11-06-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - అన్నింటికంటే ముఖ్యమైన సేవ తండ్రి స్మృతిలో ఉండడం, ఇతరులకు స్మృతిని ఇప్పించడం. మీరు ఎవరికైనా తండ్రి పరిచయమునిచ్చి వారి కళ్యాణము చేయవచ్చు ''
ప్రశ్న :-
ఏ ఒక్క చిన్న అలవాటు పెద్ద అవజ్ఞను చేయిస్తుంది? దాని నుండి తప్పించుకునే యుక్తి ఏది?
జవాబు :-
ఎవరిలోనైనా ఏదైనా దాచుకునే లేక దొంగతనము చేసే అలవాటు ఉంటే దాని ద్వారా చాలా పెద్ద అవజ్ఞ(ఆజ్ఞను ధిక్కరించుట) జరుగుతుంది. పైసా దొంగ లక్షల దొంగగా(కఖ్ కా చోర్ సో లఖ్ కా చోర్) అవుతాడని అంటారు. లోభ వశమై ఆకలి అయినప్పుడు దాచిపెట్టుకొని అడగకుండా తినేయడం, దొంగతనము చేయడం - ఇవి చాలా చెడ్డ అలవాట్లు. ఈ అలవాట్ల నుండి తప్పించుకునేందుకు బహ్మ్రాబాబా సమానము టస్ట్రీలుగా అవ్వండి. ఇటువంటి అలవాటు ఏది ఉన్నా తండ్రికి ఉన్నది ఉన్నట్లుగా సత్యం వినిపించండి.
ఓంశాంతి.
ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మనము అనంతమైన తండ్రి ఎదుట కూర్చుని ఉన్నామని పిల్లలకు తెలుసు. మనము ఈశ్వరీయ పరివారానికి చెందినవారమని పిల్లలకు తెలుసు. ఈశ్వరుడు నిరాకారుడు. మీరు ఆత్మ అభిమానులై కూర్చొని ఉన్నారు. ఇందులో సైన్సు ఆడంబరాలు గానీ, హఠయోగము మొదలైనవి చేయడం గానీ అవసరము లేదు. ఇది బుద్ధితో చేసే పని. శరీరముతో ఏ మాత్రము పని లేదు. హఠయోగములో శరీరముతో పని ఉంటుంది. ఇచ్చట మనము పిల్లలమని భావిస్తూ తండ్రి ఎదుట కూర్చొని ఉన్నాము. తండ్రి మనలను చదివిస్తున్నారని మనకు తెలుసు. తండి చెప్తున్నారు - మధురమైన పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించి తండిన్రి స్మృతి చేస్తే మీ పాపాలన్నీ తొలగిపోతాయి. చక్రమును త్రిప్పుతూ ఉండండి. ఇతరులకు సేవ చేసి మీ సమానంగా తయారు చేయండి. తండ్రి కూర్చొని ఒక్కొక్కరు ఎంత సేవ చేస్తున్నారని పరిశీలిస్తారు. స్థూల సేవ చేస్తున్నారా, సూక్ష్మ సేవ చేస్తున్నారా లేక మూల సేవ చేస్తున్నారా? అని ఒక్కొక్కరిని తండ్రి గమనిస్తారు. వీరు అందరికీ తండ్రి పరిచయము ఇస్తున్నారా? ఇదే ముఖ్యమైన విషయము. పిల్లలు ప్రతి ఒక్కరు తండ్రి పరిచయమును ఇస్తారు. తండ్రి అడుగుతున్నారు - '' నన్ను స్మృతి చేస్తే మీ జన్మ-జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి'' అని ఇతరులకు తెలుపుతున్నారా? ఈ సేవ ఎంతవరకు చేస్తున్నారు? మీకు మీరు పరిశీలించుకుంటున్నారా? అందరికంటే ఎక్కువగా ఎవరు సేవ చేస్తున్నారు? నేను వీరి కంటే ఎక్కువ సేవ ఎందుకు చేయరాదు? వీరి కంటే ఎక్కువగా స్మృతి యాత్రలో పరుగెత్తగలరా లేదా? అని ప్రతి ఒక్కరిని బాబా పరిశీలిస్తూ ఉంటారు. బాబా ప్రతి ఒక్కరిని ఏ ఏ సేవ చేస్తున్నారు? అని సమాచారము అడుగుతారు. ఎవరికైనా తండ్రి పరిచయమిచ్చి వారి కళ్యాణము చేస్తున్నారా? సమయము వృథా చేయడం లేదు కదా? ఇప్పుడు అందరూ అనాథలే. ఇదే ముఖ్యమైన