ఓంశాంతి. పిల్లలు జన్మించినప్పుడు, కర్మలనుసారంగా తమతో పాటు భాగ్యాన్ని తెచ్చుకుంటారు. కొందరు షావుకారుల వద్ద, కొందరు పేదవారి వద్ద జన్మ తీసుకుంటారు. తండ్రి కూడా, వారసుడు వచ్చాడని భావిస్తారు. తాము చేసిన దానపుణ్యాల అనుసారంగా జన్మ లభిస్తుంది. ఇప్పుడు మధురాతి-మధురమైన, చాలా కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలైన మీకు, కల్పం తర్వాత, మళ్ళీ తండ్రి వచ్చి అర్థం చేయించారు. మేము మా భాగ్యాన్ని తీసుకొని వచ్చామని పిల్లలకు కూడా తెలుసు. ఎవరైతే బాగా తెలుసుకున్నారో మరియు తండ్రిని స్మృతి చేస్తున్నారో, వారు స్వర్గ రాజ్యాధికారం యొక్క భాగ్యాన్ని తీసుకొని వచ్చారు. భాగ్యానికి స్మృతితో కనెక్షన్ ఉంది. జన్మ తీసుకున్నారు కనుక తండ్రి స్మృతి కూడా ఉండాలి. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా భాగ్యం ఉన్నతంగా ఉంటుంది. ఇది ఎంత సహజమైన విషయము. సెకెండులో జీవన్ముక్తి లభిస్తుంది. మీరు సుఖధామం యొక్క భాగ్యాన్ని ప్రాప్తి చేసుకోవడానికి వచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు పురుషార్థం చేస్తున్నారు. తాము ఎలా పురుషార్థం చేస్తున్నారు అని ప్రతి ఒక్కరు స్వయాన్ని చూసుకుంటున్నారు. మమ్మా, బాబా మరియు సర్వీసబుల్ పిల్లలు ఏ విధంగా పురుషార్థం చేస్తున్నారో, అలా వారిని ఫాలో చేయాలి. అందరికి తండ్రి పరిచయాన్నివ్వాలి. తండ్రి పరిచయాన్ని ఇచ్చినప్పుడు, అందులో రచన ఆదిమధ్యాంతాలు కూడా వస్తాయి. ఋషులు, మునులు మొదలైనవారెవరూ రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల నాలెడ్జ్ ను ఇవ్వలేరు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం చక్రం స్మృతిలో ఉంటుంది. ప్రపంచంలో ఎవరికీ తండ్రి మరియు వారసత్వం గురించి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రిని మరియు మీ భాగ్యాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. శరీర నిర్వహణార్థము కర్మలు కూడా చేయాలి. ఇళ్ళు-వాకిళ్ళను కూడా సంభాళించాలి. ఎవరైనా నిర్బంధనులుగా ఉంటే, వారు బాగా సేవ చేయగలరు. పిల్లలు లేనివారికి సేవ చేసేందుకు మంచి అవకాశం ఉంటుంది. పత్నికి, పతి మరియు పిల్లల బంధనముంటుంది. ఒకవేళ పిల్లలు లేకపోతే, బంధనముక్తులైనట్లే కదా. వారు వానప్రస్థులుగా అయినట్లు. ఇక ముక్తిధామానికి వెళ్ళేందుకు సాంగత్యము కావాలి. భక్తి మార్గంలోనైతే సాధువులు మొదలైనవారు మరియు నివృత్తి మార్గం వారి యొక్క సాంగత్యం లభిస్తుంది. ఆ నివృత్తి మార్గం వారు ప్రవృత్తి మార్గం యొక్క వారసత్వాన్ని ఇప్పించలేరు. పిల్లలైన మీరు మాత్రమే ఇప్పించగలరు. తండ్రి మీకు మార్గాన్ని తెలియజేసారు. భారత్ యొక్క 84 జన్మల చరిత్ర-భూగోళాలను అర్థం చేయించండి. భారతవాసులే 84 జన్మలను తీసుకుంటారు, ఇది ఒక్కరి విషయము కాదు. సూర్యవంశీయుల నుండి మళ్ళీ చంద్రవంశీయులుగా