ఓంశాంతి. తండ్రి కూర్చొని అర్థము చేయిస్తారు, ఈ దాదా కూడా అర్థము చేసుకుంటారు ఎందుకంటే తండ్రి కూర్చొని దాదా ద్వారా అర్థము చేయిస్తారు. మీరు ఏ విధంగా అర్థము చేసుకుంటారో దాదా కూడా అలానే అర్థము చేసుకుంటారు. దాదాను భగవంతుడని అనరు. ఇది భగవానువాచ. తండ్రి ముఖ్యంగా దేహీ-అభిమానులుగా అవ్వండి అని అర్థం చేయిస్తారు. ఇలా ఎందుకు అంటారు? ఎందుకంటే స్వయాన్ని ఆత్మగా భావిస్తే మనము పతితపావనుడైన పరమపిత పరమాత్ముని ద్వారా పావనంగా తయారయ్యేవారిమి. ఈ జ్ఞానము బుద్ధిలో ఉంది, అందరికీ అర్థం చేయించాలి. మేము పతితులమని కూడా పిలుస్తారు. కొత్త ప్రపంచము తప్పకుండా పావనంగానే ఉంటుంది. కొత్త ప్రపంచాన్ని తయారు చేసేవారు, స్థాపన చేసేవారు తండ్రియే. వారినే పతితపావన బాబా అని పిలుస్తారు. వారు పతితపావనుడు, దానితో పాటు వారిని తండ్రి అని అంటారు. తండ్రిని ఆత్మలే పిలుస్తారు, శరీరము పిలవదు. మన ఆత్మల తండ్రి పారలౌకికమైనవారు, వారే పతితపావనులు. ఇది మంచి రీతిగా గుర్తుంచుకోవాలి. ఇది కొత్త ప్రపంచమా లేక పాత ప్రపంచమా అనేది అర్థము చేసుకోగలరు కదా. మాకు అపారమైన సుఖము ఉంది, మేము స్వర్గములో కూర్చున్నామని భావించే బుద్ధిహీనులు కూడా ఉన్నారు. కానీ కలియుగాన్ని ఎప్పుడూ స్వర్గమని అనరని కూడా అర్థము చేసుకోవాలి. దీని పేరే కలియుగము, పాత పతిత ప్రపంచము. తేడా ఉంది కదా. మనుష్యుల బుద్ధిలో ఇది కూడా కూర్చోదు. పూర్తిగా శిథిలావస్థలో ఉన్నారు. పిల్లలు చదవకపోతే వీరు రాతిబుద్ధి కలవారని అంటారు కదా. మీ గ్రామ నివాసులు పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా ఉన్నారని బాబా కూడా వ్రాస్తారు. అటువంటివారు అర్థం చేసుకోరు ఎందుకంటే ఇతరులకు అర్థము చేయించరు. స్వయం పారసబుద్ధి కలవారిగా అయినట్లయితే ఇతరులను కూడా తయారుచేయాలి. పురుషార్థము చేయాలి. దీనిలో సిగ్గు పడడం మొదలైన వాటి విషయమేమీ లేదు. కానీ మనుష్యుల బుద్ధిలో అర్ధకల్పము వ్యతిరేక పదాలు ఉన్నాయి కనుక వాటిని మర్చిపోలేరు. ఎలా మర్చిపోగలరు? మరిపింపజేసే శక్తి కూడా ఒక్క తండ్రి వద్దనే ఉంది. తండ్రి తప్ప ఈ జ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. అంటే అందరూ అజ్ఞానులే. జ్ఞాన సాగరుడైన తండ్రి వచ్చి వినిపించనంత వరకు వారికి జ్ఞానము ఎక్కడ నుండి వస్తుంది! తమోప్రధానమంటేనే అజ్ఞానీ ప్రపంచము. సతోప్రధానమనగా దైవీ ప్రపంచము. తేడా ఉంది కదా. దేవీ దేవతలే పునర్జన్మలు తీసుకుంటారు. సమయం కూడా తిరుగుతూ ఉంటుంది. బుద్ధి కూడా బలహీనమవుతూ ఉంటుంది. బుద్ధియోగాన్ని జోడించడం ద్వారా ఏ శక్తి అయితే లభిస్తుందో అది మళ్ళీ సమాప్తమైపోతుంది.
