27-01-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ- ఎప్పుడూ లా ను మీ చేతిలోకి తీసుకోకండి, ఒకవేళ ఎవరి వలన అయినా పొరపాటు జరిగినట్లయితే తండ్రికి రిపోర్టు చేయండి, తండ్రి వారిని సావధానపరుస్తారు”

ప్రశ్న:-

బాబా ఏ కాంట్రాక్ట్ ను తీసుకున్నారు?

జవాబు:-

పిల్లల అవగుణాలను తొలగించే కాంట్రాక్ట్ ను ఒక్క తండ్రియే తీసుకున్నారు. పిల్లల లోపాలను తండ్రి విన్నప్పుడు వాటిని తొలగించుకునేందుకు ప్రేమగా వివరణ ఇస్తారు. ఒకవేళ పిల్లలైన మీకు ఎవరిలోనైనా లోపాలు కనిపించినా సరే మీరు లా ను మీ చేతిలోకి తీసుకోకండి. లా ను చేతిలోకి తీసుకోవడం కూడా తప్పే.

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకు తండ్రి వద్దకు వస్తారు ఎందుకంటే అనంతమైన తండ్రి నుండి అనంతమైన విశ్వ రాజ్యాధికారం తీసుకోవాలని పిల్లలకు తెలుసు. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు, కానీ మర్చిపోతారు. మాయ మరపిస్తుంది. ఒకవేళ మరపింపజేయకపోతే చాలా సంతోషముండాలి. బాబా అర్థం చేయిస్తారు - పిల్లలూ, ఈ బ్యాడ్జ్ ను పదే-పదే చూస్తూ ఉండండి. చిత్రాలను కూడా చూస్తూ ఉండండి. నడుస్తూ-తిరుగుతూ బ్యాడ్జ్ ను చూస్తూ ఉన్నట్లయితే, తండ్రి స్మృతితో తండ్రి ద్వారా నేను ఇలా తయారవుతున్నానని తెలుస్తుంది. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. జ్ఞానము లభించే సమయమిదే. మధురాతి మధురమైన పిల్లలూ అని తండ్రి అంటారు..... వారు రాత్రింబవళ్ళు మీఠే-మీఠే (మధురాతి మధురమైన) అని అంటూనే ఉంటారు. మధురాతి మధురమైన తండ్రి అని పిల్లలు అనలేరు. వాస్తవానికి ఇరువురికీ అనాలి. ఇరువురూ మధురమైనవారే కదా. అనంతమైన బాప్ దాదా. కానీ చాలామంది దేహాభిమానులు కేవలం బాబానే మధురాతి మధురమని అంటారు. కొంతమంది పిల్లలైతే కోపములోకి వచ్చి బాప్ దాదాను కూడా ఏదో ఒకటి అనేస్తారు. ఎప్పుడైనా బాబాను అన్నారంటే దాదాను కూడా అన్నట్లే, విషయం ఒక్కటే అవుతుంది. అప్పుడప్పుడు బ్రాహ్మణిపై, అప్పుడప్పుడు పరస్పరములో కోపగించుకుంటూ ఉంటారు. అనంతమైన తండ్రి కూర్చొని పిల్లలకు శిక్షణనిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ చాలామంది పిల్లలు ఉన్నారు, మీరు కోపగించుకుంటారని మీ రిపోర్టు వస్తుంది అని బాబా అందరికీ వ్రాస్తూ ఉంటారు. అనంతమైన తండ్రి దీనిని దేహాభిమానమని అంటారు. తండ్రి అందరికీ చెప్తారు - పిల్లలూ, దేహీ-అభిమానీ భవ. పిల్లలందరూ కింద-మీద అవుతూ ఉంటారు, వీరిలో కూడా మాయ ఎవరినైతే సమర్థవంతమైన పహల్వాన్ (వస్తాదు) గా చూస్తుందో, వారితోనే యుద్ధము చేస్తుంది. మహావీర్ అని హనుమంతుడిని చూపించారు, అతడిని కూడా కదిలించేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలోనే అందరి పరీక్ష తీసుకుంటుంది. అందరికీ మాయతో గెలుపు-ఓటములు జరుగుతూ ఉంటాయి. యుద్ధములో స్మృతి-విస్మృతి, అన్నీ జరుగుతాయి. ఎవరు ఎంతగా స్మృతిలో ఉంటారో, నిరంతరము తండ్రిని స్మృతి చేసే ప్రయత్నము చేస్తారో, వారు అంతటి మంచి పదవిని పొందగలరు. తండ్రి పిల్లలను చదివించేందుకే వచ్చారు, కనుక చదివిస్తూ ఉంటారు. శ్రీమతంపై నడుస్తూ ఉండాలి. శ్రీమతముపై నడిస్తేనే శ్రేష్ఠంగా అవుతారు, ఇందులో ఎవరితోనూ డిస్టర్బ్ అయ్యే విషయమేమీ లేదు. డిస్టర్బ్ అవ్వడము అంటే క్రోధం చేయడం. తప్పులు చేస్తే బాబాకు రిపోర్టు చేయాలి. స్వయం ఎవ్వరినీ ఏమీ అనకూడదు, అలా చేస్తే లా చేతిలోకి తీసుకున్నట్లవుతుంది. గవర్నమెంట్ లా ను చేతిలోకి తీసుకోనివ్వదు. ఎవరైనా కొడితే వారిని తిరిగి కొట్టరు. రిపోర్టు చేస్తారు, తర్వాత వారిపై కేసు నడుస్తుంది. ఇక్కడ కూడా పిల్లలు ఎప్పుడూ ఎదురు చెప్పకూడదు, బాబాకు చెప్పండి. అందరినీ సావధానపరిచేవారు ఒక్క బాబానే. బాబా చాలా మధురమైన యుక్తులను తెలియజేస్తారు. మధురతతో శిక్షణనిస్తారు. దేహాభిమానులుగా అయితే తమ పదవినే తగ్గించేసుకుంటారు. ఎందుకు నష్టపర్చుకోవాలి. ఎంత వీలైతే అంత బాబాను చాలా ప్రేమగా స్మృతి చేస్తూ ఉండండి. ఏ తండ్రి అయితే విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తారో, ఆ అనంతమైన తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయండి. కేవలం దైవీ గుణాలను ధారణ చేయాలి, ఎవరినీ నిందించకూడదు. దేవతలు ఎవరినైనా నిందిస్తారా? చాలామంది పిల్లలు నింద చేయకుండా ఉండలేరు. మీరు తండ్రికి చెప్పండి, తండ్రి చాలా ప్రేమగా అర్థము చేయిస్తారు! లేకపోతే సమయం వృథా అయిపోతుంది. నిందించేందుకు బదులుగా తండ్రిని స్మృతి చేసినట్లయితే చాలా చాలా లాభముంటుంది. ఎవరితోనూ వాద-వివాదము చేయకపోవడం చాలా మంచిది.

