28-01-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - ఎప్పుడూ మిథ్య అహంకారములోకి రాకండి, ఈ రథం పట్ల కూడా పూర్తిగా గౌరవముంచండి”

ప్రశ్న:-

పిల్లలైన మీలో పదమాపదమ భాగ్యశాలులు ఎవరు మరియు దుర్భాగ్యశాలులు ఎవరు?

జవాబు:-

ఎవరి నడవడిక అయితే దేవతల వలె ఉంటుందో, ఎవరైతే అందరికీ సుఖమునిస్తారో, వారు పదమాపదమ భాగ్యశాలులు మరియు ఎవరైతే ఫెయిలవుతారో, వారిని దుర్భాగ్యశాలులని అంటారు. కొందరు మహాన్ దుర్భాగ్యశాలులుగా అవుతారు, వారు అందరికీ దుఃఖాన్నే ఇస్తూ ఉంటారు. వారికి సుఖాన్నివ్వడమనేది తెలియనే తెలియదు. బాబా అంటారు, పిల్లలూ, స్వయాన్ని బాగా సంభాళించుకోండి. అందరికీ సుఖాన్నివ్వండి, యోగ్యులుగా అవ్వండి.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. మీరు ఈ పాఠశాలలో కూర్చుని ఉన్నతమైన హోదాను పొందుతారు. మేము ఎంతో ఉన్నతాతి ఉన్నతమైన స్వర్గ పదవిని పొందుతామని మనసులో భావిస్తారు. ఇటువంటి పిల్లలకు చాలా సంతోషముండాలి. ఒకవేళ అందరికీ నిశ్చయమున్నా, అందరూ ఒకే విధంగా ఉండలేరు. ఫస్ట్ నుండి లాస్ట్ నంబరు వరకు తప్పకుండా ఉంటారు. పేపర్లలో కూడా ఫస్ట్ నుండి లాస్ట్ నంబరు వరకు నంబర్లు ఉంటాయి. కొందరు ఫెయిల్ అవుతారు, కొందరు పాస్ అవుతూ కూడా ఉంటారు. కావున ప్రతి ఒక్కరు తమ మనస్సును ప్రశ్నించుకోండి - బాబా నన్ను ఇంత ఉన్నతంగా తయారుచేస్తున్నారు, నేను ఎంతవరకు అర్హునిగా అయ్యాను? ఫలానా వారికంటే బాగున్నానా లేక తక్కువగా ఉన్నానా? ఇది చదువు కదా. ఎవరైనా ఏదైనా సబ్జెక్టులో బలహీనంగా ఉంటే కిందకు వెళ్ళిపోవడం గమనిస్తారు. మానిటర్ గా ఉన్నా కానీ ఏదైనా సబ్జెక్టులో బలహీనంగా ఉంటే కిందకు వెళ్ళిపోతారు. ఎవరో అరుదుగా స్కాలర్షిప్ ను తీసుకుంటారు. ఇది కూడా స్కూలు. మనమంతా చదువుకుంటున్నామని మీకు తెలుసు, ఇందులో మొట్టమొదటి విషయము పవిత్రతకు సంబంధించినది. పవిత్రంగా అయ్యేందుకే తండ్రిని పిలిచారు కదా. ఒకవేళ క్రిమినల్ దృష్టి కలిగి ఉన్నట్లయితే, వారికి స్వయమూ అనిపిస్తుంది. బాబా, మేము ఈ సబ్జెక్టులో బలహీనంగా ఉన్నామని బాబాకు వ్రాస్తారు కూడా. విద్యార్థికి, నేను ఫలానా సబ్జెక్టులో చాలా చాలా బలహీనంగా ఉన్నానని తప్పకుండా బుద్ధిలో ఉంటుంది. కొందరు, మేము ఫెయిల్ అవుతామని కూడా భావిస్తారు. ఇందులో మొదటి నంబరు సబ్జెక్టు - పవిత్రత. బాబా, మేము ఓడిపోయాము అని చాలా మంది వ్రాస్తారు, మరి వారిని ఏమనాలి? ఇప్పుడు నేను ఎక్కలేను అని వారికి మనసులో అనిపిస్తూ ఉంటుంది. మీరు పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేస్తారు కదా. మీ లక్ష్యము-ఉద్దేశ్యమే ఇది. తండ్రి అంటారు - పిల్లలూ, నన్నొక్కరినే స్మృతి చేయండి మరియు పవిత్రంగా అవ్వండి, అప్పుడు ఈ లక్ష్మీనారాయణుల వంశములోకి వెళ్ళగలరు. ఫలానావారు ఇంత ఉన్నత పదవిని పొందగలరా లేదా అన్నది టీచరు అయితే అర్థము చేసుకోగలరు. వారు సుప్రీమ్ టీచరు. ఈ దాదా కూడా స్కూలులో చదువుకున్నారు కదా. కొంతమంది పిల్లలు ఎలాంటి చెడు పనులు చేస్తారంటే, ఇక చివరికి మాస్టర్ కు శిక్షించవలసి