25-01-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - తండ్రి శ్రీమతము ద్వారా మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు కనుక వారి శ్రీమతము యొక్క శాస్త్రము సర్వ శాస్త్ర శిరోమణి శ్రీమద్భగవద్గీత”

ప్రశ్న:-

సత్యయుగములో ప్రతి వస్తువు చాలా బాగా సతోప్రధానంగా ఉంటుంది, ఎందుకు?

జవాబు:-

ఎందుకంటే అక్కడ మనుష్యులు సతోప్రధానంగా ఉంటారు, మనుష్యులు ఎప్పుడైతే బాగా ఉంటారో, సామాగ్రి కూడా బాగా ఉంటుంది మరియు మనుష్యులు చెడుగా ఉంటే సామాగ్రి కూడా నష్టదాయకంగా ఉంటుంది. సతోప్రధాన సృష్టిలో ఏ వస్తువు యొక్క అప్రాప్తి ఉండదు, ఎవ్వరినీ ఏమీ అడగాల్సిన అవసరముండదు.

ఓంశాంతి. బాబా ఈ శరీరము ద్వారా అర్థం చేయిస్తారు. దీనిని జీవము అని అంటారు, ఇందులో ఆత్మ కూడా ఉంది మరియు పరమపిత పరమాత్మ కూడా వీరిలో ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. ఈ విషయం మొట్టమొదట పక్కా అవ్వాలి, అందుకే వీరిని దాదా అని కూడా అంటారు. పిల్లలకు ఈ నిశ్చయం ఉంది. ఈ నిశ్చయంలోనే రమించాలి. తప్పకుండా బాబా ఎవరిలోనైతే ప్రవేశించారో లేక అవతరించారో వారి గురించి స్వయంగా తండ్రి - నేను వీరి అనేక జన్మల అంతిమంలో కూడా అంతిమంలో వస్తాను అని చెప్తున్నారు. ఇది సర్వ శాస్త్ర శిరోమణి గీతా జ్ఞానమని పిల్లలకు అర్థం చేయించబడింది. శ్రీమతము అనగా శ్రేష్ఠమైన మతము. ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుని శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన మతము. వారి శ్రీమతముతోనే మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. మీరు భ్రష్ఠ మనుష్యుల నుండి శ్రేష్ఠమైన దేవతలుగా అవుతారు. మీరు దీని కోసమే వచ్చారు. నేను మిమ్మల్ని శ్రేష్ఠాచారులుగా, నిర్వికారీ మతానికి చెందిన దేవీ దేవతలుగా తయారుచేసేందుకే వచ్చానని తండ్రి కూడా స్వయంగా చెప్తున్నారు. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడమన్న అర్థము కూడా తెలుసుకోవాలి. వికారీ మనుష్యుల నుండి నిర్వికారీ దేవతలుగా తయారుచేసేందుకు వస్తారు. సత్యయుగంలో మనుష్యులుంటారు కానీ వారు దైవీ గుణాలు కలవారు. ఇప్పుడు కలియుగంలో ఆసురీ గుణాలు కలవారు ఉన్నారు. ఇదంతా మనుష్య సృష్టియే, కానీ అది ఈశ్వరీయ బుద్ధి, ఇది ఆసురీ బుద్ధి. అక్కడ జ్ఞానము, ఇక్కడ భక్తి. జ్ఞానము మరియు భక్తి వేర్వేరు కదా. భక్తి పుస్తకాలెన్ని ఉన్నాయి మరియు జ్ఞానం యొక్క పుస్తకాలెన్ని ఉన్నాయి. తండ్రి జ్ఞాన సాగరుడు. మరి వారి పుస్తకం కూడా ఒక్కటే ఉండాలి. ఎవరైతే ధర్మ స్థాపన చేస్తారో, వారి పుస్తకం ఒకటే ఉండాలి. దానిని రిలీజియస్ బుక్ (ధర్మ గ్రంథం)అని అంటారు. మొదటి రిలీజియస్ బుక్ గీత, శ్రీమద్భగవద్గీత. మొదట ఆది సనాతన దేవీదేవతా ధర్మముండేది, హిందూ ధర్మము కాదని పిల్లలకు కూడా తెలుసు. గీత ద్వారా హిందూ ధర్మ స్థాపన జరిగింది మరియు కృష్ణుడు గీతను వినిపించారని మనుష్యులు భావిస్తారు. ఎవరినైనా అడిగితే దీన్ని పరంపరగా కృష్ణుడే వినిపించారని అంటారు. ఏ శాస్త్రములోనూ శివ భగవానువాచ అని లేదు, శ్రీమత్ కృష్ణ భగవానువాచ అని వ్రాసేశారు, ఎవరైతే గీతను చదివి ఉంటారో వారికి సహజంగా అర్థమవుతుంది. ఈ గీతా జ్ఞానము ద్వారానే మనుష్యుల నుండి దేవతలుగా అయ్యారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, దాన్ని తండ్రి మీకిప్పుడు ఇస్తున్నారు. రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. పవిత్రతను