26-02-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - ఈ శరీరములో జీవించి ఉంటూనే మరణించేందుకు అభ్యాసము చేయండి - నేను కూడా ఆత్మ, నీవు కూడా ఆత్మ. ఈ అభ్యాసము ద్వారానే మమత్వము తొలగిపోతుంది.''

ప్రశ్న :-

అన్నిటికంటే గొప్ప లక్ష్యము ఏది? ఆ లక్ష్యమును ప్రాప్తి చేసుకొనువారి గుర్తులు ఏవి?

జవాబు :-

దేహధారులందరి నుండి మమత్వము తొలగిపోవాలి. సదా భాయి-భాయి స్మృతి ఉండాలి. ఇదే అన్నిటికన్నా గొప్ప లక్ష్యము. ఎవరు నిరంతరము దేహీ-అభిమానులుగా ఉండే అభ్యాసము చేస్తారో, వారే ఈ గమ్యాన్ని చేరుకోగలరు. ఒకవేళ దేహీ-అభిమానులుగా లేకుంటే తన శరీరములోనైనా లేదా ఏదో ఒక బంధు-మిత్రుల శరీరములో గాని ఎక్కడో ఒకచోట చిక్కుకుంటారు వారికి ఎవరి మాటలైనా బాగున్నాయని అనిపిస్తాయి, లేదా ఎవరి శరీరమైనా బాగుందనిపిస్తుంది. ఉన్నతమైన లక్ష్యములోకి చేరుకునేవారు శరీరాన్ని ప్రేమించరు. వారికి శరీర భావము తెగిపోయి ఉంటుంది.

ఓంశాంతి.

ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు చెప్తున్నారు - చూడండి! నేను పిల్లలైన మీ అందరినీ నా సమానంగా చేసేందుకు వచ్చాను. ఇప్పుడు తండ్రితో సమానంగా చేసేందుకు ఎలా వస్తారు? వారు నిరాకారులు. వారు చెప్తారు - నేను నిరాకారుడను. పిల్లలైన మిమ్మలను నా సమానంగా నిరాకారులుగా చేసేందుకు, జీవించి ఉండగానే మరణించడం నేర్పించేందుకు వచ్చాను. తండ్రి స్వయాన్ని కూడా ఆత్మ అని భావిస్తారు కదా. వారికి ఈ శరీర భ్రాంతి లేదు. శరీరములో ఉంటున్నా శారీరిక భ్రాంతి ఉండదు. ఈ శరీరము వారిది కాదు కదా. పిల్లలైన మీరు కూడా ఈ శరీర భ్రాంతిని తొలగించి వేయండి. ఆత్మలైన మీరు మాత్రమే నా వెంట రావాలి. ఈ శరీరాన్ని నేను అప్పుగా తీసుకున్నాను. అలాగే ఆత్మలైన మీరు కూడా పాత్రను అభినయించేందుకు లోను తీసుకున్నారు. మీరు జన్మ-జన్మలుగా శరీరాలు తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు నేను జీవిస్తూనే ఈ శరీరములో ఉన్నాను కాని దేహానికి భిన్నంగా ఉన్నాను అనగా మరణించినట్లు. శరీరము వదిలేయడాన్ని మరణించడం అని అంటారు. మీరు కూడా జీవించి ఉంటూనే ఈ శరీరము నుండి మరణించాలి. నేను కూడా ఆత్మ. మీరు కూడా ఆత్మ. మీరు కూడా నా జతలో రావాలి కదా? లేక ఇక్కడే కూర్చోవాలా? మీకు ఈ శరీరము పై జన్మ-జన్మాంతరాలుగా మోహముంది. నేనెలా అశరీరిగా ఉన్నానో, అలాగే మీరు కూడా జీవించి ఉంటూనే స్వయాన్ని అశరీరులుగా భావించండి. మేము ఇప్పుడు బాబా జతలో వెళ్లాలి. ఎలాగైతే బాబాకు ఈ పురాతన శరీరము ఉందో, అలాగే ఆత్మలైన మీకు కూడా ఈ పురాతన శరీరాలున్నాయి, పాత చెప్పును(శరీరాన్ని) వదిలేయాలి. ఎలాగైతే నాకు దీని పట్ల మమత్వము లేదో, అలా మీరు కూడా ఈ పురాతన చెప్పు పట్ల మమత్వమును తొలగించండి. మీకు మమత్వము ఉంచుకునే అలవాటైపోయింది. నాకు ఆ అలవాటు లేదు. నేను జీవించి ఉండే మరణించి ఉన్నాను. మీరు కూడా జీవించి ఉంటూ మరణించాలి. నా జతలో రావాలంటే ఇప్పుడు ఈ అభ్యాసము చేయండి. శరీరము పట్ల ఎంత భ్రాంతి ఉంటుంది! అడగనే వద్దు. శరీరము రోగగ్రస్థమైనా ఆత్మ దానిని వదిలిపెట్టదు. దీని పట్ల మమత్వాన్ని తొలగించుకోవాలి. మనమైతే(ఆత్మలము) తప్పకుండా బాబా జతలో వెళ్ళాలి. స్వయాన్ని శరీరము నుండి అతీతమని భావించాలి. దీనినే జీవించి కూడా మరణించడం అని అంటారు. మన ఇల్లే గుర్తుంటుంది. మీరు జన్మ-జన్మాంతరాలు ఈ శరీరములో ఉంటూ వచ్చారు. అందువల్లనే మీరు శ్రమ చేయాల్సి ఉంటుంది. జీవించి ఉంటూనే మరణించాల్సి ఉంటుంది. నేనైతే ఇందులో తాత్కాలికంగా వస్తాను. కనుక మరణించి నడుచుకోవటం ద్వారా అనగా స్వయాన్ని ఆత్మ అని భావించి నడుచుకోవడం ద్వారా ఏ దేహధారి పట్ల మమత్వము ఉండదు. తరచుగా ఎవరికైనా ఎవరితోనైనా మోహము కలుగుతుంది. ఇక అంతే, వారిని చూడకుండా ఉండలేరు. ఈ దేహధారి స్మృతి ఒక్కసారిగా ఎగిరిపోవాలి. ఎందుకంటే లక్ష్యము చాలా గొప్పది. తింటూ తాగుతూ ఈ శరీరములో లేనట్లుగా ఉండాలి. ఈ అవస్థను పక్కాగా చేసుకోవాలి. అప్పుడే 8 రత్నాల మాలలో రాగలరు. శ్రమ చేయకుండా ఉన్నత పదవి లభించదు. జీవించి ఉంటూ నేను అక్కడ ఉండేవాడినని భావించాలి. బాబా ఇందులో ఎలాగైతే తాత్కాలికంగా కూర్చొని ఉన్నారో, అలాగే మనము కూడా ఇప్పుడు ఇంటికి వెళ్లాలి. బాబాకు ఎలా మమత్వము లేదో, అలా మనకు కూడా ఇందులో మమత్వము ఉంచుకోరాదు. తండ్రికైతే పిల్లలైన మీకు అర్థం చేయించేందుకు ఈ శరీరములో కూర్చోవలసి పడ్తుంది.

