06-08-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - జ్ఞాన ధారణ చేస్తూ ఉంటే చివర్లో మీరు తండ్రి సమానంగా అవుతారు, తండ్రిలోని మొత్తం శక్తినంతా మీరు జీర్ణము చేసుకుంటారు ''

ప్రశ్న :-

ఏ రెండు మాటలు స్మృతిలో ఉంటే స్వదర్శన చక్రధారులుగా అవ్వగలరు?

జవాబు :-

ఉత్థానము-పతనము, సతోప్రధానము-తమోప్రధానము, శివాలయము-వేశ్యాలయము, ఈ రెండు-రెండు మాటలు స్మృతిలో ఉంటే మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. పిల్లలైన మీరిప్పుడు జ్ఞానాన్ని యధార్థంగా తెలుసుకున్నారు. భక్తిలో జ్ఞానము లేదు, కేవలం మనసును ఆనందపరచు మాటలు మాట్లాడ్తూ ఉంటారు. భక్తిమార్గము అంటేనే మనస్సును ఆనందపరచుకునే మార్గము.

ఓంశాంతి.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీరెంత ఉన్నతంగా ఉండేవారు. ఇది ఉన్నతము మరియు పతనమయ్యే ఆట. మనమెంత ఉత్తమంగా, పవిత్రంగా ఉండేవారము! ఇప్పుడు ఎంత నీచంగా అయ్యామో మీ బుద్ధిలో ఉంది. దేవీదేవతల ముందుకు వెళ్లి మీరు శ్రేష్ఠులు, మేము నీచులమని మీరే అంటారు. మనమే శ్రేష్ఠాతి శ్రేష్ఠంగా, నీచంగా అవుతామని ఇంతకుముందు మనకు తెలియదు. ఇప్పుడు తండ్రి మీకు చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా, మీరెంత ఉన్నతంగా, పవిత్రంగా ఉండేవారు! తర్వాత ఎంత అపవిత్రమైపోయారు! పవిత్రులను ఉన్నతమైనవారని అంటారు. దానిని నిర్వికారి ప్రపంచమని అంటారు. అక్కడ మీ రాజ్యముండేది, మళ్లీ మీరిప్పుడు ఆ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. తండ్రి కేవలం సూచన ఇస్తున్నారు - మీరు చాలా ఉత్తమ శివాలయమైన సత్యయుగములో నివసించేవారు. తర్వాత జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మధ్యలో వికారాలలోకి వెళ్లి పతిత వికారులుగా అయ్యారు. అర్ధకల్పము వికారులుగా ఉన్నారు, మళ్లీ మీరిప్పుడు సతోప్రధానమైన నిర్వికారులుగా అవ్వాలి. ఈ రెండు పదాలను గుర్తుంచుకోవాలి. ఇప్పుడిది తమోప్రధాన ప్రపంచము. సతోప్రధానమైన ప్రపంచానికి చిహ్నము - ఈ లక్ష్మీనారాయణులు. ఇది 5 వేల సంవత్సరాల నాటి విషయము. భారతదేశములో సతోప్రధానమైన రాజ్యముండేది. భారతదేశము చాలా ఉత్తమంగా ఉండేది, ఇప్పుడు కనిష్టంగా ఉంది. నిర్వికారులుగా ఉన్నవారు వికారులుగా అయ్యేందుకు మీకు 84 జన్మలు పట్టింది. భలే అక్కడ కూడా కళలు కొద్ది కొద్దిగా తక్కువవుతూ ఉంటాయి. కానీ వారిని సంపూర్ణ నిర్వికారులనే అంటారు కదా. సంపూర్ణ నిర్వికారుడని శ్రీకృష్ణుని అంటారు. అతడు సుందరంగా ఉండేవాడు, ఇప్పుడు నల్లగా అయ్యాడు. ఇక్కడ మీరు కూర్చొని ఉన్నారు. మనము శివాలయములో విశ్వాధికారులుగా ఉండేవారమని, మరొక ధర్మమే ఉండేది కాదని, కేవలం మన రాజ్యమే ఉండేదని మీ బుద్ధిలో ఉండాలి. తర్వాత రెండు కళలు తగ్గిపోయాయి. కొద్ది కొద్దిగా కళలు తగ్గుతూ తగ్గుతూ త్రేతా యుగమురöÖ0ö֐”Ń 4Ó˜öÖPöÖ@PöÖయి. తర్వాత వికారులుగా అయ్యి ఇంకా దిగజారుతూ, దిగజారుతూ ఛీ-ఛీ(అసహ్యము)గా అవుతారు. దీనిని వికారీ ప్రపంచమని అంటారు. విషయవైతరణీ నదిలో మునకలు వేస్తూ ఉంటారు, అక్కడ క్షీరసాగరములో