26-08-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - ఇప్పుడు మీ ఆశలన్నీ పూర్తి అవుతాయి, కడుపు నిండిపోతుంది, మిమ్ములను తృప్త ఆత్మలుగా చేసేందుకు తండ్రి వచ్చారు. ''
ప్రశ్న :-
పిల్లలైన మీరు భక్తి చేయడం లేదు, కాని మీరు తప్పకుండా భక్తులే, ఎలా ?
జవాబు :-
దేహాభిమానము ఉన్నంతవరకు భక్తులే, మీరు జ్ఞానులుగా అయ్యేందుకు చదువుతున్నారు. పరిక్ష ఉత్తీర్ణులై కర్మాతీతులుగా అవుతారో అప్పుడు సంపూర్ణ జ్ఞానులని అంటారు. తర్వాత చదువుకునే అవసరం లేదు.
ఓంశాంతి.
భక్తులు మరియు భగవంతుడు ఇద్దరు ఉన్నారు కదా. పిల్లలు మరియు తండ్రి. భక్తులైతే అనేకమంది ఉన్నారు. భగవంతుడు ఒక్కరే, పిల్లలైన మీకు ఇది సహజ విషయమనిపిస్తుంది. ఆత్మ శరీరము ద్వారా భక్తి చేస్తుంది ఎందుకు? భగవంతుడైన తండ్రిని కలుసుకునేందుకు. భక్తులైన మీరు ఇప్పుడు డ్రామాను అర్థం చేసుకున్నారు. సంపూర్ణ జ్ఞానులైనప్పుడు ఇక్కడ ఉండరు. పాఠశాలలో చదువుకుంటారు, పరీక్షలో ఉత్తీర్ణులైతే మరొక తరగతికి వెళ్తారు. ఇప్పుడు మిమ్ములను భగవంతుడు చదివిస్తున్నారు. జ్ఞానులకైతే చదువు అవసరముండదు. భక్తులను భగవంతుడు చదివిస్తున్నారు. ఆత్మలమైన మనము భక్తి చేసేవారమని మీకు తెలుసు. ఇప్పుడు భక్తి నుండి జ్ఞానములోకి ఎలా వెళ్లాలో తండ్రి నేర్పిస్తారు. ఇప్పుడు భక్తి చేయరు కాని దేహాభిమానములోకి అయితే వచ్చేస్తారు కదా. భక్తులకు భగవంతుని గురించి తెలియదని కూడా మీకు తెలుసు. మాకేమీ తెలియదని వారే చెప్తారు. మీరు ఏ భగవంతుని భక్తులో వారి గురించి తెలుసా? అని నంబరువన్ భక్తులైన వారిని కూడా తండ్రి అడుగుతారు. వాస్తవానికి భగవంతుడు ఒక్కరే ఉండాలి. ఇక్కడైతే అనేకమంది భగవంతులున్నారు. స్వయాన్ని భగవంతుడని చెప్పుకుంటూ ఉంటారు. దీనిని అజ్ఞానమని అంటారు. భక్తిలో గాఢాంధకారముంది, అది భక్తి మార్గము. జ్ఞానమనే అంజనమును సద్గురువు ఇస్తూనే అజ్ఞానమనే అంధకారము వినాశము అవుతుంది,...........