ఇప్పుడు మీరు వాపస్‌ వెళ్ళాలి. అందువల్ల ఏ దేహధారి పైనా మమత్వము ఉండరాదు. ఫలానావారు చాలా మంచివారు, మధురమైనవారు అంటూ ఆత్మ బుద్ధి అటువైపు వెళ్తుంది కదా. తండ్రి చెప్తున్నారు - శరీరాన్ని చూడకండి, ఆత్మను చూడండి. శరీరాన్ని చూచుట ద్వారా మీరు చిక్కుకొని చనిపోతారు. ఇది చాలా గొప్ప లక్ష్యము. మీది కూడా జన్మ-జన్మాంతరాల పురాతన మమత్వము. బాబాకు మమకారము లేదు. అందుకే పిల్లలైన మీకు నేర్పించేందుకు వచ్చారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు - నేనైతే ఈ శరీరములో చిక్కుకోను. మీరు చిక్కుకొని ఉన్నారు. నేను మిమ్ములను ముక్తులుగా చేసేందుకు వచ్చాను. మీ 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు శరీరము పై గల భ్రాంతిని తొలగించి వేయండి. దేహీ-అభిమానులుగా అయ్యి ఉండకపోవుట ద్వారా మీరు ఎక్కడో ఒక చోట చిక్కుకుంటూ ఉంటారు. ఎవరి మాటలో మంచిగా అనిపిస్తాయి. ఎవరి శరీరమో బాగుందనిపిస్తుంది. అప్పుడు ఇంట్లో కూడా వారి స్మృతి వస్తూ ఉంటుంది. శరీరము పై ప్రేమ ఏర్పడినట్లయితే ఓడిపోతారు. అటువంటివారు చాలా పాడైపోతారు. తండ్రి చెప్తున్నారు - స్త్రీ-పురుషుల సంబంధాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. వీరూ ఆత్మయే, నేను కూడా ఆత్మనే అని భావించండి. ఆత్మగా భావిస్తూ - భావిస్తూ శరీర భావము తొలగిపోతుంది. తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు కూడా వినాశనమవుతాయి. ఈ విషయములో మీరు మంచిరీతిగా విచార సాగర మథనము చేయవచ్చు. విచార సాగర మథనము చేయకుండా మీలో ఉత్సాహము ఉప్పొంగదు. మేము తండ్రి వద్దకు తప్పకుండా వెళ్లాలని పక్కాగా ఉండాలి. ముఖ్యమైన విషయము స్మృతి. 84 జన్మల చక్రము పూర్తయ్యింది. మళ్లీ ప్రారంభము కానున్నది. ఈ పురాతన దేహము పై మమత్వము తొలగించుకోకుంటే తమ శరీరములో లేక ఎవరైనా బంధు-మిత్రుల శరీరంలో చిక్కుకుపోతారు. మీరు ఎవరితోనూ మనసును లగ్నం చేయరాదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మలైన మనమూ నిరాకారమే, తండ్రి కూడా నిరాకారమే. అర్ధకల్పము మీరు భక్తిమార్గములో తండ్రిని స్మృతి చేస్తూ వచ్చారు కదా. ఓ ప్రభూ! అని అన్న వెంటనే శివలింగమే ఎదుటకు వస్తుంది. ఏ దేహధారినీ ఓ ప్రభూ! అని అనలేము. అందరూ శివుని మందిరాలకు వెళ్తారు. వారినే పరమాత్మగా భావించి పూజిస్తారు. సర్వోన్నతమైన భగవంతుడు ఒక్కరే. సర్వోన్నతమైనవారు అనగా పరంధామములో ఉండేవారు. భక్తి కూడా మొదట ఒక్కరిదే అవ్యభిచారిగా ఉంటుంది. తర్వాత వ్యభిచారిగా అవుతుంది. మీరు ఉన్నత పదవిని పొందాలంటే ఈ అభ్యాసము చెయ్యమని, దేహ భ్రాంతిని వదిలేయమని తండ్రి పలుమార్లు పిల్లలకు అర్థం చేయిస్తారు. సన్యాసులు కూడా వికారాలను వదిలేస్తారు కదా. సన్యాసులు ఇంతకముందు సతోప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు వారు కూడా తమోప్రధానంగా అయిపోయారు. సతోప్రధాన ఆత్మ ఆకర్షిస్తుంది. అపవిత్ర ఆత్మలను ఆకర్షిస్తుంది. ఎందుకంటే వారి ఆత్మ పవిత్రంగా ఉంటుంది. భలే పునర్జన్మలోకి వచ్చినా పవిత్రంగా ఉన్నందున ఆకర్షిస్తారు. వారికి ఎంతమంది అనుచరులు తయారవుతారు! పవిత్రతా శక్తి ఎంత ఎక్కువగా ఉంటుందో అంత ఎక్కువమంది అనుచరులుగా అవుతారు. తండ్రి ఎవర్‌ప్యూర్‌(సదా పవిత్రమైనవారు) అంతేకాక వారు గుప్తమైనవారు. ఇందులో ఇద్దరూ ఉన్నారు కదా. శక్తి అంతా వారిదే. వీరిది(బ్రహ్మది) కాదు. ప్రారంభములో కూడా మిమ్ములను వారే ఆకర్షించారు. ఈ బ్రహ్మ కాదు. ఎందుకంటే వారు సదా పవిత్రమైనవారు. మీరు వీరి వెనుక పరుగెత్తలేదు. నేను అందరికంటే ఎక్కువగా పూర్తి 84 జన్మలు ప్రవృత్తి మార్గములో ఉన్నానని ఇతడు (బ్రహ్మ) అంటాడు. కనుక ఇతడు(బ్రహ్మ) మిమ్ములను ఆకర్షించలేడు. నేనే మిమ్ములను ఆకర్షించానని తండ్రి చెప్తున్నారు. భలే సన్యాసులు పవిత్రంగా ఉంటారు కాని నా వలె సంపూర్ణ పవిత్రంగా ఎవ్వరూ ఉండలేరు. వారంతా భక్తిమార్గపు శాస్త్రాలు వినిపిస్తారు. నేను వచ్చి మీకు వేదశాస్త్రాల సారమును వినిపిస్తాను. చిత్ర్రాలలో కూడా విష్ణువు నాభి నుండి బ్రహ్మ వెలువడినట్లుగా చూపిస్తారు. బ్రహ్మ చేతిలో శాస్త్రాలు చూపించారు. ఇప్పుడు విష్ణువు బ్రహ్మ ద్వారా శాస్త్రాల రహస్యాన్ని వినిపించడం లేదు. వారైతే విష్ణువును కూడా భగవంతునిగా భావిస్తారు. నేను ఈ బ్రహ్మ ద్వారా వినిపిస్తానని తండ్రి అర్థం చేయిస్తారు. నేను విష్ణువు ద్వారా అర్థం చేయించను. బ్రహ్మ ఎక్కడ? విష్ణువు ఎక్కడ? బ్రహ్మయే విష్ణువుగా అవుతాడు మళ్లీ 84 జన్మల తర్వాత ఈ సంగమ యుగము వస్తుంది. ఇవన్నీ కొత్త విషయాలు కదా! అర్థం చేయించవలసిన ఎంత అద్భుతమైన విషయాలు!

ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - పిల్లలూ! జీవించి ఉంటూనే మరణించాలి. మీరు శరీరములో జీవిస్తారు కదా. మేము ఆత్మలము, బాబా జతలో వెళ్లిపోతామని భావిస్తారు. ఈ శరీరము మొదలైనవేవీ తీసుకెళ్లరు. ఇప్పుడు బాబా వచ్చారు. కొంచెమైనా నూతన ప్రపంచములోకి ట్రాన్స్‌ఫర్‌ చేసుకోండి. మనుష్యులు మరు జన్మలో పొందేందుకు దాన-పుణ్యాలు మొదలైనవి చేస్తారు. మీకు కూడా నూతన ప్రపంచములో లభిస్తుంది. ఇది కూడా కల్పక్రితము ఎవరు చేసి ఉంటారో వారే చేస్తారు. కొంచెం కూడా తక్కువ-ఎక్కువ కాదు. మీరు సాక్షీగా చూస్తూ ఉంటారు. ఏమీ అనవలసిన అవసరము కూడా ఉండదు. అయినా ఏదైతే చేస్తారో దాని అహంకారము రాకూడదని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మనము ఆత్మలము, ఈ శరీరాన్ని వదిలి వెళ్లిపోతాము. అక్కడ నూతన ప్రపంచములో నూతన శరీరము తీసుకుంటాము. రాముడు వెళ్లిపోయాడు, రావణుడు వెళ్లిపోయాడు................ అని గానము కూడా ఉంది. రావణుని పరివారము ఎంత పెద్దది! మీరైతే కేవలం కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఇదంతా రావణ సాంప్రదాయము. మీది రాముని సాంప్రదాయము. చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. 9 లక్షలే ఉంటారు. మీరు ధరణిలోని నక్షత్రాలు కదా. మాతా-పితలు మరియు పిల్లలైన మీరు. కనుక మాటిమాటికి మరుజీవా అయ్యేందుకు ప్రయత్నం చేయమని తండ్రి అర్థం చేయిస్తారు. ఒకవేళ ఎవరినైనా చూచినప్పుడు వీరు చాలా బాగున్నారు. అత్యంత మధురంగా అర్థం చేయిస్తారని బుద్ధిలోకి వచ్చినా అది కూడా మాయనే. అది యుద్ధము చేస్తుంది. మాయ చాలా ఆశ చూపిస్తుంది. వారి అదృష్టములో లేకుంటే మాయ ఎదుర్కొంటుంది. ఎంత అర్థం చేయించినా కోపము చేసుకుంటారు. దేహాభిమానమే ఈ పని చేయిస్తోందని అర్థం చేసుకోరు. ఒకవేళ ఎక్కువగా వివరించి చెప్పినట్లయితే జ్ఞానాన్ని వదిలి వెళ్లిపోతారు. అందువల్ల ప్రేమతో నడిపించాల్సి ఉంటుంది. ఎవరి పైన అయినా మనసు పడితే ఇక చెప్పలేము, పిచ్చివారైపోతారు. మాయ పూర్తిగా బుద్ధిహీనులుగా చేసేస్తుంది. అందుకే తండ్రి చెప్తున్నారు - ఎప్పుడూ ఎవరి నామ-రూపాలలో చిక్కుకోకండి. నేను ఆత్మను మరియు ఒక్క తండ్రి ఎవరైతే విదేహి అయినారో వారి పైనే ప్రేమ ఉంచుకోవాలి. ఇందులోనేే శ్రమ ఉంది. ఏ దేహము పౖెెనా మమకారము ఉండారాదు. ఇంటిలో కూర్చుని ఉన్నా తాను చాలా మధురమైనది, చాలా బాగా అర్థం చేయించిందని ఆ జ్ఞానమును ఇచ్చినవారే గుర్తొస్తూ ఉండరాదు. అరే! మధురమైనది జ్ఞానము. ఆత్మ మధురమైనది. శరీరము మధురమైనది కాదు. మాట్లాడేది కూడా ఆత్మనే. ఎప్పుడూ శరీరము పై ఆకర్షితులు అవ్వరాదు. శరీరాన్ని ప్రేమించరాదు.

