26-03-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం
"మధురమైనపిల్లలూ - ఎలాగైతే ఆత్మలైన మీకు ఈ శరీరమనే సింహాసనము లభించిందో, అలా తండ్రి కూడా ఈ దాదా సింహాసనము పై విరాజమానమై ఉన్నారు. వారికి తమ స్వంత సింహాసనము లేదు"
ప్రశ్న:-
ఏ పిల్లలకు మేము ఈశ్వరీయ సంతానము అనే స్మృతి ఉంటుందో, వారి గుర్తులు ఏవి?
జవాబు:-
వారికి ఒక్క తండ్రి పైనే సత్యమైన ప్రేమ ఉంటుంది. ఈశ్వరీయ సంతానము ఎప్పుడూ కొట్లాడరు, గొడవపడరు. వారికి ఎప్పుడూ చెడు దృష్టి ఉండదు. ఎప్పుడైతే బ్రహ్మాకుమారులు - కుమారీలుగా అయ్యారో, అనగా సోదర - సోదరీలుగా అయ్యారో అప్పుడు చెడు దృష్టి కలుగజాలదు.
గీతము:-
ఆకాశ సింహాసనాన్ని వదిలి రా....... (ఛోడ్ భీ దే ఆకాశ్ సింహాసన్......)
ఓంశాంతి. బాబా ఆకాశ సింహాసనాన్ని వదిలి ఇప్పుడు దాదా శరీరాన్ని తమ సింహాసనంగా చేసుకున్నారని, అది వదిలి ఇక్కడకు వచ్చి కూర్చున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఈ ఆకాశ తత్వము జీవాత్మల సింహాసనము. ఆ మహాతత్వము ఆత్మల సింహాసనము. అక్కడ ఆత్మలైన మీరు శరీర రహితంగా ఉండేవారు. ఎలాగైతే ఆకాశములో నక్షత్రాలున్నాయో, అలా ఆత్మలైన మీరు కూడా చాలా చిన్న-చిన్నగా అక్కడ ఉంటారు. ఆత్మను దివ్యదృష్టి లేకుండా చూడలేము. నక్షత్రము ఎలా చిన్నదిగా ఉంటుందో, అలా ఆత్మలు కూడా బిందువుల వలె ఉంటాయని పిల్లలైన మీకు ఇప్పుడు ఈ జ్ఞానముంది. ఇప్పుడు తండ్రి అయితే తమ సింహాసనాన్ని వదిలేశారు. తండ్రి చెప్తారు - ఆత్మలైన మీరు కూడా మీ సింహాసనాన్ని వదిలి ఇక్కడ ఈ శరీరాన్ని మీ సింహాసనంగా చేసుకుంటారు. నాకు కూడా శరీరము తప్పకుండా కావాలి. నన్ను పాత ప్రపంచములోనే పిలుస్తారు. దూరదేశంలో నివసించేవారు,...... (దూరదేశ్ కా రహనే వాలా.....) అని పాట కూడా ఉంది కదా. ఆత్మలైన మీరు ఎక్కడ ఉంటారో, అది ఆత్మలు మరియు ఆత్మల తండ్రి అయిన పరమాత్మ దేశము. అక్కడ నుండి మీరు స్వర్గములోకి వెళ్తారు, దానిని తండ్రి స్థాపన చేయిస్తారు. తండ్రి స్వయం ఆ స్వర్గములోకి రారు. వారు శబ్దానికి అతీతంగా వానప్రస్థములోకి వెళ్ళి ఉంటారు. స్వర్గములో వారి అవసరము లేదు. వారు సుఖ దుఃఖాలకు అతీతమైనవారు కదా. మీరు సుఖములోకి వస్తారు, దుఃఖములోకి కూడా వస్తారు.
