27-02-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - మీరు చార్టును ఉంచుకుంటే ముందుకు వెళ్తున్నామా లేక వెనుకకు పోతున్నామా అనేది తెలుస్తుంది. దేహాభిమానము వెనుకకు తొలగిపోయేలా చేస్తుంది. దేహీ-అభిమాని స్థితి ముందుకు తీసుకెళ్తుంది''

ప్రశ్న :-

సత్యయుగ ఆదిలో వచ్చే ఆత్మకు, ఆలస్యంగా వచ్చే ఆత్మకు ముఖ్యమైన వ్యత్యాసము ఏది ?

జవాబు :-

ఆదిలో వచ్చేవారు సుఖము కావాలనే కోరికను ఉంచుకుంటారు. ఎందుకంటే సత్యయుగంలోని ఆది సనాతన ధర్మము చాలా సుఖమునిచ్చేది. ఆలస్యంగా వచ్చే ఆత్మకు సుఖము కోరడం కూడా తెలియదు. వారు శాంతి-శాంతి అని వేడుకుంటూ ఉంటారు. అనంతమైన తండ్రి నుండి సుఖ-శాంతుల వారసత్వము ప్రతి ఆత్మకు ప్రాప్తిస్తుంది.

ఓంశాంతి.

భగవానువాచ, భగవానువాచ అని అన్నప్పుడు పిల్లలకు బుద్ధిలోకి కృష్ణుడు రాడు. బుద్ధిలోకి శివబాబాయే వస్తారు. ముఖ్యమైన విషయము - తండ్రి పరిచయమును ఇవ్వడం. ఎందుకంటే తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది. మేము శివబాబా అనుచరులమని మీరు అనరు. మీరు శివబాబాకు సంతానము. సదా మిమ్ములను మీరు పిల్లలమని భావించండి. వారు తండ్రి, టీచరు, గురువు కూడా అని ఇతరులెవ్వరికీ తెలియదు. పిల్లలైన మీలో కూడా చాలా మంది మర్చిపోతారు. ఇది గుర్తున్నా అహో సౌభాగ్యము! బాబాను మర్చిపోతారు. అప్పుడు లౌకిక దేహ సంబంధాలు మొదలైనవన్నీ గుర్తొస్తాయి. వాస్తవానికి మీ బుద్ధి నుండి మిగిలినవన్నీ తొలగిపోవాలి. ఒక్క తండ్రి మాత్రమే గుర్తుండాలి. త్వమేవ మాతాశ్చ పితా....... అని మీరు అంటారు. ఒకవేళ ఇతరులు వవరైనా గుర్తొస్తే సద్గతిలోకి వెళ్తున్నామని చెప్పరు కదా. దేహాభిమానములో ఉన్నారు కనుక దుర్గతియే కలుగుతుంది. దేహీ-అభిమానిగా ఉన్నట్లయితే సద్గతి కలుగుతుంది. ఒక్కొక్కసారి క్రిందికి, ఒక్కొక్కసారి పైకి ఎక్కుతూ - దిగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ముందుకు వెళ్తారు. ఒక్కొక్కసారి వెనుకకు వెళ్తారు. దేహాభిమానములోకి అయితే చాలా వస్తారు. అందువల్లనే బాబా సదా చార్టునుంచమని అంటారు(కోరుతారు). దాని వల్ల మనము ముందుకు వెళ్తున్నామా లేక వెనుకకు వెళ్తున్నామా? అనేది తెలుస్తుంది. మొత్తం ఆధారమంతా స్మృతి పైనే ఉంది. క్రిందకు - పైకి ఎక్కుతూ-దిగుతూనే ఉంటారు. పిల్లలు నడుస్తూ - నడుస్తూ అలసిపోతారు. అప్పుడు బాబా! ఇలా జరిగింది బాబా మీ స్మృతిని మర్చిపోతున్నాము..... అని విలపిస్తూ ఉంటారు. దేహాభిమానములోనికి రావడం వల్లనే వెనుకకు వెళ్తారు. ఏదో ఒక పాపము చేస్తారు. మొత్తం ఆధారమంతా స్మృతి పైనే ఉంది. స్మృతి ద్వారానే మీ ఆయువు పెరుగుతుంది. అందువల్లనే యోగము అనే పదము బాగా ప్రసిద్ధమయ్యింది. జ్ఞానమైతే చాలా సహజమైన సబ్జక్టు. చాలామందికి జ్ఞానము కూడా లేదు కనుక యోగము కూడా ఉండదు. దీని వల్ల చాలా నష్టము కలుగుతుంది. చాలామంది శ్రమ చేయడం లేదు. చదువులో నంబరువారుగా ఉండనే ఉంటారు. చదువు ద్వారా వారు ఎక్కడివరకు, ఎంతవరకు సేవ చేస్తున్నారో తెలుస్తుంది. అందరికీ శివబాబా పరిచయమునివ్వాలి. ఒక్క అనంతమైన తండ్రి నుండి మాత్రమే అనంతమైన వారసత్వం లభిస్తుందని మీకు తెలుసు. ముఖ్యమైనవారు మాత-పితలు మరియు పిల్లలైన మీరు. ఇది ఈశ్వరీయ కుటుంబము. మేము శివబాబా సంతానము అని, వారి నుండే మేము వారసత్వము తీసుకోవాలని ఎవరి బుద్ధిలోకి రాదు. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. వారు నిరాకార శివబాబా. వారి పరిచయమును ఈ విధంగా ఇవ్వండి. వారు అనంతమైన తండ్రి. వారిని సర్వవ్యాపి అని ఎలా అనగలరు? వారి నుండి వారసత్వమును ఎలా పొందగలము? పావనంగా ఎలా అవుతాము? తయారవ్వలేము. తండ్రి ఘడియ-ఘడియకు చెప్తారు - మన్మనాభవ. నన్ను స్మృతి చేయండి. ఇది ఎవ్వరికీ తెలియదు. వాస్తవానికి కృష్ణుని గురించి కూడా అందరికీ తెలియదు. ఆ నెమలిఫించధారి కృష్ణుడు ఇక్కడికి వలా వస్తాడు? ఇది చాలా ఉన్నతమైన జ్ఞానము. ఉన్నతమైన జ్ఞానములో తప్పకుండా కొంత కష్టము కూడా ఉంటుంది. సహజమనే పేరు కూడా ఉంది. తండ్రి నుండి వారసత్వము తీసుకోవడం అయితే సహజమే కదా. పిల్లలు కష్టమని ఎందుకు భావిస్తారు? ఎందుకంటే తండ్రిని స్మృతి చేయలేరు.

