24-03-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం


"మధురమైన పిల్లలారా - ఆత్మిక సేవ చేసి తమ మరియుఇతరుల యొక్క కళ్యాణాన్ని చేయండి. తండ్రితో సత్యమైన మనస్సు ఉంచుకుంటే తండ్రి హృదయమును అధిరోహిస్తారు”

ప్రశ్న:-

దేహీ అభిమానులుగా అయ్యేందుకు ఎవరు శ్రమ చేయగలరు? దేహీ అభిమానుల గుర్తులు వినిపించండి ?

జవాబు:-

ఎవరికైతే చదువు పై మరియుతండ్రి పై అఖండమైన ప్రీతి ఉందో, వారు దేహీ అభిమానులుగా అయ్యే శ్రమ చేయగలరు. వారు శీతలంగా ఉంటారు, ఎవరితోనూఎక్కువగా మాట్లాడరు, వారికి తండ్రిపై ప్రేమ ఉంటుంది, నడవడిక చాలా రాయల్గా(హుందాగా) ఉంటుంది. వారికి మమ్ములను భగవంతుడు చదివిస్తున్నారు, మేము వారి పిల్లలము అనే నషా ఉంటుంది. వారు సుఖదాయకులుగా (సుఖమునిచ్చేవారుగా) ఉంటారు. ప్రతి అడుగు శ్రీమతానుసారమే వేస్తారు.

ఓంశాంతి. పిల్లలు సేవా సమాచారాన్ని కూడా వినాలి. ఆ తరువాత, ముఖ్య ముఖ్యమైన మహారథి సేవాధారి పిల్లలు ఎవరైతే ఉంటారో, వారు సలహాలు ఇవ్వాలి. మేళా లేక ప్రదర్శనీల ప్రారంభోత్సవము ఎవరి ద్వారా చేయించాలి, వారికి ఏ ఏ పాయింట్లు వినిపించాలి అని సర్వీసబుల్పిల్లలకే విచార సాగర మథనము నడుస్తుందని బాబాకు తెలుసు. ఒకవేళ శంకరాచార్యులు మొదలైన వారు మీ ఈ మాటలను అర్థము చేసుకుంటే ఇక్కడి జ్ఞానము చాలా శ్రేష్టమైనదని, వీరిని చదివించేవారు ఎవరో చాలా గొప్పవారిలా ఉన్నారని అర్థము చేసుకుంటారు. అయితే భగవంతుడు చదివిస్తున్నారనివారు ఒప్పుకోరు. కనుక ప్రదర్శనీ మొదలైనవి ఉద్ఘాటన(ప్రారంభము) చేసేందుకు ఎవరు వస్తారో, వారికి ఏమేమి అర్థం చేయిస్తారో, ఆ సమాచారాన్ని అందరికీ తెలియజేయాలి. లేకుంటే టేపులో సంక్షిప్తంగా నింపాలి. గంగేదాది శంకరాచార్యులకు అర్థం చేయించారు కదా, అలాంటి సేవాధారి పిల్లలు తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారు. స్థూలమైన సేవ కూడా ఉంది. కానీ బాబా ధ్యాస అనేక మందికి కళ్యాణము జరిగే ఆత్మిక సర్వీసు పైకి వెళ్తుంది. భలే అన్ని విషయాలలోనూ కళ్యాణముంది. యోగయుక్తంగా ఉండి బ్రహ్మాభోజనాన్ని తయారు చేసినట్లయితే, అందులో కూడా కళ్యాణముంది. అలాంటి యోగయుక్త భోజనాన్ని తయారు చేసేవారుంటే భండారీలో చాలా శాంతిగా ఉంటుంది. స్మృతియాత్రలో ఉండాలి. అక్కడకు ఎవరైనా వస్తే వెంటనే వారికి అర్థము చేయించాలి. సేవాధారి పిల్లలు ఎవరో బాబా తెలుసుకోగలరు. ఎవరైతే ఇతరులకు కూడా అర్థం చేయించగలరో వారినే తరచుగా సేవ చేసేందుకు కూడా పిలుస్తారు. కనుక సర్వీసు చేసేవారే తండ్రిహృదయమును అధిరోహించి ఉంటారు. బాబా అటెన్షన్ అంతా సర్వీసెబుల్(సేవాధారి) పిల్లల వైపుకేవెళ్తుంది. చాలామంది సన్ముఖంలో మురళి వింటున్నా ఏమీ అర్థము చేసుకోలేరు. ధారణ జరగదు. ఎందుకంటే అర్థకల్పపు దేహాభిమాన రోగము చాలా కఠినంగా ఉంది. దానిని తొలగించేందుకు చాలా కొద్దిమంది మాత్రమే మంచి పురుషార్థము చేస్తున్నారు. దేహీ అభిమానులుగా అయ్యే శ్రమ చాలా మంది చేయలేరు. బాబా అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, దేహీ అభిమానులుగా అవ్వడం చాలా కష్టము. కొందరు చార్టు కూడా పంపుతారు, కానీ పూర్తిగా పంపరు. అయినా వారికి కొద్దిగా అటెన్షన్ ఉంటుంది. దేహీ అభిమానులుగా అయ్యే అటెన్షన్ చాలా మందిలో తక్కువగా ఉంటుంది. దేహీ అభిమానులు చాలా శీతలంగా ఉంటారు. వారు అంత ఎక్కువగా మాట్లాడరు. వారికి తండ్రి పై ఎంత ప్రేమ ఉంటుందంటే ఇక చెప్పలేము. ఎప్పుడూ ఏ మానవునికి లేనంత సంతోషం ఆత్మకు ఉండాలి. ఈ లక్ష్మీనారాయణులకు అయితే జ్ఞానము లేదు. భగవంతుడు చదివించే పిల్లలైన మీకు మాత్రమే ఈ జ్ఞానము ఉంది. భగవంతుడు మమ్ములను చదివిస్తున్నారనే నషా కూడా మీలో ఏ ఒకరిద్దరికి మాత్రమే ఉంటుంది. ఆ నషా ఉంటే తండ్రి స్మృతిలో