ఇప్పుడు తండ్రి మీకు అర్థము చేయిస్తారు కనుక మీరు ఎంతగా రిఫ్రెష్ అవుతారు. మీరు రిఫ్రెష్ గా ఉండేవారు మరియు విశ్రాంతిగా ఉండేవారు. పిల్లలూ, మీరు వచ్చి రిఫ్రెష్ కూడా అవ్వండి మరియు విశ్రాంతి కూడా పొందండి అని తండ్రి కూడా వ్రాస్తారు కదా. రిఫ్రెష్ అయిన తర్వాత మీరు సత్యయుగంలో విశ్రాంతిపురిలోకి వెళ్తారు. అక్కడ మీకు చాలా విశ్రాంతి లభిస్తుంది. అక్కడ మీకు సుఖము-శాంతి-సంపద మొదలైనవన్నీ లభిస్తాయి. కనుక రిఫ్రెష్ అయ్యేందుకు, విశ్రాంతి పొందేందుకు తండ్రి వద్దకు వస్తారు. రిఫ్రెష్ కూడా శివబాబాయే చేస్తారు. విశ్రాంతి కూడా బాబా వద్దనే తీసుకుంటారు. విశ్రాంతి అనగా శాంతి. అలసిపోయి విశ్రాంతి పొందుతారు కదా! విశ్రాంతి పొందేందుకు కొందరు ఒక చోటుకు, కొందరు ఇంకొక చోటుకు వెళ్తారు. అందులో రిఫ్రెష్మెంట్ విషయమే లేదు. ఇక్కడ తండ్రి మీకు రోజూ అర్థం చేయిస్తారు కనుక ఇక్కడకు వచ్చి రిఫ్రెష్ అవుతారు. స్మృతి చేయడం ద్వారా మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. సతోప్రధానంగా అయ్యేందుకే మీరు ఇక్కడకు వస్తారు. దీని కొరకు ఏం పురుషార్థము చేయాలి? మధురాతి మధురమైన పిల్లలూ, తండ్రిని స్మృతి చేయండి. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది, మీకు విశ్రాంతి ఎలా లభిస్తుంది అని తండ్రి పూర్తిగా శిక్షణ ఇచ్చారు. ఈ విషయాలు ఇంకెవ్వరికీ తెలియవు కనుక ఇతరులకు కూడా అర్థం చేయించాలి, అప్పుడు వారు కూడా మీలా రిఫ్రెష్ అవుతారు. అందరికీ సందేశాన్నివ్వడమే మీ బాధ్యత. అవినాశీగా రిఫ్రెష్ అవ్వాలి. అవినాశీ విశ్రాంతిని పొందాలి. అందరికీ ఇదే సందేశమునివ్వండి. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండని ఇదే స్మృతినిప్పించాలి. ఇది చాలా సహజమైన విషయము. అనంతమైన తండ్రి స్వర్గాన్ని రచిస్తారు. స్వర్గ వారసత్వాన్నే ఇస్తారు. ఇప్పుడు మీరు సంగమయుగములో ఉన్నారు. మాయ శాపము గురించి మరియు తండ్రి వారసత్వము గురించి మీకు తెలుసు. ఎప్పుడైతే మాయా రావణుని శాపము లభిస్తుందో, అప్పుడు పవిత్రత కూడా సమాప్తమవుతుంది, సుఖ-శాంతులు కూడా సమాప్తమైపోతాయి, అప్పుడు ధనము కూడా సమాప్తమైపోతుంది. నెమ్మది-నెమ్మదిగా ఎలా సమాప్తమైపోతాయి అన్నది కూడా తండ్రి అర్థం చేయించారు. ఎన్ని జన్మలు తీసుకుంటారు, దుఃఖధామంలో విశ్రాంతి ఏమీ లభించదు. సుఖధామంలో విశ్రాంతియే విశ్రాంతి. భక్తి మనుష్యులను ఎంతగానో అలసిపోయేలా చేస్తుంది. జన్మ-జన్మాంతరాలుగా భక్తి అనేది అలసటనే కలిగిస్తుంది. నిరుపేదలుగా చేసేస్తుంది. ఇది కూడా తండ్రి మీకిప్పుడు అర్థము చేయిస్తున్నారు. కొత్త వారు వచ్చారంటే ఎంతగా అర్థం చేయించడం జరుగుతుంది. ప్రతి ఒక్క విషయం గురించి మనుష్యులు చాలా ఆలోచిస్తారు. ఇంద్రజాలంలో పడకూడదని భావిస్తారు. అరే, మీరు ఇంద్రజాలికుడని అంటారు కనుక నేను ఇంద్రజాలికుడినని నేను కూడా అంటాను. కానీ గొర్రెలు మొదలైనవి తయారుచేసే ఇంద్రజాలమేమీ కాదు. మీరు జంతువులైతే కారు కదా. ఇది బుద్ధి ద్వారా అర్థము చేసుకోవడం జరుగుతుంది. సురమండలములోని సంగీతం..... అని గాయనము కూడా ఉంది. ఈ సమయంలో మనుష్యులు గొర్రెల వలె ఉన్నారు. ఈ విషయాలు ఇక్కడికి సంబంధించినవే. సత్యయుగంలో అలా పాడరు, ఈ గాయనం ఈ సమయములోనిదే. చండికకు ఎంతగా మేళాలు జరుగుతాయి. వారు ఎవరని అడగండి. వారు దేవీ అని చెప్తారు. ఇటువంటి పేర్లు అక్కడ ఉండవు. సత్యయుగంలో సదా శుభమైన పేర్లే ఉంటాయి. శ్రీరామ చంద్ర, శ్రీకృష్ణ..... శ్రీ అని శ్రేష్ఠమైనవారినే అంటారు. సత్యయుగీ సంప్రదాయాన్ని శ్రేష్ఠమైనదని అంటారు. కలియుగీ వికారీ సంప్రదాయాన్ని శ్రేష్ఠమని ఎలా అంటారు. శ్రీ అనగా శ్రేష్ఠము. ఇప్పటి మనుష్యులు శ్రేష్ఠంగా లేనే లేరు. మనుష్యుల నుండి దేవతలు..... అని గాయనము కూడా ఉంది, మళ్ళీ దేవతల నుండి మనుష్యులుగా అవుతారు ఎందుకంటే 5 వికారాలలోకి వెళ్తారు. రావణ రాజ్యంలో అందరూ మనుష్యులే మనుష్యులు. అక్కడ దేవతలుంటారు. దానిని దైవీ ప్రపంచము, దీనిని మనుష్యుల ప్రపంచమని అంటారు. దైవీ ప్రపంచాన్ని పగలు అని అంటారు. మనుష్యుల ప్రపంచాన్ని రాత్రి అని అంటారు. ప్రకాశాన్ని పగలు అని అంటారు. అజ్ఞాన అంధకారాన్ని రాత్రి అని అంటారు. ఈ వ్యత్యాసము గురించి మీకు తెలుసు. ఇంతకుముందు మనకు ఏమీ తెలియదని మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అన్ని విషయాలు బుద్ధిలో ఉన్నాయి. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి తెలుసా అని ఋషులు, మునులను అడిగితే వారు కూడా నేతి-నేతి (మాకు తెలియదు) అని అంటూ వెళ్ళిపోయారు. మనము కూడా మొదట నాస్తికులుగా ఉండేవారము, అప్పుడు అనంతమైన తండ్రి గురించి తెలియదు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వారు అసలైన అవినాశీ తండ్రి, ఆత్మలకు తండ్రి. మనము ఆ అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యామని పిల్లలైన మీకు తెలుసు, వారెప్పుడూ కాలిపోరు. ఇక్కడైతే అందరూ కాలిపోతారు, రావణుడిని కూడా కాలుస్తారు. శరీరముంది కదా. అయినా ఆత్మను ఎప్పుడూ ఎవరూ కాల్చలేరు. తండ్రి, పిల్లలకు ఈ గుప్త జ్ఞానాన్ని వినిపిస్తారు, ఇది తండ్రి దగ్గరే ఉంది. ఆత్మలో ఈ గుప్త జ్ఞానముంది. ఆత్మ కూడా గుప్తమైనది. ఆత్మ ఈ నోటి ద్వారా మాట్లాడుతుంది, అందుకే తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, దేహాభిమానులుగా అవ్వకండి, ఆత్మాభిమానులుగా అవ్వండి, లేకపోతే తలక్రిందులుగా అయిపోతారు. స్వయాన్ని ఆత్మ అని మర్చిపోతారు. డ్రామా రహస్యాన్ని కూడా మంచి రీతిగా అర్థము చేసుకోవాలి. డ్రామాలో ఏదైతే రచింపబడి ఉందో, అది యథావిధిగా రిపీట్ అవుతుంది. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. డ్రామానుసారముగా సెకెండు-సెకెండు ఎలా నడుస్తూ ఉంటుంది అనే జ్ఞానము కూడా బుద్ధిలో ఉంది. ఆకాశము యొక్క అంతాన్ని ఎవ్వరూ పొందలేరు. భూమి అంతాన్ని పొందగలరు. ఆకాశము సూక్ష్మమైనది, భూమి స్థూలమైనది. చాలా వస్తువుల అంతమును పొందలేరు. అందుకే ఆకాశమే ఆకాశము, పాతాళమే పాతాళము అని కూడా అంటారు. శాస్త్రాలలో విన్నారు కదా, అందుకే పైకి కూడా వెళ్ళి చూస్తారు. అక్కడ కూడా ప్రపంచాన్ని వ్యాపింపజేసేందుకు ప్రయత్నిస్తారు. ప్రపంచాన్ని ఎంతో వ్యాపింపజేశారు కదా. భారతదేశంలో కేవలం ఒక్క దేవీ దేవతా ధర్మమే ఉండేది, అప్పుడు ఇతర ఖండాలు మొదలైనవి లేవు, తర్వాత ఎంతగా వ్యాపింపజేశారు. మీరు ఆలోచించండి. భారతదేశంలో కూడా ఎంతో చిన్న భాగములో దేవతలుంటారు. యమునా నది తీరముంటుంది. ఢిల్లీ పరిస్తాన్ (స్వర్గం)గా ఉండేది. దీనిని శ్మశానవాటిక అని అంటారు, ఇక్కడ అకాలమృత్యువులు జరుగుతూ ఉంటాయి. అమరలోకాన్ని పరిస్తాన్ అని అంటారు. అక్కడ చాలా సహజ సౌందర్యముంటుంది. వాస్తవానికి భారతదేశాన్ని పరిస్తాన్ అని అనేవారు. ఈ లక్ష్మీనారాయణులు పరిస్తాన్ కు యజమానులు కదా. ఎంత శోభనీయంగా ఉన్నారు. వారు సతోప్రధానమైనవారు కదా. సహజ సౌందర్యముండేది. ఆత్మ కూడా మెరిసిపోతూ ఉంటుంది. కృష్ణుని జన్మ ఎలా జరుగుతుంది అనేది పిల్లలకు చూపించారు. గది అంతా చమత్కారము జరిగినట్లుగా అయిపోతుంది. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థము చేయిస్తారు. ఇప్పుడు మీరు పరిస్తాన్ లోకి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తున్నారు. నంబరువారుగా అయితే తప్పకుండా ఉండాలి. అందరూ ఒకే విధంగా ఉండలేరు. ఇంత చిన్న ఆత్మ ఎంత పెద్ద పాత్రను అభినయిస్తుంది అనేది ఆలోచించడం జరుగుతుంది. శరీరము నుండి ఆత్మ వెళ్ళిపోతే శరీరము పరిస్థితి ఏమవుతుంది. ప్రపంచములోని పాత్రధారులందరూ అనాదిగా రచింపబడిన పాత్రనే అభినయిస్తారు. ఈ సృష్టి కూడా అనాదియే, ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర కూడా అనాదియే. ఈ సృష్టి రూపీ వృక్షమును తెలుసుకున్నప్పుడే దీన్ని మీరు అద్భుతమని అంటారు. తండ్రి చాలా బాగా అర్థము చేయిస్తారు కానీ డ్రామాలో అర్థము చేసుకునేందుకు ఎవరెంత సమయం తీసుకోవాలో అంత తీసుకుంటారు. ప్రతి ఒక్కరి బుద్ధికీ తేడా ఉంటుంది కదా. ఆత్మ మనస్సు-బుద్ధి సహితంగా ఉంది కదా కనుక ఆత్మలలో ఎంత తేడా ఉంటుంది. మనము స్కాలర్షిప్ తీసుకోవాలని పిల్లలకు తెలుసు. కనుక హృదయములో సంతోషము కలుగుతుంది కదా. ఇక్కడ కూడా లోపలికి రావడంతోనే లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా కనిపిస్తుంది, అప్పుడు తప్పకుండా సంతోషం కలుగుతుంది కదా! ఈ విధంగా తయారయ్యేందుకు ఇక్కడకు చదువుకునేందుకు వచ్చామని మీకిప్పుడు తెలుసు. లేకపోతే ఎప్పుడూ ఎవరూ రాలేరు. ఇది లక్ష్యము-ఉద్దేశ్యము. మరుసటి జన్మ యొక్క లక్ష్యాన్ని-ఉద్దేశ్యాన్ని చూడగలిగే స్కూలు ఎక్కడా ఉండదు. వీరు స్వర్గానికి యజమానులు, మనమే ఇలా తయారవ్వబోతున్నామని మీరు చూస్తున్నారు. ఇప్పుడు మనము సంగమయుగంలో ఉన్నాము. ఆ రాజ్యానికి చెందము, ఈ రాజ్యానికి చెందము. మనం మధ్యలో ఉన్నాము, వెళ్ళిపోతున్నాము. నావికుడు (తండ్రి) కూడా నిరాకారుడే. నావ (ఆత్మ) కూడా నిరాకారియే. నావను లాక్కొని పరంధామానికి తీసుకువెళ్తారు. నిరాకార తండ్రి నిరాకార పిల్లలను తీసుకువెళ్తారు. తండ్రియే పిల్లలను తనతో పాటు తీసుకువెళ్తారు. ఈ చక్రము పూర్తవుతుంది, మళ్ళీ యథావిధిగా రిపీట్ అవ్వాలి. ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. చిన్నవారిగా అయ్యి మళ్ళీ పెద్దవారిగా అవుతారు. ఎలాగైతే మామిడి టెంకను భూమిలో నాటితే దాని నుండి మళ్ళీ మామిడి చెట్టు వెలువడుతుంది, అది హద్దులోని వృక్షము. ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షము, దీనిని వెరైటీ వృక్షమని అంటారు. సత్యయుగము నుండి మొదలుకొని కలియుగము వరకు అందరూ పాత్రను అభినయిస్తూ ఉంటారు. అవినాశీ ఆత్మ 84 జన్మల చక్రము యొక్క పాత్రను అభినయిస్తుంది. లక్ష్మీనారాయణులు ఉండేవారు, ఇప్పుడు వారు లేరు. చక్రంలో తిరిగి ఇప్పుడు మళ్ళీ ఇలా తయారవుతారు. మొదట ఈ లక్ష్మీనారాయణులు ఉండేవారని చెప్తారు, ఇది వారికి లాస్ట్ జన్మ బ్రహ్మా-సరస్వతి. ఇప్పుడు అందరూ తప్పకుండా తిరిగి వెళ్ళాలి. స్వర్గంలోనైతే ఇంతమంది మనుష్యులుండరు. ముస్లిమ్ లు గానీ, బౌద్ధులు గానీ..... దేవీ దేవతలు తప్ప ఇతర ధర్మానికి చెందిన పాత్రధారులెవ్వరూ ఉండరు. ఈ వివేకం కూడా ఎవ్వరిలోనూ లేదు. వివేకవంతులకు టైటిల్ లభించాలి కదా. ఎవరెంతగా చదువుకుంటారో అంతగా నంబరువారు పురుషార్థము ద్వారా పదవిని పొందుతారు. కనుక పిల్లలైన మీకు ఇక్కడకు రావడంతోనే ఈ లక్ష్యము-ఉద్దేశ్యము చూసి సంతోషము కలగాలి. సంతోషానికి అవధులే లేవు. పాఠశాల లేక స్కూలు అంటే ఇలా ఉండాలి. ఇది ఎంత గుప్తమైనది, కానీ గొప్ప పాఠశాల. ఎంత పెద్ద చదువో, అంత పెద్ద కాలేజి. అక్కడ అన్ని సౌకర్యాలు లభిస్తాయి. ఆత్మ చదువుకోవాలి, తర్వాత బంగారు సింహాసనము పైనైనా, చెక్క సింహాసనము పైనైనా ఎక్కాలి. పిల్లలకు ఎంత సంతోషముండాలి ఎందుకంటే ఇది శివ భగవానువాచ కదా. ఈ విశ్వరాకుమారుడు మొదటి నంబరులో ఉన్నారు. పిల్లలకిప్పుడు తెలిసిపోయింది. కల్ప-కల్పము తండ్రే వచ్చి తన పరిచయాన్నిస్తారు. నేను వీరిలో ప్రవేశించి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నాను. దేవతలలో ఈ జ్ఞానముండదు. జ్ఞానము ద్వారా దేవతలుగా అయిన తర్వాత ఈ చదువు యొక్క అవసరముండదు, ఇందులో అర్థము చేసుకునేందుకు చాలా విశాల బుద్ధి కావాలి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ పతిత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా సన్యసించి పాత దేహము మరియు దేహ సంబంధీకులను మరచి మీ బుద్ధిని తండ్రి వైపు మరియు స్వర్గము వైపు జోడించాలి.
2. అవినాశీ విశ్రాంతిని అనుభవము చేసేందుకు తండ్రి మరియు వారసత్వపు స్మృతిలో ఉండాలి. అందరికీ తండ్రి సందేశమునిచ్చి రిఫ్రెష్ చేయాలి. ఆత్మిక సేవలో సిగ్గుపడకూడదు.