08-07-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - ఆత్మాభిమానులుగా అవుతే శీతలంగా అవుతారు. వికారాల దుర్వాసన తొలగిపోతుంది. అంతర్ముఖులుగా అవుతారు. పుష్పాలుగా అవుతారు.''
ప్రశ్న :-
బాప్దాదా పిల్లలందరికి ఇచ్చే రెండు వరదానాలు ఏవి? వాటిని స్వరూపములో తీసుకొచ్చే విధి ఏది?
జవాబు :-
బాబా పిల్లలందరికీ శాంతి-సుఖాల వరదానమునిస్తారు. బాబా చెప్త్తున్నారు - పిల్లలారా! మీరు శాంతిగా ఉండే అభ్యాసము చేయండి. ఎవరైనా ఉల్టా-సుల్టాగా(తప్పుగా) మాట్లాడితే మీరు వారికి జవాబు ఇవ్వకండి. మీరు శాంతిగా ఉండాలి. వ్యర్థంగా మాట్లాడరాదు. ఎవ్వరికీ దు:ఖమునివ్వరాదు. నోటిలో శాంతి నాణెము(మొహర్)ను వేసుకుంటే ఈ రెండు వరదానాలు స్వరూపములోకి వస్తాయి.
ఓంశాంతి.
మధురాతి మధురమైన పిల్లలు అప్పుడప్పుడు సన్ముఖములో ఉంటారు. అప్పుడప్పుడు దూరంగా వెళ్లిపోతారు. ఎవరైతే స్మృతి చేస్తారో వారు సన్ముఖములో ఉంటారు. ఎందుకంటే స్మృతి యాత్రలోనే అంతా ఇమిడి ఉంది. దృష్టి ద్వారా తృప్తి(అతీతము) అని గాయనముంది కదా! ఆత్మ దృష్టి పరమపిత వైపుకు వెళ్తుంది. ఆత్మకు ఇంకేదీ నచ్చదు. వారిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమౌతాయి. కాబట్టి తమ పై తాము ఎంత అప్రమత్తంగా ఉండాలి! స్మృతి చేయకపోతే వీరి యోగము తెగిపోయి ఉందని మాయ భావించి తన వైపు ఆకర్షిస్తుంది. ఏదో ఒక ఉల్టా(తప్పుడు) కర్మను చేయిస్తుంది. ఇటువంటి తండ్రిని నిందింపజేస్తారు. బాబా, నాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు అని భక్తిమార్గములో పాడ్తారు. పిల్లలారా! గమ్యము చాలా ఉన్నతమయ్యిందని తండ్రి అంటారు. పని చేస్తూ తండ్రిని స్మృతి చేయడం ఉన్నతాతి ఉన్నతమైన గమ్యము. దీనిని చాలా బాగా అభ్యాసము చేయాలి. లేకుంటే తప్పు పనులు చేసి తండ్రిని నిందింపచేయు వారిగా అవుతారు. ఎవరైనా క్రోధములోకి వచ్చి పరస్పరము పోట్లాడుకుంటూ ఉంటే అది కూడా నిందింపచేసినట్లే అవుతుంది. ఇందులో చాలా హెచ్చరికగా ఉండాలి. తమ గృహస్థ వ్యవహారములలో ఉంటున్నా బుద్ధిని తండ్రితో జోడించాలి. ఇంకా ఎవ్వరూ సంపూర్ణమవ్వలేదని అనుకోరాదు. దేహీ-అభిమానులుగా అయ్యే అభ్యాసము చేయాలి. దేహాభిమానములోకి రావడం వలన ఏదో ఒక ఉల్టా పని చేస్తారు అనగా తండ్రిని నిందింపజేస్తారు. ఇటువంటి సద్గురువును నిందింపచేయువారు లక్ష్మీనారాయణులుగా అయ్యే ప్రాప్తిని పొందలేరు. కనుక పూర్తిగా పురుషార్థము చేస్తూ ఉండండి. దీని ద్వారా మీరు చాలా శీతలంగా అయిపోతారు. పంచ వికారాల విషయాలన్నీ తొలగిపోతాయి. తండ్రి ద్వారా చాలా