ఉంటారు. వారిని దేహీ అభిమానులని అంటారు. కాని ఆ నషా ఉండదు. స్మృతిలో ఉండేవారి నడవడిక చాలా బాగా, రాయల్గా ఉంటుంది. మనము భగవంతుని పిల్లలము, అందుకే గాయనము కూడా ఉంది- ఎవరైతేదేహీ అభిమానులై తండ్రిని స్మృతి చేస్తారో, ఆ గోప-గోపికలనే అతీంద్రియ సుఖము గురించి అడగండి అని. స్మృతి చేయరు, అందుకే శివబాబా హృదయాన్ని అధిరోహించరు. శివబాబా హృదయములో లేకుంటే దాదా హృదయమును కూడా అధిరోహించలేరు. వారి హృదయములో ఉంటే తప్పకుండా వీరి హృదయములో కూడా ఉంటారు. తండ్రికి ప్రతి ఒక్కరి గురించి తెలుసు. తాము ఏమిసర్వీసు చేస్తున్నారో స్వయం పిల్లలకు కూడా తెలుసు. సర్వీసు చేయాలనే ఆసక్తి పిల్లలలో చాలా ఉండాలి. కొంతమందికి సేవాకేంద్రాలను స్థాపించే ఆసక్తి కూడా ఉంటుంది. కొందరికి చిత్రాలను తయారుచేసే ఆసక్తి ఉంటుంది. నాకు జ్ఞానీ ఆత్మలైన పిల్లలు ప్రియంగా అనిపిస్తారని తండ్రి కూడా అంటారు. వారు తండ్రి స్మృతిలో కూడా ఉంటారు మరియుసేవ చేసేందుకు కూడా తపిస్తూ ఉంటారు. కొందరు ఏ మాత్రము సేవ చేయరు. తండ్రి చెప్పేది కూడా వినరు. ఎవరు ఎక్కడ సర్వీసు చేయాలో తండ్రికి తెలుసు కదా. కానీ దేహాభిమానం కారణంగా తమ మతానుసారముగా నడుస్తారు. కనుక బాబా హృదయములో స్థానాన్ని పొందలేరు. అజ్ఞాన కాలములో కూడా ఎవరైనా పిల్లలు చెడు నడవడిక గలవారిగా ఉంటే వారికి తండ్రి హృదయములో స్థానముండదు. వారిని కుపుత్రులుగా భావిస్తారు. సాంగత్య దోషము వలన పాడవుతారు. ఇక్కడ కూడా ఎవరైతే సర్వీసు చేస్తారో, వారే తండ్రికి ప్రియంగా అనిపిస్తారు. ఎవరైతే సర్వీసు చేయరో, వారిని తండ్రి ప్రేమించరు. అదృష్టానుసారముగానే చదువుకుంటారని భావిస్తారు కానీ ప్రేమ ఎవరి పైన ఉంటుంది? అది నియమము కదా. మంచి పిల్లలను చాలా ప్రేమగా పిలుస్తారు. నీవు చాలా సుఖదాయకుడివి, నీవు తండ్రికి స్నేహీఅని అంటారు. ఎవరైతే బాబాను స్మృతే చేయరో, వారిని తండ్రి స్నేహీ అని అనరు. దాదాకు స్నేహీలుగా అవ్వరాదు. తండ్రికి స్నేహీలుగా అవ్వాలి. ఎవరైతే తండ్రికి స్నేహీలుగా ఉంటారో వారి మాట, నడవడిక చాలా మధురంగా, సుందరంగా ఉంటాయి. వివేకము ఇలా చెబుతుంది - ఇంకా సమయం ఉంది, కానీ శరీరము పై ఏ నమ్మకము లేదు. కూర్చొని ఉండగానే ప్రమాదము(ఆక్సిడెంటు) జరుగుతుంది. కొందరికి గుండె ఆగిపోతుంది. కొందరికి రోగాలు వస్తాయి, మృత్యువు ఆకస్మికంగా కలుగుతుంది కదా. కనుక శ్వాస పై అయితే నమ్మకం లేదు. ప్రాకృతికఆపదలప్రాక్టీసు కూడా ఇప్పుడు జరుగుతుంది. సమయము కాని నమయములో వర్షాలు పడినందుకు కూడా నష్టము జరుగుతూ ఉంటుంది.ఈ ప్రపంచమే దుఃఖమిచ్చే ప్రపంచము. తండ్రి కూడా, ఎప్పుడైతే చాలా దుఃఖముంటుందో, రక్తపు నదులు ప్రవహిస్తాయో, అలాంటి సమయములోనే వస్తారు. మేము మా పురుషార్థము చేసి21 జన్మలకు కళ్యాణము చేసుకోవాలి అని ప్రయత్నించాలి. చాలామందిలో తమ కళ్యాణాన్ని చేసుకోవాలనే చింత కూడా కనిపించదు.