మేము కొత్త ప్రపంచం యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని పిల్లలైన మీ హృదయానికి తెలుసు. లోలోపల ఎంత నషా ఉండాలి. ముఖ్యమైనవి, స్మృతి మరియు దైవీ గుణాలు. పిల్లలు చక్రాన్ని స్మృతి చేస్తూనే ఉంటారు, అదైతే సహజంగా గుర్తుంటుంది. 84 జన్మల చక్రము కదా. మీకు సృష్టి ఆదిమధ్యాంతాలు, దాని వ్యవధి గురించి తెలుసు కావున ఇతరులకు కూడా చాలా ప్రేమగా పరిచయమునివ్వాలి. అనంతమైన తండ్రి మనల్ని విశ్వానికి యజమానులుగా చేస్తున్నారు, రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. వినాశనము కూడా ఎదురుగా నిలబడి ఉంది. ఇది సంగమయుగము, ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది మరియు పాత ప్రపంచము సమాప్తమైపోతుంది. స్మరిస్తూ స్మరిస్తూ సుఖాన్ని పొందండి, దేహం యొక్క కలహ క్లేశాలన్నీ తొలగిపోతాయి..... అని తండ్రి పిల్లలను సావధానపరుస్తూ ఉంటారు. అర్ధకల్పము కోసం తొలగిపోతాయి. తండ్రి సుఖధామాన్ని స్థాపన చేస్తారు. మాయా రావణుడు తిరిగి దుఃఖధామాన్ని స్థాపన చేస్తాడు. ఇది కూడా పిల్లలైన మీకు నంబరువారు పురుషార్థానుసారంగా తెలుసు. తండ్రికి పిల్లల పట్ల ఎంత ప్రేమ ఉంటుంది. తండ్రికి మొదటి నుండి ప్రేమ ఉంది. తండ్రికి తెలుసు, ఏ పిల్లలైతే కామచితిపై నల్లగా అయిపోయారో, వారిని తెల్లగా చేసేందుకు వెళ్తానని నాకు తెలుసు. తండ్రి అయితే జ్ఞానసాగరుడు, పిల్లలు నెమ్మదిగా-నెమ్మదిగా జ్ఞానము తీసుకుంటారు. మాయ మళ్ళీ మరపింపజేస్తుంది. సంతోషము కలగనివ్వదు. పిల్లలకైతే రోజు రోజుకూ సంతోషపు పాదరసం ఎక్కి ఉండాలి. సత్యయుగంలో పాదరసం ఎక్కి ఉండేది. ఇప్పుడు మళ్ళీ స్మృతియాత్ర ద్వారా ఎక్కించాలి. అది నెమ్మదిగా-నెమ్మదిగా ఎక్కుతుంది. గెలుపు-ఓటములు పొందుతూ పొందుతూ నంబరువారు పురుషార్థానుసారంగా కల్పక్రితము వలె మళ్ళీ తమ పదవిని పొందుతారు. కల్ప-కల్పము ఎంత సమయమైతే పట్టిందో, అంతే పడుతుంది. ఎవరైతే కల్ప-కల్పము పాస్ అవుతూ ఉంటారో, వారే పాస్ అవుతారు. బాప్ దాదా సాక్షీగా అయి పిల్లల అవస్థను చూస్తారు మరియు వివరణ ఇస్తూ ఉంటారు, బయట సెంటర్లు మొదలైనవాటిలో ఉన్నప్పుడు అంతగా రిఫ్రెష్ అవ్వరు. సెంటరుకు వచ్చి మళ్ళీ బయట వాయుమండలములోకి వెళ్ళిపోతారు, అందుకే పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకు ఇక్కడకు వస్తారు. పరివార సహితంగా అందరికీ ప్రియస్మృతులను ఇవ్వండని