శక్తి లభిస్తుంది. పని పాటలు కూడా చేసుకోవాలి. కర్మలు చేయకండి అని తండ్రి చెప్పరు. సత్యయుగములో మీ కర్మలు అకర్మలుగా అవుతాయి. కలియుగములో చేసే కర్మలు వికర్మలుగా అవుతాయి. ఇప్పుడు సంగమ యుగములో మీరిప్పుడు నేర్చుకోవలసి ఉంటుంది. అక్కడ నేర్చుకునే మాటే ఉండదు. ఇక్కడ తీసుకున్న శిక్షణయే అక్కడికి మీ తోడుగా వస్తుంది. బహిర్ముఖత మంచిది కాదు. అంతర్ముఖీ భవ అని తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు పూర్తి అంతర్ముఖులుగా ఉండే సమయము కూడా వస్తుంది. అప్పుడు తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రారు. ఎవరి స్మృతి లేకుండానే మీరు పరంధామము నుండి వచ్చారు. గర్భము నుండి బయటకు వచ్చిన తర్వాత వీరు నా తల్లి-తండ్రి, వీరు ఫలానావారు అని తెలుస్తుంది. మళ్లీ ఇప్పుడు అదే విధంగా వాపస్ వెళ్లాలి. మనం ఒక్క తండ్రికి చెందినవారము. వారు తప్ప బుద్ధిలో ఇంకెవ్వరూ గర్తు రాకూడదు. ఇంకా సమయముంది కానీ పురుషార్థము పూర్తిగా చేయాలి. శరీరము పై ఏ నమ్మకమూ లేదు. ఇంటిలో కూడా శాంతిగా, కలహ క్లేశాలు లేని విధంగా ప్రయత్నిస్తూ ఉండాలి. లేకుంటే వీరిలో ఎంత అశాంతి ఉంది అని అందరూ అంటారు. మీరు పూర్తి శాంతిగా ఉండాలి. మీరు శాంతి వారసత్వమును తీసుకుంటున్నారు కదా. మీరిప్పుడు ముళ్ళ మధ్యలో ఉన్నారు. పూల మధ్యలో లేరు. ముళ్ళ మధ్యలో ఉంటూ పుష్పాలుగా అవ్వాలి. ముళ్ళలో ఉంటూ ముళ్ళుగా అవ్వరాదు. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత శాంతిగా ఉంటారు. ఎవరెంత ఉల్టాగా మాట్లాడినా మీరు శాంతిగా ఉండండి. ఆత్మ స్వధర్మమే శాంతి. మనమిప్పుడు ఆ ఇంటికి వెళ్లాలని మీకు తెలుసు. తండ్రి శాంతిసాగరుడు, మీరు కూడా శాంతి సాగరులుగా అవ్వాలని చెప్తున్నారు. వ్యర్థమైన విషయాలు చాలా నష్టపరుస్తాయి. ఇటువంటి మాటలు మాట్లాడరాదని దాని ద్వారా మీరు తండ్రిని నిందింపజేస్తారని తండ్రి సూచనలిస్తున్నారు. శాంతిగా ఉండుట వలన ఎటువంటి నింద లేక వికర్మ జరగదు. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే వికర్మలు వినాశనమౌతాయి. మీరు అశాంతిగా ఉండకండి, ఇతరులను అశాంతి పరచకండి. ఎవరికైనా దు:ఖమిస్తే ఆత్మ అసంతుష్టమవుతుంది. చాలామంది తండ్రికి - ''బాబా! సెంటరు నుండి ఇంటికి వస్తూనే వీరు గొడవ చేస్తారు'' అని రిపోర్టు జాబు వ్రాస్తారు. మీరు మీ స్వధర్మమైన శాంతిలో ఉండండి అని బాబా వ్రాస్తారు. హాతమ్తాయి కథ కూడా ఉంది కదా. ఒకరు హాతమ్తాయితో - నీవు నోటిలో నాణెము(మొహరు) వేసుకుంటే మాట్లాడలేవు, శబ్ధమే రాదు అని అన్నారు.
