16-02-20 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''
నిశ్చయ బుద్ధి గల విజయీ రత్నాల గుర్తులు ''
ఈ రోజు
బాప్దాదా తమ నిశ్చయ బుద్ధి గల విజయీ రత్నాల మాలను చూస్తున్నారు. నేను నిశ్చయంలో
పక్కాగా ఉన్నానని పిల్లలందరూ స్వయాన్ని భావిస్తున్నారు. స్వయాన్ని నిశ్చయ బుద్ధి
లేనివారిగా భావించేవారు అరుదుగా ఉంటారు. నిశ్చయముందా? అని ఎవరిని అడిగినా నిశ్చయము
లేకుంటే బ్రహ్మకుమారి, బ్రహ్మకుమారులుగా ఎలా అవుతామని అంటారు. నిశ్చయముందా? అనే
ప్రశ్నకు అందరూ ఉందనే అంటారు. అందరూ నిశ్చయ బుద్ధి గలవారే కూర్చున్నారనే అంటారు కదా!
అలా కాకపోతే నిశ్చయము కలుగుతోందని భావిస్తున్న వారు చేతులెత్తండి. అందరూ నిశ్చయ
బుద్ధి గలవారే. మంచిది. అందరికీ పక్కా నిశ్చయమున్నట్లయితే విజయమాలలో నెంబరువారిగా
ఎందుకున్నారు? నిశ్చయం విషయంలో అందరి జవాబు ఒక్కటే కదా! మరి నెంబరువారిగా
ఎందుకున్నారు? అష్టరత్నాలు ఎక్కడ,100 రత్నాలు ఎక్కడ మరియు16000 ఎక్కడ! ఇందుకు
కారణమేది? అష్టదేవుల పూజ, మహిమ మరియు16 వేల మాలకు గల పూజ, మహిమలో ఎంతటి తేడా ఉంది!
తండ్రి ఒక్కరే మరియు ఒక్కరికి చెందినవారమే అన్న నిశ్చయముంది అయితే తేడా ఎందుకు?
నిశ్చయ బుద్ధిలో పర్సంటేజి ఉంటుందా? నిశ్చయంలో పర్సంటేజ్ ఉన్నట్లయితే దానిని
నిశ్చయమని అంటారా? అష్టరత్నాలను నిశ్చయబుద్ధి గలవారని, అలాగే16 వేల మందిని కూడా
నిశ్చయ బుద్ధి గలవారనే అంటారు కదా!
నిశ్చయ బుద్ధి గలవారి గుర్తు విజయము, అందుకే నిశ్చయబుద్ధి విజయంతి అన్న గాయనముంది.
కావున నిశ్చయము అనగా విజయము ఉండనే ఉంది. ఒకసారి విజయము మరొకసారి విజయం లేకపోవడమనేది
జరగదు. పరిస్థితులు ఎలా ఉన్నా నిశ్చయ బుద్ధి గల పిల్లలు పరిస్థితులలో తమ స్వ స్థితి
శక్తితో సదా విజయులుగా అనుభవం చేస్తారు. ఎవరైతే విజయీ రత్నాలుగా అనగా విజయమాలలో
మణులుగా అయిపోయారో, కంఠహారంగా అయిపోయారో వారికి మాయతో ఎప్పుడూ ఓటమి జరగదు.
ప్రపంచంలోనివారు గాని లేక బ్రాహ్మణ పరివారములోని సంబంధ-సంపర్కాలలోని వారు గాని
వేరుగా భావించినా, వీరు ఓడిపోయారని భావించినా అది ఓటమి కాదు, విజయము. ఎందుకంటే
అక్కడక్కడా చూసేవారు లేక చేసేవారు అపార్థం చేసుకోవచ్చు కూడా. నమ్రచిత్తులుగా
నిర్మాణ చిత్తులుగా లేక హాజీ పాఠాన్ని చదువుకునే ఆత్మల పట్ల అప్పుడప్పుడు అపార్థం
చేసుకున్న కారణంగా వారి ఓటమి జరగవచ్చు కాని ఇతరులకు రూపము ఓటమిగా కనిపించినా
నిజానికి అందులో విజయమే ఉంది. కేవలం ఆ సమయంలో ఇతరులు అనడం వల్ల లేక వాయుమండలం
కారణంగా స్వయం నిశ్చయ బుద్ధి నుండి మారి సంశయ రూపంగా అవ్వరాదు. ఇది ఓటమా లేక విజయమా
అని సంశయం రాకూడదు. ఈ సంశయం ఉంచుకోకుండా తమ నిశ్చయంలో పక్కాగా ఉండాలి. ఎవరినైతే నేడు
ఇతరులు ఓటమి అని అంటారో వారే రేపు ఓ¬, ఓ¬! అని పుష్పాలు చల్లుతారు.
విజయీ ఆత్మలకు ఎప్పుడూ తమ మనస్సులో, తమ కర్మల పట్ల సందిగ్ధ స్థితి ఉండదు. నేను రైటా,
రాంగా అని ఇతరులు అనడం వేరే విషయం. ఇతరులు కొందరు రైటంటారు, కొందరు రాంగ్ అని అంటారు.
కానీ నేను విజయీ ఆత్మను అని తమ మనస్సు నిశ్చయ బుద్ధి గలదిగా ఉండాలి. తండ్రి పై
నిశ్చయంతో పాటు స్వయం పై కూడా నిశ్చయముండాలి. నిశ్చయ బుద్ధి అనగా విజయీల మనస్సు అనగా
సంకల్ప శక్తి సదా స్వచ్ఛంగా ఉన్న కారణంగా స్వయం పట్ల లేక ఇతరుల పట్ల అవునా లేక కాదా
అన్న నిర్ణయం సహజంగా మరియు సత్యంగా, స్పష్టంగా ఉంటుంది. కావున ఏమో తెలియదనే సందిగ్ధ
స్థితి ఉండదు, సత్యమైన నిర్ణయమున్న కారణంగా మనసులో కొద్దిగా కూడా సంశయముండదు. సదా
ఆనందంగా ఉంటుంది, సంతోషము యొక్క అల ఉంటుంది. ఇదే నిశ్చయ బుద్ధి విజయ రత్నాల గుర్తు.
పరిస్థితులు అగ్ని సమానంగా ఉన్నా వారి కొరకు ఆ అగ్ని పరీక్ష విజయ సంతోషాన్ని అనుభవం
చేయిస్తుంది. ఎందుకంటే పరీక్షలో వారు విజయిలుగా అయిపోతారు కదా! ఇప్పుడు కూడా లౌకిక
రీతిలో ఏ విషయములోనైనా విజయం లభిస్తే ఆ సంతోషాన్ని జరుపుకునేందుకు నవ్వుతూ, నాట్యం
చేస్తూ, చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇది సంతోషానికి గుర్తు. నిశ్చయ బుద్ధి గలవారు
ఎప్పుడూ ఏ కార్యములోనూ స్వయాన్ని ఒంటరిగా అనుభవం చేయరు. అందరూ ఒకవైపు, నేను ఒంటరిగా
ఇంకొకవైపు ఉన్నాను అని భయపడరు, మెజారిటీ వేరేవైపు ఉన్నా విజయీ రత్నము కేవలం ఒక్కరే
ఒకవైపు ఉన్నా స్వయాన్ని ఒంటరిగా కాక తండ్రి నా జతలో ఉన్నారు కావున తండ్రి ముందు
అక్షోణీలు కూడా లెక్కలేదని భావిస్తారు. ఎక్కడైతే తండ్రి ఉంటారో అక్కడ మొత్తం
ప్రపంచమంతా ఆ తండ్రిలో ఉంది. బీజమున్నట్లయితే అందులో వృక్షము ఉన్నట్లే. నిశ్చయ
బుద్ధీ విజయీ ఆత్మలు సదా స్వయాన్ని తండ్రి ఆధారము క్రింద ఉన్నామని అనుభవం చేస్తారు.
ఆధారమునిచ్చే దాత నా తోడుగా ఉన్నారని సహజంగా అనుభవం చేస్తారు. సమస్య వచ్చినప్పుడు,
బాబా! మీరు నాతో ఉన్నారు కదా, మీరే సహాయకులు కదా, ఇప్పుడిక మీరే ఉన్నారని అనడం కాదు,
వారు అవసరాన్ని బట్టి ఆధారము తీసుకోరు, మీరు ఉన్నారు కదా అని అంటారు. ఉన్నారు కదా
అని అంటున్నారంటే దాని అర్థమేమి? అందులో నిశ్చయముందా? మీరే ఆధారమని తండ్రికి కూడా
గుర్తు చేయిస్తారు. నిశ్చయ బుద్ధి గలవారు ఎప్పుడూ ఇటువంటి సంకల్పము చేయజాలరు. వారి
మనస్సులో కొద్దిగా కూడా నిరాధారత లేక ఒంటరితనము సంకల్పమాత్రంగా కూడా అనుభవమవ్వదు.
నిశ్చయ బుద్ధి గలవారు విజయులుగా ఉన్న కారణంగా సదా సంతోషములో నాట్యం చేస్తూ ఉంటారు.
ఎప్పుడూ ఉదాసీనత లేక అల్పకాలిక హద్దు వైరాగ్యపు అలలోకి కూడా వారు రారు. అనేకసార్లు
మాయతో తీవ్రమైన యుద్ధం జరిగినప్పుడు అల్పకాలికమైన వైరాగ్యము కూడా కలుగుతుంది. కానీ
అది హద్దులోని అల్పకాలికమైన వైరాగ్యంగా ఉంటుంది, అది సదాకాలికమైన బేహద్ వైరాగ్యంగా
ఉండదు. ఏదో తప్పనిసరి పరిస్థితులలో వైరాగ్య వృత్తి ఉత్పన్నమవుతుంది. అందువలన ఆ
సమయంలో దీని కంటే దీనిని వదిలేయడమే మంచిది, నాకు వైరాగ్యమొచ్చేసింది, సేవను కూడా
వదిలేయాలి, ఇది కూడా వదిలేయాలని భావిస్తారు. వైరాగ్యము కలుగుతుంది కాని అది
అనంతమైన(బేహద్) వైరాగ్యము కాదు. విజయీ రత్నాలు సదా ఓటమిలో కూడా విజయాన్ని, విజయంలో
కూడా విజయాన్ని అనుభవం చేస్తారు. హద్దులోని వైరాగ్యాన్ని పక్కకు తప్పుకోవడమని అంటారు.
పేరుకు వైరాగ్యమని అంటారు, కాని నిజానికి పక్కకు తప్పుకుంటారు. కావున విజయీ రత్నాలు
ఏ కార్యముతో గాని, సమస్యతో గాని, వ్యక్తుల నుండి గాని పక్కకు తప్పుకోరు. కాని అన్ని
పనులు చేస్తూ, ఎదుర్కుంటూ, సహయోగులుగా అవుతూ బేహద్ వైరాగ్య వృత్తిలో ఉంటారు. అది
సదాకాలికమైనది. నిశ్చయబుద్ధి గల విజయిలు ఎప్పుడూ తమ విజయాన్ని వర్ణించరు. ఇతరులకు
ఫిర్యాదు చేయరు. చూడండి నేను రైటే కదా అని ఫిర్యాదు చేయడం లేక వర్ణన చేయడం
ఖాళీతనానికి గుర్తు. ఖాళీగా ఉన్న వస్తువు ఎక్కువగా ఎగురుతుంది(కదులుతుంది) కదా! ఎంత
నిండుగా ఉంటుందో, అంత కదలకుండా ఉంటుంది. విజయిలు సదా ఇతరుల ధైర్యాన్ని కూడా
పెంచుతారు. తక్కువగా చూపించే ప్రయత్నము చేయరు. ఎందుకంటే విజయీ రత్నాలు తండ్రి సమానం
మాస్టర్ ఆధారదాతలు. క్రింద నుండి పైకి ఎత్తేవారు. నిశ్చయ బుద్ధి గలవారు వ్యర్థం
నుండి సదా దూరంగా ఉంటారు. అవి వ్యర్థ సంకల్పాలు కావచ్చు, మాటలు కావచ్చు, కర్మలు
కావచ్చు. వ్యర్థం నుండి అతీతంగా ఉంటారు అనగా విజయులుగా ఉంటారు. వ్యర్థం కారణంగానే
ఒకసారి గెలుపు, మరొకసారి ఓటమి లభిస్తుంది. వ్యర్థము సమాప్తమైతే ఓటమి సమాప్తమవుతుంది.