(జ్ఞానాంజన్ సద్గురు దియా, అజ్ఞాన్ అంధేరా వినాశ్,......) అని భక్తులు పాడుతూ ఉంటారు. జ్ఞాన అంజనాన్ని గురువులు ఇవ్వలేరు. గురువులైతే అనేకమంది ఉన్నారు. భక్తిలో ఏమేమి చేసేవారో, ఎవరిని స్మృతి చేస్తూ ఉండినారో, ఎవరిని పూజిస్తూ ఉండినారో పిల్లలైన మీకు తెలుసు. ఆ భక్తి అనే మీ అంధకారం తొలగిపోయింది ఎందుకంటే మీరిప్పుడు తండ్రిని తెలుసుకున్నారు. మధురాతి మధురమైన పిల్లలారా! మీరు ఆత్మలు, ఈ శరీరము ద్వారా పాత్ర చేశారని తండ్రి పరిచయమునిచ్చారు. మీది అనంతమైన జ్ఞానము, బేహద్ పాత్ర చేస్తూ ఉంటారు. మీరు హద్దు నుండి వైదొలగి ఇప్పుడు బేహద్లోకి వెళ్లిపోయారు. ఈ ప్రపంచము కూడా వృద్ధి చెందుతూ చెందుతూ అనంతములోకి వెళ్లిపోయింది. మళ్లీ తప్పకుండా హద్దులోకి వస్తుంది. హద్దు నుండి బేహద్లోకి, బేహద్ నుండి హద్దులోకి ఎలా వస్తుందో పిల్లలైన మీకు తెలుస్తుంది. ఆత్మ చిన్న నక్షత్రము వలె ఉంటుంది. ఇంత తెలిసినా ఎంత పెద్ద లింగాన్ని తయారు చేస్తారు! వారు కూడా ఏం చేెస్తారు, ఎందుకంటే చిన్న బిందువును పూజించలేరు. భృకుటి మధ్యలో నక్షత్రము మెరుస్తూ ఉంది,......... (భృకుటి కే బీచ్ మే చమక్తా హై అజబ్ సితారా,........) అని అంటారు. ఇప్పుడు ఆ నక్షత్రాలకు భక్తి ఎలా చేెస్తారు? భగవంతుని గురించి అయితే ఎవ్వరికీ తెలియదు, ఆత్మను గురించి తెలుసు. ఆత్మ భృకుటి మధ్యలో ఉంటుందని మాత్రమే తెలుసు. ఆత్మయే శరీరాన్ని తీసుకొని పాత్ర చేస్తుందని బుద్ధిలోకి రాదు. మొట్టమొదట మీరే పూజ చేసేవారు. పెద్ద పెద్ద లింగాలను తయారుచేస్తారు. రావణుని చిత్రము కూడా రోజురోజుకు పెద్దదిగా చేస్తారు. చిన్న రావణుని తయారు చేయలేరు. మానవులైతే చిన్నగా ఉంటారు, తర్వాత పెద్దగా అవుతారు. రావణుని ఎప్పుడూ చిన్నగా చూపించరు, రావణుడైతే చిన్నగా, పెద్దగా అవ్వడు. రావణుడు ఏ స్థూలమైన వస్తువు కాదు. పంచ వికారాలను రావణుడని అంటారు. పంచ వికారాలు వృద్ధి అవుతూ ఉంటాయి. ఎందుకంటే తమోప్రధానంగా అవుతూ ఉంటారు. ఇంతకుముందు దేహాభిమానము ఇంతగా లేదు. తర్వాత పెరుగుతూ వచ్చింది. ఒకరికి పూజ చేశారు, తర్వాత మరొకరికి పూజ చేశారు. ఈ విధంగా వృద్ధి చెందుతూ వచ్చింది. ఆత్మ తమోప్రధానంగా అయ్యింది. సతోప్రధానంగా ఎప్పుడు అవుతారు? తర్వాత మళ్లీ తమోప్రధానంగా ఎప్పుడు అవుతారు? అనే విషయాలు ఈ ప్రపంచములోని మానవులెవ్వరి బుద్ధిలోనూ ఉండవు. ఈ విషయాల గురించి మానవులెవ్వరికీ తెలియదు. జ్ఞానమేమీ కష్టము కాదు. తండ్రి వచ్చి చాలా సహజంగా జ్ఞానము వినిపిస్తారు, చదివిస్తారు. అయినా చదువు అంతటి సారమేమిటంటే ''ఆత్మలమైన మనమంతా తండ్రికి పిల్లలము. తండ్రిని స్మృతి చేయాలి.''
