26-02-2020 ప్రాత:మురళిఓంశాంతి"బాప్దాదా" మధువనం
'' మధురమైన పిల్లలారా - ఆత్మాభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేయమని మీకు శ్రీమతము లభించింది. ఏ విషయములోనూ మీరు వాదించరాదు. ''
ప్రశ్న:-
బుద్ధియోగము స్వచ్ఛంగా అయి తండ్రితో జోడింపగలగాలి. అందుకు ఏ యుక్తి రచింపబడింది?
జవాబు:-
ఏడు రోజుల భట్టీ. ఎవరైనా కొత్తవారు వచ్చినప్పుడు వారిని ఏడు రోజుల భట్టీలో కూర్చోబెట్టండి. దీని ద్వారా బుద్ధిలోని మలినాలు తొలగి గుప్తమైన తండ్రిని, గుప్తమైన చదువును, గుప్తమైన వారసత్వాన్ని గుర్తించగలరు. ఒకవేళ అలాగే కూర్చుంటే తికమకపడ్తారు. ఏమీ అర్థము చేసుకోలేరు.
గీతము:-
మేల్కోండి, ప్రేయసులారా, మేల్కోండి,...........(జాగ్ సజనియా జాగ్,.........)
ఓంశాంతి.
పిల్లలను జ్ఞానయుక్త ఆత్మలుగా తయారు చేసేందుకు ఇలాంటి పాటలు వినిపించి దాని అర్థమును వివరించాలి. అప్పుడు పిల్లల నోరు తెరుచుకుంటుంది. సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము ఎంతవరకు వారి బుద్ధిలో ఉందో తెలుస్తుంది. పిల్లలైన మీ బుద్ధిలో పై నుండి క్రింది వరకు అనగా మూలవతనము, సూక్ష్మ వతనము, స్థూల వతనాల ఆదిమధ్యాంతాల పూర్తి రహస్యము ప్రకాశిస్తూ ఉంటుంది. తండ్రి వద్ద ఈ జ్ఞానముంది, దానిని మీకు వినిపిస్తారు. ఇది పూర్తిగా నూతనమైన జ్ఞానము. శాస్త్రాలు మొదలైనవాటిలో పేరు మాత్రమే ఉంది కాని ఆ పేరు ఎత్తిన వెంటనే అడ్డుకుంటారు, వాదించడం ప్రారంభిస్తారు. ఇక్కడ పూర్తి సులభ పద్ధతిలో అర్థము చేయిస్తారు. భగవానువాచ - ''నన్ను స్మృతి చేయండి, నేనే పతితపావనుడను''. కృష్ణుడు లేక బ్రహ్మ, విష్ణు, శంకరుడు మొదలగువారిని ఎప్పుడూ పతిత పావనులని అనరు. సూక్ష్మవతన వాసులను కూడా మీరు పతితపావనులని అనరు. అటువంటప్పుడు స్థూల వతనములోని మనుష్యులు పతిత పావనులుగా ఎలా అవ్వగలరు? ఈ జ్ఞానము కూడా మీ బుద్ధిలో మాత్రమే ఉంది. శాస్త్రాలను గురించి ఎక్కువగా వాదించడం మంచిది కాదు. చాలా వాదవివాదాలు జరుగుతాయి. ఒకరినొకరు లాఠీలతో కొట్టుకునేందుకు కూడా సిద్ధమవుతారు. మీకు చాలా సులభంగా అర్థం చేయించబడ్తుంది. శాస్త్ర్రాల విషయంలో అతిగా లోతుకు వెళ్లరాదు. ఆత్మాభిమానులుగా అవ్వడమే ముఖ్యమైన విషయము. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఈ శ్రీమతము ముఖ్యమైనది. మిగిలినదంతా దీని విస్తారము మాత్రమే. బీజము చాలా చిన్నదిగా ఉంటుంది. మిగిలినదంతా వృక్ష విస్తారము. ఎలాగైతే బీజములో వృక్ష జ్ఞానమంతా ఇమిడి ఉంటుందో, అలా ఈ జ్ఞానమంతా బీజమైన బాబాలో ఇమిడి ఉంది. మీ బుద్ధిలోకి బీజము, వృక్షము రెండూ వచ్చేశాయి. మీరు అర్థము చేసుకున్నట్లు ఇతరులెవ్వరూ ఈ విషయాలను అర్థము చేసుకోలేరు. వృక్షము ఆయువునే చాలా ఎక్కువగా వ్రాసేశారు. తండ్రి కూర్చొని బీజము మరియు వృక్షము అనగా డ్రామా చక్ర రహస్యాన్ని అర్థము చేయిస్తున్నారు. మీరు స్వదర్శన చక్రధారులు. ఎవరైనా కొత్తవారు వచ్చినప్పుడు స్వదర్శన చక్రధారి పిల్లలారా! అని బాబా వారిని మహిమ చేస్తే ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. వారు స్వయాన్ని బాబా పిల్లలమని కూడా భావించరు. ఈ తండ్రి కూడా గుప్తమే, జ్ఞానము కూడా గుప్తమే, వారసత్వము కూడా గుప్తమే. కొత్తవారు ఎవరైనా వింటే తికమకపడ్తారు. అందుకే ఏడు రోజుల భట్టీలో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఇక్కడ భాగవతము, రామాయణము మొదలైన వాటిని 7 రోజులు వినిపించే సాంప్రదాయము, ఇప్పటి 7 రోజుల భట్టీకి స్మృతిచిహ్నమే. దీని ద్వారా వారి బుద్ధిలోని మలినాలన్నీ తొలగి బుద్ధియోగము ఒక్క బాబాతో జోడింపబడ్తుంది. ఇక్కడ ఉన్నవారంతా రోగులే. సత్యయుగములో ఈ రోగాలు ఉండవు. ఇది అర్ధకల్పపు రోగము. 5 వికారాల రోగము చాలా పెద్దది. అక్కడ అందరూ దేహీ-అభిమానులుగా ఉంటారు. మేము ఆత్మలము, ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటామని వారికి ముందుగానే సాక్షాత్కారము అవుతుంది. అక్కడ అకాలమృత్యువులు ఉండవు. మీకు మృత్యువు పై విజయం ప్రాప్తి చేయించడం జరుగుతుంది. తండ్రిని మృత్యువులకు మృత్యువు మహాకాలుడని అంటారు. మహాకాలుని మందిరము కూడా ఉంటుంది. సిక్కు ధర్మము వారి అకాల సింహాసనము కూడా అమృత్సర్లో ఉంది. వాస్తవావానికి ఈ భృకుటియే అకాల సింహాసనము. ఇందులో ఆత్మ విరాజమానమై ఉంటుంది. ఆత్మలన్నీ ఈ అకాల సింహాసనము పై కూర్చుని ఉన్నాయి. ఈ విషయాలు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. తండ్రికి తన స్వంత సింహాసనమంటూ ఏదీ లేదు. వారు వచ్చి ఇతని సింహాసనాన్ని తీసుకుంటారు. ఈ సింహాసనము పై కూర్చొని పిల్లలైన మిమ్ములను పవిత్ర(నెమలి) సింహాసనాధికారులుగా చేస్తారు. లక్ష్మీనారాయణులు విరాజమానమై ఉండే పవిత్ర(తావూసీ) సింహాసనము ఎలా ఉంటుందో మీకు తెలుసు. తావూసి(పవిత్ర, నెమలి) సింహాసనము మహిమ చేయబడింది కదా.
