08-08-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - పని పాటలు చేసుకుంటున్నా తండ్రి గుర్తుండాలి, నడుస్తూ - తిరుగుతూ తండ్రిని, ఇంటిని స్మృతి చేయండి, ఇదే మీ పరాక్రమము ( సాహసము ) ''
ప్రశ్న :-
తండ్రికి గౌరవము, అగౌరవము ఎప్పుడు, ఎలా జరుగుతుంది ?
జవాబు :-
పిల్లలైన మీరు తండ్రిని బాగా స్మృతి చేస్తున్నప్పుడు తండ్రిని గౌరవిస్తారు. ఒకవేళ స్మృతి చేసేందుకు తీరిక లేదని అంటే అది కూడా అగౌరవపరచినట్లు అవుతుంది. వాస్తవానికి ఇది తండ్రిని అగౌరవపరిచినట్లు కాదు, ఇది స్వయాన్ని అగౌరవపరచుకున్నట్లు అవుతుంది. అందువలన భాషణము చేయుటలోనే కాదు స్మృతియాత్రలో కూడా ప్రసిద్ధమవ్వండి. స్మృతి చార్టును పెట్టండి. స్మృతి ద్వారానే ఆత్మ సతోప్రధానంగా అవుతుంది.
ఓంశాంతి.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇక్కడ అర్థం చేయించే 84 జన్మల చక్రమును జ్ఞానమని అంటారు. దీనిని పిల్లలైన మనము జన్మ-జన్మల నుండి చదివాము మరియు ధారణ చేస్తూ వచ్చాము. ఇది చాలా సహజమైనది, ఇది క్రొత్తదేమీ కాదు.
సత్యయుగము నుండి కలియుగము చివరి వరకు మీరెన్ని పునర్జన్మలు తీసుకున్నారో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఈ జ్ఞానము చాలా సహజంగా బుద్ధిలో ఉండనే ఉంది. ఇది కూడా ఒక విధమైన చదువే. రచన ఆదిమధ్యాంతాలను అర్థము చేసుకోవాలి. దీనిని తండ్రి తప్ప మరెవ్వరూ అర్థము చేయించలేరు. తండ్రి చెప్తున్నారు - ఈ జ్ఞానము కంటే ఉన్నతమైనది స్మృతియాత్ర, దానిని యోగమని అంటారు. యోగమను పదము ప్రసిద్ధి చెందింది. కానీ ఇది స్మృతియాత్ర. మానవులు యాత్రకు వెళ్తూ ఉంటే, మేము ఫలానా తీర్థయాత్రకు వెళ్తున్నామని చెప్తారు. శ్రీనాథ లేక అమరనాథకు వెళ్తే అది గుర్తుంటుంది. ఇప్పుడు ఆత్మిక తండ్రి నన్నొక్కరినే స్మృతి చేయండి అని చాలా పొడవైన యాత్రను నేర్పిస్తున్నారని మీకు తెలుసు. ఆ యాత్రల నుండి మళ్లీ తిరిగి వస్తారు. ఇది ముక్తిధామానికి వెళ్లి అక్కడ నివసించే యాత్ర. భలే పాత్ర చేసేందుకు మళ్లీ రావాలి కానీ ఈ పాత ప్రపంచములోకి కాదు. ఈ పాత ప్రపంచము పై మీకు వైరాగ్యము కలిగింది. ఇది ఛీ-ఛీ రావణ రాజ్యము. కనుక ముఖ్యమైనది స్మృతియాత్ర. చాలామంది పిల్లలకు ఎలా స్మృతి చేయాలో కూడా తెలియదు. స్మృతి చేస్తున్నారా లేదా? అని చూచేందుకు ఇది కనిపించే వస్తువు కాదు. తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయిన నన్ను స్మృతి చేయండి. ఇది కంటితో చూచేది కాదు, తెలిసేది కాదు. ఆ స్థితిలో స్మృతియాత్రలో ఎంతమాత్రము స్థిరంగా ఉంటారో అది