ఓంశాంతి. ఇది పిల్లలకు ఎవరు చెప్పారు. స్కూల్లో కూర్చొని ఉన్నారు కనుక తప్పకుండా టీచరు చెప్పి ఉంటారు. ఇది టీచరు చెప్పారా, తండ్రి చెప్పారా లేక సద్గురువు చెప్పారా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఈ మహావాక్యాలు ఎవరు చెప్పారు. పిల్లల బుద్ధిలో మొట్టమొదట ఈ విషయం రావాలి - వారు మా అనంతమైన తండ్రి, వారిని పరమపిత పరమాత్మ అని అంటారు. కావున తండ్రి కూడా చెప్పినట్లు, శిక్షకుడు కూడా చెప్పినట్లు, ఇంకా సద్గురువు కూడా చెప్పినట్లు. ఇది విద్యార్థులైన మీ బుద్ధిలో ఉంది. వేరే కాలేజ్ లేదా యూనివర్సిటీలలో టీచరు చదివిస్తారు, వారినేమీ ఫాదర్ లేదా గురువు అని అనరు. ఇది కూడా పాఠశాలనే, దీనిని యూనివర్సిటీ అని అయినా అనవచ్చు లేక కాలేజ్ అని అయినా అనవచ్చు. ఇదైతే చదువు కదా. పాఠశాలలో మమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు అన్నది మొట్టమొదట అర్థం చేసుకోవాలి. ఆత్మలందరికీ తండ్రి అయిన ఆ నిరాకారుడు, సర్వుల సద్గతిదాత మమ్మల్ని చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. ఈ రచన అంతా ఆ ఒక్క రచయిత యొక్క ప్రాపర్టీ కావున స్వయంగా వారే కూర్చుని, రచన ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు తండ్రి వద్ద జన్మ తీసుకున్నారు. ఆత్మలైన మనందరికీ వారు తండ్రి అని, వారిని జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ ఫుల్ అని అంటారని మీరు బుద్ధి ద్వారా తెలుసుకున్నారు. వారు జ్ఞానసాగరుడు, పతితపావనుడు. జ్ఞానం ద్వారానే సద్గతి కలుగుతుంది, మనుష్యులు పతితం నుండి పావనంగా అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఇక్కడ కూర్చున్నారు. ఇంకే స్కూలులోనూ, మాకు జ్ఞానసాగరుడైన నిరాకార తండ్రి చదివిస్తున్నారు అన్నది ఎవరి బుద్ధిలోనూ ఉండదు. ఇది మీరు ఇక్కడ మాత్రమే తెలుసుకున్నారు. మీకు మాత్రమే అర్థం చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా భారత్ లో మరియు మిగతా ప్రపంచంలో కూడా, మమ్మల్ని నిరాకార పరమాత్మ చదివిస్తున్నారని ఎవ్వరూ భావించరు. వారిని మనుష్య టీచర్లే చదివిస్తారు. అంతేకాక, వారికి నేను ఒక ఆత్మను అన్నది అర్థం చేసుకునే జ్ఞానం కూడా ఉండదు. ఆత్మయే చదువుకుంటుంది, ఆత్మయే అంతా చేస్తుంది. ఆత్మ ఈ ఇంద్రియాల ద్వారా ఫలానా ఉద్యోగం చేస్తుంది. నేను ఫలానా అన్న అవగాహన వారికి ఉంటుంది, వారికి వెంటనే తమ నామ రూపాలు గుర్తుకొస్తాయి. నేను ఇది చేస్తాను, నేను ఇలా చేస్తాను. శరీరం పేరే గుర్తుకొస్తుంది, కానీ అది రాంగ్. ముందు మనం ఆత్మలము కదా. తర్వాత ఈ శరీరాన్ని తీసుకున్నాము. శరీరం పేరు మారుతూ ఉంటుంది, ఆత్మ పేరైతే మారదు. ఆత్మ ఒక్కటే ఉంటుంది. ఆత్మనైన నాకు శివ అన్న పేరు ఒక్కటే ఉందని తండ్రి చెప్పారు. ఇది మొత్తం ప్రపంచానికి తెలుసు. ఇకపోతే ఈ పేర్లన్నీ శరీరాలకు పెట్టడం జరుగుతుంది. శివబాబానైతే