13-03-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - సమయము లభించినప్పుడంతా అంతర్ముఖులుగా ఉండే పురుషార్థము చేయండి, బాహ్యముఖతలోకి రాకండి. అప్పుడే పాపాలు సమాప్తమవుతాయి.''

ప్రశ్న :

ఉన్నతమయ్యే కళ కొరకు తండ్రి ప్రతి పుత్రునికి నేర్పించే పురుషార్థము ఏది ?

జవాబు :-

1. పిల్లలు ఉన్నత కళలోనికి వెళ్లాలంటే బుద్ధియోగాన్ని ఒక్క తండిత్రోనే జోడించండి. ఫలానావారు అలా ఉన్నారు, వీరు ఇలా చేస్తారు, వీరిలో ఈ అవగుణాలున్నాయి - ఈ విషయాలలోకి వెళ్లే అవసరము లేదు. అవగుణాలు చూడకుండా ముఖము తిప్పుకోండి. 2. ఎప్పుడు కూడా చదువు పై అలగరాదు. మురళీలో ఉన్న మంచి మంచి పాయింట్లను ధారణ చేస్తూ ఉండండి. అప్పుడే ఉన్నతి కళ జరగగలదు.

ఓంశాంతి.

ఇప్పుడిది జ్ఞాన తరగతి, ఉదయము జరిగేది యోగ తరగతి. ఎలాంటి యోగము? ఇది చాలా బాగా అర్థము చేయించాలి. ఎందుకంటే చాలామంది మనుష్యులు హఠయోగములో చిక్కుకొని ఉన్నారు. ఆ హఠయోగాన్ని మనుష్యులు నేర్పిస్తారు. ఈ రాజయోగాన్ని పరమపిత పరమాత్మ నేర్పిస్తారు. ఎందుకంటే రాజయోగాన్ని నేర్పించేందుకు రాజులెవ్వరూ లేరు. ఈ లక్ష్మినారాయణులు భగవతీ-భగావానులు. రాజయోగాన్ని నేర్చుకున్నారు కనుకనే భవిష్యత్తులో భగవతీ-భగవానులుగా అయ్యారు. ఇది పురుషోత్తమ సంగమ యుగము యొక్క జ్ఞానము. దీనిని పురుషోత్తమ సంగమ యుగమని అంటారు. పాత, కొత్త ప్రపంచముల మధ్య సమయము. పాత మనుష్యులు మరియు కొత్త దేవతలు. ఈ సమయంలోని మనుష్యులందరూ పాతవారు. కొత్త పప్రంచములో కొత్త ఆత్మలుంటారు, వారిని దేవతలని అంటారు. అక్కడ వారిని మనుష్యులని అనరు. వారు కూడా మనుష్యులే కానీ దైవీ గుణాలు కలిగినవారు. అందుకే దేవీ-దేవతలని అంటారు. పవిత్రంగా కూడా ఉంటారు. కామము మహాశతువ్రు అని పిల్లలకు తండి అర్థము చేయిస్తారు. ఇది రావణుని మొట్టమొదటి భూతము. ఎవరైనా చాలా కోపము చేసుకుంటే ఎందుకు కుక్కలా భౌ-భౌ అని అరుస్తావు! అని అంటారు. ఈ రెండు వికారాలు పెద్ద శతువ్రులు. లోభ-మోహముల గురించి భౌ-భౌ అని అనరు. మనుష్యులలో సైన్స్‌ అభిమానము కారణంగా చాలా క్రోధముంది. ఇది కూడా చాలా నష్టకారకము. కామ భూతము ఆది-మధ్య-అంత్యములు దు:ఖమునిస్తుంది. ఒకరి పై ఒకరు కామ ఖడ్గమును ఉపయోగిస్తారు. ఈ విషయాలన్నీ అర్థము చేసుకొని తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి. తండ్రి నుండి ఆస్తిని తీసుకునే సత్యమైన మార్గమును మీరు తప్ప ఇతరులెవ్వరూ తెలుపలేరు. పిల్లలైన మీరు మాత్రమే తెలిపించగలరు. బేహద్‌ తండ్రి నుండి ఇంత గొప్ప ఆస్తి ఎలా లభిస్తుందో అర్థం చేయించలేకుంటే తప్పకుండా ఈ చదువు పై గమనము లేదని తెలుస్తుంది. బుద్ధియోగము ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఇది యుద్ధ మైదానము కదా. ఇది చాలా సహజము అని ఎవ్వరూ అనుకోకండి. వద్దనుకున్నా మనస్సులో తుఫానులు లేక వికల్పాలు వద్దనుకున్నా అనేకము వస్తాయి. ఇందులో తికమక చెందరాదు. యోగబలముతోనే మాయ పారిపోతుంది. ఇందులో పురుషార్థము చాలా ఉంది. వ్యాపార-వ్యవహారాలలో ఎంతగానో అలసిపోతారు. ఎందుకంటే దేహాభిమానములో ఉంటారు. దేహాభిమానము కారణంగా చాలా మాట్లాడవలసి వస్తుంది. ఆత్మాభిమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు బాబా ఏది తెలియజేస్తారో దానిని ఇతరులకు తెలియజేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. పిల్లలారా, బాహ్యముఖులుగా అవ్వకండి. అంతర్ముఖులుగా అవ్వాలి అని బాబానే శిక్షణనిస్తారు. ఎక్కడైనా బాహర్ముఖులుగా కావలసి వచ్చినా ఎంత సమయము లభిస్తుందో అంత అంతర్ముఖులుగా అయ్యేందుకు ప్రయత్నము చేయాలి. అప్పుడే పాపాలు సమాప్తమవుతాయి. లేకపోతే పాపము సమాప్తమవ్వదు. ఉన్నత పదవిని పొందలేరు. జన్మ-జన్మాంతరాల పాపాలు తల పై ఉన్నాయి. అందరికంటే ఎక్కువ పాపము చేసినవారు బ్రాహ్మణులే. వారిలో కూడా నంబరువారుగా ఉన్నారు. ఎవరు చాలా ఉన్నతంగా అవుతారో వారే పూర్తి నీచంగా కూడా అవుతారు. ఎవరైతే రాకుమారులుగా అవుతారో వారే మళ్లీ భికారులుగా కూడా అవ్వవలసి ఉంటుంది. డ్రామాను బాగా అర్థము చేసుకోవాలి. ఎవరైతే మొదట వచ్చి ఉంటారో వారు చివర్లో వస్తారు. ఎవరైతే మొదట పావనంగా అవుతారో, వారే మొదట పతితులుగా అవుతారు. తండ్రి చెప్తున్నారు - నేను కూడా ఇతని(బ్రహ్మ) అనేక జన్మల అంతిమ జన్మలో అది కూడా వానప్రస్థ అవస్థలోనే వస్తాను. ఈ సమయములో చిన్న-పెద్ద అందరిదీ వానప్రస్థ స్థితియే. సర్వుల సద్గతిదాత అని ఆ తండ్రికి మహిమ ఉంది. పురుషోత్తమ సంగమ యుగములోనే సద్గతి జరుగుతుంది. ఈ పురుషోత్తమ సంగమ యుగమును కూడా గుర్తుంచుకోవాలి. మానవులకు కలియుగము ఎలా గుర్తుందో అలా పిల్లలైన మీకు మాత్రమే సంగమ యుగము గుర్తుంది. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. చాలామందికి వారి చిక్కు వ్యవహారాలే గుర్తుంటాయి. వెలుపలి విషయాల నుండి ముఖము తిప్పబడి ఉంటే ధారణ కూడా జరుగుతుంది. అంతిమ సమయములో ఎవరు స్త్రీని స్మృతిస్తారో,....... ఇటువంటి మంచి-మంచి పాటలు లేక శ్లోకాలు మన జ్ఞానానికి సంబంధించినవిగా ఉంటాయో వాటిని ఉంచుకోవాలి. ఈ ఛీ-ఛీ ప్రపంచము నుండి వెళ్లనే వెళ్లాలి. రెండవది - నయన హీనులకు మార్గము చూపండి.......... ఇలాంటి పాటలు మీ వద్ద ఉంచుకోవాలి. వీటిని తయారుచేసింది మనుష్యులే కానీ వారికి ఈ సంగమ యుగము గురించి తెలియనే తెలియదు. ఈ సమయములో అందరూ జ్ఞాన నయన హీనులైన అంధులే. ఎప్పుడు పరమాత్మ వస్తారో అప్పుడే మార్గాన్ని చూపిస్తారు. ఒక్కరికే చూపరు. వీరంతా వారి శివశక్తి సైన్యము. ఈ శక్తి సేన ఏమి చేస్తుంది? శ్రీమతానుసారము నూతన ప్రపంచమును స్థాపన చేస్తుంది. మీరు కూడా రాజయోగము నేర్చుకుంటున్నారు. దీనిని భగవంతుడు తప్ప వేరెవ్వరూ నేర్పించలేరు. భగవంతుడు నిరాకారులు. వారికి వారి శరీరమే లేదు. మిగిలినవారంతా శరీరధారులే. ఉన్నతాతి ఉన్నతమైనవారు ఒక్క తండ్రి మాత్రమే. వారే మిమ్ములను చదివిస్తున్నారు. ఇది మీకు మాత్రమే తెలుసు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. కనుక మీరు వార్నింగ్‌ ఇవ్వాలి. పెద్ద పెద్ద వార్తాపత్రికలలో కూడా వేయించాలి. మనుష్యులు నేర్పించే యోగము హఠయోగము. రాజయోగాన్ని తండ్రి అయిన ఒక్క పరమపిత పరమాత్మ మాత్రమే నేర్పిస్తారు. ఈ యోగము ద్వారా ముక్తి - జీవన్ముక్తి లభిస్తుంది. హఠయోగము ద్వారా రెండూ లభించవు. ఆ హఠయోగము పరంపరగా వస్తున్న పాత యోగము. ఈ రాజయోగము కేవలం ఈ సంగమ యుగములో మాత్రమే తండ్రి నేర్పిస్తారు.

ఉపన్యసించునప్పుడు టాపిక్స్‌ తయారు చేసుకోవాలని తండ్రి అర్థము చేయించారు. అయితే అలా చేయరు. శ్రీమతానుసారము నడిచేవారు చాలా తక్కువమంది ఉన్నారు. మొదట వ్రాసుకొని పక్కా చేసుకుంటే గుర్తుంటుంది. మీరు ఓరలీ(కాగితము చూడకుండా) ఉపన్యసించాలి, చదివి వినిపించరాదు. ఎవరు స్వయాన్ని ఆత్మ అని తెలుసుకొని మాట్లాడ్తారో వారికి విచార సాగర మథనము చేసి ఉపన్యసించేందుకు యోగ్యత ఉంటుంది. మేము సోదరులకు వినిపిస్తున్నామని భావించి తెలిపిస్తే శక్తి ఉంటుంది. ఇది చాలా శ్రేష్ఠమైన గమ్యము కదా. ఈ గమ్యాన్ని చేరడము పిన్నమ్మ ఇంట్లో ఉన్నంత సులభము కాదు. మీరు ఎంత శక్తిశాలురుగా అవుతారో(రుస్తుం) అంతగా మాయ కూడా యుద్ధము చేస్తుంది. అంగదుడు లేక మహావీరుడు కూడా శక్తిశాలురుగా ఉన్నందున మమ్ములను రావణుడు కదిలించనీ చూస్తాము అని సవాలు చేశారు. ఇవి స్థూల విషయాలు కావు. శాస్త్రాలలో ఈ కట్టు కథలున్నాయి. బాబా బంగారు జ్ఞానాన్ని విన్న ఈ చెవులు ఈ దంత కథలను వింటూ వింటూ పూర్తిగా రాయి(రాతి వలె)గా అయిపోయాయి. భక్తిమార్గములో బుద్ధిని పాడు చేసుకున్నారు(నొసలు అరిగిపోయింది), ధనమును కూడా వ్యర్థంగా పోగొట్టుకున్నారు. మెట్లు దిగుతూనే వచ్చారు. 84 జన్మల కథ కూడా ఉంది కదా. ఎంత భక్తి చేసినా, క్రిందికే దిగినారు. ఇప్పుడు తండ్రి పైకి ఎక్కడం నేర్పిస్తున్నారు. ఇప్పుడు మీది ఉన్నతమయ్యే కళ. బుద్ధియోగమును తండ్రితో జోడించకుంటే తప్పకుండా క్రిందనే పడ్తారు. తండ్రిని స్మృతి చేస్తే పైకి ఎక్కుతారు. ఇందులో చాలా కష్టముంది. కానీ పిల్లలు అజాగ్రత్తగా ఉంటారు. తప్పులు చేస్తూ ఉంటారు. వ్యాపారాలలో పడి తండ్రిని, జ్ఞానమును మర్చిపోతారు. ఫలానావారు ఇలా ఉన్నారు, ఇలా చేస్తారు, ఈ బ్రాహ్మణి ఇలా ఉంది, వీరిలో ఈ అవగుణాలు ఉన్నాయి అని............. మాయ ఇటువంటి తుఫానులలోకి తీసుకొస్తుంది. అరే! ఇందులో మీదేమి పోతుంది? సర్వగుణ సంపన్నులుగా ఎవ్వరూ అవ్వలేదు. ఎవరి అవగుణాలను చూడకుండా గుణాలనే గ్రహించాలి. అవగుణాలను చూసినప్పుడు ముఖము తిప్పేసుకోండి. మీకు లభించే మురళీని వింటూ ధారణ చేస్తూ ఉండండి. బాబా చెప్తున్న విషయాలన్నీ పూర్తిగా ఖచ్ఛితమైనవని బుద్ధిలో అర్థము చేసుకోండి. ఏదైనా విషయము మంచిగా అనిపించకపోతే దానిని వదిలేయండి. ఎప్పుడు కూడా చదువు పై అలగరాదు. బ్రాహ్మణి లేక చదువు పై అలగడం అనగా తండ్రి పై అలగడం. అలిగి సెంటరుకు రాని పిల్లలు చాలామంది ఉన్నారు. ఎవరెలా ఉన్నా మీ పని మురళీతో మాత్రమే. వింటున్న మురళీలలో చాలా మంచి పాయింట్లను ధారణ చేయాలి. ఎవ్వరితోనైనా మాట్లాడుటలో ఆనందము లేకుంటే శాంతిగా మురళి విని వెళ్లిపోవాలి. మేము సెంటరుకు రాము అని అలగరాదు. నంబరువారుగా అయితే ఉన్నారు. ఉదయమే మీరు స్మృతిలో కూర్చోవడం కూడా చాలా మంచిది. బాబా వచ్చి సర్చ్‌లైట్‌ ఇస్తారు. బాబా తమ అనుభవము ఇలా వినిపిస్తున్నారు - నేను కూర్చున్నప్పుడు మొదట అనన్యమైన పిల్లలు గుర్తు వస్తారు. భలే విదేశాలలో ఉండనీ, కలకత్తాలో ఉండనీ, మొదట అనన్యమైన పిల్లలను స్మృతి చేసి వారికి సర్చ్‌లైట్‌ ఇస్తారు. పిల్లలు భలే ఇక్కడ కూర్చొని ఉన్నా సేవ చేసే పిల్లలను బాబా స్మృతి చేస్తారు. ఉదాహరణానికి మంచి పిల్లలు శరీరము వదిలి వెళ్లిపోతే వీరు చాలా సేవ చేశారని వారి ఆత్మను కూడా స్మృతి చేస్తారు. కనుక వారు ఇక్కడనే ఏదైనా దగ్గరగా ఉన్న ఇంటిలోనే ఉంటారు. అటువంటి వారిని కూడా బాబా స్మృతి చేసి సర్చ్‌లైట్‌ ఇస్తారు. అందరూ బాబా పిల్లలే అయినా మంచి సేవ చేసేవారెవరో అందరికీ తెలుసు. ఇక్కడ సర్చ్‌లైట్‌ ఇవ్వు అని బాబా చెప్తూనే సర్చ్‌లైట్‌ ఇస్తారు. రెండు ఇంజన్లు ఉన్నాయి కదా. ఇతను కూడా ఇంత పదవిని పొందుతాడంటే తప్పకుండా శక్తి ఉంటుంది. ఇక్కడ చదివించేది శివబాబా అని చెప్తున్నప్పుడు వారి స్మృతి ఉండాలి. పోతే ఇక్కడ రెండు లైట్లు ఉన్నాయని మీరు అర్థము చేసుకున్నారు. ఇతరులెవ్వరిలోనూ రెండు లైట్లు(ఆత్మలు) ఉండవు. అందుకే ఇక్కడకు వచ్చినప్పుడు మీరు రెండు లైట్ల ముందుకు వస్తారు కనుక మంచి రీతిగా రిఫ్రెష్‌(తాజా)గా అవుతారు. ఉదయం సమయము చాలా మంచిది. స్నానము చేసి మిద్దె పైకి వెళ్లి ఏకాంతములోకి వెళ్లిపోవాలి. అందుకే బాబా పెద్ద పెద్ద పై కప్పులు తయారు చేయించారు. ఫాదరీలు కూడా ఒక్కసారిగా సైలెన్స్‌లోకి వెళ్లిపోతారు. వారు తప్పకుండా ఏసుక్రీస్తును స్మృతి చేస్తూ ఉంటారు. వారికి గాడ్‌(భగవంతుని) గురించి తెలియదు. వారు గాడ్‌ను స్మృతి చేస్తూ ఉంటే వారి బుద్ధిలోకి శివలింగమే వచ్చేది. వారి నషాలో వెళ్లిపోతారు. కనుక వారి నుండి ఈ గుణము గ్రహించాలి. దత్తాత్రేయుడు అందరి నుండి గుణాలు తీసుకునేవాడని అంటారు. పిల్లలైన మీరు కూడా నంబరువారు బయట అయితే వృత్తి వ్యాపారాలు గుర్తుకొస్తాయి. ఉదయము 4 గంటల సమయము కూడా చాలా మంచిది. వెలుపలికి వెళ్లే అవసరము లేదు. ఇంట్లోనే కూర్చోండి. పహరా కూడా జరుగుతుంది. యజ్ఞములో పహరా కూడా ఉంచవలసి వస్తుంది. యజ్ఞములో ప్రతి వస్తువును సంభాళన చేయవలసి వస్తుంది. ఎందుకంటే యజ్ఞములోని ఒక్కొక్క వస్తువు చాలా చాలా విలువైనది. అందువలన సేఫ్టీ(రక్షణ) ఫస్ట్‌. ఇక్కడకు ఎవ్వరూ రారు. ఇక్కడ నగలు మొదలైనవి ఏవీ లేవని అందరికీ తెలుసు. ఇది దేవాలయము కూడా కాదు. ఈ రోజులలో అన్నిచోట్ల దొంగతనాలు జరుగుతున్నాయి. పాత వుస్తవులు దొంగిలించి విదేశాలకు కూడా తీసుకెళ్తారు. ప్రపంచము చాలా చెడిపోయింది. కామము మహాశత్రువు. అది అన్నింటిని మరపింపజేస్తుంది.

ఉదయము పూట సదా ఆరోగ్య.వంతముగా అయ్యేందుకు ఒక క్లాసు జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు సదా ఐశ్వర్యవంతులుగా అయ్యేందుకు క్లాసు జరుగుతోంది. తండ్రిని స్మృతి కూడా చేయాలి, విచార సాగర మథనము కూడా చేయాలి. తండ్రిని స్మృతి చేస్తే వారసత్వము కూడా గుర్తుకొస్తుంది. ఈ యుక్తి చాలా సులభమైనది. తండ్రి బీజరూపులు. వారికి వృక్షము యొక్క ఆది-మధ్య-అంత్యములు తెలుసు. మీది కూడా అదే వ్యాపారము. బీజమును స్మృతి చేయడం ద్వారా పవిత్రంగా అవుతారు. చక్రమును స్మృతి చేస్తే చక్రవర్తి రాజులుగా అవుతారు. అనగా ధనము లభిస్తుంది. రాజా విక్రముడు, రాజా వికర్మాజీతుడు ఈ రెండు శకాలనూ కలిపేశారు. రావణుడు వచ్చినప్పుడు విక్రమ శకము ప్రారంభమయ్యింది. తేది మారిపోయింది. ఈ శకము 1 నుండి 2500 సంవత్సరాలు, తర్వాత శకము 2500 నుండిి 5 వేల సంవత్సరముల వరకు నడుస్తుంది. హిందువులకు తమ ధర్మము గురించి తెలియదు. తమ అసలు ధర్మమును మర్చిపోయి అధర్ములుగా అయ్యారు. ఈ ఒక్క ధర్మములోని వారే ధర్మ స్థాపకుని కూడా మర్చిపోయారు. ఆర్యసమాజము ఎప్పుడు స్థాపన అయ్యిందో మీరు చెప్పగలరు. ఆర్యులు(బాగుపడినవారు) సత్యయుగములో ఉండేవారు. ఇప్పుడున్నవారు అనార్యులు. ఇప్పుడు తండ్రి వచ్చి మిమ్ములను సరిదిద్దుతారు. మీ బుద్ధిలో పూర్తి చక్రమంతా ఉంది. మంచి పురుషార్థులు ఎవరైతే ఉన్నారో వారికి స్వయము గురించి కూడా తెలుసు. ఇతరులతో కూడా పురుషార్థము చేయిస్తారు. తండ్రి పేదల పెన్నిధి. గ్రామీణ ప్రజలకు సందేశము ఇవ్వాలి. 6 చిత్రాలు సరిపోతాయి. 84 జన్మల చిత్రము చాలా బాగుంది. ఈ చిత్రము చూపించి మంచి రీతిగా అర్థం చేయించండి. అయితే మాయ ఎంత ప్రబలమైనదంటే అన్నీ మరిపింపజేస్తుంది. ఇచ్చట రెండు లైట్లు కలిసి ఉన్నాయి. ఒకటి తండ్రిది, రెండవది ఇతనిది. రెండూ శక్తివంతమైనవే. అయితే మీరు ఒకే శక్తివంతమైన లైటును పట్టుకొమ్మని ఇతను(బ్రహ్మ) చెప్తారు. పిల్లలందరూ ఇచ్చటకు పరుగెత్తుకొస్తారు. రెండు లైట్లు ఉన్నాయని అర్థము చేసుకుంటారు. తండ్రి సన్ముఖములో వినిపిస్తారు. మీతోనే వింటాను, మీతోనే మాట్లాడ్తాను,......... అనే గాయనముంది. అయితే ఇక్కడే కూర్చుండిపోరాదు. 8 రోజులు చాలు. ఇక్కడే కూర్చోబెడితే లెక్కలేనంతమంది అవుతారు.

డ్రామానుసారము సర్వమూ నడుస్తూ ఉంటుంది కానీ మీలో చాలా ఆంతరిక సంతోషము ఉండాలి. ఎవరైతే ఇతరులను తమ సమానంగా తయారు చేస్తారో వారికి ఆంతరిక సంతోషముంటుంది. ప్రజలను తయారు చేసుకుంటేనే రాజులుగా అవుతారు. పాస్‌పోర్టు కూడా ఉండాలి. బాబాను ఎవరైనా - '' నాలో ఏ ఏ అవగుణాలు ఉన్నాయి? '' అని ప్రశ్నిస్తే బాబా వెంటనే మిమ్ములను మీరు చూసుకోండి అని సమాధానమిస్తారు. నింద-స్తుతి అన్నీ సహనము చేయవలసి వస్తుంది. ఏది యజ్ఞము నుండి లభిస్తుందో అందులో సంతోషంగా ఉండాలి. యజ్ఞ భోజనము పట్ల చాలా ప్రీతి ఉండాలి. సన్యాసులకు భోజన మహత్వము తెలిసినందున తట్ట (పళ్లెము) కడిగి ఆ నీరు తాగుతారు. ధాన్యము కూడా లభించని సమయము వస్తుంది. అన్నీ సహనము చేసినప్పుడే ఉత్తీర్ణులవుతారు. అచ్ఛా.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. ఎవరిలోనైనా ఏదైనా అవగుణము కనిపిస్తే మీ ముఖమును తిప్పేసుకోండి. చదువు పై ఎప్పుడూ అలగరాదు. దత్తాత్రేయుని సమానంగా అందరి నుండి గుణాలను గ్రహించాలి.

2. వెలుపలి విషయాల నుండి బుద్ధిని తొలగించి అంతర్ముఖులుగా ఉండే అభ్యాసము చేయాలి. వ్యాపార-వ్యవహారాలలో ఉంటూ దేహీ-అభిమానులుగా ఉండాలి. ఎక్కువగా మాట్లాడరాదు.

వరదానము :-

''సుఖ స్వరూపులుగా అయ్యి ప్రతి ఆత్మకు సుఖమునిచ్చే మాస్టర్‌ సుఖదాతా భవ''

ఏ పిల్లలైతే సదా యధార్థ కర్మలు చేస్తారో, వారికి ఆ కర్మలకు ప్రత్యక్ష ఫలముగా సంతోషము మరియు శక్తి లభిస్తాయి. వారి హృదయము సదా సంతోషంగా ఉంటుంది, వారికి సంకల్ప మాత్రము కూడా దు:ఖపుటల రాజాలదు. సంగమయుగ బ్రాహ్మణులు అనగా దు:ఖమునకు నామ-రూపాలే లేనివారు. ఎందుకంటే బ్రాహ్మణులు సుఖదాత పిల్లలు. ఇటువంటి సుఖదాత పిల్లలు స్వయం కూడా మాస్టర్‌ సుఖదాతలుగా ఉంటారు. వారు ప్రతి ఆత్మకు సదా సుఖమునే ఇస్తారు. వారు ఎప్పుడూ దు:ఖమునివ్వరు, దు:ఖము తీసుకోరు.

స్లోగన్‌ :-

''మాస్టర్‌ దాతలుగా అయ్యి సహయోగము, స్నేహము మరియు అనుభూతినివ్వడమే దయాహృదయ ఆత్మకు గుర్తు.''