20-01-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మొత్తం కల్పంలో ఇది సర్వోత్తమ కళ్యాణకారి సంగమయుగము, ఇందులో పిల్లలైన మీరు స్మృతి యొక్క శ్యాక్రిన్ ద్వారా సతోప్రధానంగా అవుతారు”

ప్రశ్న:-

అనేక రకాల ప్రశ్నల ఉత్పత్తికి కారణం మరియు వాటన్నిటి నివారణ ఏమిటి?

జవాబు:-

ఎప్పుడైతే దేహాభిమానములోకి వస్తారో, అప్పుడు సంశయము ఉత్పన్నమవుతుంది మరియు సంశయము రావడంతోనే అనేక ప్రశ్నల ఉత్పత్తి జరుగుతుంది. బాబా అంటారు, నేను పిల్లలైన మీకు పతితుల నుండి పావనంగా అవ్వండి మరియు తయారుచేయండి అని ఏ వ్యాపారాన్ని అయితే ఇచ్చానో, ఈ వ్యాపారంలో ఉండడం ద్వారా అన్ని ప్రశ్నలు సమాప్తమైపోతాయి.

గీతము:-

మిమ్మల్ని పొంది మేము విశ్వాన్ని పొందాము..... (తుమ్ హే పాకే హమ్ నే జహాన్ పాలియా హై.....)

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అని ఎవరన్నారు? తప్పకుండా ఆత్మిక తండ్రియే అనగలరు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఇప్పుడు సన్ముఖంలో కూర్చొన్నారు మరియు వారికి బాబా చాలా ప్రేమగా అర్థము చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి తప్ప సర్వులకు సుఖ-శాంతులనిచ్చేవారు మరియు సర్వులను ఈ దుఃఖము నుండి విముక్తులుగా చేసేవారు ప్రపంచమంతటిలో ఇతర మనుష్యులెవ్వరూ ఉండలేరని మీకిప్పుడు తెలుసు, అందుకే దుఃఖములో తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. పిల్లలైన మీరు సన్ముఖంలో కూర్చొన్నారు. బాబా మమ్మల్ని సుఖధామానికి అర్హులుగా చేస్తున్నారని మీకు తెలుసు. సదా సుఖధామానికి యజమానులుగా చేసే తండ్రి సన్ముఖంలోకి వచ్చారు. సన్ముఖంలో వినడానికి మరియు దూరంగా ఉంటూ వినడానికి చాలా తేడా ఉందని మీకు తెలుసు. మధుబన్ లో సన్ముఖంలోకి వస్తారు. మధుబన్ ప్రసిద్ధమైనది. మధుబన్ లో వారు కృష్ణుని చిత్రాన్ని చూపించారు కానీ కృష్ణుడు అక్కడ లేనే లేరు. ఇందులో శ్రమ ఉందని పిల్లలైన మీకు తెలుసు. పదే-పదే స్వయాన్ని ఆత్మ అని నిశ్చయము చేసుకోవాలి. ఆత్మనైన నేను తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాను. తండ్రి మొత్తం చక్రములో ఒక్క సమయంలోనే వస్తారు. ఇది కల్పము యొక్క మనోహరమైన సంగమయుగము. దీనికి పురుషోత్తమ అని పేరు పెట్టారు. ఈ సంగమయుగములోనే మనుష్యమాత్రులందరూ ఉత్తములుగా అవుతారు. ఇప్పుడైతే మనుష్యమాత్రులందరి ఆత్మలు తమోప్రధానంగా ఉన్నాయి, అవి మళ్ళీ సతోప్రధానంగా అవుతాయి. సతోప్రధానంగా ఉన్నప్పుడు ఉత్తమంగా ఉంటారు. తమోప్రధానంగా అవ్వడంతో మనుష్యులు కూడా కనిష్ఠులుగా అవుతారు. కనుక ఇప్పుడు తండ్రి ఆత్మల సన్ముఖములో కూర్చొని అర్థం చేయిస్తారు. మొత్తం పాత్ర అంతా ఆత్మనే అభినయిస్తుంది, శరీరము కాదు. ఆత్మలైన మేము నిజానికి నిరాకారీ ప్రపంచము లేక శాంతిధామంలో ఉండేవారమని మీ బుద్ధిలోకి వచ్చింది. ఇది ఎవ్వరికీ తెలియదు. స్వయం అర్థం చేయించలేరు కూడా. మీ బుద్ధి తాళము ఇప్పుడు తెరుచుకుంది. వాస్తవానికి ఆత్మలు పరంధామములో ఉంటాయని మీకు తెలుసు. అది నిరాకార ప్రపంచము. ఇది సాకార ప్రపంచము. ఇక్కడ ఆత్మలమైన మనమంతా నటులము, పాత్రధారులము. మొట్టమొదట మనము పాత్రను అభినయించేందుకు వస్తాము, తర్వాత నంబరువారుగా వస్తూ ఉంటారు. పాత్రధారులందరూ ఒకేసారి కలిసి రారు. అనేక రకాల పాత్రధారులు వస్తూ ఉంటారు. ఎప్పుడైతే నాటకము పూర్తవుతుందో, అప్పుడు అందరూ కలుస్తారు. ఆత్మలైన మేము నిజానికి శాంతిధామ నివాసులమని ఇప్పుడు మీకు పరిచయం లభించింది, ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తారు. తండ్రి పాత్రను అభినయించేందుకు పూర్తి సమయం రారు. మనమే పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ సతోప్రధానం నుండి తమోప్రధానంగా అవుతాము. ఇప్పుడు పిల్లలైన మీకు సన్ముఖములో వినడం వలన చాలా ఆనందం కలుగుతుంది. ఇంతటి ఆనందం మురళీని చదువుకోవడం వలన కలగదు. ఇక్కడ సన్ముఖములో ఉన్నారు కదా.