వ్యర్థము సమాప్తమవ్వడం విజయీ రత్నాల గుర్తు. నిశ్చయ బుద్ధి విజయీ రత్నాల గుర్తులు
అనుభవం అవుతున్నాయా అని ఇప్పుడు చెక్ చేసుకోండి. నిశ్చయ బుద్ధి గలవారిగానే ఉన్నారు,
సత్యమే చెప్తున్నారని వినిపించాము కదా! కాని నిశ్చయ బుద్ధిగా అవ్వడంలో ఒకటేమో
తెలుసుకోవడం వరకు, ఒప్పుకోవడం వరకు, రెండవది నడుచుకోవడం వరకు. భగవంతుడు లభించారు,
భగవంతునికి చెందినవారిగా అయిపోయాము అనైతే అందరూ భావిస్తారు. ఒప్పుకోవడం లేక
తెలుసుకోవడం ఒక్కటే కానీ అలా నడుచుకోవడంలో నెంబర్వారిగా అయిపోతారు. తెలుసుకుంటారు
ఇది సరైనదేనని ఒప్పుకుంటారు, కానీ మూడవ స్థితి అంగీకరించి, తెలుసుకొని ఆ విధంగా
నడుచుకోవడం. ప్రతి అడుగులోనూ నిశ్చయములో మరియు విజయములో ప్రత్యక్షతా గుర్తులు
కనిపించాలి. ఇందులో తేడా ఉంది. అందకే నెంబరువారిగా అయిపోయారు. నెంబరువారిగా
ఎందుకైపోయారో అర్థం చేసుకున్నారా!
దీనినే నిర్మోహులుగా అవ్వడమని అంటారు. నిర్మోహులుగా అయ్యే పరిభాష చాలా గుహ్యమైనది.
దాన్ని ఇంకెప్పుడైనా వినిపిద్దాం. నిశ్చయబుద్ధి నిర్మోహులుగా అయ్యేందుకు నిచ్చెన
వంటిది (మెట్ల వంటిది). మంచిది, ఈ రోజు వేరే గ్రూపువారు వచ్చారు. ఇంట్లోని పిల్లలే
ఇంటికి యజమానులు. కనున ఈ ఇంటి యజమానులు తమ ఇంటికి వచ్చారనే అంటాము కదా! ఇంటికి
వచ్చారా లేక ఇంటి నుండి వచ్చారా? ఒకవేళ దానిని మీ ఇల్లుగా భావించినట్లయితే మమకారము
అటువైపుకు వెళ్తంది కాని అది అల్పకాలికమైన సేవాస్థానము. ఇల్లు అయితే అందరిది మధువనమే
కదా! ఆత్మల సంబంధంతో చూస్తే ఇల్లు అంటే పరంధామము, బ్రాహ్మణుల సంబంధంతో చూస్తే
మధువనమే ఇల్లు. హెడ్ ఆఫీస్ మౌంట్ ఆబూ అని అన్నప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారో అది
ఏమవుతుంది? అది మీ ఆఫీసే కదా! కావుననే దానిని హెడ్ ఆఫీస్ అని అంటారు కావున మీ ఇంటి
నుండి రాలేదు, మీ ఇంట్లోకి వచ్చారు. ఆఫీస్ నుండి ఎప్పుడైనా ఎవరినైనా మార్చవచ్చు కాని
ఇంటి నుండి మార్చలేరు. ఆఫీస్నయితే మార్చవచ్చు. ఇల్లుగా భావించినట్లయితే నాది అనేది
వస్తుంది. సెంటర్ను కూడా ఇల్లుగా చేసేసుకుంటారు, కావున నాది అనేది వస్తుంది. దాన్ని
కేవలం సెంటరుగా భావించినట్లయితే నాది అనేది ఉండదు. అది ఇల్లుగా అయిపోతే, విశ్రాంతి
స్థానంగా అయిపోతే నాది అనేది ఉంటుంది. కావున మీరు మీ ఇంటి నుండి వచ్చారు. మన ఇల్లు
దాత యొక్క ఇల్లు అన్న నానుడి ఏదైతే ఉందో అది ఏ స్థానానికి సంబంధించిన గాయనము?