బాబా పిల్లలకు దుర్గతి మరియు సద్గతుల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఈ సమయములో అందరూ దుర్గతిలోకి వెళ్తున్నారు. మనుష్య మతము దుర్గతిలోకి తీసుకెళ్తుంది. ఇది ఈశ్వరీయ మతము. అందుకే బాబా రెండిటికి తేడా ఏమిటో తయారు చేయిస్తారు. ప్రతి మనిషి తాము నరకవాసులమా? లేక స్వర్గవాసులమా? అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు సత్యయుగము ఎక్కడ ఉంది? కాని మనుష్యులు కొంచెం కూడా అర్థము చేసుకోరు. సత్యయుగాన్ని కూడా కల్పన అని భావిస్తారు. అనేక మతాలున్నాయి. అనేక మతాల వలన దుర్గతి కలుగుతుంది. ఏకమతము ద్వారా సద్గతి లభిస్తుంది. మనుష్యులు మనుష్యులను దుర్గతిలోకి తీసుకెళ్తారు. ఒక్క ఈశ్వరుడే అందరికీ సద్గతినిస్తారు. ఈ నినాదము చాలా బాగుంది. కనుక మీరు శుభమునే పలుకుతారు కదా. తండ్రిని మహిమ చేస్తారు. వారు సర్వులకు తండ్రి. సర్వులకు సద్గతిని ఇస్తారు. భలే ప్రభాతవేళ శాంతియాత్రను నిర్వహించమని పిల్లలకు తండ్రి ఎంతగానో అర్థం చేయించారు. స్వర్గ రచయిత తండ్రి మాకు ఈ పదవిని ప్రాప్తింపజేస్తున్నారు. ఇప్పుడు ఈ నరకము అంతమవ్వనున్నదని చెప్పండి. అర్థం చేయించేందుకు శ్రమ చేయవలసి పడ్తుంది. విమానము నుండి కరపత్రాలు వేయవచ్చు. మనమైతే ఒక్క తండ్రి మహిమనే చేస్తాము. వారు సర్వుల సద్గతిదాత. తండ్రి చెప్తున్నారు - పిల్లలారా! నేను మీకు సద్గతినిస్తాను. మళ్లీ మీకు దుర్గతినిచ్చేవారెవరు? అర్ధకల్పము స్వర్గము తర్వాత నరకము అని అంటారు. రావణ రాజ్యము అంటేనే ఆసురీ రాజ్యము. క్రిందికి దిగుతూనే వస్తారు. అది కూడా రావణుని ఉల్టా(వ్యతిరేక) మతముతో పతితపావనుడు ఒక్క తండ్రి మాత్రమే. మనము తండ్రి ద్వారా విశ్వాధికారులుగా అవుతున్నాము. ఈ శరీరము నుండి కూడా మోహము తొలగించి వేయాలి. ఒకవేళ హంస-కొంగ కలిసి ఉన్నట్లయితే మోహము ఎలా తొలగుతుంది? ప్రతి ఒక్కరి పరిస్థితులను చూడటం జరుగుతుంది. ధైర్యముంటే తమ శరీర నిర్వహణ కూడా తామే చేసుకోవచ్చు. అప్పుడు ఎక్కువ ఝంఝాటంలో ఎందుకు చిక్కుకుంటారు? కడుపుకు ఎక్కువ తినవలసిన అవసరము లేదు. రెండు రొట్టెలు తినండి చాలు. ఇక ఏ చింతా ఉండరాదు. అయినా తండ్రినే స్మృతి చేయాలని, దీని ద్వారానే వికర్మలు