ఉండేవారు. ప్రపంచమంతటి చరిత్ర-భూగోళ శాస్త్రమును, తమ 84 జన్మల కథను కూడా మీరు అర్థము చేసుకున్నారు, మనము నిర్వికారులుగా ఉండేవారము, వీరి రాజ్యములో ఉండేవారము, పవిత్ర రాజ్యముండేది. దానిని సంపూర్ణ స్వర్గమని అంటారు. త్రేతా యుగమును సెమీ స్వర్గమని అంటారు. ఈ విషయాలు బుద్ధిలో అయితే ఉన్నాయి కదా. తండ్రియే వచ్చి సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. మధ్యలోనే రావణుడు వచ్చాడు, మళ్లీ అంతములో ఈ వికారి ప్రపంచము వినాశనమవుతుంది. మళ్లీ ఆదిలోకి వెళ్లేందుకు పవిత్రంగా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావించి నన్నొక్కరినే స్మృతి చేయండి. స్వయాన్ని దేహమని భావించకండి. బాబా, మీరు వస్తే మేము మీ వారిగానే ఉంటామని భక్తిమార్గములో ప్రతిజ్ఞ చేశారు. ఆత్మ తండ్రితో మాట్లాడ్తుంది. కృష్ణుడు తండ్రి ఏమీ కాడు. ఆత్మల తండ్రి నిరాకార శివబాబా ఒక్కరే. ఆ హద్దు తండ్రి ద్వారా హద్దు వారసత్వము, బేహద్‌ తండ్రి ద్వారా బేహద్‌ వారసత్వము భారతదేశానికి లభిస్తుంది. అందువలన సత్యయుగాన్ని శివాలయమని అంటారు. శివబాబా వచ్చి దేవీ దేవతా ధర్మమును స్థాపించారు. ఇది సదా గుర్తు ఉంచుకోవాలి. ఆనందకరమైన విషయము కదా. మనమిప్పుడు మళ్లీ శివాలయములోకి వెళ్తాము. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులైనారని అంటారు. కాని అలా ఎవ్వరూ ఎప్పుడూ వెళ్లరు. అవన్నీ మనస్సును ఆనందపరచుకునేందుకు భక్తిమార్గములోని అసత్యపు పుకార్లు మాత్రమే. సత్యమైన స్వర్గానికి మీరిప్పుడు వెళ్లనున్నారు. అక్కడ ఏ రోగమూ ఉండదు, మీరు సదా హర్షితంగా ఉంటారు. తండ్రి ఎంత సహజంగా చిన్న-చిన్న పిల్లలకు తెలిపిన విధంగా అర్థం చేయిస్తున్నారు. బయట ఎక్కడున్నా మీరు పదవి పొందుకోవచ్చు. ఇందులో మొదట పవిత్రత ముఖ్యమైనది. ఆహార పానీయాలు శుద్ధంగా ఉండాలి. దేవతలకు ఎప్పుడైనా సిగరెట్టు, బీడీని నైవేద్యంగా పెడ్తారా? గురు గ్రంథమునకు ఎదురుగా ఎప్పుడైనా కోడిగుడ్డును లేక బీడి మొదలైన వాటిని నైవేద్యంగా పెట్టారా? గ్రంథమును, గురుగోవిందుని శరీరంగా భావిస్తారు, గ్రంథమునకు అంత గౌరవమునిస్తారు. గురువు దేహముగా భావిస్తారు. గురునానక్‌గారు గ్రంథమును వ్రాయలేదు, గురునానక్‌ అవతరించారు. సిక్కు మతస్థులు వృద్ధి అయిన తర్వాత ఆ గ్రంథమును వ్రాశారు. ఒకరి తర్వాత మరొకరు సిక్కు ధర్మములోకి వచ్చి చేరారు. గురుగ్రంథము కూడా మొదట చేతితో వ్రాయబడి, చాలా చిన్నదిగా ఉండేది. ఇప్పుడు భగవద్గీతను కృష్ణుని రూపంగా భావిస్తారు. గురునానక్‌ గ్రంథము వలె కృష్ణుని గీతకు కూడా మహిమ ఉంది. కృష్ణ భగవానువాచ అనే చెప్తూ ఉంటారు. దీనిని అజ్ఞానమని అంటారు. జ్ఞానము ఒక్క పరమపిత పరమాత్మలో మాత్రమే ఉంది. గీత ద్వారానే సద్గతి లభిస్తుంది. ఆ జ్ఞానము తండ్రి వద్ద మాత్రమే ఉంది. జ్ఞానము ద్వారా పగలు, భక్తి ద్వారా రాత్రి అవుతుంది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - ఆత్మను పవిత్రంగా చేసుకోవాలి. అందుకు కష్టపడాల్సి ఉంటుంది. ఒకేసారి జ్ఞానమంతా ఎగిరిపోయేంతగా మాయావీ తుఫానులు