విషయము. అనంతమైన తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి నుండి వారసత్వము తప్పకుండా లభిస్తుంది. పిల్లలైన మీ బుద్ధిలో ముక్తి-జీవన్ముక్తి ధామాలు రెండూ ఉన్నాయి. ఇప్పుడు మేము చదువుకుంటున్నామని కూడా అర్థము చేసుకోవాలి. స్వర్గములోకి వచ్చి మళ్లీ జీవన్ముక్తి రాజ్యభాగ్యాన్ని తీసుకుంటారు. ఇతర ధర్మాలలోని అనేకమంది ఆత్మలలో ఎవ్వరూ ఆ రాజ్యములో ఉండనే ఉండరు. కేవలం మనము మాత్రమే భారతదేశములో ఉంటామని కూడా పిల్లలైన మీరు అర్థం చేయించాలి. బుద్ధిలో ఏమేమి ఉండాలో తండ్రి కూర్చొని పిల్లలకు నేర్పిస్తారు. ఈ సంగమ యుగములో మీ ఆహార-పానీయాలు కూడా చాలా శుద్ధంగా, పవిత్రంగా ఉండి తీరాలి. మనము భవిష్యత్తులో సర్వ గుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులుగా తయారవుతామని కూడా మీకు తెలుసు. ఈ మహిమ శరీర ధారణ చేసిన ఆత్మలది. కేవలం ఆత్మలకు మహిమ ఉండదు. ప్రతి ఒక్క ఆత్మ పాత్ర ఎవరిది వారిదే. ఇక్కడకు వచ్చి ఆ పాత్ర చేస్తారు. మీ బుద్ధిలో మనము వీరి వలె తయారవ్వాలనే లక్ష్యముంది. పిల్లలూ, పవిత్రంగా అవ్వండి అని బాబా ఆజ్ఞాపించారు. పవిత్రంగా ఎలా ఉండాలని అడుగుతారు. ఎందుకంటే మాయ తుఫాన్లు చాలా వస్తాయి. బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్లిపోతుంది. వాటిని ఎలా వదలాలి? పిల్లల బుద్ధి పని చేస్తుంది కదా. ఇతరులెవ్వరి బుద్ధి ఇలా పని చేయదు. తండ్రి, టీచరు, గురువు మీకు లభించారు. అత్యంత శ్రేష్ఠమైనవారు భగవంతుడని కూడా మీకు తెలుసు. వీరు తండ్రి, టీచరే కాక జ్ఞానసాగరులు కూడా అయ్యారు. ఆత్మలైన మనలను తమ వెంట తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. సత్యయుగములో చాలా కొద్దిమందే దేవీదేవతలు ఉంటారు. ఈ విషయాలు మీకు తప్ప మరెవ్వరి బుద్ధిలోనూ ఉండవు. వినాశనము తర్వాత మనమే చాలా కొద్దిమంది ఉంటామని మీ బుద్ధిలో ఉంది. ఇతర ధర్మాలు, ఖండాలు మొదలైనవేవీ అచ్చట ఉండవు. మనమే విశ్వానికి అధికారులుగా ఉంటాము. మన రాజ్యము ఒక్కటే ఉంటుంది. చాలా సుఖప్రదమైన రాజ్యముంటుంది. అయితే అందులో రకరకాల పదవులు గలవారు ఉంటారు. మాకు ఏ పదవి ఉంటుంది? మేము ఎంత ఆత్మిక సేవ చేస్తున్నాము ?.... ఈ విషయాలు తండ్రి కూడా అడుగుతారు. అంతేకాని బాబా అంతర్యామి ఏమీ కాదు. పిల్లలైన మీరు ప్రతి ఒక్కరు స్వయం మేము ఏం చేస్తున్నామని అర్థం చేసుకోగలరు. మొదటి నంబరు సేవ శ్రీమతముననుసరించి ఈ దాదా(బ్రహ్మ) చేస్తున్నారు. ఇది అందరికీ తెలుసు. తండి పదే పదే అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ! స్వయాన్ని ఆత్మ అని భావించండి, దేహాభిమానాన్ని వదలండి. ఆత్మ అని ఎంత సమయము భావిస్తున్నారు? మనమంతా ఆత్మలము అని పక్కా చేసుకోవాలి. తండిన్రి స్మృతి చేయాలి. దీని ద్వారానే కష్టాలు తొలగిపోతాయి, పడవ(నావ) తీరానికి చేరుతుంది. స్మృతి చేస్తూ చేస్తూ పాత ప్రపంచము నుండి