వారిని భోలానాథ భగవంతుడు అని ఎందుకు అంటారో ఆలోచించండి. భోలానాథ భగవంతుడని అనడం వలన బుద్ధి పైకి వెళ్లిపోతుంది. సాధు సత్పురుషులు మొదలైనవారు భోలానాథుని స్మృతి చేయండి అని వ్రేలితో పైకి సంకేతము కూడా చేస్తారు కదా. అయితే యథార్థ రీతిలో ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. ఇప్పుడు పతిత పావనులైన తండ్రి సన్ముఖంలో వచ్చి, నన్ను స్మృతి చేయండి, మీ వికర్మలు తప్పకుండా వినాశమవుతాయని గ్యారంటీ ఇస్తున్నారు. గీతలో కూడా వ్రాయబడి ఉంది. కాని మీరు గీతలోని ఒక్క ఉదాహరణ చెప్తే వారు పది ఉదాహరణలు ఇస్తారు. కనుక వాటి అవసరము లేదు. ఎవరైతే శాస్త్రాలు మొదలైనవి చదివి ఉంటారో వారు మేము వాదించగలము అని అనుకుంటారు. పిల్లలైన మీలో ఎవరికైతే ఈ శాస్త్రాలు మొదలైన వాటి గురించి తెలియదో వారు వాటి పేరే ఎత్తరాదు. కేవలం భగవంతుడు - ''తండ్రినైన నన్ను స్మృతి చేయండి'' అని చెప్తున్నారని చెప్పండి. వారినే పతితపావనులు అని అంటారు. పతిత పావన సీతారామ!.............. అని మహిమ కూడా చేస్తారు. సన్యాసులు కూడా అక్కడక్కడ పాడుతూ ఉంటారు. ఇటువంటి అభిప్రాయాలు అనేకమున్నాయి కదా. ఈ పాట ఎంత బాగుంది, డ్రామా ప్లాను అనుసారము కల్ప-కల్పము ఇలాంటి పాటలు తయారవుతాయి. పిల్లలైన మీ కొరకే తయారు చేయబడినట్లు ఉంటాయి. ఉదాహరణానికి నయన హీనులకు దారి చూపండి ప్రభూ!..... ఇటువంటి మంచి మంచి పాటలున్నాయి. ప్రభువు అని కృష్ణుని అనరు. ప్రభువు అని నిరాకారుడినే అంటారు. ఇక్కడ మీరు వారిని బాబా అని, పరమపిత పరమాత్మ అని అంటారు. నిజానికి వారు కూడా ఆత్మయే కదా. భక్తిమార్గములో చాలా అతిగా వెళ్లారు. ఇక్కడ పూర్తిగా సాధారణమైన విషయము - అల్ఫ్ మరియు బే. అల్ఫ్(అల్లా), బే బాద్షాహీ(సామ్రాజ్యము). ఇంత సాధారణమైన(సింపుల్) విషయము. తండ్రిని స్మృతి చేస్తే మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధిపతులుగా, సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. కనుక బాబాను స్మృతి చేయడం ద్వారానే మీరు ఇలా సంపూర్ణులుగా అవుతారు. ఎవరు ఎంత స్మృతి చేస్తారో, ఎంత సర్వీసు చేస్తారో వారు అంత ఉన్నతపదవిని పొందుతారు. అది అర్థం కూడా అవుతుంది. మేము తక్కువగా చదువుకుంటున్నామని పాఠశాలలోని విద్యార్థులకు అర్థమవ్వదా! ఎవరైతే పూర్తి అటెన్షన్ ఉంచరో వారు వెనుక కూర్చొని ఉంటారు. కనుక తప్పకుండా ఫెయిల్ అవుతారు.
మిమ్ములను మీరు రిఫ్రెష్ చేసుకునేందుకు జ్ఞానములో ఏ మంచి-మంచి పాటలు తయారై ఉన్నాయో వాటిని వినాలి. ఇలాంటి పాటలు మీ ఇంట్లో ఉంచుకోవాలి, ఇతరులకు ఈ పాటలు వినిపించి అర్థం చేయించవచ్చు. మన పై మాయ నీడ మళ్లీ ఎలా పడ్తుందో ఎవరికైనా తెలపవచ్చు. కల్పము ఆయువు 5 వేల సంవత్సరాలు అనే విషయం శాస్త్రాలలో లేదు. బ్రహ్మ రాత్రి, బ్రహ్మ పగలు సగము సగము ఉంటాయి. ఈ పాటను కూడా ఎవరో తయారు