05-04-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - పిల్లలందరి పై తండ్రికి ప్రేమ ఉంది కానీ ఎవరైతే తండ్రి సలహాను వెంటనే అంగీకరిస్తారో వారిలో ఆకర్షణ ఉంటుంది. గుణవంతులైన పిల్లలు తండ్రి ప్రేమను ఆకర్షిస్తారు.''
ప్రశ్న :-
తండ్రి ఏ ఒప్పందము(కాంట్రాక్ట్)ను తీసుకున్నారు ?
జవాబు :-
అందరినీ సుగంధ పుష్పాలు(గుల్గుల్)గా తయారుచేసి వాపస్ తీసుకెళ్ళే ఒప్పందము(కాంట్రాక్ట్రు) ఒక్క తండ్రిదే. తండ్రిలాంటి కాంట్రాక్టర్ ప్రపంచములో మరెవ్వరూ లేరు. సర్వులకు సద్గతినివ్వడానికి వారే వస్తారు. తండ్రి సర్వీసు లేకుండా ఉండలేరు. కావున పిల్లలు కూడా సర్వీసుకు ఋజువునివ్వాలి. వినీ విననట్లు ఉండిపోరాదు.
ఓంశాంతి.
ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థము చేయిస్తున్నారు - పిల్లలారా! స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. దీనిని ఒక్క తండ్రి తప్ప మరే ఇతర మనుష్యమాత్రులు ఎవ్వరికీ అర్థము చేయించలేరు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని మళ్లీ 5 వేల సంవత్సరముల తర్వాత మళ్లీ తండ్రే వచ్చి నేర్పిస్తారు. ఇది కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇది పురుషోత్తమ సంగమ యుగమని ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీరు మేము పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నామని స్మృతిలో ఉంచుకోవడము కూడా 'మన్మనాభవ'నే అయ్యింది. తండ్రి చెప్తున్నారు - 'నన్ను స్మృతి చేయండి' ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వాపస్ వెళ్ళాలి. 84 జన్మలు ఇప్పుడు పూర్తి అయినాయి. ఇప్పుడు సతోప్రధానంగా అయ్యి వాపస్ వెళ్ళాలి. కొందరు అసలు స్మృతే చేయరు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నవారిలో లేక వెలుపల ఉన్నవారిలో, తండ్రికి ప్రతి ఒక్కరి పురుషార్థము గురించి బాగా తెలుసు. భలే ఇక్కడ కూర్చుని చూస్తున్నా ఎవరైతే మధురాతి మధురమైన సేవాధారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని స్మృతి చేస్తాను, చూడడము కూడా వారినే చూస్తాను. వీరు ఎటువంటి పుప్పాలు, వీరిలో ఏ ఏ గుణాలున్నాయి? అని చూస్తాను. కొంతమంది ఒక్క గుణము కూడా లేనివారు ఉన్నారు. ఇటువంటివారిని చూసి తండ్రి ఏం చేస్తారు? తండ్రి ఆకర్షించుకునే(అయస్కాంతము వంటి) పవిత్రమైన ఆత్మ కనుక తప్పకుండా ఆకర్షిస్తారు. కానీ బాబా ఆంతరికంగా తెలుసుకునే ఉంటారు. బాబా తన పూర్తి లెక్కాచారాన్ని తెలియచేస్తున్నప్పుడు పిల్లలు కూడా తెలియచేయాలి. నేను మిమ్ములను