నూతన ప్రపంచములోనికి వెళ్ళిపోతారు. ఇక కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది. తర్వాత మనము మళ్లీ మన సుఖధామములోకి వెళ్లిపోతాము. అందరికీ తండి పరిచయమును ఇవ్వడమే ముఖ్యమైన ఆత్మిక సేవ. ఇది అన్నింటికంటే సులభమైన విషయము. స్థూల సేవ చేయడంలో, భోజనము తయారు చేయడంలో, భోజనము తినడంలో శ్రమ ఉంటుంది కానీ ఇందులో శ్రమించే విషయమేదీ లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. పాత్ర చేసేదంతా ఆత్మయే. ఈ శిక్షణ తండ్రి వినాశన సమయములో ఒక్కసారి మాత్రమే స్వయంగా వచ్చి ఇస్తారు. నూతన ప్రపంచము దేవీ దేవతలది. అందులోకి తప్పకుండా వెళ్లాలి. మిగిలినవారంతా శాంతిధామానికి వెళ్తారు. ఈ పాత ప్రపంచము ఇక ఉండనే ఉండదు. మీరు నూతన ప్రపంచములో ఉన్నప్పుడు పాత ప్రపంచము గుర్తుంటుందా? ఏ మాత్రము ఉండదు. మీరు స్వర్గములో రాజ్యము చేస్తూ ఉంటారు. ఇది బుద్ధిలో ఉండడం ద్వారా సంతోషము కలుగుతుంది. స్వర్గానికి అనేక పేర్లున్నాయి. నరకానికి కూడా అనేక పేర్లు ఉంచారు - పాపాత్మల ప్రపంచము, హెల్, దుఃఖధామము అని అంటారు. బేహద్ తండ్రి ఒక్కరేనని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. మనము వారి అపురూపమైన పిల్లలము. అందువలన అటువంటి తండ్రి పై చాలా ఎక్కువ ప్రేమ ఉండాలి. తండ్రికి కూడా పిల్లలంటే చాలా ప్రేమ. ఎవరు ఎక్కువ సేవ చేస్తారో, ముళ్లను పుష్పాలుగా చేస్తారో అటువంటి పిల్లల పై తండిక్రి కూడా చాలా పేమ్ర ఉంటుంది. మానవుల నుండి దేవతలుగా తయారవ్వాలి కదా. తండ్రి స్వయం దేవీ దేవతలుగా అవ్వరు, మనలను తయారు చేసేందుకు వచ్చారు. అందువలన ఆంతరికములో చాలా సంతోషముండాలి. స్వర్గములో మనము ఏ పదవి పొందుతాము? మనము ఏ సేవ చేస్తున్నాము? ఇంట్లో పని చేయు నౌకర్లకు, చాకర్లకు కూడా తండ్రి పరిచయమునివ్వాలి. ఎవరు స్వయంగా సంబంధములోకి వస్తారో వారికి శిక్షణను ఇవ్వాలి. అబలలు, నిరుపేదలు, కోయవనితలు మొదలైనవారికి సేవ చేయాలి. పేదవారు చాలామంది ఉన్నారు. వారు సంస్కరింపబడ్తారు. ఏ పాపాలు మొదలైనవి చేయరు. లేకుంటే పాపకర్మలు చేస్తూ ఉంటారు. అసత్యము, దొంగతనము కూడా ఎంత పెరిగిపోయిందో చూడండి. నౌకర్లు కూడా దొంగతనము చేస్తూ ఉంటారు. ఇంట్లో పిల్లలుంటారు మరి తాళము ఎందుకు వేయాలి? కానీ ఈ రోజులలో పిల్లలు కూడా దొంగలుగా అవుతారు. ఏదో ఒకటి దాచిపెట్టుకొని తీసుకుపోతారు. ఎవరికైనా ఆకలైతే లోభము కారణంగా తినేస్తారు. లోభులు తప్పకుండా ఏదో ఒకటి దొంగతనము చేసి తింటూ ఉంటారు. ఇది శివబాబా భంఢారము. ఇందులో ఒక్క పైసా కూడా దొంగతనము చేయరాదు. బహ్మ్ర కేవలము నిమిత్తులు. బేహద్ తండి అయిన భగవంతుడు మీ వద్దకు వచ్చారు. భగవంతుని ఇంటిలో ఎప్పుడైనా ఎవరైనా దొంగతనము చేస్తారా? స్వప్నములో కూడా చేయరు. అత్యంత శేష్ఠ్రమైనవారు శివభగవానుడే అని మీకు తెలుసు. మనము వారి పిల్లలము. కావున మనము దైవీ కర్మలు చేయాలి.