పిల్లలైన మీరు శాంతిగా ఉండాలి. మానవులు శాంతి కొరకు చాలా ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. మన మధురమైన తండ్రి శాంతి సాగరులని పిల్లలైన మీకు తెలుసు. శాంతి చేయిస్తూ - చేయిస్తూ విశ్వములో శాంతిని స్థాపన చేస్తారు. తమ భవిష్య పదవిని కూడా స్మృతి చేయండి. అక్కడ ఒకే ధర్మము తప్ప ఇతర ధర్మములేవీ ఉండవు. దానినే విశ్వములో శాంతి అని అంటారు. మళ్లీ ఇతర ధర్మాలు వచ్చినప్పుడు హంగామాలు(గలాటాలు) జరుగుతాయి. ఇప్పుడు ఎంత శాంతిగా ఉంటుంది! మన ఇల్లు అదేనని, మన స్వధర్మము శాంతి అని భావిస్తారు. శరీర స్వధర్మము శాంతి అని అనరు. శరీరము వినాశి, ఆత్మ అవినాశి. అక్కడ ఉన్నంతవరకు ఆత్మలు ఎంతో శాంతిగా ఉంటాయి. ఇక్కడైతే ప్రపంచమంతటా అశాంతియే ఉంది. అందువలన శాంతిని కోరుతూ ఉంటారు. సదా శాంతిగా ఉండాలని అనుకుంటారు. కానీ అది వీలు కాదు. 63 జన్మలు అక్కడ ఉన్నా మళ్లీ తప్పకుండా ఇక్కడకు రావలసి ఉంటుంది. తమ సుఖ-దు:ఖాల పాత్రను అభినయించి మళ్లీ అక్కడకు వెళ్ళిపోతారు. డ్రామాను బాగా గమనముంచుకోవలసి వస్తుంది.
బాబా మనకు సుఖము మరియు శాంతుల వరదానాలను ఇస్తారని గమనముండాలి. బ్రహ్మ ఆత్మ కూడా అంతా వింటుంది. అందరికంటే ముందుగా ఇతని చెవులు వింటాయి. ఇతని చెవులు నోటికి దగ్గరగా ఉన్నాయి. మీవి కాస్త దూరంగా ఉన్నాయి. ఇతడు వెంటనే వింటాడు. విషయాలన్నీ అర్థము చేసుకోగలడు. ''మధురాతి మధురమైన పిల్లలారా!'' అని తండ్రి పిలుస్తారు. మధురాతి మధురమైన అని అందరినీ పిలుస్తారు. ఎందుకంటే అందరూ పిల్లలే కదా! జీవాత్మలందరూ తండ్రికి అవినాశీ పిల్లలు. శరీరమైతే వినాశి, తండ్రి అవినాశి. పిల్లలైన ఆత్మలు కూడా అవినాశియే. తండ్రి పిల్లలతో సంభాషిస్తారు(వార్తాలాపము చేస్తారు). దీనిని ఆధ్యాత్మిక(ఆత్మిక) జ్ఞానమని అంటారు. పరమాత్మ వచ్చి కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. భలే ఆత్మలందరూ తమోప్రధానమైనప్పటికి తండ్రి ప్రేమ అందరి పై ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఆత్మలంతా సతోప్రధానంగా ఉండేవని తెలుసు. కల్ప-కల్పము నేను వచ్చి అందరికీ శాంతి మార్గమును తెలియజేస్తాను. వరమిచ్చే విషయమే లేదు. ''ధనవాన్ భవ, ఆయుష్మాన్ భవ'' అని అనరు. సత్యయుగములో