15-06-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - ఇప్పుడీ ఛీ - ఛీ మురికి ప్రపంచానికి అగ్ని తగులుకుంటుంది. అందువలన శరీర సహితముగా, మీరు నాది - నాది అంటూ వచ్చినదానినంతా మర్చిపోవాలి. దాని పై మనస్సు లగ్నము చేయరాదు ( ఉంచుకోరాదు ). ''

ప్రశ్న :-

తండ్రి మీకు ఈ దుఃఖధామము పై ఎందుకు విరక్తిని కలిగిస్తారు ?

జవాబు :-

ఎందుకంటే మీరు శాంతిధామము, సుఖధామములోకి వెళ్లాలి. ఈ అశుద్ధమైన మురికి ప్రపంచములో ఇప్పుడు ఉండేదే లేదు. ఆత్మ శరీరము నుండి వేరై ఇంటికి వెళ్తుందని మీకు తెలుసు. అందువలన ఇక ఈ శరీరాన్ని ఏం చూస్తారు? ఎవరి నామ-రూపాల వైపు కూడా మీ బుద్ధి వెళ్లరాదు. అపవిత్ర ఆలోచనలు వచ్చినా పదవి భ్రష్ఠమైపోతుంది.

ఓంశాంతి.

శివబాబా తన పిల్లలైన ఆత్మలతో మాట్లాడ్తారు. ఆత్మయే వింటుంది. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయము చేసుకోవాలి. అలా నిశ్చయము చేసుకొని అందరినీ తీసుకెళ్లేందుకు అనంతమైన తండ్రి వచ్చారని అందరికీ అర్థము చేయించాలి. వారు దు:ఖమునిచ్చే బంధనాల నుండి విడిపించి సుఖమునిచ్చే సంబంధములోకి తీసుకెళ్తారు. సుఖాన్ని సంబంధమని, దు:ఖాన్ని బంధనమని అంటారు. ఇప్పుడు ఇక్కడ ఎవ్వరి నామ-రూపాలు మొదలైన వాటి పై మనసు ఉంచుకోకండి. ఇంటికి వెళ్లేందుకు ఏర్పాటు చేసుకోవాలి. బేహద్‌(అనంతమైన) తండ్రి ఆత్మలందరినీ తీసుకెళ్లేందుకు వచ్చారు. అందువలన ఇక్కడ ఉన్నవారెవరి పైనా మనస్సు లగ్నము పెట్టుకోరాదు. ఇవన్నీ ఇక్కడున్న ఛీ-ఛీ బంధనాలు. ఇప్పుడు మేము పవిత్రమయ్యాము కనుక మా శరీరము పై ఎవ్వరూ అపవిత్ర ఆలోచనలతో చెయ్యి కూడా వెయ్యరాదని మీరు భావిస్తారు. అటువంటి ఆలోచనలే తొలగిపోతాయి. పవిత్రులవ్వకుండా ఇంటికి వాపస్‌ వెళ్లలేరు. పవిత్రంగా అవ్వకుంటే మళ్లీ శిక్షలు అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడున్న ఆత్మలన్నీ అపవిత్రంగా పాడైపోయి ఉన్నాయి. శరీరముతో అశుద్ధమైన పనులు చేస్తున్నాయి. ఛీ-ఛీ దేహధారుల పై మనస్సు లగ్నమై ఉంది. తండ్రి వచ్చి ఈ మురికి ఆలోచనలను వదలండి అని చెప్తున్నారు. ఆత్మ శరీరము నుండి వేరై ఇంటికి వెళ్లాలి. ఇది చాలా ఛీ-ఛీ(అశుద్ధమైన) మురికి ప్రపంచము. ఇప్పుడు మనము ఇందులో ఉండరాదు. ఎవరినైనా చూడాలని కూడా అనిపించదు. ఇప్పుడు స్వర్గములోకి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ! స్వయాన్ని ఆత్మగా భావించండి. పవిత్రులుగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయండి. ఏ దేహధారి పై మనస్సు లగ్నము చేయకండి. పూర్తిగా మమకారము తొలగిపోవాలి. స్త్రీ-పురుషుల మధ్య ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకరి నుండి ఒకరు వేరు అవ్వలేరు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మ భాయి-భాయిగా భావించాలి. అపవిత్ర ఆలోచనలు ఉండరాదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇది ఇప్పుడు వేశ్యాలయము. వికారాల కారణంగా మీరు ఆదిమధ్యాంతాలు దు:ఖము పొందారు. తండ్రి దీని పై చాలా ఏవగింపు కలిగిస్తున్నారు. ఇప్పుడు మీరు వెళ్లేందుకు స్టీమరులో కూర్చొని ఉన్నారు. తండ్రి వద్దకు వెళ్తున్నానని ఆత్మ భావిస్తుంది. ఈ మొత్తం పాత ప్రపంచమంతటి పై వైరాగ్యము కలిగింది. ఈ ఛీ-ఛీ ప్రపంచము, నరకము, వేశ్యాలయములో మనము ఉండేదే లేదు. అందువలన విషము కొరకు మురికి ఆలోచనలు రావడం చాలా నీచమైనది. పదవి కూడా భ్రష్ఠమైపోతుంది. తండ్రి చెప్తున్నారు - నేను మిమ్ములను పుష్పాల ప్రపంచములోకి, సుఖధామములోకి తీసుకెళ్లేందుకు వచ్చాను. నేను మిమ్ములను ఈ వేశ్యాలయము నుండి వెలుపలికి తీసి శివాలయములోకి తీసుకెళ్తాను. అందువలన ఇప్పుడు మీ బుద్ధియోగము నూతన ప్రపంచములో ఉండాలి. అనంతమైన తండ్రి మనలను చదివిస్తున్నారని ఎంత సంతోషముండాలి! ఈ అనంతమైన సృష్టిచక్రము ఎలా తిరుగుతుందో మీ బుద్ధిలో ఉంది. సృష్టిచక్రము తెలుసుకోవడం ద్వారా అనగా స్వదర్శన చక్రధారులుగా అవ్వడం వలన మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. దేహధారులతో బుద్ధి యోగాన్ని జోడిస్తే పదవి భ్రష్ఠ్ఠమైపోతుంది. ఏ దేహ సంబంధము గుర్తు రాకూడదు. ఇది దు:ఖ ప్రపంచము. ఇందులో ఉన్న వారంతా దు:ఖమిచ్చేవారే.