విశ్వాధికారులుగా చేసేందుకు వచ్చాను. తర్వాత ఎవరు ఎంత పురుషార్థము చేస్తారో అంత పొందుతారని తండ్రి చెప్తారు. ఎవరు పురుషార్థము చేసినా, అది తెలియాలి కదా. అందరి కర్తవ్యాన్ని వ్రాసి పంపండి లేక వారితో వ్రాయించి పంపండని బాబా వ్రాస్తారు. ఎవరు చురుకైన బుద్ధివంతులైన బ్రాహ్మణీలుగా ఉంటారో వారు అంతా వ్రాయించి పంపుతారు. ఏమి కర్తవ్యము చేస్తారు? ఎంత సంపాదన ఉంది? తండ్రి తన సర్వస్వమూ తెలుపుతారు అంతేకాక సృష్టి ఆదిమధ్యాంతముల జ్ఞానము వినిపిస్తారు. అందరి స్థితిని గురించి తెలుసు. భిన్న భిన్న ప్రకారాలైన వెరైటీ పుష్పాలు కదా. (ఒక్కొక్క పుష్పాన్ని చూపిస్తూ) ఎటువంటి రాయల్ పుష్పాలో చూడండి. ఇప్పుడే ఇంత సువాసన ఉంది, మరి ఇక పూర్తి వికసించినప్పుడు ఎంత ఫస్టుక్లాసుగా శోభిస్తాయి. మీరు కూడా ఈ లక్ష్మీనారాయణుల వలె యోగ్యులుగా అయ్యి వెళ్తారు. అలాగని అందరికీ సర్చ్ లైట్ ఇస్తారని కాదు, తండ్రి కూడా చూస్తూ (గమనిస్తూ) ఉంటారు. ఎవరెలా ఉంటారో అలా ఆకర్షిస్తారు. ఏ గుణాలు లేనివారు ఏం ఆకర్షిస్తారు? అలాంటివారు అక్కడకు వెళ్ళి కనిష్ఠ పదవిని పొందుతారు. బాబా ప్రతి ఒక్కరి గుణాలను గమనిస్తారు, వారిని ప్రేమిస్తారు కూడా. ప్రీతితో కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఈ సేవాధారులు ఎంత సేవ చేస్తారు! వీరికి సేవ చేయకుంటే నెమ్మదే ఉండదు, సర్వీసు లేకుండా విశ్రాంతి లభించదు. కొందరికి సేవ చేయడమే తెలియదు. యోగములో కూర్చోరు, జ్ఞాన ధారణ ఉండదు. వీరేం పదవి పొందుతారని బాబా అనుకుంటారు. ఏదీ గుప్తముగా ఉండదు. మంచి బుద్ధివంతులైన పిల్లలు సేవాకేంద్రాన్ని సంభాళన చేస్తారు. వారు ఒక్కొక్కరి లెక్కాచారము పంపవలసి ఉంటుంది. దాని వలన పురుషార్థము ఎంతవరకు ఉందో బాబా తెలుసుకుంటారు. బాబా జ్ఞానసాగరులు, పిల్లలకు జ్ఞానమునిస్తారు. ఎవరు ఎంత జ్ఞానాన్ని తీసుకుంటారో, గుణవంతులౌతారో తక్షణమే తెలుస్తుంది. బాబా ప్రేమ అందరి పై ఉంది. అందుకే దీనికి సంబంధించిన ఒక పాట కూడా ఉంది - నీకు ముళ్ళ పై కూడా ప్రీతి ఉంది, పుష్పాల పై కూడా ప్రేమ ఉంది...... ( తేరే కాంటోం సే భీ ప్యార్, తేరే ఫూలో సే భీ ప్యార్,..........) నంబరువారుగా ఉండే ఉన్నారు. కనుక తండ్రి పై ఎంత ప్రేమ ఉండాలి! బాబా ఏమి చెప్తారో అది వెంటనే చేసి చూపిస్తే బాబా పై ప్రేమ ఉందని బాబా అర్థము చేసుకుంటారు. వారికి కూడా ఆకర్షణ కలుగుతుంది. తండ్రిలోని ఆకర్షణ ఎలాంటిదంటే ఒక్కసారిగా పట్టుకొనేస్తారు. కానీ ఎంతవరకు తుప్పు వదలదో అంతవరకు ఆకర్షణ కూడా ఉండదు. ఒక్కొక్కరిని చూస్తూ ఉంటాను.
