04-04-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - ఇది మొదలే తయారైన నాటకము, ఈ నాటకము నుండి ఒక్క ఆత్మ కూడా తప్పించుకోలేదు, ఎవ్వరికీ మోక్షము లభించజాలదు. ''
ప్రశ్న :-
శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన పతితపావనుడైన తండ్రి భోలానాథుడు, ఎలా?
జవాబు :-
పిల్లలైన మీరు వారికి పిడికెడు అటుకులు ఇచ్చి మహళ్ళను తీసుకుంటారు, అందుకే తండ్రిని భోళానాథుడని అంటారు. శివబాబా మా కొడుకు అని అంటారు. అతడు ఎలాంటి పుత్రుడంటే ఎప్పుడూ ఏమీ తీసుకోడు, సదా ఇస్తూనే ఉంటాడు అని మీరు చెప్తారు. ఎవరెలాంటి కర్మ చేస్తారో, అలాంటి ఫలమును పొందుతారని భక్తిమార్గములో చెప్తారు. కానీ భక్తిలో అయితే ఫలము అల్పకాలానికి లభిస్తుంది. జ్ఞానములో వివేకయుక్తంగా చేస్తారు కనుక సదా కాలానికి లభిస్తుంది.
ఓంశాంతి.
ఆత్మిక పిల్లలతో ఆత్మిక తండ్రి ఆత్మిక సంభాషణ చేస్తున్నారు లేక ఆత్మిక తండ్రి పిల్లలకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని కూడా అంటారు. అనంతమైన తండ్రి వద్దకు రాజయోగాన్ని నేర్చుకునేందుకు మీరు వచ్చారు. కనుక బుద్ధి తండ్రి వైపుకు వెళ్ళిపోవాలి. ఇది ఆత్మల కొరకు పరమాత్ముడు ఇస్తున్న జ్ఞానము, సాలిగ్రామాల కొరకు భగవానువాచ. ఆత్మలే వినవలసి వస్తుంది. కనుక ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఇంతకుముందు మీరు దేహాభిమానులుగా ఉండేవారు. ఈ పురుషోత్తమ సంగమ యుగములోనే తండ్రి వచ్చి పిల్లలైన మిమ్ములను ఆత్మాభిమానులుగా చేస్తారు. ఆత్మాభిమానులకు మరియు దేహాభిమానులకు గల వ్యత్యాసమును మీరు అర్థము చేసుకున్నారు. ఆత్మనే శరీరము ద్వారా పాత్రను అభినయము చేస్తుందని తండ్రియే అర్థము చేయించారు. చదివేది ఆత్మ శరీరము కాదు. కాని దేహాభిమానములో ఉన్న కారణంగా ఫలానవారు(దేహధారి) చదివిస్తున్నారని భావిస్తారు. పిల్లలైన మిమ్ములను చదివించేవారు నిరాకారులు, వారి పేరు శివ. శివబాబాకు తమ శరీరము ఉండదు. మిగిలినవారంతా నా శరీరము అని అంటారు. ఇది ఎవరన్నారు? ఆత్మనే ఇది నా శరీరము అని చెప్తుంది. మిగిలినవన్నీ శారీరిక విద్యలు. అందులో అనేక రకాలైన సబ్జెక్టులుంటాయి. బి.ఎ. మొదలైన పేర్లు చాలా ఉన్నాయి. ఇందులో ఒకే ఒక్క పేరుంది, చదువు కూడా ఒక్కరే చదివిస్తారు. ఒక్క తండ్రియే వచ్చి చదివిస్తారు. కనుక ఆ తండ్రినే స్మృతి చేయవలసి ఉంటుంది. మనలను అనంతమైన తండ్రి చదివిస్తున్నారు. వారి పేరేమిటి? వారి పేరు శివ. నామ-రూపాలకు భిన్నమైనవారు కాదు. మనుష్యుల పేరు శరీరమునకు ఉంటుంది. ఈ శరీరము ఫలానావారిది అని అంటారు. శివబాబా పేరు అలాంటిది కాదు. మనుష్యుల పేరు శరీరానికి ఉంటుంది. నిరాకార తండ్రి ఒక్కరే. వారి పేరు శివ. చదివించేందుకు వచ్చినప్పుడు కూడా వారి పేరు శివుడే. ఈ శరీరము వారిది కాదు, భగవంతుడు ఒక్కరే,10-12 మంది ఉండరు. వారు ఒక్కరే. మనుష్యులు వారిని 24 అవతారాలుగా చెప్తారు. నన్ను చాలా