ఈ రోజుల్లో భక్తిమార్గం చాలా ఉంది. అనందమయి మాతను కూడా మాతా-మాతా అని స్మృతి చేస్తూ ఉంటారు. అచ్ఛా! మరి తండ్రి ఎక్కడ ఉన్నాడు? ఆస్తి తండ్రి నుండి లభిస్తుందా? లేక తల్లి నుండి లభిస్తుందా? తల్లికి కూడా ధనము ఎక్కడి నుండి లభిస్తుంది. కేవలం తల్లీ-తల్లీ అన్నందున పాపము కొద్దిగా కూడా తెగిపోదు. ''నన్నొక్కరినే స్మృతి చేయండి'' అని తండ్రి చెప్తున్నారు. నామ-రూపాలలో చిక్కుకోరాదు. అలా చిక్కుకుంటే ఇంకా ఎక్కువగా పాపము అవుతుంది. ఎందుకంటే తండ్రి ఆజ్ఞను ధిక్కరించినవారిగా అయిపోతారు. చాలా మంది పిల్లలు మర్చిపోయి ఉన్నారు. నేను పిల్లలైన మిమ్ములను తీసుకెళ్లేందుకు వచ్చానని తండ్రి అర్థం చేయిస్తున్నారు. కనుక తప్పకుండా తీసుకెెళ్తాను అందువల్ల నన్ను స్మృతి చేయండి. నన్ను ఒక్కరినే స్మృతి చేయుట నుండే మీ పాపాలు తెగిపోతాయి. భక్తిమార్గములో చాలా మందిని స్మృతి చేస్తూ వచ్చారు. కాని తండ్రి లేకుండా ఏ పని అయినా ఎలా జరుగుతుంది? తల్లిని స్మృతి చేయమని తండ్రి చెప్పరు. తండ్రి చెప్తున్నారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. పతితపావనుడను నేనే. తండ్రి ఆజ్ఞానుసారము నడచుకోండి. మీరు కూడా తండ్రి ఆదేశానుసారము ఇతరులకు అర్థం చేయిస్తూ ఉండండి. మీరు పతితపావనులు కారు. ఒక్కరినే స్మృతి చేయాలి. మాకు ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు. బాబా, మేము మీ పై అర్పణ అవుతాము అని అంటారు. అర్పణమవ్వడం అయితే శివబాబా పైనే అవ్వాలి. మిగిలిన వారందరి స్మృతి తొలగిపోవాలి. భక్తిమార్గములో అనేక మందిని స్మృతి చేస్తూ ఉంటారు. ఇక్కడైతే ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ ఉండరాదు. ఇంత చెప్పినా ఎవరైనా తమ మతమును నడిపించినట్లయితే ఇక వారికి గతి - సద్గతులు ఏమి లభిస్తాయి? బిందువును ఎలా స్మృతి చేయాలి? అని తికమకపడ్తూ ఉంటారు. అరే! మీకు నేను ఆత్మనని తమ ఆత్మ స్మృతి ఉంటుంది కదా. మీరు కూడా బిందు రూపమే, మీ తండ్రి కూడా బిందువే. తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. మాత(తల్లి) అయితే దేహధారి అవుతుంది. మీకు విదేహి నుండే వారసత్వం లభిస్తుంది. కనుక మిగిలిన అన్ని విషయాలను వదిలి ఒక్కరితోనే బుద్ధి యోగమును జోడించాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. శరీర భ్రాంతి సమాప్తము చేసేందుకు నడుస్తూ - తిరుగుతూ ఈ శరీరము నుండి మరణించి ఉన్నాము, భిన్నంగా ఉన్నాము, శరీరములో లేనే లేము అని అభ్యాసము చెయ్యాలి. శరీరము లేకుండా ఆత్మను చూడండి.