వినాశనమవుతాయని స్వయంతో ప్రతిజ్ఞ చేసుకోవాలి. దీని అర్థము వ్యాపారాలు మొదలైన వాటిని వదిలేయమని కాదు. వ్యాపారాలు చేయకపోతే కుటుంబ నిర్వహణ కొరకు ధనము ఎక్కడ నుండి లభిస్తుంది? భిక్షాటన అయితే చేయరు కదా. ఇది ఇల్లు. శివబాబా భండారము నుండి తింటారు. ఒకవేళ సేవ చేయకుండా ఊరకే తిన్నట్లైతే, దాని అర్థము భిక్షాటన చేస్తున్నట్లే. తర్వాత 21 జన్మలు మీరు సర్వీసు చేయవలసి పడ్తుంది. రాజు నుండి ప్రజల వరకు ఇక్కడ అందరూ ఉన్నారు. అక్కడ కూడా ఉంటారు. కాని అక్కడ సదా సుఖముంటుంది. ఇక్కడ సదా దు:ఖముంది. హోదా అయితే వేరుగా ఉంటుంది కదా. తండ్రితో పూర్తి యోగముంచుకోవాలి. సర్వీసు చేయాలి. మేము యజ్ఞ సేవ ఎంతగా చేస్తున్నాము? అని హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. ఈశ్వరుని వద్ద లెక్కాచారమంతా రెడీగా ఉంటుందని అంటారు. ఈ నడవడిక ద్వారా మేము ఏ పదవిని పొందుతాము? అని సాక్షి అయ్యి స్వయాన్ని చూసుకోవాలి. శ్రీమతము ఆధారంగా నడచుట ద్వారా ఎంత ఉన్నత పదవిని పొందుతామో కూడా అర్థము చేసుకోవచ్చు. శ్రీమతమును అనుసరించకపోతే పదవి ఎంత తగ్గిపోతుంది! ఇవన్నీ అర్థము చేసుకోవలసిన విషయాలు. మీ వద్ద ప్రదర్శినీలో అనేక ధర్మాల వారు వస్తారు. వారికిలా చెప్పండి - బేహద్‌ తండ్రి నుండి బేహద్‌ సుఖ-శాంతుల వారసత్వము లభిస్తుంది. అనంతమైన తండ్రియే శాంతిదాత. వారినే శాంతిదేవ అని అంటారు. జడమూర్తులు శాంతిని ఇవ్వలేవు. మీ స్వధర్మమే శాంతి అని తండ్రి చెప్తున్నారు. మీరు శాంతిధామములోకి వెళ్లాలని కోరుకుంటారు. శివబాబా శాంతినివ్వండి అని కోరినప్పుడు తండ్రి ఎందుకు ఇవ్వరు? తండ్రి తన పిల్లలకు ఆస్తినివ్వరా? శివబాబా సుఖమునివ్వండి అని అంటారు. వారు స్వర్గస్థాపన చేయు తండ్రి. మరి సుఖమును ఎందుకు ఇవ్వరు? వారిని స్మృతి చేయనే చేయరు. వారిని అడగనే అడగకుంటే వారు ఎలా ఇస్తారు? శాంతిసాగరుడైతే బాబాయే కదా. మీరు సుఖాన్ని కోరుకుంటారు, తండ్రి చెప్తారు - శాంతి తర్వాత మళ్లీ సుఖములోకి రావాలి. మొట్టమొదట వచ్చినవారు సుఖమును పొందుతారు, ఆలస్యంగా వచ్చేవారికి సుఖమును కోరడం కూడా రాదు. వారు ముక్తినే కోరుకుంటారు. మొదట అందరూ ముక్తిలోకే వెళ్తారు. అక్కడ అసలు దు:ఖమే ఉండదు.