తండ్రి వ్రాస్తారు కూడా. వారు హద్దు తండ్రి, వీరు అనంతమైన తండ్రి. బాబా మరియు దాదా, ఇరువురికీ చాలా ప్రేమ ఉంది ఎందుకంటే వారు కల్ప-కల్పము లవ్లీ సర్వీస్ చేస్తారు మరియు చాలా ప్రేమగా చేస్తారు. లోపల దయ కలుగుతుంది. చదువుకోకపోతే లేదా మంచి నడవడికను నడుచుకోకపోతే, శ్రీమతంపై నడవకపోతే - వీరు తక్కువ పదవిని పొందుతారని దయ కలుగుతుంది. అప్పుడు బాబా ఏం చేయగలరు! అక్కడ ఉండడానికి మరియు ఇక్కడ ఉండడానికి చాలా తేడా ఉంది. కానీ అందరూ ఇక్కడే ఉండలేరు. పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు. ఈ ఆబూ అన్నింటికన్నా గొప్ప తీర్థ స్థానమని తండ్రి కూడా అర్థం చేయించారు. తండ్రి అంటారు - నేను ఇక్కడికే వచ్చి మొత్తం సృష్టిని, పంచతత్వాల సహితంగా అన్నింటినీ పవిత్రంగా తయారు చేస్తాను. ఎంత సేవ ఉంది. ఒక్క తండ్రి మాత్రమే వచ్చి సర్వులకు సద్గతినిస్తారు. ఇది కూడా అనేకసార్లు చేశారు. ఇది తెలిసి ఉంటూ కూడా మళ్ళీ మర్చిపోతారు - అందుకే మాయ చాలా శక్తివంతమైనదని బాబా అంటారు. అర్ధకల్పము దీని రాజ్యము నడుస్తుంది. మాయ ఓడిస్తుంది, తండ్రి మళ్ళీ నిలబెడతారు. బాబా, మేము పడిపోయామని చాలా మంది వ్రాస్తారు. అచ్ఛా, మళ్ళీ పడకండి. అయినా పడిపోతారు. పడిపోతారు, ఇక ఎక్కడమే ఆపేస్తారు. ఎంత దెబ్బ తగులుతుంది. అందరికీ తగులుతుంది. ఆధారమంతా చదువు పైనే ఉంది. చదువులో యోగము ఉంటుంది, ఫలానావారు నాకు ఇది చదివిస్తున్నారు. ఇప్పుడు తండ్రి మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. ఇక్కడ మీరు చాలా రిఫ్రెష్ అవుతారు. ఎవరైతే మనల్ని నిందిస్తారో, వారు మన మిత్రులని గాయనము కూడా ఉంది. భగవానువాచ - చాలా మంది నన్ను నిందిస్తారు. నేను వచ్చి మిత్రునిగా అవుతాను. ఎంతగా నిందిస్తారు, అందరూ నా పిల్లలేనని నేను భావిస్తాను. నాకు వాళ్ళ పట్ల ఎంత ప్రీతి ఉంది. నిందించడం మంచిది కాదు. ఈ సమయంలోనైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. రకరకాల అవస్థలు కలిగిన పిల్లలున్నారు, అందరూ పురుషార్థము చేస్తూ ఉంటారు. ఏదైనా పొరపాటు జరిగినా కూడా పురుషార్థము చేసి ఆ పొరపాటును చెయ్యనివారిగా అవ్వాలి. మాయ అందరితోనూ పొరపాట్లు చేయిస్తుంది. ఇది బాక్సింగ్ కదా. కొన్ని సార్లు ఎలాంటి దెబ్బ తగులుతుందంటే, ఇక అది పడేస్తుంది. తండ్రి సావధానపరుస్తారు - పిల్లలూ, అలా ఓడిపోతే చేసుకున్న సంపాదనంతటినీ నష్టపోతారు. 