బ్రహ్మకుమారీ-కుమారులైన మేము సోదరీ-సోదరులమని ఇప్పుడు మీకు తెలుసు. పరస్పరములో చెడు దృష్టితో కూడిన సంకల్పము కూడా రాకూడదు. ఇక్కడైతే మీరు తండ్రి సన్ముఖములో కూర్చొని ఉన్నారు, పరస్పరము సోదరీ-సోదరులు. పవిత్రంగా ఉండేందుకు యుక్తి ఎలా ఉందో చూడండి. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. అందరి తండ్రి ఒక్కరే, కాబట్టి అందరూ పిల్లలే కదా! పిల్లలు పరస్పరము కొట్టుకోవడము-గొడవపడడము చేయరాదు. ఈ సమయంలో మేము ఈశ్వరీయ సంతానమని, దీనికి ముందు ఆసురీ సంతానంగా ఉండేవారమని మీకు తెలుసు. ఇప్పుడు సంగమ యుగములో మళ్లీ ఈశ్వరీయ సంతానంగా అయ్యాము. తర్వాత సత్యయుగములో మళ్లీ దైవీ సంతానంగా అవుతాము. ఈ చక్రము గురించి పిల్లలకు తెలిసింది. మీరు బ్రహ్మాకుమార-కుమారీలు కనుక మీకు ఎప్పుడూ చెడు దృష్టి కలగదు. సత్యయుగములో చెడు దృష్టి ఉండదు. రావణ రాజ్యములో చెడు దృష్టి ఉంటుంది. పిల్లలైన మీకు ఒక్క తండ్రి స్మృతి తప్ప వేరెవ్వరి స్మృతి ఉండరాదు. అందరికంటే ఒక్క తండ్రి పైనే ఎక్కువ ప్రీతి ఉండాలి. నాకు ఒక్క శివబాబా తప్ప వేరెవ్వరూ లేరు. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, ఇప్పుడు మీరు శివాలయానికి వెళ్లాలి. శివబాబా స్వర్గ స్థాపన చేస్తున్నారు. అర్థకల్పము రావణుని రాజ్యము నడిచింది, దాని ద్వారా దుర్గతి పొందారు. రావణుడు ఎవరు? రావణుడిని ఎందుకు కాలుస్తారో కూడా ఎవ్వరికీ తెలియదు. శివబాబాను గురించి కూడా తెలియదు. ఎలాగైతే దేవీలను అలంకరించి, పూజించి నీటిలో ముంచేస్తారో, అలా శివబాబాది కూడా మట్టి లింగాన్ని తయారు చేసి, పూజలు మొదలైనవి చేసి తర్వాత మట్టిని మట్టిలో కలిపేస్తారో, అలాగే రావణుని బొమ్మను కూడా తయారు చేసి కాలుస్తారు. ఏమీ అర్థము చేసుకోరు. ఇప్పుడిది రావణ రాజ్యము, రామరాజ్యము స్థాపనవ్వాలని కూడా అంటారు. గాంధీజీ కూడా రామరాజ్యాన్ని కోరేవారు అనగా దీని అర్థము ఇది రావణ రాజ్యము అని కదా. ఏ పిల్లలైతే ఈ రావణ రాజ్యములో, కామచితి పై కూర్చొని కాలిపోయారో తండ్రి వచ్చి వారిపై జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు, అందరి కళ్యాణము చేస్తారు. ఎండిపోయిన భూమిపై వర్షము కురిసినప్పుడు గడ్డి మొలుస్తుంది కదా అలా మీపై కూడా జ్ఞాన వర్షము కురవని కారణంగా ఎంతో నిరుపేదలైపోయారు. ఇప్పుడు మళ్లీ జ్ఞాన వర్షము కురుస్తుంది. దీని ద్వారా మీరు విశ్వానికి యజమానులుగా అయిపోతారు. పిల్లలైన మీరు గృహస్థ వ్యవహారములో ఉంటారు కానీ లోపల చాలా సంతోషం ఉండాలి. ఎవరైనా పేదపిల్లలు చదివి బ్యారిస్టరు మొదలైనవారిగా అయితే వారు కూడా పెద్ద-పెద్ద వారితో కలిసి కూర్చుంటారు, తింటారు, త్రాగుతారు. బోయ స్త్రీ విషయము కూడా శాస్త్రాలలో ఉంది కదా.