దొంగతనము చేసేవారికి కూడా మీరు జైలుకు వెళ్లి జ్ఞాన దానము చేస్తారు. అటువంటి వారు ఇక్కడ ఎందుకు దొంగతనము చేస్తారు? ఎప్పుడైనా మామిడి పండు, ఎప్పుడైనా ఏదో ఒక తినే వస్తువు తీసుకుని తినేస్తారు - ఇది కూడా దొంగతనమే కదా. ఏ వస్తువు కూడా అడగకుండా తీసుకోరాదు. చేతితో తగలను కూడా తగలరాదు. శివబాబా మన తండ్రి, వారు వినడమే కాక చూడను కూడా చూస్తారు. పిల్లలూ! మీలో ఏ అవగుణాలు లేవు కదా? అని అడుగుతారు. ఏదైనా అవగుణముంటే బాబాకు వినిపించండి, దానము ఇచ్చేయండి. దానంగా ఇచ్చి మళ్లీ తప్పులు చేస్తే చాలా శిక్షలు అనుభవిస్తారు. దొంగతనం చేసే అలవాటు చాలా చెడ్డది. ఎవరైనా సైకిలు తీసుకుని పట్టుపడ్డారనుకోండి. ఏదైనా దుకాణానికి వెళ్లినప్పుడు ఒక బిస్కట్ ప్యాకెట్ను దాచి పెట్టినారు లేక ఏదైనా చిన్న వస్తువు తీసుకున్నారు అనుకోండి. దుకాణదారుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. అతడు ఏం చేస్తాడో మీకు తెలుసు. ఇది కూడా చాలా పెద్ద ప్రభుత్వము, పాండవ ప్రభుత్వము. తన దైవీ రాజ్యమును స్థాపన చేస్తోంది. తండ్రి అంటున్నారు - నేను రాజ్యపాలన చేయను, పాండవులైన మీరే రాజ్యపాలన చేస్తారు. వారు పాండవపతిగా కృష్ణుని చూపించారు. అయితే పాండవ పిత ఎవరు? మీ ముందే కూర్చొని ఉన్నారని మీకు తెలుసు. నేను బాబా సేవ ఏం చేస్తున్నానని పత్రి ఒక్కరికి ఆంతరికములో తెలుసు. బాబా మనకు విశ్వ రాజ్యాధికారము ఇచ్చి, స్వయం వానప్రస్థములోకి వెళ్ళిపోతారు. ఎంతటి నిష్కామ సేవ చేస్తారు! అందరూ సుఖమును, శాంతిని పొందుతారు. వారు కేవలం విశ్వములో శాంతి కావాలని నోటితో అంటారు. శాంతి బహుమతి ఇస్తూ ఉంటారు. మనకు చాలా గొప్ప బహుమతి లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. ఎవరైతే మంచి సేవ చేస్తారో, వారికి పెద్ద ప్రైజు లభిస్తుంది. తండ్రి పరిచయమివ్వడం అన్నిటికంటే శ్రేష్ఠమైన సేవ. ఇది ఎవరైనా చేయగలరు. పిల్లలు దేవతలుగా అవ్వాలంటే సేవ కూడా చేయాలి కదా. ఇతనిని చూడండి, ఇతడు కూడా లౌకిక పరివారము గల వాడే కదా. ఇతని ద్వారా బాబా సేవ చేయించారు. ఇతనిలో ప్రవేశించి ఇతనికి కూడా చెప్తారు. అలాగే మీకు కూడా ఇలా చేయమని, ఇది చేయమని చెప్తారు. నాకు ఎలా చెప్తారు? నాలో ప్రవేశించి చేయిస్తారు. వారు చేసి చేయించేవారు కదా. అకస్మాత్తుగా నాలో కూర్చొని - కూర్చొని ఇది వదులు, ఇది ఛీ-ఛీ ప్రపంచము, వైకుంఠానికి పద, ఇప్పుడు వైకుంఠానికి అధికారిగా అవ్వాలి అని వారన్నారు. అంతే వెంటనే వైరాగ్యము వచ్చేసింది. ఇతనికి ఏమయ్యింది? అని అందరూ అనుకునేవారు. ఇంత మంచి లాభము సంపాదించే వ్యాపారి ఇలా అయిపోయాడు, ఏమి చేస్తున్నాడు? అని అందరూ అనుకున్నారు. ఇతను వెళ్లి ఏమి చేస్తాడో ఎవ్వరికీ తెలియదు. వదిలేయడం పెద్ద