తండ్రి మురికి ప్రపంచము నుండి అందరినీ తీసుకెళ్తారు. అందువలన మీ బుద్ధియోగాన్ని మీ ఇంటితో జోడించండి. మనుష్యులు ముక్తికి తీసుకెళ్లేందుకు భక్తి చేస్తారు. ఆత్మలమైన మనము ఇక్కడ ఉండేది లేదని మీరు కూడా అంటారు. మనము ఈ ఛీ-ఛీ శరీరాన్ని వదిలి మన ఇంటికి వెళ్తాము. ఇది పాత చెప్పు(శరీరము). తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఈ శరీరము వదిలిపోతుంది. అంత్యకాలములో తండ్రి తప్ప మరి ఏ ఇతర వస్తువు గుర్తు రాకూడదు. ఈ శరీరాన్ని కూడా ఇక్కడేే వదిలేయాలి. శరీరము పోతే అన్నీ పోతాయి. దేహ సహితము ఉన్నదంతా, 'నాది - నాది' అనుకునే దానినంతా మర్చిపోవాలి. ఈ ఛీ-ఛీ ప్రపంచానికి అగ్ని అంటుకోనున్నది. అందువలన వీటి పై ఇప్పుడు మనస్సు లగ్నము చేయరాదు. తండ్రి అంటున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ! నేను మీ కొరకు స్వర్గ స్థాపన చేస్తున్నాను. అక్కడకు మీరే వెళ్లి ఉంటారు. ఇప్పుడు మీ ముఖము అటువైపు తిరిగి ఉంది. తండ్రిని, ఇంటిని, స్వర్గాన్ని స్మృతి చేయాలి. దు:ఖధామము పై ఏవగింపు కలుగుతుంది. ఈ శరీరము పై కూడా అసహ్యమేర్పడుతుంది. వివాహము చేసుకునే అవసరము కూడా లేదు. వివాహము చేసుకుంటే శరీరము పై మనసు లగ్నమవుతుంది. తండ్రి చెప్తున్నారు - ఈ పాత శరీరము పై ఏ మాత్రము ప్రేమ ఉంచకండి. ఇది వేశ్యాలయము. అందరూ పతితులుగానే ఉన్నారు. ఇది రావణ రాజ్యము. ఇచ్చట ఒక్క తండ్రితో తప్ప మరెవ్వరితోనూ మీ మనసును ఉంచుకోరాదు. తండ్రిని స్మృతి చేయకుంటే జన్మ-జన్మాంతరాల పాపాలు తొలగిపోవు. శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. పదవి కూడా భ్రష్టమైపోతుంది. అందువలన ఈ కలియుగ బంధనాలను ఎందకు వదిలేయరాదు! బాబా ఈ అనంతమైన విషయాలను మానవులందరి కొరకు అర్థం చేయిస్తారు. రజోప్రధాన సన్యాసులున్నప్పుడు ప్రపంచము ఇంత అపవిత్రముగా లేదు. వారు అడవులలో ఉండేవారు. అందరికీ ఆకర్షణ కలిగేది. మనుష్యులు అచ్చటకు వెళ్లి వారికి భోజనము అందించి వచ్చేవారు. నిర్భయులుగా ఉండేవారు. మీరు కూడా నిర్భయులగా అవ్వాలి. అందుకు చాలా విశాలమైన బుద్ధి కావాలి. తండ్రి వద్దకు వచ్చినప్పుడు పిల్లలకు చాలా సంతోషముంటుంది. మేము బేహద్‌ తండ్రి నుండి సుఖధామపు వారసత్వము తీసుకుంటున్నామని భావిస్తారు. ఇచ్చట అపారమైన దు:ఖముంది. అనేకమైన మురికి - మురికి జబ్బులు మొదలైనవి కూడా వస్తూ ఉంటాయి. తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు - ''దు:ఖము జబ్బులు మొదలైనవాటి నామ-రూపాలే లేని చోటుకు మిమ్ములను తీసుకెళ్తారు. అల్పకాలము కొరకు మిమ్ములను ఆరోగ్యవంతులుగా చేస్తారు. ఇక్కడ మీరు ఎవ్వరితోనైనా మనసు లగ్నము చేస్తే చాలా శిక్షలు అవుభవించవలసి వస్తుంది.