జోరుగా వస్తాయి. ఎవ్వరికీ చెప్పలేము. మొదట కామ వికారమే చాలా ఇబ్బంది పెడుతుంది, విసిగిస్తుంది. అందులోనే సమయము పడ్తుంది. జీవన్ముక్తి అయితే ఒక్క öÖ0ö֐”Ń 4Ó˜öÖPöÖ@PöÖ#3143;. పుత్రుడు జన్మిస్తూనే అధికారిగా అవుతాడు. శివబాబా వచ్చారని మీరు గుర్తించారు, వారసత్వానికి హక్కుదారులుగా అయ్యారు. గీత కూడా శివబాబాయే గానం చేశారు. వారే ''నన్నొక్కరినే స్మృతి చేయండి'' అని చెప్పారు. నేను ఈ సాధారణ తనువులో వస్తాను. కృష్ణుడు సాధారణమైనవాడు కాదు. అతడు జన్మ తీసుకోగానే మెరుపులు మెరుస్తాయి. చాలా ప్రభావము పడ్తుంది. అందువలన శ్రీ కృష్ణుని ఇప్పటివరకు కూడా మహిమ చేస్తారు. ఇక శాస్త్ర్రాలు మొదలైనవన్నీ భక్తిమార్గానికి చెందినవి. ఆంగ్లములో తత్వ శాస్త్రమని(ఫిలాసఫి) అంటారు. ఆధ్యాత్మిక జ్ఞానమైతే ఆధ్యాత్మిక తండ్రి మాత్రమే ఇవ్వగలరు. నేను మీ ఆధ్యాత్మిక తండ్రినని స్వయంగా వారే చెప్తున్నారు. నేను జ్ఞానసాగరుడను. పిల్లలైన మీరు తండ్రి ద్వారా నేర్చుకుంటున్నారు. జ్ఞానాన్ని ధారణ చేస్తున్నారు. చివరిలో మళ్లీ తండ్రి వలె అవుతారు. ఆధారమంతా ధారణ పై ఉంది. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మళ్లీ ఆ శక్తి వచ్చేస్తుంది. స్మృతిని పదును అని అంటారు. ఖడ్గాలలో కూడా తేడా అయితే ఉంటుంది కదా. 100 రూపాయల ఖడ్గమూ ఉంటుంది, 3-4 వేల రూపాయల ఖడ్గము కూడా ఉంటుంది. బాబా అయితే అనుభవీ కదా. ఖడ్గానికి చాలా గౌరవముంటుంది. గురుగోవింద్‌ సింగ్‌గారి ఖడ్గానికి ఎంత గౌరవముంది! పిల్లలైన మీలో కూడా యోగబలము ఉండాలి. కావున జ్ఞానమనే ఖడ్గములో పదును ఉండాలి. పదును వస్తే త్వరగా అర్థము చేసుకుంటారు. డ్రామానుసారం మీరు కష్టపడుతూ ఉంటారు. తండ్రిని ఎంతెంత స్మృతి చేస్తారో, స్మృతి చేయడం ద్వారానే పాపము సమాప్తమవుతుంది. పతిత పావనులైన తండ్రియే యుక్తిని తెలుపుతున్నారు. మళ్లీ కల్పము తర్వాత కూడా ఈ విధంగానే వచ్చి మీకు జ్ఞానమునిస్తారు. ఇతనితో కూడా అంతా త్యాగము చేయించి తమ రథంగా చేసుకుంటాడు. అక్కడ మీకు ఎంత ఆకర్షణ కలిగింది! దానితో అందరూ ఎలా పరుగెత్తి వచ్చేశారు. తండ్రిలో ఆకర్షణ ఉంది కదా! ఇప్పుడు మీరు కూడా ఇలా సంపూర్ణంగా అవ్వాలి. నంబరువారుగానే అవుతారు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది.
సత్యయుగం ఆది నుండి కలియుగాంతము వరకు తిరుగు సృష్టి చక్రమునైతే అర్థం చేసుకున్నారు. ఇది సంగమ యుగము. పావనంగా చేసేందుకు తండ్రి కూడా తప్పకుండా రావలసి వచ్చింది. పావనము అనగా సతోప్రధానము. మళ్లీ త్రుప్పు(మలినము) పడుతూ పోయింది. ఆ త్రుప్పు ఇప్పుడెలా తొలగిపోతుంది? ఆత్మ సత్యంగా ఉన్నప్పుడు శరీరము కూడా సత్యమైనది అనగా సుందరంగా ఉంటుంది. ఆత్మ అసత్యంగా అయితే శరీరము కూడా పతితమౌతుంది. జ్ఞానము తెలియకముందు ఇతడు కూడా నమస్కారము - వందనము చేస్తూ ఉండేవాడు. ఆయిల్‌తో పెయింట్‌ చేసిన లక్ష్మినారాయణుల పెద్ద చిత్రము గద్దె పై వ్రేలాడుతూ ఉండేది. వారినే చాలా ప్రేమగా స్మృతి చేసేవాడు. ఇతరులనెవ్వరినీ స్మృతి చేసేవాడు కాదు. ఆలోచనలు వేరే వైపు వెళ్తూ ఉంటే