బాబాకు సర్వీసెబుల్ (సేవాధారి) పిల్లలు కావాలి. తండ్రి సర్వీసు కొరకే వస్తారు. పతితులను పావనంగా చేస్తారు. ఇది మీకు తెలుసు కానీ ప్రపంచములోని వారికి తెలియదు. ఎందుకంటే మీరు ఇప్పుడు చాలా కొద్దిమందే ఉన్నారు. ఎంతవరకు యోగము ఉండదో అంతవరకు ఆకర్షణ ఉండదు. కొద్దిమందే ఆ శ్రమ చేస్తారు. ఏదో ఒక విషయములో చిక్కుకొని ఉంటారు. విన్నదానికంతా సత్యము - సత్యము అని అనేందుకు ఇది అలాంటి సత్సంగము కాదు. సర్వశాస్త్రమయి శిరోమణి ఒక్క గీతయే. గీతలోనే రాజయోగముంది. విశ్వాధికారి తండ్రి ఒక్కరు మాత్రమే. గీత ద్వారానే ప్రభావము వెలువడ్తుందని పిల్లలకు చెప్తూ ఉంటాను. కానీ అంత శక్తి కూడా ఉండాలి కదా. యోగబలపు పదును బాగుండాలి. అందులో చాలా బలహీనంగా ఉన్నారు. ఇప్పుడు కొద్ది సమయము మాత్రమే ఉంది. మిఠరా ఘుర త ఘురాయ్...... అంటే నన్ను ప్రీతిస్తే నేను కూడా ప్రీతి చేస్తాను. ఇది ఆత్మ ప్రీతి. ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. ఈ స్మృతి ద్వారానే వికర్మలు వినాశమౌతాయి. కొందరు అసలు స్మృతే చేయరు. తండ్రి అర్థము చేయిస్తున్నారు - ఇక్కడ భక్తి ప్రస్తావనే లేదు. ఇది బాబా రథము, ఇతని ద్వారా శివబాబా చదివిస్తారు. నా పాదాలు కడిగి త్రాగమని శివబాబా చెప్పరు. బాబా చేతితో కూడా ముట్టనివ్వరు. ఇది చదువు. స్పర్శించుట వలన ఏమౌతుంది? తండ్రి అయితే అందరికీ సద్గతినిచ్చేవారు. కోటిలో కొందరు మాత్రమే ఈ విషయాన్ని అర్థము చేసుకుంటారు. కల్పక్రితము వారు ఎవరుంటారో వారే అర్థము చేసుకుంటారు. భోళానాథ తండ్రి వచ్చి అమాయకులైన మాతలకు జ్ఞానాన్నిచ్చి ఉన్నతంగా చేస్తారు. బాబా సంపూర్ణంగా ముక్తి మరియు జీవన్ముక్తిలోకి ఎక్కిస్తారు. కేవలం వికారాలను మాత్రము వదలండని తండ్రి చెప్తున్నారు. ఈ విషయము పైనే గొడవలు జరుగుతాయి. నాలో ఏ ఏ అవగుణాలున్నాయని మీలో మీరు చూసుకోండని తండ్రి తెలిపిస్తున్నారు. వ్యాపారస్థులు ప్రతి రోజు తమ లాభ-నష్టాల ఖాతాను చూసుకుంటారు. మీరు కూడా మీ లెక్కాచారమును చూసుకోండి. ఎంత సమయము అతిప్రియమైన బాబాను, ఎవరైతే విశ్వాధికారిగా చేస్తారో వారిని స్మృతి చేసాను? తక్కువగా స్మృతి చేసి ఉంటే ఇటువంటి తండ్రిని ఇంతేనా స్మృతి చేసేదని మీకే సిగ్గవుతుంది. మన బాబా అందరికంటే అద్భుతమైనవారు. సమస్త సృష్టిలో స్వర్గము అతిఅద్భుతమైనది. వారు స్వర్గానికి లక్షల సంవత్సరాలని అనేస్తారు. మీరు 5 వేల సంవత్సరాలని అంటారు. ఎంత రాత్రి పగలుకు ఉన్నంత వ్యత్యాసముంది! ఎవరు చాలా పాత భక్తులో వారి పై బాబా బలిహారి అవుతారు. అతిభక్తి చేశారు కదా. బాబా ఈ జన్మలో కూడా