బాబా ఇక్కడ కూర్చొని మురళి వినిపించినవ్పటికీ వారి బుద్ధి సేవాధారి(సర్వీసబుల్) పిల్లల వైపే ఉంటుంది. ఇప్పుడు శంకరాచార్యులను ప్రదర్శనీకి పిలిచారు. వీరు సాధారణంగా ఎక్కడికీ వెళ్లరు, చాలా అహంభావములో ఉంటారు కనుక వారికి గౌరవము కూడా ఇవ్వవలసి ఉంటుంది. పైనసింహాసనము పై కూర్చోబెట్టవలసి ఉంటుంది. వారు అందరితో కలిసి కూర్చుంటారని అనుకోకండి. వారికి చాలా గౌరవము కావాలి. నిరహంకారులుగా ఉంటే వెండి సింహాసనము మొదలైనవి వదిలి ఉండేవారు. తండ్రి ఎంత సాధారణంగా ఉంటారో చూడండి. వారి గూర్చిఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీలో కూడా ఎవరో కొద్దిమందికి మాత్రమే తెలుసు. తండ్రి ఎంత నిరహంకారులు! ఇది తండ్రి పిల్లల సంబంధము కదా. లౌకిక తండ్రి పిల్లలతో పాటు ఉంటారు, తింటారు, తినిపిస్తారు,ఇక్కడ వీరు అనంతమైన తండ్రి. సన్యాసులు మొదలైన వారికి తండ్రిప్రేమ లభించదు. కల్ప-కల్పము మనకు అనంతమైన తండ్రి ప్రేమ లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. పుష్పాలుగా తయారు చేసేందుకు తండ్రి చాలా శ్రమ చేస్తారు. అయితే డ్రామానుసారముగా అందరూ పుష్పాలుగా అవ్వరు. ఈ రోజు చాలా బాగుంటారు, రేపు వికారులుగా అయిపోతారు. తండ్రిచెప్తున్నారు - అదృష్టములో లేకుంటే, ఏం చేయగలరు. చాలామంది నడవడిక చాలా పాడైపోతుంది. ఆజ్ఞను ఉల్లంఘిస్తారు. ఈశ్వరుని మతము పై కూడా నడవలేదంటే వారి స్థితి ఎలా ఉంటుంది! ఉన్నతాతి ఉన్నతమైనవారు తండ్రి ఒక్కరే. ఇంకెవ్వరూ లేరు. తర్వాత దేవతల చిత్రములలో చూసినట్లయితే, ఈ లక్ష్మీనారాయణులే ఉన్నతాతి ఉన్నతమైనవారు. కానీ వారిని అలా తయారు చేసిందెవరో కూడా మనుష్యులకు తెలియదు. తండ్రి కూర్చొని పిల్లలైన మీకు రచయిత, రచనల జ్ఞానాన్ని బాగా అర్థం చేయిస్తున్నారు. మీకు మీశాంతిధామము, సుఖధామాలే జ్ఞాపకము వస్తాయి. సర్వీసు చేసేవారి పేర్లు జ్ఞాపకముంటాయి. ఎవరు బాబాకు ఆజ్ఞాకారీ పిల్లలుగా ఉంటారో, మనసు తప్పకుండా వారి వైపుకే వెళ్తుంది. బేహద్తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. ఆ లౌకిక తండ్రి జన్మ-జన్మాంతరాలకు లభిస్తారు. సత్యయుగములో కూడా లభిస్తారు. కానీ అక్కడ ఈ తండ్రి లభించరు. ఇప్పటి చదువు ద్వారానే మీరు పదవిని పొందుతారు. తండ్రి నుండి నూతన ప్రపంచము పొందేందుకు చదువుతున్నామని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇది బుద్ధిలో జ్ఞాపకముండాలి. ఇది చాలా సహజం.తండ్రి ఆట ఆడుతున్నారనుకోండి, అకస్మాత్తుగా ఎవరైనా వచ్చినట్లయితే, బాబా తక్షణము అక్కడే వారికి జ్ఞానము ఇవ్వడం ప్రారంభిస్తారు. బేహద్తండ్రి గురించి తెలుసా? తండ్రి పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేసేందుకు వచ్చారు. రాజయోగాన్ని నేర్పిస్తారు. భారతవాసులకే నేర్పించాలి.భారతదేశమే స్వర్గముగా ఉండేది. అక్కడ ఈ దేవీ దేవతల రాజ్యముండేది. ఇప్పుడిది నరకంగా ఉంది. నరకము నుండి మళ్లీ స్వర్గంగా తండ్రి మాత్రమే చేస్తారు. ఇలాంటి ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకొని ఎవరైనా వచ్చినప్పుడు వారికి అర్థం చేయించండి. అప్పుడు ఎంత సంతోషిస్తారు.