14-04-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - అంతర్ముఖులుగా అయి జ్ఞాన రూప అవస్థలో ఉంటూ, ఈ మహావాక్యాలను ధారణ చెయ్యండి, అప్పుడు స్వయం మరియు ఇతర ఆత్మల కళ్యాణాన్ని చేయగలరు, మీ మనసు మరియు హృదయం రూపీ మందిరాన్ని ఈశ్వరీయ గుణాల రూపీ మూర్తులతో అలంకరించండి మరియు పవిత్ర సంకల్పాల సుగంధాన్ని వ్యాపింపజేయండి”

ప్రశ్న:-

సర్వోత్తమమైన, సత్యమైన సేవ ఏది? యథార్థ సేవ యొక్క సూక్ష్మమైన మరియు గుహ్యమైన రహస్యమేమిటి?

జవాబు:-

ఎవరి ద్వారానైనా ఏదైనా పొరపాటు జరిగినట్లయితే, వారిని సావధానపరచడంతో పాటు సూక్ష్మ రీతిలో తమ యోగశక్తిని వారి వరకు చేర్చి, వారి అశుద్ధ సంకల్పాలను భస్మం చేయాలి - ఇదే సర్వోత్తమమైన, సత్యమైన సేవ. దీనితో పాటు, మనసులో కూడా ఎటువంటి అశుద్ధ సంకల్పాలు ఉత్పన్నమవ్వకుండా స్వయం పట్ల కూడా అటెన్షన్ పెట్టాలి. ఇందులో స్వయం కూడా జాగ్రత్తగా ఉండాలి మరియు ఇతరుల కోసం ఇటువంటి దివ్యమైన సేవ చేయాలి, ఇదే సేవ యొక్క సూక్ష్మమైన మరియు గుహ్యమైన రహస్యము.

ఓంశాంతి. పురుషార్థీ పిల్లలు ప్రతి ఒక్కరు ముందు అంతర్ముఖి అవస్థను తప్పకుండా ధారణ చేయాలి. అంతర్ముఖతలో చాలా కళ్యాణం ఇమిడి ఉంది. ఈ అవస్థ ద్వారానే అచల, స్థిర, ఓర్పు, నిర్మాన చిత్తము మొదలైన గుణాల ధారణ జరగగలదు, మరియు సంపూర్ణ జ్ఞానమయ అవస్థను పొందగలరు. అంతర్ముఖులుగా అవ్వని కారణంగా, ఆ సంపూర్ణ జ్ఞాన రూప అవస్థ ప్రాప్తించదు, ఎందుకంటే ఏ ‘‘మహావాక్యాలు’’ నైతే సమ్ముఖంలో వినడం జరుగుతుందో, వాటిని లోతుల్లోకి వెళ్ళి గ్రహించకపోతే, ఆ మహావాక్యాలను విని కేవలం రిపీట్ మాత్రమే చేస్తే, అప్పుడు ఆ మహావాక్యాలు వాక్యాలుగా అయిపోతాయి. మహావాక్యాలను జ్ఞాన రూప అవస్థలో ఉంటూ వినకపోతే, ఆ మహావాక్యాలపై మాయ యొక్క నీడ పడుతుంది. మరి ఇప్పుడు, మాయ యొక్క అశుద్ధమైన వైబ్రేషన్లతో నిండినటువంటి మహావాక్యాలను విని, కేవలం రిపీట్ చేయడంతో స్వయంతో పాటు ఇతరులకు, కళ్యాణం జరిగేందుకు బదులుగా అకళ్యాణం జరుగుతుంది, అందుకే - హే పిల్లలూ, పూర్తిగా అంతర్ముఖులుగా అయిపోండి.

మీ ఈ మనసు మందిరం వంటిది. ఎలాగైతే మందిరం నుండి సదా సుగంధం వస్తుందో, అలా మనసు అనే మందిరం పవిత్రంగా అయినప్పుడు సంకల్పాలు కూడా పవిత్రమైనవి ఉత్పన్నమవుతాయి. ఎలాగైతే మందిరంలో కేవలం పవిత్రమైన దేవీదేవతల చిత్రాలనే పెట్టడం జరుగుతుందో, దైత్యులవి పెట్టరో, అలాగే పిల్లలైన మీరు మీ మనసు మరియు హృదయం రూపీ మందిరాన్ని సర్వ ఈశ్వరీయ గుణాల మూర్తులతో అలంకరించండి. ఆ గుణాలు ఏమిటంటే - నిర్మోహి, నిర్లోభి, నిర్భయ, ఓర్పు, నిరహంకారి మొదలైనవి ఎందుకంటే ఈ దివ్య లక్షణాలన్నీ మీవే. పిల్లలైన మీరు మీ మనసు అనే మందిరాన్ని ప్రకాశవంతంగా అనగా సంపూర్ణ శుద్ధంగా తయారుచేసుకోవాలి. మనసు అనే మందిరం ప్రకాశవంతంగా అయినప్పుడే తమ ప్రకాశవంతమైన, ప్రియమైన వైకుంఠ దేశానికి వెళ్ళగలరు. కావున ఇప్పుడు మీ మనసును ఉజ్వలంగా చేసుకునే ప్రయత్నం చేయాలి మరియు మనసు సహితంగా వికారీ కర్మేంద్రియాలను వశం చేసుకోవాలి. కానీ, కేవలం స్వయం కోసమే కాకుండా ఇతరుల కోసం కూడా ఈ దివ్యమైన సేవను చేయాలి.

వాస్తవానికి సేవ యొక్క అర్థం అతి సూక్ష్మమైనది మరియు గుహ్యమైనది. ఎవరైనా పొరపాటు చేసినప్పుడు కేవలం వారిని సావధానపరచడం వరకే సేవ కాదు. కానీ, సూక్ష్మ రీతిలో వారికి తమ యోగ శక్తిని అందించి, వారి అశుద్ధ సంకల్పాలను భస్మం చేయాలి, ఇదే సర్వోత్తమమైన, సత్యమైన సేవ. దీనితో పాటు స్వయంపై కూడా అటెన్షన్ పెట్టాలి. కేవలం మీ వాచా మరియు కర్మణా మాత్రమే కాదు, మనసులోనైనా సరే ఏవైనా అశుద్ధ సంకల్పాలు ఉత్పన్నమైతే, వాటి వైబ్రేషన్లు ఇతరుల వరకు వెళ్ళి సూక్ష్మ రీతిలో అకళ్యాణం చేస్తాయి, దాని భారం మీపైకి వస్తుంది మరియు ఆ భారమే బంధనమైపోతుంది. అందుకే - హే పిల్లలూ, స్వయం జాగ్రత్త ఉండండి, తర్వాత ఇతరుల పట్ల కూడా ఈ దివ్యమైన సేవనే చేయండి, ఇదే సేవాధారి పిల్లలైన మీ అలౌకిక కర్తవ్యము. ఇటువంటి సేవ చేసేవారు స్వయం పట్ల ఎటువంటి సేవ తీసుకోకూడదు. ఎప్పుడైనా అనాయాసంగా ఏదైనా పొరపాటు జరిగినట్లయితే, దానిని మీ బుద్ధియోగ బలంతో సదా కోసం కరెక్ట్ చేసుకోవాలి. ఇటువంటి తీవ్ర పురుషార్థులు కొద్దిగా సూచన లభించినా సరే, దానిని వెంటనే గ్రహించి పరివర్తన చేసుకుంటారు, మరియు భవిష్యత్తు కోసం మంచి రీతిలో అటెన్షన్ పెట్టి నడుచుకుంటారు, ఇదే విశాల బుద్ధి కల పిల్లల కర్తవ్యము.