మేము ముక్తిధామములోకి వెళ్లి తర్వాత మళ్లీ జీవన్ముక్తిలోకి వస్తామని మీకు తెలుసు. మిగిలినవారందరూ ముక్తిలోకి వెళ్లిపోతారు. దీనిని వినాశన(కయామత్‌) సమయము అని అంటారు అందరి లెక్కాచారాలు సమాప్తమవ్వనున్నాయి. జంతువులకు కూడా లెక్కాచారాలుంటాయి కదా. కొన్ని రాజుల దగ్గర ఉంటాయి. వాటి పాలన చాలా బాగా జరుగుతుంది. రేసులో పాల్గొనే గుర్రాలను చాలా సంభాళన చేయడం జరుగుతుంది. ఎందుకంటే గుర్రము వేగంగా పరిగెత్తితే వారికి సంపాదన బాగా వస్తుంది. అప్పుడు యజమాని తప్పకుండా దానిని ప్రేమతో చూసుకుంటాడు కదా! ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడింది. అక్కడ ఇవన్నీ ఉండవు. ఈ రేసులు మొదలైనవి తర్వాత ప్రారంభమయ్యాయి. ఇదంతా తయారు చేసి చేయబడిన ఆట. సృష్టి ఆది-మధ్య-అంతములను కూడా ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఆదిలో చాలా తక్కువమంది మనుష్యులుంటారు. మీరు విశ్వము పై రాజ్యము చేస్తూ ఉంటారు. మేము అవ్వగలమా? లేదా? అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. మేము అనేకమంది కళ్యాణము చేస్తున్నామా? ఇందులో శ్రమ చేయవలసి పడ్తుంది. ఇప్పుడు తండ్రి లభించారు. ప్రపంచములోనివారు పరస్పరము కొట్లాడుకుంటూ ఉంటారు. వినాశనము కొరకు ఏమేమో తయారు చేస్తూ ఉంటారు. ఎటువంటి బాంబులను తయారు చేస్తారంటే - వాటిని విసరగానే అగ్ని ప్రజ్వలితమౌతుంది. వెదురు అడవికి మంటలు తక్కువగా ఏమీ అంటుకోవు. ఆ సమయములో నిప్పును ఆర్పేవారు ఎవ్వరూ ఉండరు. లేక్కలేనన్ని బాంబులను తయారు చేస్తూ ఉంటారు. అందులో గ్యాసు, విషము మొదలైన వాటిని వేస్తారు. గాలి వీచగానే అందరూ సమాప్తమైపోతారు. మృత్యువు ఎదురుగా నిలిచి ఉంది. అందువల్ల తండ్రి చెప్తున్నారు - వారసత్వము తీసుకోవాలనుకుంటే తీసుకోండి. శ్రమ చేయండి. వ్యాపారాలు మొదలైన వాటిల్లోకి ఎక్కువగా వెళ్ళరాదు. ఎంతో ధ్యాస ఉంచుకోవలసి పడ్తుంది. బాబా ఇతడినైతే మ్తుంగా చేశారు. ఇప్పుడిది ఛీ - ఛీ (పాడైపోయిన) ప్రపంచము. పిల్లలైన మీరు తండ్రిని స్మృతి చేయాలి. తద్వారా మీ వికర్మలు వినాశనమై మీరు తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి. చాలా ప్రేమతో స్మృతి చేయాలి. లక్ష్మీనారాయణుల చిత్రమును చూడగానే మనసు సంతోషిస్తుంది. ఇది మన లక్ష్యము-ఉద్ధేశ్యము. భలే పూజ చేసేవారము కాని మనమే ఇలా అవ్వగలమని తెలియదు. నిన్న పూజారులుగా ఉండేవారము, ఈ రోజు పూజ్యులుగా అవుతున్నాము. బాబా రావడంతో పూజ వదిలేశాము. తండ్రి వినాశనము మరియు స్థాపనల సాక్షాత్కారము చేయించారు కదా. మనము విశ్వాధికారులుగా అవుతాము. ఇవన్నీ సమాప్తమవ్వాల్సిందే. మరి మనము తండ్రిని ఎందుకు స్మృతి చేయరాదు! లోలోపల ఆ ఒక్కరి మహిమనే పాడుతూ ఉండాలి - '' బాబా! మీరు ఎంత మధురమైనవారు! ''