స్వయానికే తెలియాలి. యుక్తినైతే చాలామందికి తెలుపుతారు. కళ్యాణకారి తండ్రి తెలిపిస్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి శివబాబాను స్మృతి చేయండి. భలే తమ సేవను కూడా చేసుకుంటూ ఉండండి. కాపలా ఉన్y y 8 + Hz z @ z #3137; తిరుగుతూ తండ్రిని స్మృతి చేయడం చాలా సహజము. తండ్రి తప్ప మరేదీ గుర్తు రాకూడదు. బాబా ఉదాహరణ ఇచ్చి స్మృతిలోనే రావాలి, పోవాలి అని చెప్తున్నారు. క్రైస్తవ ఫాదరీలు ఎంత మౌనంగా వెళ్తూ ఉంటారు! కావున పిల్లలైన మీరు కూడా చాలా ప్రేమగా తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయాలి. ఇది చాలా గొప్ప గమ్యము. భక్తులు కూడా ఇదే పురుషార్థము చేస్తూ ఉంటారు. కానీ మనము వాపస్ వెళ్లాలని వారికి తెలియదు. కలియుగము పూర్తి అయినప్పుడు వెళ్తామని భావిస్తారు. వారికి ఇలా నేర్పించేవారు ఎవ్వరూ లేరు. పిల్లలైన మీకైతే నేర్పించబడ్తుంది. కాపలా ఉన్నవారికైతే ఏకాంతంగా తండ్రిని ఎంతగా స్మృతి చేస్తే అంత మంచిది. స్మృతి ద్వారా పాపము సమాప్తమవుతుంది. జన్మ-జన్మాంతరాల పాప భారము తల పై ఉంది. ఎవరైతే ముందు సతోప్రధానంగా అవుతారో వారు రామరాజ్యములో కూడా ముందే వెళ్తారు. కావున వారు అన్నిటికంటే ఎక్కువగా స్మృతియాత్ర చేస్తూ ఉండాలి. ఇది కల్ప-కల్పము జరిగే విషయము. ఇతనికైతే స్మృతియాత్రలో ఉండేందుకు మంచి అవకాశముంది. ఇక్కడైతే కొట్లాడే, జగడాలాడే విషయమేదీ లేదు. వస్తూ, పోతూ లేక కూర్చొని ఉన్నా ఒకేసారి రెండు కార్యాలు చేయవచ్చు, కాపలాగానూ ఉండండి, తండ్రిని స్మృతి కూడా చేయండి. కర్మలు చేస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. కాపలా ఉన్నవారికైతే అందరికంటే ఎక్కువ లాభముంది. ఒకవేళ ఈ స్మృతి చేసే అలవాటు పడితే పగలు కావచ్చు, రాత్రి కావచ్చు కాపలా ఉన్నవారికి చాలా లాభముంది. కాపలా కాస్తూ స్మృతియాత్రలో ఉండు ఈ మంచి సేవను తండ్రి ఇచ్చారు. తండ్రి స్మృతిలో ఉండే అవకాశము కూడా లభిస్తుంది. ఈ విధంగా స్మృతియాత్ర చేసేందుకు పలువిధాల యుక్తులు తెలిపిస్తారు. మీరు ఇక్కడ స్మృతి చేసినంతగా బయటి పనులు చేయునప్పుడు స్మృతి చేయలేరు. అందువలన రిఫ్రెష్(తాజాతనము) అయ్యేందుకు మధువనానికి వస్తారు. ఏకాంతంగా కొండ పైకి వెళ్లి కూర్చుని స్మృతియాత్రలో ఉండండి, ఒకరు వెళ్లండి లేక ఇద్దరు ముగ్గురైనా వెళ్లండి. ఇక్కడ చాలా మంచి అవకాశముంది. తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైనది. భారతదేశములోని ప్రాచీన యోగము చాలా ప్రసిద్ధి కూడా చెందింది. స్మృతియాత్ర ద్వారా పాపము సమాప్తమవుతుందని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. మనము సతోప్రధానంగా తయారవుతాము. కావున ఇందులో చాలా బాగా పురుషార్థము చేయాలి, పని చేస్తూ తండ్రిని స్మృతి చేసి చూపించండి, ఇందులోనే మీ పరాక్రమము కనిపిస్తుంది. మీరు ప్రవృత్తి మార్గములో ఉన్నందున పనులేమో చేయాల్సిందే. గృహస్థ వ్యవహారములో ఉంటూ, వృత్తి వ్యాపారాదులు చేస్తూ బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయండి. ఇందులో మీకు చాలా చాలా సంపాదన ఉంది. భలే చాలామంది పిల్లల బుద్ధిలో ఇప్పుడు ఉండకపోవచ్చు. తండ్రి చార్టును పెట్టమని చెప్తూనే ఉంటారు. కానీ చాలా కొద్దిమందే వ్రాస్తారు. తండ్రి చాలా యుక్తులు తెలుపుతూ ఉంటారు. బాబా వద్దకు వెళ్లాలని పిల్లలు కోరుకుంటారు. ఇక్కడ చాలా సంపాదించవచ్చు. ఏకాంతము చాలా బాగుంటుంది. తండ్రి సన్ముఖంలో వచ్చి కూర్చొని అర్థం చేయిస్తున్నారు - నన్ను స్మృతి చేస్తే పాపము సమాప్తమవుతుంది, ఎందుకంటే జన్మ-జన్మల పాపము తల పై ఉంది. వికారాల గురించి ఎంత కొట్లాడ్తారు, విఘ్నాలు వస్తాయి. బాబా, మమ్ములను పవిత్రంగా ఉండనివ్వడం లేదని చెప్తారు. తండ్రి చెప్తున్నారు - పిల్లలారా! మీరు స్మృతియాత్రలో ఉంటూ జన్మ-జన్మల నుijy y 8 + Hz z @ z ;ారమును తొలగించుకోండి. ఇంటిలో ఉంటూ శివబాబాను స్మృతి చేస్తూ ఉండండి. ఎక్కడ కూర్చుని ఉన్నా స్మృతి చేయవచ్చు. ఎక్కడ ఉన్నా ఈ అభ్యాసము చేయాలి. ఎవరు వచ్చినా, వారికి కూడా ఈ సందేశమును ఇవ్వండి - తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి, దీనినే యోగబలము అని అంటారు, బలము అనగా శక్తి. తండ్రిని సర్వశక్తివంతుడని అంటారు కదా. అయితే తండ్రి ద్వారా ఆ శక్తి ఎలా లభిస్తుంది? తండ్రియే స్వయంగా ''నన్ను స్మృతి చేయండి'' అని చెప్తున్నారు. మీరు క్రిందకు దిగుతూ దిగుతూ తమోప్రధానమైపోయారు కావున శక్తి పూర్తిగా సమాప్తమైపోయింది. కొద్దిగా కూడా శక్తి లేదు. మీలో కూడా కొంతమంది ఇతరులకు బాగా అర్థం చేయిస్తూ, తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు.
నా చార్టు ఎలా ఉందో తమకు తామే ప్రశ్నించుకోండి. స్మృతియాత్ర ముఖ్యమైనదని తండ్రి పిల్లలందరికీ చెప్తారు. స్మృతి ద్వారానే మీ పాపాలు తొలగిపోతాయి. భలే అప్రమత్తము చేయువారు ఎవ్వరూ లేకున్నా తండ్రిని స్మృతి చేయగలరు కదా. భలే విదేశాలలో ఒంటరిగా ఉన్నా స్మృతి చేయగలరు. వివాహితులైనవారు, స్త్రీ మరొక చోట ఉంటే వారికి తండ్రిని స్మృతి చేస్తే జన్మ-జన్మల పాపము భస్మమవుతుందని మీరు వ్రాయండి. వినాశనము సమీపముగా ఎదురుగా నిల్చొని