విషయమేమీ కాదు. వెంటనే సర్వస్వము త్యాగము చేసేశాడు. అలాగే అందరితో త్యాగము చేయించారు. కూతురుతో కూడా త్యాగము చేయించారు. ఇప్పుడు ఈ ఆత్మిక సేవ చేయాలి, అందరినీ పవిత్రంగా తయారు చేయాలి. మేము జ్ఞానామృతము త్రాగేందుకు వెళ్తున్నామని అందరూ అనేవారు. పేరు మాత్రము మాతది. ఓం రాధ వద్దకు జ్ఞానామృతము త్రాగేందుకు వెళ్తున్నామని చెప్పేవారు. ఈ యుక్తి రచించిందెవరు? శివబాబా ఇతనిలో ప్రవేశించి ఎంతో మంచి యుక్తిని రచించారు. ఎవరు వచ్చినా వారు జ్ఞానామృతమును త్రాగుతారు. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తినాలి? అన్న గాయనము కూడా ఉంది. విషాన్ని వదలి జ్ఞానామృతము తాగి, పవిత దేవతలుగా అవ్వాలి. ప్రారంభములో ఇలా చెప్పేవారు. ఎవరైనా వస్తే పవిత్రంగా అవ్వండి అని చెప్పేవారు. అమృతము త్రాగాలంటే విషాన్ని వదిలేయాలి. పవిత్ర వైకుంఠానికి అధికారిగా అవ్వాలంటే, ఒక్కరినే స్మృతి చేయాలి. ఇలా అన్నప్పుడు తప్పకుండా గొడవలు జరుగుతాయి కదా. ప్రారంభములోని గొడవలు ఇప్పటివరకు జరుగుతూనే వచ్చాయి. అబలల పై ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. మీరు ఎంత పక్కాగా అవుతూ ఉంటారో అంత పవిత్రత చాలా మంచిదని అర్థము చేసుకుంటారు. అందుకే ''బాబా మీరు వచ్చి పావనంగా తయారు చేయండి'' అని పిలుస్తూ ఉంటారు. ఇంతకు ముందు మీ స్వభావము కూడా ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా అవుతున్నారు? ఇంతకు ముందు దేవతల ముందుకు వెళ్లి చేతులు జోడించి మేము పాపులమని అనేవారు. ఇప్పుడు అలా అనరు. ఎందుకంటే ఇప్పుడు మనము ఇలా(దేవతలుగా) తయారవుతున్నామని మీకు తెలుసు.
నేను ఎంత వరకు సేవ చేస్తున్నాను? అని పిల్లలు స్వయాన్ని పశ్న్రించుకోవాలి. ఉదాహరణానికి భండారీ (వంట చేయువారు) మీ కొరకు ఎంత సేవ చేస్తోంది! ఎంత పుణ్యము సంపాదించుకుంటోంది! అనేక మందికి సేవ చేస్తోంది, అందువలన వారికి అందరి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఎంతోమంది ఆమెను గురించి చాలా గొప్పగా వ్రాస్తారు. భండారి సేవ చాలా అద్భుతము. ఎన్ని ఏర్పాట్లు చేస్తుంది! ఇది స్థూల సేవ. సూక్ష్మ సేవ కూడా చేయాలి. బాబా, ''ఈ పంచ భూతాలు చాలా తీవ్రమైనవని, స్మృతిలో ఉండనివ్వడం లేదు'' అని పిల్లలంటారు. పిల్లలూ, శివబాబాను స్మృతి చేసి భోజనము తయారు చేయండి అని బాబా అంటారు. ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేనే లేరు. వారే సహాయము చేస్తారు. నేను నీ శరణుజొచ్చాను.......... అని గాయనము కూడా ఉంది కదా. సత్యయుగములో ఇలా అనరు. ఇప్పుడు మీరు శరణులోకి వచ్చేశారు. ఎవరికైనా భూతాలు పట్టుకుంటే అవి చాలా పీడిస్తాయి. అశుద్ధ ఆత్మ ప్రవేశిస్తుంది. మిమ్ములను ఎన్ని భుతాలు పట్టుకొని ఉన్నాయి. కామము, క్రోధము, లోభము, మోహము........... ఈ భూతాలు మిమ్ములను చాలా పీడిస్తున్నాయి. అశుద్ధ ఆత్మ అయితే కొంతమందిని విసిగించి బాధపెడ్తుంది. కానీ ఈ పంచ భూతాలు 2500 సంవత్సరాల నుండి పీడిస్తున్నాయని మీకు తెలుసు. మీరు ఎంత బాధపడ్డారు! ఈ పంచ భూతాలు మిమ్ములను నిరుపేదలుగా చేసేశాయి. దేహాభిమానము నంబర్వన్ భూతము. కామము కూడా చాలా పెద్ద భూతము. అవి మిమ్ములను ఎంత సతాయించాయో అది కూడా తండ్రియే తెలిపించారు. కల్ప-కల్పము మిమ్ములను ఈ భూతాలు పీడిస్తాయి. యథా రాజా రాణి తథా ప్రజా. అందరికీ భూతాలు పట్టే ఉన్నాయి. అందువలన దీనిని భూతాల ప్రపంచమని అంటారు. రావణ రాజ్యము అనగా రాక్షసుల రాజ్యము. సత్య-త్రేతా యుగాలలో భూతాలు ఉండవు. ఒక్క భూతమైనా ఎంత బాధిస్తుంది! వీటిని గురించి ఎవ్వరికీ తెలియదు. ఇది 5 వికారాల రూపీ రావణ భూతము. తండ్రి వచ్చి వాటి నుండి విడిపిస్తారు. మీలో కూడా కొంతమంది చాలా తెలివైనవారున్నారు. వారి బుద్ధిలో వెంటనే ఈ విషయాలు కూర్చుంటాయి. ఈ జన్మలో అటువంటి పని ఏదీ చేయరాదు. దొంగతనము చేస్తే, దేహాభిమానములోకి వస్తే ఫలితము ఏమవుతుంది? పదవి భ్రష్టమైపోతుంది. చెప్పకుండా ఏదో ఒకటి తీసుకుపోతారు. పైసల దొంగ లక్షల దొంగగా అవుతాడని అంటారు కదా. యజ్ఞములో ఇటువంటి పనులు ఎప్పుడూ చేయరాదు. అలవాటు పడితే, అది సులభంగా వదిలిపోదు. ఎంతో తల కొట్టుకుంటూ ఉంటారు. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. స్థూల సేవతో పాటు సూక్ష్మ సేవ, మూల(ముక్తినిచ్చు) సేవ కూడా చేయాలి. అందరికీ తండ్రి పరిచయమునివ్వాలి. ఆత్మల కళ్యాణము చేయాలి. స్మృతి యాత్రలో ఉండాలి. ఇదే సత్యమైన సేవ. ఈ సేవలో తలమునకలై(బిజీగా) ఉండాలి. మీ సమయాన్ని వృథా చేయరాదు.
2. తెలివిగలవారై 5 వికారాలనే భూతాల పై విజయము ప్రాప్తి చేసుకోవాలి. దొంగతనము లేక అసత్యము చెప్పే అలవాటు తొలగించి వేయాలి. దానంగా ఇచ్చిన వస్తువును ఎప్పుడూ వాపసు తీసుకోరాదు.
వరదానము :-
'' కర్మయోగులుగా అయ్యి ప్రతి సంకల్పము, మాట, కర్మలను శ్రేష్ఠంగా చేసుకునే నిరంతర యోగీ భవ ''
కర్మయోగీ ఆత్మల ప్రతి కర్మ యోగయుక్తంగా, యుక్తియుక్తంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా కర్మ యుక్తియుక్తంగా జరగకుంటే యోగయుక్తంగా లేరని అర్థము చేసుకోండి. ఒకవేళ సాధారణ కర్మ లేక వ్యర్థ కర్మ జరిగితే వారిని నిరంతర యోగులని అనరు. కర్మయోగులనగా ప్రతి సెకండు, ప్రతి సంకల్పము, ప్రతి మాట సదా శ్రేష్ఠంగా ఉండాలి. శ్రేష్ఠ కర్మకు గుర్తు - స్వయం కూడా సంతుష్టంగా ఉండాలి, ఇతరులు కూడా సంతుష్టంగా ఉండాలి. ఇటువంటి ఆత్మలే నిరంతర యోగులుగా అవుతారు.
స్లోగన్ :-
'' స్వయం ప్రియ, లోక ప్రియ మరియు ప్రభు ప్రియమైన ఆత్మలే వరదాని మూర్తులు.''