గీతా పఠనము చేసేవారు, నారాయణుని చిత్రాన్ని కూడా జేబులో ఉంచుకునేవారు. లక్ష్మిని దాస్యత్వము నుండి ముక్తపరచగానే ఎంత ఆనందము కలిగింది! మనము ఈ శరీరాన్ని వదలి వెళ్ళి సత్యయుగములో మరొక శరీరమును తీసుకుంటాము. నేను వెళ్ళి సుందరమైన రాకుమారునిగా అవుతానని బాబాకు కూడా సంతోషము ఉంటుంది. పురుషార్థము కూడా చేయిస్తూ ఉంటారు. ఊరకే ఎలా అవుతారు. మీరు కూడా తండ్రిని బాగా స్మృతి చేస్తే స్వర్గ వారసత్వము పొందుతారు. కొందరు చదవరు, దైవీగుణాలను ధారణ కూడా చేయరు, లెక్కాచారమే ఉంచరు. శ్రేష్ఠంగా తయారయ్యే వారే లెక్కాచారాన్ని ఉంచుతారు లేకుంటే ఊరికే ఆర్భాటము చేస్తారు.15 - 20 రోజుల తర్వాత వ్రాయడం వదిలేస్తారు. ఇక్కడి పరీక్షలు మొదలైనవన్నీ గుప్తమైనవి. ప్రతి ఒక్కరి అర్హతలు తండ్రికి తెలుసు. బాబా ఆజ్ఞను తక్షణమే పాటిస్తే ఆజ్ఞాకారులని అంటారు. పిల్లలు ఇప్పుడు ఇంకా చాలా పని చేయాల్సి ఉందని బాబా చెప్తున్నారు. ఎంతో మంచి మంచి పిల్లలు కూడా విడాకులిచ్చి వెళ్ళిపోతారు. వీరెప్పుడూ ఎవ్వరికీ విడాకులివ్వరు. వీరు(శివబాబా) డ్రామానుసారము పెద్ద కాంట్రాక్టు తీసుకోవడానికే వచ్చారు. నేను అందరికంటే పెద్ద కంట్రాక్టర్ను. అందరినీ సుగంధ పుష్పాలుగా తయారు చేసి వాపస్ తీసుకెళ్తాను. పతితులను పావనంగా చేసే కాంట్రాక్టర్ వీరు ఒక్కరేనని పిల్లలైన మీకు తెలుసు. వారు మీ సన్ముఖములో కూర్చుని ఉన్నారు. కొందరికి పూర్తి నిశ్చయముంది. కొందరికి ఏమాత్రము నిశ్చయము లేదు. ఈ రోజు ఇక్కడుంటారు, రేపు మరెక్కడికో వెళ్ళిపోతారు. అటువంటి నడవడికలు కలిగి ఉంటారు. మేము బాబా వద్ద ఉండి, బాబావారిగా తయారై ఏం చేస్తున్నాము? అని ఆంతరికములో తప్పకుండా మనస్సు తింటూ ఉంటుంది. సర్వీసు చేయకుంటే ఏం లభిస్తుంది? రొట్టెలు కాల్చడము, సబ్జీ (తాళింపు) చేయడం...... ఇవి ముందు కూడా చేసేవారు కదా. క్రొత్త మాటేం చేశారు? సర్వీసుకు ఋజువునివ్వాలి. ఎంతమందికి మార్గమును చూపించారు?
ఆ డ్రామా చాలా అద్భుతంగా తయారు చేయబడింది. ఏమేమి జరుగుతోందో మీరు ప్రాక్టికల్గా చూస్తున్నారు. శాస్త్రాలలో కృష్ణుని చరిత్రను వ్రాసేశారు. కానీ చరిత్ర ఒక్క తండ్రిది మాత్రమే ఉంది. వారే అందరికి సద్గతినిస్తారు. వీరి వంటి చరిత్ర మరెవ్వరికీ ఉండదు. చరిత్ర అంటే మంచిదిగా ఉండాలి కదా. అంతేకాని ఎత్తుకొని పోవడము, దొంగలించడము...... ఇదేమీ చరిత్ర కాదు. సర్వులకు సద్గతినిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారు కల్ప-కల్పము వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు. లక్షల సంవత్సరాల మాటే లేదు.