5 అంతస్తుల నుండి పడిపోతారు. బాబా, ఇలాంటి పొరపాటు ఇక ఎప్పుడూ జరగదు, ఇప్పుడు క్షమించండి అని అంటారు. బాబా ఏమి క్షమిస్తారు. తండ్రి అయితే పురుషార్థము చేయమని చెప్తారు. మాయ చాలా శక్తివంతమైనదని బాబాకు తెలుసు. చాలా మందిని ఓడిస్తుంది. పొరపాటు గురించి శిక్షణనిచ్చి పొరపాటు చేయనివారిగా తయారు చేయడమే టీచరు పని. ఎవరైనా పొరపాటు చేస్తే, ఇక ఎప్పటికీ వారి ద్వారా ఆ పొరపాటు జరుగుతూ ఉంటుందని కాదు. లేదు, మంచి గుణాలు గాయనం చేయబడతాయి. పొరపాట్లు గాయనం చేయబడవు. తండ్రి ఒక్కరే అవినాశీ వైద్యుడు. వారు మందు ఇస్తారు. పిల్లలైన మీరు లా ను మీ చేతుల్లోకి ఎందుకు తీసుకుంటారు? ఎవరిలోనైతే క్రోధము యొక్క అంశము ఉంటుందో, వారు నిందిస్తూనే ఉంటారు. సరిదిద్దడం తండ్రి పని, మీరు సరిదిద్దేవారు కాదు. కొందరిలో క్రోధం యొక్క భూతముంది. స్వయం ఎవరినైనా నిందిస్తున్నారంటే లా ను మీ చేతుల్లోకి తీసుకున్నట్లు, దీనితో వారు బాగుపడరు. ఇంకా విరోధము ఏర్పడుతుంది. ఉప్పునీరుగా అయిపోతారు. పిల్లలందరి కోసం ఒక్క తండ్రి కూర్చుని ఉన్నారు. లా ను మీ చేతుల్లోకి తీసుకుని ఎవరినైనా నిందించడమనేది పెద్ద తప్పు. అందరిలోనూ ఏవో ఒక లోపాలు ఉంటాయి. అందరూ సంపూర్ణులుగా అయితే అవ్వలేదు. కొందరిలో ఒక అవగుణముంటుంది, కొందరిలో ఇంకొకటి ఉంటుంది. వాటన్నింటినీ తొలగించే కాంట్రాక్టును తండ్రి తీసుకున్నారు. ఇది మీ పని కాదు. తండ్రి, పిల్లల లోపాలను విన్నప్పుడు వాటిని తొలగించేందుకు ప్రేమగా వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు ఎవ్వరూ సంపూర్ణం కాలేదు. అందరూ శ్రీమతమనుసారముగా బాగుపడుతున్నారు. అంతిమంలో సంపూర్ణులుగా అవుతారు. ఈ సమయంలో అందరూ పురుషార్థులే. బాబా సదా స్థిరంగా ఉంటారు. పిల్లలకు ప్రేమగా శిక్షణనిస్తూ ఉంటారు. శిక్షణనివ్వడం తండ్రి పని. తర్వాత దానిపై నడవడం, నడవకపోవడం, అది వారి భాగ్యము. పదవి ఎంతగా తగ్గిపోతుంది. శ్రీమతంపై నడవని కారణంగా అటువంటివి ఏమైనా చేసినట్లయితే పద భ్రష్టులైపోతారు. మేము ఈ పొరపాటు చేశామని మనసు లోపల తింటుంది. మనము చాలా శ్రమ చేయవలసి ఉంటుంది. ఎవరిలోనైనా అవగుణము ఉంటే దాన్ని తండ్రికి వినిపించాలి, అన్ని చోట్లా వినిపించడమంటే, అది దేహాభిమానము. తండ్రిని స్మృతి చేయరు. అవ్యభిచారులుగా అవ్వాలి కదా. ఒక్కరికే వినిపించినట్లయితే వారు వెంటనే