చెంపదెబ్బలు వేసుకునేవాడు. మనసు ఎందుకు పరిగెడ్తూ ఉంది? ఎందుకు దర్శనమవ్వడం లేదు? అని అనుకునేవాడు. భక్తిమార్గములో ఉండేవాడు కదా. తర్వాత విష్ణువు దర్శనమైనంత మాత్రాన నారాయణునిగా తయారైనాడా? పురుషార్థమైతే తప్పకుండా చేయాల్సి ఉంటుంది. లక్ష్యము ఎదురుగా నిలబడి ఉంది. చైతన్యంగా ఉండినవారి జడ చిత్రాలను తయారు చేశారు. పావనంగా, నరుని నుండి నారాయణునిగా చేసేందుకు తండ్రి వచ్చారు. మీరు కూడా వారి రాజధానిలో ఉండేవారు. మరి ఆ విధంగా తయారయ్యే పురుషార్థము చేస్తున్నారు కనుక తండ్రిన఺öÖ0ö֐”Ń 4Ó˜öÖPöÖ@PöÖ3135;. బ్రహ్మను దేవుడని అనరు. విష్ణుదేవా! అని అనడం సరియైనది. మానవులకైతే ఏమీ తెలియదు. గురు బ్రహ్మ, గురు విష్ణు...... అని అంటారు. ఇప్పుడు విష్ణువు ఎవరికి గురువుగా ఉన్నాడు? అందరినీ గురువు-గురువు అని అంటూ ఉంటారు. శివ పరమాత్మాయ నమ: అని అంటారు. వారినే గరువని, పరమాత్మ అని అంటారు. తండ్రియే అందరికంటే గొప్పవారు కదా. ఇతరులకు నేర్పించేందుకు వారి ద్వారా మనము నేర్చుకుంటున్నాము. సద్గురువు అర్థం చేయించిన విషయాలను మీరు ఇతరులకు అర్థం చేయిస్తారు. గురువును తండ్రి అని, టీచర్‌ అని అనరు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉండాలి. మనము శివాలయములో ఉండేవారము. ఇప్పుడు వేశ్యాలయములో ఉన్నాము. మళ్లీ ఇప్పుడు శివాలయములోకి వెళ్లాలి. భలే బ్రహ్మలో లీనమైనారని, జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని అంటారు. కానీ ఆత్మ అవినాశిగా ఉంటుంది. ప్రతి ఒక్కరిలో తమ-తమ పాత్ర నిండుగా ఉంది. అందరూ పాత్రధారులే, వారు తమ-తమ పాత్ర చేయాల్సిందే. అది ఎప్పటికీ చెరిగిపోదు, ఈ ప్రపంచములోని ఆత్మలందరూ వారి పాత్రను అభినయించాల్సిందే. క్రొత్తగా షూటింగ్‌ జరుగుతున్న విధంగా జరుగుతోంది. కానీ ఇది అనాదిలో జరిగిన షూటింగ్‌. ఈ ప్రపంచ చరిత్ర-భూగోళాలు పునరావృతమౌతూ ఉంటాయి. ఇది భృకుటి మధ్యలో మెరుస్తున్న అద్భుతమైన నక్షత్రము. ఎప్పటికీ అరిగిపోదు. ఇంతకు ముందు ఈ జ్ఞానము మీలో ఉండేది కాదు. వండర్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ అయిన స్వర్గము అను పేరు వినగానే మనసు సంతోషిస్తుంది. ఇప్పుడైతే సత్యయుగము లేనే లేదు, ఇది కలియుగము కనుక కలియుగములోనే పునర్జన్మలు తీసుకుంటారు. తప్పకుండా అందరూ వెళ్లాల్సిందే. కానీ పతితంగా ఉన్న ఆత్మలు వెళ్లలేరు. పిల్లలైన మీరిప్పుడు యోగబలము ద్వారా పావనంగా అవుతారు. పావన ప్రపంచాన్ని గాడ్‌ ఫాదరే స్థాపన చేస్తారు. మళ్లీ రావణుడు నరకంగా చేస్తాడు. ఇది ప్రత్యక్షంగా ఉంది కదా. రావణుని తగులబెట్తారు కదా! ఇది అనాదిగా వస్తోందని మనుష్యులంటారు. కానీ ఎప్పటి నుండి ప్రారంభమయ్యిందో కూడా ఎవ్వరికీ తెలియదు. సగము సగము చేయలేరు. ఎందుకంటే లక్షల సంవత్సరాలని అనేస్తారు. కలియుగానికే ఇంకా 40 వేల సంవత్సరాలని అంటారు. కావున మనుష్యులు గాఢాంధకారములో ఉన్నారు కదా. అజ్ఞాన నిద్ర నుండి మేల్కోవడం చాలా కష్టము, మేల్కోనే మేల్కోరు. ఇది సంగమ యుగము. సంగమయుగములో తండ్రి వచ్చి పావనంగా అయ్యేందుకు