ఆత్మలైన మనందరికీ తండ్రి వారొక్కరేనని, వారి నుండే వారసత్వము లభిస్తుందని మీకు తెలుసు. మనం భక్తిమార్గములో వారినే స్మృతి చేసేవారము. వారు పరంధామములో ఉండేవారు. అందుకే వారి చిత్రము కూడా ఉంది. ఒకవేళ వారు ఇక్కడకు రాకుంటే, వారి చిత్రము ఇక్కడ ఎందుకు ఉంటుంది? శివజయంతిని కూడా ఆచరిస్తారు. వారిని పరమపిత పరమాత్మ అని అంటారు. మిగిలినవారందరినీ మనుష్యులు లేక దేవతలు అని అంటారు. అన్నింటికంటే మొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మముండేది, వెనుక ఇతర ధర్మాలు వచ్చాయి. మరి అటువంటి తండ్రిని ఎంత ప్రేమగా స్మృతి చేయాలి! భక్తిమార్గములో అయితే చాలా విలపిస్తూ ఉంటారు. ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. అర్థము కొంచెం కూడా తెలియదు. ఎవరు వచ్చినా, వారి మహిమను చేస్తూ ఉంటారు. అనేక రకాల స్తుతులు(స్తోత్రాలు) ఉన్నాయి. తండ్రిని ఏమని స్తుతి చేస్తారు! మీరే కృష్ణుడు, మీరే వ్యాసులు, మీరే ఫలానావారు,.......... ఇలా అనడం గ్లాని చేయడం కదా. తండ్రికి ఎంత అపకారము చేశారు! తండ్రి చెప్తున్నారు - డ్రామానుసారము ఇలా నన్ను ఎంతగానో నిందించి నాకు అపకారము చేశారు. మళ్లీ నేను వచ్చి అందరికి ఉపకారము చేసి, అందరికి సద్గతినిస్తాను. నూతన ప్రపంచ స్థాపన చేసేందుకు నేను వచ్చాను. ఇదే గెలుపు-ఓటముల ఆట. ఇది 5 వేల సంవత్సరాల తయారుచేసి - చేయబడిన నాటకము. ఇందులో ఏ మాత్రం వ్యతాసం ఉండదు. ఈ డ్రామా రహస్యాన్ని ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. మనుష్య మతాలైతే అనేకము వెలువడుతూ ఉంటాయి. దేవతా మతమైతే లభించనే లభించదు. మిగిలినవన్నీ మనుష్య మతాలు. ప్రతి ఒక్కరూ తమ తెలివిని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఇతరులనెవ్వరినీ స్మృతి చేయరాదు. ఆత్మ కేవలం తమ తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. అందుకు శ్రమ చెయ్యాలి. భక్తులు కూడా శ్రమ చేస్తారు కదా! చాలా శ్రద్ధతో భక్తి చేస్తారు. అది ఎలా భక్తి అయ్యిందో, అలా మీరు జ్ఞానములో శ్రమ చేస్తారు. భక్తిలో శ్రమ తక్కువేమైనా చేస్తారా? గురువులు రోజూ 100 సార్లు మాలను జపించండి అని చెప్తారు. తర్వాత వెళ్ళి చిన్న గదిలో కూర్చుండిపోతారు. మాలను త్రిప్పుతూ - త్రిప్పుతూ గంటల సమయము గడచిపోతుంది. సాధారణంగా అధికంగా రామ - రామ అని ఎక్కువగా జపిస్తూ ఉంటారు. ఇక్కడైతే మీరు తండ్రి స్మృతిలో ఉండాలి. చాలా ప్రేమతో స్మృతి చేయాలి. ఎంత మధురాతి మధురమైన బాబా! కేవలం నన్ను స్మృతి చేయండి మరియు దైవీ గుణాలను ధారణ చేయండి అని చెప్తారు. స్వయము చేస్తే అప్పుడు ఇతరులకు కూడా మార్గాన్ని తెలుపుతారు. తండ్రి వంటి మధురమైనవారు వేరెవ్వరూ లేరు. కల్పము తర్వాత మీకు మధురమైన బాబా లభిస్తారు, ఇటువంటి మధురమైన తండ్రిని ఎందుకు మర్చిపోతారో తెలియదు! తండ్రి స్వర్గ రచయిత కనుక మీరు కూడా తప్పకుండా స్వర్గాధికారులుగా అవుతారు. కాని తుప్పు తొలగించుకునేందుకు తండ్రిని స్మృతి చేయండి. స్మృతి చేయకుండా ఉండేందుకు కష్టమేమో చెప్పండి! తండ్రిని స్మృతి చేయడం కష్టము ఎందుకు అవుతుందో కారణము చెప్పండి! అచ్ఛా!