కోటికొక్కరే,................. (కోటోం మే కోయీ,......) అని కూడా గాయనముంది. బాబా పిల్లలుగా కొద్దిమందే వెలువడ్తారు. కోటిలో కొంతమంది మాత్రమే యధార్థంగా తెలుసుకుంటారు. ఎవరిని? తండ్రిని. ఏ తండ్రి అయినా ఇలా ఉంటారా? అని అడుగుతారు. తమ తండ్రి గురించి అయితే అందరికీ తెలుసు. ఈ తండ్రిని ఎందుకు మర్చిపోయారు? దీని పేరే మరిచి మరపించే ఆట (బూల్ బులయ్యా ఆట, బయటికి వచ్చే దారి తెలియని ఆట). ఒకరు హద్దులోని తండ్రి, మరొకరు బేహద్ తండ్రి. ఇద్దరు తండ్రుల ద్వారా వారసత్వము లభిస్తుంది. హద్దు తండ్రి ద్వారా వారసత్వము కొద్దిగా లభిస్తుంది. రోజురోజుకు పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. కొద్దిగా కూడా లేని విధంగా అయిపోతుంది. బేహద్ తండ్రి రానంతవరకు కడుపు కూడా నిండదు. కడుపు పూర్తిగా ఖాళీ అయిపోతుంది, తండ్రి వచ్చి కడుపు నింపుతారు. ఏ వస్తువులు మొదలైనవి ఏవీ అవసరము లేనంతగా పిల్లలైన మీ కడుపు నింపుతారు(తృప్తి పరుస్తారు). ఆశలన్నీ పూర్తి చేసేస్తారు. తృప్త ఆత్మగా అయిపోతుంది. బ్రాహ్మణులకు తినిపిస్తే ఆత్మ తృప్తి పడ్తుంది కదా. (సంవత్సరీకము చేయునప్పుడు). ఇది అనంతమైన తృప్తి. ఎంత తేడా ఉందో చూడండి. ఆత్మకు కలిగే హద్దు తృప్తికి, బేహద్ తృప్తికి ఎంత తేడా ఉందో చూడండి. తండ్రిని తెలుసుకోగానే తృప్తి చెందుతుంది ఎందుకంటే తండ్రి స్వర్గానికి అధికారులుగా చేస్తారు. మనము బేహద్ తండ్రి పిల్లలమని మీకు తెలుసు. తండ్రిని అందరూ స్మృతి చేస్తారు కదా. ఇది మామూలే, మేము బ్రహ్మములో లీనమైపోతామనని కొందరు అంటారు. బ్రహ్మములో ఎవ్వరూ లీనమవ్వరని తండ్రి చెప్తున్నారు. ఇది అనాది డ్రామా తిరుగుతూనే ఉంటుంది. ఇందులో తకమక పడే అవసరమే లేదు. నాలుగు యుగాల చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఉన్నది ఉన్నట్లు పునారావృతమౌతూ ఉంటుంది. తండ్రి ఒక్కరే, ప్రపంచము కూడా ఒక్కటే. వారెంతగానో తల కొట్టుకుంటారు. చంద్రునిలో కూడా ప్రపంచముందని, నక్షత్రాలలో కూడా ప్రపంచముందని అనుకుంటారు. ఎంతగానో వెతుకుతారు. చంద్రునిలో కూడా ప్లాటు తీసుకోవాలని అనుకుంటారు, అది ఎలా వీలౌతుంది? ధనము ఎవరికి ఇస్తారు? దీనిని విజ్ఞాన గర్వము అని అంటారు. అంతకన్నా మరేమీ లేదు. ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇది మాయ ఆడంబరము కదా. స్వర్గము కంటే ఎక్కువ షో చేసి చూపిస్తారు. స్వర్గమునైతే పూర్తిగా మర్చిపోయారు. స్వర్గములో చాలా ధనముండేది. ఒక్క (సోమనాథ) మందిరము నుండే ఎంత ధనమును తీసుకుపోయారో చూడండి. భారతదేశములోనే ఇంత ధనము ఉండేది, ఖజానాలన్నీ సంపన్నంగా ఉండేవి. మహమ్మద్గజ్నీ వచ్చి లూటీ చేసి తీసికెళ్లిపోయాడు. అర్ధకల్పము వరకు మీరు సమర్థులుగా ఉంటారు, దొంగతనము మొదలైనవాటి పేరు కూడా ఉండదు. రావణ రాజ్యమే లేదు. రావణరాజ్యము మొదలైనప్పటి నుండి దొంగతనాలు, దోపిడీలు, జగడాలు మొదలైనవన్నీ ప్రారంభమయ్యాయి. రావణుని పేరు వాడుతూ ఉంటారు. అంతేగాని రావణుడనే వ్యక్తి ఎవ్వరూ లేరు. వికారాలు ప్రవేశించాయి. మానవులు రావణుని గురించి ఏమేమో చేస్తారు. ఎంతగానో జరుపుకుంటారు. మీరు కూడా దశరాను జరుపుకునేవారు, రావణుని ఎలా తగులబెట్తారో చూచేందుకు వెళ్లేవారు. తర్వాత బంగారును లూటీ చేసేందుకు వెళ్తారు. అక్కడ ఏముంది, ఇప్పుడు ఎంత ఆశ్చర్యమేస్తుంది! ఎలా తయారై ఉండినారు! ఇన్ని పూజలు మొదలైనవి చేసేవారు. ఏవైనా గొప్ప రోజులు వస్తే ఏమేమో చేస్తూ ఉంటారు. భక్తిమార్గము బొమ్మల ఆట వలె ఉంది. అది కూడా ఎంత సమయము నడుస్తుందో మీకు తెలుసు. ప్రారంభములో ఇంత భక్తి చేసేవారు కాదు. తర్వాత వృద్ధి చెందుతూ చెందుతూ ఇప్పుడు ఎలాంటి పరిస్థితి తయారయ్యిందో చూడండి. ఎంతో ఖర్చు చేసి చిత్రాలు లేక మందిరాలు మొదలైనవి ఎందుకు తయారు చేస్తారు? ఇదంతా వృథా ఖర్చు. మందిరాలు మొదలైనవి తయారుచేయుటకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. తండ్రి ఎంత ప్రేమగా కూర్చొని అర్థం చేయిస్తారు. నేను మీకు లెక్కలేనంత ధనాన్నిచ్చాను, అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు? ఎలా ఉన్నవారు రావణ రాజ్యములోకి వచ్చిన తర్వాత ఎలా తయారయ్యారు! ఇదేమీ ఈశ్వరేచ్ఛ అని రాజీ పడరాదు. ఇది ఈశ్వరుని భావి కాదు, మాయ యొక్క భావి. మీకిప్పుడు ఈశ్వరీయ రాజ్య భాగ్యము లభిస్తుంది. అక్కడైతే దు:ఖమనే మాటే ఉండదు. ఈశ్వరీయ ప్రాలబ్ధము మరియు ఆసురీ ప్రాలబ్ధమునకు ఎంత తేడా ఉంది! ఇదంతా మీకిప్పుడు అర్థమవుతుంది, అది కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా. జ్ఞాన ఇంజెక్షన్ ఎవరికి పడ్తుందో మీరు అర్థం చేసుకోగలరు. ఫలానావారికి జ్ఞాన ఇంజక్షన్ బాగా పడింది, ఫలానావారికి తక్కువ పడింది, కొందరికి పూర్తిగా పడనేలేదు. ఇవన్నీ తండ్రికే తెలుసు. ఆధారమంతా సర్విసు పైనే ఉంది. వీరికి ఇంజక్షన్ పడలేదని, వీరికి సర్వీసు చేయడమే తెలియదని, సర్వీసు ద్వారానే తండ్రి చెప్తారు. కొందరికి ఎక్కువ ఇంజక్షన్ పడ్తుంది, కొందరికి పూర్తిగా పడదు, ఇలా కూడా ఉంటుంది.