శివ అనే అంటారు, అంతే. వారి శరీరమంటూ ఏదీ కనిపించదు. నేను ఫలానా అని మనుష్యులకు పేరు ఉంటుంది. ఫలానా టీచరు మమ్మల్ని చదివిస్తున్నారని పేరు చెప్తారు కదా. వాస్తవానికి ఆత్మ శరీరం ద్వారా టీచరు పని చేస్తుంది, ఆ ఆత్మలను చదివిస్తుంది. సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. ఇంద్రియాల ద్వారా చదివిస్తుంది, సంస్కారాలనుసారంగా పాత్రను అభినయిస్తుంది. కానీ దేహానికున్న పేర్లు అనుసారంగానే, వ్యాపారాలు మొదలైనవన్నీ నడుస్తాయి. ఇక్కడ మమ్మల్ని నిరాకార తండ్రి చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. మీ బుద్ధి ఎక్కడకు వెళ్ళింది. ఆత్మలైన మనము, ఆ తండ్రికి చెందినవారిగా అయ్యాము. నిరాకార ఫాదర్ వచ్చి, ఈ సాకారుని ద్వారా మమ్మల్ని చదివిస్తున్నారని ఆత్మకు తెలుసు, వారి పేరు శివ. శివజయంతిని కూడా జరుపుకుంటారు. శివుడు అనంతమైన తండ్రి, వారినే పరమపిత పరమాత్మ అని అంటారు. వారు ఆత్మలందరికీ తండ్రి, ఇప్పుడు వారి జయంతిని ఎలా జరుపుకుంటారు. ఆత్మ శరీరంలో ప్రవేశిస్తుందా లేక గర్భంలో ప్రవేశిస్తుందా. ఆత్మ పై నుండి వస్తుంది అన్నది ఎవరికీ తెలియదు. క్రీస్తును ధర్మస్థాపకుడని అంటారు. మొట్టమొదట అతని ఆత్మ పై నుండి రావలసి ఉంటుంది. సతోప్రధాన ఆత్మ వస్తుంది, ఎటువంటి వికర్మ చేసి ఉండదు. ముందు సతోప్రధానంగా ఉంటుంది, తర్వాత సతో, రజో, తమోలలోకి వస్తుంది, అప్పుడు వికర్మలు జరుగుతాయి. ఆత్మ మొదట వచ్చినప్పుడు సతోప్రధానంగా ఉన్న కారణంగా, ఎటువంటి దుఃఖాన్ని అనుభవించదు. సగం సమయం పూర్తయినప్పుడు, వికర్మలు చేయడం మొదలుపెడుతుంది.
నేటికి 5 వేల సంవత్సరాల క్రితం తప్పకుండా సూర్యవంశ రాజ్యముండేది, మిగిలిన ధర్మాలన్నీ తర్వాత వచ్చాయి. భారతవాసులు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. భారత్ ను అవినాశీ ఖండమని అంటారు, ఆ సమయంలో వేరే ఖండాలేవి లేవు. శివబాబా పాడైనదానిని బాగుచేసేవారు. భోళానాథుడని శివుడినే అంటారు, శంకరుడిని కాదు. భోళానాథుడైన శివుడు పాడైనదానిని బాగుచేసేవారు. శివుడు మరియు శంకరుడు ఒక్కరు కాదు, వేర్వేరు. బ్రహ్మా, విష్ణు, శంకరులకు ఎటువంటి మహిమ లేదు. మహిమ కేవలం పాడైనదానిని బాగుచేసే ఒక్క శివునిది మాత్రమే. నేను సాధారణ వృద్ధ తనువులోకి వస్తానని అంటారు. వీరు (బ్రహ్మా) 84 జన్మలు పూర్తి చేశారు, ఇప్పుడు ఆట పూర్తయ్యింది. ఈ పాత శరీరము, పాత సంబంధాలు కూడా సమాప్తమవ్వనున్నాయి. ఇప్పుడిక ఎవరిని గుర్తు చేయాలి. సమాప్తమయ్యే వాటిని గుర్తు చేయడం జరగదు. కొత్త ఇల్లు తయారవుతున్నప్పుడు, పాతదాని నుండి మనసు తొలగిపోతుంది. ఇక్కడిది అనంతమైన విషయము. సర్వుల సద్గతి జరుగుతుంది అనగా రావణ రాజ్యం నుండి అందరికీ విముక్తి లభిస్తుంది. రావణుడు అందరినీ పాడు చేసాడు. భారత్ పూర్తిగా నిరుపేదగా, భ్రష్టాచారిగా ఉంది. మనుష్యులు