హే నా ప్రాణులూ, పరమాత్మ ద్వారా రచించబడిన ఈ అవినాశీ రాజస్వ జ్ఞాన యజ్ఞం కోసం తనువు, మనసు, ధనమును సంపూర్ణ రీతిలో స్వాహా చేసే రహస్యం చాలా గుహ్యమైనది. మీరు ఏ క్షణమైతే, నేను తనువు, మనసు, ధనముల సహితంగా యజ్ఞంలో స్వాహా అనగా అర్పితమై మరణించాను అని అంటారో, ఆ క్షణం నుండి మొదలుకొని మీదంటూ ఏదీ ఉండదు. అందులో కూడా ముందు తనువు, మనసును సంపూర్ణ రీతితో సేవలో పెట్టాలి. అంతా యజ్ఞం కోసం మరియు పరమాత్మ కోసం ఉన్నప్పుడు, ఇక స్వయం కోసమంటూ ఏమీ ఉండదు, ధనాన్ని కూడా వ్యర్థంగా పోగొట్టలేరు. మనసు కూడా అశుద్ధ సంకల్పాలు, వికల్పాల వైపు పరుగెత్తలేదు ఎందుకంటే దానిని పరమాత్మకు అర్పణ చేసేసారు. పరమాత్మ అయితే శుద్ధ, శాంత స్వరూపుడు. ఈ కారణం చేత అశుద్ధ సంకల్పాలు స్వతహాగా శాంతిస్తాయి. ఒకవేళ మనసును మాయ చేతికి ఇచ్చినట్లయితే, మాయకు వెరైటీ రూపాలు ఉన్న కారణంగా అనేక రకాల వికల్పాలను ఉత్పన్నం చేసి మనసు అనే గుర్రంపై స్వారీ చేస్తుంది. ఒకవేళ పిల్లల్లో ఎవరికైనా ఇప్పటివరకు కూడా సంకల్ప-వికల్పాలు వస్తున్నాయంటే, మనసు ఇంకా పూర్తి రీతిలో స్వాహా అవ్వలేదని అర్థం చేసుకోవాలి అనగా ఈశ్వరీయ మనసుగా తయారవ్వలేదు, అందుకే - హే సర్వ త్యాగీ పిల్లలూ, ఈ గుహ్యమైన రహస్యాలను అర్థం చేసుకొని, కర్మలు చేసేటప్పుడు స్వయాన్ని సాక్షీగా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి.

స్వయంగా గోపీ వల్లభుడు తమ ప్రియమైన గోప-గోపికలైన మీకు అర్థం చేయిస్తున్నారు - మీలోని ప్రతి ఒక్కరి వాస్తవికమైన, సత్యమైన ప్రేమ ఏమిటి! హే ప్రాణులూ, మీరు పరస్పరంలో ఒకరినొకరు ప్రేమపూర్వకంగా సావధాన పరచుకున్నప్పుడు, అది స్వీకరించాలి ఎందుకంటే ఎంత ప్రియమైన పుష్పమో, అంత శ్రేష్ఠమైన పాలన లభిస్తుంది. పుష్పాన్ని విలువైనదిగా చేసేందుకు తోటమాలికి దానిని ముళ్ళ నుండి బయటకు తీయవలసి ఉంటుంది. అలాగే మిమ్మల్ని కూడా ఎవరైనా సావధానపరచినప్పుడు, వారు నాకు పాలన చేశారని అనగా నాకు సేవ చేశారని భావించాలి. ఆ సేవకు మరియు పాలనకు గౌరవమివ్వాలి, ఇదే సంపూర్ణంగా తయారయ్యేందుకు యుక్తి. ఇదే జ్ఞాన సహిత ఆంతరిక, సత్యమైన ప్రేమ. ఈ దివ్యమైన ప్రేమలో, ఒకరి పట్ల ఒకరికి చాలా గౌరవముండాలి. ప్రతి విషయంలోనూ ముందు స్వయాన్ని సావధానపరచుకోవాలి, ఇదే నిర్మానచిత్త, అతి మధురమైన అవస్థ. ఇలా ప్రేమపూర్వకంగా నడుచుకోవడంతో, మీకు ఇక్కడే ఆ సత్యయుగపు మనోహరమైన రోజులు ఆంతరికంగా అనుభవమవుతాయి. అక్కడైతే ఈ ప్రేమ న్యాచురల్ గా (స్వతహాగా) ఉంటుంది, కానీ ఈ సంగమయుగపు స్వీటెస్ట్ (అతి మధురమైన) సమయంలో ఒకరికొకరు సేవ చేసుకునేందుకు ఇది అతి మధురమైన, రమణీకమైన ప్రేమ, ఈ శుద్ధమైన ప్రేమయే జగత్తులో గాయనం చేయబడింది.