అవుతారు, తర్వాత వైశ్యవంశంలోకి..... వస్తారు, నంబరువారుగా అయితే ఉంటారు కదా. భారత్ యొక్క మొదటి నంబరు రాకుమారుడు శ్రీకృష్ణుడు, అతడిని ఊయలలో ఊపుతారు. రెండవ నంబరు వారిని ఊపరు ఎందుకంటే కళలు తగ్గిపోయాయి. మొదటి నంబరు వారికే పూజ జరుగుతుంది. కృష్ణుడు ఒక్కరా లేక ఇద్దరు ముగ్గురు ఉంటారా అన్నది మనుష్యులు అర్థం చేసుకోరు. కృష్ణుని రాజ్యం కొనసాగుతుంది అన్నది ఎవ్వరికీ తెలియదు. కేవలం మొదటి నంబరు వారికి మాత్రమే పూజ జరుగుతుంది. మార్కులైతే నంబరువారుగానే లభిస్తాయి. కనుక నేను మొదటి నంబరులోకి ఎందుకు రాకూడదు అని పురుషార్థం చేయాలి. మమ్మా, బాబాలను ఫాలో చేయాలి, వారి రాజధానిని తీసుకోవాలి. ఎవరైతే బాగా సేవ చేస్తారో, వారు మంచి మహారాజు ఇంట్లో జన్మ తీసుకుంటారు. అక్కడైతే మహారాజా-మహారాణులే ఉంటారు. ఆ సమయంలో ఎవరికీ రాజా-రాణి అనే టైటిల్స్ ఉండవు, అవి తర్వాత ప్రారంభమవుతాయి. ద్వాపరం నుండి పతితులుగా అయినప్పుడు, వారిలో ఎక్కువ ప్రాపర్టీ ఉన్నవారిని రాజు అని అంటారు. అప్పుడిక మహారాజు పదవి తగ్గిపోతుంది, ప్రాయః లోపమైపోతుంది. తర్వాత భక్తి మార్గం ప్రారంభమైనప్పుడు, పేదవారు, షావుకారులలో తేడా ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలైన మీరే శివబాబాను స్మృతి చేస్తారు మరియు వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. మిగిలిన సత్సంగాల్లో మనుష్యులు కూర్చొని కథలను వినిపిస్తారు. మనుష్యులు, మనుష్యులకు భక్తిని నేర్పిస్తారు. వారు జ్ఞానాన్నిచ్చి, సద్గతిని కలిగించలేరు. వేదశాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. సద్గతి అయితే జ్ఞానం ద్వారానే కలుగుతుంది. పునర్జన్మలను కూడా నమ్ముతారు. మధ్యలో ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. చివర్లోనే తండ్రి వచ్చి అందరినీ తీసుకువెళ్తారు. ఇంతమంది ఆత్మలు ఎక్కడకు వెళ్ళి ఉంటాయి. అన్ని ధర్మాల వారి సెక్షన్లు వేర్వేరుగా ఉంటాయి కదా. కనుక ఇది కూడా అర్థం చేయించాలి. ఆత్మల వృక్షం కూడా ఉంటుందని ఎవరికి తెలియదు. పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం వృక్షం యొక్క జ్ఞానం ఉంటుంది. ఆత్మల వృక్షం కూడా ఉంటుంది, జీవాత్మల వృక్షం కూడా ఉంటుంది. మేము ఈ పాత శరీరాలను వదిలి ఇంటికి వెళ్తున్నామని పిల్లలకు తెలుసు. నేను ఒక ఆత్మను, ఈ శరీరానికి వేరుగా ఉన్నాను అని అర్థం చేసుకోవడమంటే జీవిస్తూ మరణించడము. మీరు మరణించినట్లైతే మీకు సంబంధించినంత వరకు ప్రపంచము మరణించినట్లే. మిత్ర-సంబంధీకులు మొదలైన వారందరినీ వదిలేసారు. ముందు పూర్తి శిక్షణ తీసుకొని, పదవికి అధికారులుగా అయి, అప్పుడు వెళ్ళాలి. తండ్రిని స్మృతి చేయడమైతే చాలా సులభము. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా సరే, వారికి కూడా, శివబాబాను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని చెప్తూ ఉండాలి. ఎవరైతే పక్కా యోగులుగా ఉంటారో, వారు త్వరగా మరణించడం (శరీరాన్ని వదలడం) కూడా మంచిది కాదు, ఎందుకంటే వారు యోగంలో ఉంటూ ఆత్మిక సేవను చేస్తారు. మరణించినట్లైతే సేవను చేయలేరు. సేవ చేయడంతో తమ పదవిని ఉన్నతంగా చేసుకుంటూ ఉంటారు మరియు సోదరీ-సోదరుల సేవ కూడా జరుగుతుంది. వారు కూడా తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతారు. మనం పరస్పరంలో సోదరులము, ఒక్క తండ్రి సంతానము.
నన్ను స్మృతి చేసినట్లయితే, వికర్మలు వినాశనమవుతాయని తండ్రి అంటారు, ఇంతకుముందు కూడా ఇలా చెప్పారు. మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు - సోదరీ లేక సోదరా, మీ ఆత్మ తమోప్రధానంగా అయిపోయింది. ఇదివరకు సతోప్రధానముగా ఉన్న ఆత్మ, ఇప్పుడు మళ్ళీ తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయి, సతోప్రధాన ప్రపంచంలోకి వెళ్ళాలి. స్మృతి యాత్రతో ఆత్మను సతోప్రధానంగా చేసుకోవాలి. స్మృతి చార్టును పూర్తిగా పెట్టుకోవాలి. జ్ఞానం యొక్క చార్టును పెట్టుకోలేరు. తండ్రి అయితే జ్ఞానాన్ని ఇస్తూనే ఉంటారు. నాపై ఉన్న వికర్మల భారం ఎలా తొలగుతుందని చెక్ చేసుకోవాలి. అందుకే, నేను ఎన్ని గంటలు స్మృతి చేసాను అని స్మృతి చార్టును పెట్టుకోవడం జరుగుతుంది. మూలవతనాన్ని కూడా స్మృతి చేస్తారు, మళ్ళీ కొత్త ప్రపంచాన్ని కూడా స్మృతి చేస్తారు. అతలాకుతలం అవ్వనున్నది. దానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాంబులు మొదలైనవి కూడా తయారవుతూ ఉంటాయి. ఒకవైపు, మేము మృత్యువు కోసం ఇటువంటి సామాగ్రిని తయారుచేస్తున్నామని అంటారు. మరొక వైపు, మృత్యు సామాగ్రిని తయారుచేయకండి అని అంటారు. సముద్ర గర్భంలో కూడా హతమార్చే సామాగ్రిని (జలాంతర్గాములు) ఉంచారు. అవి పైకి వచ్చి బాంబులు వేసి, మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఇలాంటి వస్తువులను తయారుచేస్తూ ఉంటారు. ఇవి తమ వినాశనం కోసమే చేసుకుంటున్నారు. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. ఇంత పెద్ద-పెద్ద మహళ్ళను తయారుచేస్తున్నారు. ఇవన్నీ మట్టిలో కలిసిపోతాయని మీకు తెలుసు. కొందరిది మట్టిలో కూరుకుపోతుంది..... యుద్ధం తప్పకుండా జరుగుతుంది. అప్పుడు అందరి జేబులను ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తారు. ఎంతోమంది దొంగలు కూడా చొరబడతారు. యుద్ధాలకు ఎంత ఖర్చు చేస్తారు. ఇదంతా మట్టిలో కలిసిపోనున్నది. ఇళ్ళు మొదలైనవన్నీ కూలిపోతాయి. బాంబులు పడడంతో సృష్టిలోని మూడు భాగాలు సమాప్తమైపోతుంది, ఒక భాగం మిగులుతుంది. భారత్ ఒక భాగంలో ఉంది కదా, మిగిలినవన్నీ తర్వాత వచ్చినవి. ఇప్పుడు భారత్ యొక్క భాగం మాత్రమే మిగులుతుంది. అందరి మృత్యువు జరుగనున్నది కనుక మనం తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు, అందుకే తండ్రి