30-03-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - మీ ముఖము సదా సంతోషంతో వెలిగిపోతూ ఉండాలి, మమ్ములను స్వయము భగవంతుడే చదివిస్తున్నారనే సంతోషము మీ ముఖము పై ప్రకాశిస్తూ ఉండాలి"

ప్రశ్న:-

ఇప్పుడు పిల్లలైన మీ ముఖ్య పురుషార్థము ఏది?

జవాబు:-

మీరు శిక్షల నుండి విడుదల అయ్యేందుకే పురుషార్థము చేస్తూ ఉంటారు. అందుకు ముఖ్యమైనది స్మృతియాత్ర. ఈ యాత్ర ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. మీరు ప్రేమతో స్మృతి చేస్తే చాలా సంపాదన జమ అవుతూ ఉంటుంది. అమృతవేళనే లేచి స్మృతి చేస్తూ కూర్చుంటే పాత ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటారు. జ్ఞాన విషయాలు బుద్ధిలో వస్తూ ఉంటాయి.

పిల్లలైన మీరు నోటి నుండి ఎలాంటి వ్యర్థ మాటలు మాట్లాడకూడదు.

పాట:- మిమ్ములను పొంది మేము... (తుమ్ హే పాకే హమ్ నే...)

ఓంశాంతి. పాట విన్నప్పుడు కొంతమంది బాగా అర్థము చేసుకుంటారు మరియు ఆ సంతోషము కూడా పెరుగుతుంది. భగవంతుడు మమ్ములను చదివించి విశ్వ చక్రవర్తి పదవిని ఇస్తారు. కానీ ఇంత సంతోషము ఎవరో కొంతమందికి మాత్రమే అరుదుగా ఉంటుంది. ఈ స్మృతి స్థిరంగా నిలువదు. మేము తండ్రికి చెందిన వారిగా అయ్యాము, ఆ తండ్రి మమ్ములను చదివిస్తున్నారని, చాలా మందికి నషా ఎక్కదు. సత్సంగాలు మొదలైన వాటిలో కథలు వినేవారికి కూడా సంతోషము కలుగుతుంది. ఇక్కడ తండ్రి ఎంతో మంచి మంచి విషయాలు వినిపిస్తున్నారు. బాబా చదివించిన తర్వాత విశ్వాధికారులుగా తయారుచేస్తున్నప్పుడు విద్యార్థులకు ఎంత సంతోషముండాలి. ఆ భౌతిక చదువు చదివేవారికి ఎంత సంతోషముంటుందో అంత సంతోషము ఇక్కడి వారికి లేదు. బుద్ధిలో కూర్చోనే కూర్చోదు. ఇటువంటి పాటలు 4-5 సార్లు వినమని తండ్రి అర్థం చేయించారు. తండ్రిని మర్చిపోయినందుకు పాత ప్రపంచము, పాత సంబంధాలు కూడా గుర్తుకొస్తాయి. అటువంటి సమయములో పాటలు విన్నాసరే తండ్రి స్మృతి వచ్చేస్తుంది. తండ్రి అని అంటూనే వారసత్వము కూడా గుర్తుకొస్తుంది. చదువు ద్వారా వారసత్వము లభిస్తుంది. మీరు శివబాబా ద్వారా విశ్వానికి అధికారులుగా అయ్యేందుకు చదువుతున్నారు. అంతకంటే ఇంకేమి కావాలి. విద్యార్థులలో ఇటువంటి సంతోషము ఎంతగానో ఉండాలి. రాత్రింబవళ్ళు నిద్ర కూడా పట్టకూడదు. ముఖ్యంగా నిద్రను త్యాగము చేసి మరీ ఇటువంటి తండ్రిని, టీచరును నషాతో స్మృతి చేస్తూ ఉండాలి, వారొక్కరిలోనే లీనమైనట్లు ఉండాలి. "ఓహో, మాకు తండ్రి ద్వారా విశ్వచక్రవర్తి పదవి లభిస్తుంది". కానీ మాయ స్మృతి చేయనివ్వదు. బంధు-మిత్రులు మొదలైనవారి స్మృతి వస్తూ ఉంటుంది. వారి చింతననే కలుగుతూ ఉంటుంది. పాతదై పడైపోయిన మురికి ప్రపంచము చాలా మందికి గుర్తుకొస్తుంది. విశ్వానికి చక్రవర్తిగా అవుతారని తండ్రి తెలిపిన దానికి నషా పెరగదు. పాఠశాలలో చదివే వారి ముఖాలు చాలా ఆనందంగా ఉంటాయి. ఇక్కడ స్వయం భగవంతుడే చదివిస్తున్నారు. ఈ సంతోషము కొంతమందికి మాత్రమే అరుదుగా ఉంటుంది. లేదంటే సంతోషపు పాదరసం చాలా పైకి ఎక్కి ఉండాలి. అనంతమైన తండ్రి స్వయంగా చదివిస్తున్నారని మర్చిపోతారు. ఇది