01-08-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - ఇప్పుడు వాపసు ఇంటికి వెళ్లాలి. అందువలన తండ్రిని స్మృతి చేసేందుకు, తమ చరిత్ర (స్వభావ-సంస్కారముల)ను సరిదిద్దుకునేందుకు శ్రమించండి. ''

ప్రశ్న :-

అజ్ఞాన నిద్రలో నిద్రపుచ్చే విషయము ఏది? దాని వలన ఏ నష్టము జరిగింది?

జవాబు :-

కల్పాయువును లక్షల సంవత్సరాలని చెప్పడం అజ్ఞాన నిద్రలో నిదురింపజేసే విషయము. దీని వలన జ్ఞాన నేత్ర హీనులుగా అయిపోయారు. ఇల్లు చాలా దూరంగా ఉందని భావిస్తారు. లక్షల సంవత్సరాల వరకు ఇక్కడే సుఖ-దు:ఖాల పాత్ర చేయాలని బుద్ధిలో ఉంది. అందువలన పావనంగా అయ్యేందుకు కష్టపడరు. కాని ఇప్పుడు ఇల్లు చాలా సమీపంగా ఉందని, మనమిప్పుడు కష్టపడి కర్మాతీతముగా అవ్వాలని పిల్లలైన మీకు తెలుసు.

ఓంశాంతి.

మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి ఇప్పుడు ఇంటిని గుర్తు చేయిస్తున్నారు. భలే భక్తిమార్గములో కూడా ఇంటిని స్మృతి చేస్తారు కానీ ఎప్పుడు, ఎలా వెళ్లాలో ఏమీ తెలియదు. కల్పము ఆయువును లక్షల సంవత్సరాలని చెప్పినందున ఇంటిని కూడా మర్చిపోయారు. లక్షల సంవత్సరాలు ఇక్కడే పాత్ర చేయాలని భావించారు. కావున ఇంటిని మర్చిపోతారు. ఇప్పుడు తండ్రి గుర్తు చేయిస్తున్నారు - పిల్లలారా! ఇల్లు చాలా సమీపంగా ఉంది, ఇప్పుడు మన ఇంటికి వెళ్తాము. పిల్లలైన మీరు పిలిచినందువలన నేను వచ్చాను. ఇంటికి వెళ్దామా? ఎంత సహజమైన విషయము! భక్తి మార్గములో అయితే ముక్తిధామానికి ఎప్పుడు వెళ్తామో తెలియదు. ముక్తిధామమునే ఇల్లు అని అంటారు. లక్షల సంవత్సరాలని అన్నందున అందరూ మర్చిపోతారు. తండ్రిని, ఇంటిని కూడా మర్చిపోతారు. లక్షల సంవత్సరాలని చెప్పడము వలన చాలా తేడా వచ్చేస్తుంది. అజ్ఞాన నిద్రలో నిద్రపోయినట్లు ఉన్నారు. ఎవ్వరికీ అర్థము కాదు. భక్తిమార్గములో ఇల్లు చాలా దూరంగా ఉందని చెప్తారు. ఇప్పుడు ఆ ముక్తిధామములోకి వెళ్లాలని తండ్రి చెప్తున్నారు. లక్షల సంవత్సరాలు మీరు భక్తి చేయరు. భక్తి ఎప్పటి నుండి పారంభమయ్యిందో కూడా మీకు తెలియదు. లక్షల సంవత్సరాలను లెక్కించే అవసరమే లేదు. తండ్రిని మరియు ఇంటిని మర్చిపోతారు. ఇది కూడా డ్రామాలో రచింపపడింది. కానీ అనవసరంగా ఇంత దూరము చేసేస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - పిల్లలారా, ఇల్లు చాలా దగ్గరగా ఉంది, నేనిప్పుడు మిమ్ములను తీసుకెళ్లేందుకు వచ్చాను. ఇంటికి వెళ్లాలంటే తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. గంగా స్నానము మొదలైనవి మీరు చేస్తూ వచ్చారు కానీ పవిత్రంగా అవ్వలేదు. పవిత్రంగా అయ్యి ఉంటే ఇంటికి వెళ్లిపోయేవారు. కానీ ఇంటి గురించే తెలియకుంటే, పవిత్రత గురించి కూడా తెలియదు. అర్ధకల్పము నుండి భక్తి చేసినందున దానిని వదిలిపెట్టలేరు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - భక్తి పూర్తి అవుతుందÀxŸÀxŸPíœ`k•(yŸàxŸ@àxŸ#3114;ారమైన దు:ఖము ఉంటుంది. అలాగని పిల్లలైన మీరు లక్షల సంవత్సరాల దు:ఖమును చూడలేదు. లక్షల సంవత్సరాల మాటే లేదు. ఎక్కువ వికారాలలో పడి చాలా మురికిగా అయినప్పుడు అసలైన దు:ఖమును మీరు కలియుగములోనే అనుభవించారు. రజోగుణములో ఉన్నప్పుడు కొంచెం తెలివి ఉండేది. ఇప్పుడైతే పూర్తిగా బుద్ధిహీనులైపోయారు. సుఖధామనికి వెళ్ళాలంటే పావనంగా అవ్వండి అని పిల్లలకు చెప్తున్నారు. జన్మ-జన్మల నుండి తల పైన ఉన్న పాప భారాన్ని స్మృతి ద్వారా తొలగించుకోండి. స్మృతి ద్వారా చాలా సంతోషంగా ఉంటారు. ఏ తండ్రి అయితే మిమ్ములను అర్ధకల్పము వరకు సుఖధామానికి తీసుకెళ్తారో ఆ తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి చెప్తున్నారు - మీరు ఈ విధంగా(లక్ష్మీనారాయణుల వలె) అవ్వాలంటే ఒకటేమో పవిత్రంగా అవ్వండి, రెండవది చరిత్రను(నడవడికను) సరిదిద్దుకోండి. వికారాలను భూతమని అంటారు. లోభమనే భూతము కూడా తక్కవైనదేమీ కాదు. ఈ భూతము చాలా అశుద్ధమైనది. మనుష్యులను పూర్తి మురికిగా తయారు చేస్తుంది. లోభము కూడా చాలా పాపము చేయిస్తుంది. 5 వికారరాలు చాలా కఠినమైన భూతాలు. వీటన్నిటిని వదిలేయాలి. కామవికారాన్ని వదలడం ఎంత కష్టమో, లోభమును వదిలేయడం కూడా అంతే కష్టము. మోహమును వదిలిపెట్టడం కూడా అంతే కష్టము. ఒక రకంగా వదిలిపెట్టవు. తండ్రి ఆయువంతా అర్థము చేయిస్తూ ఉన్నా మోహమనే అంశము అతుక్కునే ఉంటుంది. క్రోధము కూడా కష్టంగా సమాప్తమవుతుంది. పిల్లల పై కోపము వస్తుందని అంటారు. పేరైతే క్రోధమనే అంటారు కదా. ఏ భూతమూ రాకూడదు. వాటి పై విజయము పొందాలి.