భారతదేశము దేవీ దేవతల స్థానంగా ఉండేదని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు అలా లేదు. మీరు చిత్రాలను చూస్తారు, వారు తప్పకుండా ఉండేవారు. మనం అక్కడి నివాసులుగా ఉండేవారము - మొట్టమొదట మనము దేవతలుగా ఉండేవారము, మీ పాత్రను గుర్తు చేసుకుంటారా లేక మర్చిపోతారా. మీరిక్కడ ఈ పాత్రను అభినయించారని బాబా అంటారు. ఇది డ్రామా. కొత్త ప్రపంచము నుండి తప్పకుండా మళ్ళీ పాత ప్రపంచంగా అవుతుంది. మొట్టమొదట పై నుండి ఏ ఆత్మలైతే వస్తారో, వారు స్వర్ణిమ యుగములో వస్తారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. మీరు విశ్వానికి యజమానులుగా, మహారాజా-మహారాణులుగా ఉండేవారు. మీ రాజధాని ఉండేది. ఇప్పుడైతే రాజధాని లేదు. మేము రాజ్యాన్ని ఎలా నడిపించాలి అని ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు. అక్కడ మంత్రులుండరు. సలహాలిచ్చే వారి అవసరమే ఉండదు. వారు శ్రీమతము ద్వారా శ్రేష్ఠాతి శ్రేష్ఠంగా తయారైపోతారు. ఇక వారికి ఇంకెవరి నుండి సలహాలు తీసుకునే అవసరమే ఉండదు. ఒకవేళ ఎవరి నుండి అయినా సలహాలు తీసుకున్నట్లయితే వారి బుద్ధి బలహీనముగా ఉందని భావించడం జరుగుతుంది. ఇప్పుడు ఏ శ్రీమతమైతే లభిస్తుందో, అది సత్యయుగంలో కూడా స్థిరంగా ఉంటుంది. మొట్టమొదట తప్పకుండా ఈ దేవీ దేవతల రాజ్యము అర్ధకల్పముండేదని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మీ ఆత్మ రిఫ్రెష్ అవుతుంది. ఆత్మలకు ఈ నాలెడ్జ్ పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు.