ఉంది. తండ్రి చాలా మంచిగా యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. కొందరు చేస్తారు, కొందరు చేయరు, అది వారి ఇష్టము. తండ్రి చాలా మంచి సలహాలను ఇస్తారని పిల్లలు కూడా అర్థం చేసుకొని ఉంటారు. బంధు-మిత్రులు మొదలైనవారు ఎవరు లభించినా అందరికీ సందేశము ఇవ్వడమే మనందరి కర్తవ్యము. స్నేహితులైనా లేక ఎవరైనా సర్వీసు చేయాలని ఆసక్తి ఉండాలి. మీ వద్ద చిత్రాలు కూడా ఉన్నాయి. బ్యాడ్జ్ కూడా ఉంది. ఇది చాలా మంచి వస్తువు. ఈ బ్యాడ్జ్ ఎవరినైనా లక్ష్మీ-నారాయణులుగా తయారు చేయగలదు. త్రిమూర్తి చిత్రము పై బాగా అర్థం చేయించాలి. త్రిమూర్తుల పై శివుడు ఉన్నారు. వారు త్రిమూర్తి చిత్రమును తయారు చేస్తారు, కానీ వారి పై శివుని చూపించరు. శివుని గురించి తెలియనందున భారతదేశ నావ మునిగి ఉంది. ఇప్పుడు శివబాబా ద్వారానే భారతదేశ నావ తీరానికి చేరుతుంది. పతితపావనా వచ్చి పతితులైన మమ్ములను పావనంగా చేయమని వేడుకుంటారు, మళ్లీ సర్వవ్యాపి అని అనేస్తారు. ఎంత సూక్ష్మమైన తప్పు జరిగింది. ఎలా ఉపన్యసించాలో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. తండ్రి కూడా ఆదేశాలను ఇస్తూ ఉంటారు - ఇలాంటి మ్యూజియమ్లను తెరచి, సర్వీసు చేస్తే చాలామంది వస్తారు. పెద్ద పెద్ద పట్టణాలలో సర్కస్ కూడా తెరుస్తారు కదా. వారి వద్ద ఎంత సామగ్రి ఉంటుంది. ప్రజలు పల్లె-పల్లెల నుండి చూచేందుకు వస్తారు. అందువలన బాబా చెప్తున్నారు - మీరు కూడా అందమైన మ్యూజియంను తెరవండి. అది చూచి సంతోషించి ఇతరులకు కూడా వినిపించాలి. కల్పక్రితము జరిగిన విధంగానే సర్వీసు జరుగుతుందని కూడా తెలియజేస్తున్నారు. కానీ సతోప్రధానంగా అవ్వాలనే తపన చాలా ఉండాలి. ఇందులోనే పిల్లలు పొరపాటు చేస్తారు, ఈ స్మృతియాత్రలోనే మాయ విఘ్నాలను వేస్తూ ఉంటుంది. ఇంత ఆసక్తి నాకుందా, కష్టపడుతున్నానా? అని మీ మనస్సును మీరే ప్రశ్నించుకోండి. జ్ఞానమైతే చాలా సహజము. 84 జన్మల చక్రమును తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు. స్మృతియాత్ర ముఖ్యమైనది. చివరి సమయములో తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తు రాకూడదు. ఆదేశాలనైతే తండ్రి పూర్తిĵy y 8 + Hz z @ z స్మృతి చేయడం ముఖ్యమైన విషయము. మీరు ఎవరికైనా అర్థం చేయించగలరు. ఎవరు వచ్చినా కేవలం బ్యాడ్జ్ చూపించి అర్థము చేయించండి. అర్థ సహితంగా ఉన్న ఇలాంటి మెడల్ ఎవరి వద్దా ఉండదు. మిలిటరీలో ఉన్నవారు కర్తవ్యాన్ని బాగా చేస్తే వారికి మెడల్ లభిస్తుంది. రాయ్సాహెబ్ మెడల్ను చూచి వీరికి వైస్రాయ్ ద్వారా