ఓంశాంతి. ఆత్మిక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, బ్రాహ్మణులైన మనమే ఆత్మిక తండ్రిని గుర్తిస్తామని మీకు తెలుసు. ఆత్మిక తండ్రి ఎవరినైతే గాడ్ ఫాదర్ లేక పరమపిత పరమాత్మ అని అంటారో, వారి గురించి ప్రపంచములో మనుష్యమాత్రులెవ్వరికీ తెలియదు. ఎప్పుడైతే ఆ ఆత్మిక తండ్రి వస్తారో, అప్పుడే ఆత్మిక పిల్లలకు పరిచయమునిస్తారు. ఈ జ్ఞానము సృష్టి ఆదిలోనూ ఉండదు, సృష్టి అంతిమంలో కూడా ఉండదు. ఇప్పుడు మీకు జ్ఞానము లభించింది, ఇది సృష్టి అంతిమం మరియు ఆది యొక్క సంగమయుగము. ఈ సంగమయుగము గురించే తెలియకపోతే తండ్రిని ఎలా తెలుసుకోగలరు. ఓ పతితపావనా రండి, మీరు వచ్చి పావనంగా చేయండి అని అంటారు కానీ పతితపావనుడు ఎవరు మరియు వారెప్పుడు వస్తారు అనేది తెలియదు. బాబా అంటారు - నేను ఎవరినో, ఎలా ఉంటానో, నా గురించి ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడైతే నేను వచ్చి పరిచయం ఇస్తానో, అప్పుడే నన్ను తెలుసుకుంటారు. నేను నా పరిచయాన్ని మరియు సృష్టి ఆదిమధ్యాంతాల పరిచయాన్ని సంగమయుగములో ఒక్కసారి మాత్రమే వచ్చి ఇస్తాను. కల్పము తర్వాత మళ్ళీ వస్తాను. మీకు ఏదైతే అర్థం చేయిస్తానో అది మళ్ళీ ప్రాయః లోపమైపోతుంది. సత్యయుగము నుండి మొదలుకొని కలియుగాంతము వరకు మనుష్యమాత్రులెవ్వరికీ పరమపిత పరమాత్మనైన నా గురించి తెలియదు. బ్రహ్మా-విష్ణు-శంకరులను గురించి కూడా తెలియదు. నన్ను మనుష్యులే పిలుస్తారు, బ్రహ్మా-విష్ణు-శంకరులు పిలవరు. మనుష్యులు దుఃఖితులైనప్పుడు పిలుస్తారు. సూక్ష్మవతనపు విషయమే లేదు. ఆత్మిక తండ్రి వచ్చి తమ ఆత్మిక పిల్లలకు అంటే ఆత్మలకు కూర్చుని అర్థం చేయిస్తారు. అచ్ఛా, ఆత్మిక తండ్రి పేరేమిటి? బాబా అని ఎవరినైతే అంటారో, వారికి తప్పకుండా ఏదో ఒక పేరుండాలి కదా. తప్పకుండా శివ అనే ఒక్క పేరుతోనే పాడుతారు. ఇది ప్రసిద్ధి చెందిన పేరు కానీ మనుష్యులు అనేక పేర్లను పెట్టేసారు. భక్తి మార్గంలో తమ బుద్ధితో ఈ లింగ రూపాన్ని తయారుచేశారు. అయినా శివ అన్న పేరే ఉంటుంది. తండ్రి అంటారు - నేను ఒక్కసారే వస్తాను. వచ్చి ముక్తి-జీవన్ముక్తుల వారసత్వాన్నిస్తాను. ముక్తిధామము, నిర్వాణధామము అని మనుష్యులు పేర్లు తీసుకుంటారు కానీ వారికేమీ తెలియదు. తండ్రి గురించి తెలియదు, దేవతల గురించి కూడా తెలియదు. తండ్రి భారతదేశంలో వచ్చి రాజధానిని ఎలా స్థాపన చేస్తారు అనేది ఎవ్వరికీ తెలియదు. పరమపిత పరమాత్మ వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని ఎలా స్థాపన చేస్తారు అని శాస్త్రాలలో కూడా ఇటువంటి విషయాలేవీ లేవు. అలాగని సత్యయుగంలో దేవతలకు జ్ఞానము ఉండేది, అది మాయమైపోయిందని కాదు. ఒకవేళ దేవతలలో కూడా ఈ జ్ఞానము ఉన్నట్లైతే, అది కొనసాగుతూ వచ్చేది. ఇస్లాములు, బౌద్ధులు మొదలైన వారెవరైతే ఉన్నారో వారి జ్ఞానము కొనసాగుతూ వస్తుంది. ఈ జ్ఞానము ప్రాయః లోపమైపోతుందని అందరికీ తెలుసు. నేను ఎప్పుడైతే వస్తానో, అప్పుడు ఏ ఆత్మలైతే పతితంగా అయి రాజ్యాన్ని పోగొట్టుకొని కూర్చున్నారో, వారిని మళ్ళీ పావనంగా తయారుచేస్తాను. భారతదేశంలో రాజ్యముండేది, దానినెలా పోగొట్టుకున్నారు అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. అందుకే తండ్రి అంటారు, పిల్లల బుద్ధి ఎంత తుచ్ఛ బుద్ధిగా అయిపోయింది. నేను పిల్లలకు ఈ జ్ఞానాన్ని ఇచ్చి ప్రారబ్ధాన్ని ఇస్తాను, మళ్ళీ అందరూ మర్చిపోతారు. తండ్రి ఎలా వచ్చారు, ఏ విధంగా పిల్లలకు శిక్షణనిచ్చారు అనేదంతా మర్చిపోతారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. పిల్లలకు విచార సాగర మథనము చేసేందుకు విశాలమైన బుద్ధి ఉండాలి.
తండ్రి అంటారు, ఈ శాస్త్రాలు మొదలైనవి ఏవైతే మీరు చదువుతూ వచ్చారో, వాటిని సత్యయుగ త్రేతా యుగాలలో చదివేవారు కాదు. అక్కడ అవి లేనే లేవు. ఈ జ్ఞానాన్ని మీరు మర్చిపోతారు, మరి గీత మొదలైన శాస్త్రాలు ఎక్కడ నుండి వచ్చాయి? ఎవరైతే గీతను విని ఈ పదవిని పొందారో, వారికే తెలియకపోతే మరి ఇతరులు ఎలా తెలుసుకోగలరు. తాము మనుష్యుల నుండి దేవతలుగా ఎలా అయ్యాము అనేది దేవతలు కూడా తెలుసుకోలేరు. ఆ పురుషార్థము యొక్క పాత్రయే సమాప్తమైపోయింది. మీ ప్రారబ్ధము ప్రారంభమయింది. అక్కడ ఈ జ్ఞానము ఎలా ఉండగలదు. కల్పక్రితము వలె ఈ జ్ఞానము మీకు మళ్ళీ లభిస్తుందని తండ్రి అర్థం చేయిస్తారు. మీకు రాజయోగాన్ని నేర్పించి ప్రారబ్ధాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక మళ్ళీ అక్కడ దుర్గతి ఉండదు కనుక జ్ఞానం యొక్క విషయము కూడా తలెత్తదు. జ్ఞానము సద్గతి పొందేందుకే ఉన్నది. దీనిని ఇచ్చేవారు ఒక్క తండ్రియే. సద్గతి మరియు దుర్గతి అనే పదాలు ఇక్కడ నుండే వెలువడుతాయి. భారతవాసులే సద్గతిని పొందుతారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ స్వర్గాన్ని రచించారని భావిస్తారు. ఎప్పుడు రచించారు అనేది కొంచెము కూడా తెలియదు. శాస్త్రాలలో లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. బాబా అంటారు - పిల్లలూ, మీకు మళ్ళీ జ్ఞానాన్నిస్తాను, తర్వాత ఈ జ్ఞానము సమాప్తమైపోతుంది, అప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. అర్ధకల్పము జ్ఞానము, అర్ధకల్పము భక్తి. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. సత్యయుగానికి లక్షల సంవత్సరాలు ఆయువునిచ్చేసారు. ఇక వారికి ఎలా తెలుస్తుంది. 5 వేల సంవత్సరాల నాటి విషయం కూడా మర్చిపోయారు కనుక లక్షల సంవత్సరాల విషయాన్ని ఎలా తెలుసుకోగలరు. ఏమీ అర్థము చేసుకోరు. తండ్రి ఎంత సహజంగా అర్థము చేయిస్తారు. కల్పము ఆయుష్షు 5 వేల సంవత్సరాలు. 4 యుగాలే ఉంటాయి. నాలుగింటికీ సమానంగా 1250 సంవత్సరాలు సమయం ఉంటుంది. ఇది బ్రాహ్మణుల చిన్న యుగము. ఆ 4 యుగాల కంటే ఇది చాలా చిన్నది. కనుక తండ్రి కొత్త కొత్త పాయింట్లను రకరకాల పద్ధతులతో, సహజమైన రీతిలో పిల్లలకు అర్థము చేయిస్తూ ఉంటారు. మీరు ధారణ చేయాలి. మీరు శ్రమ చేయాలి. డ్రామానుసారంగా ఏదైతే అర్థం చేయిస్తూ వచ్చానో, ఆ పాత్ర కొనసాగుతూ వస్తుంది. ఏదైతే తెలియజేసేది ఉందో, అదే ఈ రోజు తెలియజేస్తున్నాను. ఇమర్జ్ అవుతూ ఉంటుంది. మీరు వింటూ ఉంటారు. మీరే ధారణ చేయాలి మరియు చేయించాలి. నేనైతే ధారణ చేయవలసిన అవసరం లేదు. మీకు వినిపిస్తాను, ధారణ చేయిస్తాను. నా ఆత్మలో పతితులను పావనంగా తయారుచేసే పాత్ర ఉంది. కల్పక్రితము ఏదైతే అర్థము చేయించానో, అదే వెలువడుతూ ఉంటుంది. నేను ఏమి వినిపిస్తాను అనేది నాకు ముందు నుండే తెలియదు. ఇతని ఆత్మ విచార సాగర మథనము చేస్తుంది. ఇతను విచార సాగర మథనము చేసి వినిపిస్తున్నారా లేక బాబా వినిపిస్తున్నారా - ఇవి చాలా గుప్తమైన విషయాలు, ఇందులో చాలా మంచి బ్రెయిన్ కావాలి. ఎవరైతే సేవలో తత్పరులై ఉంటారో, వారికే విచార సాగర మథనము నడుస్తూ ఉంటుంది.
వాస్తవానికి కన్యలు బంధన ముక్తులుగా ఉంటారు. వారు ఈ ఆత్మిక చదువులో నిమగ్నమైపోవాలి, వారికి ఎటువంటి బంధనము లేదు. కుమారీలు దీన్ని బాగా తీసుకోవచ్చు, వారు చదువుకోవాలి మరియు చదివించాలి. వారు సంపాదించాల్సిన అవసరముండదు. కుమారీ ఒకవేళ ఈ జ్ఞానాన్ని మంచి రీతిగా అర్థము చేసుకున్నట్లైతే, అది అన్నిటికంటే మంచిది. తెలివైనవారైతే ఇక ఈ ఆత్మిక సంపాదనలో నిమగ్నమైపోతారు. చాలామంది లౌకిక చదువును ఆసక్తితో చదువుకుంటూ ఉంటారు. దాని వలన లాభమేమీ ఉండదని వారికి అర్థం చేయించడం జరుగుతుంది. మీరు ఈ ఆత్మిక చదువును చదువుకొని సేవలో నిమగ్నమవ్వండి. ఆ చదువు అయితే దేనికీ పనికి రాదు. చదువుకొని గృహస్థ వ్యవహారములోకి వెళ్ళిపోతారు. గృహస్థంలోని మాతలుగా అయిపోతారు. కన్యలైతే ఈ జ్ఞానములో నిమగ్నమైపోవాలి. అడుగడుగునా శ్రీమతముపై నడుస్తూ ధారణలో నిమగ్నమైపోవాలి. మమ్మా ప్రారంభంలోనే వచ్చారు మరియు ఈ చదువులో నిమగ్నమైపోయారు, ఎంతమంది కుమారీలు మాయమైపోయారు. కుమారీలకు మంచి అవకాశముంది. శ్రీమతంపై నడిచినట్లైతే చాలా ఫస్ట్ క్లాస్ గా అవుతారు. ఇది శ్రీమతమా లేక బ్రహ్మా మతమా - ఇందులోనే తికమక పడిపోతారు. అయినా ఇది బాబా రథము కదా. వీరి ద్వారా ఏదైనా పొరపాటు జరిగినా, మీరు శ్రీమతంపై నడుస్తూ ఉన్నట్లయితే దానిని వారంతట వారే సరి చేస్తారు. శ్రీమతము కూడా వీరి ద్వారానే లభిస్తుంది. శ్రీమతము లభిస్తుందని మీరు సదా భావించాలి, ఇక తర్వాత ఏం జరిగినా వారు స్వయం బాధ్యులు. వీరి ద్వారా ఏమైనా జరిగితే, నేను బాధ్యుడను అని బాబా అంటారు. డ్రామాలో ఈ రహస్యము రచింపబడి ఉంది. వీరిని కూడా బాగు చేయగలరు. అయినా వీరు తండ్రి కదా. బాప్ దాదా ఇరువురూ కలిసే ఉన్నారు కనుక శివబాబా చెప్తున్నారా లేక బ్రహ్మా చెప్తున్నారా అన్నది తెలియదు అని తికమక పడిపోతారు. శివబాబాయే మతమును ఇస్తున్నారని ఒకవేళ భావించినట్లైతే ఇక ఎప్పుడూ కదలరు. శివబాబా ఏదైతే అర్థం చేయిస్తారో, అది సరియైనదే. బాబా, మీరే మాకు తండ్రి, టీచర్, గురువు అని మీరంటారు. కనుక శ్రీమతంపై నడవాలి కదా. వారు ఏం చెప్తే దానిపై నడవండి. ఎల్లప్పుడూ శివబాబాయే చెప్తున్నారని భావించండి - వారు కళ్యాణకారి, వీరి బాధ్యత కూడా వారిపై ఉంది. వారి రథము కదా. ఇది బ్రహ్మా సలహానా లేక శివబాబాదా తెలియదు, అని ఎందుకు తికమకపడిపోతారు. శివబాబాయే అర్థం చేయిస్తున్నారని మీరెందుకు అర్థం చేసుకోరు. శ్రీమతము ఏం చెప్తున్నదో, అది చేస్తూ ఉండండి. ఇతరుల మతములోకి అసలు మీరెందుకు వస్తారు. శ్రీమతంపై నడిస్తే ఎప్పుడూ కునికిపాట్లు రావు. కానీ నడుచుకోలేరు, తికమకపడిపోతారు. మీరు శ్రీమతముపై నిశ్చయము పెట్టుకున్నట్లయితే నేను బాధ్యుడిని అని బాబా అంటారు. మీరు నిశ్చయమే పెట్టుకోకపోతే నేను కూడా బాధ్యుడను కాను. శ్రీమతంపై నడవాల్సిందేనని ఎల్లప్పుడూ భావించండి. వారు ఏమి చెబితే అది, ప్రేమ చేయనీ, కొట్టనీ..... అని వారి కోసమే గాయనము ఉంది. ఇందులో కాళ్ళతో తన్నడం మొదలైన విషయమేమీ లేదు. కానీ ఎవరికైనా నిశ్చయం కూర్చోవడమే చాలా కష్టము. నిశ్చయము పూర్తిగా కూర్చున్నట్లయితే కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. కానీ ఆ స్థితి రావడానికి కూడా సమయం కావాలి. అది అంతిమంలో జరుగుతుంది, ఇందులో నిశ్చయము చాలా స్థిరంగా ఉండాలి. శివబాబా ద్వారా ఎప్పుడూ ఎలాంటి తప్పులు జరగవు, వీరి ద్వారా జరగవచ్చు. ఇరువురూ కలిసే ఉన్నారు. కానీ శివబాబా అర్థం చేయిస్తున్నారు, దానిపై మనం నడుచుకోవాల్సి ఉంటుందని మీరు నిశ్చయము కూడా పెట్టుకోవాలి. కనుక బాబా శ్రీమతమని భావిస్తూ నడుచుకుంటూ ఉండండి. అప్పుడు తప్పు కూడా సరైపోతుంది. అక్కడక్కడా అపార్థాలు కూడా జరుగుతాయి. శివబాబా మరియు బ్రహ్మాబాబా మురళీని కూడా చాలా మంచి రీతిగా అర్థము చేసుకోవాలి. బాబా చెప్పారా లేక వీరు చెప్పారా. అలాగని బ్రహ్మా అసలు మాట్లాడరని కాదు. అచ్ఛా, ఈ బ్రహ్మాకు ఏమీ తెలియదు, అంతా శివబాబాయే వినిపిస్తారు అని భావించండి - అని బాబా అర్థం చేయించారు. శివబాబా రథానికి స్నానము చేయిస్తాను, శివబాబా భండారా యొక్క సేవ చేస్తాను - ఈ స్మృతి ఉన్నా కూడా చాలా మంచిది. శివబాబా స్మృతిలో ఉంటూ ఏమి చేసినా చాలామంది కంటే చురుకుగా ముందుకు వెళ్ళగలరు. శివబాబాను స్మృతి చేయడమే ముఖ్యమైన విషయము. అల్ఫ్ (భగవంతుడు) మరియు బే (వారసత్వము). మిగిలినది విస్తారము.
తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో, దానిపై అటెన్షన్ పెట్టాలి. తండ్రియే పతితపావనుడు, జ్ఞానసాగరుడు కదా. వారే వచ్చి పతిత శూద్రులను బ్రాహ్మణులుగా చేస్తారు. బ్రాహ్మణులనే పావనంగా చేస్తారు, శూద్రులను పావనంగా చేయరు, ఈ విషయాలన్నీ భాగవతము మొదలైనవాటిలో లేవు. కొన్ని కొన్ని పదాలున్నాయి. రాధా-కృష్ణులే లక్ష్మీనారాయణులని కూడా మనుష్యులకు తెలియదు. తికమకపడిపోతారు. దేవతలు ఉన్నదే సూర్యవంశీ-చంద్రవంశీయులు. లక్ష్మీనారాయణుల రాజ్యము, సీతా-రాముల రాజ్యాలుంటాయి. బాబా అంటారు - భారతవాసులైన మధురమైన పిల్లలూ, స్మృతి చేయండి, లక్షల సంవత్సరాల విషయమేమీ కాదు. ఇది నిన్నటి విషయం. మీకు రాజ్యమునిచ్చాను. లెక్కలేనంత ధనము, సంపదను ఇచ్చాను. తండ్రి మిమ్మల్ని మొత్తం విశ్వానికి యజమానులుగా చేశారు, ఇంకే ఖండాలు ఉండేవి కావు, మళ్ళీ మీకు ఏమయ్యింది! విద్వాంసులు, ఆచార్యులు, పండితులు ఎవ్వరికీ ఈ విషయాలు తెలియవు. అరే భారతవాసీయులు, మీకు రాజ్య భాగ్యాన్నిచ్చాను కదా అని తండ్రియే అంటారు. మీకు ఇంత ధనమునిచ్చాను, మీరు మళ్ళీ ఎక్కడ పోగొట్టుకున్నారని శివబాబా అంటున్నారని మీరు కూడా చెప్తారు. తండ్రి వారసత్వం ఎంత గొప్పది. తండ్రియే అడుగుతారు కదా లేక తండ్రి వెళ్ళిపోతే మిత్ర-సంబంధీకులు అడుగుతారు. తండ్రి నీకు ఇంత ధనమునిచ్చారు, అదంతా ఎక్కడ పోగొట్టుకున్నావు అని అడుగుతారు. వీరైతే అనంతమైన తండ్రి. తండ్రి గవ్వ నుండి వజ్రం వలె తయారుచేశారు. ఇంతటి రాజ్యమునిచ్చారు, మరి ఆ ధనము ఏమైపోయింది అని అడిగితే మీరు ఏం జవాబు ఇస్తారు. ఇది ఎవ్వరికీ అర్థము కాదు. ఇంతటి నిరుపేదగా ఎలా అయిపోయారని తండ్రి సరిగ్గానే అడుగుతున్నారని మీరు భావిస్తారు. మొదట అన్నీ సతోప్రధానంగా ఉండేవి, తర్వాత కళలు తగ్గుతూ వచ్చాయి, ఇక అన్నీ తగ్గిపోతూ వచ్చాయి. సత్యయుగంలోనైతే సతోప్రధానంగా ఉండేవారు, లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. రాధా-కృష్ణుల కన్నా లక్ష్మీనారాయణుల పేరు ఎక్కువగా ఉంటుంది. వారి గురించి ఎటువంటి నింద వ్రాయలేదు, మిగిలినవారందరి గురించి నిందలు వ్రాశారు. లక్ష్మీనారాయణుల రాజ్యంలో రాక్షసులు మొదలైన వారెవ్వరి గురించి చెప్పరు. ఇవి అర్థము చేసుకోవలసిన విషయాలు. తండ్రి జ్ఞాన ధనముతో జోలెను నింపుతున్నారు. తండ్రి అంటారు - పిల్లలూ, ఈ మాయతో అప్రమత్తంగా ఉండండి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తెలివైనవారిగా అయి సత్యమైన సేవలో నిమగ్నమవ్వాలి. బాధ్యుడు ఒక్క తండ్రి కనుక శ్రీమతములో సంశయము రాకూడదు. నిశ్చయంలో స్థిరంగా ఉండాలి.
2. విచార సాగర మథనము చేసి తండ్రి యొక్క ప్రతి వివరణపై అటెన్షన్ ఇవ్వాలి. స్వయం జ్ఞాన ధారణ చేసి ఇతరులకు వినిపించాలి.