కేవలం తండ్రి వచ్చి ఉన్నారు అని చెప్పండి. గీతలో గాయనము చేయబడిన మహాభారత యుద్ధము ఇదే. గీతా భగవానుడు వచ్చారు, గీతను వినిపించారు. ఎందుకు? మనుష్యులను దేవతలుగా తయారు చేసేందుకు. కేవలం తండ్రినైన నన్ను, వారసత్వాన్నిస్మృతి చేయండి అని తండ్రి చెప్తారు.ఇది దుఃఖధామము. ఇంతమాత్రము స్మృతి ఉన్నా సంతోషం ఉంటుంది. ఆత్మలమైన మనము బాబాతో పాటు శాంతిధామానికి వెళ్లేవారము. మళ్లీ అక్కడ నుండి పాత్ర అభినయము చేసేందుకు మొట్టమొదట సుఖధామములోకి వస్తాము. ఎలా అయితే కాలేజీలో చదివేటప్పుడు మేము ఈ చదువు చదివితర్వాత ఇలా అవుతామని భావిస్తారు. బ్యారిస్టరు అవుతాము లేక పోలీసు సూపరింటెండెంట్ అవుతాము, ఇంత ధనాన్ని సంపాదిస్తామని అనుకుంటారు. సంతోషపు పాదరసం ఎక్కి ఉంటుంది. పిల్లలైన మీకు కూడా ఈ సంతోషము ఉండాలి. మేము బేహద్తండ్రి ద్వారా ఈ వారసత్వాన్నిపొందుతాము, ఆ తర్వాత స్వర్గములో మా మహళ్ళు కట్టుకుంటాము. రోజంతా బుద్ధిలో ఈ చింతన ఉంటే సంతోషము కూడా ఉంటుంది. తమ మరియుఇతరుల కళ్యాణాన్ని కూడా చేయాలి. ఏ పిల్లల వద్ద జ్ఞాన ధనముందో, వారి కర్తవ్యము దానము చేయడం. ఒకవేళ ధనము ఉండి కూడా దానముచేయకుంటే వారిని పిసినారిఅని అంటారు. వారి వద్ద ధనమున్నా లేనట్లే. ధనముంటే దానము తప్పకుండా చేయాలి. మంచి మంచి మహారథి పిల్లలు సదా బాబా హృదయంలో ఉంటారు. వీరు బహుశా పడిపోతారేమో అని కొందరి గురించి ఆలోచన కలుగుతుంది. పరిస్థితులుఅలా ఉన్నాయి. దేహ అహంకారము చాలా ఎక్కువగా ఉంది. ఏ సమయములోనైనా చేయి వదిలి తమ ఇంటికి వెళ్లిపోతారు. మురళీని చాలా బాగా చెప్పగలరు, కాని దేహాభిమానము చాలా ఉంది. బాబా కొద్దిగా హెచ్చరించినాతక్షణం విడిచివెళ్లిపోతారు. లేకుంటే గాయనముంది -ప్రేమించండి లేక తిరస్కరించండి....... ఇక్కడ తండ్రి సరియైన(రైటు)మాట చెప్పినా కోపము వచ్చేస్తుంది. ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారు, కొందరు లోలోపల చాలా ధన్యవాదాలు అర్పిస్తారు, కొందరు లోలోపల కాలిపోతూ ఉంటారు. మాయ యొక్క దేహాభిమానము చాలాఉంది. అసలు మురళిని ఏ మాత్రమూ వినని పిల్లలున్నారు, కొందరు మురళీ లేకుండా ఉండలేని పిల్లలు కూడా ఉన్నారు. మురళి చదవని వారు మాలో చాలా జ్ఞానముంది, ఇక మాకు తెలియనిది ఏమీ లేదు అని కూడా భావిస్తారు. ఎక్కడైతే శంకరాచార్యులు మొదలైనవారు ప్రదర్శనీకి వస్తారో, సర్వీసు బాగా జరుగుతుందో, ఆ సమాచారాన్ని అందరికీ పంపాలి. దాని వలన ఎలా సర్వీసు జరిగిందో అందరికీ తెలుస్తుంది, వారు కూడా నేర్చుకుంటారు. ఇలాంటి ఇలాంటి సర్వీసు చేసేందుకు ఎవరికి సంకల్పము వస్తుందో, వారినే బాబా సేవాధారి పిల్లలుగా భావిస్తారు. సర్వీసులో ఎప్పుడూ అలసిపోకూడదు. అనేకమంది కళ్యాణము చేయాలి కదా. అందరికీ ఈ జ్ఞానము లభించాలి, పిల్లల ఉన్నతి కూడా జరగాలి అని బాబాకు ఇదే తపన ఉంటుంది. ఈ ఆత్మిక సర్వీసు ముఖ్యమైనదని రోజూ మురళీలో అర్థం చేయిస్తూ ఉంటారు. వినాలి మరియు వినిపించాలి. అభిరుచి ఉండాలి. బ్యాడ్జి తీసుకుని రోజూ మందిరాలకు వెళ్ళి అర్థం చేయించండి - వీరు లక్ష్మీనారాయణులుగా ఎలా అయ్యారు? తర్వాత వీరు ఎక్కడికి వెళ్లారు, ఎలా రాజ్య భాగ్యాన్ని పొందారు? వెళ్లి మందిర ద్వారము వద్ద కూర్చోండి. ఎవరైనా వచ్చినట్లయితే, ఈ లక్ష్మీనారాయణులు ఎవరు? భారతదేశములో వీరి రాజ్యము ఎప్పుడుండేది? అని చెప్పండి. హనుమంతుడు కూడా చెప్పుల వద్ద కూర్చునేవారు అని అంటారు కదా. దానికి కూడా రహస్యముంది కదా. జాలి కలుగుతుంది. సర్వీసు చేసే యుక్తులు బాబా చాలా తెలియజేస్తారు కాని వాటిని చాలా కొద్దిమంది మాత్రమే కష్టముతో అమలులోకి తెస్తారు. సర్వీసు చాలా ఉంది. అంధులకు చేతికర్రగా అవ్వాలి. ఎవరైతే సర్వీసు చేయరో, బుద్ధి స్వచ్ఛంగా ఉండదో, ఇక ధారణ జరుగదు. లేకుంటే సర్వీసు చాలా సహజము. మీరు ఈ జ్ఞానరత్నాలను దానము చేస్తున్నారు. ఎవరైనా శ్రీమంతులు వచ్చినట్లయితే, మేము మీకు ఈ బహుమానము ఇస్తాము, దీని అర్థము కూడా మీకు తెలియజేస్తాము అని చెప్పండి. ఈ బ్యాడ్జ్లంటే బాబాకు చాలా గౌరవముంది. వేరెవ్వరికీ అంత గౌరవము లేదు. ఇందులో చాలా మంచి జ్ఞానము నిండి ఉంది. కానీ ఎవరి భాగ్యములోనైనా లేకుంటే బాబా కూడా ఏం చేయగలరు? బాబాను, చదువును వదలడము - ఇది అతి పెద్ద ఆత్మహత్య. బాబావారిగా అయ్యి మరలా వదలి వేయడము - ఇలాంటి మహాపాపము వేరేదీ ఉండదు. అలాంటి దౌర్భాగ్యులు ఎవ్వరూ ఉండరు. పిల్లలు శ్రీమతానుసారముగా నడవాలి కదా. మేము విశ్వానికి యజమానులుగా అయ్యేవారమని మీ బుద్ధిలో ఉ౦ది. ఇది తక్కువ మాటేమీ కాదు. స్మృతి చేసినట్లయితే సంతోషం కూడా ఉంటుంది. స్మృతి చేయకుంటే పాపాలు భస్మము కావు. దత్తత తీసుకోబడ్డారు కనుకసంతోషపు పాదరసం పైకి ఎక్కాలి. కానీ మాయ చాలా విఘ్నాలు కలుగజేస్తుంది. కచ్చాగా ఉన్నవారిని పడేస్తుంది. ఎవరైతే తండ్రి శ్రీమతమునే తీసుకోరో వారు ఏ పదవి పొందుతారు? కొద్దిగా తీసుకుంటే అలాంటి తేలిక పదవినే పొందుతారు. చాలా బాగా మతాన్ని తీసుకుంటే, ఉన్నత పదవిని పొందుతారు. ఈ బేహద్రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఇందులో ఖర్చు మొదలైన మాట కూడా లేదు. కుమారీలు వస్తారు, నేర్చుకొని అనేక మందిని తమ సమానంగా తయారు చేస్తారు. ఇందులో ఫీజు మొదలైన వాటి మాటే లేదు. తండ్రి చెప్తారు - మీకు స్వర్గ సామ్రాజ్యాన్ని ఇస్తాను, నేను స్వర్గములోకి కూడా రాను. శివబాబా దాత కదా. వారికి ఫీజు ఏమిస్తారు. వీరు సర్వస్వాన్ని వారికి ఇచ్చేశారు, వారసునిగా చేసుకున్నారు. ప్రతిఫలంగా రాజ్యము లభిస్తోంది కదా. వీరు మొట్టమొదటి ఉదాహరణ. పూర్తి విశ్వము పై స్వర్గ స్థాపన జరుగుతుంది. పైసా కూడా ఖర్చు కాదు. మంచిది.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పితా స్నేహీలుగా అయ్యేందుకు చాలా చాలా సుఖదాయులుగా అవ్వాలి. మీ మాట, నడవడిక చాలా మధురంగా, రాయల్గా ఉండాలి.సేవాధారులుగా అవ్వాలి, నిరహంకారులుగా అయి సేవ చేయాలి.