ఇప్పుడు పిల్లలైన మీరు దేహీ-అభిమానులుగా అవ్వాలి. శాంతిధామము నుండి వచ్చి ఇక్కడ మీరు టాకీగా అయ్యారు. టాకీగా అవ్వకుండా కర్మలు జరగవు. ఇది బాగా అర్థము చేసుకోవలసిన విషయము. ఏ విధంగా తండ్రిలో మొత్తం జ్ఞానముందో, అదే విధంగా మీ ఆత్మలో కూడా జ్ఞానముంది. నేను ఒక శరీరాన్ని వదిలి సంస్కారం అనుసారముగా మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుంటాను అని ఆత్మ అంటుంది. పునర్జన్మలు కూడా తప్పకుండా ఉంటాయి. ఆత్మకు ఏ పాత్ర అయితే లభించి ఉందో, అది అభినయిస్తూ ఉంటుంది. సంస్కారాల అనుసారముగా ఇంకొక జన్మ తీసుకుంటూ ఉంటారు. రోజురోజుకు ఆత్మ యొక్క పవిత్రతా డిగ్రీ తగ్గిపోతూ ఉంటుంది. పతితము అనే పదము ద్వాపర యుగము నుండి ఉపయోగిస్తారు. అయినా కొంచెం తేడా అయితే తప్పకుండా ఉంటుంది. మీరు కొత్త ఇంటిని నిర్మించండి, ఒక నెల తర్వాత తప్పకుండా ఎంతోకొంత తేడా వస్తుంది. బాబా మాకు వారసత్వాన్ని ఇస్తున్నారని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇచ్చేందుకే నేను వచ్చానని తండ్రి అంటారు. ఎవరు ఎంతగా పురుషార్థము చేస్తారో, అంతటి పదవిని పొందుతారు. తండ్రి వద్ద ఎలాంటి తేడా ఉండదు. నేను ఆత్మలను చదివిస్తున్నానని తండ్రికి తెలుసు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడం అనేది ఆత్మ యొక్క హక్కు, ఇందులో స్త్రీ-పురుషుల దృష్టి ఇక్కడ ఉండదు. మీరందరూ పిల్లలు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఆత్మలందరూ సోదరులు, వారిని తండ్రి చదివిస్తారు, వారసత్వాన్ని ఇస్తారు. తండ్రియే ఆత్మిక పిల్లలతో మాట్లాడుతారు - ఓ మధురమైన, గారాబాల, చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలూ, మీరు చాలా సమయం నుండి పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ ఇప్పుడు మళ్ళీ మీ వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చి కలిసారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. ప్రారంభము నుండి మొదలుకొని పాత్ర రచింపబడి ఉంది. పాత్రధారులైన మీరు పాత్రను అభినయిస్తూ, నటిస్తూ ఉంటారు. ఆత్మ అవినాశీ, ఇందులో అవినాశీ పాత్ర రచింపబడి ఉంది. శరీరమైతే మారిపోతూ ఉంటుంది. ఇకపోతే ఆత్మ కేవలం పవిత్రం నుండి అపవిత్రంగా అవుతుంది, పతితంగా అవుతుంది, సత్యయుగములో పావనంగా ఉంటుంది. దీనిని పతిత ప్రపంచమని అంటారు. దేవతల రాజ్యమున్నప్పుడు నిర్వికారీ ప్రపంచముండేది. ఇప్పుడది లేదు. ఇది ఆట కదా. కొత్త ప్రపంచము నుండి పాత ప్రపంచంగా, పాత ప్రపంచము నుండి మళ్ళీ కొత్త ప్రపంచంగా అవుతుంది. ఇప్పుడు సుఖధామము స్థాపనవుతుంది, మిగిలిన ఆత్మలందరూ ముక్తిధామములో ఉంటాయి. ఇప్పుడు ఈ అనంతమైన నాటకము పూర్తయ్యింది. ఆత్మలన్నీ దోమల వలె వెళ్తాయి. ఈ సమయంలో ఏ ఆత్మ వచ్చినా కానీ పతిత ప్రపంచంలో వారికి ఏం విలువ ఉంటుంది. ఎవరైతే కొత్త ప్రపంచములో మొట్టమొదట వస్తారో, వారికి విలువ ఉంటుంది. ఏదైతే కొత్త ప్రపంచంగా ఉండేదో, అది మళ్ళీ పాతదిగా అయిపోయిందని మీకు తెలుసు. కొత్త ప్రపంచంలో మనము దేవీదేవతలుగా ఉండేవారము. అక్కడ దుఃఖము యొక్క పేరే ఉండేది కాదు. ఇక్కడైతే అపారమైన దుఃఖముంది. తండ్రి వచ్చి దుఃఖము యొక్క ప్రపంచము నుండి ముక్తులుగా చేస్తారు. ఈ పాత ప్రపంచము తప్పకుండా మారనున్నది. మేము తప్పకుండా సత్యయుగానికి యజమానులుగా ఉండేవారమని మీకు తెలుసు. మళ్ళీ 84 జన్మల తర్వాత ఈ విధంగా అయ్యాము. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారని ఇప్పుడు మళ్ళీ తండ్రి చెప్తున్నారు. కనుక మనము స్వయాన్ని ఆత్మ అని నిశ్చయము చేసుకొని తండ్రిని ఎందుకు స్మృతి చేయకూడదు. ఎంతోకొంత శ్రమ అయితే చేయాలి కదా. రాజ్యాన్ని పొందడం సహజమేమీ కాదు. తండ్రిని స్మృతి చేయాలి. పదే-పదే మిమ్మల్ని మరిపింపజేస్తుంది, ఇది మాయ యొక్క అద్భుతము. దాని కొరకు ఉపాయాన్ని రచించాలి. నా వారిగా అవ్వడంతో స్మృతి నిలుస్తుందని కాదు. ఇక పురుషార్థము ఏం చేస్తారు! లేదు. ఎంతవరకైతే జీవించి ఉంటారో, అంతవరకు పురుషార్థము చేయాలి. జ్ఞానామృతాన్ని తాగుతూ ఉండాలి. ఇది మన అంతిమ జన్మ అని కూడా మీకు తెలుసు. ఈ శరీర భానాన్ని వదిలి దేహీ-అభిమానులుగా అవ్వాలి. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. పురుషార్థము తప్పకుండా చేయాలి. కేవలం స్వయాన్ని ఆత్మగా నిశ్చయించుకొని తండ్రిని స్మృతి చేయండి. త్వమేవ మాతాశ్చ పితా..... ఇదంతా భక్తి మార్గపు మహిమ. మీరు కేవలం ఒక్క అల్ఫ్ ను స్మృతి చేయాలి. వారొక్కరే మధురమైన శ్యాక్రిన్. మిగిలిన విషయాలన్నీ వదిలి ఒక్క శ్యాక్రిన్ ను (తండ్రిని) స్మృతి చేయండి, ఇప్పుడు మీ ఆత్మ తమోప్రధానంగా అయిపోయింది, దానిని సతోప్రధానంగా చేసేందుకు స్మృతియాత్రలో ఉండండి. తండ్రి నుండి సుఖపు వారసత్వాన్ని తీసుకోండి అని అందరికీ ఇదే తెలియజేయండి. సుఖము సత్యయుగంలోనే ఉంటుంది. సుఖధామాన్ని స్థాపన చేసేవారు బాబా. తండ్రిని స్మృతి చేయాలి, ఇది చాలా సహజము. కానీ మాయ వ్యతిరేకత చాలా ఉంది కనుక ప్రయత్నము చేసి తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మాలిన్యం తొలగిపోతుంది. సెకెండులో జీవన్ముక్తి అని గాయనం చేయబడుతుంది. ఆత్మలమైన మనము ఆత్మిక తండ్రి సంతానము. అక్కడి నివాసులము. మళ్ళీ మనము మన పాత్రను రిపీట్ చేయాలి. ఈ డ్రామాలో అందరికన్నా ఎక్కువ పాత్ర మనకు ఉంది. సుఖము కూడా అందరికన్నా ఎక్కువగా మనకే లభిస్తుంది. మీ దేవీదేవతా ధర్మము చాలా సుఖమునిచ్చేది అని బాబా అంటారు. మిగిలినవారంతా లెక్కాచారాలను పూర్తి చేసుకొని ఆటోమెటిక్ గా శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఎక్కువ విస్తారములోకి మనము ఎందుకు వెళ్ళాలి. తండ్రి అందరినీ తిరిగి తీసుకువెళ్ళేందుకే వస్తారు. దోమల వలె అందరినీ తీసుకువెళ్తారు. సత్యయుగములో చాలా కొద్దిమంది ఉంటారు. ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది. శరీరాలు సమాప్తమైపోతాయి. అవినాశీగా ఉండే ఆత్మ లెక్కాచారాన్ని సమాప్తము చేసుకొని వెళ్ళిపోతుంది, అంతేకానీ ఆత్మ అగ్నిలో పడటం వలన పవిత్రంగా అవుతుందని కాదు. స్మృతి రూపీ యోగాగ్ని ద్వారానే ఆత్మ పవిత్రంగా అవ్వాలి. ఇది యోగాగ్ని. సీత అగ్నిని దాటి వెళ్ళిందని వారు కూర్చొని నాటకాన్ని తయారుచేశారు. అగ్ని ద్వారా ఎవ్వరూ పావనంగా అవ్వరు. సీతలైన మీరంతా ఈ సమయంలో పతితంగా ఉన్నారని, రావణ రాజ్యములో ఉన్నారని తండ్రి అర్థము చేయిస్తారు. ఇప్పుడు ఒక్క తండ్రి స్మృతితో మీరు పావనంగా అవ్వాలి. రాముడు ఒక్కరే. అగ్ని అనే పదము వినడంతో అగ్ని నుండి బయటకు వచ్చారని భావిస్తారు. యోగాగ్ని ఎక్కడ, అది ఎక్కడ. ఆత్మ పరమపిత పరమాత్మతో యోగాన్ని జోడించడంతోనే పతితము నుండి పావనంగా అవుతుంది. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. నరకంలో సీతలందరూ రావణుని జైలులో శోకవాటికలో ఉన్నారు. ఇక్కడి సుఖమైతే కాకిరెట్ట సమానమైనది. పోల్చడం జరుగుతుంది. స్వర్గం యొక్క సుఖాలైతే అపారమైనవి.