బిరుదు లభించిందని అందరూ దానిని చూస్తారు. ఇంతకుముందు వైస్రాయ్ ఉండేవారు. ఇప్పుడైతే వారికి ఎటువంటి అధికారము లేదు. ఇప్పుడైతే ఎన్నో ప్రకారాల కొట్లాటలు జరుగుతున్నాయి. మానవుల జన సంఖ్య చాలా పెరిగిపోయింది. కావున వారికి పట్టణాలలో భూమి కావాలి. బాబా ఇప్పుడు స్వర్గ స్థాపన చేస్తున్నారు, వీరంతా సమాప్తమై చాలా కొద్ది మంది మాత్రమే మిగిలి ఉంటారు. భూమి లెక్కలేనంత ఉంటుంది. అక్కడైతే అంతా కొత్తదిగా ఉంటుంది. ఆ కొత్త ప్రపంచములోకి వెళ్లేందుకు పురుషార్థము బాగా చేయాలి. ఉన్నతపదవి పొందేందుకు ప్రతి మనిషి చాలా పురుషార్థము చేస్తాడు. పూర్తిగా పురుషార్థము చేయనివారు పాస్ అవ్వలేరని భావిస్తారు. నేను ఫెయిల్ అవుతానని భావించి చదువును కూడా వదిలేసి వెళ్లి నౌకరీలో చేరిపోతారు. ఈ రోజుల్లో ఉద్యోగాలలో కూడా చాలా కఠినమైన నియమాలు తయారు చేస్తూ ఉంటారు. మనుష్యులు చాలా దు:ఖితులుగా ఉన్నారు. 21 జన్మల వరకు ఎప్పటికీ దు:ఖానికి నామ-రూపాలు కూడా ఉండని మార్గమును బాబా ఇప్పుడు మీకు తెలుపుతున్నారు. తండ్రి చెప్తున్నారు - కేవలం స్మృతియాత్రలో ఉండండి. వీలైనంత ఎక్కువగా స్మృతి చేసేందుకు రాత్రి సమయము చాలా బాగుంటుంది. పడుకొని కూడా స్మృతి చేయండి. కొందరికి మళ్లీ నిద్ర వస్తుంది. వృద్ధులైనప్పుడు ఎక్కువ సమయము కూర్చోలేరు. కావున తప్పకుండా నిద్రపోతారు. పడుకుని తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. లోలోపల చాలా ఖుషీగా ఉంటుంది, ఎందుకంటే ఇందులో చాలా చాలా సంపాదన ఉంది. ఇంకా సమయముందని భావిస్తారు, కానీ మృత్యువుకు ఒక సమయమంటూ లేదు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు - స్మృతియాత్ర ముఖ్యమైనది. అక్కడ పట్టణాలలో స్మృతి చేయడం కష్టమౌతుంది. ఇక్కడికి వస్తే చాలా మంచి అవకాశము లభిస్తుంది. చింతించే విషయమేదీ ఉండదు. అందువలన ఇక్కడ చార్టును పెంచుకుంటూ ఉండండి. దీని ద్వారా మీలో గుణాలు కూడా బాగుపడ్తూ ఉంటాయి. కానీ మాయ చాలా శక్తివంతమైనది. బయటి వారికున్నంత గౌరవము ఇంట్లో ఉన్న వారికి ఉండదు. అయినా ఈ సమయములో గోపుల(అన్నయ్యల) రిజల్టు బాగుంది.
వివాహము చేసుకోమని చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఏమి చేసేది? అని చాలామంది కుమారీలు వ్రాస్తారు. శక్తివంతమైన, తెలివైన కుమారీలు ఎప్పటికీ ఇలా వ్రాయరు. ఒకవేళ వ్రాస్తే వారు మేకలు, గొర్రెలని బాబా భావిస్తారు. మీ జీవితాన్ని రక్షించుకోవడము మీ చేతుల్లోనే ఉంది. ఈ ప్రపంచములో అనేక రకాలైన దు:ఖముంది. బాబా ఇప్పుడు చాలా సహజంగా తెలుపుతున్నారు.
