04-05-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - స్వయాన్ని సరిదిద్దుకునేందుకు గమనముంచండి. దైవీ గుణాలు ధారణ చెయ్యండి, తండ్రి ఎప్పుడూ ఎవ్వరినీ కోపపడరు, శిక్షణనిస్తారు. ఇందులో భయపడే విషయమేదీ లేదు. ''

ప్రశ్న :-

పిల్లలకు ఏ స్మృతి ఉంటే సమయాన్ని వృథా చేయరు ?

జవాబు :-

'' ఇది సంగమ సమయము. మాకు చాలా గొప్ప లాటరీ లభించింది. తండ్రి మమ్ములను వజ్ర సమానమైన దేవతలుగా తయారు చేస్తున్నారు '' '' ఇది సంగమ సమయము. మాకు చాలా గొప్ప లాటరీ లభించింది. తండ్రి మమ్ములను వజ్ర సమానమైన దేవతలుగా తయారు చేస్తున్నారు '' - ఈ స్మృతి ఉంటే ఎప్పుడూ సమయాన్ని వృథా చేయరు. ఈ జ్ఞానము సంపాదనకు మూలము . కనుక ఎప్పుడూ చదువును మిస్‌ చేయరాదు. మాయ దేహాభిమానములోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది. కానీ మీకు నేరుగా తండ్రితో యోగముంటే సమయము సఫలమైపోతుంది.

ఓంశాంతి.

