28-03-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - ఈ జ్ఞానము మిమ్ములను శీతలంగా చేస్తుంది, ఈ జ్ఞానము ద్వారా కామక్రోధాల అగ్ని సమాప్తమైపోతుంది, భక్తి ద్వారా ఈ అగ్ని సమాప్తమవ్వదు."

ప్రశ్న:-

స్మృతిలో ముఖ్యమైన శ్రమ ఏది?

జవాబు:-

తండ్రిని స్మృతి చేసేందుకు కూర్చున్నప్పుడు దేహము కూడా గుర్తు రాకూడదు. ఆత్మాభిమానిగా అయి తండ్రిని స్మృతి చేయండి, ఇందులోనే శ్రమ ఉంది. ఇందులోనే విఘ్నాలు వస్తాయి ఎందుకంటే అర్థకల్పము దేహాభిమానులుగా ఉన్నారు. భక్తి అంటేనే దేహపు స్మృతి.

ఓంశాంతి. స్మృతి కొరకు ఏకాంతము చాలా అవసరమని పిల్లలైన మీకు తెలుసు. మీరు ఎంత ఏకాంతంగా, శాంతిగా తండ్రి స్మృతిలో ఉండగలరో, అంత శాంతిగా గుంపులో ఉండలేరు. పాఠశాలలో కూడా పిల్లలు చదువుకునేటప్పుడు ఏకాంతములోకి వెళ్ళి చదువుకుంటారు. ఇందులో కూడా ఏకాంతము అవసరము. తిరిగేందుకు వెళ్లినప్పుడు కూడా స్మృతియాత్ర ముఖ్యమైనది. చదువు చాలా సహజము ఎందుకంటే అర్థకల్పము మాయారాజ్యము వచ్చేటప్పటికే మీరు దేహాభిమానులుగా అవుతారు. మొట్టమొదటి శత్రువు దేహాభిమానము. తండ్రిని స్మృతి చేసేందుకు బదులు దేహాన్ని స్మృతి చేస్తారు. దీనిని దేహ అహంకారమని అంటారు. ఆత్మాభిమానులుగా అవ్వండి అని ఇక్కడ పిల్లలైన మీకు చెప్పడం జరుగుతుంది, ఇందులోనే శ్రమ అనిపిస్తుంది. ఇప్పుడు భక్తి వదిలిపోయింది. భక్తి శరీరముతోనే జరుగుతుంది. తీర్థస్థానాలు మొదలైన వాటికి శరీరాన్ని తీసుకెళ్ళవలసి ఉంటుంది. దర్శనము చేసుకునేందుకు, ఇది చేసేందుకు శరీరము వెళ్ళవలసి ఉంటుంది. మేము ఆత్మలము, పరమపిత పరమాత్మ అయిన తండ్రిని స్మృతి చేయాలి అనే చింతననే ఇక్కడ మీరు చేయవలసి ఉంటుంది. ఎంత స్మృతి చేస్తారో, అంత పాపము సమాప్తమవుతుంది. భక్తిమార్గములో అయితే ఎప్పుడూ పాపము సమాప్తమవ్వదు. ఎవరైనా వృద్ధులు మొదలైన వారికైతే ఆంతరికముగా, మేము భక్తి చేయమంటే నష్టము కలుగుతుంది, నాస్తికులుగా అవుతాము అనే అనుమానం ఉంటుంది. భక్తి అగ్నివలె అంటుకొని ఉంది. జ్ఞానములో శీతలత ఉంది. ఇందులో కామక్రోధాల అగ్ని సమాప్తమవుతుంది. భక్తి మార్గములో మనుష్యులు ఎంత భావన పెట్టుకుంటారు, శ్రమ చేస్తారు. బద్రీనాథ్ కు వెళ్తారనుకోండి, మూర్తి సాక్షాత్కారమవుతుంది. తర్వాత ఏమవుతుంది! తక్షణమే భావన కూర్చుంటుంది, తర్వాత బద్రీనాథుడు తప్ప వేరెవ్వరి స్మృతి బుద్ధిలో ఉండదు. మొదట కాలినడకన వెళ్ళేవారు. తండ్రి చెప్తారు - నేను అల్పకాలానికి భక్తుల మనోకామనలను పూర్తి చేస్తాను, సాక్షాత్కారాలు చేయిస్తాను. కానీ నేను వీటి ద్వారా లభించను. నేను లేకుండా వారసత్వము లభించదు. మీకు వారసత్వము నా ద్వారానే లభించాలి కదా. వీరంతా దేహధారులు. వారసత్వము రచయిత అయిన ఒక్క తండ్రి ద్వారా మాత్రమే లభిస్తుంది, మిగిలిన జడము లేక చైతన్యమంతా వారి రచన. రచన ద్వారా ఎప్పుడూ వారసత్వము లభించదు. పతితపావనులు ఒక్క తండ్రి మాత్రమే. కుమారీలు సాంగత్య దోషము నుండి చాలా రక్షించుకోవాలి. బాబా చెప్తారు - ఈ పతితత్వము వలన మీరు ఆదిమధ్యాంతాలు దుఃఖము పొందుతారు. ఇప్పుడు అందరూ పతితులే. మీరిప్పుడు పావనంగా అవ్వాలి. నిరాకార తండ్రియే వచ్చి మిమ్ములను చదివిస్తున్నారు. బ్రహ్మా చదివిస్తున్నారని ఎప్పుడూ భావించకండి. అందరి బుద్ధి శివబాబా వైపే ఉండాలి. శివబాబా వీరి ద్వారా చదివిస్తారు. దాదీలైన మిమ్ములను చదివించేవారు కూడా శివబాబాయే. వారికి ఏం మర్యాదలు చేస్తారు. మీరు శివబాబా కొరకు ద్రాక్ష, మామిడి పళ్లు తీసుకొస్తారు. కానీ శివబాబా - నేను అభోక్తను అని అంటారు. ఇవి అన్నీ పిల్లలైన మీ కొరకే. భక్తులు భోగ్ పెడ్తారు, పంచుకొని తింటారు. నేను తినను. తండ్రి చెప్తారు - పిల్లలైన మిమ్ములను చదివించి పావనంగా చేసేందుకే నేను వస్తాను. పావనంగా అయి మీరు ఇంత ఉన్నతమైన పదవిని పొందుతారు. ఇదే నా కర్తవ్యము. శివభగవానువాచ అని అంటారు కూడా. బ్రహ్మా భగవానువాచ అని అనరు. బ్రహ్మా వాచ అని కూడా అనరు. వారు కూడా మురళి వినిపిస్తారు, కానీ సదా శివబాబానే వినిపిస్తున్నారని భావించండి. ఏ పుత్రునికైనా, బాణము బాగా వేయాలనుకుంటే, బాబా స్వయంగా ప్రవేశిస్తారు. జ్ఞాన బాణము తీక్షణమైనదని మహిమ చేయబడుతుంది కదా. సైన్స్ లో కూడా ఎంత శక్తి ఉంది! బాంబులు మొదలైన వాటి శబ్దము ఎంతగా ఉంటుంది. మీరు ఎంత సైలెన్స్ లో ఉంటారు! సైన్స్ పై సైలెన్స్ విజయం పొందుతుంది.