భ్రమింపజేశారు. పరమాత్మ రాళ్ళు - రప్పలు మొదలైన వాటన్నింటిలో ఉన్నాడని అనేశారు. స్వయం భక్తిమార్గములో ఎలా తిరుగుతూ ఉంటారో అలా నన్ను కూడా తిప్పారు. డ్రామానుసారము వారు మాట్లాడే విధానము ఎంత శీతలంగా ఉంది. నాకు అందరూ ఎంత అపకారము చేశారో, నన్ను ఎంతగా గ్లాని చేశారో అని తండ్రి అర్థము చేయిస్తారు. మేము నిష్కామ సేవ చేస్తామని మనుష్యులు అంటారు. నేను తప్ప వేరెవ్వరూ నిష్కామ సేవ చేయలేరని తండ్రి అంటారు. ఎవరు చేస్తారో వారికి తప్పకుండా ఫలము లభిస్తుంది. ఇప్పుడు మీకు ఫలము లభిస్తూ ఉంది. భక్తికి ఫలము భగవంతుడిస్తాడనే గాయనముంది ఎందుకంటే భగవంతుడు జ్ఞానసాగరుడు. భక్తిలో అర్ధకల్పము మీరు కర్మకాండ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ జ్ఞానము చదువు. ఒక్కసారి మాత్రమే తండ్రి ద్వారా ఈ చదువు లభిస్తుంది. తండ్రి పురుషోత్తమ సంగమ యుగములో ఒక్కసారి మాత్రమే వచ్చి మిమ్ములను పురుషోత్తములుగా తయారు చేసి వెళ్తారు, ఇది జ్ఞానము, అది భక్తి. అర్ధకల్పము మీరు భక్తి చేశారు, ఇప్పుడు ఎవరైతే భక్తి చేయరో వారికి ఇక్కడకు వచ్చిన తర్వాత భక్తి చేయలేదు కనుకనే ఫలానావారు మరణించారు, అనారోగ్యము పాలయ్యారు అన్న సందేహము(భ్రమ) కలుగుతుంది. కానీ అలా జరగదు.
తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, మీరు వచ్చి పతితులను పావనంగా తయారు చేసి అందరికీ సద్గతినివ్వండని నన్ను పిలుస్తూ వచ్చారు. ఇప్పుడు నేను వచ్చాను. భక్తి వేరు, జ్ఞానము వేరు. భక్తి ద్వారా అర్ధకల్పము రాత్రి ఉంటుంది, జ్ఞానము ద్వారా అర్ధకల్పము పగలు ఉంటుంది. రామరాజ్యము మరియు రావణ రాజ్యము రెండూ అనంతమైనవే. రెండింటి సమయము సమానమే. ఈ సమయములో భోగులైన కారణంగా ప్రపంచ జనాభా ఎక్కువగా వృద్ధి అవుతుంది. ఆయువు కూడా తగ్గిపోతుంది. ఎక్కువ వృద్ధి జరగరాదని ఎన్నో ఏర్పాట్లు రచిస్తారు. ఇంత పెద్ద ప్రపంచాన్ని తగ్గించడము తండ్రి కర్తవ్యము మాత్రమేనని మీకు తెలుసు. తండ్రి వచ్చిందే తగ్గించేందుకు. బాబా, మీరు వచ్చి అధర్మాన్ని వినాశనము చేయండి అనగా సృష్టిని తగ్గించండి అని పిలుస్తారు కూడా. తండ్రి ఎంతగా తగ్గిస్తారో ప్రపంచము వారికి తెలియదు. కొద్దిమంది మనుష్యులు మాత్రమే మిగిలిపోతారు. మిగిలిన ఆత్మలన్నీ తమ ఇంటికి వెళ్ళిపోతాయి. మళ్లీ నెంబరువారుగా పాత్ర చేసేందుకు వస్తాయి. నాటకములో పాత్ర ఎంత ఆలస్యంగా ఉంటుందో వారు ఇంటి నుండి కూడా అంత ఆలస్యంగా వస్తారు. తమ కర్తవ్యాలు మొదలైనవి పూర్తి చేసుకుని తర్వాత వస్తారు. నాటకములో పాత్ర చేసేవారు కూడా తమ కర్తవ్యాలను చేస్తారు. మళ్లీ సమయానుసారముగా పాత్ర చేసేందుకు నాటములోకి వస్తారు. మీరు కూడా అలాగే. ఎవరి పాత్ర చివర్లో ఉంటుందో వారు చివర్లోనే వస్తారు. ఎవరు మొట్టమొదటి ప్రారంభపు పాత్రధారులుగా ఉంటారో వారు సత్యయుగం ఆదిలో వస్తారు. చివర్లో వచ్చేవారు ఇంకా ఇప్పుడు కూడా వస్తున్నారు. కొమ్మ-రెమ్మలు చివరి వరకు వస్తూనే ఉంటాయి.