యుక్తి తెలుపుతున్నారు. మీరు పావనంగా అయితే పావన ప్రపంచము తప్పకుండా స్థాపనవుతుంది, ఈ పతిత ప్రపంచము సమాప్తమైపోతుంది. ఇప్పుడెంత పెద్ద ప్రపంచంగా ఉంది. సత్యయుగములో అయితే చాలా చిన్న ప్రపంచంగా అయిపోతుంది. ఇప్పుడు మాయ పై విజయము పొంది తప్పకుండా పావనంగా అవ్వాలి. తండ్రి చెప్తున్నారు - మాయ చాలా శక్తివంతమైనది, పావనంగా తయారవ్వడంలోనే అనేక విధాలైన విఘ్నాలు కలిగిస్తుంది. పవిత్రంగా అయ్యేందుకు ధైర్యమున్నా మాయ వచ్చి ఎలాంటి పరిస్థితి తెస్తుంది! ఒక్క ఘూసాతో(ముష్టిఘాతము, గుద్దు) క్రింద పడేస్తుంది, సంపాదించిన దానినంతా సమాప్తము చేసేస్తుంది. మళ్లీ చాలా కష్టపడాల్సి వస్తుంది. కొంతమంది క్రింద పడ్తారు, మళ్లీ వారి మొఖము కూడా చూపించరు. ఉన్నత పదవిని పొందలేరు. పురుషార్థమును పూర్తిగా చేయాలి. ఫెయిల్‌ అవ్వరాదు. అందువలన కొందరు గాంధర్వ వివాహమును కూడా చేసుకుని చూపిస్తారు. వివాహము చేసుకొని పవిత్రంగా ఉండడం అసంభవమని సన్యాసులు అంటారు. తండ్రి చెప్తున్నారు - అపారమైన ప్రాప్తి ఉన్నందున ఇది సాధ్యము. ఈ చివరి జన్మలో మీరు పవిత్రంగా అయితే మీకు స్వర్గ చక్రవర్తి పదవి లభిస్తుంది. ఇంత గొప్ప ప్రాప్తిని పొందేందుకు మీరు ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండలేరా? ''బాబా, మేము తప్పకుండా ఉంటాము'' అని అంటారు. సిక్కులు కూడా పవిత్రతా కంకణాన్ని ధరిస్తారు. ఇక్కడ ఏ దారము మొదలైనవి కట్టుకునే అవసరము లేదు. ఇది బుద్ధికి సంబంధించిన విషయము. తండ్రి చెప్తున్నారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. పిల్లలు చాలా మందికి వినిపిస్తారు. కానీ గొప్ప వ్యక్తుల బుద్ధిలో కూర్చోదు. మొదట వారికి వీరంతా ప్రజాపిత బ్రహ్మ సంతానమని అర్థం చేయించండి. శివబాబా ద్వారా వారసత్వము లభిస్తోంది. పతితుల నుండి పావనంగా అవ్వాలి. నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. ఈ విధంగా మరెవ్వరూ చెప్పలేరు. భారతదేశము మొదట నిర్వికారిగా ఉండేదని, ఇప్పుడు వికారిగా అయ్యిందని, మళ్లీ నిర్వికారిగా ఎలా అవుతుందో వారి బుద్ధిలో ఉండే విధంగా తెలపాలి. భగవానువాచ - ''నన్నొక్కరినే స్మృతి చేయండి.'' ఇంత మాత్రము చెప్పినా అహో సౌభాగ్యము! కానీ ఇది కూడా చెప్పలేరు, మర్చిపోతారు. ఉద్ఘాటన అయితే తండ్రి చేసేశారు. మిగిలింది మీరు నిమిత్తంగా చేస్తున్నారు. పునాది వేసేశారు, ఇప్పుడింక సర్వీస్‌ స్టేషన్‌ ఉద్ఘాటన జరుగుతుంది. ఇది గీతలోని విషయమే. గీతలో కూడా - ఓ పిల్లలారా, మీరు కామము పై విజయము పొందితే 21 జన్మల వరకు జగజ్జీతులుగా అవుతారని ఉంది. మీరు అవ్వకపోయినా ఇతరులకైనా అర్థం చేయించండి. ఇతరులను లేపి, తాము క్రింద పడిపోయినవారు చాలామంది ఉన్నారు. కామము మహాశత్రువు, పూర్తిగా మురికి కాలువలో పడేస్తుంది. ఏ పిల్లలైతే కామము పై విజయము పొందుతారో వారే జగత్‌ జీతులుగా అవుతారు.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. ఈ అంతిమ జన్మలో సర్వ ప్రాప్తులను ఎదురుగా ఉంచుకొని పావనంగా అయ్యి చూపించాలి. మాయ విఘ్నాలతో ఓడిపోరాదు.