గుర్తున్నా సంతోషము ఉంటుంది. కాని గతం యొక్క కర్మభోగము ఎలా ఉందంటే తండ్రిని స్మృతి చేయనివ్వదు. మళ్లీ ముఖము వ్యర్థం వైపుకే వెళ్తుంది. అందరూ ఇలా ఉంటారని బాబా అనరు. నంబరువారిగా ఉన్నారు. తండ్రి స్మృతిలో ఉండేవారు మహాసౌభాగ్యశాలురు. స్వయం భగవంతుడే మమ్ములను చదివిస్తున్నారు. ఆ చదువులో ఫలానా టీచరు మమ్ములను బ్యారిష్టరుగా చేస్తున్నారని ఎలా అనుకుంటారో, ఇక్కడ కూడా స్వయం భగవంతుడు మమ్ములను భగవాన్ - భగవతిగా తయారుచేయడానికి చదివిస్తున్నారంటే ఎంత నషా ఉండాలి! వినే సమయంలో కొంతమందికి నషా ఎక్కుతుంది. మిగిలిన వారు అర్థమే చేసుకోరు. గురువును ఆశ్రయిస్తూనే వీరు తమ వెంట తీసుకెళ్తారని భావిస్తారు, భగవంతునితో కలుపుతారని నమ్ముతారు. కానీ ఇక్కడ స్వయం భగవంతుడే మీతో కలిసి తమతో పాటు తీసుకెళ్తారు. భగవంతుని వద్దకు తీసుకెళ్లేందుకు లేక శాంతిధామానికి తీసుకెళ్లేందుకు మానవులు గురువులను ఆశ్రయిస్తారు. ఈ తండ్రి సన్ముఖములో కూర్చొని మీరు విద్యార్థులు, చదివించే టీచరును స్మృతి చేయండి అని ఎంతగా అర్థం చేయిస్తున్నారు. ఇంతగా చెప్తున్నా ఏ మాత్రమూ స్మృతి చేయరు. మంచి మంచి పిల్లలు కూడా స్మృతి చేయరు. శివబాబా మమ్ములను చదివిస్తున్నారు, వారు జ్ఞానసాగరులు. మాకు వారసత్వమునిస్తారు - ఇది గుర్తున్నా సంతోషపు పాదరసం ఎక్కి ఉంటుంది. తండ్రి సన్ముఖములో అర్థం చేయిస్తున్నా ఆ నషా ఎక్కదు. బుద్ధి అనేక వైపులకు వెళ్ళిపోతుంది. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయని తండ్రి చెప్తున్నారు. బాబా గ్యారంటీ కూడా ఇస్తున్నారు. ఒక్క తండ్రిని తప్ప ఇతరులెవ్వరినీ స్మృతి చేయకండి. వినాశనమయ్యే వస్తువును ఎందుకు స్మృతి చేయాలి? ఇక్కడ ఎవరైనా మరణిస్తే 2-4సంవత్సరాల వరకు కూడా వారిని స్మృతి చేస్తూ ఉంటారు. వారిని మహిమ చేస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి సన్ముఖములో కూర్చొని పిల్లలకు - నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు. ఎవరు ఎంత ప్రేమగా స్మృతి చేస్తారో, అంతగా వారి పాపాలు కట్ అవుతూ ఉంటాయి. చాలా సంపాదన జరుగుతుంది. అమృతవేళ లేచి తండ్రిని స్మృతి చేయండి. భక్తిమార్గములో కూడా మనుష్యులు అమృతవేళలోనే నిదురలేచి భక్తి చేస్తారు. మీరు జ్ఞానవంతులు, పాత ప్రపంచపు వ్యర్థములో మీరు చిక్కుకుపోకూడదు. కానీ ఆ మురికిలో చాలా మంది పిల్లలు ఎంత చిక్కుకుంటారో ఇక చెప్పలేము. ఆ మురికి నుండి బయటకు రానే రారు. రోజంతా వ్యర్థమే మాట్లాడుతూ ఉంటారు. జ్ఞానానికి సంబంధించిన విషయాలు బుద్ధిలోకి రానే రావు. కొంతమంది పిల్లలు రోజంతా సేవ కొరకు పరుగులు తీస్తూ ఉంటారు. బాబా సేవ చేస్తే, బాబా కూడా గుర్తిస్తారు. ఈ సమయంలో అందరికంటే ఎక్కువగా సేవలో తత్పరమైనవారు మనోహర్ దాది. ఈ రోజు కర్నాల్ కు వెళ్లారు, రేపు మరొక చోటకి వెళ్తారు. ఈ విధంగా సేవ కొరకు పరుగులు తీస్తూ ఉంటారు. పరస్పరము కొట్లాడుకునే వారు సర్వీసు ఏం చేయగలరు? తండ్రికి ప్రియమైన వారు ఎవరు? బాగా సేవ చేసేవారు తండ్రికి అత్యంత ప్రియమైన వారు. రాత్రింబవళ్లు సేవ చేయాలనే చింత ఉంటుంది. తండ్రి హృదయమును కూడా వారే అధిరోహిస్తారు. పదే పదే ఇటువంటి పాటలు వింటున్నా స్మృతి కలుగుతుంది, నషా పెరుగుతుంది. ఎప్పుడైనా ఉదాసీనంగా ఉన్నట్లయితే పాటల రికార్డు వినిపిస్తూనే సంతోషము కలుగుతుంది, ఓహో! మేము విశ్వానికి యజమానులుగా అవుతాము. బాబా కేవలం నన్ను స్మృతి చేయండి అని మాత్రమే చెప్తున్నారు. ఇది చాలా సులభమైన చదువు. బాబా 10-12 మంచి మంచి పాటలు సెలెక్ట్ చేశారు. ఇవి అందరి వద్దా ఉండాలి. కానీ మర్చిపోతారు. మరి కొంత మంది నడుస్తూ నడుస్తూ చదువునే వదిలేస్తారు. మాయ దాడి చేస్తుంది. తమోప్రధాన బుద్ధిని సతో ప్రధానంగా చేసేందుకు బాబా ఎంతో సహజమైన యుక్తులు తెలుపుతున్నారు. ఇప్పుడు మీకు తప్పొప్పులు తెలుసుకునే బుద్ధి లభించింది. "ఓ పతితపావనా! రండి” అని తండ్రిని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు బాబా వచ్చారు. కనుక పావనంగా అవ్వాలి కదా. మీ తలపై జన్మ జన్మాంతరాల భారము చాలా ఉంది. ఎంత ఎక్కువగా స్మృతి చేస్తే అంత పవిత్రంగా అవుతారు, అంతేకాక సంతోషము కూడా ఉంటుంది. సేవ చేయడమే కాక తమ ఖాతాను కూడా చూసుకుంటూ ఉండాలి - ఎంత సమయము తండ్రిని స్మృతి చేస్తున్నాను? స్మృతి చార్టును ఎవ్వరూ పెట్టలేకపోతున్నారు. పాయింట్లు వ్రాస్తారు కానీ స్మృతిని మర్చిపోతారు. తండ్రి చెప్తున్నారు, మీరు స్మృతిలో ఉండి భాషణ చేసినట్లయితే, మీకు చాలా శక్తి లభిస్తుంది. లేకపోతే నేనే వెళ్ళి చాలా మందికి సహాయము చేస్తానని బాబా చెప్తున్నారు. కొంతమందిలో ప్రవేశించి నేనే వెళ్లి సేవ చేస్తాను. సేవ అయితే చేయాల్సిందే. ఎవరి భాగ్యమైనా తయారయ్యేందుకు, ఒకవేళ సేవ చేసేవారిలో తెలివి లేకుంటే నేనే ప్రవేశించి సేవ చేస్తాను. అందుకే కొంతమంది బాబాయే ఈ సేవ చేయించారని వ్రాస్తూ ఉంటారు. నాకు అంత శక్తి లేదు, బాబానే మురళి నడిపించారు అని అంటారు. కానీ కొంతమంది అహంకారంలోకి వచ్చి నేను ఇంత బాగా అర్థం చేయించాను అని అంటూ ఉంటారు. బాబా అంటారు, కళ్యాణము చేసేందుకు నేను ప్రవేశిస్తాను, ఇక తర్వాత వారు బ్రాహ్మణికంటే కూడా తెలివైనవారిగా అయిపోతారు. అంత తెలివిలేని వారిని ఎవరినైనా పంపితే, వీరి కంటే నేనే బాగా అర్థం చేయించగలను అని వారు అనుకుంటారు. వీరిలో గుణాలు కూడా లేవు. వీరి కంటే మా స్థితే బాగుంది అని కూడా అనుకుంటారు. కొంతమంది హెడ్ గా అయ్యి ఉంటే చాలా నషా ఎక్కిపోతుంది. చాలా ఆడంబరముగా ఉంటారు. పెద్ద వ్యక్తులతో కూడా నువ్వు - నువ్వు అంటూ మాట్లాడ్తారు. వారిని దేవి-దేవత అని అనేటప్పటికి అందులోనే సంతోషపడిపోతారు. ఇటువంటి వారు కూడా చాలా మంది ఉంటారు. టీచర్ల కంటే కూడా విద్యార్థులు చాలా తెలివిగలవారిగా అవుతారు. పరీక్ష పాస్ అయింది ఒక్క బాబాయే. వారు జ్ఞానసాగరులు, వారి ద్వారా మీరు చదువుకుని చదివిస్తారు. కొంతమంది చాలా బాగా ధారణ చేస్తారు. కొంతమంది మర్చిపోతారు. అన్నింటికంటే ముఖ్యమైనది స్మృతియాత్ర. మన వికర్మలు ఎలా వినాశనమవ్వాలి? చాలా మంది పిల్లలు ఎటువంటి నడవడిక నడుచుకుంటున్నారంటే కేవలం ఈ బాబాకు మరియు ఆ బాబాకు మాత్రమే అది తెలుసు.

ఇప్పుడు పిల్లలైన మీరు శిక్షల నుండి ముక్తులుగా అయ్యే పురుషార్థమే ముఖ్యంగా చేయాలి. దాని కొరకు ముఖ్యమైనది స్మృతియాత్ర. దాని ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. కొంతమంది ధన సహాయము చేసి, మేము ధనవంతులమవుతామని భావిస్తారు. కానీ శిక్షల నుండి రక్షించుకునేందుకు పురుషార్థము చేయాలి. అలా చేయకపోతే, బాబా ముందు శిక్షలు అనుభవించవలసి వస్తుంది. ఎవరైనా జడ్జి కుమారుడు అటువంటి పనులు చేస్తే జడ్జికి కూడా సిగ్గుగా అనిపిస్తుంది కదా. అలాగే ఈ తండ్రి కూడా అంటున్నారు - నేను ఎవరికైతే పాలన ఇస్తున్నానో వారికే నేను శిక్షను విధిస్తాను. అప్పుడు మీరు తల క్రిందకు వంచుకొని అయ్యో అయ్యో అని అంటూ ఉంటారు. బాబా ఎంతగానో అర్థం చేయించారు, చదివించారు, మేము ధ్యానము పెట్టలేదు. బాబాతో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు కదా, వారికి మీ జాతకము తెలుసు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా చూస్తారు. 10 సంవత్సరాలు పవిత్రంగా ఉన్నవారిపై కూడా అకస్మాత్తుగా మాయ ఎటువంటి దాడి చేసిందంటే సంపాదించుకున్నదంతా మాయం అయిపోయింది, పతితులుగా అయిపోయారు. ఇటువంటి ఉదాహరణలు చాలా జరుగుతూ ఉంటాయి. చాలామంది క్రింద పడుతూ ఉంటారు. మాయావి తుఫానుల వలన రోజంతా కంగారుపడూతూ ఉంటారు, చివరికి తండ్రినే మర్చిపోతారు. బాబా నుండి అనంతమైన రాజ్యాము లభిస్తూ ఉందనే సంతోషం ఉండదు. కామవికారముతో పాటు మోహము కూడా ఉంటుంది. ఇందులో నష్టోమోహులుగా అవ్వాలి. పతితులపై ఏ మాత్రము ఆకర్షణ ఉండరాదు. వారికి కూడా తండ్రి పరిచయమిచ్చి ఉన్నతంగా చేయాలనే ఆలోచన ఉండాలి. వారిని శివాలయానికి అర్హులుగా ఎలా చేయాలి! అని యుక్తులు ఆలోచిస్తూ ఉండాలి. ఇలా ఆలోచించడం మోహము కాదు. ఎంత ప్రియమైన సంబంధీకులైనా వారికి కూడా అర్థం చేయిస్తూ ఉండండి. ఎవరిపైనా భౌతికమైన ప్రేమ ఉండకూడదు. లేకపోతే బాగుపడరు. దయా హృదయులుగా అవ్వాలి. మీపై మీరు కూడా దయ చూపించుకోవాలి. ఇతరుల పై కూడా దయ చూపాలి. తండ్రికి కూడా జాలి కలుగుతుంది. ఎంతమందిని తమ సమానంగా తయారు చేశారో గమనిస్తూ ఉండాలి. బాబాకు ఋజువును చూపించాలి. ఎంతమందికి పరిచయమిచ్చారో, పరిచయము తీసుకున్నవారు కూడా బాబా మాకు ఫలానావారి ద్వారా పరిచయము లభించింది అని వ్రాస్తారు. ఇటువంటి ఋజువు లభిస్తే, మీరు సేవ చేస్తున్నారని బాబాకు తెలుస్తుంది. ఈ బ్రాహ్మణి చాలా మంచి చురుకైన వారు అని బాబాకు వ్రాయాలి. చాలా బాగా సేవ చేస్తున్నారు, చాలా బాగా చదివిస్తున్నారు అని వ్రాయాలి. కానీ యోగములో చాలామంది పిల్లలు ఫెయిల్ అవుతారు. స్మృతి చేయాలనే తెలివే ఉండదు. భోజనము చేస్తున్నప్పుడు కూడా శివబాబా స్మృతిలో ఉంటూ తినండి. ఎక్కడికైనా తిరిగేందుకు వెళ్లినప్పుడు కూడా శివబాబాను స్మృతి చేయండి. వ్యర్థమైన మాటలు మాట్లాడకండి. ఏవేవో ఇతర మాటలు గుర్తుకొచ్చినా మళ్లీ తండ్రిని స్మృతి చేయండి. అలా చేస్తే కార్యవ్యవహారాలతో పాటు తండ్రి స్మృతిలో కూడా ఉన్నారని అర్థమవుతుంది. తండ్రి చెప్తున్నారు - కర్మలు చేయండి, నిద్రపోండి, వాటితో పాటు ఇది కూడా చేయండి. కనీసం 8 గంటలైనా యోగము చేయగలగాలి. ఇది చివరి సమయములో వీలవుతుంది. మీ చార్టును నెమ్మదిగా వృద్ధి చేసుకోండి. కొందరు 2 గంటలు మాత్రమే స్మృతిలో ఉన్మామని వ్రాస్తారు. కానీ ఆ తర్వాత తక్కువైపోయిందని కూడా వ్రాస్తారు. ఆ కొంచాన్ని కూడా మాయ మాయం చేస్తుంది. మాయ చాలా శక్తివంతమైనది. ఎవరైతే ఈ సేవలో రోజంతా బిజీగా ఉంటారో, వారే స్మృతి కూడా చేయగలరు. పదే పదే తండ్రి పరిచయమునిస్తూ ఉండాలి. తండ్రిని స్మృతి చేయమని బాబా ఎంతో తీవ్రంగా చెప్తూ ఉంటారు. స్మృతి చేయడం లేదని స్వయానికి కూడా తెలుస్తుంది. స్మృతిలోనే మాయ విఘ్నాలు కల్గిస్తుంది. చదువు చాలా సులభమైనది. తండ్రి ద్వారా మనం చదువుకుంటున్నాము. ఎంత విద్యా ధనము తీసుకుంటామో, అంత గొప్ప ధనవంతులుగా అవుతాము. తండ్రి అందరినీ చదివిస్తారు కదా. మురళీ కూడా అందరి వద్దకు వస్తుంది. కేవలం మీరే కాదు అందరూ చదువుతున్నారు. మురళి రాకపోతే, విలపిస్తూ ఉంటారు. మురళి వినని వారు కూడా చాలామంది ఉన్నారు. అలాగే నడుస్తూ ఉంటారు. మురళి వినాలనే ఆసక్తి ఉండాలి. బాబా మేము వారసత్వము తీసుకునేందుకు వచ్చాము అనే పాట ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉంది. బాబా మేము ఎలా ఉన్నా, ఎటువంటివారిమైనా, చెవిటి వారమైనా మేము మీ వారిమే అని అంటారు కదా. ఈ మాట బాగానే ఉంది కాని ఛీ-ఛీ నుండి మంచిగా అవ్వాలి కదా. ఆధారమంతా చదువు, యోగాల పైనే ఉంది.