నిజమైన దాత ద్వారము మన ఇల్లు మధువనమే కదా! మీ ఇంట్లోకి అనగా దాత ఇంట్లోకి వచ్చారు.
ఇల్లు అనండి, ద్వారమనండి విషయమొక్కటే. ఇంట్లోకి వచ్చారు, వస్తూనే విశ్రాంతి
లభిస్తుంది కదా, మనస్సుకు విశ్రాంతి, తనువుకు కూడా విశ్రాంతి, ధనానికీ విశ్రాంతి
లభిస్తుంది. ఇక్కడకు వచ్చాక ధనం సంపాదించేందుకు వెళ్లే పని ఉండదు! తినే ముందు వంట
వండడం నుండి కూడా విశ్రాంతి. పళ్లెంలో తయారైన భోజనం రెడీగా లభిస్తుంది. ఇక్కడైతే
దేవతా మూర్తులుగా అవుతారు. దేవతల మందిరంలో గంటలు మోగిస్తారు కదా! తనను లేపాలన్నా
పడుకోబెట్టాలన్నా గంటలు మ్రోగుతాయి. నివేదన జరిపినప్పుడు కూడా గంటలు మోగిస్తారు. అలా
మీ కోసం కూడా గంట మ్రోగుతుంది కదా! ఈ రోజుల్లో ఫ్యాషనబుల్గా ఉన్నారు కనుక రికార్డు
మ్రోగిస్తున్నారు. మీరు రికార్డు వింటూ పడుకుంటున్నారు మళ్లీ రికార్డుతో లేస్తారు
కావున ఠాకూర్గా అయిపోయినట్లే కదా! ఇక్కడిదే మళ్లీ భక్తిమార్గంలో కాపీ చేస్తారు.
ఇక్కడ కూడా 3-4 సార్లు భోగ్ పెడ్తారు కదా! చైతన్యమైన ఠాకూర్లకు 4 గంటల నుండే భోగ్
పెట్టడం మొదలవుతుంది. అమృతవేళ నుండే భోగ్ ప్రారమభమవుతుంది. చైతన్య స్వరూపంలో
భగవంతుడు పిల్లలకు సేవ చేస్తున్నారు. భగవంతుని సేవనైతే అందరూ చేస్తారు కానీ ఇక్కడ
భగవంతుడే సేవ చేస్తాడు. ఎవరి సేవ చేస్తారు? చైతన్య మూర్తులకు. ఈ నిశ్చయము సదా
సంతోషములో ఊయలలూపుతూ ఉంటుంది. అర్థమయిందా! అన్ని జోన్లవారూ ప్రియమైనవారే. ఏ జోన్వారు
వచ్చినా వారు అపురూపమైనవారే. మీరందరూ ప్రియమైనవారే కానీ కేవలం తండ్రికి
ప్రియమైనవారిగా అవ్వండి. మాయకు ప్రియమైనవారిగా అయితే ఎన్నో గారాబాలకు పోతారు.
ఇక్కడకు వచ్చిన మీరంతా భాగ్యవంతులు. భగవంతుని వద్దకు వచ్చారు. మంచిది.
సదా పత్రి సంకల్పంలో నిశ్చయ బుద్ధి విజయీ రత్నాలకు, సదా భగవంతుడు మరియు భాగ్యం
యొక్క స్మృతి స్వరూపులైన ఆత్మలకు, సదా ఓటమి మరియు గెలుపు రెండింటిలోను విజయాన్ని
అనుభవం చేసుకునేవారికి, సదా ఆధారమును అనగా సహయోగమును ఇచ్చే మాస్టర్ ఆధారదాతలైన
ఆత్మలకు, సదా స్వయాన్ని తండి తోడును అనుభం చేసుకునే శేష్ఠ్రఆత్మలకు బాప్దాదా
పియ్రస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో
అవ్యక్త బాప్దాదా మిలనము :-
1.
