01-03-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - తండ్రి కర్తవ్యానికి, పిల్లల కర్తవ్యానికి గల వ్యత్యాసాన్ని గుర్తించండి. పిల్లలైన మీతో తండ్రి ఆడుకోగలరు కాని భుజించలేరు. ''

ప్రశ్న :-

సత్యమైన సాంగత్యము తేలుస్తుంది, కు సాంగత్యము అనగా చెడు సాంగత్యము ముంచుతుంది - దీని భావార్థమేమి ?

సమా :-

ఇప్పుడు మీరు సత్యమైన సాంగత్యము చేస్తున్నారు అనగా బుద్ధి యోగమును తండ్రితో జోడిస్తున్నారు. కనుక తీరానికి చేరుకుంటారు. మళ్లీ నెమ్మది నెమ్మదిగా చెడు సాంగత్యము అనగా దేహ సాంగత్యములోకి వస్తారు. కనుక క్రిందికి దిగుతూ వస్తారు. ఎందుకంటే సాంగత్యము రంగు అంటుకుంటుంది. అందుకే సత్యమైన సాంగత్యము తేలుస్తుంది, చెడు సాంగత్యము ముంచుతుంది అని అంటారు. మీరు దేహ సహితము దేహ సంబంధములన్నీ మరచి తండ్రి సాంగత్యమును చేయండి అనగా తండ్రిని స్మృతి చేస్తే తండ్రి సమానంగా పావనమవుతారు.

ఓంశాంతి.

ఇప్పుడు పిల్లలకు రెండు క్లాసులు అయిపోయాయి. ఇవి బాగున్నాయి. ఒకటేమో స్మృతి యాత్ర. దాని ద్వారా పాపాలు నశిస్తూ పోతాయి. ఆత్మ పవిత్రమౌతూ ఉంటుంది. రెండవది జ్ఞాన క్లాసు. జ్ఞానము కూడా చాలా సులభము. ఏ కష్టమూ లేదు. మీ సేవాకేంద్రానికి, ఇక్కడ(మధువనము)కు తేడా ఉంటుంది. ఇక్కడైతే తండ్రి కూర్చుని ఉన్నారు. పిల్లలు కూడా కూర్చుని ఉన్నారు. ఇది తండ్రి, పిల్లల కలయిక. మీ సేవాకేంద్రాలలో పరస్పరము పిల్లల కలయికే జరుగుతుంది. అందుకే పిల్లలు తండ్రి సన్ముఖములోకి వస్తారు. భలే స్మృతి చేస్తారు కానీ మీరు సన్ముఖములో చూస్తారు - '' మీతోనే కూర్చుంటాను, మీతోనే సంభాషిస్తాను,....... తండ్రి కర్తవ్యానికి, పిల్లల కర్తవ్యానికి తేడా ఉందని తండ్రి అర్థం చేయించారు. ఇందులో బాబా పాత్ర ఏమిటో, రథము పాత్ర ఏమిటో ఆలోచించండి. బాబా రథము ద్వారా ఆడగలరా? ఆడగలరు. మీతోనే కూర్చుంటాను, అలాగే మీతోనే తింటాను............... అని అంటారు. కాని అలా జరగదు ఎందుకంటే వారు స్వయం తినరు. పిల్లలతో ఆడుకోవడం, ఎగరడం వేరే విషయము. ఇద్దరూ ఆడుకుంటారని తండ్రికి స్వయంగా తెలుస్తుంది. ఇచ్చట మీ జతలోనే అంతా చేస్తారు. ఎందుకంటే వారు సుప్రీమ్‌ టీచరు కూడా అయ్యారు. పిల్లలను సంతోషపెట్టడం టీచరు కర్తవ్యము. ఇండోర్‌ గేమ్స్‌(ఇంటిలో ఆడుకొనే ఆటలు) ఉంటాయి కదా. ఈ రోజుల్లో ఆటలు కూడా అనేక రకాలు వెలువడ్డాయి. అన్నిటికంటే ప్రసిద్ధి చెందిన ఆట పచ్చీసు (పాచికలతో ఆడేది)ఆట. దీనిని మహాభారతములో వర్ణించారు. అయితే అది జూదము రూపములో చూపించారు. జూదము ఆడేవారిని పట్టుకుంటారు. ఇవన్నీ భక్తి మార్గములో పుస్తకాల ద్వారా వెలువడిన విషయాలు.