అజ్ఞానమనే అంధకారాన్ని వినాశనము చేసి జ్ఞానమనే అంజనము సద్గురువు ఇచ్చారని,........ అంటారు. జ్ఞానసాగరులు, సుఖసాగరులు పరమపిత పరమాత్మయే. అటువంటివారిని రాళ్ళు-రప్పలలో పడేశారు. పిల్లలకు ఎంత నిశ్చయముండాలి! అనంతమైన తండ్రి మనకు అనంతమైన సుఖమునిస్తారు. బేహద్ బాబా, మీరు వస్తే మేము మీవారిగానే అవుతామని మీ మతానుసారమే నడుచుకుంటామని పాడ్తారు. భక్తిలో అయితే తండ్రిని గురించే తెలియదు, ఈ పాత్ర ఇప్పుడే నడుస్తుంది. తండ్రి ఇప్పుడే చదివిస్తారు. ఇలా చదువుకునే పాత్ర మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత నడుస్తుందని మీకు తెలుసు. తండ్రి మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత వస్తారు. ఆత్మలందరూ పరస్పరములో సోదరలు(భాయీ-భాయీ). శరీరాలను ధరించి పాత్రను అభినయిస్తారు. మానవ సృష్టి కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆత్మల స్టాక్ కూడా ఉంది కదా! చివరికి ఇక్కడ ఎంతమంది మనుష్యులుంటారో అక్కడ కూడా ఆత్మల స్టాక్ అంతే ఉంటుంది. ఒక్క పాత్రధారి కూడా ఎక్కువ, తక్కువగా ఉండరు. వీరంతా బేహద్ పాత్రధారులు. వీరికి అనాది పాత్ర లభించింది. ఇది చాలా అద్భుతంగా ఉంది కదా. మీరిప్పుడు ఎంత వివేకవంతులుగా అయ్యారు! ఈ చదువు ఎంత శ్రేష్ఠమైనది! మిమ్ములను స్వయం జ్ఞానసాగరులైన తండ్రియే చదివిస్తారు. మిగతా వారంతా భక్తిసాగరులు. భక్తికి ఎలాగైతే గౌరవముందో, అలా జ్ఞానానికి కూడా గౌరవముంది. భక్తిలో మానవులు ఈశ్వరార్థము దాన-పుణ్యాలు ఎంతగానో చేస్తారు. ఎందుకంటే వేదశాస్త్ర్రాలు మొదలైనవాటిని ఎంతో పెద్దవిగా తయారు చేస్తారు.
పిల్లలైన మీకిప్పుడు భక్తికి, జ్ఞానానికి గల తేడా లభించింది. ఎంత విశాలమైన బుద్ధి ఉండాలి. మీ దృష్టి ఎవరి పైకి కూడా వెళ్లదు. మనము ఈ రాజా - రాణి మొదలైన వారిని చూడాలని మీరు అంటారా? వారినేం చూడాలి? మనసులో ఏ ఆశా ఉండదు. ఇదంతా సమాప్తమవ్వనున్నది. ఎవరి వద్ద ఎంత ఉందో అదంతా సమాప్తమవుతుంది. కడుపు కోరేది రెండు రొట్టెలే కానీ దాని కొరకు ఎంత పాపము చేస్తారు! నేటి ప్రపంచములో ఎక్కడ చూసినా పాపమే పాపముంది. కడుపు చాలా పాపము చేయిస్తుంది. ఒకరి మీద ఒకరు అసత్య కళంకాలు ఆపాదిస్తారు. ధనము కూడా చాలా సంపాదిస్తారు. ఎంత ధనాన్ని దాచిపెట్టుకుంటారు! ప్రభుత్వము మాత్రము ఏం చేయగలదు. కాని ఎవరు ఎంత దాచినా దాగదు. ఇప్పుడైతే ఇంకా ప్రాకృతిక ప్రకోపాలు కూడా రానున్నవి. ఇక కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది. బాబా చెప్తున్నారు - శరీర నిర్వహణ కొరకు ఏమి చేసినా వద్దనరు. పిల్లలకు ఖుషీ పాదరస మీటరు పెరిగి ఉండాలి. తండ్రి మరియు వారసత్వము గుర్తుండాలి. తండ్రి అయితే మిమ్ములను విశ్వమంతటికీ అధిపతులుగా చేస్తారు. భూమి-ఆకాశములు అన్నీ మనవిగా అయిపోతాయి. ఎలాంటి హద్దులు ఉండవు. మనమే అధికారులుగా ఉండేవారమని పిల్లలకు తెలుసు. భారతదేశము అవినాశి ఖండముగా పేరు పొందింది. కావున పిల్లలైన మీకు చాలా సంతోషముండాలి. హద్దు చదువు ద్వారా కూడా సంతోషము ఉంటుంది కదా. ఇది బేహద్ చదువు. బేహద్ తండ్రి చదివిస్తారు. ఇలాంటి తండ్రిని స్మృతి చేయాలి. ఆ దైహిక వ్యాపారాలు మొదలైన వాటిలో ఏముంది? ఏమీ లేదు. మనము తండ్రి ద్వారా ఎలాంటి వారసత్వము తీసుకుంటున్నామో పిల్లలు గ్రహించాలి. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. మనము దైహిక వృత్తి వ్యాపారాలు చేస్తూ కూడా కిరీటధారులుగా అవుతాము. చదివించేందుకు తండ్రే వస్తే, పిల్లలకు ఎంత సంతోషముండాలి. ఆ పనిపాటలు కూడా చేస్తూ ఉండాలి. ఈ పాత ప్రపంచము వినాశనమయ్యేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని మీకు తెలుసు. ఎక్కడ పెద్ద యుద్ధము జరుగుతుందోనని భయం కలిగించే విధంగా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ డ్రామానుసారము జరగాల్సిందే. అంతేగాని ఇవన్నీ ఈశ్వరుడు చేయిస్తాడని కాదు. ఈ రోజు కాకపోతే రేపు తప్పకుండా వినాశనమవుతుంది. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. మీ కొరకు తప్పకుండా నూతన ప్రపంచము కావాలి. ఈ విషయాలన్నీ మనసులో స్మరణ చేసుకుంటూ సంతోషంగా ఉండాలి. బాబా ఈ రథమును కూడా తీసుకున్నారు, వీరికి ఏమీ లేదు. అంతా వదిలేశారు. బేహద్ చక్రవర్తి పదవి లభిస్తూ ఉంటే ఇది ఏం చేస్తారు! ఆత్మకు అల్లా లభిస్తే ఈ పనికిరాని దానిని ఏం చేస్తారు? ఒకేసారి అంతా ఇచ్చి సమాప్తం చేసేశాము. శరీరాన్ని కూడా బాబాకు ఇచ్చేశాము. ఓహో! మనము విశ్వానికి అధికారులుగా అవుతాము, అనేకసార్లు అధికారులుగా అయ్యాము. ఎంత సహజము. మీరు భలే మీ ఇంట్లో ఉండండి, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఏ విషయములోనూ కళ్ళు చంచలము కానీ విధంగా తృప్తిగా విశాలబుద్ధి గలవారిగా అవ్వాలి. మనసులో ఏ ఆశా ఉండరాదు. ఎందుకంటే ఇవన్నీ వినాశనము కానున్నవి.
2. శరీర నిర్వహణార్థము కర్మ చేస్తూ, ఖుషీ పాదరస మీటరు సదా పైకెక్కి ఉండాలి. తండ్రి మరియు వారసత్వము గుర్తుండాలి. బుద్ధిని హద్దు నుండి తొలగించి సదా బేహద్లో ఉండండి.
వరదానము :-
'' తండ్రి మరియు సేవలో మగ్నమై ఉండే నిర్విఘ్న నిరంతర సేవాధారీ భవ ''
ఎక్కడైతే సేవ చేయాలనే ఉత్సాహముంటుందో, అక్కడ అనేక విషయాల నుండి దూరమవుతారు. ఒక్క తండ్రితో మరియు సేవలో మగ్నమై ఉంటే నిర్విఘ్నంగా ఉంటారు. నిరంతర సేవాధారులు సహజంగా మాయాజీతులుగా అవుతారు. సమయ ప్రతి సమయం సేవ యొక్క రూపురేఖలు మారిపోతున్నాయి, ఇంకా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరముండదు. కానీ స్వయం వారే ఇది శ్రేష్ఠమైన కార్యమని అంటారు. అందువలన మమ్ములను కూడా సహయోగులుగా చేసుకోండి అని అంటారు. ఇది సమయ సమీపతకు గుర్తు. కనుక మంచి ఉల్లాస - ఉత్సాహాలతో సేవ చేస్తూ ముందుకు సాగుతూ ఉండండి.
స్లోగన్ :-
'' సంపన్నతా స్థితిలో స్థితమై ప్రకృతి ఆందోళనను, సాగిపోతూ ఉండే మేఘాల సమానంగా అనుభవం చేయండి. ''