ఈ విషయాలన్నీ మీరు అర్థం చేయించండి. వారు మూడు నిముషాలు సైలెన్స్‌ అని అంటారు. కేవలం సైలెన్స్‌గా ఉంటే ఏమొస్తుంది అని అడగండి. వికర్మలు వినాశనమయ్యేందుకు తండ్రిని స్మృతి చేయాలని వారికి అర్థం చేయించండి. ఈ సైలెన్స్‌ వరమును ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారిని స్మృతి చేయకుండా శాంతి ఎలా లభిస్తుంది? వారిని స్మృతి చేస్తేనే వారసత్వము లభిస్తుంది. టీచర్లు కూడా చాలా పాఠాలు చదివించాల్సి ఉంది. మీరు లేచి నిలబడాలి. ఎవ్వరూ ఏమీ అనరు. తండ్రివారిగా అయినందున కడుపుకు కావలసింది తప్పకుండా లభిస్తుంది. శరీర నిర్వహణ కొరకు చాలా లభిస్తుంది. వేదాంతి ఉంది కదా. తాను పరీక్షలు వ్రాసింది. అందులో గీతా భగవంతుడు ఎవరు? అన్న పాయింటు ఒకటి వచ్చింది. పరమపిత పరమాత్మ శివుడు అని వ్రాస్తే ఆమెను పాస్‌ చేయలేదు. కృష్ణుడు అని వ్రాసిన వారిని పాస్‌ చేశారు. వేదాంతి సత్యము తెలిపింది కానీ వారికి తెలియని కారణంగా ఆమెను పాస్‌ చేయలేదు. నేను సత్యమే వ్రాశానని కొట్లాడవలసి వచ్చింది. గీతా భగవంతుడు నిరాకార పరమపిత పరమాత్మయే. దేహధారి అయిన కృష్ణుడు భగవంతుడు కాదు అని వారితో వాదించవలసి ఉంటుంది. కానీ ఆమెకు ఆత్మిక ఈ సేవ చేయాలని మనసు ఉంది కావున ఆ చదువును వదిలేసింది.

ఇప్పుడు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఈ శరీరము కూడా వదిలేసి సైలెన్స్‌ ప్రపంచములోకి వెళ్లాలని మీకు తెలుసు. స్మృతి చేయడం వలన ఆరోగ్యము, ఐశ్వర్యము రెండూ లభిస్తాయి. భారత దేశములో శాంతి, సంపదలు రెండూ ఉండేవి కదా. ఈ విధంగా కుమారీలైన మీరు కూర్చుని అర్థం చేయిస్తే మిమ్ములను ఎవ్వరూ ఏమీ అనరు. ఎవరైనా ఎదిరిస్తే మీరు నియమానుసారము పోట్లాడండి. పెద్ద పెద్ద ఆఫీసర్ల వద్దకు వెళ్లండి. వారేం చేస్తారు? మీరేమీ ఆకలితో మరణించరు. అరటి పండుతో, పెరుగుతోనైనా రొట్టెలు తినవచ్చు. మానవులు పొట్ట కొరకు ఎన్నో పాపాలు చేస్తారు. తండ్రి వచ్చి పాపాత్ములను పుణ్యాత్మలుగా చేస్తారు. ఇందులో పాపాలు చేసే, అసత్యము చెప్పే అవసరమే లేదు. మీరు 3/4 వంతు సుఖము, 1/4 వంతు దు:ఖము అనుభవిస్తారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు - మధురమైన పిల్లలూ! నన్ను స్మృతి చేస్తే మీ జన్మ-జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి. అందుకు వేరే ఏ ఇతర ఉపాయము లేదు. భక్తిమార్గములో చాలా ఎదురుదెబ్బలు తింటారు. శివుని పూజ ఇంటిలో కూర్చుని కూడా చేయవచ్చు. కానీ బయట నిర్మించిన శివాలయాలకు తప్పకుండా వెళ్తారు. ఇచ్చటైతే మీకు తండ్రి లభించారు. మీరు చిత్రాలు ఉంచుకునే అవసరము లేదు. మీకు తండ్రిని గూర్చి తెలుసు. వారు మన అనంతమైన తండ్రి, పిల్లలకు స్వర్గ చక్రవర్తి పదవిని వారసత్వంగా ఇస్తున్నారు. మీరు తండ్రి నుండి వారసత్వము తీసుకునేందుకు ఇక్కడకు వస్తారు. ఇక్కడ శాస్త్రాలు మొదలైనవేవీ చదివే అవసరము లేదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. బాబా ఇక మేము వచ్చేస్తున్నాము. మీరు ఇల్లు వదిలి ఎంత సమయమయ్యింది. సుఖధామాన్ని వదిలి 63 జన్మలు అయ్యింది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - శాంతిధామము, సుఖధామములోకి పదండి. ఈ దు:ఖధామాన్ని మర్చిపోండి. శాంతి ధామము, సుఖధామమును స్మృతి చేయండి. ఇక ఏ ఇతర కష్టము లేదు. శివబాబాకు ఏ శాస్త్రము మొదలైనవి చదివే అవసరము లేదు. ఈ బ్రహ్మ అన్నీ చదివారు. మిమ్ములను ఇప్పుడు శివబాబా చదివిస్తున్నారు. ఈ బ్రహ్మ కూడా చదివించగలరు. కానీ సదా శివబాబా చదివిస్తున్నారని భావించండి. వారిని స్మృతి చేసినందున వికర్మలు వినాశనమవుతాయి. మధ్యలో ఇతను కూడా ఉన్నారు.