బాగుపడతారు. సరిదిద్దేవారు ఒక్క తండ్రి మాత్రమే. మిగిలినవారంతా బాగుపడనివారే. కానీ మాయ ఎటువంటిదంటే తలను తిప్పేస్తుంది. తండ్రి ఒక వైపుకు తిప్పుతారు, మాయ మళ్ళీ తన వైపుకు తిప్పేసుకుంటుంది. తండ్రి అందరినీ సరిదిద్ది మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసేందుకే వచ్చారు, కావున ఎవరి పేరునైనా అన్ని చోట్లా పాడు చేయడమనేది నియమ విరుద్ధము. మీరు శివబాబాను స్మృతి చేయండి. జడ్జిమెంట్ కూడా వారి వద్దనే జరుగుతుంది కదా. కర్మల ఫలము కూడా తండ్రే ఇస్తారు. డ్రామాలో ఉన్నా కానీ ఎవరో ఒకరి పేరు తీసుకోవడం జరుగుతుంది కదా. తండ్రి పిల్లలకు అన్ని విషయాలను అర్థము చేయిస్తూ ఉంటారు. మీరు ఎంత భాగ్యశాలులు. ఎంతమంది అతిథులు వస్తారు. ఎవరి వద్దకైతే చాలామంది అతిథులు వస్తారో, వారు సంతోషిస్తారు. వీరు పిల్లలు కూడా, అతిథులు కూడా. టీచరు బుద్ధిలో అయితే ఇదే ఉంటుంది - నేను పిల్లలను వీరి వలె సర్వగుణ సంపన్నులుగా తయారుచేయాలి. డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రి ఈ కాంట్రాక్టును తీసుకున్నారు. పిల్లలు మురళీని కూడా ఎప్పుడూ మిస్ చేయకూడదు. మురళీ గురించే కదా గాయనముంది - ఒక్క మురళీని మిస్ చేసినా స్కూలుకు ఆబ్సెంట్ అయినట్లే. ఇది అనంతమైన తండ్రి యొక్క స్కూలు, ఇందులో ఒక్క రోజు కూడా మిస్ చేయకూడదు. తండ్రి వచ్చి చదివిస్తారు, ప్రపంచంలో ఎవ్వరికీ ఇది తెలియదు. స్వర్గ స్థాపన ఎలా జరుగుతుంది అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. మీకు అన్నీ తెలుసు. ఈ చదువు అపారమైన సంపాదనను చేయిస్తుంది. ఈ చదువు యొక్క ఫలము జన్మ-జన్మాంతరాల కోసం లభిస్తుంది. వినాశనం యొక్క సంబంధమంతా మీ చదువుతోనే ఉంది. మీ చదువు పూర్తవుతుంది మరియు ఈ యుద్ధము ప్రారంభమవుతుంది. చదువుతూ-చదువుతూ, తండ్రిని స్మృతి చేస్తూ ఎప్పుడైతే పరీక్ష జరుగుతుందో, మార్కులు పూర్తిగా లభిస్తాయో, అప్పుడు యుద్ధము ప్రారంభమవుతుంది. మీ చదువు పూర్తయినప్పుడు యుద్ధము మొదలవుతుంది. ఇది కొత్త ప్రపంచము కోసం పూర్తిగా కొత్త జ్ఞానము, అందుకే పాపం మనుష్యులు తికమక పడిపోతారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎవరి అవగుణాలనైనా చూసి వారిని నిందించకూడదు. అన్ని చోట్లా వారి అవగుణాలను వినిపించకూడదు. మీ మధురతను విడిచిపెట్టకూడదు. క్రోధంలోకి వచ్చి ఎవరికీ ఎదురు చెప్పకూడదు.