తండ్రికి చెందినవారిగా అయ్యాక పిల్లలు ప్రతి ఒక్కరికీ ఈ ఆలోచన తప్పుకుండా రావాలి – మేము బాబాకు చెందినవారిగా అయ్యామంటే స్వర్గంలోకి తప్పకుండా వెళ్తాము కానీ మేము స్వర్గములో ఏమి అవ్వాలి అనేది కూడా ఆలోచించాలి. బాగా చదువుకోండి, దైవీగుణాలు ధారణ చేయండి. కోతి, కోతిగానే ఉంటే ఏ పదవిని పొందుతారు? అక్కడ కూడా ప్రజలకు నౌకర్లు, చాకర్లు అందరూ కావాలి కదా. చదువుకున్న వారి ముందు చదువుకోనివారు బరువులు మోస్తారు. ఎంత బాగా పురుషార్థము చేస్తే, అంత ఎక్కువ సుఖము పొందుతారు. మంచి ధనవంతులుగా అయితే మంచి గౌరవముంటుంది. బాగా చదువుకున్న వారికి మంచి గౌరవముంటుంది. తండ్రిని స్మృతి చేస్తూ శాంతిగా ఉండమని బాబా సలహానిస్తున్నారు. సన్ముఖములో ఉన్నవారికంటే, దూరంగా ఉన్నవారు చాలా స్మృతి చేస్తారని బాబాకు తెలుసు. వారు మంచి పదవిని కూడా పొందుతారు. భక్తి మార్గములో కూడా ఇలాగే ఉంటుంది. కొంతమంది భక్తులు గురువుల కంటే ఎక్కువగా స్మృతి చేస్తారు. చాలా భక్తి చేసిన వారే ఇక్కడకు వస్తారు. అందరూ భక్తులే కదా. సన్యాసులు మొదలైనవారు ఇక్కడకు రారు. భక్తి చేస్తూ చేస్తూ భక్తులందరూ వచ్చేస్తారు. బాబా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. మీరు జ్ఞానము తీసుకుంటున్నారు, కావున మీరు చాలా భక్తి చేశారని ఋజువవుతున్నది. ఎక్కువ భక్తి చేసినవారు ఎక్కువగా చదువుతారు. భక్తి తక్కువగా చేసిన వారు తక్కువగా చదువుకుంటారు. ముఖ్యమైన శ్రమ స్మృతి చేయడమే. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి, అంతేకాక చాలా మధురంగా కూడా తయారవ్వాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత - పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎవరు ఎంత ప్రియమైన సంబంధీకులైనా మోహము యొక్క బంధము ఆకర్షించకూడదు. నష్టోమోహులుగా అవ్వాలి, యుక్తిగా తెలపాలి. స్వయంపై మరియు ఇతరులపై కూడా దయ చూపించాలి.