అవినీతిని, కల్తీని, దొంగతనాన్ని, మోసాన్ని భ్రష్టాచారముగా భావిస్తారు. కానీ తండ్రి అంటారు - మురికిపట్టిన వస్త్రాలుగా అవ్వడము (అపవిత్రంగా అవ్వడము) మొదటి భ్రష్టాచారము. శరీరం వికారాల ద్వారా జన్మిస్తుంది, అందుకే దీనిని వికారీ ప్రపంచమని అంటారు. సత్యయుగాన్ని నిర్వికారీ ప్రపంచమని అంటారు. మనం సత్యయుగంలో ప్రవృత్తి మార్గపు దేవీ దేవతలుగా ఉండేవారము. పవిత్రంగా ఉంటే, వికారాలు లేకపోతే, పిల్లలు ఎలా జన్మిస్తారని అంటారు. అప్పుడు మీరు చెప్పండి - మేము మా రాజధానిని బాహుబలంతో కాదు, యోగబలంతో స్థాపన చేస్తాము, అటువంటప్పుడు యోగబలంతో పిల్లలు జన్మించలేరా! అయినా అది నిర్వికారీ ప్రపంచము, అక్కడున్నది పవిత్ర గృహస్థాశ్రమము. యథా రాజా రాణి, తథా ప్రజా అందరూ సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు. ఇక్కడ సంపూర్ణ వికారులుగా ఉన్నారు. సత్యయుగంలో వికారాలుండవు. దానిని ఈశ్వరీయ రాజ్యమని అంటారు, ఈశ్వరుడైన తండ్రి స్థాపన చేసినటువంటిది. ఇప్పుడిది రావణ రాజ్యము. స్వర్గాన్ని స్థాపన చేసిన శివబాబాకు పూజ జరుగుతుంది. నరకంగా తయారుచేసిన రావణుడిని కాలుస్తూ వస్తారు. ద్వాపరం ఎప్పుడు ప్రారంభమయ్యింది అనేది కూడా ఎవరికీ తెలియదు. ఇది కూడా అర్థం చేసుకునే విషయము. ఇది తమోప్రధాన ఆసురీ ప్రపంచము. అది ఈశ్వరీయ ప్రపంచము. దానిని స్వర్గమని, దైవీ పావన ప్రపంచమని అంటారు. ఇది నరకము, పతిత ప్రపంచము. ఎవరైతే రోజూ చదువుకుంటారో, వారే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. ఫలానా స్థానంలో (మధుబన్) స్కూలు లేదు కదా అని చాలామంది అంటారు. అరే, హెడ్ ఆఫీస్ ఉంది కదా. మీరు వచ్చి డైరెక్షన్ లను తీసుకుని వెళ్ళండి. ఇది పెద్ద విషయమేమీ కాదు. సృష్టి చక్రాన్ని సెకండులో అర్థం చేయించడం జరుగుతుంది. సత్య, త్రేతా యుగాలు గడిచిపోయాయి, తర్వాత ద్వాపర, కలియుగాలు ఉంటాయి, అవి కూడా గడిచిపోయాయి, ఇప్పుడిది సంగమయుగము. కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు చదువుకోవాలి. ప్రతి ఒక్కరికీ చదువుకునే హక్కు ఉంది. బాబా, మేము ఉద్యోగం చేస్తున్నామని అంటారు. అచ్ఛా, ఒక వారం రోజులు జ్ఞానం తీసుకొని వెళ్ళండి, మురళీ అందుతూ ఉంటుంది. ముందు 7 రోజులు భట్టీలో తప్పకుండా ఉండాలి. 7 రోజులు వస్తారు కానీ అందరి బుద్ధి ఒకేలా ఉండదు. 7 రోజుల భట్టీ అంటే ఎవ్వరూ గుర్తుకు రాకూడదు, ఎవరితోనూ పత్ర వ్యవహారాలు మొదలైనవి ఉండకూడదు. అందరూ ఒకేలా అర్థం చేసుకోలేరు. ఇక్కడ పతితులు పావనంగా అవ్వాలి. ఈ పతితత్వము కూడా ఒక రోగము, మనుష్యులు అర్ధకల్పపు మహారోగులుగా ఉన్నారు. వారిని వేరుగా కూర్చోబెట్టవలసి ఉంటుంది. ఎవ్వరి సాంగత్యము ఉండకూడదు. బయటకు వెళ్తే, అశుద్ధమైనవి తింటారు, పతితుల చేతి వంటను తింటారు. సత్యయుగంలో దేవతలు పావనంగా ఉంటారు కదా. వారి కోసం ప్రత్యేకంగా మందిరాలను నిర్మిస్తారు చూడండి. దేవతలను