అంటారు - లౌకిక సంబంధీకులతో కూడా తోడును నిర్వర్తించాలి. ఒకవేళ బంధనాలేవీ లేకపోతే, సేవలో ఎందుకు నిమగ్నమవ్వకూడదు అని బాబా సలహానిస్తారు. స్వతంత్రులుగా ఉన్నట్లయితే, అనేకులకు మేలు చేయగలరు. అచ్ఛా, ఒకవేళ బయటకు ఎక్కడికీ వెళ్ళలేకపోతే, తమ మిత్ర-సంబంధీకులపైనే దయ చూపించాలి. బాబా, దయ చూపించండి అని ఇంతకుముందు అనేవారు కదా. ఇప్పుడు మీకు మార్గం లభించింది కనుక బాబా దయ చూపించినట్లుగా, మీరు ఇతరులపై దయ చూపించాలి. తండ్రి అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. సన్యాసులైతే హఠయోగం మొదలైనవాటిలో ఎంతగా శ్రమిస్తారు. ఇక్కడైతే అలాంటిదేమీ లేదు. కేవలం స్మృతి చేసినట్లయితే, పాపాలు భస్మమైపోతాయి, ఇందులో కష్టమేమీ లేదు. ఇది కేవలం స్మృతి యాత్ర యొక్క విషయము. నిలబడండి-కూర్చోండి, కర్మేంద్రియాలతో కర్మలు కూడా చేయండి, కేవలం బుద్ధియోగాన్ని తండ్రితో జోడించండి. ఆ ప్రియునికి సత్యాతి-సత్యమైన ప్రేయసులుగా అవ్వాలి. వారు స్వయంగా అంటారు - ఓ ప్రేయసులారా, ఓ పిల్లలూ! భక్తి మార్గంలోనైతే చాలా స్మృతి చేసారు. కానీ ఇప్పుడు ప్రియుడినైన నన్ను స్మృతి చేసినట్లయితే, మీ పాపాలు భస్మమైపోతాయి, నేను గ్యారంటీ ఇస్తున్నాను. కొన్ని-కొన్ని విషయాలు శాస్త్రాలలో కూడా ఉన్నాయి. భగవంతుని ద్వారా గీతను వినడంతో మీరు జీవన్ముక్తిని పొందుతారు. మనుష్యుల ద్వారా గీతను వినడంతో జీవన బంధనంలోకి వచ్చేసారు, మెట్లు దిగుతూ వచ్చారు. ప్రతి విషయంలోనూ విచార సాగర మథనం చేయాలి. మీ బుద్ధిని ఉపయోగించాలి. ఇది బుద్ధితో చేసే యాత్ర, దీనితో వికర్మలు వినాశనమవుతాయి. వేద శాస్త్రాలు, యజ్ఞ తపాదులు మొదలైనవి చేయడంతో పాపాలు నశించవు, వాటితో కిందకే దిగుతూ వచ్చారు. ఇప్పుడు మీరు పైకి వెళ్ళాలి. మెట్ల చిత్రం గురించి ఎవరైనా అర్థం చేయించనంతవరకు, కేవలం చిత్రాన్ని చూసి ఎవరూ అర్థం చేసుకోలేరు. ఎలాగైతే చిన్న పిల్లలకు చిత్రాన్ని చూపించి, ఇది ఏనుగు అని నేర్పించవలసి ఉంటుంది. వారు ఏనుగును చూసినప్పుడు, చిత్రం కూడా గుర్తుకొస్తుంది. మీ బుద్ధిలోకి ఇదే విధంగా వస్తుంది. చిత్రంలోని బొమ్మలను ఎప్పుడూ చిన్నవిగా చూపించడం జరుగుతుంది. వైకుంఠమైతే పెద్దదిగా ఉంటుందని మీకు తెలుసు కదా, పెద్ద రాజధాని ఉంటుంది. అక్కడ వజ్ర వైఢూర్యాల మహళ్ళు ఉంటాయి, అవి తర్వాత ప్రాయః లోపమైపోతాయి. అన్ని వస్తువులు మాయమైపోతాయి. లేకపోతే, ఈ భారత్ పేదదిగా ఎలా అయ్యింది. షావుకారు నుండి నిరుపేదగా, నిరుపేద నుండి షావుకారుగా అవ్వాలి. ఈ డ్రామా తయారై తయారవుతున్నది, అందుకే మెట్ల చిత్రం గురించి అర్థం చేయించడం జరుగుతుంది. కొత్త-కొత్తవారు వచ్చినప్పుడు వారికి అర్థం చేయించడం వలన అభ్యాసమైపోతుంది, నోరు తెరుచుకుంటుంది. పిల్లలను సేవకు యోగ్యులుగా తయారుచేయడం జరుగుతుంది. చాలా సెంటర్లలో చాలా మంది పిల్లలు అశాంతిని వ్యాపింపజేస్తూ ఉంటారు. బుద్ధియోగం బయట భ్రమిస్తున్నట్లయితే నష్టం కలిగిస్తారు, వాయుమండలాన్ని పాడు చేస్తారు. నంబరువారుగా ఉన్నారు కదా. అప్పుడు తండ్రి, నీవు చదువుకోలేదు కనుక నీ పరిస్థితి ఎలా ఉందో చూడు అని అంటారు. రోజు-రోజుకు ఎక్కవ సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. పాపాలు చేసేవారికి శిక్షలు కూడా లభిస్తూ ఉంటాయి. అప్పుడు, నేను అనవసరంగా పాపం చేసాను అని అంటారు. తండ్రికి వినిపించి ప్రాయశ్చిత్తం చేసుకోవడంతో కొంత తగ్గవచ్చు, లేకపోతే వృద్ధి చెందుతూ ఉంటుంది. అలా జరుగుతూ ఉంటుంది. స్వయం కూడా రియలైజ్ అవుతారు కానీ ఏమి చేయాలి, మా ఈ అలవాటు తొలగిపోవడం లేదు, దీనికన్నా ఇంటికి వెళ్ళి ఉండడం మంచిదని అంటారు. కొందరు బాగా సర్వీస్ చేస్తారు. కొందరు డిస్సర్వీస్ కూడా చేస్తారు. మన సైన్యంలో ధైర్యవంతులు ఎవరెవరు అన్న పేర్లను తండ్రి కూర్చొని తెలియజేస్తారు. ఇకపోతే యుద్ధం మొదలైన విషయాలేవీ ఇక్కడ ఉండవు. ఇవి అనంతమైన విషయాలు. మంచి పిల్లలనైతే తండ్రి తప్పకుండా మహిమ చేస్తారు. పిల్లలు చాలా దయాహృదయులుగా, కళ్యాణకారులుగా అవ్వాలి. అంధులకు చేతికర్రగా అవ్వాలి. బాబాను స్మృతి చేసినట్లయితే, వికర్మలు వినాశనమవుతాయని అందరికీ మార్గాన్ని తెలియజేయాలి. పాపాత్మ మరియు పుణ్యాత్మ అని అంటారు కదా. అంతేకానీ లోపల పరమాత్మ ఉండరు, అలాగే ఆత్మ పరమాత్మగా అవ్వదు. ఇదంతా రాంగ్. పరమాత్మకు పాపం అంటదు. వారికి డ్రామాలో సేవ చేసే పాత్ర ఉంది. మనుష్యులే పాపాత్ములుగా, పుణ్యాత్ములుగా అవుతారు. ఎవరైతే సతోప్రధానంగా ఉండేవారో, వారే తమోప్రధానంగా అయ్యారు. వారి తనువులో తండ్రి కూర్చొని సతోప్రధానంగా చేస్తారు కనుక వారి మతమనుసారంగా నడుచుకోవలసి ఉంటుంది కదా.
ఇప్పుడు తండ్రి పిల్లలైన మిమ్మల్ని విశాలబుద్ధి కలవారిగా చేసారు. రాజధాని ఎలా స్థాపన అవుతుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. తండ్రియే బ్రహ్మా తనువులోకి వచ్చి, బ్రహ్మా ముఖవంశావళి పిల్లలకు రాజయోగాన్ని నేర్పించి, దేవీ దేవతలుగా తయారుచేస్తారు. తర్వాత వారు పునర్జన్మలు తీసుకుంటూ మెట్లు దిగుతారు. ఇప్పుడు మళ్ళీ ఇదంతా రిపీట్ అవ్వనున్నది. తండ్రి మళ్ళీ బ్రహ్మా ద్వారా స్థాపన చేయిస్తున్నారు. యోగబలంతో మీరు 5 వికారాలపై విజయాన్ని పొంది జగత్ జీతులుగా అవుతారు, అంతేకానీ యుద్ధం మొదలైన విషయాలేవీ లేవు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. బంధనముక్తులుగా అయి తండ్రి సేవలో నిమగ్నమవ్వాలి, అప్పుడే ఉన్నతమైన భాగ్యం తయారవుతుంది. దయాహృదయులై అనేకులకు మార్గాన్ని తెలియజేయాలి. అంధులకు చేతి కర్రగా అవ్వాలి.
2. ఈ శరీరం పట్ల మమకారాన్ని తొలగించుకొని, జీవిస్తూ మరణించాలి ఎందుకంటే ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. అనారోగ్యంలో కూడా ఒక్క తండ్రి స్మృతి ఉన్నట్లయితే, వికర్మలు వినాశనమైపోతాయి.