నేను ఉన్నంత వరకు మీరు పురుషార్థము చేస్తూ ఉండండి అని తండ్రి చెప్తున్నారు. తండ్రి ఎన్ని సంవత్సరాలుంటారు? తండ్రి కూర్చుని ఎన్ని సంవత్సరాల నుండి అర్థం చేయిస్తున్నారు. చాలా సమయాన్ని ఇస్తారు. సృష్టి చక్రమును తెలుసుకోవడము చాలా సహజము. 7 రోజులలో మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఇక జన్మ-జన్మల పాపము సమాప్తమయ్యేందుకు సమయము పడ్తుంది. ఇదే కష్టము. దీని కొరకు బాబా సమయమునిస్తారు. మాయ చాలా వ్యతిరేకిస్తుంది, పూర్తిగా మరిపిస్తుంది. ఇక్కడ కూర్చున్న సమయమంతా స్మృతిలోనే ఉండరు. బుద్ధి అనేక వైపులకు వెళ్తూ ఉంటుంది, అందువలన సమయమునివ్వాలి, కష్టపడి కర్మాతీత స్థితిని పొందాలి. చదువేమో చాలా సహజమైనది. తెలివైన పిల్లలైతే 7 రోజులలోనే 84 జన్మల చక్రము ఎలా తిరుగుతుందో మొత్తం జ్ఞానమంతా అర్థము చేసుకుంటారు. పవిత్రంగా అవ్వడంలోనే శ్రమ ఉంది. దీని కొరకు ఎంత హంగామా జరుగుతుంది! విషయమేమో సరియైనది(రైటు). మేము ఈ బ్రహ్మకుమారీలు సోదర-సోదరీలుగా చేస్తారని నిందించేవారము కానీ ఇది సరియైనదని(రైటని) అర్థము చేసుకుంటారు. ప్రజాపిత బ్రహ్మకు పిల్లలుగా అవ్వనంతవరకు పవిత్రంగా ఎలా ఉండగలరు, వికారీ దృష్టి నిర్వికారి దృష్టిగా ఎలా అవ్వగలదు. మనము బ్రహ్మకుమార్‌-కుమారీలుగా ఉన్నప్పుడు సోదర-సోదరీలుగా అయ్యామనే యుక్తి చాలా బాగుంది. నిర్వికారి దృష్టిని తయారు చేసేందుకు ఇది(ఈ యుక్తి) చాలా సహయోగము చేస్తుంది. బ్రహ్మ కర్తవ్యము కూడా ఉంది కదా. బ్రహ్మ ద్వారా దేవీ దేవతా ధర్మమును స్థాపన చేయడం అనగా మనుష్యులను దేవతలుగా చేయడం.
పురుషోత్తమ సంగమ యుగములోనే తండ్రి వస్తారు. ఈ విషయం అర్థము చేయించేందుకు ఎంత కష్టపడవలసి ఉంటుంది. తండ్రి పరిచయమును ఇచ్చేందుకే సేవాకేంద్రాలు తెరవబడ్తాయి. అనంతమైన తండ్రి ద్వారా అన&ÀxŸÀxŸPíœ`k•(yŸàxŸ@àxŸ8;ీసుకోవాలి. భగవంతుడైతే నిరాకారుడు. కృష్ణుడు దేహధారి, అతనిని భగవంతుడని అనలేరు. భగవంతుడు వచ్చి భక్తి ఫలితాన్ని ఇస్తారని అంటారు. కానీ భగవంతుని పరిచయమే లేదు. ఎన్ని విధాలుగా అర్థం చేయించినా వారు అర్థము చేసుకోరు. దేహధారులైతే తప్పకుండా పునర్జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు వారి ద్వారా వారసత్వము లభించజాలదు. ఆత్మలకు ఒక్క పరమపిత ద్వారానే వారసత్వము లభిస్తుంది. మనుష్యులు మనుష్యులకు జీవన్మక్తిని ఇవ్వలేరు. ఈ వారసత్వమును పొందేందుకు పిల్లలైన మీరు పురుషార్థము చేస్తున్నారు. ఆ తండ్రిని పొందేందుకు మీరెంత వెతుకుతూ ఉండేవారు! మొదట కేవలం ఒక్క శివునికే పూజ చేస్తూ ఉండేవారు, మరి ఏ ఇతర వైపుకు వెళ్లేవారు కాదు. అది అవ్యభిచారి భక్తి. ఇతరుల మందిరాలు మొదలైనవి ఇన్ని లేవు. ఇప్పుడైతే చాలా చిత్రాలున్నాయి, మందిరాలు మొదలైనవి తయారు చేస్తున్నారు. భక్తిమార్గములో మీరెంత కష్టపడవలసి ఉంటుంది. శాస్త్రాలలో గతి-సద్గతుల కొరకు మార్గమేదీ లేదని మీకు తెలుసు. అది కేవలం ఒక్క తండ్రి మాత్రమే చెప్తారు. భక్తిమార్గములో ఎన్నో మందిరాలను నిర్మిస్తూ ఉంటారు. వాస్తవానికి సత్యయుగములో ఉన్న దేవీదేవతలకు మాత్రమే మందిరాలు ఉంటాయి. ఏ ఇతర మనుష్యులకు మందిరాలు నిర్మించబడవు ఎందుకంటే మనుష్యులు పతితులు. పతిత మనుష్యులు పావనమైన దేవతలను పూజిస్తారు. భలే వారు కూడా మనుష్యులే, కానీ వారిలో దైవీ గుణాలున్నాయి. దైవీగుణాలు లేనివారు వారిని పూజిస్తారు. స్వయం మీరే పూజ్యులుగా ఉండేవారు, తర్వాత మళ్లీ పూజారులుగా అయ్యారు. మనుష్యులకు భక్తి చేయడమంటే 5 తత్వాలను పూజించడం. శరీరము 5 తత్వాలతో తయారు చేయబడింది. పిల్లలిప్పుడు ముక్తిధామములోకి వెళ్లాలి, అందుకే ఇంత భక్తి చేశారు. ఇప్పుడు నాతో పాటు తీసుకెళ్తాను. మీరు సత్యయుగములోకి వెళ్తారు. పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచానికి తీసుకెళ్లేందుకే తండ్రి వచ్చారు. ఉండే పావన ప్రపంచాలు రెండే. అవి ముక్తి మరియు జీవన్ముక్తి. తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా! నేను కల్ప-కల్పము సంగమ యుగములోనే వస్తాను. భక్తిమార్గములో మీరెంత దు:ఖమును అనుభవిస్తారు! నలువైపులా చుట్టినా............. అని పాట కూడా ఉంది కదా? ఎవరి నుండి దూరంగా ఉన్నారు? తండ్రి నుండి. తండ్రిని వెతికేందుకు జన్మ-జన్మలు ప్రదక్షిణలు చేశారు. అయినా తండ్రి నుండి దూరంగానే ఉన్నారు. అందుకే హే పతితపావనా! రండి, వచ్చి పావనంగా చేయమని పిలుస్తారు. తండ్రి తప్ప మరెవ్వరూ పావనంగా చేయలేరు. ఇది 5 వేల సంవత్సరాల ఆట. డ్రామానుసారము ప్రతి ఒక్కరు పురుషార్థము చేస్తారు, కల్పక్రితము చేసిన విధంగానే రాజధాని స్థాపన అవుతూ ఉంది. అందరూ ఒకే విధంగా చదవరు. ఇది పాఠశాల కదా. రాజయోగ చదువును దేవీదేవతా ధర్మానికి చెందినవారు చదువుకునేందుకు వస్తారు. మూలవతనంలో కూడా ఉన్న సంఖ్య ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కువా లేదు, తక్కువా లేదు, నాటకములో పాత్రధారుల అంచనా ఖచ్చితంగా ఉంటుంది కానీ అర్థము చేసుకోలేరు. ఉన్నవారందరూ ఖచ్చితంగా మళ్లీ వచ్చి పాత్ర చేస్తారు. మళ్లీ మీరు క్రొత్త ప్రపంచములోకి వస్తారు. మిగిలిన వారందరూ అక్కడికి వెళ్లిపోతారు. ఇప్పుడు ఎవరైనా లెక్క పెట్టాలంటే లెక్కించగలరు. తండ్రి మీకిప్పుడు చాలా గుహ్యమైన విషయాలు తెలుపుతారు. మొదటికి, ఇప్పటికి అర్థము చేయించడంలో ఎంత తేడా ఉంది! చదువుకునేందుకు సమయం పడ్తుంది. వెంట&ÀxŸÀxŸPíœ`k•(yŸàxŸ@àxŸ204;.గా అవ్వలేరు. చదువు కూడా నెంబర్‌వార్‌గా ఉంటుంది. మనుష్యుల బుద్ధిలో సహజంగా కూర్చునేందుకు తండ్రి ఎంత సహజము చేసి అర్థం చేయిస్తున్నారు! రోజురోజుకు క్రొత్త క్రొత్త పాయింట్లు అర్థం చేయిస్తూ ఉంటారు. పతితపావనుడైన నన్ను పిలిచారు కనుక నేను వచ్చాను, మీరు పావనంగా అవ్వాలి కదా అని తండ్రి ఇప్పుడు చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి నన్నొక్కరినే స్మృతి చేస్తే మీరు సతోప్రధానంగా అయిపోతారు. తర్వాత మళ్లీ పాత్ర చేసేందుకు ఇక్కడకు రావలసి ఉంటుంది. తండ్రి చెప్తున్నారు - ఆత్మ పతితంగా అయ్యింది. అందువలన పావనంగా అయ్యేందుకు పతితపావనుడైన తండ్రిని స్మృతి చేస్తారు. ఇంత చిన్న ఆత్మ ఎంత పాత్ర చేస్తుంది - ఎంత విచిత్రంగా ఉంది, దీనిని ప్రాకృతికము