07-02-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - పావనంగా అయ్యేందుకు మొదటిది స్మృతి బలము, రెండవది శిక్షల బలము. మీరు స్మృతి బలము ద్వారా పావనంగా అయ్యి ఉన్నత పదవిని పొందాలి.''
ప్రశ్న :-
తండ్రి ఆత్మిక సర్జన్, వారు మీకు ఏ ధైర్యమును ఇచ్చేందుకు వచ్చారు ?
జవాబు :-
ఇప్పుడు జబ్బు నయమైపోతుందని లౌకిక సర్జన్ ఎలాగైతే రోగికి ధైర్యమిస్తాడో అలా ఆత్మిక సర్జన్ కూడా పిల్లలైన మీకు ధైౖర్యమునిస్తున్నారు - పిల్లలూ! మీరు మాయ ద్వారా కలిగిన జబ్బులను గురించి ఎలాంటి అధైర్యము, గాభరా చెందకండి. సర్జన్ ఔషధమును ఇచ్చినప్పుడు ఈ జబ్బులన్నీ బయటపడ్తాయి. అజ్ఞానములో కూడా రాని చెడు ఆలోచనలు వస్తాయి. కాని మీరు అన్నిటినీ సహనము చేయాలి. కొంత శ్రమ చేయండి. త్వరలో మీకు సుఖమును అనుభవించే రోజులు రానే వస్తాయి.
ఓంశాంతి.
అనంతమైన తండ్రి పిల్లలందరికీ అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు తండ్రి వచ్చారనే సందేశమును అందరికీ చేర్చాలి. తండ్రి ధైౖర్యమిచ్చి ఓదారుస్తున్నారు. ఎందుకంటే భక్తిమార్గములో, ఓ తండ్రీ! మీరు రండి ఈ దు:ఖముల నుండి విడిపించండి, ముక్తినివ్వండి అని పిలుస్తూ వేడుకున్నారు. అందుకే తండ్రి ఇక కొద్ది రోజులు మాత్రమే ఓపిక పట్టమని ధైర్యము చెప్తున్నారు. ఎవరికైనా జబ్బు నయమవుతున్నప్పుడు త్వరలో నయమైపోతుందని అంటారు. ఈ ఛీ-ఛీ ప్రపంచము ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత నూతన ప్రపంచములోకి వెళ్తామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అందుకు మీరు అర్హులుగా తయారవ్వాలి. ఆ తర్వాత మిమ్ములను ఏ రోగాలు మొదలైనవి సతాయించవు. తండ్రి ధైర్యమును కలిగించి కొంచెము శ్రమ చేయమని అంటున్నారు. ఇతరులెవ్వరూ ఇటువంటి ధైర్యమును ఇవ్వలేరు. మీరే తమోప్రధానమైపోయారు. మళ్లీ మిమ్ములను సతోప్రధానంగా తయారు చేసేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. ఇప్పుడు ఆత్మలన్నీ పవిత్రమైపోతాయి. కాని కొన్ని యోగబలముతో, కొన్ని శిక్షల బలముతో పవిత్రమౌతాయి. శిక్షల బలము కూడా ఉంది కదా! శిక్షలను అనుభవించి పవిత్రులయ్యేవారి పదవి తగ్గిపోతుంది. పిల్లలైన మీకు శ్రీమతము లభిస్తూ ఉంటుంది. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి(మామేకమ్ యాద్ కరో) అని తండ్రి చెప్తున్నారు. మీ పాపాలన్నీ భస్మమైపోతాయి. స్మృతి చేయకుంటే మీ పాపాలు వంద రెట్లు వృద్ధి చెందుతాయి. ఎందుకంటే పాపాత్మలుగా అయ్యి మీరు నన్ను నిందింపజేస్తారు. వీరు అసురీ నడవడికను చూపుతున్నారు, ఈశ్వరుడు వీరికి ఇటువంటి మతమునిస్తున్నారా! అని మనుష్యులు నిందిస్తారు. ఉన్నతము, పతనము