ఈ వ్రతాలు, నియమాలు మొదలైనవవన్నీ భక్తి మార్గములోని విషయాలని మీకు తెలుసు. నీరు త్రాగరు, భోజనము తినరు. దీనిని నిర్జల ఉపవాసము అని అంటారు. ఒకవేళ భక్తి మార్గములో ప్రాప్తి జరిగినా, అది అల్పకాలానికే. ఇక్కడ పిల్లలైన మీకు అన్నీ అర్థం చేయించబడ్తాయి. భక్తి మార్గములో అనేక ఎదురు దెబ్బలు తింటారు. జ్ఞాన మార్గము సుఖమైన మార్గము. మనము సుఖ వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకుంటున్నామని మీరు తెలుసుకున్నారు. భక్తి మార్గములో కూడా ఒక్కరినే స్మృతి చేస్తారు. ఒక్కరినే పూజిస్తే దానిని అవ్యభిచారి పూజ అని అంటారు. అది కూడా మంచిదే. భక్తి కూడా సతో, రజో, తమోగా ఉంటుంది. అన్నిటికంటే శ్రేష్ఠమైనది సతోగుణ భక్తి - శివబాబా భక్తి. శివబాబాయే వచ్చి పిల్లలందరినీ సుఖధామానికి తీసుకెళ్తారు. ఎవరైతే అందరికంటే ఎక్కువగా సేవ చేస్తారో, పావనంగా చేస్తారో వారిని పిలుస్తూ కూడా ఉంటారు. మళ్లీ రాయి - రప్పలలో ఉన్నారని అంటారు. ఇది గ్లాని(నింద) చేయడం కదా. పిల్లలైన మీకు అనంతమైన తండ్రి ద్వారా రాజ్య భాగ్యము లభించింది. మళ్లీ తప్పకుండా లభిస్తుంది. జ్ఞానము వేరని, భక్తి వేరని మీరు అర్థం చేసుకున్నారు. రామరాజ్యము, రావణరాజ్యము ఎలా జరుగుతాయో కూడా నంబరువారు పురుషార్థానుసారము మీకు తెలుసు. అందుకే కరపత్రాలు మొదలైనవి కూడా అచ్చు వేయిస్తూ ఉంటారు. ఎందుకంటే మానవులకు సత్యమైన జ్ఞానము కూడా అవసరము కదా. మీరు చెప్పేదంతా సత్యమైనది.