వస్తుంది. ఇంతకుముందు చాలా జోరుగా శిక్షలు వేసేవారు, ఇప్పుడు శిక్షలు మొదలైనవి తగ్గించేసారు, కనుక విద్యార్థులు ఇంకా ఎక్కువగా పాడైపోతున్నారు. ఈ రోజుల్లో విద్యార్థులు ఎన్ని హంగామాలు చేస్తారు. విద్యార్థులది కొత్త రక్తమని అంటారు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి! నిప్పు అంటిచేస్తారు, తమ యవ్వనపు శక్తిని చూపిస్తారు. ఇది ఉన్నదే ఆసురీ ప్రపంచము. యువకులే చాలా చెడ్డగా ఉంటారు, వారి కనులు చాలా క్రిమినల్ గా ఉంటాయి. చూడడానికి చాలా మంచివారిలా ఉంటారు. ఏ విధంగా ఈశ్వరుని అంతాన్ని పొందలేరని అంటారో, అదే విధంగా వీళ్ళు ఏ రకమైన మనుష్యులు అని వీరి అంతాన్ని కూడా తెలుసుకోలేరు. అయితే, జ్ఞాన బుద్ధి ద్వారా వీరు ఎలా చదువుతున్నారు, వీరి నడవడిక ఎలా ఉంది అనేది తెలుస్తుంది. కొందరు మాట్లాడేటప్పుడు వారి నోటి నుండి పుష్పాలు వెలువడుతునట్లుగా ఉంటుంది, కొందరు రాళ్ళు వేస్తున్నట్లుగా మాట్లాడుతారు. చూడడానికి చాలా బాగుంటారు, పాయింట్లు మొదలైనవి కూడా వ్రాస్తారు కానీ రాతిబుద్ధి కలవారిగా ఉంటారు. బాహ్య ఆర్భాటము ఉంటుంది. మాయ చాలా శక్తివంతమైనది, అందుకే గాయనముంది - ఆశ్చర్యవంతులై వింటారు, మేము శివబాబా సంతానమని చెప్పుకుంటారు, ఇతరులకు వినిపిస్తారు, వర్ణన చేస్తారు, తర్వాత పారిపోతారు అంటే ద్రోహులుగా అవుతారు. అలాగని తెలివైనవారు ద్రోహులుగా అవ్వరని కాదు, మంచి మంచి తెలివైనవారు కూడా ద్రోహులుగా అవుతారు. ఆ సైన్యములో కూడా ఇలాగే జరుగుతుంది. ఏరోప్లేన్ సహితంగా మరో దేశానికి వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది, స్థాపనలో చాలా కష్టముంటుంది. పిల్లలకు కూడా చదువులో శ్రమ అనిపిస్తుంది, టీచరుకు కూడా చదివించడంలో శ్రమ అనిపిస్తుంది. ఫలానావారు అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారు, చదవడం లేదని గమనిస్తే స్కూళ్ళలో కొరడాతో శిక్షిస్తారు. వీరైతే తండ్రి, తండ్రి ఏమీ అనరు. బాబా వద్ద ఈ చట్టము లేదు, ఇక్కడైతే పూర్తిగా శాంతిగా ఉండవలసి ఉంటుంది. తండ్రి అయితే సుఖదాత, ప్రేమసాగరుడు. మరి పిల్లల నడవడిక కూడా అలాగే ఉండాలి కదా, దేవతల వలె ఉండాలి. మీరు పదమాపదమ భాగ్యశాలులు అని పిల్లలైన మీకు బాబా సదా చెప్తూ ఉంటారు. కానీ పదమాపదమ దుర్భాగ్యశాలులుగా కూడా అవుతారు. ఎవరైతే ఫెయిల్ అవుతారో, వారిని దుర్భాగ్యశాలులని అంటారు కదా. ఇది అంతిమం వరకు జరుగుతూ ఉంటుందని బాబాకు తెలుసు. కొంతమంది మహాన్ దుర్భాగ్యశాలులుగా కూడా తప్పకుండా అవుతారు. వారి నడవడిక ఎలా ఉంటుందంటే, ఇక వీరు నిలవలేరని అర్థం చేసుకుంటారు. ఇంత ఉన్నతంగా అయ్యేందుకు అర్హులుగా లేరు, అందరికీ దుఃఖాన్నిస్తూ ఉంటారు. సుఖాన్నివ్వడమే తెలియదు అంటే ఇక వారి పరిస్థితి ఏమవుతుంది! బాబా సదా చెప్తూ ఉంటారు - పిల్లలూ, స్వయాన్ని మంచి రీతిగా సంభాళించుకోండి, ఇది కూడా డ్రామానుసారముగా జరగాల్సిందే, లోహము కంటే కూడా నీచంగా అయిపోతారు. మంచి మంచి పిల్లల్లో కొందరు ఎప్పుడూ ఉత్తరాలు కూడా వ్రాయరు. పాపం వారి పరిస్థితి ఎలా ఉంటుంది!