వీరు మా తండ్రి అని, కనుక ఇందులో భయపడే అవసరము లేదని పిల్లలకు తెలుసు. శాపమిచ్చేందుకు గాని, కోపపడేందుకు గాని వీరు ఏ సాధువో, మహాత్మయో కాదు. ఆ గురువులు మొదలైనవారిలో చాలా కోపముంటుంది. వారు శపిస్తారని మనుష్యులు వారికి చాలా భయపడ్తారు. ఇక్కడ అటువంటిదేమీ లేదు. పిల్లలు ఎప్పుడూ భయపడే అవసరం లేదు. ఎవరైతే స్వయం చంచలంగా ఉంటారో, వారు తండ్రిని చూసి భయపడ్తారు. ఆ లౌకిక తండ్రి అయితే కోప్పడ్తారు కూడా. కానీ ఈ తండ్రి ఎప్పుడూ కోపము మొదలైనవి చేసుకోరు. తండిన్రి స్మృతి చేయకుంటే వికర్మలు వినాశనమవ్వవని, జన్మ-జన్మాంతరాలకు నష్టపడ్తారని అర్థము చేయిస్తారు. ముందు ముందు పిల్లలు బాగుపడేందుకు తండి జ్ఞానమునిస్తారు. అంతేగాని తండ్రి ఎప్పుడూ కోపపడరు. పిల్లలూ! మిమ్ములను మీరు బాగా సరిదిద్దుకునేందుకు స్మృతియాత పై గమనమివ్వండని, దానితో పాటు సృష్టి చక్రమును బుద్ధిలో ఉంచుకొని దైవీ గుణాలు ధారణ చెయ్యమని తండి అర్థం చేయిస్తూ ఉంటారు. ముఖ్యమైనది - స్మృతి. పోతే సృష్టి చక్ర జ్ఞానము చాలా సులభము. అది సంపాదనకు మూలము. కానీ దానితో పాటు దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. ఇది పూర్తి ఆసురీ గుణాల సమయము. చిన్న పిల్లలలో కూడా ఆసురీ గుణాలుంటాయి. అయితే వారిని ఏ మాత్రము కొట్టరాదు, అలా కొట్తే ఇంకా ఎక్కువగా ఆసురీ గుణాలు నేర్చుకుంటారు. అక్కడ సత్యయుగములో అలాంటివి నేర్చుకోరు. ఇక్కడైతే తల్లిదండ్రుల నుండి పిల్లలు అన్నీ నేర్చుకుంటారు. బాబా పేదల గురించి చెప్తారు. ధనవంతులకైతే ఇది స్వర్గము వలె ఉంటుంది. వారికి జ్ఞానము అవసరము లేదు. ఇది చదువు. నేర్పించేందుకు, బాగు పరిచేందుకు టీచరు కావాలి. కనుక తండ్రి పేదల గురించే మాట్లాడ్తారు. పరిస్థితులెలా ఉన్నాయి? పిల్లలు ఎంతగా పాడైపోతూ ఉంటారు! తల్లిదండ్రులను అందరూ చూస్తూ ఉంటారు. బాల్యములోనే అందరూ చెడిపోతున్నారు. నేను పేదల పెన్నిధినని ఈ ఆత్మిక తండ్రి చెప్తున్నారు. ఈ ప్రపంచములోని మనుష్యుల స్థితి ఎలా ఉందో చూడమని తెలిపిస్తున్నాను. ఇది తమోప్రధాన ప్రపంచము. తమోప్రధానతకు కూడా ఒక హద్దు ఉంటుంది కదా. కలియుగము మొదలై 1250 సంవత్సరాలయ్యింది. ఒక రోజు కూడా ఎక్కువ - తక్కువా అవ్వదు. పూర్తిగా తమోప్రధానమైనప్పుడు తండ్రి రావలసి వచ్చింది. తండ్రి చెప్తున్నారు - నేను డ్రామానుసారము బంధింపబడి ఉన్నాను. నేను తప్పకుండా రావలసి వస్తుంది. ప్రారంభములో ఎంతమంది పేదవారు వచ్చారు, ధనవంతులు కూడా వచ్చారు. ఇరువురు కలిసి కూర్చునేవారు. గొప్ప-గొప్ప కుటుంబాల ఆడపిల్లలు పారిపోయి వచ్చారు. వారు వచ్చునప్పుడు ఏమీ తీసుకు రాలేదు. ఎన్ని గలాటాలు జరిగాయి! డ్రామాలో ఏదైతే జరగవలసి ఉండినదో అది జరిగిపోయింది. ఇలా జరగుతుందని ఆలోచించనేలేదు. స్వయం బ్రహ్మాబాబా కూడా ఇలా ఎందుకు జరుగుతూ ఉంది అని ఆశ్చర్యపడేవాడు. ఇతని చరిత్ర చాలా అద్భుతమైనది. ఇది కూడా డ్రామాలో రచింపబడింది. బాబా అందరికీ వారి ఇంటి నుండి జ్ఞానామృతము తాగేందుకు మా పిల్లలు వస్తున్నారని లెటరు తెమ్మని చెప్పారు. తర్వాత వారి భర్తలు విదేశాల నుండి వచ్చారు. వారు విషమివ్వమని పిల్లలను అడిగారు. అందుకు పిల్లలు మేము జ్ఞానమృతము తాగాము, విషమెలా ఇవ్వగలమని చెప్పారు. దీని పై వీరు పాడిన ఒక పాట కూడా ఉంది. దీనిని చరిత్ర అని అంటారు. శాస్త్రాలలో అది కృష్ణుని చరిత్రగా వ్రాసేశారు. ఇది కృష్ణుని విషయము కాజాలదు. అయితే ఇదంతా డ్రామాలో నిర్ణయించబడింది. నాటకములో ఇవన్నీ జరుగుతాయి. ఇరువురు తండ్రులూ, మేమేమీ చెయ్యలేదని, అది డ్రామా అని పరిహాసానికి చెప్తారు. చిన్న చిన్న పిల్లలు యజ్ఞములోకి వచ్చేశారు. ఇప్పుడు వారు చాలా పెద్దవారైపోయారు. సందేశ పుత్రికలు పిల్లలకు అద్భుతమైన పేర్లు తీసుకొని వచ్చారు. వారి నుండి కొంతమంది పారిపోయారు. వారి పేర్లు లేనే లేవు. వారికి మళ్లీ పాత పేర్లే కొనసాగాయి. అందువలన బ్రాహ్మణుల మాల తయారవ్వదు.

