10-07-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - తండ్రి ద్వారా హోల్సేల్ (టోకు) వ్యాపారము చేయడం నేర్చుకోండి. 'మన్మనాభవ' ఒక్కటే హోల్సేల్ వ్యాపారము అనగా తండ్రి(అల్ఫ్)ని స్మృతి చేయడం మరియు చేయించడం. మిగిలినదంతా రీటైల్(చిల్లర) వ్యాపారమే.''
ప్రశ్న :-
తండ్రి తన ఇంటికి ఎలాటి పిల్లలను ఆహ్వానిస్తారు?
జవాబు :-
ఎవరైతే తండ్రి మతము పై నడుచుకుంటూ, మరెవ్వరినీ స్మృతి చేయకుండా, దేహ సహితంగా దేహ సంబంధాలన్నిటి నుండి బుద్ధియోగమును తెంచి ఒక్కరి స్మృతిలో ఉంటారో, వారినే తండ్రి తన ఇంటికి ఆహ్వానిస్తారు. తండ్రి ఇప్పుడు తన పిల్లలను పుష్పాలుగా తయారు చేస్తూ, పుష్పాలుగా అయిన పిల్లలను మళ్లీ తన ఇంటికి ఆహ్వానిస్తారు.
ఓంశాంతి.
పిల్లలు తమ తండ్రి స్మృతిలో శాంతిధామము, సుఖధామము స్మృతిలో కూర్చోవాలి. ఆత్మ తన తండ్రినే స్మృతి చేయాలి. ఈ దు:ఖధామమును మర్చిపోవాలి. ఇది తండ్రి, పిల్లల మధురమైన సంబంధము. ఇంత మధురమైన సంబంధము మరే తండ్రికీ ఉండదు. మొదటి సంబంధము తండ్రితో, తర్వాత టీచరు మరియు గురువుతో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడైతే ఈ ముగ్గురూ ఒక్కరే. ఇది బుద్ధిలో గుర్తున్నా అది ఆనందకరమైన విషయము కదా. ఒకే తండ్రి లభించారు. వారు చాలా సహజ మార్గమును తెలిపిస్తున్నారు. తండ్రిని, శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి, ఈ దు:ఖధామాన్ని మర్చిపోండి. నడవండి, తిరగండి కాని బుద్ధిలో ఇదే స్మృతి ఉండాలి. ఇక్కడైతే ఎలాంటి చిక్కు పనులు, వ్యాపారాలు మొదలైనవేవీ లేవు. ఇంట్లో కూర్చుని ఉన్నారు. తండ్రి కేవలం మూడు పదాలను స్మృతి చేయమని చెప్తారు. వాస్తవానికి తండ్రిని స్మృతి చేయండి అను ఒక్క పదము చాలు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా సుఖధామము, శాంతిధామము రెండు వారసత్వాలు గుర్తుకు వస్తాయి. అవి ఇచ్చేవారు ఒక్క తండ్రియే. స్మృతి చేయడం ద్వారా ఖుషీ పాదరస మీటరు పైకి ఎక్కుతుంది. పిల్లలైన మీ సంతోషము ప్రసిద్ధి చెందినది. బాబా మనలను ఇంట్లోకి మళ్లీ ఆహ్వానిస్తున్నారని, కలుసుకుంటామని పిల్లల బుద్ధిలో ఉంది. కాని ఎవరైతే తండ్రి శ్రీమతమును బాగా అనుసరిస్తారో, వేరెవ్వరినీ స్మృతి చేయరో వారినే ఆహ్వానిస్తారు. దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలతో బుద్ధియోగాన్ని తెంచి నన్నొక్కరినే స్మృతి చేయాలని చెప్తున్నారు. భక్తిమార్గములో అయితే మీరు చాలా సేవలు చేశారు. కాని ఇంటికి వెళ్ళే మార్గము లభించనే లేదు. తండ్రి ఇప్పుడు ఎంత సహజమైన మార్గము తెలుపుచున్నారు! తండ్రి కేవలం తండ్రియే కాక శిక్షకులుగా కూడా అయ్యారు. సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని కూడా వినిపిస్తారు. ఈ జ్ఞానమును ఇతరులెవ్వరూ అర్థము చేయించలేరు. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలని, మళ్లీ మొట్టమొదట సత్యయుగములో వస్తారని తండ్రి చెప్తున్నారు. ఈ ఛీ-ఛీ ప్రపంచము నుండి ఇప్పుడు వెళ్లిపోవాలి. భలే మీరిక్కడ కూర్చున్నారు కాని ఇక్కడ నుండి తప్పకుండా వెళ్లనే వెళ్తారు. తండ్రి కూడా సంతోషిస్తారు. పిల్లలైన మీరు తండ్రిని చాలా కాలము నుండి ఆహ్వానించారు. ఇప్పుడు మళ్లీ తండ్రిని రిసీవ్ చేసుకున్నారు. మిమ్ములను పుష్పాలుగా చేసి మళ్లీ శాంతిధామములో రిసీవ్ చేసుకుంటానని తండ్రి చెప్తున్నారు. మళ్లీ మీరు నెంబరువారుగా వెళ్లిపోతారు. ఇది ఎంత సులభము! ఇలాంటి తండ్రిని మర్చిపోరాదు. విషయమైతే చాలా మధురమైనది, స్పష్టమైనది. తండ్రిని స్మృతి చేయండి. ఇదొక్క విషయమే ముఖ్యమైనది. వివరంగా అర్థం చేయించినా మళ్లీ చివరికి తండ్రి తప్ప మరెవ్వరినీ స్మృతి చేయకండి అని చెప్తారు. మీరు జన్మ - జన్మల నుండి ఒకే ప్రియునికి ప్రేయసులు. తండ్రీ మీరు వస్తే మీ వారిగానే ఉంటామని పాడుతూ వచ్చారు. ఇప్పుడు వారు వచ్చారు. కనుక వారి పిల్లలుగానే అవ్వాలి. నిశ్చయబుద్ధి విజయంతి. రావణుని పై విజయమును పొందుతారు. మళ్లీ రామ రాజ్యములోకి రావలసి ఉంటుంది. కల్ప - కల్పము మీరు రావణుని పైన విజయము పొందుతారు. ఇప్పుడు బ్రాహ్మణులుగా అయి రావణుని పై విజయము పొందుతారు. రామరాజ్యము పై మీకు హక్కు ఉంది. తండ్రిని గుర్తించగానే రామరాజ్యము పై హక్కు ఏర్పడింది. ఇప్పుడు ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థము చేయాలి. విజయమాలలోకి రావాలి. విజయమాల పెద్దదిగా ఉంది. రాజులుగా అయితే అన్నీ లభిస్తాయి. దాస-దాసీలందరూ నెంబరువారుగా తయారవుతారు. అందరూ ఒకే విధంగా ఉండరు. కొందరు చాలా సమీపంగా ఉంటారు. రాజు - రాణులు భుజించే ఆహారము భండారములో తయారైన ఆహారము దాస-దాసీలకు కూడా లభిస్తుంది. దీనినే 36 రకాల భోజనము అని అంటారు. రాజులను పదమ్పతులని కూడా అంటారు. ప్రజలను పదమపతులని అనరు. అక్కడ ధనానికి లోటు ఉండదు. ఈ లక్షణాలు దేవతలకే ఉంటాయి. ఎంతగా స్మృతి చేస్తారో అంత సూర్యవంశములోకి వస్తారు. క్రొత్త ప్రపంచములోకి రావాలి కదా. మహారాజ - మహారాణులుగా అవ్వాలి. నరుని నుండి నారాయణునిగా అయ్యే జ్ఞానాన్ని తండ్రి ఇస్తున్నారు. దీనినే రాజయోగము అని అంటారు. భక్తి మార్గములోని శాస్త్రాలను కూడా అందరికంటే ఎక్కువగా మీరే చదివారు. అందరికంటే మీరే ఎక్కువగా భక్తి కూడా చేశారు. ఇప్పుడు మీరు వచ్చి తండ్రిని లుసుకున్నారు. స్మృతి చేయండి అని తండ్రి చాలా సహజంగా, స్పష్టంగా అర్థం చేయిస్తున్నారు. పిల్లలారా! పిల్లలారా! అని తండ్రి పిలుస్తూ ఉంటారు. తండ్రి పిల్లల పై బలిహారమవుతారు. వారసులైనపుడు తప్పకుండా బలిహారి అవ్వవలసి ఉంటుంది కదా. బాబా! మీరు వస్తే మీ పై మేము బలిహారమవుతామని, తనువు, మనసు, ధనముల సహితంగా బలిహారమవుతామని మీరు కూడా బాబాకు చెప్పారు కదా. మీరు ఒక్కసారి బలిహారమైతే బాబా 21 సార్లు బలిహారమవుతారు. తండ్రి పిల్లలకు స్మృతి కూడా కలిగిస్తారు. పిల్లలందరూ నెంబరువారి పురుషార్థానుసారము తమ తమ భాగ్యాన్ని తీసుకునేందుకు వచ్చారని అర్థము చేసుకోగలరు. తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలారా! విశ్వరాజ్య పదవి మన జాగీరు(ఆస్తి). మీరిప్పుడు ఎంత పురుషార్థము చేస్తే అంత. ఎంత పురుషార్థము చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. నెంబర్వన్ నుండి ఇప్పుడు లాస్ట్ నెంబరులో ఉన్నారు. మళ్లీ తప్పకుండా నెంబరువన్లోకి వెళ్తారు. ఆధారమంతా పురుషార్థము పైనే ఉంది. పిల్లలను ఇంటికి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే పాపాలు సమాప్తమైపోతాయి. అదేమో కామాగ్ని. ఇదేమో యోగాగ్ని. కామాగ్నిలో కాలుతూ కాలుతూ నల్లగా అయిపోయారు. పూర్తిగా బూడిదైపోయారు. ఇప్పుడు నేను వచ్చి మిమ్ములను మేల్కొల్పుతాను. తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయ్యే యుక్తిని తెలియజేస్తాను. ఎంతో సరళమైనది. ఇంతవరకు దేహాభిమానములో ఉన్నందున మీరు ఉల్టాగా(తలక్రిందులుగా) వ్రేలాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆత్మాభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేయండి. ఇప్పుడిక ఇంటికి వెళ్లాలి. తండ్రి తీసుకెళ్లేందుకు వచ్చారు. మీరు ఆహ్వానించారు, తండ్రి వచ్చారు. ఆత్మలైన మీ అందరినీ పతితుల నుండి పావనంగా చేసి మార్గదర్శియై వాపస్ తీసుకెళ్తారు. ఈ యాత్రలో ఆత్మయే వెళ్లాలి.
మీరు పాండవ సాంప్రదాయానికి చెందినవారు. పాండవుల రాజ్యముండేది కాదు. కౌరవుల రాజ్యముండేది. ఇక్కడైతే ఇప్పుడు ఆ రాజ్యము కూడా సమాప్తమైపోయింది. ఇప్పుడు భారతదేశము స్థితి ఎంత చెడిపోయింది(ఎంత దీన పరిస్థితి వచ్చింది)! మీరు పూజ్యులుగా విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు పూజారులుగా అయ్యారు కాబట్టి విశ్వాధిపతులు ఎవ్వరూ లేరు. కేవలం దేవీ - దేవతలే విశ్వానికి అధిపతులుగా అవుతారు. విశ్వములో శాంతి ఏర్పడాలని అందరూ అంటారు. విశ్వశాంతి అని దేనినంటారు? విశ్వములో శాంతి ఎప్పుడు ఉండేది? అని వారినడగండి. ప్రపంచ చరిత్ర-భూగోళము