కావున పిల్లలు చెడు(ఛీ-ఛీ) అలవాట్లను వదిలేయాలి లేకుంటే ఏ పదవి లభిస్తుంది? ప్రియుడు కూడా గుణాలను చూసి ప్రేమిస్తాడు కదా. ఎవరైతే వారి సర్వీసులో తత్పరులై ఉంటారో వారిని ప్రేమిస్తారు. సర్వీసు చేయనివారు దేనికి పనికి వస్తారు? ఇవి చాలా అర్థము చేసుకోవలసిన విషయాలు. తండ్రి అర్థము చేయిస్తున్నారు - మీరు మహాన్ భాగ్యశాలురు. మీ వంటి భాగ్యశాలురు మరెవ్వరూ లేరు. భలే మీరు స్వర్గములోకి వెళ్తారు కానీ శ్రేష్ఠ ప్రాలబ్ధమును తయారు చేసుకోవాలి. ఇది కల్ప-కల్పాంతరముల విషయము. పదవి తగ్గిపోతుంది. ఎంత దొరికితే అంత చాలు అని సంతోషపడిపోరాదు. పురుషార్థము చాలా బాగా చేయాలి. ఎంతమందిని తమ సమానముగా చేసినామో ఋజువు చూపించాలి. మీ ప్రజలు ఎక్కడ? తండ్రి, టీచరు సర్వుల ద్వారా పురుషార్థము చేయిస్తారు. కానీ వారి అదృష్టములో కూడా ఉండాలి కదా. తండ్రి తన శాంతిధామాన్ని వదిలి పతిత ప్రపంచములో, పతిత శరీరములో రావడమే సర్వోన్నతమైన ఆశీర్వాదము, లేకుంటే మీకు రచయిత-రచనల జ్ఞానము ఎవరు వినిపిస్తారు? సత్యయుగములో రామరాజ్యము మరియు కలియుగములో రావణ రాజ్యముంటుందని కూడా ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. రామరాజ్యములో ఒకే రాజ్యముండేది, రావణ రాజ్యములో అనేక రాజ్యాలున్నాయి. అందుకే మీరు నరకవాసులా లేక స్వర్గవాసులా? అని అడుగుతారు. కానీ మనుష్యులు తాము ఎక్కడ ఉన్నారో తెలుసుకోరు. ఇది ముళ్ళ అడవి, అది పూలతోట. కావున ఇప్పుడు తల్లి-తండ్రి మరియు అనన్య పిల్లలను అనుసరిస్తేనే శ్రేష్ఠమౌతారు. తండ్రి చాలానే అర్థము చేయిచేస్తారు. కానీ అర్థము చేసుకునేవారే అర్థము చేసుకుంటారు. కొందరు విని బాగా విచార సాగర మథనము చేస్తారు. కొందరు విని విననట్లు ఉండిపోతారు. శివబాబా స్మృతి ఉందా? అని అన్ని చోట్లా వ్రాసి ఉండాలి. అప్పుడు తప్పకుండా వారసత్వము కూడా స్మృతి వస్తుంది. దైవీ గుణాలుంటేనే దేవతలౌతారు. ఒకవేళ క్రోధముంటే, ఆసురీ అవగుణాలుంటే శ్రేష్ఠ పదవిని పొందలేరు. అక్కడ ఏ భూతాలూ ఉండవు. రావణుడే లేకుంటే రావణుని భూతాలు ఎక్కడ నుండి వస్తాయి. దేహాభిమానము, కామ క్రోధములు,..... ఇవి పెద్ద భూతాలు. వీటిని తొలగించే ఉపాయము ఒక్కటే. ''తండ్రి స్మృతి'' తండ్రి స్మృతి ద్వారానే అన్ని భూతాలు పారిపోతాయి. అచ్ఛా!