మీ వద్ద ఏమీ లేదు. మొదట మాల తిప్పుతూ ఉండేవారు. ఇప్పుడు మీరు మాలలోని మణులుగా అవుతారు. అక్కడ భక్తి ఉండదు. ఇది అర్థము చేసుకోవలసిన జ్ఞానము. అయితే ఇది ఒక సెకండు జ్ఞానమే. వారిని జ్ఞాన సాగరులని అంటారు. మొత్తం సముద్రమునంతా సిరాగా చేసుకొని, అడవినంతా కలముగా చేసుకున్నా వారి మహిమ, వారి జ్ఞానము పూర్తి కాదు. అయినా అదంతా ఒక సెకండు మాటే. అల్ఫ్‌(బాబాను) తెలుసుకున్నారంటే బే(చక్రవర్తి పదవి) తప్పకుండా లభించాలి. అయితే ఆ స్థితిని తయారు చేసుకునేందుకు అంటే పతితుల నుండి పావనంగా అవ్వడంలో శ్రమ ఉంది, స్వయాన్ని ఆత్మగా భావించి మీ అనంతమైన తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఇందులో శ్రమ ఉంది. పురుషార్థము చేయించే టీచరైతే ఉన్నారు. అయితే అదృష్టములో లేకుంటే టీచరు కూడా ఏం చెయ్యగలరు? టీచరైతే చదివిస్తారు. అంతేగాని లంచము తీసుకొని పాస్‌ చెయ్యరు. ఇక్కడ బాప్‌దాదా ఇరువురూ కలిసి ఉన్నారని పిల్లలు అర్థము చేసుకున్నారు. అనేక మంది పిల్లలు బాప్‌దాదా పేరుతో జాబులు వ్రాస్తూ ఉంటారు. శివబాబా జ/ూ. ప్రజాపిత బ్రహ్మ అని వ్రాస్తారు. తండ్రి నుండి ఈ దాదా ద్వారా వారసత్వము తీసుకుంటారు. త్రిమూర్తిలో బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు. బ్రహ్మను సృష్టి కర్త అని అనరు. అనంతమైన సృష్టికర్త ఆ తండ్రియే. ప్రజాపిత బ్రహ్మ కూడా అనంతమైపోయారు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారంటే తప్పకుండా ప్రజలు చాలామంది ఉంటారు. అందరూ గ్రేట్‌ గ్రేట్‌ గ్రాండ్‌ ఫాదర్‌ అని అంటారు. శివబాబాను గ్రేట్‌ గ్రేట్‌ గ్రాండ్‌ ఫాదర్‌ అని అనరు. వారేమో ఆత్మలందరికీ తండ్రి. ఆత్మలందరూ సోదరులే(భాయి-భాయి) తర్వాత మళ్లీ సోదరీ-సోదరులుగా అవుతారు. అనంతమైన వంశానికి హెడ్‌(ముఖ్యలు) ప్రజాపిత బ్రహ్మ. ఎలాగైతే వంశ వృక్షముంటుందో, అలా ఇది అనంతమైన వంశ వృక్షము. ఆదం - బీబీ, యాడమ్‌ - ఈవ్‌ అని ఎవరిని అంటారు? బ్రహ్మ - సరస్వతులనే అలా అంటారు. ఇప్పుడు వంశ వృక్షము చాలా పెద్దదైపోయింది. వృక్షమంతా శిథిలాస్థకు వచ్చేసింది. మళ్లీ కొత్తది కావాలి. దీనిని వెరైటీ ధర్మాల వృక్షమని అంటారు. వెరైటీ రూపురేఖలున్నాయి. ఒకదానితో ఒకటి కలవవు. ప్రతి ఒక్కరి పాత్ర ఒక దానితో ఒకటి కలవదు. ఇవి చాలా గుహ్యమైన విషయాలు. చిన్న బుద్ధి గలవారైతే అర్థము చేసుకోలేరు. చాలా కష్టము. ఆత్మలైన మనము చిన్న బిందువులము. పరమపిత పరమాత్మ కూడా చిన్న బిందువే. ఇక్కడ పక్కనే వచ్చి కూర్చుంటారు. ఆత్మ చిన్నదిగా, పెద్దదిగా అవ్వదు. బాప్‌దాదా కలిసి చేయు పాత్ర చాలా అద్భుతమైనది. బాబా చాలా అనుభవము గల ఈ రథాన్ని తీసుకున్నారు. బాబా స్వయంగా ఇది భాగ్యశాలి రథమని అర్థం చేయిస్తారు. ఈ ఇల్లు లేక రథములో ఆత్మ కూర్చుని ఉంది. నేను ఇటువంటి తండ్రికి నా ఇంటిని లేక రథమును బాడుగకు ఇచ్చానంటే ఏమనుకుంటున్నారు! అందుకే ఇతనిని భాగ్యశాలి రథమని అంటారు. ఇందులో తండ్రి కూర్చుని పిల్లలైన మిమ్ములను వజ్రము వంటి దేవతలుగా చేస్తారు. ఇంతకుముందు ఇదేమీ అర్థమయ్యేది కాదు. పూర్తి తుచ్ఛ బుద్ధిగా ఉండేవారు.