2. లక్ష్యమును, ఉద్ధేశ్యమును ఎదురుగా ఉంచుకొని పురుషార్థము పూర్తిగా చేయాలి. బ్రహ్మాబాబా ఎలాగైతే పురుషార్థము చేసి నరుని నుండి నారాయణునిగా అవుతారో, అలా వారిని అనుసరించి సింహాసనాధికారులుగా అవ్వాలి. ఆత్మను సతోప్రధానంగా తయారు చేసునేందుకు కష్టపడాలి.

వరదానము :-

'' శుభచింతన ద్వారా నెగటివ్‌ను పాజిటివ్‌లోకి పరివర్తన చేసే శుభచింతక్‌ భవ ''

సదా సమర్థంగా ఉండేందుకు కేవలం రెండు మాటలు గుర్తుంచుకోండి - శుభ చింతన, శుభ చింతకులు. ఈ రెండిటికి పరస్పర సంబంధముంది. శుభ చింతన లేకుంటే శుభ చింతకులుగా కూడా అవ్వలేరు. వర్తమాన సమయంలో ఈ రెండిటి పై అటెన్షన్‌(గమనము) ఉంచండి. ఎందుకంటే అనేక సమస్యలు, అనేకమంది మనుష్యులు ఎలా ఉన్నారంటే వాచా ద్వారా అర్థం చేసుకోరు. కాని శుభచింతకులుగా అయ్యి వైబ్రేషన్లు ఇస్తే మారిపోతారు.

స్లోగన్‌ :-

'' జ్ఞానరత్నాలతో, గుణాలతో, శక్తులతో ఆడుకోండి, మట్టితో కాదు. ''