మీరు ఇలా(లక్ష్మి నారాయణులు) ఉండేవారు. కానీ నేనేమీ ఆశీర్వాదాలు ఇవ్వను. దయ లేక ఆశీర్వాదాలు అడగరాదు. తండ్రి - తండ్రే కాక టీచరుగా కూడా అయ్యారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓహో! శివబాబా తండ్రి, టీచరు, జ్ఞానసాగరులు కూడా అని గుర్తుంచుకోవాలి. తండ్రియే వచ్చి కూర్చొని తమను గురించి, రచన ఆదిమధ్యాంతాల జ్ఞానము వినిపిస్తున్నారు. దీని ద్వారా మీరు చక్రవర్తి మహారాజులుగా అవుతారు. ఇదంతా ఆల్రౌండు చక్రము కదా. ఈ సమయము ప్రపంచమంతా రావణ రాజ్యములో ఉంది అని తండ్రి అర్థం చేయిస్తారు. రావణుడు కేవలం లంకలోనే కాదు, ఇదంతా అనంతమైన లంకయే. నలువైపులా నీరు ఉంది. లంక అంతా రావణ రాజ్యంగా ఉండేది. ఇప్పుడు మళ్లీ రామరాజ్యంగా అవుతుంది. లంక బంగారు లంకగా ఉండేది. అక్కడ బంగారు చాలా ఉంటుంది. ఒక ఉదాహరణ కూడా చెప్తారు - ధ్యానములోకి వెళ్లినప్పుడు అక్కడ ఒక బంగారు ఇటుకను చూచారని, మట్టి ఇటుక ఇక్కడెలా ఉంటుందో అలా అక్కడ బంగారు ఇటుక ఉంటుంది. అప్పుడు బంగారు ఇటుకను తీసుకెళ్లాలనే ఆలోచన వచ్చినట్లు చెప్తారు. ఈ విధంగా ఏవేవో నాటకాలు తయారుచేశారు. భారతదేశము ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇతర ఖండాలలో ఇన్ని వజ్ర వైడూర్యాలుండవు. నేను మార్గదర్శినై అందరినీ వాపస్ తీసుకెళ్తానని తండ్రి చెప్తున్నారు. పదండి పిల్లలారా! ఇప్పుడు ఇంటికి వెళ్లాలని చెప్తాను. ఆత్మలు పతితంగా ఉన్నాయి. పావనంగా అవ్వకుండా ఇంటికి వెళ్లలేరు. పతితులను పావనంగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. అందువలన అందరూ ఇక్కడే ఉన్నారు. వాపస్ ఎవ్వరూ వెళ్లలేరు. జోరుగా దేహాభిమానములోకి తీసుకొస్తుంది.'' తండ్రిని స్మృతి చేయనివ్వదు. మీరు హెచ్చరికగా ఉండాలి. దీని గురించే యుద్ధము జరుగుతుంది. కళ్ళు చాలా మోసము చేస్తాయి. ఈ కళ్ళను మీ అధీనములో ఉంచుకోవాలి. సోదర - సోదరీలకు కూడా మంచి దృష్టి లేదని గమనించారు. కావున ఇప్పుడు అందరూ సోదరులమేనని భావించండి అని అర్థం చేయిస్తున్నారు. మనమంతా సోదరులమని అందరూ చెప్తారు కానీ ఏమీ అర్థము చేసుకోరు. కప్పలాగా బెక - బెక అని అంటూ ఉంటారు. అర్థమేమీ చేసుకోరు. మీరిప్పుడు ప్రతి విషయమును యదార్థంగా అర్థము చేసుకున్నారు.