ఈ సమయంలో పిల్లలైన మీకు జ్ఞాన విషయాలు అర్థము చేయించబడ్తాయి. ఉదయము మీరు స్మృతిలో కూర్చుంటారు. అది డ్రిల్లు(వ్యాయామము). ఆత్మ తన తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. యోగమనే మాటను వదిలేయండి. ఇందులో తికమకపడ్తారు. నాకు యోగము కుదరడం లేదు అని అంటారు. అరే! మీరు తండ్రిని స్మృతి చేయలేరా! ఇదేమైనా బాగుందా! స్మృతి చేయకుంటే పావనంగా ఎలా అవుతారు? అని తండ్రి అంటున్నారు. తండ్రి పతితపావనులు. ఆ తండ్రే వచ్చి డ్రామా ఆదిమధ్యాంతాల రహస్యమును అర్థము చేయిస్తున్నారు. ఇది వెరైటీ ధర్మాల మరియు వెరైటీ మనుష్యుల వృక్షము. పూర్తి సృష్టిలో ఉన్న మనుష్యులందరూ పాత్రధారులే. ఎంతమంది మనుష్యులున్నారు? ఒక సంవత్సరములో ఎన్ని కోట్లమంది జన్మించారని లెక్క తీస్తారు. మరి అంత స్థలము ఎక్కడుంది? అందుకే తండ్రి చెప్తున్నారు - నేను జనాభాను పరిమితము చేసేందుకే వస్తాను. ఇప్పుడు ఆత్మలందరూ పై నుండి వచ్చేస్తారు. మన ఇల్లు ఖాళీ అయిపోతుంది, మిగిలినవారు కూడా వచ్చేస్తారు. వృక్షము ఎప్పుడూ ఎండిపోదు, కొనసాగుతూనే ఉంటుంది. చివర్లో ఎప్పుడైతే అక్కడ ఎవ్వరూ ఉండరో, అప్పుడు అందరూ వాపస్ అక్కడకు వెళ్తారు. క్రొత్త ప్రపంచములో ఎంత కొద్దిమంది ఉండేవారు! ఇప్పుడు ఎంత ఎక్కువమంది అయ్యారు! శరీరములైతే అందరివీ మారిపోతూ ఉంటాయి. కల్ప-కల్పము ఎవరు జన్మ తీసుకున్నారో మళ్లీ వారే జన్మ తీసుకుంటారు. ఈ వరల్డ్ డ్రామా ఎలా నడుస్తుందో తండ్రి తప్ప వేరెవ్వరూ అర్థము చేయించలేరు. పిల్లలు కూడా నెంబరువారు పురుషార్థానుసారము అర్థము చేసుకుంటారు. ఈ అనంతమైన నాటము ఎంత పెద్దది! అర్థము చేసుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అనంతమైన తండ్రి జ్ఞానసాగరులు. మిగిలినవారంతా పరిమిత జ్ఞానం గలవారే. వేదశాస్త్రాలు మొదలైనవి కొన్నిటిని తయారు చేస్తారు. అవి ఎక్కువగా ఏమీ తయారు కావు. కానీ మీరు ప్రారంభము నుండి వ్రాస్తూ వచ్చినట్లయితే ఎంత పొడవైన, పెద్ద గీతగా తయారౌతుంది! అన్నీ ముద్రింపబడుతూ ఉన్నట్లయితే అది ఇంటికన్నా పెద్ద గీతగా తయారౌతుంది. అందుకే సాగరాన్ని సిరాగా చేసుకున్నా వ్రాయలేరని,........ గొప్పగా మహిమ చేస్తారు. మరలా మరొకవైపు పిచుకలు సాగరాన్ని మింగేశాయని కూడా అంటారు. ఆ పిచుకలు మీరే. పూర్తి జ్ఞాన సాగరాన్ని మింగేస్తున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. మీకు జ్ఞానము లభించినది. జ్ఞానము ద్వారా మీరు సర్వమూ తెలుసుకున్నారు. కల్ప-కల్పము మీరిక్కడ చదువును చదువుతారు. అందులో కొద్దిగా కూడా హెచ్చు-తక్కువలు కాజాలదు. ఎవరెంత పురుషార్థము చేస్తారో వారికంత ప్రాలబ్ధము తయారౌతుంది. '' మేము ఎంత పురుషార్థము చేసి ఎంత పదవిని పొందేందుకు యోగ్యులుగా అవుతాము '' అని ప్రతి ఒక్కరూ అర్థము చేసుకోగలరు. స్కూలులో కూడా నెంబరువారుగా పరీక్ష పాసౌతారు. సూర్య