2. తండ్రి మరియు టీచరును చాలా ప్రీతిగా స్మృతి చేయాలి. స్వయం భగవంతుడు చదివించి మాకు విశ్వచక్రవర్తి పదవిని ఇస్తున్నారనే నషా ఉండాలి. నడుస్తూ, తిరుగుతూ స్మృతి చేయాలి. వ్యర్థ మాటలు మాట్లాడకూడదు.

వరదానము:-

సర్వాత్మలకు యథార్థమైన అవినాశి ఆధారమిచ్చే ఆధార, ఉద్ధారమూర్త్ భవ

వర్తమాన సమయంలో విశ్వం నలువైపులా ఏదో ఒక రకమైన అలజడి ఉంది. ఒక్కోచోట మనస్సు యొక్క అనేక టెన్షన్ ల అలజడి ఉంది, ఒక్కోచోట ప్రకృతి యొక్క తమోప్రధాన వాయుమండలం కారణంగా అలజడి ఉంది, అల్పకాలిక సాధనాలు అందరినీ చింతల చితి పైకి తీసుకెళ్తున్నాయి. అందుకే అల్పకాలిక ఆధారములతో, ప్రాప్తులతో, విధులతో అలసిపోయి వాస్తవిక ఆధారాన్ని వెతుకుతున్నారు. కనుక ఆధార, ఉద్ధారమూర్తులైన మీరు వారికి శ్రేష్ఠమైన అవినాశి ప్రాప్తుల యథార్థమైన, వాస్తవిక అవినాశి ఆధారాన్ని అనుభవం చేయించండి.

స్లోగన్:-

సమయం అమూల్యమైన ఖజానా, అందువలన సమయాన్ని నష్టము చేసుకునేందుకు బదులు వెంటనే నిర్ణయం తీసుకొని సఫలం చేయండి.