2. అందరినీ సరిదిద్దేవారు ఒక్క తండ్రియే, అందుకే ఒక్క తండ్రికే అంతా వినిపించాలి, అవ్యభిచారిగా అవ్వాలి. మురళీని ఎప్పుడూ మిస్ చేయకూడదు.

వరదానము:-

దేహాభిమానపు మై-పన్ (నేను) అన్నదానిని సంపూర్ణ ఆహుతి చేసే ధారణా స్వరూప భవ

ఎప్పుడైతే సంకల్పం మరియు స్వప్నంలో కూడా దేహాభిమానపు మై-పన్ (నేను) అనేది ఉండదో, అనాది ఆత్మిక స్వరూపపు స్మృతి ఉంటుందో, బాబా-బాబా అనే నాదము వెలువడుతూ ఉంటుందో, అప్పుడు ధారణా స్వరూపులు, సత్యమైన బ్రాహ్మణులని అంటారు. మై-పన్ (నేను) అనగా పాత స్వభావాలు మరియు సంస్కారాల రూపీ సృష్టిని, ఎప్పుడైతే బ్రాహ్మణులైన మీరు ఈ మహా యజ్ఞములో స్వాహా చేస్తారో, అప్పుడు ఈ పాత సృష్టి యొక్క ఆహుతి జరుగుతుంది. కావున ఏ విధంగా యజ్ఞాన్ని రచించేందుకు నిమిత్తంగా అయ్యారో, అదే విధంగా ఇప్పుడు అంతిమ ఆహుతిని వేసి సమాప్తికి కూడా నిమిత్తులుగా అవ్వండి.

స్లోగన్:-

స్వయంతో, సేవతో మరియు సర్వులతో సంతుష్టతా సర్టిఫికెట్ ను తీసుకోవడమే సిద్ధి స్వరూపులుగా అవ్వడం.