అని అంటారు. వారిని చూడలేము. మేము పరమాత్ముని సాక్షాత్కారము చేసుకోవాలని కొందరు అంటారు. ఇంత చిన్న బిందువును మీరు ఎలా సాక్షాత్కారము చేస్తారు. నన్ను తెలుసుకోగలరు కానీ చూడడం కష్టము. పాత్ర చేసేందుకు ఆత్మకు ఈ కర్మేంద్రియాలు లభించాయి. ఎన్ని రకాల పాత్ర చేస్తుంది! ఇది అద్భుతము. ఆత్మ ఎప్పటికీ అరగదు. ఇది అవినాశి డ్రామా. ఇది తయారు చేయిబడిన అవినాశి డ్రామా. ఎప్పుడు తయారయ్యిందని అడగరాదు. దీనిని అనాది అని అంటారు. రావణుని ఎప్పటి నుండి తగులబెట్తూ ఉన్నారని, శాస్త్ర్రాలను ఎప్పటి నుండి చదువుతూ వచ్చారని మనుష్యులను ప్రశ్నిస్తే - తెలియదు, ఇది అనాది అని అంటారు. తికమక పడి ఉన్నారు కదా. పిల్లలను చదివించే విధంగా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు.
పూర్తి బుద్ధిహీనులుగా ఉన్న మనలో మళ్లీ బేహద్‌ సమర్థత(బుద్ధివంతము) వచ్చిందని మీకు తెలుసు. అది హద్దు చదువు. ఇది బేహద్‌ చదువు. అర్ధకల్పము పగలు, అర్ధకల్పము రాత్రి. 21 జన్మల వరకు మీరు దు:ఖమును కొద్దిగా కూడా అనుభవించరు. వెంట్రుకను కూడా కదిలించలేరు అని అంటారు కదా. ఎవ్వరూ దు:ఖమును ఇవ్వలేరు. దాని పేరే సుఖధామము. ఇక్కడైతే సుఖము లేనే లేదు. పవిత్రతయే ముఖ్యమైనది. గుణగణాలు(స్వభావ-సంస్కారాలు) బాగుండాలి కదా.
ప్రతి విషయాన్ని పిల్లలకు స్పష్టంగా అర్థం చేయిస్తారు. ప్రతి విషయంలో లాభ-నష్టాలుంటాయి కదా. తండ్రి చెప్తున్నారు - ఇప్పుడైతే లాభము ప్రసక్తే లేదు. ఇంకా నష్టానికి నష్టమే జరగనున్నది. వినాశ సమయము వచ్చినప్పుడు ఏమేమి జరుగుతుందో చూడండి. వర్షము పడకపోతే ధాన్యము వెల ఎంత పెరిగిపోతుంది! 3 సంవత్సరాల తర్వాత చాలా ధాన్యముంటుందని ఎంతో చెప్తారు, అయినా బయటి నుండి ధాన్యాన్ని తెప్పిస్తూనే ఉంటారు. ఒక్క ధాన్యపు గింజ కూడా దొరకని పరిస్థితి వస్తుంది. ఎన్నో ఆపదలు రానున్నాయి. వాటిని ఈశ్వరీయ ఆపదలని అంటారు. వర్షము పడకపోతే కరువు కాటకాలు తప్పకుండా వస్తాయి. అన్ని తత్వాలు మొదలైనవన్నీ ప్రకోపిస్తాయి. ఎక్కువ స్థానాలలో వర్షాలు పడి నష్టపరుస్తాయి.
తండ్రి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇది మీ లక్ష్యము. మిమ్ములను మళ్లీ నరుని నుండి నారాయణునిగా తయారు చేస్తున్నారు. ఈ బేహద్‌ పాఠాన్ని బేహద్‌ తండ్రియే చదివిస్తారు. ఎవరు ఎలా చదువుతారో అలాటి పదవి పొందుతారు. తండ్రి ఏమో పురుషార్థము చేయిస్తారు. పురుషార్థము తక్కువగా చేస్తే పదవి కూడా తక్కువగా పొందుతారు. టీచరు కూడా విద్యార్థులకు అర్థం చేయిస్తారు కదా. ఇతరులను తమ సమానంగా తయారు చేసినప్పుడు, వీరు బాగా చదువుతూ చదివిస్తారని తెలుస్తుంది. ముఖ్యమైనది - స్మృతియాత్ర. తల పై పాప భారము చాలా ఉంది. నన్ను స్మృతి చేస్తే పాపము భస్మమవుతుంది. ఇది ఆత్మిక యాత్ర. శివబాబాను స్మృతి చేయమని చిన్న పిల్లలకు కూడా నేర్పించండి. వారికి కూడా హక్కు ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలని తెలియదు. కేవలం శివబాబాను స్మృతి చేస్తారు. కష్టపడితే వారి కళ్యాణము కూడా జరుగుతుంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. నరుని నుండి నారాయణుని పదవిని పొందేందుకు బేహద్‌ తండ్రి ద్వారా బేహద్‌ పాఠమును చదివి ఇతరులను చదివించాలి, తమ సమానంగా తయారుచేయు సేవ చేయాలి.