చైతన్య పుష్పాలైన మీలోని ప్రతి ఒక్కరు నిత్యం హర్షితముఖులుగా ఉండాలి, ఎందుకంటే నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్న కారణంగా మీ నరనరాల్లో సంపూర్ణ ఈశ్వరీయ శక్తి ఇమిడి ఉంది. ఇటువంటి ఆకర్షణ శక్తి తన దివ్య చమత్కారాన్ని తప్పకుండా చూపిస్తుంది. ఎలాగైతే నిర్దోషులైన చిన్న పిల్లలు, శుద్ధంగా, పవిత్రంగా ఉన్న కారణంగా సదా నవ్వుతూ ఉంటారు మరియు తమ రమణీకమైన చరిత్ర ద్వారా అందరినీ చాలా ఆకర్షిస్తారు, అలా మీలోని ప్రతి ఒక్కరిదీ ఇటువంటి ఈశ్వరీయ రమణీకమైన జీవితములా ఉండాలి, దీని కోసం మీరు ఏదో ఒక యుక్తితో మీ ఆసురీ స్వభావాలపై విజయాన్ని ప్రాప్తించుకోవాలి. ఎవరైనా క్రోధము యొక్క వికారానికి వశమై మీ ముందుకు రావడం చూసినప్పుడు, వారి ముందు మీరు జ్ఞాన రూపులుగా అయి చిన్ననాటి మధురమైన రీతితో చిరునవ్వుతో ఉన్నట్లయితే, వారు స్వయం శాంతచిత్తులుగా అయిపోతారు అనగా విస్మృతి స్వరూపం నుండి స్మృతిలోకి వచ్చేస్తారు. ఇది వారికి తెలియకపోవచ్చు కానీ సూక్ష్మ రీతితో వారిపై గెలుపొంది యాజమానులుగా అవ్వండి, ఇదే యజమానులుగా మరియు బాలకులుగా ఉండే సర్వోత్తమమైన శిరోమణి విధి.

ఎలాగైతే ఈశ్వరుడు సంపూర్ణ జ్ఞాన రూపుడో, అలా సంపూర్ణ ప్రేమ రూపుడు కూడా. ఈశ్వరుడిలో రెండు గుణాలు ఇమిడి ఉన్నాయి కానీ ఫస్ట్ - జ్ఞానము, సెకెండ్ - ప్రేమ. ఒకవేళ ఎవరైనా ముందు జ్ఞాన రూపులుగా అవ్వకుండా కేవలం ప్రేమ రూపులుగా అయినట్లయితే, ఆ ప్రేమ అశుద్ధ ఖాతా వైపుకు తీసుకువెళ్తుంది, అందుకే ప్రేమను మర్జ్ చేసి ముందు జ్ఞాన రూపులుగా అయి, రకరకాల రూపాలలో వచ్చే మాయపై గెలుపొంది, తర్వాత ప్రేమ రూపులుగా అవ్వాలి. ఒకవేళ జ్ఞానం లేకుండా ప్రేమలోకి వస్తే, అక్కడక్కడ చంచలంగా కూడా అయిపోతారు. ఉదాహరణకు ఎవరైనా జ్ఞాన రూపులుగా అవ్వకుండా ధ్యానంలోకి వెళ్తే, చాలా సార్లు మాయలో చిక్కుకుపోతారు, అందుకే బాబా అంటారు - పిల్లలూ, ఈ ధ్యానం కూడా దారపు సంకెళ్ళ వంటిది. కానీ జ్ఞాన రూపులుగా అయి, తర్వాత ధ్యానంలోకి వెళ్ళినట్లయితే అతి ఆనందం అనుభవమవుతుంది. కావున ముందు జ్ఞానము, తర్వాత ధ్యానము. ధ్యానములో ఉన్న అవస్థ కన్నా జ్ఞానములో ఉన్న అవస్థ శ్రేష్ఠమైనది. అందుకే - హే పిల్లలూ, ముందు జ్ఞాన రూపులుగా అయి తర్వాత ప్రేమను ఇమర్జ్ చేయాలి. జ్ఞానం లేకుండా కేవలం ప్రేమ ఉండడమనేది, ఈ పురుషార్థీ జీవితంలో విఘ్నాలను కలిగిస్తుంది.