రాత్రి క్లాసు :- మేము కూడా అనేమందిని మా సమానంగా చేసే సేవ చేయాలని చాలామంది పిల్లలకు అనిపిస్తుంది. మన ప్రజలను తయారు చేసుకోవాలి. మన ఇతర సోదరులు ఎలా సేవ చేస్తున్నారో అలా మేము కూడా చేయాలి అని అనుకుంటారు. మాతలు చాలామంది ఉన్నారు. కలశము కూడా మాతల పైనే ఉంచారు కానీ ఇది ప్రవృత్తి మార్గము. ఇరువురూ కావాలి కదా. ఎంతమంది పిల్లలున్నారని బాబా అడుగుతారు. సరిగ్గా సమాధానమిస్తారా! అని గమనిస్తారు. మాకు 5 మంది అంతేకాక శివబాబా కూడా ఒక్కరు అని చెప్తారు. కొందరు నామమాత్రంగా చెప్తారు. కొందరు సత్యంగానే కొడుకుగా చేసుకుంటారు. ఎవరైతే వారసునిగా చేసుకుంటారో వారు విజయమాలలో కూర్చబడ్తారు. ఎవరైతే సత్య సత్యమైన వారసునిగా చేసుకుంటారో, స్వయంగా వారు కూడా వారసులుగా అవుతారు. సత్యమైన హృదయము పై ప్రభువు రాజీ అవుతారు...... మిగిలిన వారంతా చెప్పడానికి మాత్రమే చెప్తారు. ఈ సమయములో పారలౌకిక తండ్రే అందరికీ వారసత్వమునిస్తారు. కావున ఎవరి నుండి 21 జన్మలకు వారసత్వము లభిస్తుందో వారినే స్మృతి చేయాలి. ఇవేమీ మిగలవనే జ్ఞానము బుద్ధిలో ఉంది. తండ్రి ప్రతి ఒక్కరి స్థితిని చూస్తారు - '' వీరు సత్యంగా వారసునిగా చేసుకున్నారా లేక చేసుకునే ఆలోచనలు చేస్తున్నారా? '' వారసునిగా చేసుకోవడం అనగా అర్థమేమో తెలుసు. మాయకు వశమై ఉన్నందువలన చాలామంది వారసునిగా చేసుకోవాలనుకున్నా చేసుకోలేరు. ఒకటి ఈశ్వరునికైనా వశమై ఉండాలి లేక మాయకైనా వశమై ఉండాలి. ఎవరైతే ఈశ్వరునికి వశమై ఉన్నారో వారు వారసునిగా తయారు చేయు బాబాను వారసునిగా చేసుకుంటారు. అష్టరత్నాల మాల కూడా ఉంటుంది,108 రత్నాల మాల కూడా ఉంటుంది. అష్టరత్నాలు తప్పకుండా అద్భుతాలు చేసేవారిగా ఉంటారు. తప్పకుండా వారసునిగా చేసుకునే తీరుతారు. భలే వారసులుగా కూడా తయారు చేస్తారు, అస్తినైతే తప్పకుండా తీసుకుంటారు. అటువంటి ఉన్నతమైన వారసులను తయారు చేసుకునే వారి కర్మలు కూడా అదే విధంగా శ్రేష్ఠంగా ఉంటాయి. ఎటువంటి వికర్మలు జరగరాదు. వికారాలతో కూడినవన్నీ వికర్మలే కదా. తండ్రిని వదిలి ఇతరులనెవ్వరినీ స్మృతి చేసినా అది కూడా వికర్మే కదా. తండ్రి అంటే తండ్రే. తండ్రి ఈ నోటితో చెప్తున్నారు - నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఆదేశము లభించింది కదా. కావున వారొక్కరినే స్మృతి చేయాలి. ఇందులోనే చాలా శ్రమ ఉంది. ఒక్క తండ్రినే స్మృతి చేస్తే మాయ అంతగా సతాయించదు. పోతే మాయ కూడా చాలా శక్తిశాలి. మాయ చాలా పెద్ద వికర్మలు చేయిస్తుందని కూడా అర్థమౌతుంది. గొప్ప గొప్ప మహారథులను కూడా క్రింద పడేసి అధోగతి