పిల్లలు సేవ చేయాలి. చేయవలసిన సేవ అయితే చాలా ఉంది. సేవ చేసేందుకు ఈ బ్యాడ్జి చాలా బాగుంది. ఈ బ్యాడ్జే అన్నిటికంటే గొప్ప శాస్త్రము. ఇవన్నీ జ్ఞాన విషయాలు. ఈ స్మృతియాత్ర వేరుగా ఉంటుందని అర్థం చేయించవలసి ఉంటుంది. దీనిని అజపాజపము అని అంటారు. జపించేదేమీ లేదు. లోపల కూడా శివ-శివ అని అనుకోరాదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. శివబాబా మనందరి తండ్రి అని, ఆత్మలైన మనము వారి సంతానమని మీకు తెలుసు. నేను పతితపావనుడనని, కల్ప-కల్పము పావనంగా చేసేందుకు వస్తానని వారు సన్ముఖములోకి వచ్చి చెప్తున్నారు. దేహ సహితము, దేహ సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. మీ తండ్రి అయిన నన్ను స్మృతి చేస్తే మీరు పావనమైపోతారు. పతితులను పావనంగా చేయడమే నా పాత్ర. ఇది బుద్ధియోగము అనగా తండ్రి సాంగత్యములో ఉండుట. సాంగత్యము ద్వారా రంగు అంటుకుంటుంది. మంచి సాంగత్యము తేలుస్తుంది(ఉద్ధరిస్తుంది), చెడు సాంగత్యము ముంచుతుందని అంటారు....... బుద్ధి యోగమును తండ్రితో జోడించినందున మీరు ఆవలి తీరానికి వెళ్ళిపోతారు. మళ్లీ క్రిందకు దిగడం ప్రారంభిస్తారు. అందుకే సత్యమైన సాంగత్యము తేలుస్తుంది............. అని అంటారు. భక్తిమార్గములోని వారికి దీని అర్థము తెలియదు. ఆత్మలైన మనము పతితంగా అయ్యామని మీరు అర్థం చేసుకున్నారు. పతితులైన మనము వీరితో బుద్ధి యోగాన్ని జోడిస్తే పవిత్రంగా అవుతాము. పరమాత్మ అయిన తండ్రిని ఆత్మ స్మృతి చేయవలసి ఉంటుంది. ఆత్మ పవిత్రమైనప్పుడు శరీరము కూడా పవిత్రమవుతుంది. సత్యమైన బంగారుగా అవుతుంది. ఇది స్మృతియాత్ర. యోగాగ్ని ద్వారా వికర్మలు భస్మమవుతాయి. మురికి వదిలిపోతుంది. సత్యయుగ నూతన ప్రపంచంలో మనము పవిత్రంగా సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారమని, 16 కళా సంపూర్ణముగా కూడా ఉండేవారమని మీకు తెలుసు. ఇప్పుడు ఒక్క కళ కూడా లేదు. దీనిని రాహుగ్రహణము అని అంటారు. ప్రపంచమంతా ముఖ్యంగా భారతదేశానికి రాహు గ్రహణము పట్టి ఉంది. శరీరాలు కూడా నల్లగా అయ్యాయి. ఈ కళ్ళతో మీరు చూచేవన్నీ నల్లవే అనగా అపవిత్రమైనవే. యథా రాజా - రాణి తథా ప్రజా. శ్యామసుందరుని అర్థము కూడా ఎవ్వరికీ తెలియదు. మానవులు అనేక పేర్లు పెట్టేశారు. ఇప్పుడు తండ్రి వచ్చి అర్థము తెలిపించారు. మీరే మొదట సుందరంగా ఉండేవారు, తర్వాత శ్యామంగా అవుతారు. జ్ఞాన చితి పై కూర్చున్నందున మీరు సుందరంగా అవుతారు. మళ్లీ ఇలాగే అవ్వాలి - శ్యామము నుండి సుందరము, సుందరము నుండి శ్యామంగా అవుతారు. దీని అర్థమును తండ్రి వచ్చి ఆత్మలకు తెలిపించారు. ఆత్మలైన మనము ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తాము. మనము బిందువులమని బుద్ధిలోకి వచ్చేసింది. దీనిని ఆత్మానుభూతి (రియలైజేషన్‌ ) అని అంటారు. ఆత్మను చూచేందుకు దివ్యదృష్టి కావాలి, స్థూలమైన కంటికి కనిపించదు. ఇవి అర్థము చేసుకునే విషయాలు. ఆత్మ, '' నేను ఆత్మను, ఇది నా శరీరము అని అర్థం చేసుకోవాలి. ఇచ్చట మనము శరీరములోకి వచ్చి పాత్రను అభినయిస్తాము. మొట్టమొదట డ్రామా ప్లాను అనుసారము మనము ఇక్కడకు వస్తాము. అందరూ ఆత్మలే కాని కొంతమందిలో కొంత పాత్ర, మరి కొంతమందిలో మరికొంత పాత్ర నిండి ఉంది. ఇది చాలా గొప్ప అనంతమైన నాటకము. ఇందులోనికి నంబరువారుగా ఎలా వస్తారో పాత్రను ఎలా అభినయిస్తారో మీకు తెలుసు. మొట్టమొదట దేవీ దేవతల వంశముంటుంది. ఈ జ్ఞానము కూడా మీకు ఇప్పుడు మాత్రమే ఈ పురుషోత్తమ సంగమ యుగములోనే ఉంది. ఆ తర్వాత ఇది కొంచెం కూడా గుర్తు ఉండదు. తండ్రే స్వయంగా చెప్తున్నారు - ఈ జ్ఞానము లోపించిపోతుంది. దేవీ దేవతా ధర్మ స్థాపన ఎలా జరిగిందో ఎవ్వరికీ తెలియదు. దేవతల చిత్రాలైతే ఉన్నాయి కాని వారి ధర్మము ఎలా స్థాపన అయ్యిందో ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు తెలుసు. మళ్లీ మీరు ఇతరులను కూడా మీ సమానంగా చేస్తారు. చాలామంది తయారవుతే మీరు మైకు కూడా పెట్టుకోవలసి వస్తుంది. ఏదో ఒక యుక్తి తప్పకుండా వెలువడ్తుంది. చాలా పెద్ద హాలు కూడా అవసరమవుతుంది. కల్పక్రితము ఏ కర్తవ్యము జరిగిందో మళ్లీ అదే జరుగుతుంది. ఇది బాగా అర్థమవుతుంది. పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. వివాహాల కొరకు కళ్యాణమంటపాలు మొదలైనవి నిర్మించేవారికి కూడా అర్థం చేయించండని బాబా తెలిపించారు. ఇక్కడ కూడా వివాహాల కొరకు ధర్మశాలలు మొదలైనవి నిర్మిస్తున్నారు కదా. మన కులానికి చెందినవారైతే వెంటనే అర్థము చేసుకుంటారు. ఈ కులానికి చెందనివారిగా ఉంటే విఘ్నాలు కలిగిస్తారు. ఈ కులానికి చెందిన వారైతే వీరు సత్యమే చెప్తున్నారని అంగీకరిస్తారు. ఈ ధర్మానికి చెందినవారు కాకుంటే కొట్లాడ్తారు. ఈ ఆచారాలు ఎప్పటి నుండో వస్తున్నాయని అంటారు. ఇప్పుడు అపవిత్ర ప్రవృత్తి మార్గముంది. పావనంగా తయారు చేసేందుకు మళ్లీ తండ్రి వచ్చారు. మీరు పవిత్రత గురించి ఒత్తి చెప్తారు. కావున ఎన్నో విఘ్నాలు ఏర్పడ్తాయి. ఆగాఖాన్‌కు(ఒక గురువు) ఎంత గౌరవముంది! అలాగే పోప్‌కు కూడా చాలా గౌరవముంది. పోప్‌ వచ్చి ఏమి చేస్తారో మీకు తెలుసు - ల్షల, కోట్ల వివాహాలు జరిపిస్తారు. చాలా వివాహాలు జరుగుతాయి. పోప్‌ వచ్చి వధువు, వరులకు ముడి వేస్తారు. ఇది గౌరవమైన కార్యమని వారు భావిస్తారు మహాత్మలను కూడా వివాహాలకు ఆహ్వానిస్తారు. ఈ రోజులలో నిశ్చితార్థాలు కూడా చేయిస్తారు. కామము మహాశత్రువని తండ్రి చెప్తున్నారు. ఈ ఆర్డినెన్స్‌ జారీ చేయడం సులభము కాదు. దీనిని అర్థం చేయించేందుకు చాలా యుక్తి కావాలి. పోను పోను నెమ్మది నెమ్మదిగా అర్థం చేసుకుంటూ వస్తారు. ఎవరైతే ఆది సనాతన హిందూ ధర్మానికి చెందిన వారిగా ఉన్నారో వారికి అర్థం చేయించండి. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఉండేదని, హిందూ ధర్మము కాదని వారు వెంటనే అర్థము చేసుకుంటారు. తండ్రి ద్వారా మీరు ఎలా తెలుసుకున్నారో అలా ఇంకా చాలా మంది అర్థం చేసుకొని వృద్ధి చెందుతూ ఉంటారు. ఇది కూడా పక్కాగా నిశ్చితమై ఉంది, ఈ నాటు పడుతూ ఉంటుంది. మీరు తండ్రి శ్రీమతమును అనుసరించి దేవతలుగా అవుతారు. వీరు నూతన ప్రపంచములో ఉండేవారు. తండ్రి సంగమ యుగములోకి వచ్చి మనలను బదిలీ చేస్తారని మొదట మీకు తెలియదు. కొంచెం కూడా తెలియదు. ఇది సత్యమైన పురుషోత్తమ సంగమ యుగమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మనము పురుషోత్తములుగా అవుతున్నాము. ఇప్పుడు ఎంత పురుషార్థము చేస్తామో, అంత దేవతలుగా అవుతాము.