సాక్షీ అవస్థ అతి మధురమైనది, రమణీకమైనది మరియు సుందరమైనది. భవిష్య జీవితమంతా ఈ అవస్థ పైనే ఆధారపడి ఉంది. ఎలాగైతే ఎవరి వద్దకైనా ఏదైనా శారీరక బాధ వస్తే, ఆ సమయంలో వారు సాక్షీ, సుఖరూప అవస్థలో స్థితులై దానిని అనుభవించినట్లయితే, గత కర్మలను అనుభవించి సమాప్తం కూడా చేసుకుంటారు మరియు దానితో పాటు భవిష్యత్తు కోసం సుఖపు లెక్కను కూడా తయారుచేసుకుంటారు. కావున ఈ సాక్షీతనపు సుఖరూప అవస్థకు గతం మరియు భవిష్యత్తు, ఈ రెండింటితోనూ కనెక్షన్ ఉంటుంది. కావున ఈ రహస్యాన్ని అర్థం చేసుకుంటే, ఎవరూ కూడా - నా ఈ మనోహరమైన సమయం కేవలం సమాప్తం చేసుకోవడంలో గడిచిపోయింది అని అనరు. ఇదే మనోహరమైన పురుషార్థపు సమయం, ఈ సమయంలోనే రెండు కార్యాలు సంపూర్ణ రీతిలో సిద్ధిస్తాయి. ఇలా రెండు కార్యాలను సిద్ధింపజేసే తీవ్ర పురుషార్థులే అతీంద్రియ సుఖం మరియు ఆనందాల అనుభవంలో ఉంటారు.

ఈ వెరైటీ విరాట డ్రామాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ పిల్లలైన మీకు సంపూర్ణ నిశ్చయం ఉండాలి, ఎందుకంటే ఇది తయారై తయారవుతున్న డ్రామా, పూర్తిగా నమ్మకమైనది. చూడండి, ఈ డ్రామా ప్రతి ఒక్క జీవ ప్రాణి చేత తన పాత్రను పూర్తిగా అభినయించేలా చేస్తుంది. ఎవరైనా రాంగ్ అయినా, వారు ఆ రాంగ్ పాత్రను కూడా పూర్తి రీతిలో అభినయిస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. రాంగ్ మరియు రైట్, ఈ రెండూ ప్లాన్ లో నిశ్చితమై ఉన్నప్పుడు, ఏ విషయంలోనైనా సంశయం రావడమనేది జ్ఞానం కాదు, ఎందుకంటే ప్రతి పాత్రధారి ఎవరి పాత్రను వారు అభినయిస్తున్నారు. ఎలాగైతే బయోస్కోప్ లో (సినిమా) అనేక రకాల పేర్లు, రూపాలు కల యాక్టర్లు తమ-తమ యాక్టింగ్ ను చేసినప్పుడు, వారిలో కొందరి పట్ల ద్వేషం కలగడం లేదా కొందరి పట్ల సంతోషం కలగడమనేది జరగదు. ఇదొక ఆట అని, ఇందులో ప్రతి ఒక్కరికి తమ-తమ గుడ్ లేదా బ్యాడ్ పార్ట్ (మంచి లేదా చెడు పాత్ర) లభించి ఉంది అని తెలుసు. అలాగే అనాదిగా తయారై ఉన్న ఈ బయోస్కోప్ ను కూడా సాక్షీగా అయి ఏకరస అవస్థలో ఉంటూ హర్షితముఖులుగా చూస్తూ ఉండాలి. సంగఠనలో ఈ పాయింట్ ను చాలా మంచి రీతిలో ధారణ చేయాలి. ఒకరినొకరు ఈశ్వరీయ రూపంలో చూడాలి, అనుభూతి చెందే జ్ఞానాన్ని తీసుకొని సర్వ ఈశ్వరీయ గుణాలను ధారణ చేయాలి. మీ లక్ష్య స్వరూప స్మృతి ద్వారా శాంత చిత్తము, నిర్మాన చిత్తము, ఓర్పు, మధురత, శీతలత మొదలైన సర్వ దైవీ గుణాలను ఇమర్జ్ చేసుకోవాలి.