వంశీయులు, చంద్ర వంశీయులు ఇరువురూ తయారవుతారు. ఎవరైతే ఫెయిల్ అయిపోతారో వారు చంద్ర వంశీయులుగా అవుతారు. రామునికి బాణాలు ఎందుకు చూపించారో ఎవ్వరికీ తెలియదు. మారణహోమం జరిగే చరిత్రను తయారుచేశారు. ఈ సమయములో అంతా మారణహోమమే ఉంది. ఎవరెలాంటి కర్మ చేస్తారో వారికి అలాంటి ఫలము లభిస్తుందని మీకు తెలుసు. ఎవరైనా ఆసుపత్రి కట్టించినట్లయితే మరుసటి జన్మలో వారికి దీర్ఘాయువు మరియు మంచి ఆరోగ్యము ఉంటుంది. ఎవరైనా ధర్మశాలలు, పాఠశాలలు కట్టించినట్లయితే వారికి అర్ధకల్పములో సుఖము లభిస్తుంది. పిల్లలిక్కడికి వచ్చినప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? అని బాబా అడుగుతారు. ముగ్గురు లౌకిక పిల్లలు, ఒక్క శివబాబా అని అంటారు ఎందుకంటే వారు వారసత్వమునిస్తారు, తీసుకుంటారు కూడా. లెక్క ఉంది. వారు తీసుకునేది ఏమీ లేదు. వారు దాత. పిడికెడు అటుకులనిచ్చి మీరు వారి నుండి మహళ్ళను తీసుకుంటారు. కనుకనే వారు భోలానాథుడు. పతితపావనులు, జ్ఞానసాగరులు. ఈ భక్తి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి సారమును అర్థము చేయిస్తున్నానని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. భక్తికి ఫలము(జ్ఞానము) అర్ధకల్పము ఉంటుంది. ఇక్కడ సుఖము కాకిరెట్టకు సమానమని సన్యాసులంటారు. అందుకే వారు ఇల్లు-వాకిళ్ళు వదిలి అడవికి వెళ్ళిపోతారు. మళ్లీ నరకానికి తెచ్చే స్వర్గ సుఖము మాకు అవసరము లేదని, మాకు మోక్షము కావాలని అంటారు. కానీ ఇది అనంతమైన నాటకమని గుర్తుంచుకోండి. ఒక్క ఆత్మ కూడా ఈ నాటకము నుండి తప్పించుకోలేదు. ఇది తయారైన నాటకము. అందుకే తయారైనదే మళ్లీ తయారు చేయబడుతూ ఉంది,.......... అని గానము చేస్తారు. కానీ భక్తిమార్గములో చింత చేయవలసి ఉంటుంది. ఏది గడచిపోయిందో అది మళ్లీ జరుగుతుంది. 84 జన్మల చక్రములో మీరు తిరుగుతారు. ఇది ఎప్పుడూ ఆగిపోదు. ఇది రచింపబడింది. ఇందులో మీరు మీ పురుషార్థాన్ని ఎలా ఎగురగొట్టగలరు? మీరు అలా అన్నంత మాత్రాన మీరు డ్రామా నుండి తొలగిపోలేరు. మోక్షమును పొందడం, జ్యోతిలో జ్యోతి లీనమవ్వడం, బ్రహ్మ తత్వములో లీనమవ్వడం ఇవన్నీ ఒక్కటే. అనేక మతాలు, అనేక ధర్మాలు ఉన్నాయి. భగవంతుడా! మీ లీలలు(గతి మతి) మీకే తెలియాలని అంటారు. మీ శ్రీమతము ద్వారా సద్గతి లభిస్తుంది. అది కూడా మీకే తెలుసు. మీరు వచ్చినప్పుడు తెలుసుకునేది మేమే, పావనంగా అయ్యేది కూడా మేమే. చదువుకుంటేనే సద్గతి లుగుతుంది. ఎప్పుడు సద్గతి కలుగుతుందో అప్పుడు ఎవ్వరూ పిలవరు. ఈ సమయములో అందరి పైన దు:ఖపు పర్వతాలు విరిగిపడనున్నవి. అనవసర రక్తపాతపు ఆటను చూపిస్తారు, గోవర్థన పర్వతాన్ని కూడా చూపిస్తారు. వ్రేలుతో పర్వతాన్ని ఎత్తుటకు అర్థము మీకు తెలుసు. కొద్దిమంది పిల్లలైన మీరు ఈ దు:ఖపు పర్వతాన్ని తొలగిస్తారు. దు:ఖమును కూడా సహిస్తారు.