ప్రతి ఒక్కరు తమను తాము హృదయములో ప్రశ్నించుకోవాలి. పాఠశాలలో ఏ సబ్జక్ట్‌లో కచ్ఛాగా(బలహీనంగా) ఉంటామో అందులో పాస్‌ అవ్వలేమని అర్థము చేసుకుంటారు. ఇది కూడా ఒక పాఠశాల. గీతా పాఠశాల ప్రసిద్ధి చెందింది కదా. తర్వాత దాని పేరు కొద్ది కొద్దిగా మార్చేశారు. సత్యమైన గీత, అసత్యమైన గీత అని మీరు వ్రాసినా వారు కోపపడ్తారు. తప్పకుండా గొడవలు జరుగుతాయి. ఇందులో భయపడే విషయము ఏదీ లేదు. ఈ రోజుల్లో బస్సులు మొదలైనవి తగులబెడ్తూ నిప్పు అంటించడం మొదలైనవి ఫ్యాషన్‌గా తయారయ్యింది. ఎవరు ఏది నేర్పితే అదే నేర్చుకున్నారు. పూర్వము కంటే ఇప్పుడు ఎక్కువగా నేర్చుకున్నారు. అందరూ పికెటింగ్‌లు మొదలైనవి చేస్తూ ఉంటారు. ప్రభుత్వానికి కూడా ప్రతి సంవత్సరము నష్టము వాటిల్లుతుంది. అందువలన మళ్లీ పన్నులు పెంచబడ్తాయి. ఒకానొక రోజు బ్యాంకులు మొదలైన అన్ని ఖజానాలు తెరిచేస్తారు. ధాన్యము మొదలైన వాటి కొరకు ఎక్కువ స్టాక్‌ పెట్టలేదు కదా అని అన్ని చోట్ల వెతుకుతారు. ఈ విషయాలన్నింటి నుండి మీరు విడుదలయ్యారు. మీకు ముఖ్యమైనది స్మృతి యాత్ర. తండ్రి చెప్తున్నారు - నాకు ఈ విషయాలతో ఏ సంబంధమూ లేదు. దారి చూపడం మాత్రమే నా కర్తవ్యము. అలా నడుచుకుంటే మీ దు:ఖములన్నీ దూరమైపోతాయి. ఈ సమయంలో మీ కర్మల లెక్కాచారమంతా చుక్తా అవుతుంది. లోపల దాగి ఉన్న, మిగిలి ఉన్న జబ్బులన్నీ బయట పడ్తాయి. ఇంకా మిగిలి ఉన్న లెక్కాచారమంతా చివరిలో చుక్తా అవ్వాలి. భయపడరాదు. జబ్బు పడినప్పుడు కూడా మానవులకు భగవంతుని స్మృతినిప్పిస్తారు కదా. మీరు ఆసుపత్రులకు కూడా వెళ్ళి తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయని జ్ఞానము ఇవ్వండిి. కేవలం ఈ ఒక్క జన్మకే కాదు భవిష్య 21 జన్మలకు ఎప్పుడూ జబ్బులు రావని మేము గ్యారంటీ ఇస్తామని, ఒక్క తండ్రిని స్మృతి చేసినందున మీ ఆయువు వృద్ధి చెందుతుందని చెప్పండి. భారతీయుల ఆయువు చాలా ఎక్కువగా ఉండేది. నిరోగులుగా ఉండేవారు. ఇప్పుడు పిల్లలైన మీరు శ్రేష్ఠంగా అయ్యేందుకు తండ్రి శ్రీమతమును ఇస్తున్నారు. పురుషోత్తమ అనే పదమును ఎప్పుడూ మర్చిపోరాదు. కల్ప-కల్పము మీరే తయారవుతారు. ఈ విధంగా ఇతరులెవ్వరూ చెప్పలేరు. ఈ విధమైన సేవ మీరు ఎంతైనా చేయగలరు. డాక్టర్ల నుండి ఏ సమయములోనైనా మీరు అనుమతి తీసుకోవచ్చు. ఉద్యోగము చేయువారు కూడా చాలా సేవ చేయగలరు. మా డాక్టరు కూడా చాలా గొప్పవాడని, అవినాశి సర్జను అని రోగులకు చెప్పండి. మేము అతని వారిగా అయిపోయాము, అందువలన 21 జన్మలు నిరోగులుగా అవుతామని వారికి చెప్పండి. ఆరోగ్య మినిష్టరుకు - ఆరోగ్యము కొరకు ఇంతగా ఎందుకు తల బాదుకుంటారు(కష్టపడ్తారు), సత్యయుగములో మనుష్యులు చాలా తక్కువగా ఉండేవారు, శాంతి, సుఖము, పవిత్రత అన్నీ ఉండేవని అర్థం చేయించండి.