ఎవరైతే అందరికంటే ఎక్కువ భక్తి చేశారో, వారే వచ్చి అందరికంటే ఎక్కువ జ్ఞానము తీసుకుంటారని పిల్లలైన మీకు తెలుసు. ప్రారంభము నుండి అందరికంటే ఎక్కువగా భక్తిని మనమే చేశాము. మళ్లీ మొట్టమొదట మనలనే బాబా స్వర్గములోకి పంపిస్తారు. ఇది జ్ఞానయుక్తమైన యథార్థమైన మాట. మనమే పూజ్యులుగా ఉండేవారము, మళ్లీ పూజారులుగా అవుతాము. క్రిందకు దిగుతూ వెళ్తాము. పిల్లలకు పూర్తి జ్ఞానమంతా అర్థము చేయించబడుతుంది. ఈ సమయములో మొత్తం ప్రపంచములోని వారంతా నాస్తికులుగా ఉన్నారు. తండ్రి అంటే ఎవరో తెలియదు. నేతి-నేతి(మాకు తెలియదు) అని అంటారు. ముందు-ముందు ఈ సన్యాసులు మొదలైన వారందరూ వచ్చి తప్పకుండా ఆస్తికులుగా అవుతారు. ఎవరో ఒక సన్యాసి ఇక్కడకు వచ్చినా వారి పై అందరూ విశ్వాసాన్ని ఉంచరు. వీరిని బి.కె.లు మాయ చేసారు అని అంటారు. వారి శిష్యులను ఆసనంపై కూర్చోబెట్టి వారిని దించేస్తారు. అలా చాలామంది సన్యాసులు మీ వద్దకు వచ్చారు. మళ్లీ మాయమైపోతారు. ఇది చాలా అద్భుతమైన డ్రామా. ఇప్పుడు పిల్లలైన మీకు ఆది నుండి అంతము వరకు అంతా తెలుసు. మీలో కూడా నంబరువారు పురుషార్థానుసారముగా ధారణ చేయగలరు. తండ్రి వద్ద సంపూర్ణ జ్ఞానము ఉంది, మీ వద్ద కూడా ఉండాలి. రోజు రోజుకూ ఎన్ని సేవాకేంద్రాలు తెరుచుకుంటాయి. పిల్లలు చాలా దయాహృదయులుగా అవ్వాలి. తండ్రి చెప్తారు - స్వయంపై కూడా దయాహృదయులుగా అవ్వండి, నిర్దయులుగా అవ్వకండి. స్వయం పై దయ చూపుకోవాలి. ఎలా? బాబా అది కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. బాబాను స్మృతి చేసి, పతితుల నుండి పావనంగా అవ్వాలి మళ్లీ ఎప్పుడూ పతితులుగా అయ్యే పురుషార్థము చేయకూడదు. దృష్టి చాలా మంచిగా ఉండాలి. బ్రాహ్మణులైన మనము ఈశ్వరీయ సంతానము. ఈశ్వరుడు మనలను దత్తత తీసుకున్నారు కదా. ఇప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి. మొదట సూక్ష్మవతనవాసులైన ఫరిస్తాలుగా అవుతారు. ఇప్పుడు మీరు ఫరిస్తాలుగా అవుతున్నారు. సూక్ష్మవతన రహస్యము కూడా పిల్లలకు అర్థం చేయించబడింది. ఇక్కడ ఉన్నది టాకీ(శబ్దాలు), సూక్ష్మవతనములో ఉన్నది మూవీ(కదలికలు), మూలవతనములో సైలెన్స్ (నిశ్శబ్దము) ఉంటుంది. సూక్ష్మవతనము ఫరిస్తాల ప్రపంచము. ప్రేతాత్మకు నీడలాంటి శరీరముంటుంది కదా. ఆత్మకు శరీరము లభించకుంటే, అది భ్రమిస్తూ ఉంటుంది, దానిని దెయ్యము లేక భూతము అని కూడా అంటారు. వాటిని ఈ కనుల ద్వారా కూడా చూడగలరు. అయితే వీరు సూక్ష్మవతనవాసులైన ఫరిస్తాలు. ఇవన్నీ బాగా అర్థము చేసుకోవలసిన విషయాలు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము - మీకు వీటిని గురించిన జ్ఞానము ఉంది. నడుస్తూ తిరుగుతూ మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉండాలి. వాస్తవానికి