నేను సర్వుల కళ్యాణము చేసేందుకే వచ్చానని బాబా అంటారు. ఈ రోజు అందరి సద్గతి చేస్తాను, రేపు మళ్ళీ దుర్గతి ఏర్పడుతుంది. నిన్న మేము విశ్వానికి యజమానులుగా ఉండేవారము, ఈ రోజు బానిసలుగా అయిపోయామని మీరంటారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో వృక్షమంతా ఉంది. ఇది అద్భుతమైన వృక్షము. మనుష్యులకు ఇది కూడా తెలియదు. కల్పము అనగా పూర్తి 5 వేల సంవత్సరాల ఏక్యురేట్ వృక్షమని ఇప్పుడు మీకు తెలుసు. ఒక్క క్షణము కూడా తేడా ఉండదు. ఈ అనంతమైన వృక్షము గురించి పిల్లలైన మీకు ఇప్పుడే జ్ఞానము లభిస్తుంది. జ్ఞానాన్నిచ్చే వారు వృక్షపతి. బీజము ఎంత చిన్నదిగా ఉంటుంది, దాని నుండి ఎంత పెద్ద ఫలము వెలువడుతుందో చూడండి. ఇది అద్భుతమైన వృక్షము, దీని బీజము చాలా చిన్నది. ఆత్మ ఎంత చిన్నది. తండ్రి కూడా చిన్నగా ఉంటారు, ఈ కనులతో చూడలేము. వివేకానందుని గురించి చెప్తారు - వారి నుండి జ్యోతి వెలువడి నాలో ఇమిడిపోయిందని అతడన్నారు. ఆ విధంగా జ్యోతి వెలువడి మళ్ళీ అలా ఇమిడిపోలేదు. ఏం వెలువడింది అనేది అర్థము చేసుకోరు. ఇటువంటి సాక్షాత్కారాలు చాలా జరుగుతాయి కానీ ఆ మనుష్యులు వాటిని అంగీకరిస్తారు, ఇంకా వారి మహిమను కూడా వ్రాస్తారు. భగవానువాచ - ఏ మనిషికీ మహిమ లేదు. కేవలం దేవతలకు మాత్రమే మహిమ ఉంది మరియు ఎవరైతే ఈ విధంగా దేవతలుగా తయారయ్యేవారుంటారో, వారికి మహిమ ఉంటుంది. బాబా కార్డును చాలా బాగా తయారు చేయించారు. జయంతిని జరుపుకోవాలంటే ఒక్క శివబాబాదే జరుపుకోవాలి. వీరిని (లక్ష్మీ నారాయణులను) కూడా ఈ విధంగా తయారు చేసేవారు శివబాబాయే కదా. మహిమ కేవలం ఒక్కరిదే ఉంటుంది, ఆ ఒక్కరినే స్మృతి చేయండి. నేను ఉన్నతాతి ఉన్నతంగా అవుతాను, మళ్ళీ కిందకు కూడా దిగిపోతాను అని వీరు స్వయంగా అంటారు. ఉన్నతాతి ఉన్నతమైన లక్ష్మీనారాయణులే మళ్ళీ 84 జన్మల తర్వాత కిందకు దిగుతారు, తతత్వమ్, ఇది ఎవ్వరికీ తెలియదు. మీరే విశ్వానికి యజమానులుగా ఉండేవారు, మళ్ళీ ఎలా అయిపోయారు! సత్యయుగములో ఎవరు ఉండేవారు? మీరందరే ఉండేవారు, నంబరువారు పురుషార్థానుసారముగా ఉండేవారు. రాజా-రాణులు కూడా ఉండేవారు, సూర్యవంశం-చంద్రవంశమువారు కూడా ఉండేవారు. బాబా ఎంత మంచి రీతిగా అర్థము చేయిస్తారు. ఈ సృష్టి చక్ర జ్ఞానము నడుస్తూ తిరుగుతూ పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి. మీరు చైతన్యమైన లైట్ హౌస్ లు. మొత్తం చదువంతా బుద్ధిలో ఉండాలి. కానీ ఆ అవస్థ ఇంకా ఏర్పడలేదు, అది ఇంకా ఏర్పడనున్నది. ఎవరైతే పాస్ విత్ హానర్ గా అవుతారో, వారికి ఈ అవస్థ ఉంటుంది. మొత్తం జ్ఞానమంతా బుద్ధిలో ఉంటుంది. అప్పుడు తండ్రికి గారాబాల, లవ్లీ పిల్లలని పిలవబడతారు. ఇటువంటి పిల్లలపై తండ్రి స్వర్గ రాజ్యాన్ని బలిహారం చేస్తారు. తండ్రి అంటారు - నేను రాజ్యం చేయను, మీకు ఇస్తాను, దీనినే నిష్కామ సేవ అని అంటారు. బాబా మనల్ని శిరస్సుపై ఎక్కించుకుంటున్నారని పిల్లలకు తెలుసు కనుక అటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి. ఇది కూడా డ్రామాగా రచింపబడింది. తండ్రి సంగమయుగములో వచ్చి నంబరువారు పురుషార్థానుసారంగా అందరికీ సద్గతినిస్తారు. నంబరువన్ హైయ్యెస్ట్ పూర్తి పవిత్రమైనవారు, నంబరు లాస్ట్ పూర్తిగా అపవిత్రమైనవారు. ప్రియస్మృతులనైతే బాబా అందరికీ ఇస్తారు.