మొత్తము ప్రపంచములో అందరికీ కళ్యాణము చేయువారు మీరే. మీరు పండాలు(మార్గదర్శకులు) కదా. పాండవ సంప్రదాయానికి చెందినవారు. ఇది ఎవరి బుద్ధిలోనూ ఉండదు. ఆహార మంత్రికి - మొట్టమొదటి ఆహారమంత్రి వర్యులు శివబాబా అని అర్థం చేయించండి. వారు ఎంత గమనమును ఇస్తారంటే స్వర్గములో ఎప్పుడూ కొరత ఏర్పడదు అని చెప్పండి. ఇప్పుడు మీరు సంగమ యుగములో ఉన్నారు. సృష్టిచక్రమంతా మీ బుద్ధిలో ఉంది. అందుకే మిమ్ములను స్వదర్శన చక్రధారులని అంటారు. పోతే భారతదేశము దివాలా తీసింది. తెలివిగలవారు వచ్చి తెలివి(జ్ఞానము) నేర్పిస్తూ ఉంటారని కూడా పిల్లలైన మీకు తెలుసు. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. ఒక్క తండ్రిని మాత్రమే సాథీ(స్నేహితుడు, జతగాడు)గా చేసుకొని మీతోనే కూర్చుంటాను. మీతోనే తింటాను, మీతోనే వింటాను,........... దీనిని అనుభవం చేయాలి. చెడు సాంగత్యాన్ని వదిలి సత్యమైన సాంగత్యంలో ఉండాలి.