ఇప్పుడు సమయము తక్కువగా ఉంది, ఎక్కువగా లేదు. అదృష్టములో ఉండేదే లభిస్తుంది అని భావించకండి. పాఠశాలలో చదివే పురుషార్థము చేస్తారు కదా. అక్కడ అదృష్టములో ఉంటే....... అని అనరు కదా. ఇక్కడ చదవకపోతే అక్కడ జన్మ-జన్మాంతరాలు నౌకరి, చాకరి చేస్తూ ఉంటారు. రాజ్యపదవి లభించదు. ఒకవేళ లభించినా త్రేతాలో చివర్లో కిరీటము పెడ్తారు. ముఖ్యమైన విషయము - పవిత్రంగా అయ్యి ఇతరులను కూడా పవిత్రంగా చేయాలి. సత్యనారాయణ సత్యమైన కథను వినిపించాలి. ఇది చాలా సులభము. ఇద్దరు తండ్రులున్నారు. హద్దు తండ్రి ద్వారా హద్దు వారసత్వము లభిస్తుంది, బేహద్‌ తండ్రి ద్వారా బేహద్‌ వారసత్వము లభిస్తుంది. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే ఇలా దేవతలుగా అవుతారు. కానీ అందులో కూడా ఉన్నత పదవి పొందేందుకు చాలా మారణహోమాలు జరుగుతాయి. చివర్లో బాంబులు కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొని సహాయము చేసుకుంటారు. ఒకప్పుడు ఈ ధర్మాలేవీ లేవు. ఇప్పుడిక మళ్లీ అవి ఉండవు. మీరు రాజ్యము చేస్తారు. కనుక మీ పైన మీరు దయ చూపించుకోవాలి. కనీసము ఉన్నత పదవినైనా పొందాలి. కన్యలు 8 అణాలు కూడా సేవ కొరకు ఇచ్చి ఒక ఇటుక మాది కూడా ఉంచండి అని అంటారు. సుదాముని ఉదాహరణ విన్నారు కదా. పిడికెడు అటుకులకు బదులుగా అతడికి మహళ్ళు లభించాయి. పేదవారి వద్ద ఉండేదే 8 అణాలు. కావున వారు అంతే ఇస్తారు కదా. బాబా, మేము పేదలము అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు సత్యమైన సంపాదన చేస్తున్నారు. ఇక్కడున్న వారందరిదీ అసత్య సంపాదన. చేసే దాన-పుణ్యములన్నీ పాపాత్మలకే చేస్తున్నారు. అందువలన పుణ్యానికి బదులు పాపమే లభిస్తుంది. దానము ఇచ్చేవారి పై కూడా పాప భారము పడ్తుంది. ఇలా చేస్తూ చేస్తూ అందరూ పాపాత్మలుగా అయిపోతారు. సత్యయుగములో మాత్రమే పుణ్యాత్మలు ఉంటారు. అది పుణ్యాత్మల ప్రపంచము. దానిని తండ్రే తయారుచేస్తారు. పాపాత్మలుగా తయారు చేసేది రావణుడు, అశుద్ధమైపోతారు. అశుద్ధ పనులు చేయకండి అని తండ్రి చెప్తున్నారు. కొత్త ప్రపంచములో మురికి ఉండదు. దాని పేరే స్వర్గము. మరి ఇంకేమిటి? స్వర్గము అంటూనే నోట్లో నీరూరుతుంది. దేవతలు ఒకప్పుడు ఇచ్చట ఉండి వెళ్లిపోయారు. అందుకే వారి జ్ఞాపక చిహ్నాలున్నాయి. ఆత్మ అవినాశి. అనేకమంది నటులున్నారు. ఎక్కడో అక్కడ కూర్చొని ఉంటారు కదా. అక్కడ నుండి పాత్ర చేసేందుకు వస్తారు. ఇప్పుడు కలియుగములో ఎంతమంది మనుష్యులున్నారు! దేవీదేవతల రాజ్యము ఇక్కడ లేనే లేదు. ఇది ఎవరికైనా అర్థం చేయించేందుకు చాలా సులభము. ఇప్పుడు మళ్లీ ఏక ధర్మ స్థాపన జరుగుతోంది. మిగిలిన ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. మీరు స్వర్గములో ఉన్నప్పుడు ఏ ఇతర ధర్మాలు లేవు. చిత్రములో రామునికి బాణాలు చూపిస్తారు. అక్కడ బాణాలు మొదలైనవేమీ ఉండవు. ఇది కూడా అర్థము చేసుకుంటారు. కల్పక్రితము ఎవరు ఎంత సేవ చేశారో, వారే ఇప్పుడు మళ్లీ చేస్తున్నారు. ఎవరైతే చాలా సేవ చేస్తారో వారు తండ్రికి కూడా చాలా ప్రియమనిపిస్తారు. లౌకిక తండ్రికి కూడా ఏ పిల్లలైతే బాగా చదువుతారో, అంటువంటి పిల్లల పై ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఎవరు కొట్లాడుతూ, తింటూ ఉంటారో వారిని ఎవ్వరూ ప్రేమించరు. సేవ చేయువారు చాలా ప్రియమనిపిస్తారు.