మనము మూలవతన వాసులము. ఇప్పుడు మనము వయా సూక్ష్మవతనము అక్కడికి వెళ్తాము. బాబా సూక్ష్మవతనాన్ని ఈ సమయములోనే రచిస్తారు. మొదట సూక్ష్మము తర్వాత స్థూలము కావాలి. ఇప్పుడిది సంగమయుగము. దీనిని ఈశ్వరీయ యుగమని అని అంటారు, దానిని దైవీ యుగమని అంటారు. పిల్లలైన మీకు ఎంత సంతోషముండాలి! చెడు దృష్టి ఉంటే ఉన్నత పదవి పొందలేరు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ-బ్రాహ్మణీలు కదా. ఈ విషయము ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోరాదు. మీరు సాంగత్య దోషములోకి వచ్చి మర్చిపోతారు. హంసలైన మీరు ఈశ్వరీయ సంతానము. మీకు ఎవరిపైనా ఆంతరికంగా మోహము కలగరాదు. ఒకవేళ మోహము కలిగితే వారిని మోహమున్న కోతి అని అంటారు.
అందరినీ పావనంగా చేయడమే మీ కర్తవ్యము. మీరు విశ్వాన్ని స్వర్గంగా తయారు చేసేవారు. ఆ రావణుని ఆసురీ సంతానమెక్కడ. ఈశ్వరీయ సంతానమైన మీరెక్కడ! మీరు మీ స్థితిని ఏకరసంగా తయారు చేసుకునేందుకు అన్నీ చూస్తున్నా చూడనట్లుగా ఉండే అభ్యాసము చేయాలి. ఇందులో బుద్ధిని ఏకరసంగా ఉంచుకోవడం సాహసంతో కూడిన విషయము. పర్ఫెక్ట్గా తయారయ్యేందుకు శ్రమ ఉంటుంది. సంపూర్ణంగా అయ్యేందుకు సమయము పడుతుంది. ఎప్పుడు కర్మాతీత స్థితి వస్తుందో అప్పుడు ఆ దృష్టి స్థిరమవుతుంది. అంతవరకు ఏదో ఒక ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. ఇందులో పూర్తి ఉపరామంగా అవ్వవలసి ఉంటుంది. లైను క్లియర్గా ఉండాలి. చూస్తూ ఉన్నా చూడనట్లుండే అభ్యాసము ఎవరికి ఉంటుందో వారే ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడింకా ఆ స్థితి లేదు. సన్యాసులు ఈ విషయాలను అర్థము కూడా చేసుకోలేరు. ఇక్కడ చాలా శ్రమించాల్సి ఉంటుంది. మేము కూడా ఈ పాత ప్రపంచాన్ని సన్యసించామని మీకు తెలుసు. కేవలం ఇప్పుడు మనము మన స్వీట్ సైలెన్సు హోమ్లోకి వెళ్లాలి. మీ బుద్ధిలో ఎంత ఉందో, అంత వేరెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలని మీకు మాత్రమే తెలుసు. శివభగవానువాచ కూడా ఉంది - వారు పతితపావనులు, ముక్తిదాత, మార్గదర్శకులు. కృష్ణుడిని మార్గదర్శకుడని అనరు. ఈ సమయంలో మీరు కూడా అందరికీ మార్గాన్ని తెలియజేయుట నేర్చుకుంటారు కనుక మీ పేరు పాండవులు అని పెట్టబడింది. మీరు పాండవ సైన్యం. ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా అయ్యారు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలని, ఈ పాత శరీరాన్ని వదలాలని మీకు తెలుసు. సర్పము, భ్రమరము మొదలైన ఉదాహరణలన్నీ ఈ సమయములో మీకు చెందినవే. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా ఉన్నారు. వారు ఈ వ్యవహారము చేయలేరు. ఇది శ్మశానమని, ఇప్పుడు మళ్లీ స్వర్గముగా తయారవ్వాలని మీకు తెలుసు.
మీ కొరకు అన్ని రోజులూ లక్కీ రోజులే. పిల్లలైన మీరు సదా అదృష్టవంతులే. గురువారము రోజున పిల్లలను పాఠశాలలో కూర్చోబెడ్తారు. ఈ ఆచారము కొనసాగుతూ వస్తున్నది. ఇప్పుడు మిమ్ములను వృక్షపతి చదివిస్తున్నారు. మీ ఈ బృహస్పతి దశ జన్మ-జన్మాంతరాలు నడుస్తుంది. ఇది అనంతమైన దశ. భక్తిమార్గములో హద్దులోని దశలుంటాయి. ఇప్పుడున్నది అనంతమైన దశ కనుక పూర్తిగా శ్రమ చేయాలి. లక్ష్మీనారాయణులేమీ ఒక్కరే ఉండరు కదా. వారి వంశముంటుంది కదా. కనుక తప్పకుండా చాలామంది రాజ్యము చేస్తూ ఉంటారు. లక్ష్మీనారాయణుల సూర్యవంశ సామ్రాజ్యము నడుస్తుంది అని ఈ విషయాలు కూడా మీ బుద్ధిలో ఉన్నాయి. అక్కడ రాజ్యతిలకమెలా ఇస్తారో, సూర్యవంశీయులు మళ్లీ చంద్రవంశీయులకు రాజ్యాన్ని ఎలా ఇస్తారో, పిల్లలైన మీకు సాక్షాత్కారమయింది. తల్లిదండ్రులు పిల్లల కాళ్ళు కడిగి రాజ్యతిలకాన్ని ఇస్తారు, రాజ్యభాగ్యాన్ని ఇస్తారు. ఈ సాక్షాత్కారాలు మొదలైనవన్నీ డ్రామాలో నిర్ణయింపబడినవి. ఇందులో పిల్లలైన మీరు తికమక చెందవలసిన అవసరము లేదు. మీరు తండ్రిని స్మృతి చేయండి, స్వదర్శన చక్రధారులుగా అవ్వండి, ఇతరులను కూడా తయారు చేయండి. మీరు బ్రహ్మా ముఖవంశావళి, స్వదర్శన చక్రధారులైన సత్యమైన బ్రాహ్మణులు, శాస్త్రాలలో స్వదర్శన చక్రముతో ఎన్ని హింసలు చూపించారు! ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు సత్యమైన గీతను వినిపిస్తారు. దీనిని కంఠస్థము చేయవలసి ఉంటుంది. ఎంత సహజము. మీ సంబంధమంతా గీతతోనే ఉంది. గీతలో జ్ఞానము కూడా ఉంది, యోగము కూడా ఉంది. మీరు కూడా ఒకే పుస్తకమును తయారుచేయాలి. యోగ పుస్తకమును వేరుగా ఎందుకు తయారు చేయాలి. కానీ వర్తమాన సమయములో యోగానికి చాలా పేరు ప్రఖ్యాతులున్నాయి. కనుక మనుష్యులు వచ్చి తెలుసుకోవాలని ఆ పేరునుంచుతారు. యోగము ఒక్క తండ్రితోనే జోడించాలని చివరికి అర్థము చేసుకుంటారు. ఎవరైతే వింటారో, వారు మళ్లీ తమ ధర్మములోకి వచ్చి ఉన్నత పదవిని పొందుతారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మీపై మీరే దయ చూపుకోవాలి, మీ దృష్టిని చాలా మంచిగా, పవిత్రంగా ఉంచుకోవాలి. ఈశ్వరుడు మనుష్యుల నుండి దేవతలుగా చేసేందుకు దత్తత తీసుకున్నారు. కనుక పతితులుగా అయ్యే ఆలోచన కూడా ఎప్పుడూ రాకూడదు.