2. ఎప్పుడూ ఎవరి శరీరము పై మీరు ఆకర్షితులు అవ్వరాదు. ఒక్క విదేహి అయిన తండ్రి పైనే ప్రేమను ఉంచుకోవాలి. ఒక్కరితోనే బుద్ధి యోగమును జోడించాలి.

వరదానము :-

''బ్రాహ్మణ జీవితంలో అన్ని ఖజానాలను సఫలం చేసి సదా ప్రాప్తి సంపన్నంగా అయ్యే సంతుష్టమణి భవ ''

బ్రాహ్మణ జీవితంలో అన్నిటికంటే అత్యంత గొప్ప ఖజానా ''సంతుష్టంగా ఉండుట (తృప్తిగా ఉండుట). ఎక్కడైతే సర్వ ప్రాప్తులు ఉంటాయో అక్కడ తృప్తి ఉంటుంది. తృప్తి ఎక్కడ ఉంటుందో అక్కడ అన్నీ(సర్వము) ఉంటాయి. ఎవరైతే సంతుష్ట రత్నాలుగా ఉంటారో వారు సర్వ ప్రాప్త్తి స్వరూపులుగా ఉంటారు. వారు ''పొందాల్సినదంతా పొందాను'' అనే పాట పాడుతూ ఉంటారు. ఇటువంటి సర్వ ప్రాప్తి సంపన్నులుగా అయ్యేందుకు విధి - '' లభించిన ఖజానాలన్నిటిని ఉపయోగించడం.'' ఎందుకంటే ఖజానాలను ఎంత సఫలం చేస్తారో అవి అంత వృద్ధి చెందుతూ ఉంటాయి.

స్లోగన్‌ :-

''ఎవరైతే అవగుణాలనే రాళ్లను కాక సదా 'మంచి' అనే ముత్యాలను ఏరుకుంటారో వారే హోలీహంసలు.''