2. లోభ, మోహముల అంశాల(బంధాల)ను తొలగించేందుకు కష్టపడాలి. ఏ భూతము లోపలికి ప్రవేశించని విధంగా తమ చరిత్ర(గుణగణాల)ను సరిదిద్దుకోవాలి.

వరదానము :-

'' తమ రాజ్య అధికారి లేక పూజ్య స్వరూప స్మృతి ద్వారా దాతలుగా అయ్యి దానమిచ్చే సర్వ ఖజానాలతో సంపన్న భవ ''

సదా ''నేను పూజ్య ఆత్మను, ఇతరులకు ఇచ్చే దాతను, లేవతను కాను, దేవతను'' అనే స్మృతిలో ఉండండి. ఎలాగైతే తండ్రి మీ అందరికి తనంతకు తానే ఇచ్చాడో, అలా మీరు కూడా మాస్టర్‌ దాతలుగా అయ్యి ఇస్తూ ఉండండి, అడుక్కోకండి. తమ రాజ్య అధికారి లేక పూజ్య స్వరూప స్మృతిలో ఉండండి. ఇంతవరకు మీ జడచిత్రాల ముందుకు వెళ్లి వేడుకునేవారు, మమ్ములను రక్షించండి అని అనేవారు. ఇప్పుడు మీరు రక్షించేవారు. రక్షించండి - రక్షించండి అని వేడుకునేవారు కాదు. కాని దాతలుగా అయ్యేందుకు స్మృతి ద్వారా, సేవ ద్వారా, శుభ భావన ద్వారా, శుభ కామన ద్వారా సర్వ ఖజానాలతో సంపన్నులుగా అవ్వండి.

స్లోగన్‌ :-

'' నడవడిక మరియు ముఖాలలో ప్రసన్నతే ఆత్మిక పర్సనాలిటీకి గుర్తు. ''