూడడంతోనే మనసు సంతోషపడుతుంది. దాని పేరే స్వర్గం. కావున కుమారీలు లౌకిక తల్లి-తండ్రులకు చెప్పాలి - ఇప్పుడు మేము అక్కడకు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాము, తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. కామం మహాశత్రువు అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు నేను యోగినిగా అయ్యాను కావున పతితం కాలేను. ఇలా మాట్లాడేందుకు చాలా ధైర్యం కావాలి. అటువంటి కుమారీలు వెలువడితే ఎంత త్వరగా సేవ జరుగుతుందో చూడండి. కాని నష్టోమోహులుగా ఉండాలి. ఒకసారి మరణించిన తర్వాత మళ్ళీ ఎందుకు గుర్తు రావాలి. కాని చాలామందికి ఇళ్ళు, పిల్లలు మొదలైనవాటి స్మృతి వస్తూనే ఉంటుంది. మరి తండ్రితో యోగం ఎలా కుదురుతుంది. మేము బాబాకు చెందినవారము, ఈ పాత ప్రపంచం సమాప్తమయ్యే ఉందని బుద్ధిలో ఉండాలి. నన్ను స్మృతి చేయండని తండ్రి చెప్తున్నారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తమ ఉన్నతమైన అదృష్టాన్ని తయారుచేసుకునేందుకు ఎంత వీలైతే అంత - అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి. శరీర భానాన్ని పూర్తిగా మర్చిపోవాలి, ఎవరి నామ-రూపాలు కూడా గుర్తు రాకూడదు - ఈ శ్రమ చేయండి.

2. తమ నడవడిక యొక్క చార్టును పెట్టుకోవాలి - ఎప్పుడూ కూడా ఆసురీ నడవడిక నడవకూడదు. హృదయపూర్వక సత్యతతో నష్టోమోహులుగా అయి భారత్ ను స్వర్గంగా తయారుచేసే సేవలో నిమగ్నమవ్వాలి.

వరదానము:-

స్వయం యొక్క మహానతను మరియు మహిమను తెలిసుకున్న సర్వాత్మలలో శ్రేష్ఠమైనవారు, విశ్వం ద్వారా పూజ్యనీయ భవ

బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ వర్తమాన సమయంలో విశ్వంలోని ఆత్మలందరిలో శ్రేష్ఠమైనవారు మరియు భవిష్యత్తులో విశ్వం ద్వారా పూజ్యనీయులు. నంబరువారుగా ఉన్నా, లాస్ట్ నంబరు మణి కూడా విశ్వం ముందు మహాన్ గా ఉంటారు. ఈ రోజు వరకూ భక్తాత్మలు చివరి నంబరు మణిని కూడా కళ్ళకు అద్దుకుంటారు ఎందుకంటే పిల్లలందరూ బాప్ దాదా నయనాలలోని తారలు, కనుపాపలు. ఎవరైతే ఒక్కసారైనా మనస్ఫూర్తిగా, సత్యమైన హృదయంతో స్వయాన్ని తండ్రి బిడ్డనని నిశ్చయం చేసుకుని, డైరెక్ట్ తండ్రికి బిడ్డగా అయ్యారో వారికి మహాన్ లేక పూజ్యనీయంగా అయ్యే లాటరీ లేదా వరదానం లభించనే లభిస్తుంది.

స్లోగన్:-

స్థితి సదా ఖజానాలతో సంపన్నంగా మరియు సంతుష్టంగా ఉన్నట్లయితే పరిస్థితులు మారిపోతాయి.