ఓర్పు గల అవస్థను ధారణ చేసేందుకు ముఖ్యమైన పునాది - వెయిట్ ఎండ్ సీ (వేచి చూడడం). హే నా ప్రియమైన పిల్లలూ, వెయిట్ అనగా ఓర్పు వహించడం, సీ అనగా చూడడం. ముందు మీ మనసులో ఓర్పు గుణాన్ని ధారణ చేసి, ఆ తర్వాత బయటి విరాట డ్రామాను సాక్షీగా అయి చూడాలి. ఏ రహస్యం గురించైనా, వినే సమయం సమీపంగా వచ్చేంత వరకు ఓర్పు గుణాన్ని ధారణ చేయాలి. సమయం వచ్చినప్పుడు ఆ ఓర్పు గుణంతో రహస్యాన్ని విన్నట్లయితే, ఎప్పుడూ చలించరు. అందుకే - హే పురుషార్థీ ప్రాణులూ, కొంచెం ఆగండి మరియు ముందుకు వెళ్తున్న కొద్దీ రహస్యాలను చూస్తూ ఉండండి. ఈ ఓర్పు గల అవస్థతో అన్ని కర్తవ్యాలు సంపూర్ణ రీతిలో సిద్ధిస్తాయి. ఈ గుణం నిశ్చయంతో ముడిపడి ఉంది. ఇటువంటి నిశ్చయబుద్ధి, సాక్షీదృష్టలుగా అయి ప్రతి ఆటను హర్షిత ముఖంతో చూస్తూ, ఆంతరికంగా ఓర్పుతో మరియు స్థిరమైన చిత్తముతో ఉంటారు, ఇదే జ్ఞానం యొక్క పరిపక్వ అవస్థ, ఇదే అంతిమంలో, సంపూర్ణతా సమయంలో ప్రాక్టికల్ గా ఉంటుంది, కావున చాలా కాలముగా ఈ సాక్షీ అవస్థలో స్థితులై ఉండే కృషి చేయాలి.

ఎలాగైతే నాటకంలోని యాక్టర్ కు, లభించిన పాత్రను పూర్తిగా అభినయించేందుకు ముందు నుండే రిహార్సల్ చేయవలసి ఉంటుందో, అలాగే ప్రియ పుష్పాలైన మీరు కూడా, రాబోయే భారీ పరీక్షలలో యోగబలంతో పాస్ అయ్యేందుకు తప్పకుండా ముందు నుండే రిహార్సల్ చేయాలి. కానీ ఒకవేళ చాలాకాలం నుండి ఈ పురుషార్థం చేసి ఉండకపోతే, ఆ సమయంలో గాభరాలో ఫెయిల్ అయిపోతారు, అందుకే ముందు మీ ఈశ్వరీయ పునాదిని దృఢంగా ఉంచుకుని దైవీ గుణధారులుగా అవ్వాలి.