మీరు ఈ సృష్టిని పావనంగా చేస్తారు. మొదట స్వయాన్ని పావనంగా చేసుకోవాలి. డ్రామానుసారముగా పావనంగా కూడా తప్పకుండా అవ్వాలి, అందువల్లనే వినాశనము కూడా నిర్ణయింపబడి ఉంది. డ్రామాను అర్థం చేసుకొని చాలా హర్షితంగా ఉండాలి. ఇప్పుడు మనము శాంతిధామానికి వెళ్లాలి. తండ్రి చెప్తారు - అది మీ ఇల్లు, ఇంటికి సంతోషంగా వెళ్ళాలి కదా. ఇందులో ఆత్మాభిమానులుగా అయ్యేందుకు చాలా శ్రమ చేయాలి. ఈ స్మృతియాత్ర గురించే బాబా చాలా జోరు ఇచ్చి చెప్తున్నారు, ఇందులోనే శ్రమ ఉంది. నడుస్తూ, తిరుగుతూ స్మృతి చేయడము సహజమా? లేక ఒక స్థానములో కూర్చొని స్మృతి చేయడం సహజమా? అని బాబా అడుగుతున్నారు. భక్తిమార్గములో కూడా ఎన్ని మాలలు తిప్పుతారు, రామ- రామ అని జపిస్తూ ఉంటారు, కానీ లాభము ఏమీ ఉండదు. భోజనాన్ని తయారు చేయండి, ఇంకేదైనా చేయండి, తండ్రిని స్మృతి చేయండి అని బాబా పిల్లలైన మీకు చాలా సహజమైన యుక్తిని తెలియజేస్తారు. భక్తి మార్గములో శ్రీనాథ ద్వారములో భోగ్ తయారు చేయునప్పుడు, కొద్దిగా కూడా శబ్దము రాకూడదని నోటికి పట్టి కట్టుకుంటారు. అది భక్తిమార్గము. మీరైతే తండ్రిని స్మృతి చేయాలి. వారు అంత భోగ్ స్వీకరింపచేస్తారు, కానీ దానిని వారెవ్వరూ తినరు. పండాల కుటుంబాలు ఉంటాయి, వారు దానిని తింటారు. మనలను శివబాబా చదివిస్తున్నారని ఇక్కడ మీకు తెలుసు. మనలను శివబాబా చదివిస్తున్నారని భక్తిలో భావించరు. భలే శివపురాణాన్ని తయారు చేశారు, కానీ అందులో శివ పార్వతులను, శివ-శంకరులను అందరినీ కలిపేశారు. దానిని చదవడం వలన ఏ లాభమూ కలగదు. ప్రతి ఒక్కరు తమ శాస్త్రాన్ని చదవవలసి ఉంటుంది. భారతవాసులకు ఒక్క గీత మాత్రమే ఉంది. క్రైస్తవులకు ఒకే బైబిల్ ఉంది. గీత, దేవీదేవతా ధర్మశాస్త్రము. అందులోనే జ్ఞానముంది, జ్ఞానమునే చదువుతారు. మీరు జ్ఞానాన్ని చదవాలి. యుద్ధము మొదలైన విషయాలు ఏ పుస్తకాలలో ఉన్నాయో వాటితో మీకే పనీ లేదు. మనము యోగబలము గలవారము, కనుక బాహుబలము గలవారి కథలను ఎందుకు వినాలి! వాస్తవానికి మీకు ఏ యుద్ధమూ లేదు. మీరు యోగబలము ద్వారా 5 వికారాల పై విజయం పొందుతారు. మీ యుద్ధము 5 వికారాలతో. అక్కడ మనుష్యులు మనుష్యులతో యుద్ధము చేస్తారు. మీరు మీ వికారాలతో యుద్ధము చేస్తారు. ఈ విషయాలు సన్యాసులు మొదలైనవారు అర్థం చేయించలేరు. మీకు డ్రిల్లు మొదలైనవి ఏవీ నేర్పించరు. మీ డ్రిల్లు ఒక్కటే. మీది యోగబలము. స్మృతిబలము ద్వారా 5 వికారాలపై విజయాన్ని పొందుతారు. ఈ 5 వికారాలు శత్రువులు. వాటిలో కూడా మొదటి నెంబరు దేహాభిమానము. తండ్రి చెప్తారు - మీరు ఆత్మలు కదా. ఆత్మలైన మీరు వచ్చి గర్భములో ప్రవేశిస్తారు, నేనైతే ఈ శరీరములో విరాజమానమై ఉన్నాను. నేను ఏ గర్భములోకి వెళ్ళను. సత్యయుగములో మీరు గర్భ మహళ్లలో ఉంటారు. తర్వాత రావణ రాజ్యములో గర్భ జైళ్లలోనికి వెళ్తారు. నేనైతే ప్రవేశిస్తాను, దీనిని దివ్యజన్మ అని అంటారు. డ్రామానుసారముగా నేను వీరిలో రావలసి ఉంటుంది. వీరి పేరు బ్రహ్మా అని పెడ్తాను ఎందుకంటే వీరు నా వారిగా అయ్యారు కదా. దత్తతకు వెళ్లినప్పుడు ఎంత మంచి మంచి పేర్లు పెడ్తారు! మీకు కూడా చాలా మంచి మంచి పేర్లు పెట్టాను. అద్భుతమైన లిస్టు సందేశి ద్వారా వచ్చింది. బాబాకు అన్ని పేర్లు జ్ఞాపకము లేవు. పేరుతో ఏ పనీ లేదు. శరీరానికి పేరు పెడతారు కదా. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే చాలు అని తండ్రి చెప్తారు. మనము పూజ్య దేవతలుగా అవుతామని, మళ్లీ రాజ్యపాలన చేస్తామని మీకు తెలుసు. మళ్లీ భక్తి మార్గములో మన చిత్రాలే తయారు చేస్తారని మీకు తెలుసు. అనేక దేవీల చిత్రాలు తయారు చేస్తారు. ఆత్మలకు కూడా పూజ జరుగుతుంది. మట్టితో సాలిగ్రామాలను తయారు చేస్తారు, మళ్లీ రాత్రికి విరిపేస్తారు. దేవీలను కూడా అలంకరించి, పూజించి, మళ్లీ సముద్రములో వేసేస్తారు. తండ్రి చెప్తారు - నా రూపాన్ని కూడా తయారు చేసి, తీర్థ నైవేద్యాలు పెట్టి మళ్లీ నన్ను రాళ్ళు-రప్పలలో ఉన్నారని చెప్తారు. అందరికన్నా నాకే ఎక్కువ దుర్దశను కలిగిస్తారు. మీరు ఎంత పేదవారిగా అయ్యారు, పేదవారే మళ్లీ ఉన్నత పదవిని పొందుతారు. ధనవంతులు ఈ జ్ఞానాన్ని కష్టంగా తీసుకుంటారు. బాబా కూడా ధనవంతుల నుండి అంత తీసుకొని ఏం చేస్తారు. ఇక్కడైతే పిల్లల పైసా పైసాతో ఈ ఇళ్ళు మొదలైనవి తయారవుతాయి. బాబా మా ఒక్క ఇటుకను పెట్టండి, ప్రతిఫలంగా మాకు వెండి, బంగారు మహళ్ళు లభిస్తాయని భావిస్తారు. అక్కడైతే చాలా బంగారముంటుంది. బంగారు ఇటుకలు ఉంటాయి, అప్పుడే ఇళ్ళు తయారవుతాయి. కనుక తండ్రి చాలా ప్రేమగా చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలూ - ఇప్పుడు నన్ను స్మృతి చేయండి, ఇప్పుడు నాటకము పూర్తి అవుతుంది.