ఒక కథ ఉంది. రెండు పిల్లులు కొట్లాడుకున్నాయి.......... మధ్యలో వెన్నను కృష్ణుడు తినేశారు. మొత్తం విశ్వ రాజ్యాధికారము అనే వెన్న మీకు లభిస్తుంది. అందువలన ఇప్పుడు పొరపాట్లు చేయరాదు. అశుద్ధంగా అవ్వరాదు. వాటి వెంట పడి రాజ్యపదవి పోగొట్టుకోకండి. తండ్రి ఆదేశము లభిస్తుంది - స్మృతి చేయపోతే పాప భారము పెరుగుతూ ఉంటుంది. చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. వెక్కి వెక్కి ఏడుస్తారు. 21 జన్మలకు చక్రవర్తి పదవి లభిస్తుంది. ఇందులో ఫెయిల్‌ అయితే చాలా ఏడుస్తారు. తండ్రి చెప్తున్నారు - తల్లిగారింటిని గానీ, అత్తగారింటిని గానీ స్మృతి చేయరాదు. కేవలం భవిష్య నూతన ఇంటిని మాత్రమే స్మృతి చేయాలి.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఎవరినైనా చూచి మోహితులై ఆకర్షింపబడరాదు. పుష్పాలుగా అవ్వాలి. దేవతలు పుష్పాలుగా ఉండేవారు. కలియుగములో ముళ్ళుగా ఉండేవారు. ఇప్పుడు మీరు సంగమ యుగములో పుష్పాలుగా అవుతున్నారు. కనుక ఎవ్వరికీ దు:ఖము ఇవ్వరాదు. ఇక్కడ అలా తయారైతే సత్యయుగములోకి వెళ్తారు. మంచిది. అచ్ఛా. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. అంత్యకాలములో ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ గుర్తుకు రాకూడదు. అందుకొరకు ఈ ప్రపంచములో ఎవరి పైనా మనసు లగ్నము చేయరాదు. ఛీ-ఛీ శరీరాన్ని ప్రేమించరాదు. కలియుగములోని బంధనాలను తెంచి వేయాలి.

2. విశాల బుద్ధి గలవారిగా అయ్యి నిర్భయులుగా అవ్వాలి. పుణ్యాత్మలుగా అయ్యేందుకు ఇప్పుడు ఏ పాపము చేయరాదు. కడుపు కొరకు అసత్యము చెప్పరాదు. ఉన్న పిడికెడు అటుకులను సఫలము చేసుకొని సత్య - సత్యమైన సంపాదన జమ చేసుకోవాలి. స్వయం పై దయ చూపుకోవాలి.

వరదానము :-

'' సదా స్నేహీలుగా అయ్యి ఎగిరేకళను వరదానంగా ప్రాప్తి చేసుకునే నిశ్చిత విజయీ, నిశ్చింత భవ ''

స్నేహీ పిల్లలకు బాప్‌దాదా ద్వారా ఎగిరేకళ వరదానంగా లభించింది. ఎగిరేకళ ద్వారా సెకెండులో బాప్‌దాదా వద్దకు చేరుకుంటే ఎటువంటిి స్వరూపంలో మాయ వచ్చినా, అది మిమ్ములను స్పర్శించజాలదు(తాకలేదు). పరమాత్మ ఛత్రఛాయలోకి మాయ ఛాయ(నీడ) కూడా రాజాలదు. స్నేహము, శ్రమను మనోరంజనములోకి పరివర్తన చేస్తుంది. స్నేహము ప్రతి కర్మలో నిశ్చిత విజయీ స్థితిని అనుభవం చేయిస్తుంది. స్నేహీ పిల్లలు ప్రతి సమయంలో నిశ్చింతులుగా ఉంటారు.

స్లోగన్‌ :-

'' నథింగ్‌ న్యూ '' స్మృతి ద్వారా స్థిరంగా(అచలంగా) ఉంటే, సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు ''