ఓంశాంతి. ఈ పాట ద్వారా ఓర్పు వహించండి అని పిల్లలకు సూచన లభించింది. మేము శ్రీమతం ఆధారంగా పురుషార్థము చేస్తున్నామని మరియు ఈ గుప్తమైన యోగం యొక్క యాత్రలో ఉన్నామని పిల్లలకు తెలుసు. ఆ యాత్రలు సమయానుసారంగా పూర్తవ్వనున్నాయి. ఈ యాత్రయే ముఖ్యమైనది, దీని గురించి మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. యాత్రకు తప్పకుండా వెళ్ళాలి మరియు తీసుకువెళ్ళే పండా కూడా కావాలి. దీనికి పాండవ సైన్యం అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు యాత్రలో ఉన్నారు. ఇందులో స్థూలమైన యుద్ధము యొక్క విషయమేమీ లేదు. ప్రతి ఒక్క విషయము గుప్తమైనది. యాత్ర కూడా చాలా గుప్తమైనది. నన్ను స్మృతి చేస్తే నా వద్దకు వచ్చి చేరుకుంటారని తండ్రి అన్నట్లుగా శాస్త్రాలలో కూడా ఉంది. ఇది యాత్రయే కదా. తండ్రి అన్ని శాస్త్రాల సారాన్ని తెలియజేస్తారు. ప్రాక్టికల్ గా ఆచరణలోకి తీసుకొస్తారు. ఆత్మలైన మనము మన నిర్వాణధామ యాత్రకు వెళ్ళాలి. ఆలోచిస్తే అర్థము చేసుకోగలరు. ఇది ముక్తిధామానికి సత్యమైన యాత్ర. మేము ముక్తిధామానికి వెళ్ళాలని అందరూ కోరుకుంటారు. ఈ యాత్ర చేయాలంటే ఎవరైనా ముక్తిధామానికి మార్గాన్ని తెలియజేయాలి. కానీ తండ్రి అయితే వారి సమయానికి వారంతట వారే వస్తారు, ఆ సమయము గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి వచ్చి అర్థము చేయించినప్పుడే పిల్లలకు నిశ్చయం కలుగుతుంది. వాస్తవానికి గాయనం చేయబడిన సత్యమైన యాత్ర ఇదే. భగవంతుడే ఈ యాత్రను నేర్పించారు. మన్మనాభవ, మధ్యాజీ భవ. ఈ పదాలు కూడా మీకు ఎంతో ఉపయోగపడతాయి. కేవలం ఎవరు చెప్పారు అన్నదానిలో పొరపాటు చేసేశారు. దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను మర్చిపోండి అని అంటారు. ఇతనికి (బ్రహ్మాబాబాకు) కూడా దేహముంది. ఇతనికి కూడా అర్థము చేయించేవారు మరొకరు ఉన్నారు, వారికి తమ దేహము లేదు, ఆ తండ్రి విచిత్రుడు, వారికి ఏ చిత్రమూ లేదు, మిగిలిన వారందరికీ చిత్రాలున్నాయి (శరీరాలున్నాయి). మొత్తం ప్రపంచమంతా చిత్రశాల. విచిత్రము మరియు చిత్రము అనగా జీవము మరియు ఆత్మల ఈ మనుష్య స్వరూపం తయారుచేయబడి ఉంది. ఆ తండ్రి విచిత్రుడు. నేను ఈ చిత్రాన్ని ఆధారంగా తీసుకోవలసి ఉంటుందని వారు అర్థం చేయిస్తారు. వాస్తవానికి మహాభారత యుద్ధము జరిగినప్పుడు భగవంతుడు తెలియజేసారని శాస్త్రాలలో కూడా ఉంది. వారు రాజయోగాన్ని నేర్పించారు, తప్పకుండా రాజ్యస్థాపన జరిగింది. ఇప్పుడైతే రాజ్యము లేదు. కొత్త ప్రపంచము కోసం భగవంతుడు రాజయోగాన్ని నేర్పించారు, ఎందుకంటే ఆ సమయంలో వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. స్వర్గ స్థాపన జరిగినప్పుడు ఇలా జరిగిందని అర్థం చేయించడం జరుగుతుంది. ఆ లక్ష్మీనారాయణుల రాజ్య స్థాపన జరిగింది. సత్యయుగము ఉండేదని, ఇప్పుడిది కలియుగమని మీ బుద్ధిలో ఉంది. మళ్ళీ తండ్రి అవే విషయాలను అర్థము చేయిస్తారు. మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్ళేందుకు నేను పరంధామము నుండి వచ్చాను అని ఈ విధంగా ఇతరులెవ్వరూ చెప్పలేరు. పరమపిత పరమాత్మయే బ్రహ్మా ద్వారా చెప్పగలరు, ఇంకెవ్వరి ద్వారా కూడా చెప్పలేరు. సూక్ష్మవతనములో బ్రహ్మా, విష్ణు, శంకరులు ఉన్నారు. వారు అవ్యక్త బ్రహ్మా, వీరు వ్యక్త బ్రహ్మా అని బ్రహ్మా గురించి కూడా అర్థం చేయించారు. మీరిప్పుడు ఫరిస్తాగా అవుతారు. ఫరిస్తాలు స్థూలవతనంలో ఉండవు. ఫరిస్తాలకు ఎముకలు-మాంసము ఉండవు. ఇక్కడ ఈ ఆత్మిక సేవలో ఎముకలు మొదలైనవన్నీ సమాప్తం చేసేస్తారు, తర్వాత ఫరిస్తాలుగా అయిపోతారు. ఇప్పుడైతే ఎముకలున్నాయి కదా. తమ ఎముకలను కూడా సేవలో ఇచ్చేశారని వ్రాయబడి ఉంది. అనగా తమ ఎముకలను సమాప్తము చేస్తారు. స్థూలవతనము నుండి సూక్ష్మ వతనవాసులుగా అవ్వాలి. ఇక్కడ మనము ఎముకలనిచ్చి సూక్ష్మంగా అయిపోతాము. ఈ సేవలో అంతా స్వాహా చేయాలి. స్మృతిలో ఉంటూ-ఉంటూ మనము ఫరిస్తాలుగా అయిపోతాము. మిరువా మౌత్ మలూకా షికార్ (వేటగానికి అది వేట, వేటకు అది మృత్యువు) అని కూడా గాయనం చేయబడింది, వేటగాడు అని ఫరిస్తాను అంటారు. మీరు మనుష్యుల నుండి ఫరిస్తాలుగా అవుతారు. మిమ్మల్ని దేవతలని అనలేరు. ఇక్కడైతే మీకు శరీరముంది కదా. సూక్ష్మవతనం యొక్క వర్ణన ఇప్పుడే జరుగుతుంది. యోగములో ఉంటూ ఫరిస్తాలుగా అయిపోతారు. చివరిలో మీరు ఫరిస్తాలుగా అయిపోతారు. మీకు అన్నీ సాక్షాత్కారమవుతాయి మరియు ఎంతో సంతోషం కలుగుతుంది. మనుష్యులందరూ మృత్యువుకు బలైపోతారు. మీలో మహావీరులు ఎవరైతే ఉంటారో వారు స్థిరంగా ఉంటారు. ఇంకా ఏమేమి జరుగుతూ ఉంటాయి! వినాశన దృశ్యాలైతే జరగనున్నాయి కదా. అర్జునుడికి వినాశన సాక్షాత్కారం జరిగింది. ఇది ఒక్క అర్జునుడి విషయం కాదు. పిల్లలైన మీకు వినాశనము మరియు స్థాపన యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. మొట్టమొదట బాబాకు కూడా వినాశనము యొక్క సాక్షాత్కారమయ్యింది. ఆ సమయంలో జ్ఞానమేమీ లేదు. సృష్టి వినాశనమవుతూ ఉండడం చూశారు. తర్వాత చతుర్భుజుని సాక్షాత్కారము జరిగింది. ఇది మంచిదేనని భావించడం మొదలుపెట్టారు. వినాశనము తర్వాత నేను విశ్వానికి యజమానిగా అవుతానని చాలా సంతోషం కలిగింది. వినాశనము మంచిదేనని ప్రపంచము వారికి తెలియదు. శాంతి కోసం ప్రయత్నాలు చేస్తారు కానీ చివరికి వినాశనమైతే జరగనున్నది. పతితపావనా రండి అని స్మృతి చేస్తారు కావున తండ్రి తప్పకుండా వస్తారు, వచ్చి పావన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు, అందులో మనము రాజ్యం చేస్తాము. ఇది మంచిదే కదా. పతితపావనుడిని ఎందుకు స్మృతి చేస్తారు? ఎందుకంటే దుఃఖముంది. పావన ప్రపంచములో దేవతలున్నారు, పతిత ప్రపంచంలోనైతే దేవతల పాదాలు మోపబడవు. కావున తప్పకుండా పతిత ప్రపంచపు వినాశనం జరగాలి. మహావినాశనము జరిగిందని గాయనము కూడా ఉంది. దాని తర్వాత ఏం జరుగుతుంది? ఏక ధర్మ స్థాపన ఇలాగే జరుగుతుంది కదా. ఇక్కడి నుండి రాజయోగాన్ని నేర్చుకుంటారు. వినాశనం జరుగుతుంది, ఇక భారతదేశంలో ఎవరు మిగులుతారు? ఎవరైతే రాజయోగాన్ని నేర్చుకుంటారో, జ్ఞానాన్ని ఇస్తారో, వారే మిగులుతారు. వినాశనమైతే అందరిదీ జరగనున్నది, ఇందులో భయపడే విషయమేమీ లేదు. పతితపావనుడిని పిలుస్తారు, మరి వారు వచ్చినప్పుడు సంతోషం ఉండాలి కదా. వికారాలలోకి వెళ్ళకండి అని తండ్రి చెప్తారు. ఈ వికారాలపై విజయాన్ని పొందండి లేదా దానమునివ్వండి, అప్పుడు గ్రహణము తొలగిపోతుంది. భారత్ కు పట్టిన గ్రహణము తప్పకుండా తొలగిపోతుంది. నల్లవారి నుండి తెల్లవారిగా అవ్వాలి. సత్యయుగంలో పవిత్ర దేవతలుండేవారు, వారు తప్పకుండా ఇక్కడే తయారై ఉంటారు.
మనము శ్రీమతము ద్వారా నిర్వికారులుగా అవుతామని మీకు తెలుసు. భగవానువాచ - ఇది గుప్తము. శ్రీమతంపై నడుచుకుని మీరు రాజ్యాధికారాన్ని పొందుతారు. మీరు నరుని నుండి నారాయణునిగా అవ్వాలని తండ్రి అంటారు. క్షణంలో రాజ్యము లభించగలదు. మొదట్లో పిల్లలు 4-5 రోజులు కూడా వైకుంఠంలోకి వెళ్ళి ఉండేవారు. శివబాబా వచ్చి పిల్లలకు వైకుంఠం యొక్క సాక్షాత్కారము కూడా చేయించేవారు. ఎంత గౌరవ-ప్రతిష్ఠలతో దేవతలు వచ్చేవారు. కావున గుప్త వేషములో వచ్చే తండ్రి మాకు అర్థము చేయిస్తున్నారని పిల్లలకు మనస్సులో అనిపిస్తుంది. బ్రహ్మా తనువులో వస్తారు. బ్రహ్మా తనువైతే ఇక్కడే కావాలి కదా. ప్రజాపిత బ్రహ్మా ద్వారా స్థాపన జరుగుతుంది. ఎవరైనా వస్తే వారిని మీరు ఎవరి వద్దకు వచ్చారు అని అడగండి అని బాబా అర్థం చేయించారు. బి.కె.ల వద్దకు అని అంటారు. అచ్ఛా, బ్రహ్మా పేరును ఎప్పుడైనా విన్నారా? వారు ప్రజాపిత కదా. మనమంతా వచ్చి వారికి చెందినవారిగా అయ్యాము. తప్పకుండా ఇంతకుముందు కూడా అలా అయ్యాము. బ్రహ్మా ద్వారా స్థాపన జరుగుతుంది కావున తోడుగా బ్రాహ్మణులు కూడా కావాలి. తండ్రి బ్రహ్మా ద్వారా ఎవరికి అర్థం చేయిస్తారు? శూద్రులకైతే అర్థము చేయించరు. వీరంతా బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులు, శివబాబా బ్రహ్మా ద్వారా మనల్ని తమవారిగా చేసుకున్నారు. బ్రహ్మాకుమార-కుమారీలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని సెంటర్లు ఉన్నాయి. అన్నింటిలోనూ బ్రహ్మాకుమారీలు చదివిస్తారు. ఇక్కడ మనకు తాతగారి వారసత్వము లభిస్తుంది. భగవానువాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. వారు నిరాకారుడైన కారణంగా, వీరి శరీరాన్ని ఆధారంగా తీసుకొని మనకు జ్ఞానాన్ని వినిపిస్తారు. ప్రజాపితకైతే అందరూ పిల్లలే అవుతారు కదా! మనము ప్రజాపిత బ్రహ్మాకుమార-కుమారీలము. శివబాబా మనకు దాదా (తాతగారు). వారు దత్తత తీసుకున్నారు. బ్రహ్మా ద్వారా మనము దాదా (తాతగారి) నుండి చదువుకుంటున్నామని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణులు ఇరువురూ స్వర్గానికి యజమానులు కదా. భగవంతుడు ఒక్క ఉన్నతోన్నతుడైన నిరాకారుడే. పిల్లలకు చాలా బాగా ధారణ జరగాలి. భక్తి మార్గములో ఇద్దరు తండ్రులు ఉంటారని మొట్టమొదట అర్థం చేయించండి. స్వర్గములో ఒకే తండ్రి ఉంటారు. పారలౌకిక తండ్రి ద్వారా రాజ్యాధికారం లభించిన తర్వాత ఇక వారిని ఎందుకు స్మృతి చేస్తారు. స్మృతి చేసేందుకు అక్కడ దుఃఖమే ఉండదు. దుఃఖహర్త-సుఖకర్త అని పాడతారు. అది ఇప్పటి విషయము. ఏదైతే గతించిపోతుందో, దానికి గాయనం జరుగుతుంది. మహిమంతా ఒక్కరిదే. ఆ ఒక్క తండ్రే వచ్చి పతితులను పావనంగా తయారుచేస్తారు. ఇవి మనుష్యులు అర్థము చేసుకోరు. వారు గతించిపోయిన కథను కూర్చొని వ్రాస్తారు. తండ్రి తప్పకుండా రాజయోగాన్ని నేర్పించారని, దాని ద్వారా రాజ్యాధికారం లభించిందని మీరిప్పుడు తెలుసుకున్నారు. మీరు 84 జన్మల చక్రములో తిరిగారు. ఇప్పుడు మనం మళ్ళీ చదువుకుంటున్నాము, తర్వాత 21 జన్మలు రాజ్యం చేస్తాము. ఇటువంటి దేవతలుగా అవుతారు. ఇలా కల్పక్రితం కూడా అయ్యారు. మేము పూర్తిగా 84 జన్మల చక్రాన్ని తిరిగామని అర్థము చేసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ సత్య-త్రేతా యుగాలలోకి వెళ్తారు, అందుకే ఇంతకుముందు ఎన్ని సార్లు కలిశారు అని తండ్రి అడుగుతారు. ఇది ప్రాక్టికల్ విషయం కదా! ఎవరైనా కొత్తవారు విన్నా, 84 జన్మల చక్రము తప్పకుండా ఉందని అర్థము చేసుకుంటారు. మొట్టమొదటి వారు ఎవరైతే ఉంటారో, వారి చక్రము పూర్తి అయ్యి ఉంటుంది. బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసి ఉంటుంది. బాబా, ఈ ఇంట్లో, ఈ డ్రెస్సులో మేము మిమ్మల్ని చాలాసార్లు కలుస్తాము మరియు కలుస్తూనే ఉంటాము. పతితుల నుండి పావనంగా, పావనము నుండి పతితంగా అవుతూనే వచ్చాము. ఏ వస్తువైనా ఎప్పటికీ కొత్తదిగా ఉండాలంటే, అది జరగదు. అది తప్పకుండా పాతదిగా అవుతుంది. ప్రతి వస్తువు సతో-రజో-తమోలోకి వస్తుంది. కొత్త ప్రపంచము వస్తుందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. దానిని స్వర్గమని అంటారు. ఇది నరకము. అది పావన ప్రపంచము. ఓ పతిత పావనా, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారుచేయండని చాలా పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే దుఃఖము బాగా పెరిగిపోతూ ఉంటుంది కదా. కానీ మేమే పూజ్యులుగా ఉండేవారిమని, మేమే మళ్ళీ పూజారులుగా అయ్యామని అర్థము చేసుకోరు. ద్వాపర యుగములో పూజారులుగా అయ్యాము. అనేక ధర్మాలు వెలువడుతూ వచ్చాయి. తప్పకుండా పతితుల నుండి పావనులుగా, పావనుల నుండి పతితులుగా అవుతూ వచ్చారు. ఈ ఆట అంతా భారతదేశము పైనే ఉంది.
ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతి కలిగింది, ఇప్పుడు మీరు శివజయంతిని జరుపుకుంటారు. మిగిలిన వారెవ్వరికీ శివుని గురించి తెలియదు. మనకు తెలుసు. వాస్తవానికి వారే మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు. బ్రహ్మా ద్వారా స్వర్గ స్థాపన జరుగుతుంది. ఎవరైతే యోగము నేర్చుకుంటారో, స్థాపన చేస్తారో, వారే మళ్ళీ రాజ్య భాగ్యాన్ని తప్పకుండా పొందుతారు. తప్పకుండా కల్ప-కల్పము మేము తండ్రి నుండి ఈ రాజయోగాన్ని నేర్చుకున్నామని మనము అంటాము. ఇప్పుడు ఈ 84 జన్మల చక్రము పూర్తవుతుందని తండ్రి అర్థం చేయించారు. మళ్ళీ కొత్త చక్రములో తిరగాలి. చక్రమునైతే తెలుసుకోవాలి కదా. ఈ చిత్రము లేకపోయినా కానీ మీరు అర్థం చేయించగలరు. ఇది చాలా సహజమైన విషయము. భారతదేశము తప్పకుండా స్వర్గంగా ఉండేది. ఇప్పుడు నరకంగా ఉంది. వారైతే కలియుగము ఇంకా బాల్యదశలో ఉందని భావిస్తారు. కానీ, ఇది కలియుగ అంతిమం అని మీరంటారు. ఇప్పుడు చక్రము పూర్తవుతుంది. పతిత ప్రపంచాన్ని పావనంగా చేసేందుకు నేను వస్తానని తండ్రి అర్థం చేయిస్తారు. మనం పావన ప్రపంచములోకి వెళ్ళాలని మీకు తెలుసు. మీరు ముక్తి, జీవన్ముక్తి ధామాలను, శాంతిధామము, సుఖధామము మరియు దుఃఖధామాలను కూడా అర్థము చేసుకున్నారు. కానీ అదృష్టములో లేకపోతే, మేము సుఖధామానికి ఎందుకు వెళ్ళకూడదు అని ఆలోచించరు. వాస్తవానికి ఆత్మలైన మన ఇల్లు ఆ శాంతిధామము. అక్కడ ఆత్మకు కర్మేంద్రియాలు లేని కారణంగా ఏమీ మాట్లాడదు. అక్కడ అందరికీ శాంతి లభిస్తుంది. సత్యయుగంలో ఒకే ధర్మముంటుంది. ఇది అనాది, అవినాశీ వరల్డ్ డ్రామా, ఇది తిరుగుతూనే ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ వినాశనమవ్వదు. శాంతిధామంలో కూడా కొద్ది సమయము ఉండవలసిందే. ఇవి బాగా అర్థము చేసుకోవలసిన విషయాలు. కలియుగం దుఃఖధామము. ఎన్ని ధర్మాలున్నాయి, ఎంత అలజడి ఉంది. ఎప్పుడైతే పూర్తిగా దుఃఖధామంగా అవుతుందో, అప్పుడే తండ్రి వస్తారు. దుఃఖధామము తర్వాత పూర్తిగా సుఖధామం ఉంటుంది. శాంతిధామము నుండి మనము సుఖధామంలోకి వస్తాము, తర్వాత దుఃఖధామంగా అవుతుంది. సత్యయుగంలో సంపూర్ణ నిర్వికారులు ఉంటారు, ఇక్కడ సంపూర్ణ వికారులు ఉంటారు. ఇది అర్థము చేయించడం చాలా సహజము కదా. దీని కోసం ధైర్యము కావాలి. ఎక్కడికైనా వెళ్ళి అర్థం చేయించండి. హనుమంతుడు సత్సంగములో వెనుక చెప్పుల వద్ద కూర్చొని ఉండేవారని కూడా వ్రాయబడి ఉంది. కావున ఎవరైతే మహావీరులుగా ఉంటారో, వారు ఎక్కడికైనా వెళ్ళి, వీరు ఏం చెప్తున్నారో చూద్దాము అని యుక్తిగా వింటారు. మీరు డ్రెస్సు మార్చుకొని వారి కళ్యాణము చేసేందుకు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. బాబా కూడా గుప్త వేషంలో మీ కళ్యాణము చేస్తున్నారు కదా. మందిరాలలో ఎక్కడైనా నిమంత్రణ లభిస్తే వెళ్ళి అర్థము చేయించాలి. రోజు రోజుకూ మీరు తెలివైనవారిగా అవుతారు. అందరికీ తండ్రి పరిచయాన్ని అయితే ఇవ్వవలసిందే, ట్రయల్ వేయవలసి ఉంటుంది. చివర్లో సన్యాసులు, రాజులు మొదలైనవారు వచ్చారు అన్న గాయనముంది. జనక మహారాజుకు క్షణంలో జీవన్ముక్తి లభించిందని అంటారు. వారు వెళ్ళి త్రేతాయుగంలో అనుజనకునిగా అయ్యారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. అంతిమ వినాశన దృశ్యాలను చూసేందుకు మీ స్థితిని మహావీరుని వలె నిర్భయంగా, స్థిరంగా తయారుచేసుకోవాలి. గుప్తమైన స్మృతియాత్రలో ఉండాలి.
2. అవ్యక్త వతనవాసీ ఫరిస్తాగా అయ్యేందుకు అనంతమైన సేవలో దధీచి ఋషి వలె మీ ఎముక-ఎముకను స్వాహా చేయాలి.