పునరావృతమౌతూ ఉంటుంది. చమ్రు తిరుగుతూ ఉంటుంది. విశ్వములో శాంతి ఎప్పుడు ఉండేదో చెప్పండిి? మీరు ఏ విధమైన శాంతిని కోరుకుంటున్నారు? అని పిల్లలైన మీరడగండి. జవాబు ఎవ్వరూ చెప్పలేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - విశ్వములో స్వర్గమున్నప్పుడు శాంతి ఉండేది. దానిని ప్యారడైజ్(స్వర్గము) అని అంటారు. క్రీస్తు పూర్వము 3 వేల సంవత్సరాల క్రితము స్వర్గముండేదని క్రైస్తవులు అంటారు. వారు పారసబుద్ధిగానూ అవ్వరు. రాతి బుద్ధిగానూ అవ్వరు. భారతీయులే పారసబుద్ధిగా మరియు రాతిబుద్ధిగా అవుతారు. నూతన ప్రపంచాన్ని స్వర్గమని అంటారు. పాతదానిని స్వర్గమని అనరు. పిల్లలకు తండ్రి నరకము మరియు స్వర్గముల రహస్యాన్ని అర్థం చేయించారు. ఇది రీటైల్ (చిల్లరవ్యాపారము), హోల్సేల్లో(టోకు వ్యాపారములో) అయితే నన్నొక్కరినే స్మృతి చేయండని ఒకే మాట చెప్తారు. తండ్రి ద్వారానే అనంతమైన వారసత్వము లభిస్తుంది. ఇది కూడా పాత విషయమే. 5 వేల సంవత్సరాల క్రితము భారతదేశములో స్వర్గముండేది. తండ్రి పిల్లలకు సత్య-సత్యమైన కథ చెప్తున్నారు. సత్యనారాయణుని కథ, తీజరీ కథ, అమరకథలు ప్రసిద్ధి చెందినవి. మీకు కూడా జ్ఞానమనే మూడవ నేత్రము లభిస్తుంది. దానినే తీజరీ కథ అని అంటారు. వారైతే భక్తి మార్గంలో పుస్తకాలను తయారు చేశారు. పిల్లలైన మీకిప్పుడు అన్ని విషయాలు బాగా అర్థం చేయిస్తారు. రీటైల్ మరియు హోల్సేల్ ఉంటాయి కదా. సాగరమునంతా సిరా(ఇంకు)గా చేసుకున్నా జ్ఞానము సమాప్తము కాదని చెప్తారు. ఇది రీటైల.్ హోల్ సేల్లో కేవలం ''మన్మనాభవ'' అని అంటారు. ఒకే ఒక పదముంది. దాని అర్థము కూడా మీకు తెలుసు. మరెవ్వరూ తెలపలేరు. తండ్రి సంస్కృతములో జ్ఞానము ఇవ్వలేదు. ఎవరైతే రాజులుగా ఉంటారో, వారు వారి భాషను నడుపుతారు. మనకు ఒక్క హిందీ భాషయే ఉంటుంది. మరి సంస్కృతాన్ని ఎందుకు నేర్చుకోవాలి? ఎంత ధనము ఖర్చు చేస్తారు!
తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేస్తే శాంతిధామము, సుఖధామాల వారసత్వము లభిస్తుందని మీ వద్దకు ఎవరు వచ్చినా చెప్పండి. ఇది అర్థము చేసుకోవాలంటే కూర్చుని అర్థము చేసుకోండి. ఇక మా వద్ద మరే విషయము లేదు అని చెప్పండి. తండ్రి (అల్ఫ్)యే అర్థం చేయిస్తున్నారు - అల్ఫ్ ద్వారానే వారసత్వము లభిస్తుంది. తండ్రిని స్మృతి చేస్తే పాపాలు నాశనమై మళ్లీ పవిత్రంగా అయి శాంతిధామానికి వెళ్ళిపోతారు. 