పతితులు ముట్టుకోలేరు. ఈ సమయంలో మనుష్యులు పూర్తిగా పతితులుగా, భ్రష్టాచారులుగా ఉన్నారు. శరీరం విషంతో జన్మిస్తుంది, అందుకే దానిని భ్రష్టాచారము అని అంటారు. సన్యాసుల శరీరం కూడా విషంతోనే తయారయ్యింది. తండ్రి అంటారు - మొట్టమొదట ఆత్మ పవిత్రంగా అవ్వాలి, తర్వాత శరీరం కూడా పవిత్రమైనది కావాలి, అందుకే పాత అపవిత్ర శరీరాలన్నీ వినాశనం చెందవలసి ఉంటుంది. అందరూ తిరిగి వెళ్ళాలి. ఇది వినాశన సమయము. అందరూ పవిత్రంగా అయి తిరిగి వెళ్ళాలి. భారత్ లోనే హోలిక పండుగను జరుపుకుంటారు. ఇక్కడ పంచతత్వాల శరీరం తమోప్రధానంగా ఉంది. సత్యయుగంలో శరీరాలు కూడా సతోప్రధానంగా ఉంటాయి. శ్రీకృష్ణుని చిత్రముంది కదా, నరకాన్ని కాలదన్నవలసి ఉంటుంది ఎందుకంటే సత్యయుగంలోకి వెళ్ళాలి. శవాన్ని కూడా శ్మశానానికి తీసుకువెళ్ళినప్పుడు, మొదట ముఖాన్ని ఊరి వైపు, కాళ్ళను శ్మశానం వైపు పెడతారు. తర్వాత శ్మశానం లోపలికి వెళ్ళినప్పుడు, ముఖాన్ని శ్మశానం వైపు పెడతారు. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్తారు కనుక మీ ముఖం అటు వైపు ఉంది అనగా శాంతిధామము మరియు సుఖధామము వైపు ఉంది, కాళ్ళు దుఃఖధామము వైపు ఉన్నాయి. ఇది శవానికి సంబంధించిన విషయము. ఇక్కడైతే పురుషార్థం చేయవలసి ఉంటుంది. స్వీట్ హోమ్ ను (మధురమైన ఇల్లు) స్మృతి చేస్తూ-చేస్తూ ఆత్మలైన మీరు స్వీట్ హోమ్ కు వెళ్ళిపోతారు. ఇది బుద్ధితో చేసే ప్రాక్టీస్. తండ్రి కూర్చుని ఈ రహస్యాలన్నింటినీ అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఆత్మలైన మనం ఇంటికి వెళ్ళాలని మీకు తెలుసు. ఇది పాత శరీరము, పాత ప్రపంచము. నాటకం పూర్తయ్యింది అంటే 84 జన్మల పాత్రను అభినయించాము. అందరూ 84 జన్మలు తీసుకోరని కూడా అర్థం చేయించారు. ఎవరైతే తర్వాత వేరే ధర్మాలలోకి వస్తారో, వారికి తప్పకుండా తక్కువ జన్మలు ఉంటాయి. ఇస్లాముల కన్నా బౌద్ధులకు తక్కువ జన్మలు ఉంటాయి, వారి కన్నా క్రిస్టియన్లకు ఇంకా తక్కువ జన్మలు ఉంటాయి. గురునానక్ కు చెందిన సిక్కులైతే ఇప్పుడే వచ్చారు. గురునానక్ వచ్చి 500 సంవత్సరాలయ్యింది కనుక వారు 84 జన్మలు తీసుకోరు. లెక్క వేయడం జరుగుతుంది. 5 వేల సంవత్సరాలలో ఇన్ని జన్మలుంటే, 500 సంవత్సరాల్లో ఎన్ని జన్మలు ఉండవచ్చు. 12-13 జన్మలు ఉండవచ్చు. క్రీస్తు వచ్చి 2 వేల సంవత్సరాలయ్యింది కనుక వారికి ఎన్ని జన్మలు ఉంటాయి. సగం కన్నా తక్కువగా ఉంటాయి. లెక్క ఉంది కదా. ఇందులో కొందరు కొన్ని, కొందరు కొన్ని జన్మలు తీసుకుంటారు, ఏక్యురేట్ గా చెప్పలేము. ఈ విషయాల గురించి వాదించడంలో ఎక్కువగా టైమ్ వేస్ట్ చేయకండి. తండ్రిని స్మృతి చేయడం మీ పని. బుద్ధి వ్యర్థమైన విషయాల్లోకి వెళ్ళకూడదు. తండ్రితో యోగాన్ని జోడించాలి, చక్రాన్ని తెలుసుకోవాలి. ఇకపోతే స్మృతితోనే పాపాలు నశిస్తాయి. ఇందులోనే శ్రమ ఉంది, అందుకే భారత్ యొక్క ప్రాచీన