చేయించారు. బాబా బుద్ధివంతుల బుద్ధి. కనుక ఎవరి బుద్ధిలోకి వచ్చిందో వారు కూర్చొని తయారుచేశారు. ఈ పాటలు మొదలైనవి విని మీ వద్ద కూడా ఎంతమంది ధ్యానములోకి వెళ్లేవారు! ఈ జ్ఞాన పాటలు పాడేవారు కూడా మీ వద్దకు వచ్చే రోజు వస్తుంది. బాబా మహిమ చేస్తూ ఇలాంటి తన్మయత్వము అనగా ప్రభావితము చేసే పాటలు కూడా పాడ్తారు. అలాంటివారు కూడా వస్తారు. తన్మయత్వమవ్వడం రాగము పై కూడా ఆధారపడి ఉంటుంది. గాన విద్యకు కూడా చాలా పేరు ప్రతిష్ఠలున్నాయి. ఇప్పుడు అలా జ్ఞాన పాటలు పాడేవారు ఎవ్వరూ లేరు. కేవలం ఒక పాటను మాత్రము తయారుచేశారు - కితనా మీఠా, కితనా ప్యారా(బాబా ఎంత మధురమైనవారు, ఎంత ప్రియమైనవారు). బాబా చాలా మధురమైనవారు, చాలా ప్రియమైనవారు అందుకే వారిని అందరూ స్మృతి చేస్తారు. అలాగని దేవతలు కూడా వారిని స్మృతి చేస్తారని కాదు. చిత్రాలలో రాముడు పూజ చేస్తున్నట్లు వారి ముందు కూడా శివలింగాన్ని చూపించారు. ఇది తప్పు. దేవతలు ఎవ్వరినీ స్మృతి చేయరు. స్మృతి చేసేవారు మనుష్యులు. మీరు కూడా ఇప్పుడు మనుష్యులుగా ఉన్నారు తర్వాత మీరే దేవతలుగా అవుతారు. దేవతలకు, మనుష్యులకు రాత్రికి-పగలుకు ఉన్నంత వ్యత్యాసముంది. ఆ దేవతలే మళ్లీ మనుష్యులుగా అవుతారు. ఈ చక్రము ఎలా తిరుగుతూ ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. మేము సత్య-సత్యమైన దేవతలుగా అవుతామని ఇప్పుడు మీకు తెలిసింది. ప్రస్తుతము మనము బ్రాహ్మణులము, నూతన ప్రపంచములో దేవతలుగా పిలువబడ్తాము. ఇది విని మీరు ఆశ్చర్యపడ్తారు. ఈ బ్రహ్మ కూడా ఈ జన్మలో మొదట పూజారిగా ఉండేవాడు. శ్రీ నారాయణుని మహిమ చేసేవాడు. నారాయణుని పై చాలా ప్రీతి ఉండేది. ఇప్పుడు తానే అలా తయారవ్వడం ఒక అద్భుతమనిపిస్తుంది. కనుక ఖుషీ పాదరస మీటరు ఎంత పైకెక్కాలి! మీరు గుప్త సైనికులు, అహింసావాదులు, వాస్తవానికి మీరు డబల్ అహింసకులు. కామ ఖడ్గమూ లేదు, ఆ జగడాలూ లేవు. కామము వేరు, క్రోధము వేరు. కనుక మీరు డబల్ అహింసకులు. అహింసాయుత సైనికులు. సైన్యము అను పదమున్నందున వారు సైన్యాలను నిలబెట్టారు. మహాభారత యుద్ధములో పురుషుల పేర్లు మాత్రమే చూపించారు. స్త్రీలు లేరు. వాస్తవానికి మీరు శివశక్తులు. మెజారిటి మీదే అయిన కారణంగా శివశక్తి సైన్యము అని చెప్పబడింది. ఈ విషయాలను తండ్రియే కూర్చొని అర్థము చేయిస్తున్నారు.
ఇప్పుడు పిల్లలైన మీరు నూతన యుగాన్ని స్మృతి చేస్తారు. ప్రపంచంలో ఎవ్వరికీ నూతన యుగము గురించి తెలియదు. నవ యుగము 40 వేల సంవత్సరాల తర్వాత వస్తుందని భావిస్తారు. సత్యయుగమే నవ యుగమని ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఇలాంటి మంచి-మంచి పాటలు కూడా విని రిఫ్రెష్ అయ్యి ఇతరులకు కూడా అర్థము చేయించమని బాబా సలహానిస్తారు. ఇవన్నీ యుక్తులు. పాటల భావాలు కేవలం మీరు మాత్రమే అర్థము చేసుకోగలరు. మిమ్ములను మీరు రిఫ్రెష్ చేసుకునేందుకు చాలా మంచి-మంచి పాటలున్నాయి. ఈ పాటలు చాలా సహాయపడ్తాయి. వాటి అర్థము ఇతరులకు చెప్పడం ద్వారా మీ నోరు కూడా తెరవబడ్తుంది. సంతోషము కూడా కలుగుతుంది. ఎవరైతే ఎక్కువగా ధారణ చేయలేరో, వారు ఇంట్లోనే కూర్చొని బాబాను స్మృతి చేస్తూ ఉండండి అని తండ్రి చెప్తారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ కేవలం ఈ మంత్రాన్ని జ్ఞాపకముంచుకోండి - ''యోగీ భవ, పవిత్ర భవ(తండ్రిని స్మృతి చేయండి, పవిత్రులు కండి).'' భగవంతుని ఇంట్లో కూర్చొని కూడా స్మృతి చేయవచ్చు. గుళ్లు, గోపురాలు మొదలైన వాటి చుట్టూ వ్యర్థంగా తిరిగే అవసరం ఏముంది? మేము మీకు ఇంట్లోనే విగ్రహాలను ఇస్తాము, ఇక్కడే కూర్చొని స్మృతి చేయండి, ఎదురుదెబ్బలు తినేందుకు ఎందుకు వెళ్తారు అని చాలామంది పురుషులు స్త్రీలను బయటకు వెళ్లనిచ్చే వారు కాదు. అక్కడైనా, ఇంట్లో అయినా పూజ చేయడం, స్మృతి చేయడమే కదా. ఒకసారి చూస్తే తర్వాత స్మృతి చేయగలరు కదా. నెమలి కిరీటధారి కృష్ణుని చిత్రము అన్నిచోట్లా ఉంది. అక్కడ ఎలా జన్మ జరుగుతుందో పిల్లలైన మీకు సాక్షాత్కారమయ్యింది. అయితే మీరు దానిని చిత్రించగలరా?(ఫోటో తీయగలరా?) ఎవ్వరూ ఖచ్ఛితంగా చిత్రించలేరు. దివ్యదృష్టి ద్వారా కేవలం చూడగలరు కాని దానిని చిత్రించలేరు. చూసి వర్ణన చేయవచ్చు కాని దానిని చిత్రీకరించలేరు (పెయింట్ చేయలేరు). ఎంత మంచి చిత్రకారుడైనా(పెయింటర్ అయినా) సాక్షాత్కారాము పొందినా ఖచ్ఛితమైన పోలికలను చిత్రీకరించలేడు. కనుక ఎవరితోనూ ఎక్కువగా వాదించరాదని తండ్రి అర్థం చేయించారు. వారికిలా చెప్పండి - మీకు శాంతి కావాలంటే తండ్రిని స్మృతి చేయండి, పవిత్రమవ్వండి. పవిత్రాత్మలు ఇక్కడ ఉండలేరు. వారు వాపస్ ఇంటికి వెళ్లిపోతారు. ఆత్మను పావనంగా చేసే శక్తి ఒక్క తండ్రిలోనే ఉంది. ఇతరులెవ్వరూ పావనంగా చెయ్యలేరు. ఇదంతా ఒక రంగస్థలమని, దీని పై నాటకం జరుగుతూ ఉందని మీకు తెలుసు. ఈ సమయంలో దీని పై రావణ రాజ్యముంది. సృష్టి అంతా సముద్రము పై నిలిచి ఉంది. ఇది అనంతమైన ద్వీపము. అవి హద్దులోనివి, ఇది అనంతమైన విషయము. దీని పై అర్ధకల్పము దైవీ రాజ్యము, అర్ధకల్పము ఆసురీ రాజ్యముంటుంది. ఖండాలు వేరు వేరుగా ఉన్నాయి. కాని ఇదంతా పూర్తి బేహద్ విషయము. మనము గంగ, యమున తీయటి నదీ తీరాలలో నివసిస్తామని మీకు తెలుసు. సముద్రము వద్దకు వెళ్లే అవసరమే ఉండదు. ద్వారక సముద్రము మధ్యలో ఉండదు. ద్వారక వేరే వస్తువేదో కాదు. పిల్లలైన మీకు అంతా సాక్షాత్కారమయ్యింది. ప్రారంభములో ఈ సందేశీ గుల్జారుకు చాలా సాక్షాత్కారాలు అయ్యేవి. వీరు చాలా పెద్ద పాత్రను అభినయించారు. ఎందుకంటే భట్టీలో పిల్లలను సంతోష పెట్టాల్సి ఉండినది. కనుక సాక్షాత్కారాల ద్వారా చాలా చాలా సంతోషించారు. మళ్లీ చివర్లో కూడా చాలా సంతోషిస్తారు అని తండ్రి చెప్తున్నారు. ఆ పాత్ర వేరుగా