ఇప్పుడు పిల్లలైన మీరు అర్థము చేసుకున్నారు, కనుక మళ్లీ పురుషార్థము కూడా మంచి రీతిగా చేయాలి. సమయమును వృథా చెయ్యరాదు. పాఠశాలలో సమయాన్ని వ్యర్థము చేస్తే పాస్‌ అవ్వలేరు. తండ్రి మీకు చాలా పెద్ద లాటరీ ఇస్తారు. కొంతమంది రాజుల ఇంటిలో జన్మించారంటే లాటరీ లభించినట్లే కదా. నిరుపేదల ఇంటిలో జన్మిస్తే దానిని లాటరీ అని అనరు. ఇది అన్నిటికంటే పెద్ద లాటరీ. ఇందులో సమయము వృథా చేయరాదు. మాయతో మల్లయుద్ధము జరుగుతుందని బాబాకు తెలుసు. క్షణ-క్షణము మాయ దేహాభిమానములోకి తెస్తుంది. మీ యోగము నేరుగా తండ్రి జతలో ఉంది. ఎదుర్లో కూర్చుని ఉన్నారు కదా. అందువలన డ్రామానుసారము ఇక్కడకు రిఫ్రెష్‌ అయ్యేందుకు వస్తారు. నేను మీకు ఏదైతే అర్థం చేయిస్తానో దానిని ధారణ చెయ్యాలని తండ్రి చెప్తున్నారు. ఈ జ్ఞానము కూడా మీకు ఇప్పుడే లభిస్తుంది. తర్వాత ప్రాయ: లోపమైపోతుంది. ఆత్మలన్నీ శాంతిధామానికి వెళ్లిపోతాయి. మళ్లీ అర్ధకల్పము తర్వాత భక్తిమార్గము ప్రారంభమవుతుంది. అర్ధ కల్పము నుండి మీరు వేదశాస్త్రాలు చదువుతూ భక్తి చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేస్తే జన్మ-జన్మాంతరాల వికర్మలు వినాశనమవుతాయనే ముఖ్యమైన విషయము అర్థము చేయించబడ్తుంది. ఈ జ్ఞానము ఆదాయానికి మూలము. దీని ద్వారా మీరు పదమాపదమ్‌ భాగ్యశాలురుగా అవుతారు. స్వర్గానికి అధికారులుగా అవుతారు. అక్కడంతా సుఖమే సుఖముంటుంది. మీకు స్వర్గములో ఎంత అపారమైన సుఖమిచ్చానో గుర్తు తెచ్చుకోమని తండ్రి స్మృతినిప్పిస్తారు. మీరు విశ్వాధికారులుగా ఉండేవారు. మళ్లీ అంతా పోగొట్టుకున్నారు. మీరు రావణునికి దాసులుగా అయిపోయారు. ఇది రాముడు, రావణుని అద్భుతమైన ఆట. ఇది మళ్లీ జరుగుతుంది. ఇది అనాదిగా తయారైన డ్రామా. స్వర్గములో మీరు సదా ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతులుగా ఉంటారు. ఇక్కడ మనుష్యులను ఆరోగ్యవంతంగా చేసేందుకు ఎంత ఖర్చు చేస్తారు! అది కూడా ఒక జన్మ కొరకే. అర్ధ కల్పము సదా ఆరోగ్యవంతంగా చేసుకునేందుకు మీకు ఎంత ఖర్చవుతుంది? ఒక పైసా కూడా ఖర్చు కాదు. దేవతలు సదా ఆరోగ్యంగా ఉంటారు కదా. మీరు ఇక్కడకు సదా ఆరోగ్యంగా అయ్యేందుకు వచ్చారు. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ అందరినీ సదా ఆరోగ్యవంతంగా చెయ్యలేరు. మీరిప్పుడు సర్వ గుణసంపన్నులుగా అవుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు సంగమ యుగములో ఉన్నారు. తండ్రి మిమ్ములను నూతన ప్రపంచానికి యజమానులుగా చేస్తున్నారు. డ్రామా ప్లాను అనుసారము ఎంతవరకు బ్రాహ్మణులుగా అవ్వరో అంతవరకు దేవతలుగా అవ్వలేరు. పురుషోత్తమ సంగమ యుగములో తండ్రి ద్వారా పురుషోత్తములుగా అయ్యేందుకు రానంతవరకు దేవతలుగా అవ్వలేరు.