ఆత్మలైన మీకు ఇప్పుడు ప్రియుడైన శివునితో నిశ్చితార్థము జరిగింది. కనుక ఆత్మ స్త్రీ అయింది కదా! కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారని శివబాబా అంటారు. శాంతిధామానికి వెళ్ళి మళ్ళీ సుఖధామంలోకి వచ్చేస్తారు. కనుక పిల్లలు జ్ఞానరత్నాలతో జోలెను నింపుకోవాలి. ఏ రకమైన సంశయమును తీసుకురాకూడదు. దేహాభిమానములోకి రావడం వలన అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఇక తర్వాత తండ్రి ఏ కర్తవ్యాన్ని అయితే ఇస్తారో, అది చేయరు. ముఖ్యమైన విషయము, మనము పతితుల నుండి పావనంగా అవ్వాలి. మిగిలిన విషయాలను వదిలేయాలి. రాజధాని యొక్క ఆచార-వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, అవే నడుస్తాయి. భవనాలను ఎలా నిర్మించి ఉంటారో, అలాగే నిర్మిస్తారు. ముఖ్యమైన విషయము, పవిత్రంగా అవ్వడం. ఓ పతితపావనా..... అని పిలుస్తారు కూడా. పావనంగా అవ్వడంతో సుఖవంతులుగా అవుతారు. అందరికన్నా పావనమైనవారు దేవీ దేవతలు.