పిల్లలైన మీరు గొప్ప భాగ్యశాలురు, ఎందుకంటే మీరు గొప్ప తండ్రికి పిల్లలైనారు. తండ్రి ఎంత శ్రేష్ఠంగా తయారు చేస్తారు, అటువంటి తండ్రిని ఎంతగానో నిందిస్తూ వచ్చారు, అది కూడా చాలా చెడు నిందలు. చెప్పనలవికానంత తమోప్రధానంగా అయిపోయారు. ఇంతకంటే ఎక్కువగా ఇంకెవరు సహిస్తారు. చెప్తూ ఉంటారు కదా - ఎక్కువగా సతాయిస్తే చంపేస్తానంటారు కదా. ఇక్కడైతే తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు - శాస్త్రాలలో అయితే అనేక కథలు వ్రాసేశారు. బాబా చాలా సహజమైన యుక్తులు తెలుపుతున్నారు. కర్మలు చేస్తూ స్మృతి చేయండి, ఇందులో చాలా చాలా లాభముంది. ఉదయమే వచ్చి స్మృతిలో కూర్చోండి. చాలా మజాగా ఉంటుంది. కానీ అంత ఆసక్తి లేదు. విద్యార్థుల ప్రవర్తనను బట్టి వీరు ఫెయిల్ అవుతారని ఉపాధ్యాయులు అర్థము చేసుకుంటారు. తండ్రికి కూడా వీరు ఫెయిల్ అవుతారని అర్థమవుతుంది. అది కూడా కల్ప-కల్పమూ ఫెయిల్ అవుతారు. ఉపన్యాసము చేయడంలో అయితే చాలా తెలివిగా ఉన్నారు, ప్రదర్శనీలో కూడా చాలా బాగా అర్థం చేయిస్తారు. కానీ స్మృతి చేయరు. ఈ విషయములో ఫెయిల్ అవుతారు. ఇది కూడా అగౌరవపరచినట్లవుతుంది. తమకు తామే అగౌరవపరచుకుంటారు. శివబాబాకైతే అగౌరవము జరగదు. స్మృతి చేసేందుకు మాకు తీరికే లేదని ఎవ్వరూ చెప్పలేరు. బాబా అంగీకరించరు. స్నానము చేయునప్పుడు కూడా స్మృతి చేయవచ్చు. భోజనము చేయునప్పుడు తండ్రిని స్మృతి చేయండి, ఇందులో చాలా చాలా సంపాదన ఉంది. కొంతమంది పిల్లలు కేవలం ఉపన్యసించడంలో ప్రసిద్ధి చెంది ఉన్నారు, యోగము చేయరు. అహంకారము కూడా క్రిందికి పడేస్తుంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. సర్వ శక్తివంతుడైన తండ్రి ద్వారా శక్తిని తీసుకునేందుకు స్మృతి చార్టును పెంచుకోవాలి. స్మృతి చేసేందుకు పలురకాల ఉపాయాలను రచించాలి. ఏకాంతంగా కూర్చొని విశేషంగా సంపాదనను జమ చేసుకోవాలి.
2. సతోప్రధానంగా అవ్వాలనే తపన ఉండాలి. పొరపాట్లు చేయరాదు. అజాగ్రత్తగా ఉండరాదు. అహంకారము ఉండరాదు. సర్వీసు చేయాలనే ఆసక్తి కూడా ఉండాలి, దీనితో పాటు స్మృతియాత్ర కూడా చేస్తూ ఉండాలి.
వరదానము :-
'' బుద్ధిని మేరేపన్ (నాది) అనే భ్రమణము నుండి తొలగించి, చిక్కుల నుండి (సమస్యల నుండి) ముక్తముగా ఉండే న్యారే ట్రస్టీ భవ ''
బుద్ధి ఎక్కడైనా చిక్కులోకి వచ్చిందంటే తప్పకుండా ఏదో ఒక 'మేరాపన్' ఉందని అర్థం చేసుకోండి. ఎక్కడైతే 'నాది' వస్తుందో అక్కడ బుద్ధి భ్రమిస్తుంది. గృహస్థులుగా ఆలోచిస్తే గడబిడ జరుగుతుంది. అందువలన పూర్తి అతీతంగా(న్యారాగా), ట్రస్టీగా(నిమిత్తంగా) అయిపోండి. ఈ మేరాపన్ - నా పేరు చెడిపోతుంది, నాకు గ్లాని జరుగుతుంది...... ఇలా ఆలోచించుటే సమస్యలలో చిక్కుకోవడం. తర్వాత పరిష్కరించేందుకు ఎంత ప్రయత్నిస్తే అంత చిక్కుకుంటూ పోతారు. అందువలన ట్రస్టీలుగా అయ్యి ఈ చిక్కుల నుండి ముక్తులైపోండి. భగవంతుని పిల్లలు ఎప్పుడూ చిక్కులలోకి రాజాలరు.
స్లోగన్ :-
'' మీరు పెద్ద తండ్రికి పిల్లలు అందువలన మనసు చిన్నదిగా చేసుకోకండి, చిన్న విషయాలకు భయపడకండి. ''