'శాంతిదేవా' అని కూడా అంటారు కదా. తండ్రియే శాంతిసాగరుడు కావున వారినే స్మృతి చేస్తారు. తండ్రి స్థాపించనున్న స్వర్గము ఇక్కడే ఉంటుంది. సూక్ష్మవతనములో ఏమీ లేదు. ఇవి సాక్షాత్కారాల విషయాలు. అలాంటి ఫరిస్తాలుగా అవ్వాలి. ఇక్కడే అవ్వాల్సి ఉంటుంది. ఫరిస్తాలుగా అయి మళ్లీ ఇంటికి వెళ్ళిపోతారు. రాజధాని వారసత్వము తండ్రి ద్వారా లభిస్తుంది. శాంతి మరియు సుఖము రెండు వారసత్వాలు లభిస్తాయి. తండ్రిని తప్ప మరెవ్వరినీ సాగరము అని అనజాలరు. జ్ఞానసాగరుడైన తండ్రి మాత్రమే సర్వులకు సద్గతినివ్వగలరు. నేను మీకు తండ్రిని, టీచరును, గురువును, మీకు సద్గతిని ఇస్తాను. అయితే మళ్లీ మీకు దుర్గతి కలిగించేదెవరు? రావణుడు. ఇది దుర్గతి మరియు సద్గతుల ఆట. సంశయముంటే, అర్థము కాకుంటే ఎవరైనా అడిగి తెలసుకోవచ్చు. భక్తిమార్గములో చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. జ్ఞాన మార్గములో ప్రశ్నలుండవు. శాస్త్రాలలో అయితే శివబాబా సహితంగా దేవతలను మొదలైనవారందరిని ఎంతగానో గ్లాని చేసేశారు. ఎవ్వరినీ వదిలి పెట్టలేదు. ఇది కూడా డ్రామాలో రచింపబడింది. మళ్లీ కూడా నిందిస్తారు. ఈ దేవీ దేవతా ధర్మము చాలా సుఖమునిచ్చే ధర్మము. అప్పుడు ఈ దు:ఖాలుండవని తండ్రి చెప్తున్నారు. తండ్రి మిమ్ములను ఎంతో వివేకవంతులుగా తయారు చేస్తారు. ఈ లక్ష్మీనారాయణులు చాలా వివేకవంతులు. అందుకే విశ్వానికి అధిపతులైనారు. తెలివిలేనివారు విశ్వానికి అధికారులుగా అవ్వలేరు. మొదట మీరు ముళ్ళుగా ఉండేవారు. ఇప్పుడు పుష్పాలుగా అవుతూ ఉన్నారు. అందుకే ఇలాంటి పుష్పాలుగా తయారవ్వాలని బాబా కూడా గులాబీ పుష్పాన్ని తీసుకొస్తారు. స్వయంగా వారే వచ్చి పూలతోటను తయారు చేస్తారు. మళ్లీ ముళ్ల అడవిగా చేసేందుకు రావణుడు వస్తాడు. ఎంత స్పష్టంగా ఉంది! ఇదంతా స్మరణ చేస్తూ ఉండాలి. ఒక్కరిని స్మృతి చేయడం ద్వారా అందులో అన్నీ వచ్చేస్తాయి. తండ్రి ద్వారా వారసత్వము లభిస్తుంది. ఇది చాలా గొప్ప సంపద. శాంతి వారసత్వము కూడా లభిస్తుంది. ఎందుకంటే వారే శాంతిసాగరులు. లౌకిక తండ్రిని ఈ విధంగా ఎప్పుడూ ఇలా మహిమ చేయరు. శ్రీ కృష్ణుడు అందరికంటే ప్రియమైనవాడు. మొట్ట మొదటి జన్మ అతడిదేే. అందువలన అతడిని అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. తండ్రి తమ పిల్లలకే మొత్తం ఇంటి సమాచారమంతా వినిపిస్తారు. తండ్రి మంచి వ్యాపారి కూడా. ఎవరో అరుదుగా ఇటువంటి వ్యాపారమును చేస్తారు. హోల్సేల్ వ్యాపారిగా ఏ ఒక్కరో కష్టంగా అవుతారు. మీరు హోల్సేల్ వ్యాపారులు కదా. తండ్రిని స్మృతి చేస్తూనే ఉంటారు. కొందరు రీటైల్గా వ్యాపారము చేసి మళ్లీ మర్చిపోతారు. నిరంతరము స్మృతి చేస్తూ ఉండండి అని తండ్రి చెప్తున్నారు. వారసత్వము లభించిన తర్వాత స్మృతి చేసే అవసరముండదు. లౌకిక సంబంధములో తండ్రి వృద్ధుడైనప్పుడు కొంతమంది