బాబా ఎంత మంచి రీతిగా అర్థము చేయిస్తారు, ఎప్పుడూ మిథ్య అహంకారము రాకూడదు. అప్రమత్తంగా ఉండాలి, రథానికి కూడా గౌరవముంచాలి అని తండ్రి చెప్తారు. వీరి ద్వారానే కదా తండ్రి వినిపిస్తారు. వీరు ఇంతకుముందు ఎప్పుడూ నిందలు పొందలేదు. వీరిని అందరూ ప్రేమించేవారు. ఇప్పుడు వీరిపై ఎన్ని నిందలు వేస్తున్నారో చూడండి. చాలా మంది ద్రోహులుగా అయి పారిపోయారు, ఇక వారి గతి ఏమవుతుంది, ఫెయిలైపోతారు కదా! మాయ అటువంటిదే, అందుకే చాలా అప్రమత్తంగా ఉండాలి అని తండ్రి అర్థము చేయిస్తారు. మాయ ఎవ్వరినీ విడిచిపెట్టదు. అన్ని రకాలుగా నిప్పు అంటించేస్తుంది. నా పిల్లలందరూ కామచితి పైకి ఎక్కి నల్లగా బొగ్గు వలె అయిపోయారని తండ్రి అంటారు. అందరూ ఒకే విధంగా ఉండరు. అలాగే, అందరి పాత్ర ఒకే విధముగా ఉండదు. దీని పేరే వేశ్యాలయము, ఎన్నిసార్లు కామచితి పైకి ఎక్కి ఉంటారు. రావణుడు ఎంత శక్తివంతుడు, బుద్ధినే పతితంగా చేసేస్తాడు. ఇక్కడకు వచ్చి తండ్రి దగ్గర శిక్షణ తీసుకునేవారు కూడా అలా అయిపోతారు. తండ్రి స్మృతితో తప్ప క్రిమినల్ దృష్టి ఎప్పటికీ మారదు, అందుకే సూరదాసుని కథ ఉంది. ఇది కల్పించిన విషయమే, ఉదాహరణ కూడా ఇస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం యొక్క మూడవ నేత్రము లభిస్తుంది. అజ్ఞానమంటే అంధకారము. మీరు అంధులు, అజ్ఞానులు అని అంటారు కదా. జ్ఞానము గుప్తమైనది, ఇందులో ఏమీ మాట్లాడవలసిన అవసరముండదు. ఒక్క క్షణములో పూర్తి జ్ఞానమంతా వచ్చేస్తుంది, ఇది అన్నింటికంటే సులభమైన జ్ఞానము. అయినా చివరి వరకు మాయ ద్వారా పరీక్షలు నడుస్తూనే ఉంటాయి. ఈ సమయంలో తుఫానుల మధ్యలో ఉన్నారు, పక్కాగా అయిపోయిన తర్వాత ఇన్ని తుఫాన్లు రావు, కిందపడరు. ఇక తర్వాత మీ వృక్షము ఎంతగా పెరుగుతుందో చూడండి. పేరు అయితే ప్రఖ్యాతమవ్వవలసిందే. వృక్షమైతే పెరుగుతూనే ఉంటుంది. కొద్దిగా వినాశనం జరిగితే మళ్ళీ చాలా జాగ్రత్తగా ఉంటారు. మళ్ళీ తండ్రి స్మృతిలో పూర్తిగా వేలాడుతూ ఉంటారు. సమయము చాలా తక్కువగా ఉందని భావిస్తారు. పరస్పరములో చాలా ప్రేమగా నడుచుకోండి, కన్నెర్ర చేయకండి అని తండ్రి చాలా బాగా అర్థము చేయిస్తారు. క్రోధమనే భూతము రావడంతో ముఖమే పూర్తిగా మారిపోతుంది. మీరు లక్ష్మీనారాయణుల వంటి ముఖము కలవారిగా అవ్వాలి. లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా ఉంది. చివరిలో ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు సాక్షాత్కారము జరుగుతుంది. ఏ విధంగా ప్రారంభములో