అచ్ఛా. ఈ రోజు బాబా ఆత్మిక డ్రిల్లు కూడా నేర్పించారు. జ్ఞానము కూడా వినిపించారు. పిల్లలను అప్రమత్తము కూడా చేశారు. అజాగ్రత్తగా ఉండి పొరపాట్లు చెయ్యకండి. తప్పు మాటలు మాట్లాడకండి. శాంతిగా ఉండండి, తండ్రిని స్మృతి చేయండి. అచ్ఛా.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

మాతేశ్వరీగారి మధుర మహావాక్యాలు

గుప్త వేషధారి అయిన పరమాత్ముని ఎదుట కన్యలు, మాతల సన్యాసము

ఇప్పుడు ప్రపంచములోని మనుష్యులకు ''ఈ కన్యలు, మాతలు ఎందుకు సన్యసించారు?'' అని ఆలోచన కలగాలి. ఇది హఠయోగమూ కాదు, కర్మ సన్యాసమూ కాదు. ఇది పూర్తిగా సహజ యోగము, రాజయోగము, ఇది తప్పకుండా కర్మ యోగ సన్యాసము. పరమాత్మ స్వయంగా వచ్చి జీవించి ఉండే దేహ సహితము, దేహములోని అన్ని కర్మేంద్రియాలను మనసు ద్వారా సన్యసింపజేస్తారు. అనగా పంచ వికారాలను సంపూర్ణంగా తప్పకుండా సన్యసించాలి. పరమాత్మ వచ్చి '' దానమిస్తే గ్రహణము విడుస్తుంది '' అని చెప్తున్నారు. ఇప్పుడు అర్ధకల్పము నుండి పట్టిన మాయా గ్రహణము ద్వారా నల్లగా(పతితంగా) అయిన ఆత్మను మళ్లీ పావనంగా చేసుకోవాలి. దేవతల ఆత్మలెంత పవిత్రంగా మెరుస్తూ ఉన్నాయో చూడండి. ఆత్మ పవిత్రంగా ఉంటే శరీరము కూడా నిరోగి, పవిత్రమైనది లభిస్తుంది. ఇప్పుడు ఈ సన్యాసము కూడా ఎప్పుడు వీలవుతుందంటే, మొదట ఏదైనా లభించాలి. పేదబాలుడు ధనవంతుల ఒడిలోకి వెళ్తానంటే తప్పకుండా ఏదో చూచి ధనవంతుల ఒడి తీసుకుంటాడు. కానీ ధనవంతుల బాలుడు పేదవారి ఒడిలోకి వెళ్లలేడు. ఇది అనాథాశ్రమము కాదు, ఇచ్చట పెద్ద పెద్ద ధనవంతులు, కులీన మాతలు, కన్యలు ఉన్నారు. వారిని ప్రపంచములోనివారు ఇప్పుడు కూడా వాపస్‌ ఇంటికి రమ్మని కోరుతున్నారు, అయితే ఆ మాయావి ధనము, పదార్థాలు అనగా సర్వస్వము సన్యసించారంటే వారేమి ప్రాప్తి చేసుకున్నారు? కనుక వారి నుండి వారికి తప్పకుండా ఎక్కువ సుఖ-శాంతులు ప్రాప్తించినందునే ఆ ధనమును పదార్థాలను కాలదన్ని వచ్చేశారు. రాజా గోపీచంద్‌ లేక మీరాబాయి తమ రాజ పదవిని, రాణీ పదవిని సన్యసించినట్లు వీరు కూడా సన్యసించారు, ఇది ఈశ్వరీయ అతీంద్రియ అలౌకిక సుఖము. దీని ముందు ఆ ప్రాపంచిక పదార్థాలు తుచ్ఛమైనవి. ఇలా మరజీవగా అవ్వడం వలన మేము జన్మ-జన్మాంతరాలకు అమరపురిలో చక్రవర్తి పదవిని ప్రాప్తి చేసుకుంటున్నామని వారికి తెలుసు. అందుకే భవిష్యత్తును తయారు చేసుకునేందుకు పురుషార్థము చేస్తున్నారు. పరమాత్ముని వారిగా అవ్వడం అనగా పరమాత్ముని వారిగా అయిపోవడం. సర్వస్వమూ వారికి అర్పణ చేయుట. అందుకు బదులుగా వారు అవినాశి పదవిని ఇచ్చేస్తారు. ఈ మనోకామనను పరమాత్మయే స్వయంగా ఈ సంగమ సమయములో వచ్చి పూర్తి చేస్తారు. ఎందుకంటే వినాశ జ్వాలలో తనువు-మనసు-ధనముల సహితంగా అన్నీ తప్పకుండా భస్మమైపోతాయని వారికి తెలుసు. అందువలన పరమాత్ముని కార్యములో ఎందుకు సఫలము చేసుకోరాదు? అంతా వినాశనమవుతూ ఉంటే మేము మాత్రం తీసుకొని ఏం చేసుకోవాలి - ఈ రహస్యాన్ని కూడా అర్థము చేసుకోవాలి. సన్యాసుల వలె, మహామండలేశ్వరుల వలె ఇక్కడ మనం కూర్చోరాదు. అయితే ఈశ్వరార్థము బీజము నాటడం వలన భవిష్యత్తులో అక్కడ జన్మ-జన్మాంతరాలు వీరి(బ్రహ్మ) వారిగా అవ్వడం, ఇది గుప్తమైన రహస్యము. ప్రభువైతే దాత కదా. ఒకటిచ్చి నూరు పొందండి. అయితే ఈ జ్ఞానములో మొదట సహనము చేయవలసి వస్తుంది. ఎంత సహనము చేస్తారో, అంత్యములో అంత ప్రభావము వెలువడ్తుంది. అందువలన ఇప్పటి నుండే పురుషార్థము చేయండి. అచ్ఛా.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. వికర్మలను వినాశనము చేసుకొని స్వయాన్ని సరిదిద్దుకునేందుకు స్మృతి యాత్ర పై పూర్తిగా గమనమివ్వాలి. దైవీ గుణాలు ధారణ చేయాలి.