కూడా నేర్పిస్తున్నారు. కామము మహాశత్రువు, దీని ద్వారానే మీరు ఓటమి పొందారు. ఇప్పుడు మళ్ళీ దీనిపై విజయాన్ని పొందడంతో మీరు జగత్ జీతులుగా అనగా విశ్వానికి యజమానులుగా అయిపోతారు. ఇదైతే చాలా సహజము. అనంతమైన తండ్రి కూర్చొని వీరి ద్వారా మిమ్మల్ని చదివిస్తున్నారు. వారు ఆత్మలందరికీ తండ్రి. వీరు మనుష్యులకు అనంతమైన తండ్రి. వీరి పేరే ప్రజాపిత బ్రహ్మా. బ్రహ్మా తండ్రి పేరు చెప్పండి అని మీరు ఎవరినైనా అడిగితే వారు తికమకపడిపోతారు. బ్రహ్మా-విష్ణు-శంకరులు క్రియేషన్ (రచన). ఈ ముగ్గురికీ ఎవరైనా తండ్రి అయితే ఉంటారు కదా. ఈ ముగ్గురికీ తండ్రి నిరాకార శివుడని మీరు చూపిస్తారు. బ్రహ్మా-విష్ణు-శంకరులను సూక్ష్మ వతనములోని దేవతలుగా చూపిస్తారు. వారికి పైన శివుడున్నారు. శివబాబా పిల్లలైన ఆత్మలెవరైతే ఉన్నారో వారికి తమ శరీరాలై ఉంటాయని పిల్లలకు తెలుసు. వారైతే సదా నిరాకారుడు, పరమపిత పరమాత్మ. నిరాకార పరమపిత పరమాత్మకు మనం పిల్లలమని పిల్లలకు తెలుసు. ఆత్మ శరీరం ద్వారా - పరమపిత పరమాత్మ అని అంటుంది. ఇవి ఎంత సహజమైన విషయాలు. వీటినే అల్ఫ్, బే అని అంటారు. చదివించేవారెవరు? గీతా జ్ఞానాన్ని ఎవరు వినిపించారు? నిరాకార తండ్రి. వారిపై కిరీటము మొదలైనవేవీ లేవు. వారు జ్ఞానసాగరుడు, బీజరూపుడు, చైతన్యమైనవారు. మీరు కూడా చైతన్యమైన ఆత్మలు కదా! అన్ని వృక్షాల ఆదిమధ్యాంతాల గురించి మీకు తెలుసు. తోటమాలి కాకపోయినా కానీ బీజాన్ని ఎలా వేస్తారు, దాని నుండి వృక్షమెలా వెలువడుతుంది అనేది మీరు అర్థము చేసుకోగలరు. అదైతే జడమైన వృక్షం, ఇది చైతన్యమైనది. మీ ఆత్మలో జ్ఞానముంది, ఇంకెవ్వరి ఆత్మలోనూ జ్ఞానము లేదు. తండ్రి చైతన్య మనుష్య సృష్టికి బీజరూపుడు. కనుక వృక్షము మనుష్యులదే ఉంటుంది. ఇది చైతన్యమైన క్రియేషన్. బీజానికి మరియు క్రియేషన్ కు తేడా అయితే ఉంటుంది కదా! మామిడి విత్తనాన్ని నాటడం వలన మామిడి చెట్టు వెలువడుతుంది, తర్వాత వృక్షం ఎంత పెద్దదిగా అవుతుంది. అలాగే మనుష్య బీజము నుండి ఎంతో మంది మనుష్యులు వెలువడుతారు. జడ బీజములో జ్ఞానమేమీ ఉండదు. వీరైతే చైతన్య బీజరూపుడు. సృష్టి రూపీ వృక్షం యొక్క ఉత్పత్తి, పాలన మరియు వినాశనమెలా జరుగుతుంది అనే మొత్తం జ్ఞానము వీరిలో ఉంది. చాలా పెద్దగా ఉన్న ఈ వృక్షము సమాప్తమైపోయి మళ్ళీ వేరే కొత్త వృక్షము ఎలా వెలువడుతుంది అన్నది గుప్తము. మీకు జ్ఞానము కూడా గుప్తంగానే లభిస్తుంది, తండ్రి కూడా గుప్తంగానే వచ్చారు. ఇప్పుడు అంటు కట్టబడుతుందని మీకు తెలుసు. ఇప్పుడు అందరూ పతితులుగా అయిపోయారు. అచ్ఛా, బీజము నుండి మొట్టమొదటి నంబరులో ఏ ఆకులైతే వెలువడ్డాయో వారెవరు? సత్యయుగపు మొదటి ఆకు అని కృష్ణుడినే అంటారు, లక్ష్మీనారాయణులను అనరు. కొత్త ఆకు చిన్నగా ఉంటుంది, తర్వాత పెద్దగా అవుతుంది. కనుక ఈ బీజానికి ఎంత మహిమ ఉంది. వీరు చైతన్యమైనవారు కదా. తర్వాత మిగతా ఆకులు కూడా వెలువడుతాయి. వారికి మహిమ అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు దేవీ దేవతలుగా అవుతున్నారు. దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు. మనము దైవీ గుణాలను ధారణ చేయాలి, వీరి వలె తయారవ్వాలని, ఇదే ముఖ్యమైన విషయము. చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రాలు లేకపోతే బుద్ధిలోకి జ్ఞానమే రాదు. ఈ చిత్రాలు చాలా ఉపయోగపడతాయి. భక్తి మార్గంలో ఈ చిత్రాలకు పూజ జరుగుతుంది మరియు జ్ఞాన మార్గంలో ఈ చిత్రాల ద్వారా ఈ విధంగా తయారవ్వాలని మీకు జ్ఞానము లభిస్తుంది. భక్తి మార్గంలో మేమిలా తయారవ్వాలని భావించరు. భక్తి మార్గంలో ఎన్ని మందిరాలను నిర్మిస్తారు. అందరికన్నా ఎక్కువగా ఎవరి మందిరాలు ఉంటాయి? తప్పకుండా బీజరూపుడైన శివబాబావే ఉంటాయి. వారి తర్వాత మొదటి క్రియేషన్ యొక్క మందిరాలుంటాయి. మొదటి క్రియేషన్ ఈ లక్ష్మీనారాయణులు. శివుని తర్వాత అందరికన్నా ఎక్కువగా వీరి పూజ జరుగుతుంది. మాతలైతే జ్ఞానము ఇస్తారు, వారికి పూజ జరగదు, వారు చదివిస్తారు కదా. తండ్రి మిమ్మల్ని చదివిస్తారు. మీరెవ్వరినీ పూజించరు. చదివించేవారిని ఇప్పుడు పూజించలేరు. మీరు చదువుకుని మళ్ళీ ఎప్పుడైతే చదువులేనివారిగా అయిపోతారో, అప్పుడు మళ్ళీ పూజ జరుగుతుంది. మీరే దేవీ దేవతలుగా అవుతారు. ఎవరైతే మనల్ని ఆ విధంగా తయారు చేస్తారో మొదట వారి పూజ జరుగుతుంది, తర్వాత మన పూజ నంబరువారుగా జరుగుతుందని మీకే తెలుసు. మళ్ళీ పడిపోతూ పడిపోతూ పంచ తత్వాలను కూడా పూజించడం మొదలుపెడతారు. శరీరము పంచతత్వాలదే కదా. పంచతత్వాలను పూజించడమన్నా లేక శరీరాలను పూజించడమన్నా, ఒక్కటే అవుతుంది. ఈ జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. ఈ లక్ష్మీనారాయణులు మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారు. కొత్త సృష్టిలో ఈ దేవీ దేవతల రాజ్యము ఉండేది. కానీ అది ఎప్పుడుండేదో, ఎవ్వరికీ తెలియదు, లక్షల సంవత్సరాలని అంటారు. ఇప్పుడు లక్షల సంవత్సరాల విషయమైతే ఎప్పుడూ ఎవ్వరి బుద్ధిలోనూ ఉండదు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితము మనము ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారమని మీకిప్పుడు స్మృతి కలిగింది. దేవీ దేవతా ధర్మమువారు మళ్ళీ ఇతర ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారు. హిందూ ధర్మమని అనలేము. కానీ పతితంగా ఉన్న కారణంగా స్వయాన్ని దేవీ దేవతలమని చెప్పుకోవడం శోభించదు. అపవిత్రమైన వారిని దేవీ దేవతలని అనలేరు. మనుష్యులు పవిత్రమైన దేవీలను పూజిస్తారు కనుక తప్పనిసరిగా వారు స్వయం అపవిత్రంగా ఉన్నారు, అందుకే పవిత్రమైనవారి ఎదురుగా తల వంచవలసి వస్తుంది. భారతదేశంలో విశేషంగా కన్యలకు నమస్కరిస్తారు. కుమారులకు నమస్కరించరు. స్త్రీలకు నమస్కరిస్తారు. పురుషులకెందుకు నమస్కరించరు? ఎందుకంటే ఈ సమయంలో జ్ఞానము కూడా మొదట మాతలకే లభిస్తుంది. తండ్రి వీరిలో ప్రవేశిస్తారు. తప్పకుండా వీరు జ్ఞానం యొక్క పెద్ద నది అని కూడా తెలుసుకున్నారు. వీరు జ్ఞాన నది కూడా, ఇంకా పురుషుడు కూడా. వీరు అందరికన్నా పెద్ద నది. బ్రహ్మపుత్ర నది అన్నింటికన్నా పెద్దది, ఇది కలకత్తా వైపుగా వెళ్ళి సాగరంలో కలుస్తుంది. అక్కడ మేళా కూడా జరుగుతుంది. కానీ ఇది ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మేళా అని వారికి తెలియదు. అదైతే నీటి నది, దానికి బ్రహ్మపుత్ర నది అని పేరు పెట్టారు. వారు బ్రహ్మతత్వమునే ఈశ్వరుడని అంటారు, అందుకే బ్రహ్మపుత్రను చాలా పావనమైనదిగా భావిస్తారు. అది పెద్ద నది కనుక పవిత్రంగా కూడా ఉంటుంది. వాస్తవానికి పతితపావని అని గంగను కాదు, బ్రహ్మపుత్రను పిలవాలి. దీనికి మేళా కూడా జరుగుతుంది. ఇది కూడా సాగరము మరియు బ్రహ్మ నదుల యొక్క మేళా. బ్రహ్మా ద్వారా దత్తత ఎలా జరుగుతుంది - ఇవి అర్థము చేసుకోవలసిన గుహ్యమైన విషయాలు, ఇవి ప్రాయః లోపమైపోతాయి. ఇదైతే పూర్తిగా సహజమైన విషయము కదా.

భగవానువాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను, తర్వాత ఈ ప్రపంచమే సమాప్తమైపోతుంది. ఇక శాస్త్రాలు మొదలైనవేవీ ఉండవు. తర్వాత భక్తి మార్గములో ఈ శాస్త్రాలు ఉంటాయి. జ్ఞాన మార్గంలో శాస్త్రాలు ఉండవు. ఈ శాస్త్రాలు పరంపరగా కొనసాగుతూ వస్తాయని మనుష్యులు భావిస్తారు. వారిలో జ్ఞానమైతే ఏమాత్రమూ లేదు. కల్పము ఆయువునే లక్షల సంవత్సరాలని అంటారు, అందుకే పరంపర అనేస్తారు. దీనినే అజ్ఞాన అంధకారమని అంటారు. పిల్లలైన మీకిప్పుడు ఈ అనంతమైన చదువు లభిస్తుంది, దీనితో మీరు ఆదిమధ్యాంత రహస్యాన్ని అర్థము చేయించగలరు. మీకు ఈ దేవీ దేవతల చరిత్ర-భూగోళము గురించి పూర్తిగా తెలుసు. వీరు పవిత్ర ప్రవృత్తి మార్గానికి చెందిన పూజ్యులుగా ఉండేవారు. ఇప్పుడు పూజారులుగా, పతితులుగా అయ్యారు. సత్యయుగంలో పవిత్ర ప్రవృత్తి మార్గముంటుంది, ఇక్కడ కలియుగంలో అపవిత్ర ప్రవృత్తి మార్గముంది. తర్వాత నివృత్తి మార్గముంటుంది. అది కూడా డ్రామాలో ఉంది. దానినే సన్యాస ధర్మమని అంటారు. ఇళ్ళు-వాకిళ్ళను సన్యసించి అడవులలోకి వెళ్ళిపోతారు. అది హద్దు సన్యాసము, అయినా వారు ఈ పాత ప్రపంచంలోనే ఉంటారు కదా. మనము సంగమయుగంలో ఉన్నాము, మళ్ళీ కొత్త ప్రపంచములోకి వెళ్తామని మీకిప్పుడు తెలుసు. మీకు తిథి, తారీఖు, సెకెండు సహితంగా అన్నీ తెలుసు. ఆ మనుష్యులైతే కల్పము ఆయువునే లక్షల సంవత్సరాలని అనేస్తారు. దీనికైతే పూర్తి లెక్కను తీయగలరు కానీ లక్షల సంవత్సరాల విషయాలను ఎవ్వరూ స్మృతి కూడా చేయలేరు. తండ్రి ఎవరు, ఎలా వస్తారు, ఏ కర్తవ్యాన్ని చేస్తారు అనేది మీకిప్పుడు తెలుసు. మీకు అందరి కర్తవ్యము, జన్మ పత్రుల గురించి తెలుసు. ఇక వృక్షములో ఆకులైతే లెక్కలేనన్ని ఉంటాయి. వాటిని లెక్క వేయలేము. ఈ అనంతమైన సృష్టి రూపీ వృక్షానికి ఎన్ని ఆకులు ఉన్నాయి? 5 వేల సంవత్సరాలలో ఇన్ని కోట్లు అయ్యాయి. ఇక లక్షల సంవత్సరాలలో ఎంత లెక్కలేనంత మంది మనుష్యులైపోతారు. భక్తి మార్గంలో సత్యయుగానికి ఇన్ని సంవత్సరాలు ఉంటుంది, త్రేతాయుగానికి ఇన్ని సంవత్సరాలు ఉంటుంది, ద్వాపరయుగానికి ఇన్ని సంవత్సరాలు ఉంటుంది అని వ్రాయబడి ఉన్నట్లుగా చూపిస్తారు. కనుక తండ్రి కూర్చొని పిల్లలైన మీకు ఈ రహస్యాలన్నీ అర్థము చేయిస్తారు. మామిడి విత్తనాన్ని చూస్తే మామిడి చెట్టు ఎదురుగా వస్తుంది కదా! ఇప్పుడు మనుష్య సృష్టి యొక్క బీజరూపుడు మీ ఎదురుగా ఉన్నారు. వారు కూర్చొని వృక్షం యొక్క రహస్యాన్ని మీకు అర్థం చేయిస్తారు ఎందుకంటే వారు చైతన్యమైనవారు. ఇది మన తలక్రిందులుగా ఉన్న వృక్షమని తెలియజేస్తారు. ఈ ప్రపంచంలో ఉన్నది ఏదైనా, అది జడమైనా లేక చైతన్యమైనా, అలాగే రిపీట్ అవుతుందని మీరు అర్థము చేయించగలరు. ఇప్పుడు ఎంతగా వృద్ధి చెందుతూ ఉన్నారు. సత్యయుగంలో ఇంతమంది ఉండరు. ఫలానా వస్తువు ఆస్ట్రేలియా నుండి, జపాన్ నుండి వచ్చిందని అంటారు. సత్యయుగంలో ఆస్ట్రేలియా, జపాన్ మొదలైనవి ఉండవు. డ్రామానుసారంగా అక్కడి వస్తువులు ఇక్కడకు వస్తాయి. మొదట అమెరికా నుండి గోధుమ మొదలైనవి వస్తాయి. సత్యయుగంలో ఇలా ఎక్కడ నుండీ రావు. అక్కడ ఉన్నది ఒకే ధర్మము, అన్ని వస్తువులు నిండుగా ఉంటాయి. ఇక్కడ ధర్మాలు వృద్ధి చెందుతూ ఉంటాయి, వాటితో పాటు వస్తువులన్నీ తగ్గిపోతూ ఉంటాయి. సత్యయుగంలో ఎక్కడి నుండీ తెప్పించరు. ఇప్పుడైతే ఎక్కడెక్కడ నుండి తెప్పిస్తున్నారో చూడండి! మనుష్యులు తర్వాత వృద్ధి చెందుతూ వచ్చారు, సత్యయుగంలో అప్రాప్తి అనే వస్తువేదీ ఉండదు. అక్కడ ప్రతి వస్తువు సతోప్రధానంగా, చాలా బాగుంటుంది. మనుష్యులే సతోప్రధానంగా ఉంటారు, మనుష్యులు బాగుంటే సామాగ్రి కూడా బాగుంటుంది. మనుష్యులు చెడ్డవారైతే సామాగ్రి కూడా నష్టదాయకంగా ఉంటుంది.