సాక్షాత్కారాలు జరిగాయో, అదే విధంగా అంతిమ సమయంలో కూడా చాలా పాత్రను చూస్తారు. మీరు చాలా సంతోషంగా ఉంటారు. వేటకు మృత్యువు, వేటగాడికి వేట..... చివర్లో చాలా దృశ్యాలు చూడాలి, అప్పుడు మేము ఇలా చేశామని..... పశ్చాత్తాపపడతారు కదా. తర్వాత వారికి చాలా కఠినమైన శిక్షలు కూడా లభిస్తాయి. తండ్రి వచ్చి చదివిస్తారు, వారి పట్ల కూడా గౌరవం ఉంచకపోతే శిక్షలు లభిస్తాయి. ఎవరైతే వికారాలలోకి వెళ్తారో లేదా ఎవరైతే శివబాబాను ఎంతగానో నిందింపజేసేందుకు నిమిత్తులుగా అవుతారో, వారికి అందరికన్నా కఠినమైన శిక్షలు లభిస్తాయి. మాయ చాలా శక్తివంతమైనది. స్థాపనలో ఏమేమి జరుగుతాయి. మీరిప్పుడు దేవతలుగా అవుతారు కదా. సత్యయుగంలో అసురులు మొదలైనవారు ఉండరు. ఇది సంగమయుగము యొక్క విషయమే. ఇక్కడ వికారీ మనుష్యులు ఎంతగా దుఃఖాన్నిస్తారు, కుమారీలను కొడతారు, వివాహము తప్పకుండా చేసుకోవాలని అంటారు. వికారాల కోసం స్త్రీలను ఎంతగానో కొడతారు, ఎంతగా ఎదుర్కొంటారు. సన్యాసులు కూడా ఉండలేరు, అటువంటప్పుడు పవిత్రంగా ఉండి చూపించే వీరెవరు అని అంటారు. మున్ముందు తప్పకుండా అర్థము చేసుకుంటారు. పవిత్రత లేకుండా దేవతలుగా అవ్వలేరు. మాకు ఇంతటి ప్రాప్తి కలుగుతుంది, అందుకే వదిలేశామని మీరు అర్థం చేయిస్తారు. భగవానువాచ - కామజీతులే జగత్ జీతులు. ఇలాంటి లక్ష్మీనారాయణులుగా అవుతుంటే ఎందుకు పవిత్రముగా అవ్వరు. మళ్ళీ మాయ కూడా చాలా పడేస్తుంది. ఇది ఉన్నతమైన చదువు కదా. తండ్రి వచ్చి చదివిస్తారు - పిల్లలు, దీన్ని మంచి రీతిగా స్మరణ చేయకపోతే మళ్ళీ మాయ చెంపదెబ్బ వేస్తుంది. మాయ ఎన్నో ఆజ్ఞలను కూడా ఉల్లంఘించేలా చేస్తుంది, ఇక తర్వాత వారి పరిస్థితి ఏమవుతుంది. మాయ ఎలాంటి నిర్లక్ష్యం కలవారిగా చేస్తుందంటే, అహంకారములోకి తీసుకువస్తుందంటే ఇక అడగకండి. రాజధాని నంబరువారుగా తయారవుతుంది, మరి ఏదో ఒక కారణముతోనే అలా తయారవుతుంది కదా. ఇప్పుడు మీకు భూత, వర్తమాన, భవిష్యత్తుల జ్ఞానము లభిస్తుంది కనుక ఎంత మంచి రీతిగా ధ్యానముంచాలి. అహంకారము వచ్చిందంటే మరణించినట్లే. మాయ ఒక్కసారిగా పైసకు కొరగాకుండా చేసేస్తుంది. తండ్రి ఆజ్ఞ యొక్క ఉల్లంఘన జరిగినట్లయితే ఇక మళ్ళీ తండ్రిని స్మృతి చేయలేరు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పరస్పరములో చాలా ప్రేమగా నడుచుకోవాలి. ఎప్పుడూ క్రోధంలోకి వచ్చి ఒకరిపై ఒకరు కన్నెర్ర చేసుకోకూడదు. తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించకూడదు.