2. దేవతలుగా అయ్యేందుకు సంగమ యుగములో పురుషోత్తములుగా అయ్యే పురుషార్థము చెయ్యాలి. అజాగ్రత్తగా మీ సమయాన్ని వ్యర్థము చేయరాదు.

వరదానము :-

'' మనసు - బుద్ధిని అనుభవమనే సీటు పై సెట్‌ చేసే నంబరువన్‌ విశేష ఆత్మా భవ ''

బ్రాహ్మణాత్మలందరిలో మేము నంబరువన్‌ విశేషాత్మలుగా అవ్వాలనే సంకల్పముంటుంది. కానీ సంకల్పానికి, కర్మకు గల అంతరాన్ని(తేడాను) సమాప్తం చేసేందుకు స్మృతిని అనుభవంలోకి తీసుకురావాలి. ఎలాగైతే విన్నది, తెలుసుకున్నది గుర్తు ఉంటుందో అలా స్వయాన్ని ఆ అనుభవ స్థితిలోకి తీసుకు రావాలి. అందుకు స్వంత మహత్వాన్ని, సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని మనసు మరియు బుద్ధిని ఏదైనా అనుభవమనే సీటు పై సెట్‌ చేసుకుంటే నంబరువన్‌ విశేష ఆత్మగా అవుతారు.

స్లోగన్‌ :-

'' చెడు పై రీస్‌ (కోపాన్ని) వదిలి, మంచితో రేస్‌ చేయండి (పోటీ పడండి). ''