2. కర్మల లెక్కాచారాన్ని స్మృతియాత్ర మరియు కర్మభోగముల ద్వారా చుక్తా చేసుకొని సంపూర్ణ పావనంగా అవ్వాలి. సంగమ యుగములో స్వయాన్ని పూర్తిగా బదిలీ(ట్రాన్స్‌ఫర్‌) చేయాలి.

వరదానము :-

''పాయింటు స్వరూపంలో స్థితమై మనసు - బుద్ధిని నెగటివ్‌ ప్రభావము నుండి సురక్షితంగా ఉంచుకునే విశేష ఆత్మా భవ''

ఎలాగైతే ఏదైనా సీజన్‌ ప్రభావం నుండి రక్షించుకునేందుకు దాని అనుసారము గమనముంచుతారో, వర్షము వస్తే గొడుగులు, రెయిన్‌ కోట్‌ మొదలైన వాటి పై గమనముంచుతారో, చలికాలము వస్తే ఉన్ని వస్త్రాలు ధరిస్తారో...... అలా వర్తమాన సమయంలో మనసు-బుద్ధిలో నెగటివ్‌ భావమును, భావనలను ఉత్పన్నము చేసే విశేష కార్యమును మాయ చేస్తూ ఉంది. అందువలన మాయ నుండి సురక్షితంగా ఉండు సాధనం పై గమనముంచండి. అందుకు సహజ సాధనం - బిందువు పెట్టడం అనగా విశేష ఆత్మగా అవ్వడం.

స్లోగన్‌ :-

''ఎవరైతే ప్రతి సంకల్పము, మాట, కర్మలో జీ హజూర్‌ (అలాగే బాబా) అని అంటారో, వారే ఆజ్ఞాకారులు.''