2. పాస్ విత్ ఆనర్ గా అయ్యేందుకు చదువును బుద్ధిలో ఉంచుకోవాలి. చైతన్యమైన లైట్ హౌస్ లుగా అవ్వాలి. రాత్రింబవళ్ళూ బుద్ధిలో జ్ఞానము తిరుగుతూ ఉండాలి.

వరదానము:-

సదా తమ శ్రేష్ఠ భాగ్యము యొక్క నషా మరియు సంతోషంలో ఉండే పదమాపదమ భాగ్యశాలి భవ

మొత్తం విశ్వంలో ధర్మపితలు లేక జగద్గురువులు అని ఎవరైతే పిలవబడుతూ వచ్చారో, వారెవ్వరికీ కూడా మాతా-పితల సంబంధంతో అలౌకిక జన్మ మరియు పాలన ప్రాప్తించదు. వారు అలౌకిక మాతాపితల అనుభవాన్ని స్వప్నంలో కూడా పొందలేరు మరియు పదమాపదమపతులైన, శ్రేష్ఠ ఆత్మలైన మీరు ప్రతిరోజూ మాతాపితల లేక సర్వ సంబంధీకుల ప్రియస్మృతులను తీసుకునేందుకు పాత్రులుగా ఉన్నారు. స్వయంగా సర్వశక్తివంతుడైన తండ్రి పిల్లలైన మీకు సేవకునిగా అయి ప్రతి అడుగులోనూ తోడును నిర్వర్తిస్తారు - కనుక ఈ శ్రేష్ఠ భాగ్యము యొక్క నషాలో మరియు సంతోషంలో ఉండండి.

స్లోగన్:-

తనువును మరియు మనసును సదా సంతోషంగా ఉంచుకునేందుకు సంతోషంతో కూడుకున్న సమర్థ సంకల్పాలనే చేయండి.