ఇప్పుడు మీరు 21 జన్మలకు సర్వోత్తమ పావనులుగా అవుతారు. వారిని సంపూర్ణ నిర్వికారీ, పావనులని అంటారు. కనుక తండ్రి ఏ శ్రీమతాన్నిస్తారో, దానిపై నడవాలి. ఏ సంకల్పమూ చేసే అవసరము లేదు. మొదట మనము పతితుల నుండి పావనంగా అయితే అవ్వాలి. ఓ పతితపావనా..... అని కూడా పిలుస్తారు కానీ ఏమీ అర్థము చేసుకోరు. పతితపావనుడు ఎవరు అన్నది కూడా తెలియదు. ఇది పతిత ప్రపంచము, అది పావన ప్రపంచము. పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయము. పావనంగా ఎవరు తయారుచేస్తారో అనేది ఏ మాత్రమూ తెలియదు. పతితపావనుడని పిలుస్తారు కానీ మీరు పతితులు అని చెప్పినట్లయితే డిస్టర్బ్ అవుతారు. స్వయాన్ని వికారులని ఎవ్వరూ భావించరు. అందరూ గృహస్థములో ఉండేవారు కదా, రాధా-కృష్ణులు, లక్ష్మీనారాయణులకు కూడా పిల్లలుండేవారు కదా అని అంటారు. అక్కడ యోగబలము ద్వారా పిల్లలు జన్మిస్తారని మర్చిపోయారు. దానిని నిర్వికారీ ప్రపంచము, స్వర్గమని అంటారు. అది శివాలయము. పతిత ప్రపంచంలో పావనమైనవారు ఒక్కరు కూడా లేరని తండ్రి అంటారు. ఈ తండ్రి అయితే తండ్రి, టీచర్ మరియు సద్గురువు కూడా, వారు అందరికీ సద్గతినిస్తారు. అక్కడైతే ఒక గురువు వెళ్ళిపోతే వారి పిల్లలకు పీఠాన్ని ఇస్తారు. ఇప్పుడు వారు సద్గతిలోకి ఎలా తీసుకువెళ్తారు? సర్వుల సద్గతిదాత ఒక్కరే. సత్యయుగంలో కేవలం దేవీదేవతలుంటారు. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామానికి వెళ్ళిపోతాయి. రావణ రాజ్యము నుండి ముక్తులైపోతారు. తండ్రి అందరినీ పవిత్రంగా తయారుచేసి తీసుకువెళ్తారు. పావనం నుండి ఎవ్వరూ వెంటనే పతితులుగా అవ్వరు. నంబరువారుగా దిగుతారు, సతోప్రధానము నుండి సతో, రజో, తమో..... మీ బుద్ధిలో 84 జన్మల చక్రము కూర్చొంది. ఇప్పుడు మీరు లైట్ హౌస్ వంటి వారు. ఈ చక్రము ఎలా తిరుగుతుంది అనేది జ్ఞానము ద్వారా తెలుసుకున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు మిగిలినవారందరికీ మార్గాన్ని తెలియజేయాలి. అందరూ నావలు, మీరు మార్గాన్ని తెలియజేసే పైలెట్లు. మీరు శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయండని, కలియుగ దుఃఖధామాన్ని మర్చిపోండని అందరికీ చెప్పండి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎప్పటివరకైతే జీవించి ఉంటారో, అప్పటివరకు జ్ఞానామృతాన్ని తాగుతూ ఉండాలి. జ్ఞాన రత్నాలతో మీ జోలెను నింపుకోవాలి. సంశయములోకి వచ్చి ఏ ప్రశ్నలూ వేయకూడదు.