ఉంటుంది. మేము ఏం చూశామో అది మీరు చూడలేదు అని ఒక పాట కూడా ఉంది కదా. మీరు త్వరత్వరగా సాక్షాత్కారాలు పొందుతూ ఉంటారు. ఎలాగైతే పరీక్ష రోజులు సమీపానికి వస్తున్న కొలది మేము ఎన్ని మార్కులతో పాస్ అవుతామని విద్యార్థులకు తెలుస్తుందో అలా మీది కూడా ఆ చదువు వంటిదే. ఇప్పుడు మీరు జ్ఞాన సంపన్నులైనట్లు కూర్చొని ఉన్నారు. అందరూ ఫుల్(సంపన్నము)గా ఉండరు. పాఠశాలలో సదా నంబరువారుగా ఉంటారు. ఇది కూడా జ్ఞానము - మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము 3 లోకాల జ్ఞానము మీలో ఉంది. ఈ సృష్టిచక్రాన్ని మీరు తెలుసుకున్నారు. ఇది తిరుగుతూ ఉంటుంది. తండ్రి చెప్తారు - మీకు ఏ జ్ఞానాన్ని ఇచ్చానో అది ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. మీ పై అనంతమైన దశ ఉంది. కొందరి పై బృహస్పతి దశ ఉంది. ఎవరి పై అయినా రాహు దశ ఉంటే అక్కడకు వెళ్లి చండాలురు మొదలైనవారిగా అవుతారు. ఇది అనంతమైన దశ. అది హద్దులోని దశ. అనంతమైన తండ్రి అనంతమైన విషయాలను వినిపిస్తారు. అనంతమైన వారసత్వమునిస్తారు పిల్లలైన మీకు ఎంత సంతోషముండాలి! మీరు అనేకసార్లు సామ్రాజ్యాన్ని తీసుకున్నారు, పోగొట్టుకున్నారు. ఇది పక్కాగా జరిగే విషయం. నథింగ్ న్యూ(ఇందులో కొత్తదేమీ లేదు) అని భావిస్తే మీరు సదా హర్షితంగా ఉండగలరు లేకుంటే మాయ అడ్డగిస్తుంది.
కనుక మీరంతా ఒక్క ప్రియతముని ప్రేయసులు. ప్రేయసులందరూ ఆ ఒక్క ప్రియతముడినే స్మృతి చేస్తారు. వారు వచ్చి అందరికీ సుఖమునిస్తారు. అర్ధకల్పము వారిని స్మృతి చేశారు. ఇప్పుడు వారు లభించారు కనుక ఎంత సంతోషంగా ఉండాలి! మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సదా హర్షితంగా ఉండేందుకు ఏదీ కొత్తది కాదు(నథింగ్ న్యూ ) అను పాఠాన్ని పక్కా చేసుకోవాలి. అనంతమైన తండ్రి మాకు అనంతమైన సామ్రాజ్యాన్ని ఇస్తున్నారు అన్న సంతోషంలో ఉండాలి.
2. జ్ఞానములోని మంచి మంచి పాటలు విని స్వయాన్ని రిఫ్రెష్ చేసుకోవాలి, దాని అర్థాన్ని తెలుసుకొని ఇతరులకు వినిపించాలి.
వరదానము:-
'' అనేక ప్రకారాలైన ప్రవృత్తి నుండి నివృత్తమయ్యే నిర్మోహి స్మృతి స్వరూప భవ ''
స్వంత ప్రవృత్తి, దైవీ పరివార ప్రవృత్తి, సేవా ప్రవృత్తి, హద్దు ప్రాప్తుల ప్రవృత్తి మొదలైన అన్ని ప్రవృత్తుల నుండి నిర్మోహులుగా అనగా అతీతంగా అయ్యేందుకు బాప్దాదా స్నేహ రూపాన్ని ముందుంచుకొని స్మృతి స్వరూపులుగా అవ్వండి. స్మృతి స్వరూపులుగా అవ్వడం ద్వారా స్వతహాగానే నిర్మోహులుగా అవుతారు. ప్రవృత్తి నుండి నివృత్తులుగా అవ్వడం అనగా 'మైపన్ ను(నాది)' సమాప్తం చేసి నిర్మోహులుగా అవ్వడం. ఇలా నిర్మోహులుగా అయ్యే పిల్లలు చాలాకాలపు పురుషార్థం నుండి చాలాకాలపు ప్రాలబ్ధ ప్రాప్తికి అధికారులుగా అవుతారు.
స్లోగన్:-
'' కమలపుష్ప సమానం అతీతంగా ఉంటే, ప్రభువు ప్రేమ లభిస్తూ ఉంటుంది. ''