కూడా జరుగుతాయి కదా! పిల్లలు అపజయమును కూడా పొందుతారు. మంచి-మంచి పిల్లలు కూడా ఓడిపోతారు కావున పాపాలు నశించనే నశించవు. తర్వాత తప్పకుండా అనుభవించవలసి వస్తుంది. ఇది చాలా ఛీ-ఛీ ప్రపంచము. ఇందులో అన్నీ జరుగుతూ ఉంటాయి. ఓ తండ్ర్ర్రీ, వచ్చి మాకు భవిష్య నూతన ప్రపంచానికి దారి చూపమని వేడుకుంటారు. నన్ను పిలుస్తారు. అటువైపు పాత ప్రపంచము, ఇటువైపు నూతన ప్రపంచము ఉందని బాబాకు తెలుసు. మీరు ఇతరులను దాటించే నావికులు. ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు ముందుకు వెళ్తున్నారు. ఆ పాత ప్రపంచము నుండి మీ లంగరు ఎత్తేశారు. కావున ఎక్కడకు వెళ్లాలో ఆ ఇంటినే స్మృతి చేయాలి. నన్ను స్మృతి చేస్తే మీ మలినాలన్నీ తొలగిపోతాయని తండ్రి చెప్తున్నారు. యోగబలము లేక శిక్షల బలము రెండూ ఉన్నాయి. ప్రతి ఆత్మ తప్పకుండా పవిత్రంగా అవ్వాల్సిందే. పవిత్రంగా అవ్వకుండా ఎవ్వరూ తిరిగి వెళ్లలేరు. అందరికీ తమ తమ పాత్ర లభించే ఉంది. ఇది మీ అంతిమ జన్మ అని తండ్రి చెప్తున్నారు. కాని కలియుగము ఇంకా బాల్యావస్థలో ఉందని మనుష్యులు అంటారు. అనగా మనుష్యులు ఇప్పటికంటే ఇంకా దు:ఖితులుగా అవుతారని అర్థం. ఇప్పుడు ఈ దు:ఖదామము సమాప్తమైపోతుందని సంగమ యుగములోని బ్రాహ్మణులైన మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి ధైర్యమునిస్తున్నారు. కల్పక్రితము కూడా నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ పాపాల మలినమంతా తొలగిపోతుందని తండ్రి తెలిపారు. నేను గ్యారెంటీ ఇస్తున్నాను. కలియుగము తప్పకుండా వినాశనమౌతుందని, సత్యయుగము తప్పక వస్తుందని కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి నుండి పాలన లభిస్తుంది. పిల్లలకు నిశ్చయము కూడా ఉంది. కాని స్మృతి నిలువనందున మళ్లీ ఏదో ఒక వికర్మ చేస్తూ ఉంటారు. బాబా, కోపము వచ్చేస్తుందని పిల్లలు అంటారు. దీనిని కూడా భూతమని అంటారు. ఈ రావణ రాజ్యములో 5 భూతాలు దు:ఖమిస్తూ ఉంటాయి. పాత జన్మ లెక్కాచారాలు కూడా సమాప్తము(చుక్తా) చేసుకోవాలి. ఎవరినైతే ఇంతకు ముందు కామ వికారము సతాయించలేదో వారిలో కూడా ఈ జబ్బు బహిర్గతమవుతుంది. ఇంతకుముందు ఇటువంటి వికల్పాలు వచ్చేవి కావు, ఇప్పుడు ఎందుకు సతాయిస్తున్నాయని అంటారు. ఇది జ్ఞానము కదా! ఈ జ్ఞానము జబ్బునంతటిని వెలుపలికి లాగుతుంది. భక్తి జబ్బులన్నిటినీ వెలుపలికి తీయదు. ఇది అశుద్ధమైన వికారీ ప్రపంచము. నూటికి నూరు పాళ్ళు అశుద్ధముంది. వంద శాతము పతితము నుండి మళ్లీ వంద శాతము పావనంగా అవ్వాలి. వంద శాతము భ్రష్టాచారము నుండి వంద శాతము పావన శ్రేష్ఠాచార ప్రపంచంగా అవ్వాలి.
తండ్రి చెప్తున్నారు - పిల్లలైన మిమ్ములను శాంతిధామము, సుఖధామానికి తీసుకెళ్లేందుకు వచ్చాను. మీరు నన్ను స్మృతి చేయండి, సృష్టి చక్రమును తిప్పండి, ఏ వికర్మలు చేయకండి. ఈ దేవతలలో ఉన్న గుణాలను ధారణ చేయండి. బాబా మీకు ఏ కష్టమునివ్వరు. కొన్ని నివాస గృహాలలో ప్రేతాత్మలు(ఈవిల్ సోల్స్) ఉన్నట్లైతే అగ్నిని అంటిస్తాయి, నష్టపరుస్తాయి. ఈ సమయంలో మనుష్యులందరూ చెడ్డవారే కదా! స్థూలంగా కూడా కర్మభోగమును అనుభవిస్తున్నారు. ఆత్మలు శరీరము ద్వారా ఒకరికొకరు దు:ఖమును ఇచ్చుకుంటారు. శరీరము లేకున్నా దు:ఖమునిస్తాయి. పిల్లలు తెల్లని నీడ వలె ఉన్న భూతాలను చూశారు. అయితే వాటిని గురించి ఏమీ ఆలోచించకండి. మీరు తండ్రిని ఎంత బాగా స్మృతి చేస్తే అంతగా ఇవన్నీ సమాప్తమవుతూ ఉంటాయి. ఇవి కూడా లెక్కాచారాలే కదా.
మేము పవిత్రంగా ఉండాలనుకుంటున్నామని ఇంట్లో పిల్లలు అంటారు. ఇలా చెప్పేది ఆత్మనే. జ్ఞానము లేనివారు పవిత్రంగా ఉండవద్దని చెప్తుంటారు. తర్వాత కొట్లాటలు జరుగుతాయి. ఎన్నో గొడవలు జరుగుతాయి. ఇప్పుడు మీరు పవిత్రాత్మలుగా తయారవుతున్నారు. వారు అపవిత్రులు కనుక దు:ఖమిస్తారు. వారు కూడా ఆత్మలే కదా! వారిని ఈవిల్ ఆత్మలు అని అంటారు. శరీరము ఉన్నా, శరీరము లేకున్నా దు:ఖమిస్తాయి. జ్ఞానమైతే చాలా సులభము. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. పోతే ముఖ్యమైనది పవిత్రత. పవిత్రత కొరకు తండ్రిని సంతోషంగా స్మృతి చేయాలి. రావణుని ఈవిల్ అని అంటారు కదా! ప్రస్తుత సమయములో ఈ ప్రపంచమంతా ఈవిల్(చెడు)గానే ఉంది. ఒకరి నుండి మరొకరు అనేక ప్రకారాలైన దు:ఖమును పొందుకుంటున్నారు. ఈవిల్ అని పతితులను అంటారు. పతిత ఆత్మలో కూడా పంచ వికారాలు అనేక విధాలుగా ఉంటాయి. కొందరిలో కామ వికారపు అలవాటు, కొందరిలో క్రోధము, కొందరిలో విసిగించే, కొందరిలో ఏడిపించే అలవాటు, కొందరిలో నష్టపరిచే అలవాటు ఇలా రకరకాలుంటాయి. కొందరి వికారపు కోరిక తీరకుంటే క్రోధముతో చాలా కొట్టి కూడా హింసిస్తారు. ఈ ప్రపంచమే అలా ఉంది. కనుక తండ్రి వచ్చి ధైర్యము చెప్తున్నారు - హే ఆత్మలారా! పిల్లలారా, ధైర్యము వహించండి. దైవీగుణాలు కూడా ధారణ చేయండి. నన్ను స్మృతి చేస్తూ ఉండండి. వృత్తి వ్యాపారాదులు మానేయమని కూడా చెప్పరు. మిలిట్రీవారు యుద్ధ భూమిలోకి వెళ్లవలసి వచ్చినా వారికి కూడా శివబాబా స్మృతిలో ఉండమని తండ్రి చెప్తున్నారు. యుద్ధ మైదానములో మరణిస్తే స్వర్గానికి వెళ్తామని గీతలోని శ్లోకాలను చదువుతూ వారు భావిస్తారు. అందువల్ల ఖుషీగా యుద్ధ రంగానికి వెళ్తారు. అయితే అలాంటి విషయమే లేదు. ఒక్క శివబాబాను స్మృతి చేస్తేనే స్వర్గములోకి వెళ్తారని బాబా చెప్తున్నారు. ఒక్క శివబాబాను మాత్రమే స్మృతి చేయాలి. అప్పుడు తప్పకుండా స్వర్గములోకి వెళ్తారు. ఇచ్చటకు వచ్చిన వారు జ్ఞానమార్గమును వదిలి వెళ్లి మళ్లీ పతితులైనప్పటికి తప్పకుండా స్వర్గానికి వస్తారు. శిక్షలు అనుభవించి, పవిత్రంగా అయ్యి మళ్లీ తప్పకుండా వస్తారు. తండ్రి దయాహృదయులు కదా! ఎలాంటి వికర్మలు చేయకుండా ఉంటే వికర్మాజీతులు అవుతారని తండ్రి అర్థం చేయిస్తారు. ఈ లక్ష్మీనారాయణులు వికర్మాజీత్లు కదా. రావణరాజ్యములో మళ్లీ వికర్మలు చేస్తారు. విక్రమ సంవత్సరము ప్రారంభమవుతుంది కదా. మనుష్యులకైతే ఏమీ తెలియదు. ఈ లక్ష్మీనారాయణులు వికర్మాజీతులుగా అయ్యారని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. వికర్మాజీత్ నెంబర్వన్ అని అంటారు. తర్వాత 2500 సంవత్సరాల తర్వాత విక్రమ సంవత్సరము ప్రారంభమవుతుంది. మోహమును జయించిన మోహజీత్ రాజా కథ ఉంది కదా. తండ్రి చెప్తున్నారు - నిర్మోహులుగా అవ్వండి. నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయి. 2500 సంవత్సరాలుగా చేసిన పాపాలన్నీ 50-60 సంవత్సరాలలో తొలగించుకొని స్వయాన్ని సతోప్రధానంగా చేసుకోగలరు. యోగబలము లేకుంటే నంబరు వెనుకబడిిపోతుంది. మాల ఏమో చాలా పెద్దది. భారతదేశ మాల ముఖ్యమైనది. డ్రామా అంతా భారతదేశం పైనే తయారై ఉంది. ఇందులో ముఖ్యమైనది స్మృతి యాత్ర. బాబా ఇక ఏ విధమైన కష్టమునివ్వరు. భక్తిమార్గములో అనేకమందితో బుద్ధియోగమును జోడిస్తారు. ఇదంతా రచన. వీరి స్మృతి ద్వారా ఎవ్వరికీ కళ్యాణము జరగదు. ఇతరులెవరిని స్మృతి చేయరాదని తండ్రి చెప్తున్నారు. భక్తిమార్గములో మొదట నన్ను మాత్రమే భక్తి చేసి పూజిస్తూ ఉండేవారు. ఇప్పుడు మళ్లీ చివరిలో కూడా నన్ను మాత్రమే స్మృతి చేయండి అని తండ్రి చాలా స్పష్టంగా అర్థం చేయిస్తున్నారు. ఇంతకు ముందు మీకు ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు మీకు జ్ఞానము లభించింది. తండ్రి చెప్తున్నారు - ఇతర సాంగత్యములన్నీ వదిలి ఒక్క నాతోనే సాంగత్యము జోడించండి. అప్పుడు యోగాగ్ని ద్వారా మీ పాపాలన్నీ భస్మమైపోతాయి. అనేక పాపాలు చేస్తూ వచ్చారు. కామకటారిని(కామఖడ్గమును) ఝళిపిస్తారు(నడిపిస్తారు). ఒకరికొకరు పరస్పరము ఆదిమధ్యాంతాలు దు:ఖమునే ఇస్తూ వచ్చారు. ముఖ్యమైనది కామ ఖడ్గము. ఇది కూడా డ్రామాయే కదా! ఇటువంటి డ్రామా ఎందుకు తయారయ్యింది? అని కూడా అనరు. ఇది అనాది డ్రామా. ఇందులో నా పాత్ర కూడా ఉంది. డ్రామా ఎప్పుడు తయారయ్యింది. ఎప్పుడు పూర్తవుతుంది? అనేది చెప్పలేరు. ఇదైతే ఆత్మలో పాత్ర నిండి ఉంది. ఆత్మ రూపి ప్లేట్ ఎప్పుడూ అరిగిపోదు. ఆత్మ అవినాశి. అందులోని ఇమిడి ఉన్న పాత్ర కూడా అవినాశియే. డ్రామాను కూడా అవినాశి అని అంటారు. తండ్రి ఎవరైతే పునర్జన్మ తీసుకోరో వారే స్వయంగా వచ్చి ఈ రహస్యాలన్నీ అర్థం చేయిస్తారు. సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని ఎవ్వరూ అర్థం చేయించలేరు. తండ్రి కర్తవ్యము గురించి గాని, ఆత్మ కర్తవ్యము గురించి గాని ఎవ్వరికీ తెలియదు. ఈ సృష్టి చక్రము తిరుగుతూనే ఉంటుంది.
ఇది పురుషోత్తమ సంగమ యుగము, ఈ సమయములో మానవులందరూ ఉత్తమ పురుషులుగా అవుతారు. పవిత్రంగా తయారై ఆత్మలన్నీ శాంతిధామములోకి వెళ్తాయి. శాంతిధామములో ఆత్మలన్నీ పవిత్రముగా, ఉత్తమంగా అయిపోతాయి. శాంతిధామము పావనమైనది కదా! నూతన ప్రపంచము కూడా పవిత్రమైనదే. అక్కడ శాంతి ఉండనే ఉంటుంది. శరీరము లభించిన వెంటనే ఆత్మలు పాత్రను అభినయిస్తాయి. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన పాత్ర లభించిందని మనకు తెలుసు. అది మన స్వంత ఇల్లు. అక్కడ శాంతిలో ఉంటాము. ఇక్కడైతే పాత్రను అభినయించాలి. భక్తిమార్గములో మీరు నన్ను అవ్యభిచారిగా పూజించారని తండ్రి చెప్తున్నారు. అప్పుడు మీకు దు:ఖము లేదు. ఇప్పుడు వ్యభిచారి భక్తి వలన మీరు దు:ఖితులుగా అయిపోయారు. ఇప్పుడు తండ్రి దైవీగుణాలు ధారణ చేయమని చెప్తున్నా ఆసురీ గుణాలు ఎందుకున్నాయి? ఇక్కడకు వచ్చి పావనంగా చేయమని తండ్రిని పిలిచారు. మరి ఎందుకు పతితులుగా అవుతారు? అందులోనూ ముఖ్యంగా కామ వికారమును జయించాలి. అప్పుడే మీరు జగత్జీతులుగా అవుతారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు అని మానవులు భగవంతుని అంటారు అనగా వారిని క్రిందకు తీసుకొస్తారు. ఈ విధంగా పాపాలు చేస్తూ చేస్తూ మహావికారీ ప్రపంచంగా తయారైపోతుంది. గరుడ పురాణములో కూడా రౌరవ నరకమని వర్ణించారు. అచ్చట తేళ్ళు, మండ్రగబ్బలు కరుస్తూ ఉంటాయి. శాస్త్రాలలో ఏమేమో చూపించారు. శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తిమార్గానికి చెందినవని తండ్రి అర్థం చేయించారు. వీటి ద్వారా నేను లభించనని, ఇంకా తమోప్రధానంగా అవుతారని బాబా చెప్తున్నారు. అందుకే మీరు వచ్చి పావనంగా చేయమని నన్ను పిలుస్తారు. కావున పతితులైనట్లే కదా! మానవులకు ఏ మాత్రము అర్థమే కాదు. నిశ్చయబుద్ధి గలవారు విజయులైపోతారు. రావణుని పై విజయము పొంది, రామ రాజ్యములోకి వచ్చేస్తారు. తండ్రి చెప్తున్నారు - కామమును జయించండి. దీనిని గురించే హంగామా (గలాటా) జరుగుతుంది. అమృతాన్ని వదిలి విషము ఎందుకు తాగుతారు?,.......... అని పాట కూడా పాడ్తారు. అమృతము అనే పేరు విని గోముఖము నుండి అమృతము వెలువడ్తుందని అంటారు. అరే! గంగా జలమును అమృతమని అంటారా? నిజానికి ఇది జ్ఞానామృతము గురించి చెప్పిన మాట. స్త్రీ తన పతి పాదాలను కడిగి పాద తీర్థము త్రాగుతుంది. దానిని కూడా అమృతమని భావిస్తుంది. అది అమృతమైతే వజ్ర సమానంగా అవ్వాలి కదా! తండ్రి ఇచ్చే జ్ఞానము ద్వారా మీరు వజ్ర సమానంగా అవుతారు. నీటిని అమృతమని భావించి నీటిని ఎంతో ప్రసిద్ధి గావించారు. మీరు జ్ఞానామృతమును తాగిస్తారు. వారు నీటిని తాగిస్తారు. బ్రాహ్మణులైన మీ గురించి ఎవ్వరికీ తెలియదు. వారు కౌరవులు - పాండవులని అంటారు. కాని పాండవులనగా బ్రాహ్మణులేనని అర్థం చేసుకోరు. గీతలో పాండవులంటే బ్రాహ్మణులని భావించే విధంగా ఏ విధమైన పదాలు లేవు. ఇప్పుడు తండ్రి కూర్చొని సర్వ శాస్త్రముల సారమును అర్థం చేయిస్తున్నారు. శాస్త్రాలలో ఏమేమి చదివారో, నేను ఏమేమి వినిపిస్తున్నానో పరిశీలించి మీరే నిర్ణయము తీసుకోండని పిల్లలతో అంటారు. ఇంతకు ముందు విన్నదంతా తప్పని, ఇప్పుడు యదార్థమును వింటున్నామని మీకు తెలుసు.