తండ్రి పేద పిల్లలకు ధనవంతులుగా అయ్యే యుక్తిని తెలియజేస్తారు – మధురమైన పిల్లలూ, మీ వద్ద ఏమేమి ఉందో, అదంతా బదిలీ చేయండి. ఇక్కడ ఏదీ ఉండదు. ఇక్కడ ఏమేం బదిలీ చేస్తారో, అది కొత్త ప్రపంచములో మీకు వంద రెట్లు వృద్ధి చెంది లభిస్తుంది. బాబా ఏదీ అడగరు. వారు దాత. ఈ యుక్తి తెలియజేయబడ్తుంది. ఇక్కడిదంతా మట్టిలో కలిసిపోతుంది. బదిలీ చేస్తే మీకు కొత్త ప్రపంచములో లభిస్తుంది. ఇది పాత ప్రపంచము వినాశనమయ్యే సమయము. ఇక్కడ ఉండేది ఏదీ ఉపయోగపడదు. కనుక బాబా చెప్తారు - ఇంటింటిలో యూనివర్సిటి కమ్ హాస్పిటల్ తెరవండి, దీని ద్వారా ఆరోగ్యము, ఐశ్వర్యము లభిస్తాయి. ఇదే ముఖ్యమైనది. మంచిది.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

రాత్రిక్లాసు : 12-03-1968

ఈ సమయంలో సాధారణ పేద మాతలైన మీరు పురుషార్థము చేసి ఉన్నతమైన పదవిని పొందుతారు. యజ్ఞములో సహాయము మొదలైనవి కూడా మాతలు చాలా చేస్తారు, సహాయము చేసే పురుషులు తక్కువ మందే ఉన్నారు. మాతలకు ఆస్తి, వారసత్వాల నషా ఉండదు. వారు బీజము నాటుతూ ఉంటారు, తమ జీవితాన్ని తయారు చేసుకుంటూ ఉంటారు. మీ జ్ఞానము యథార్థమైనది. మిగిలినదంతా భక్తి. ఆత్మిక తండ్రియే వచ్చి జ్ఞానమిస్తారు. తండ్రిని అర్థము చేసుకుని ఉంటే తండ్రి నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలి. మీతో తండ్రి పురుషార్థము చేయిస్తూ ఉంటారు, అర్థము చేయిస్తూ ఉంటారు. సమయాన్ని వ్యర్థము చేయకండి. కొందరు మంచి పురుషార్థులు, కొందరు మధ్యమ రకమైన పురుషార్థులు, మరి కొందరు తృతీయ రకమైన పురషార్థులున్నారని తండ్రికి తెలుసు. బాబాను అడిగితే వెంటనే ఎవరు ప్రథమము, ఎవరు ద్వితీయము, ఎవరు తృతీయము అని వెంటనే చెప్పేస్తారు. జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వలేకపోతే వారు థర్డ్ క్లాస్ అనే చెప్పాలి. ఋజువును ఇవ్వడము లేదంటే బాబా తప్పకుండా అంటారు కదా. భగవంతుడు వచ్చి ఏ జ్ఞానాన్ని నేర్పిస్తారో అది తర్వాత ప్రాయఃలోపమైపోతుంది. ఇది ఎవ్వరికీ తెలియదు. డ్రామా ప్లాను అనుసారముగా ఇది భక్తిమార్గము. దీని ద్వారా నన్ను ఎవ్వరూ ప్రాప్తి చేసుకోలేరు. సత్యయుగములోకి ఎవ్వరూ వెళ్లలేరు. పిల్లలైన మీరిప్పుడు పురుషార్థము చేస్తున్నారు. కల్పక్రితము ఎవరు ఎంత పురుషార్థము చేశారో అంత చేస్తూనే ఉంటారు. ఎవరెవరు తమ కళ్యాణము చేసుకుంటున్నారో తండ్రి అర్థము చేసుకోగలరు. ప్రతిరోజూ ఈ లక్ష్మీనారాయణుల చిత్రము ముందు వెళ్ళి కూర్చోమని తండ్రి చెప్తున్నారు. బాబా, మీ శ్రీమతము ద్వారా మేము తప్పకుండా ఈ వారసత్వాన్ని పొందుతామని బాబాకు చెప్పండి. తమ సమానంగా తయారు చేసే సర్వీసుపై ఆసక్తి తప్పకుండా ఉండాలి. సేవాకేంద్రాలలో ఉండేవారికి కూడా నేను చెప్తాను, ఇన్ని సంవత్సరాలుగా చదువుకున్నారు, అయినా ఇతరులను చదివించలేకపోతే మరిక ఏమి చదివినట్లు! పిల్లల ఉన్నతి అయితే చేయాలి కదా. పిల్లల బుద్ధిలో రోజంతా సర్వీసు గురించిన ఆలోచనలే నడవాలి.