మీరు భక్తిమార్గములో కూడా ప్రేయసులుగా ఉండేవారు. ప్రియున్ని స్మృతి చేస్తూ ఉండేవారని తండ్రి కూడా మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తారు. దు:ఖములో ఉన్నప్పుడు వెంటనే అయ్యో రామా! హే భగవంతా! దయ చూపమని స్మృతి చేస్తారు. స్వర్గములో ఎప్పుడూ ఈ విధంగా అననే అనరు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. మిమ్ములను రామరాజ్యానికి తీసుకెళ్తారు కనుక వారి మతమును అనుసరించాలి. మీకిప్పుడు ఈశ్వరీయ మతము లబిస్తోంది. తర్వాత దైవీ మతము లభిస్తుంది. ఈ కళ్యాణకారీ సంగమయుగము గురించి ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే కలియుగము ఇంకా చిన్న బిడ్డగా ఉందని అందరికీ చెప్పడం జరిగింది. ఇంకా లక్షల సంవత్సరాలుందని అంటారు. ఇది భక్తి మార్గపు గాఢాంధకారమని తండ్రి తెలుపుతున్నారు. జ్ఞానము వెలుగు. డ్రామానుసారంగా భక్తి కూడా రచింపబడి ఉంది. ఇది మళ్లీ జరుగుతుంది. భగవంతుడు లభించిన తర్వాత ఇక వెతికే అవసరము లేదని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. మేము బాబా దగ్గరకు లేక బాప్దాదా వద్దకు వెళ్తున్నామని మీరు చెప్తారు. ఈ విషయాలను మానవులు అర్థము చేసుకోలేరు. మీలో కూడా పూర్తి నిశ్చయము లేనివారిని మాయ పూర్తిగా మింగేస్తుంది. ఏనుగును కూడా మొసలి పూర్తిగా మింగేసిందని అంటారు. ఆశ్చర్యంగా వింటూ ఉంటారు,......... పాతవారైతే వెళ్లిపోయారు. వారికి కూడా ''మంచి - మంచి మహారథులను సైతం మాయ ఓడించేస్తుంది'' అని గాయనముంది. బాబా! మీరు మీ మాయను పంపించకండి అని బాబాకు వ్రాస్తారు. అరే! ఇది నాది కాదు. రావణుడు తన రాజ్యపాలన చేస్తున్నాడు. నేను మన రాజ్యమును స్థాపన చేస్తున్నాను. ఇది పరంపరగా జరుగుతూ వస్తోంది. రావణుడే మీకు అందరికంటే పెద్ద శత్రువు. రావణుడు శత్రువని తెలుసు కాబట్టి అతడిని ప్రతి సంవత్సరము తగులబెడ్తారు. మైసూరులో అయితే దశరా పండుగను చాలా బాగా జరుపుతారు. అర్థమేమీ చేసుకోరు. మీకు శివశక్తి సైన్యమని పేరుంది. వారు వానర సైన్యమని పేరు పెట్టారు. మనము కోతి సమానంగా ఉండేవారమని ఇప్పుడు రావణుని జయించేందుకు శివబాబా ద్వారా శక్తిని తీసుకుంటున్నామని మీకు తెలుసు. తండ్రియే వచ్చి రాజయోగాన్ని నేరిస్తారు. దీని గురించి కథలను కూడా చాలా తయారు చేశారు. అమరకథ అని కూడా చెప్తారు. బాబా మనకు అమరకథను వినిపిస్తున్నారని మీకు తెలుసు. పోతే కొండల పైన ఏ కథా వినిపించరు. శంకరుడు పార్వతికి అమరకథను వినిపించారని అంటారు. శివ శంకరుల చిత్రమును కూడా ఉంచుతారు. ఇరువురిని కలిపేశారు. ఇదంతా భక్తిమార్గము. రోజురోజుకు అందరూ తమోప్రధానంగా అవుతూ ఉన్నారు. సతోప్రధానము నుండి సతోకు వస్తే రెండు కళలు తగ్గుతాయి. త్రేతాను కూడా వాస్తవానికి స్వర్గమని అనరు. పిల్లలైన మిమ్ములను స్వర్గవాసులుగా చేసేందుకు తండ్రి వస్తారు. బ్రాహ్మణ కులము మరియు సూర్యవంశము - చంద్రవంశీ కులాలు రెండూ స్థాపన అవుతూ ఉన్నాయని తండ్రికి తెలుసు. రామచంద్రునికి క్షత్రియుల గుర్తునిచ్చారు. మీరందరూ మాయ పైన విజయము పొందే క్షత్రియులు కదా. తక్కువ మార్కులతో పాసయ్యేవారిని చంద్రవంశీయులని అంటారు. అందువలన రామునికి బాణాలు మొదలైనవి ఇచ్చేశారు. త్రేతాయుగములో కూడా హింస ఉండదు. రాజూ రాముడే, ప్రజలూ రాముడే అని మహిమ కూడా ఉంది. కానీ ఈ క్షత్రియ గుర్తులను ఇచ్చేశారు. కనుక మనుష్యులు తికమకపడ్తారు. ఈ ఆయుధాలు మొదలైనవేవీ ఉండవు. శక్తులకు కూడా కత్తి మొదలైనవి చూపిస్తారు. అర్థమేమీ చేసుకోరు. తండ్రి జ్ఞానసాగరులు కనుక తండ్రియే ఆదిమధ్యాంత రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారని పిల్లలైన మీకిప్పుడు తెలిసింది. పిల్లల పై అనంతమైన తండ్రికి ఉన్నంత ప్రేమ హద్దు తండ్రికి ఉండదు. 21 జన్మల వరకు పిల్లలను సుఖవంతులుగా తయారు చేస్తారు కాబట్టి తండ్రి ప్రియమైనవారు కదా! తండ్రి ఎంతటి ప్రియమైనవారు! మీ దు:ఖమునంతా దూరము చేస్తారు. సుఖ వారసత్వము లభిస్తుంది. అక్కడ దు:ఖమునకు నామ-రూపాలు కూడా ఉండవు. ఇప్పుడిది బుద్ధిలో ఉండాలి కదా. ఇది మర్చిపోరాదు. ఎంత సహజమైనది, కేవలం మురళి చదివి వినిపించాలి. అయినా బ్రహ్మణి కావాలని, బ్రాహ్మణి లేకుండా ధారణ జరగదు అని అంటారు. అరే! సత్యనారాయణుని కథను చిన్న పిల్లలు కూడా గుర్తుంచుకొని వినిపిస్తారు. నేను మీకు ప్రతి రోజు కేవలం తండ్రిని స్మృతి చేయండి అని అర్థం చేయిస్తున్నాను. ఈ జ్ఞానమైతే 7 రోజులలో బుద్ధిలో కూర్చుండిపోవాలి. కానీ పిల్లలు మర్చిపోతారు. బాబా అయితే ఆశ్చర్యపడ్తారు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రితో ఆశీర్వాదాలు లేక కృపను వేడుకోరాదు. తండ్రి, టీచరు, గురువును స్మృతి చేసి తమ పై తామే కృప చూపుకోవాలి. మాయతో జాగ్రత్తగా ఉండాలి. కళ్ళు మోసము చేస్తాయి. వాటిని మీ అధికారములో ఉంచుకోవాలి.
2. వ్యర్థమైన విషయాలు, పరచింతన విషయాలు చాలా నష్టపరుస్తాయి. కావున వీలైనంత శాంతిగా ఉండాలి. నోటిలో మొహర్(నాణెము) వేసుకోవాలి. ఎప్పుడూ ఉల్టా-సుల్టాగా మాట్లాడరాదు. స్వయం అశాంతిగా అవ్వరాదు, ఇతరులెవ్వరినీ అశాంతిగా చెయ్యరాదు.
వరదానము :-
''అవినాశి ప్రాప్తుల ఆధారంతో సదా సంపన్నతను అనుభవం చేసే ప్రసన్నచిత్త్ భవ''
సంగమ యుగంలో పరమాత్మ నుండి డైరెక్టుగా అనేక ప్రాప్తులు లభిస్తాయి. వర్తమాన సమయానికి పోలుస్తే భవిష్య ప్రాప్తులు చాలా స్వల్పమైనవి. అందుకే మీ పాట ''పొందాల్సినదంతా పొందేశాను,..........'' ''బ్రాహ్మణుల ఖజానాలో ప్రాప్తించని వస్తువేదీ లేదు'' - ఇది ఈ సమయానికి గల మహిమయే. ఇవి అవినాశి ప్రాప్తులు. ఈ ప్రాప్తులతో సంపన్నంగా ఉంటే మీ నడవడిక(చలన్) మరియు మొఖము(చెహరా) ద్వారా సదా ప్రసన్నత అనే విశేషత కనిపిస్తుంది. ఏమి జరిగినా సర్వ ప్రాప్తి వంతులు తమ ప్రసన్నతను వదలలేరు.
స్లోగన్ :-
''పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి, ఏ ఆటంకము మిమ్ములను ఆపలేదు.''