2. యోగాగ్నితో ఆత్మ రూపీ సీతను పావనంగా తయారుచేసుకోవాలి. ఏ విషయంలోనూ ఎక్కువ విస్తారములోకి వెళ్ళకుండా దేహీ-అభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి. శాంతిధామము మరియు సుఖధామాలను స్మృతి చేయాలి.

వరదానము:-

దేహీ-అభిమానీ స్థితిలో స్థితులై సదా విశేషమైన పాత్రను అభినయించే సంతుష్టమణి భవ

ఏ పిల్లలైతే విశేషమైన పాత్రధారులో, వారి ప్రతి కర్మ విశేషంగా ఉంటుంది, ఏ కర్మా కూడా సాధారణంగా ఉండదు. సాధారణ ఆత్మ ఏ కర్మనైనా దేహాభిమానిగా అయి చేస్తుంది మరియు విశేష ఆత్మ దేహీ-అభిమానిగా అయి చేస్తుంది. ఎవరైతే దేహీ-అభిమానీ స్థితిలో స్థితులై కర్మలు చేస్తారో, వారు స్వయం కూడా సదా సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంతుష్టపరుస్తారు, అందుకే వారికి సంతుష్టమణి అనే వరదానం స్వతహాగా ప్రాప్తిస్తుంది.

స్లోగన్:-

ప్రయోగీ ఆత్మలుగా అయి యోగ ప్రయోగము ద్వారా సర్వ ఖజానాలను పెంచుకుంటూ వెళ్ళండి.