సైన్సు యొక్క ముఖ్యమైన వస్తువులు అటామిక్ బాంబులు, వాటి ద్వారానే ఇంతటి వినాశనమంతా జరుగుతుంది. వాటినెలా తయారు చేసి ఉండవచ్చు! తయారు చేసే ఆత్మలో డ్రామానుసారంగా మొదటి నుండే జ్ఞానము ఉంటుంది. ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడు వారిలోకి ఆ జ్ఞానము వస్తుంది, ఎవరిలోనైతే ఆ సెన్స్ (తెలివి) ఉంటుందో, వారే పని చేస్తారు మరియు ఇతరులకు నేర్పిస్తారు. కల్ప-కల్పము ఏ పాత్రనైతే అభినయించారో, దాన్నే అభినయిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరెంత నాలెడ్జ్ ఫుల్ గా అవుతారు, దీనికన్నా గొప్ప జ్ఞానము ఇంకేదీ ఉండదు. మీరు ఈ జ్ఞానముతో దేవతగా అయిపోతారు. దీని కన్నా ఉన్నతమైన జ్ఞానమేదీ ఉండదు. అది మాయా జ్ఞానము, దాని ద్వారా వినాశనం జరుగుతుంది. ఆ మనుష్యులు (వైజ్ఞానికులు) చంద్రుని పైకి వెళ్తారు, పరిశోధనలు చేస్తారు. మీకైతే కొత్త విషయమేమీ కాదు. ఇదంతా మాయ యొక్క ఆర్భాటము. చాలా షో చేస్తారు, అతి లోతుల్లోకి వెళ్తారు. ఏదైనా అద్భుతాన్ని చేసి చూపించాలని బుద్ధిని చాలా నడిపిస్తారు. చాలా అద్భుతము చేయడం వలన ఇంకా నష్టము ఏర్పడుతుంది. ఏవేవో తయారు చేస్తూ ఉంటారు. వీటి ద్వారా ఇలా వినాశనము జరుగుతుందని తయారుచేసేవారికి తెలుసు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. గుప్త జ్ఞానాన్ని స్మరణ చేస్తూ హర్షితంగా ఉండాలి. దేవతల చిత్రాలను ఎదురుగా చూస్తూ, వాటికి నమస్కారం చేయడం, వందనం చేయడానికి బదులుగా వారిలా తయారయ్యేందుకు దైవీ గుణాలను ధారణ చేయాలి.