వశీకరణ మంత్రమును మీరు అందరికీ ఇవ్వాలి. తులసీదాసు చందనాన్ని అరగదీసారు అని..... (తులసీదాస్ చందన్ ఘిసే.....) అంటారు. మీ మీ శ్రమ ద్వారా మీకు రాజ్యతిలకము లభిస్తుంది. మీరు రాజ్యము కొరకు చదువుతున్నారు. ఏ రాజయోగము ద్వారా రాజ్యము లభిస్తుందో దానిని చదివించేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు మీరు ఇంటిలో కూర్చుని ఉన్నారు. ఇది దర్బారు కాదు. ఎక్కడైతే రాజులు, మహారాజులు కలుస్తారో దానిని దర్బారు అని అంటారు. ఇది పాఠశాల. ఏ బ్రాహ్మణి కూడా వికారులను తీసుకొని రాకూడదని అర్థము చేయించబడ్తుంది. పతితులు వాయుమండలాన్ని పాడు చేస్తారు. కనుక వారికి అనుమతి ఇవ్వరు. ఎప్పుడు పవిత్రంగా అవుతారో అప్పుడు అనుమతి ఇవ్వబడ్తుంది. ఇప్పుడైతే కొందరిని అనుమతించవలసి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుండి వెళ్ళి పతితులుగా అయ్యారంటే ధారణ జరగదు. ఇది తమను తామే శపించుకోవడం. వికారము రావణుని మతము. రాముని మతమును వదిలి రావణుని మతము ద్వారా వికారులుగా అయ్యి రాళ్ళుగా అవుతారు. ఇలా గరుడ పురాణములో చాలా భయము కలిగించే రుచించే విషయాలను వ్రాసేశారు. మనుష్యులు మనుష్యులుగానే అవుతారు. జంతువులు మొదలైన వాటిగా అవ్వరు అని తండ్రి చెప్తారు. చదువులో అంధవిశ్వాసపు మాటలేవీ ఉండవు. ఇది మీరు చదువుకునే చదువు. విద్యార్థులు చదివి ఉత్తీర్ణులై సంపాదిస్తారు. అచ్ఛా ! (మంచిది!)
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. వశీకరణ మంత్రమును అందరికీ ఇవ్వాలి. శ్రమపడి చదువుకొని రాజ్యతిలకము తీసుకోవాలి. ఈ దు:ఖపు పర్వతాన్ని తొలగించుటలో మీ వ్రేలును(సహయోగము) ఇవ్వాలి.
2. సంగమ యుగములో పురుషోత్తములుగా అయ్యే పురుషార్థము చేయాలి. బాబాను స్మృతి చేసే డ్రిల్లు చేయాలి. అంతేగాని యోగము, యోగము అని తికమక పడరాదు.
వరదానము :-
'' పరమాత్మ జ్ఞానములోని నవీనత అయిన ' పవిత్రత ' ను ధారణ చేసే సర్వ ఆకర్షణల నుండి ముక్త్ భవ ''
పరమాత్మ ఇచ్చిన జ్ఞానములోని నవీనత 'పవిత్రత'. మీరు నషాతో అగ్ని - దూది కలిసి ఉంటున్నా అగ్ని అంటుకోజాలదని అంటారు. పవిత్రత లేకుండా యోగి లేక జ్ఞానీ ఆత్మగా అవ్వలేరని మీరు విశ్వము ముందు ఛాలెంజ్ చేస్తారు. కనుక ' పవిత్రత ' అనగా సంపూర్ణ ఆకర్షణ ముక్తులు. ఏ వ్యక్తి పై గానీ, సాధనాల పౖౖె గానీ ఆకర్షణ ఉండరాదు. ఇటువంటి పవిత్రత ద్వారానే ప్రకృతిని పావనంగా చేసే సేవ చేయగలరు.
స్లోగన్ :-
''పవిత్రత మీ జీవితానికి ముఖ్యమైన పునాది. భూమి బద్దలైనా ధర్మాన్ని వదలకండి.''