2. చదువును, తండ్రిని వదిలి ఎప్పుడూ జీవహత్య చేసుకొని మహాపాపులుగా అవ్వరాదు. ముఖ్యమైనది ఆత్మిక సేవ. ఈ సర్వీసులో ఎప్పుడూ అలసిపోరాదు. జ్ఞానరత్నాలను దానము చేయాలి. దురదృష్టవంతులుగా అవ్వరాదు.

వరదానము:-

"నేను మరియు నాది” ని బలి చేసే సంపూర్ణ మహాబలి భవ

హద్దులోని ఎవరైనా వ్యక్తి లేక వైభవము పై ఆకర్షణ ఉంటే దానిని మేరాపన్(నాది) అని అంటారు. ఈ మేరాపన్ను, నేను చేస్తాను, నేను చేశాను,....... ఈ మైపన్(నేను)ను సంపూర్ణ సమర్పణ చేసేవారు అనగా బలి చేసేవారే మహాబలి. ఎప్పుడైతే హద్దులోని "నేను, నేను” సమర్పణ అవుతుందో అప్పుడు సంపూర్ణముగా మరియు తండ్రి సమానంగా అవుతారు. నేను చేస్తున్నానని అనుకోరాదు. బాబా చేయిస్తున్నారు, బాబా నడిపిస్తున్నారు అని భావించాలి. ఏ విషయంలో అయినా నేనుకు బదులు సదా న్యాచురల్భాషలో కూడా "తండ్రి” అనే పదమే రావాలి. "నేను” అనే పదము రాకూడదు.

స్లోగన్:-

సంకల్పాలలో ఎటువంటి దృఢతను ధారణ చేయాలంటే, తద్వారా ఆలోచించడం, చేయడం సమానమైపోవాలి.