2. సంపూర్ణ, కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు సదా ఉపరామంగా ఉండే అభ్యాసము చేయాలి. ఈ ప్రపంచములో అన్నీ చూస్తున్నా, చూడనట్లుండాలి. ఈ అభ్యాసము ద్వారానే స్థితిని ఏకరసంగా తయారు చేసుకోవాలి.
వరదానము:-
శ్రేష్ఠమైన పాలనా విధి ద్వారా వృద్ధి చేసే అందరి అభినందనలకు పాత్రలుగా కండి
సంగమయుగము అభినందనలతోనే వృద్ధి చెందే యుగము. తండ్రి, పరివారముల అభినందనలతోనే పిల్లలైన మీరు పాలింపబడుతున్నారు. అభినందనలతోనే నాట్యము చేస్తూ, పాడుతూ, పాలింపబడుతూ, ఎగురుతూ వెళ్తున్నారు. ఈ పాలన కూడా అద్భుతమైనది. కనుక పిల్లలైన మీరు కూడా విశాల హృదయంతో, దయా భావనతో, దాతలుగా అయి ప్రతి ఘడియ ఒకరికొకరు చాలా బాగుంది, చాలా బాగుంది అంటూ అభినందనలు తెలుపుకుంటూ ఉండండి - ఇదే పాలన చేసే శ్రేష్ఠమైన విధి. ఈ విధి ద్వారా అందరి పాలనను చేస్తూ ఉంటే అభినందనలకు పాత్రులుగా అవుతారు.
స్లోగన్:-
మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి - ఇదే సమాధాన స్వరూపులుగా అయ్యేందుకు సహజ విధి.
మాతేశ్వరిగారిఅమూల్యమైనమహావాక్యాలు
"అర్ధకల్పముజ్ఞానముబ్రహ్మాపగలు, అర్ధకల్పముభక్తిమార్గముబ్రహ్మారాత్రి"
అర్ధకల్పము బ్రహ్మా పగలు, అర్ధకల్పము బ్రహ్మా రాత్రి. ఇప్పుడు రాత్రి పూర్తి అయి ఉదయం రానున్నది. ఇప్పుడు పరమాత్మ వచ్చి అంధకారాన్ని అంత్యము చేసి వెలుగును ప్రారంభిస్తారు. జ్ఞానము ద్వారా వెలుతురు, భక్తితో అంధకారముంది. పాటలో కూడా ఈ పాపపు ప్రపంచము నుండి ఎక్కడికైనా దూరంగా, చిత్తము ఎక్కడ సుఖము పొందుతుందో... అక్కడకు తీసుకెళ్ళమని ఉంది కదా. ఇది ప్రశాంతత లేని ప్రపంచము, ఇక్కడ శాంతి లేదు. ముక్తిలో శాంతి లేదు, అశాంతి లేదు. సత్య-త్రేతా యుగాలు ప్రశాంతమైన ప్రపంచము. ఆ సుఖధామాన్ని అందరూ గుర్తు చేసుకుంటారు. కనుక ఇప్పుడు మీరు ప్రశాంతమైన ప్రపంచంలోకి వెళ్తున్నారు. అక్కడకు ఏ అపవిత్ర ఆత్మలు వెళ్లలేరు. వారు అంత్యములో ధర్మరాజు శిక్షలను అనుభవించి కర్మబంధనాల నుండి ముక్తులుగా అయి శుద్ధ సంస్కారాలను తీసుకెళ్తారు. ఎందుకంటే అక్కడ అశుద్ధ సంస్కారాలు ఉండవు, పాపము ఉండదు. ఎప్పుడైతే ఆత్మ తన నిజమైన తండ్రిని మర్చిపోతుందో అప్పుడు ఈ భూలభులైయా అనే అనాది నాటకము, గెలుపు-ఓటముల నాటకము తయారుచేయబడి ఉంది. అందుకే మీరు మీ సర్వశక్తివంతుడైన పరమాత్మ నుండి శక్తి తీసుకొని వికారాలపై విజయము పొంది 21 జన్మలకు రాజ్యభాగ్యము తీసుకుంటున్నారు. అచ్ఛా. ఓం శాంతి.