మధురాతి మధురమైన లక్కీ నక్షత్రాలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. శరీర నిర్వహణ కొరకు కర్మ తప్పకుండా చేయండి కాని అధిక ఝంఝాటంలో చిక్కుకోరాదు. తండ్రిని మరచిపోయేటంతగా వ్యాపారాలు మొదలైన వాటిని గురించి చింతన చేయరాదు.

2. మనుష్యుల అనేక మతాలను వదిలి ఒక్క తండ్రి మతమునే అనుసరించాలి. ఒక్క తండ్రినే మహిమ చేయాలి. ఒక్క తండ్రినే ప్రేమించాలి. మిగిలిన అందరి నుండి మోహమును తొలగించి వేయాలి.

వరదానము :-

''జ్ఞానమనే లైట్‌, మైట్‌ల ద్వారా రాంగ్‌ను రైట్‌లోకి పరివర్తన చేసే జ్ఞానయుక్త ఆత్మా భవ''

' జ్ఞానమంటే లైట్‌ - మైట్‌ ' అని అంటారు. ఎక్కడైతే ఇది తప్పు, ఇది రైటు, ఇది అంధకారము, ఇది వెలుతురు, ఇది వ్యర్థము, ఇది సమర్థము అనే లైటు అనగా ప్రకాశము ఉంటుందో అక్కడ రాంగ్‌ను అర్థము చేసుకొని, రాంగ్‌ కర్మలు లేక సంకల్పాలకు వశీభూతులుగా అవ్వలేరు. జ్ఞానయుక్త ఆత్మలనగా తెలివి గలవారు, జ్ఞాన స్వరూపులు. వారు ఎప్పుడూ ఇలా జరిగి ఉండరాదు....... అని అనజాలరు. ఎందుకంటే వారి వద్ద రాంగ్‌ను(తప్పును) రైట్‌లోకి పరివర్తన చేసే శక్తి ఉంటుంది.

స్లోగన్‌ :-

''ఎవరైతే సదా శుభచింతకులై శుభ చింతన చేస్తూ ఉంటారో, వారు వ్యర్థ చింతన నుండి ముక్తులుగా అవుతారు (విడుదల అవుతారు).''