అందరూ ఒకే లగ్నంలో మగ్నమై ఉండే శ్రేష్ఠ ఆత్మలేనా? సాధారణమైనవారైతే కారు కదా! సదా
శ్రేష్ఠ ఆత్మలు ఏ కర్మ చేసినా అది శ్రేష్ఠంగానే ఉంటుంది. జన్మయే శ్రేష్ఠంగా
ఉన్నప్పుడు కర్మ సాధారణంగా ఎలా ఉండగలదు. జన్మ మారినప్పుడు కర్మ కూడా మారుతుంది. నామ,
రూప, దేశ, కర్మలు అన్నీ మారిపోతాయి. కావున సదా కొత్త జన్మ మరియు కొత్త జన్మల నవీనతతో
ఉల్లాస-ఉత్సాహాలలో ఉంటారు. అప్పుడప్పుడు ఉల్లాస-ఉత్సాహాలలో ఉండేవారికి రాజ్యం కూడా
అప్పుడప్పుడు మాత్రమే లభిస్తుంది.
నిమిత్తంగా ఉన్న ఆత్మలెవరైతే ఉన్నారో వారికి నిమిత్తంగా అయినందుకు ఫలము లభిస్తూ
ఉంటుంది, ఆ ఫలమును భుజించే ఆత్మలు శక్తిశాలిగా ఉంటారు. ఇది ప్రత్యక్ష ఫలము. శ్రేష్ఠ
యుగానికి ఫలము. ఈ ఫలమును భుజించేవారు సదా శక్తిశాలిగా ఉంటారు. ఇటువంటి శక్తిశాలి
ఆత్మలు పరిస్థితుల పై సహజంగానే విజయాన్ని పొందుతారు. పరిస్థితులు క్రింద ఉంటాయి,
వారు పైన ఉంటారు. ఉదాహరణానికి శ్రీ కృష్ణుడు సర్పమును కూడా జయించినట్లుగా చూపిస్తారు.
దాని తల పై పాదం మోపి నాట్యం చేసినట్లుగా చూపిస్తారు. కావున ఇది మీ చిత్రమే. ఎంత
విషపూరితమైన సర్పమైనా మీరు దాని పై కూడా విజయం పొంది నాట్యం చేసేవారు. ఈ శ్రేష్ఠ
శక్తిశాలి స్మృతియే అందరినీ సమర్థులుగా చేసేస్తుంది. అంతేకాక ఎక్కడైతే సమర్థత
ఉంటుందో అక్కడ వ్యర్థము సమాప్తమైపోతుంది. సమర్థుడైన తండ్రి తోడుగా ఉన్నాడు. ఇదే
స్మృతి యొక్క వరదానము ద్వారా సదా ముందుకు సాగుతూ ఉండండి.
2. అందరూ అమరుడైన తండ్రి యొక్క అమరులైన ఆత్మలే కదా! అమరులుగా అయిపోయారు కదా!
శరీరాలను వదిలినా అమరులే. ఎందుకు? ఎందుకంటే భాగ్యాన్ని తయారు చేసుకుని వెళ్తారు.
ఖాళీ చేతులతో వెళ్లరు. కావున మరణించడం కాదు, నిండుగా అయి వెళ్లడం. మరణించడం అనగా
ఖాళీ చేతులతో వెళ్లడం. నిండుగా అయి వెళ్లడం అనగా వస్త్రాన్ని మార్చుకోవడం. కావున
మీరు అమరులుగా అయిపోయారు కదా! 'అమరభవ' అన్న వరదానము లభించింది. ఇందులో మృత్యువుకు
వశీభూతులవ్వరు. వెళ్లాలి, మళ్లీ రావాలి అని కూడా తెలుసు. అందుకే మీరు అమరులు.
అమరకథను వింటూ, వింటూ అమరులుగా అయిపోయారు. ప్రతిరోజూ ప్రేమతో కథను వింటారు కదా!
తండ్రి అమరకథను వినిపించి, అమరభవ అను వరదానమును ఇస్తారు. ఇప్పుడిక మేము అమరులుగా
అయిపోయాము సుసంపన్నంగా అయిపోయాము అన్న సంతోషములోనే సదా ఉండండి. ఖాళీగా ఉండేవారము,
ఇప్పుడు నిండుగా అయిపోయాము. ఎంత నిండుగా అయిపోయారంటే ఇక అనేక జన్మల వరకు ఖాళీగా
అవ్వరు.