జ్ఞాన స్వరూప స్థితిలో స్థితులవ్వడంతో శాంత రూప అవస్థ స్వతహాగా ఏర్పడుతుంది. ఎప్పుడైతే జ్ఞానయుక్త ఆత్మలైన పిల్లలు కలిసి కూర్చొని మురళీ వింటారో, అప్పుడు నాలువైపులా శాంతి వాయుమండలం తయారవుతుంది, ఎందుకంటే వారు ఏ మహావాక్యాలను విన్నా సరే, అవి ఆంతరికంగా లోతుల్లోకి వెళ్ళిపోతాయి. లోతుగా వెళ్ళిన కారణంగా, వారికి ఆంతరికంగా శాంతి యొక్క మధురమైన అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు దీని కోసం ఎవరూ ప్రత్యేకంగా కూర్చొని శ్రమించవలసిన అవసరం లేదు, కానీ జ్ఞానము యొక్క అవస్థలో స్థితులవ్వడం ద్వారా ఈ గుణం అనాయాసంగా వచ్చేస్తుంది. పిల్లలైన మీరు ఉదయాన్నే లేచి ఏకాంతంలో కూర్చున్నప్పుడు శుద్ధ ఆలోచనల రూపీ అలలు ఉత్పన్నమవుతాయి, ఆ సమయంలో చాలా ఉపరామ అవస్థ ఉండాలి. అప్పుడు మీ అసలైన శుద్ధ సంకల్పాలలో స్థితులవ్వడం ద్వారా ఇతర సంకల్పాలన్నీ వాటంతటవే శాంతిస్తాయి మరియు మనసు శాంతమయంగా అయిపోతుంది, ఎందుకంటే మనసును వశం చేసుకునేందుకు కూడా ఏదో ఒక శక్తి తప్పకుండా కావాలి, అందుకే ముందుగా తమ లక్ష్య స్వరూపం యొక్క శుద్ధ సంకల్పాలను ధారణ చేయండి. ఆంతరిక బుద్ధియోగం నియమానుసారంగా ఉన్నప్పుడు మీకు నిస్సంకల్ప స్థితి స్వతహాగానే కలుగుతుంది.

మధురాతి మధురమైన ఆత్మిక జ్ఞాన గుల్జారీ, జ్ఞాన సితారులకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తమ లక్ష్య స్వరూప స్మృతి ద్వారా శాంత చిత్తము, నిర్మాన చిత్తము, ఓర్పు, మధురత, శీతలత మొదలైన దైవీ గుణాలన్నింటినీ ధారణ చేయాలి.

2. నిశ్చయబుద్ధి కలవారిగా, సాక్షీదృష్టలుగా అయి ఈ ఆటను హర్షిత ముఖంతో చూస్తూ ఆంతరికంగా ఓర్పు మరియు స్థిర చిత్తం కలిగి ఉండాలి. చాలా కాలం నుండి ఈ సాక్షీతనపు స్థితిలో స్థితులై ఉండే కృషి చేయాలి.

వరదానము:-

స్నేహం మరియు శక్తి రూపాల బ్యాలెన్స్ ద్వారా సేవ చేసే సఫలతా మూర్త భవ

ఎలాగైతే ఒక కంటిలో తండ్రి స్నేహం మరియు ఇంకొక కంటిలో తండ్రి ద్వారా లభించిన కర్తవ్యం (సేవ) సదా స్మృతిలో ఉంటుందో, అలా స్నేహ మూర్తులుగా అవ్వడంతో పాటు ఇప్పుడు శక్తి రూపంగా కూడా అవ్వండి. స్నేహంతో పాటు మాటల్లో ఎటువంటి పదును ఉండాలంటే, అవి ఎవరి హృదయమునైనా విదీర్ణం చేయాలి. ఎలాగైతే తల్లి పిల్లలకు ఎటువంటి పదాలతో శిక్షణనిచ్చినా కానీ, తల్లి స్నేహం కారణంగా ఆ పదాలు కఠినంగా లేదా చేదుగా అనిపించవు, అలా జ్ఞానం యొక్క సత్యమైన విషయాలేవైతే ఉన్నాయో వాటిని స్పష్టమైన పదాలలో ఇవ్వండి - కానీ పదాలలో స్నేహం ఇమిడి ఉంటే సఫలతా మూర్తులుగా అవుతారు.

స్లోగన్:-

సర్వశక్తివంతుడైన తండ్రిని సాథీ (సహచరుడు) గా చేసుకున్నట్లయితే పశ్చాత్తాపం నుండి విముక్తులవుతారు.