పట్టిస్తుంది. రోజురోజుకు సేవాకేంద్రాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. గీతాపాఠశాల లేక మ్యూజియమ్లు కూడా తెరవబడుతూ ఉంటాయి. పూర్తి ప్రపంచములోని మనుష్యులు తండ్రిని కూడా అంగీకరిస్తారు. బ్రహ్మను కూడా అంగీకరిస్తారు. బ్రహ్మనే ప్రజాపిత అని అంటారు. ఆత్మలను ప్రజలని అనరు. మనుష్య సృష్టిని ఎవరు రచిస్తారు? ప్రజాపిత బ్రహ్మ అంటున్నారంటే వారు సాకారులు. వీరు(శివుడు) నిరాకారులు. వారు అనాది, వీరు కూడా అనాదే అని అంటారు. ఇద్దరి పేర్లు కూడా అత్యున్నతమైనవి. వారు ఆత్మిక తండ్రి, వారు ప్రజాపిత. ఇరువురూ కూర్చుని మిమ్ములను చదివిస్తున్నారు. ఎంత శ్రేష్ఠమైనవారు కదా. పిల్లలకు ఎంత నషా ఉండాలి. ఖుషీ ఎంత ఉండాలి! కానీ మాయ ఖుషీగా లేక నషాలో ఉండనివ్వదు. విద్యార్థులు ఇటువంటి విచార సాగర మథనము చేస్తూ ఉంటే సర్వీసు కూడా చేయగలరు. ఖుషీ కూడా ఉంటుంది. అయితే బహుశా ఇంకా సమయముందని అనుకుంటారు. కర్మాతీత స్థితిని పొందుకుంటే ఖుషీ కూడా ఉంటుంది. అచ్ఛా! (మంచిది!)
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ప్రతిరోజు రాత్రి అతిమధురమైన బాబాను మొత్తం రోజులో ఎంతసేపు స్మృతి చేశాను? అని లెక్కాచారము చూసుకోవాలి. స్వయాన్ని చూపించుకునేందుకు(ప్రత్యక్షము చేసుకునేందుకు) లెక్కాచారము ఉంచుకోరాదు, గుప్త పురుషార్థము చేయాలి.
2. తండ్రి ఏదైతే వినిపిస్తారో దాని పై విచార సాగర మథనం చేయాలి. సేవ చేసినందుకు ఋజువునివ్వాలి. విని విననట్లు ఉండరాదు. లోపల ఏదెనా ఆసురీ అవగుణముంటే పరిశీలించుకొని (చెక్ చేసుకొని) దానిని తొలగించుకోవాలి.
వరదానము :-
'' స్వార్థము, ఈర్ష్య, చిరుబురులాడుట(చిడ్చిడాపన్) నుండి ముక్తముగా ఉండు క్రోధముక్త్ భవ ''
భలే మీరు ఏ విచారమును(సలహాను) ఇచ్చినా, సేవ కొరకు స్వయాన్ని ఆఫర్ చేయండి(మీ అంతకు మీరే ముందుకు వెళ్లండి). కానీ మీ విచారాన్ని కోరిక రూపంలోకి పరివర్తన చేయకండి. ఎప్పుడైతే సంకల్పము కోరిక రూపంలోకి మారుతుందో అప్పుడు చిడచిడాపన్(కోపము) వచ్చేస్తుంది. కానీ నిస్వార్థంగా ఉండి మీ సలహాను, విచారాన్ని ఇవ్వండి. స్వార్థము ఉంచుకోకండి. నేను చెప్పిందే జరగాలి అనుకోకండి. సేవ చేసేందుకు స్వయాన్ని ఆఫర్ చేయాలి. ఎందుకు, ఏమి అని ప్రశ్నలలోకి రాకండి. అలా ప్రశ్నలలోకి వస్తే ఈర్ష్య, అసహ్యము మొదలైన వాటి స్నేహితులన్నీ ఒక్కొక్కటి వచ్చేస్తాయి. స్వార్థము లేక ఈర్ష్య కారణంగా కూడా కోపము ఉత్పన్నమౌతుంది. ఇప్పుడు దీని నుండి కూడా ముక్తులుగా అవ్వండి.
స్లోగన్ :-
''శాంతి దూతలుగా అయ్యి అందరికీ శాంతినివ్వడమే మీ కర్తవ్యము''