మీరు వానప్రస్థులు కదా. వానప్రస్థుల ఆశ్రమము కూడా ఉంటుంది. వానప్రస్థుల వద్దకు వెళ్ళాలి, మరణించేందుకు ముందు లక్ష్యమైనా తెలపండి. వాణికి అతీతంగా ఆత్మ ఎలా వెళ్ళాలి. పతిత ఆత్మ అయితే వెళ్ళలేదు. భగవానువాచ నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీరు వానప్రస్థములోకి వెళ్ళిపోతారు. బనారస్ లో కూడా చాలా సేవ ఉంది. చాలామంది సాధువులు కాశీవాసము చేసేందుకు అక్కడ ఉంటారు. రోజంతా శివకాశీ విశ్వనాథ గంగా అని అంటూ ఉంటారు. మీలో సదా సంతోషపు చప్పట్లు మోగుతూ ఉండాలి. మీరు విద్యార్థులు కదా, సేవ కూడా చేస్తారు, చదువుకుంటారు కూడా. తండ్రిని స్మృతి చేయాలి, వారసత్వాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనము శివబాబా వద్దకు వెళ్తాము. ఇది 'మన్మనాభవ'. కానీ చాలామందికి గుర్తు ఉండదు. వ్యర్థ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. స్మృతియే ముఖ్యమైన విషయము. స్మృతియే సంతోషంలోకి తెస్తుంది. విశ్వశాంతి కావాలని అందరూ కోరుకుంటారు. బాబా కూడా చెప్తున్నారు - వారికి విశ్వములో ఇప్పుడు శాంతి స్థాపించబడుతోందని అర్థం చేయించండి. అందువలన బాబా లక్ష్మీనారాయణుల చిత్రానికి ఎక్కువ మహత్వమును ఇస్తారు. సుఖ, శాంతి, పవిత్రతలు అన్నీ ఉండే ప్రపంచమిప్పుడు స్థాపించబడుతోందని చెప్పండి. విశ్వములో శాంతి స్థాపించబడాలని అందరూ కోరుకుంటారు. చాలామందికి బహుమతులు కూడా లభిస్తూ ఉంటాయి. ప్రపంచములో శాంతిని స్థాపన చేసేవారు యజమానే కదా. వీరి రాజ్యములో విశ్వములో శాంతి ఉండేది. ఒకే భాష, ఒకే రాజ్యము, ఒకే ధర్మము ఉండేది. మిగిలిన ఆత్మలన్నీ నిరాకార ప్రపంచములో ఉండేవి. ఇటువంటి ప్రపంచాన్ని ఎవరు స్థాపించారు? శాంతిని ఎవరు నెలకొల్పారు? ఇక్కడ స్వర్గము ఉండేదని, వీరి(లక్ష్మినారాయణుల) రాజ్యముండేదని విదేశీయులు కూడా భావిస్తారు. ప్రపంచములో శాంతి అయితే ఇప్పుడు స్థాపించబడుతోంది. బాబా అర్థం చేయించారు - ప్రభాత యాత్రలో కూడా ఈ లక్ష్మీనారాయణుల చిత్రమును చూపించండి. ఈ రాజ్యము స్థాపించబడుతోందని అందరి చెవులలో పడాలి. నరకం వినాశనము ఎదురుగా నిలిచి ఉంది. డ్రామానుసారముగా బహుశ ఆలస్యమవుతుంది. పెద్ద పెద్ద వారి అదృష్టములో ఇప్పుడే లేదు. అయినా బాబా పురుషార్థము చేయిస్తూనే ఉంటారు. డ్రామానుసారముగా సేవ నడుస్తూ ఉంది. అచ్ఛా, గుడ్ నైట్.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సాంగత్య దోషము నుండి మిమ్ములను మీరు చాలా చాలా సంభాళన చేసుకోవాలి. ఎప్పుడూ పతితుల సాంగత్యములోకి రాకూడదు. సైలెన్స్ శక్తి ద్వారా ఈ సృష్టిని పావనంగా చేసే సేవ చేయాలి.

2. డ్రామాను బాగా అర్థము చేసుకొని హర్షితంగా ఉండాలి. మీ సర్వస్వాన్ని క్రొత్త ప్రపంచము కొరకు బదిలీ చేయాలి.

వరదానము:-

ఆత్మికత ప్రభావము ద్వారా ఫరిస్తాతనపు మేకప్ చేసుకునే సర్వుల స్నేహీ భవ

ఏ పిల్లలైతే సదా బాప్ దాదా సాంగత్యములో ఉంటారో వారికి సాంగత్యపు రంగు ఎలా పడుతుందంటే, దాని ద్వారా ప్రతి ఒక్కరి మఖముపై ఆత్మికత యొక్క ప్రభావము కనిపిస్తుంది. ఈ ఆత్మికతలో ఉండుట వలన ఫరిస్తాతనపు మేకప్ స్వతహాగా జరుగుతుంది. ఎలాగైతే మేకప్ చేసిన తర్వాత ఎవరు ఎలా ఉన్నా మారిపోతారో, మేకప్ చేయడం వలన సుందరంగా కనిపిస్తారో అలా ఇక్కడ కూడా ఫరిస్తాతనపు మేకప్ వలన మెరిసిపోతూ ఉంటారు. అంతేకాక ఈ ఆత్మిక మేకప్ సర్వుల స్నేహిగా చేస్తుంది.

స్లోగన్:-

బ్రహ్మచర్యము, యోగము మరియు దివ్యగుణాల ధారణయే వాస్తవిక పురుషార్థము.