తండ్రి అర్థం చేయించారు - మీరందరూ సీతలు లేక భక్తులు, భక్తికి ఫలమిచ్చే రాముడు ఆ భగవంతుడు ఒక్కరే. నేను భక్తికి ఫలము ఇచ్చేందుకు వస్తానని వారు చెప్తున్నారు. మనము స్వర్గములో అపారమైన సుఖాన్ని అనుభవిస్తామని మీకు తెలుసు. అప్పుడు మిగిలినవారందరూ శాంతిధామములో ఉంటారు. అక్కడ శాంతి లభిస్తుంది కదా! ఆ విశ్వములో సుఖము-శాంతి-పవిత్రత అన్నీ ఉంటాయి. విశ్వములో ఒకే ధర్మమున్నప్పుడు శాంతి ఉండేదని మీరు అర్థం చేయిస్తారు. అయినా అర్థము చేసుకోరు. అతికష్టము మీద ఏ కొందరో నిలుస్తారు. చివర్లో అనేకమంది వస్తారు. ఇంకెక్కడికి వెళ్లగలరు! ఉండే దుకాణము ఇది ఒక్కటే. ఉదాహరణానికి దుకాణములోని వస్తువులు బాగుంటే ఒకే ధర ఉంటుంది కదా! ఇది శివబాబా దుకాణము. వారు నిరాకారులు. బ్రహ్మ కూడా తప్పకుండా అవసరమే. మీరు బ్రహ్మాకుమారులు - బ్రహ్మాకుమారీలని పిలువబడ్తారు. శివకుమారీలని పిలువబడరు. బ్రాహ్మణులు కూడా తప్పకుండా కావాలి. బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎలా అవుతారు? అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. దేవతల వంటి గుణాలు స్వయంలో ధారణ చేయాలి. లోపల ఏవైతే చెడు సంస్కారాలున్నాయో క్రోధము మొదలైన చెడు అలవాట్లన్నీ వదిలేయాలి. వికర్మాజీత్లుగా అవ్వాలంటే ఇప్పుడు ఏ వికర్మలూ చేయరాదు.
2. వజ్ర సమానము శ్రేష్ఠంగా అయ్యేందుకు జ్ఞానామృతమును తాగుతూ ఇతరులకు తాగించాలి. కామ వికారము పై సంపూర్ణ విజయమును పొందాలి. స్వయాన్ని సతోప్రధానంగా చేసుకోవాలి. స్మృతి బలము ద్వారా పాత లెక్కాచారాలన్నిటినీ సమాప్తము చేసుకోవాలి.
వరదానము :-
''సహజయోగ సాధన ద్వారా సాధనాల పై విజయాన్ని ప్రాప్తి చేసుకునే ప్రయోగీ ఆత్మా భవ''
సాధనాలున్నా వాటిని ప్రయోగములోకి తెస్తూ యోగస్థితి అటు ఇటు చలించరాదు. యోగులుగా అయ్యి వాటిని ఉపయోగించుటను 'న్యారాగా'(అతీతంగా) ఉండుట అని అంటారు. సాధనాలున్నా నిమిత్తమాత్రంగా అనాసక్త రూపంతో ప్రయోగించండి. ఒకవేళ ఇచ్ఛ(కోరిక) ఉంటే అది అచ్ఛాగా(మంచిగా) అవ్వనివ్వదు. శ్రమ చేయడంలోనే సమయం గడచిపోతుంది. ఆ సమయంలో మీరు సాధనలో ఉండేందుకు ప్రయత్నిస్తారు, సాధనాలు తమ వైపు ఆకర్షిస్తాయి. అందువలన ప్రయోగీ ఆత్మలుగా అయ్యి సహజయోగ సాధన ద్వారా సాధనాల పై అనగా ప్రకృతి పై విజయులుగా అవ్వండి.
స్లోగన్ :-
''స్వయం సంతుష్టంగా ఉండి అందరిని సంతుష్టంగా చేయడమే సంతుష్టమణులుగా అవ్వడం.''