యోగమని అంటారు, దీనిని తండ్రియే నేర్పిస్తారు. సత్య, త్రేతాయుగాలలో యోగమనే మాటే ఉండదు. తర్వాత భక్తి మార్గంలో హఠయోగం ప్రారంభమవుతుంది. ఇది సహజ రాజయోగము. నన్ను స్మృతి చేయడంతో పావనంగా అవుతారని తండ్రి అంటారు. ముఖ్యమైన విషయము స్మృతి. ఏ పాపము చేయకూడదు. దేవీ దేవతలకు మందిరాలున్నాయి ఎందుకంటే వారు పావనులు. పూజారులైతే పతితులు, పావన దేవతలకు స్నానాలు మొదలైనవి చేయిస్తారు. వాస్తవానికి పతితుల చేతులు అంటకూడదు కూడా. ఇవన్నీ భక్తి మార్గపు ఆచారాలు-పద్ధతులు. ఇప్పుడు మనం పావనంగా అవుతున్నాము. పవిత్రంగా అయితే దేవతలుగా అయిపోతాము. అక్కడ పూజలు మొదలైనవాటి అవసరం ఉండదు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. వారినే భోళానాథుడని అంటారు. నేను పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి, పాత రావణ రాజ్యంలోకి వస్తాను. అయితే వారు ఎవరి తనువులోనైనా ప్రవేశించి మురళీ వినిపించగలరు. అలాగని వారు సర్వవ్యాపి అని కాదు. ప్రతి ఒక్కరిలో వారి వారి ఆత్మ ఉంటుంది. మీ ఆత్మకు తండ్రి ఎవరు అని ఫారమ్ లో కూడా రాయించడం జరుగుతుంది కానీ అర్థం చేసుకోరు. ఆత్మల తండ్రి ఒక్కరే ఉంటారు. మనమంతా సోదరులము, ఫాదర్ ఒక్కరే, వారి నుండి జీవన్ముక్తి వారసత్వం లభిస్తుంది, వారే ముక్తిదాత, మార్గదర్శకుడు. ఆత్మలందరినీ స్వీట్ హోమ్ కు తీసుకువెళ్తారు, అందుకే పాత ప్రపంచ వినాశనం జరుగుతుంది. హోలిక పండుగ జరుగుతుంది కదా. శరీరాలన్నీ సమాప్తమైపోతాయి, ఇకపోతే ఆత్మలన్నీ తిరిగి వెళ్ళిపోతాయి. సత్యయుగంలోనైతే చాలా కొద్దిమంది ఉంటారు. స్వర్గ స్థాపనను ఎవరు చేయిస్తారు, కలియుగ వినాశనాన్ని ఎవరు చేయిస్తారు అనేది అర్థం చేసుకోవాలి. ఇది స్పష్టంగా రాయబడి ఉన్నది. ప్రేమ ఇస్తే ప్రేమ లభిస్తుంది అని అంటారు. తండ్రి అంటారు - ఎవరైతే నా కోసం మనుష్యులను దేవతలుగా తయారుచేసే సేవను చాలా చేస్తారో, వారు చాలా ప్రియంగా అనిపిస్తారు.
ఎవరైతే పురుషార్థం చేస్తారో, వారు ఉన్నతమైన వారసత్వాన్ని పొందుతారు. ఆత్మలు పరమాత్మ తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలి. ఆత్మాభిమానులుగా అవ్వవలసి ఉంటుంది. చాలామంది చాలా తప్పులను కూడా చేస్తారు, పాత అలవాట్లు పక్కా అయిపోయాయి. ఇక అలాంటప్పుడు ఎంతగా అర్థం చేయించినా సరే, అవి తొలగిపోవు, దానివల్ల వారి పదవి తక్కువైపోతుంది. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఏ విషయంలోనూ వాదనలోకి వచ్చి తమ టైమ్ వేస్ట్ చేసుకోకూడదు. వ్యర్థ విషయాల్లోకి బుద్ధి ఎక్కువగా వెళ్ళకూడదు. ఎంత వీలైతే అంత స్మృతియాత్రతో వికర్మలను వినాశనం చేసుకోవాలి. ఆత్మాభిమానులుగా ఉండే అలవాటు చేసుకోవాలి.
2. ఈ పాత ప్రపంచం నుండి మీ ముఖాన్ని తిప్పుకోవాలి. శాంతిధామము మరియు సుఖధామాలను స్మృతి చేయాలి. కొత్త ఇల్లు తయారవుతుంది కనుక పాతదాని నుండి మనసును తొలగించుకోవాలి.