3. అందరూ స్మృతియాత్రలో ముందుకు వెళ్తున్నారు కదా! ఈ ఆధ్యాత్మిక యాత్ర సదా సుఖము
కలిగించేదిగా అనుభవం చేయిస్తుంది. ఈ యాత్ర ద్వారా సదా కొరకు సర్వ యాత్రలు పూర్తి
అవుతాయి. ఆత్మిక యాత్రను చేసినట్లయితే ఇక అన్ని యాత్రలు పూర్తయిపోతాయి. ఇంకే యాత్రను
చేయవలసిన అవసరముండదు. ఎందుకంటే ఇది మ¬న్నతమైన యాత్ర కదా! ఈ మా¬న్నతమైన యాత్రలో అన్ని
యాత్రలు ఇమిడి ఉన్నాయి. ఇంతకు ముందు యాత్రలలో భ్రమించేవారు, ఇప్పుడిక ఈ ఆత్మికయాత్ర
ద్వారా గమ్యం వరకు చేరుకున్నారు. ఇప్పుడు మనసుకు కూడా స్థిరమైన స్థానం లభించింది.
శరీరానికి కూడా స్థానం లభించింది. ఒకే యాత్ర ద్వారా అనేక రకాల భ్రమించడం
సమాప్తమైపోయింది. కావున సదా ఆత్మిక యాత్రికులము అన్న స్మృతిలో ఉండండి. దీని ద్వారా
సదా అతీతంగా ఉంటారు, భిన్నంగా ఉంటారు, నిర్మోహులుగా ఉంటారు. ఎవ్వరిలోనూ మోహం ఉండదు.
యాత్రికులకు ఎవ్వరి పైనా మోహం ఉండదు. ఇటువంటి స్థితి సదా ఉండాలి.
వీడ్కోలు
సమయంలో :-
బాప్దాదా దేశ-విదేశాలలోని పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు. ఎందుకంటే అందరూ
సహయోగీ పిల్లలు. సహయోగీ పిల్లలను బాప్దాదా సదా హృదయ సింహాసనాధికారులుగా భావిస్తూ
స్మృతి చేస్తున్నారు. నిశ్చయ బుద్ధి గల ఆత్మలందరూ బాప్దాదాకు ప్రియమైనవారే. ఎందుకంటే
అందరూ కంఠహారంగా అయిపోయారు. మంచిది. పిల్లలందరూ సేవలో బాగా వృద్ధిని ప్రాప్తి
చేయిస్తున్నారు. బాగుంది.
వరదానము:-
'' సత్యమైన
సేవ ద్వారా అవినాశి, అలౌకిక సంతోషాల సాగరంలో తేలియాడే భాగ్యశాలి ఆత్మ భవ''
ఏ పిల్లలైతే సేవలో బాప్దాదా మరియు
నిమిత్తమైన పెద్దల స్నేహమనే ఆశీర్వాదాలను పొందుతారో వారికి లోపల నుండి అలౌకిక,
ఆత్మిక సంతోషము అనుభవమవుతుంది. వారు సేవల ద్వారా ఆంతరిక సంతోషము, ఆత్మిక ఆనందము,
అనంతమైన ప్రాప్తిని అనుభవం చేస్తూ సదా సంతోష సాగరంలో తేలియాడుతూ ఉంటారు. సత్యమైన
సేవ సర్వుల స్నేహము, సర్వుల అవినాశి గౌరవము మరియు సంతోషాల ఆశీర్వాదాలను
ప్రాప్తించుకునే అదృష్టము యొక్క శ్రేష్ఠ భాగ్యాన్ని అనుభవం చేయిస్తుంది. ఎవరైతే సదా
సంతోషంగా ఉంటారో వారే భాగ్యశాలురు.
స్లోగన్:-
'' సదా
హర్షితంగా మరియు ఆకర్షణ మూర్తులుగా అయ్యేందుకు సంతుష్టమణులుగా అవ్వండి ''