2. సృష్టికి బీజరూపుడైన తండ్రిని మరియు వారి చైతన్యమైన క్రియేషన్ ను అర్థము చేసుకొని నాలెడ్జ్ ఫుల్ గా అవ్వాలి, ఈ నాలెడ్జ్ కు మించిన నాలెడ్జ్ ఇంకేదీ ఉండదు, ఈ నషాలో ఉండాలి.

వరదానము:-

బాధ్యతను సంభాళిస్తూ ఆకారీ మరియు నిరాకారీ స్థితి యొక్క అభ్యాసం ద్వారా సాక్షాత్కార మూర్త భవ

ఏ విధంగా సాకార రూపంలో ఇంత పెద్ద బాధ్యత ఉన్నా కూడా ఆకారీ మరియు నిరాకారీ స్థితిని అనుభవం చేయిస్తూ ఉండేవారో, అలా తండ్రిని ఫాలో చేయండి. సాకార రూపంలో ఫరిశ్తాతనాన్ని అనుభూతి చేయించండి. ఎవరు ఎంతటి అశాంతి లేక వ్యాకులతతో భయపడుతూ మీ ముందుకు వచ్చినా కానీ మీ ఒక్క దృష్టి, వృత్తి మరియు స్మృతి యొక్క శక్తి వారిని పూర్తిగా శాంతపర్చాలి. వ్యక్త భావంలోకి వచ్చినా కానీ అవ్యక్త స్థితిని అనుభవం చేయాలి, అప్పుడు సాక్షాత్కార మూర్తి అని అంటారు.

స్లోగన్:-

ఎవరైతే సత్యమైన దయాహృదయులుగా ఉంటారో, వారికి దేహము లేక దేహాభిమానం యొక్క ఆకర్షణ ఉండదు.