పిల్లలు చివరి వరకు కూడా సహాయకులుగా ఉంటారు. కొందరైతే ఆస్తి లభించిన వెంటనే తీసుకెళ్ళి సమాప్తము చేసేస్తారు. ఈ బాబా అన్ని విషయాలలో అనుభవము గలవారు. అందుకే తండ్రి కూడా ఇతడిని తన రథముగా చేసుకున్నారు. పేదరికము గురించి తెలుసు. ధనవంతుల గురించి తెలుసు. అన్నింటిలో అనుభవీ అయినారు. డ్రామానుసారము ఈ ఒక్క రథమే ఉంది. ఈ రథము ఎప్పటికీ మారదు. ఇది తయారు చేయబడిన డ్రామా. ఇందులో ఎప్పటికీ మార్పు ఉండదు. విషయాలన్నీ హోల్సేల్గా, రీటైల్గా అర్థం చేయించి, చివరిగా ''మన్మనాభవ, మధ్యాజీభవ'' అని చెప్పేస్తారు. మన్మనాభవలో అన్నీ వచ్చేస్తాయి. ఇది చాలా గొప్ప ఖజానా, వీటితో జోలె నిండుతుంది. అవినాశి జ్ఞానరత్నాలు ఒక్కొక్కటి లక్షల రూపాయలతో సమానము. మీరు పదమా పదమ్ భాగ్యశాలురుగా అవుతారు. తండ్రి ఖుషీగా ఉండుట, ఖుషీగా లేకపోవుట ఈ రెండింటికి అతీతులు. సాక్షిగా ఉండి డ్రామాను చూస్తున్నారు. మీరు పాత్ర చేస్తున్నారు. నేను పాత్ర చేస్తున్నా సాక్షిగా ఉన్నాను. జనన-మరణాలలోకి రాను. మరెవ్వరూ దీని నుండి తప్పించుకోలేరు. మోక్షము లభించదు. ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా. ఇది కూడా అద్భుతమైనదే. చిన్న ఆత్మలో పాత్ర అంతా నిండి ఉంది. ఈ అవినాశి డ్రామా ఎప్పటికీ నాశనము చెందదు. అచ్చా!
మధురాతి మధురమైన పిల్లల పట్ల మాత - పిత, బాప్దాదాల హృదయపూర్వకమైన, గాఢమైన ప్రేమతో
సేవాధారి పిల్లలకు నంబరువార్ పురుషార్థానుసారము ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఎలాగైతే తండ్రి పిల్లలకు బలిహారమవుతారో, అదే విధంగా తనువు-మనసు-ధనముల సహితంగా ఒక్కసారి తండ్రికి పూర్తిగా బలిహారి అయ్యి 21 జన్మలకు వారసత్వము తీసుకోవాలి.
2. తండ్రి ఇస్తున్న అవినాశి అమూల్య ఖజానాతో తమ జోలెను సదా నిండుగా ఉంచుకోవాలి. సదా మేము పదమా పదమ్ భాగ్యశాలురమనే ఖుషీ లేక నషాలో ఉండాలి.
వరదానము :-
''దృఢ నిశ్చయము ఆధారంతో సదా విజయులుగా అయ్యే బ్రహ్మబాబా స్నేహీ భవ''
ఎవరైతే దృఢ నిశ్చయముంచుతారో ఆ నిశ్చయంతో లభించిన విజయము ఎప్పుడూ తప్పదు (విజయం తథ్యము). పంచతత్వాలు గాని, ఇతర ఆత్మలు గాని ఎంత ఎదిరించినా, అవి ఎదిరిస్తాయి కాని మీరు స్థిరమైన నిశ్చయం ఆధారంతో, ఇముడ్చుకునే శక్తి ద్వారా ఆ ఎదిరింపును(దాడిని) ఇముడ్చుకునేస్తారు. నిశ్చయంలో ఎప్పుడూ హల్చల్(ఆందోళన) ఉండజాలదు. ఇలా అచలంగా ఉండే విజయీ పిల్లలే తండ్రి స్నేహీలు. స్నేహీ పిల్లలు సదా బ్రహ్మబాబా భుజాలలో ఇమిడిపోయి ఉంటారు.
స్లోగన్ :-
''సర్వ ఖజానాల తాళంచెవిని ప్రాప్తి చేసుకోవాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి .''