16-08-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - దు:ఖాన్ని హరించే బాబా మమ్ములను సుఖధామానికి తీసుకెళ్లేందుకు వచ్చారని, మేము స్వర్గములో దేవకన్యలుగా అయ్యేవారమని మీకు సంతోషముండాలి. ''
ప్రశ్న :-
పిల్లల ఏ స్థితిని చూస్తున్నా తండ్రికి చింత కలగదు - ఎందుకు ?
జవాబు :-
కొంతమంది పిల్లలు ఫస్ట్క్లాస్ సుగంధభరిత పుష్పాలుగా ఉన్నారు, కొందరిలో కొద్దిగా కూడా సుగంధము లేదు. కొందరి స్థితి చాలా బాగుంటుంది, కొందరు మాయా తుఫానులలో చిక్కుకొని ఓడిపోతారు. ఇవన్నీ చూస్తున్నా తండ్రికి చింత కలుగదు. ఎందుకంటే ఇప్పుడు సత్యయుగ రాజధాని స్థాపన అవుతూ ఉందని తండ్రికి తెలుసు. అయినా తండ్రి శిక్షణను ఇస్తున్నారు - పిల్లలారా! ఎంత ఎక్కువగా వీలైతే అంత స్మృతిలో ఉండండి. మాయ తుఫానులకు భయపడకండి.
ఓంశాంతి.
మధురాతి మధురమైన బేహద్ తండ్రి కూర్చుని మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తండ్రి చాలా చాలా మధురమైనవారని మీకు తెలుసు కదా. శిక్షణనిచ్చే శిక్షకుడు కూడా చాలా మధురమైనవారే. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు తండ్రి చాలా మధురాతి మధురమైనవారని, వారి ద్వారా స్వర్గ వారసత్వము లభిస్తుందని గుర్తుండాలి. ఇక్కడైతే వేశ్యాలయములో కూర్చుని ఉన్నారు. ఎంత మధురమైన తండ్రి! ఆ సంతోషము హృదయములో ఉండాలి. తండ్రి మనలను అర్ధకల్పము కొరకు సుఖధామానికి తీసుకెళ్తారు. వారు దు:ఖాన్ని హరించువారు. వారు మన తండ్రి, వారే టీచరుగా కూడా అవుతారు. మనకు పూర్తి సృష్టిచక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇది ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. ఈ చక్రము ఎలా తిరుగుతుందో, 84 జన్మలు ఎలా గడచిపోతాయో ఇవన్నీ ఒక్క చిటికలో అర్థము చేయిస్తారు. తర్వాత మళ్లీ జతలో కూడా తీసుకెళ్తారు. ఇక ఇక్కడ ఉండరాదు. ఆత్మలందరినీ జతలో తీసుకెళ్తారు. ఇక కొద్ది రోజులే ఉన్నాయి. చాలా గడచిపోయింది, కొద్దిగా మిగిలి ఉంది,............... (బహుత్ గయీ, థోడీ రహీ) అని అంటారు. ఇక కొద్ది సమయమే ఉన్నందున త్వరత్వరగా నన్ను స్మృతి చేస్తే మీలో జన్మ-జన్మలుగా జమ అయ్యి ఉన్న పాప భారము సమాప్తమౌతుందని తండ్రి చెప్తున్నారు. భలే మాయతో యుద్ధము నడుస్తుంది. మీరు నన్ను స్మృతి చేస్తారు, మాయ స్మృతి చేయడం నుండి తొలగిస్తుంది. ఇది కూడా బాబా తెలుపుతున్నారు. అందువలన ఎప్పుడూ చింతించకండి. ఎన్ని సంకల్పాలు, వికల్పాలు, తుఫానులు వచ్చినా మొత్తం రాత్రంతా సంకల్పాలతో నిద్ర చెడిపోయినా భయపడరాదు. సాహసవంతులుగా ఉండాలి. అవి తప్పకుండా వస్తాయని తండ్రి చెప్తున్నారు. స్వప్నాలు కూడా వస్తాయి. వీటన్నిటికి భయపడరాదు. యుద్ధ మైదానము కదా. ఇదంతా వినాశమవ్వనున్నది. మీరు మాయను జయించేందుకు యుద్ధము చేస్తారు అంతేకాని ఇందులో శ్వాస మొదలైనవి ఆపేందుకు కూడా అవసరము లేదు. ఆత్మ శరీరములో ఉన్నపుడు శ్వాస నడుస్తుంది. ఇందులో(రాజయోగములో) శ్వాస మొదలైనవి ఆపేందుకు కూడా ప్రయత్నించవలసిన అవసరము లేదు. హఠయోగము మొదలైనవాటిలో ఎంతగానో కష్టపడ్తారు. బాబాకు అనుభవముంది. కొద్ది కొద్దిగా నేర్చుకునేవారు, కాని ఫుర్సత్(సమయము) ఉంటే కదా. ఎలాగైతే ఈ రోజుల్లో మీతో కకూడా, జ్ఞానమేమో చాలా బాగుంది, కానీ సమయము లేదు, ఇన్ని కర్మాగారాలు, ఇన్ని................. అని అంటారు కదా. మీకు తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా! ఒకటి తండ్రిని స్మృతి చేయండి, చక్రమును స్మృతి చేయండి, చాలు. ఇదేమైనా కష్టమా?
సత్య-త్రేతా యుగాలలో వీరి రాజ్యముండేది తర్వాత ఇస్లామీలు, బౌద్ధులు మొదలైనవారు వృద్ధి చెందుతూ పోయారు. దేవతలు తమ ధర్మమును మర్చిపోయారు. అపవిత్రులైన కారణంగా తమను తాము దేవతలమని చెప్పుకోలేరు. దేవతలైతే పవిత్రంగా ఉండేవారు. డ్రామా ప్లాను అనుసారము వారే హిందువులనబడ్తారు. వాస్తవానికి హిందూ ధర్మము అనేది లేనే లేదు. హిందుస్థాన్ అనే పేరు తర్వాత పెట్టబడింది. అసలు పేరు భారతదేశము. భారతమాతలకు జయము అని అంటూ ఉంటారు. హిందుస్థాన్ మాతలని అనరు. భారతదేశములోనే ఈ దేవతల రాజ్యముండేది. భారతదేశమునే మహిమ చేస్తారు. తండ్రిని ఎలా స్మృతి చేయాలో వారే పిల్లలకు నేర్పిస్తున్నారు. ఇంటికి తీసుకెళ్లేందుకే తండ్రి వచ్చారు. ఎవరిని? ఆత్మలను. మీరెంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంత పవిత్రంగా అవుతారు. పవిత్రంగా అయితే శిక్షలు కూడా అనుభవించరు. శిక్షలు అనుభవిస్తే పదవి తగ్గిపోతుంది. కావున ఎంత స్మృతి చేస్తారో అంత వికర్మలు వినాశమౌతూ ఉంటాయి. చాలా మంది పిల్లలు స్మృతే చెయ్యలేరు. విసిగిపోయి వదిలేస్తారు. యుద్ధము చెయ్యరు. ఇలాంటివారు కూడా ఉన్నారు. రాజధాని స్థాపన అవ్వనున్నదని తెలుపబడ్తుంది. అనేకమంది పాస్ కూడా అవ్వరు. పేద ప్రజలు కూడా కావాలి కదా. భలే అక్కడ దు:ఖము లేకపోయినా పేదవారు, ధనవంతులు సదా ఉంటారు. ఇది కలియుగము. ఇక్కడ పేదవారు, ధనవంతులు ఇరువురూ దు:ఖాన్ని అనుభవిస్తారు, అక్కడ ఇరువురూ సుఖంగా ఉంటారు. కానీ పేదవారు, ధనవంతులనే భావనలైతే ఉంటాయి. దు:ఖమనే పేరే ఉండదు. పోతే నంబరువారుగా ఉండనే ఉంటారు. ఎటువంటి రోగాలూ ఉండవు, ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ దు:ఖధామాన్ని మర్చిపోతారు. సత్యయుగములో మీకు దు:ఖము గుర్తు కూడా ఉండదు. ఈ దు:ఖధామము మరియు సుఖధామాల స్మృతిని తండ్రి ఇప్పుడే ఇప్పిస్తారు. స్వర్గము ఒకప్పుడు ఉండేదని మనుష్యులు చెప్తారు కానీ అది ఎప్పుడు ఉండేదో, ఎలా ఉండేదో ఏ మాత్రము తెలియదు. లక్షల సంవత్సరాల మాటైతే ఎవ్వరికీ గుర్తు రాదు. తండ్రి చెప్తున్నారు - నిన్న మీకు సుఖముండేది, రేపు మళ్లీ సుఖముంటుంది. కావున ఇక్కడ కూర్చుని పుష్పాలను చూస్తున్నారు. వీరు మంచి పుష్పాలు, వీరు చాలా శ్రమ పడ్తారు, వీరు స్థిరంగా లేరు, వీరు రాతిబుద్ధివారని అంటారు. తండ్రికి ఏ విషయము గురించి చింత ఉండదు. పిల్లలు త్వరగా చదువుకొని ధవనంతులుగా అవ్వాలి, చదివించాలి కూడా అని అనుకుంటారు. పిల్లలుగా అయితే అయినారు కానీ త్వరగా చదువుకొని చురుకుగా అవ్వాలి. అది కూడా ఎలా చదువుతున్నారు, చదివిస్తున్నారు, ఎటువంటి పుష్పాలు - ఇవన్నీ తండ్రి కూర్చుని చూస్తారు. ఎందుకంటే ఇది చైతన్య పూలతోట. పూలను చూస్తూనే ఎంత సంతోషమవుతుంది! బాబా స్వర్గ వారసత్వమునిస్తారని పిల్లలకు కూడా తెలుసు. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే పాపాలు కట్ అవుతూ పోతాయి. లేకుంటే శిక్షలు అనుభవించి పదవిని పొందుతారు. దానిని తన్నులు తిని పదవి పొందడమని అంటారు. జన్మ-జన్మల పాపాలు భస్మమయ్యే విధంగా తండ్రిని స్మృతి చేయండి. చక్రమును కూడా తెలుసుకోవాలి. చక్రము తిరుగుతూ ఉంటుంది, ఎప్పుడూ ఆగదు. పేను వలె నడుస్తూనే ఉంటుంది. పేను అన్నిటికంటే మెల్లగా నడుస్తుంది. ఈ అనంతమైన డ్రామా కూడా చాలా మెల్లగా నడుస్తుంది. టిక్-టిక్ అంటూ ఉంటుంది. 5 వేల సంవత్సరాలలో ఎన్ని సెకండ్లు, ఎన్ని నిముషాలు ఉంటాయని కూడా పిల్లలు లెక్క తీసి పంపించారు. లక్షల సంవత్సరాలైతే ఎవ్వరూ లెక్కపెట్టలేరు. ఇక్కడ తండ్రి మరియు పిల్లలు కూర్చుని ఉన్నారు. బాబా కూర్చొని ఒక్కొక్కరిని -''వీరు బాబాను ఎంత స్మృతి చేస్తారు, ఎంత జ్ఞానమును తీసుకున్నారు, ఇతరులకు ఎంత అర్థం చేయిస్తారు'' అని చూస్తారు. వాస్తవానికి ఇది చాలా సహజము. కేవలం తండ్రి పరిచయమునివ్వండి. పిల్లల వద్ద బ్యాడ్జ్ ఉండనే ఉంటుంది. వీరు శివబాబా అని చెప్పండి. కాశీకి వెళ్లినా శివబాబా - శివబాబా అంటూ స్మృతి చేస్తూ అరుస్తూ ఉంటారు. మీరు సాలిగ్రామాలు. ఆత్మ చాలా చిన్న నక్షత్రము. అందులో ఎంత పాత్ర నిండి ఉంది! ఆత్మ పెరగదు, తరగదు, వినాశమవ్వలేదు. ఆత్మ అవినాశి. అందులో డ్రామా పాత్ర నిండి ఉంది. వజ్రము అన్నిటికంటే గట్టిగా ఉంటుంది. దానంత గట్టి రాయి మరేదీ ఉండదు. ఈ విషయం వజ్రాల వ్యాపారస్థులకు తెలుసు. ఆత్మ గురించి కూడా ఆలోచించండి. ఎంత చిన్నదిగా ఉంటుంది! అందులో ఎంత పాత్ర నిండి ఉంది! అది ఎప్పుడూ అరిగిపోదు. అలాంటి ఆత్మ(పాత్ర) మరొకటి ఉండదు. ఈ ప్రపంచములో తండ్రి, టీచరు, సద్గురువు(ఒక్కరే) అని పిలువబడే మనుష్యులెవరూ లేరు. ఈ ఒక్క బేహద్ తండ్రి మాత్రమే శిక్షకులు. సర్వులకు మన్మనాభవ అని శిక్షణ నిస్తారు. మీకు కూడా చెప్తున్నారు - ఏ ధర్మము వారు వచ్చినా, మీరు అల్లాను స్మృతి చేస్తారు కదా అని చెప్పండి. ఆత్మలందరూ సోదరులు. సదా నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశమౌతాయని తండ్రి శిక్షణ ఇస్తున్నారు. ఆ తండ్రియే పతితపావనుడు. ఇది ఎవరు చెప్తున్నారు? - ఆత్మ. మనుష్యులు భలే కీర్తిస్తున్నారు కానీ అర్థము చేసుకోరు.
తండ్రి చెప్తున్నారు - మీరందరూ సీతలు, నేను రాముడను. భక్తులందరి సద్గతిదాతను నేనే. సర్వులకు సద్గతినిస్తాను. మిగిలినవారంతా ముక్తిధామానికి వెళ్లిపోతారు. సత్యయుగములో ఇతర ఏ ధర్మమూ ఉండదు. కేవలం మనము మాత్రమే ఉంటాము. ఎందుకంటే మనము మాత్రమే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. ఇక్కడ ఎన్ని మందిరాలున్నాయో చూడండి! ఎంత పెద్ద ప్రపంచము! ఎన్నెన్ని వస్తువులున్నాయి! అక్కడ ఇవేవీ ఉండవు. కేవలం భారతదేశమొక్కటే ఉంటుంది. ఈ రైళ్లు మొదలైనవి కూడా ఉండవు. ఇవన్నీ సమాప్తమైపోతాయి. అక్కడ రైళ్ల అవసరమే ఉండదు. పట్టణాలు చిన్నవిగా ఉంటాయి. దూర-దూర గ్రామాలకు వెళ్లాలంటే రైళ్లు ఉండాలి. బాబా పిల్లల కొరకు భిన్న-భిన్న పాయింట్లు అర్థం చేయిస్తూ రిఫ్రెష్ చేస్తున్నారు. ఇక్కడ కూర్చుని ఉన్నా బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. పరమపిత పరమాత్మలో పూర్తి జ్ఞానమంతా నిండి ఉన్నందున దానిని మీకు అర్థం చేయిస్తూ ఉంటారు. మన తండ్రి సర్వ శ్రేష్ఠమైన శాంతిధామములో ఉండే శాంతిసాగరులు. ఆత్మలమైన మనందరము కూడా ఆ మధురమైన ఇంటిలో ఉండేవారము. శాంతి కొరకు మనుష్యులు ఎంతగా తల కొట్టుకుంటారు? సాధువులు కూడా మన:శ్శాంతి ఎలా దొరుకుతుందని అంటారు. ఏమేమో యుక్తులను రచిస్తారు. ఆత్మ మనసు, బుద్ధి సహితంగా ఉందని, దాని స్వధర్మము శాంతి అని గాయనముంది. నోరు లేదు, కర్మేంద్రియాలు కూడా లేవంటే తప్పకుండా శాంతిగానే ఉంటుంది. ఆత్మలమైన మన నివాసము స్వీట్హోమ్(మధురమైన ఇల్లు). అక్కడ పూర్తిగా శాంతి ఉంటుంది. అక్కడ నుండి మొదట సుఖధామములోకి వస్తాము. ఇప్పుడు ఈ దు:ఖధామము నుండి బదిలీ అయ్యి సుఖధామములోకి వెళ్తాము. తండ్రి పావనంగా చేస్తున్నారు. ఎంత పెద్ద ప్రపంచము! ఇన్ని అడవులు మొదలైనవేవీ అక్కడ ఉండవు. ఇన్ని పర్వతాలు మొదలైనవి కూడా అక్కడ ఉండవు. మన రాజధాని ఉంటుంది. స్వర్గము మాడల్(నమూనా) చిన్నదిగా తయారు చేసినట్లు అక్కడ స్వర్గము చిన్నదిగా ఉంటుంది. అద్భుతము చూడండి, ఇది ఎంత విశాలమైన సృష్టి! ఇక్కడైతే అందరూ పరస్పరము కొట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత మళ్లీ ఈ ప్రపంచమంతా సమాప్తమైపోతుంది. మన రాజ్యము మాత్రమే మిగిలి ఉంటుంది. ఇవన్నీ సమాప్తమై ఎక్కడకు పోతాయి? సముద్రము, భూమి మొదలైనవాటిలోకి వెళ్లిపోతాయి. వాటి నామ-రూపాలే ఉండవు. సముద్రములోకి వెళ్లిన వస్తువులు లోలోపలే సమాప్తమైపోతాయి. సాగరము మింగేస్తుంది. తత్వాలు తత్వాలలో, మట్టి మట్టిలో కలిసిపోతుంది. తర్వాత ప్రపంచమే సతోప్రధానమైపోతుంది. ఆ సమయములో దానిని నూతన సతోప్రధాన ప్రకృతి అని అంటారు. మీకు అక్కడ సహజ సౌందర్యము ఉంటుంది. లిప్స్టిక్ మొదలైనవేవీ ఉపయోగించరు. కావున పిల్లలైన మీకు సంతోషముండాలి. మీరు స్వర్గములో దేవకన్యలుగా అవుతారు.
జ్ఞానస్నానము చేయకుంటే మీరు దేవతలుగా అవ్వలేరు. ఏ ఇతర ఉపాయము లేనే లేదు. బాబా సదా సుందరులు. ఆత్మలైన మీరు నల్లగా అయిపోయారు. ప్రియుడు చాలా సుందరమైన బాటసారి. వారు వచ్చి మిమ్ములను సుందరంగా చేస్తారు. తండ్రి చెప్తున్నారు - నేను ఇతనిలో ప్రవేశించాను. నేను ఎప్పుడూ నల్లగా అవ్వను. మీరు నలుపు నుండి సుందరమైనవారిగా అవుతారు. ఈ ఒక్క బాటసారి(శివబాబా) మాత్రమే సదా సుందరులు. ఈ బాబా(బ్రహ్మాబాబా) సుందరంగా మరియు వికారిగా అవుతాడు. తండ్రి మిమ్ములనందరినీ సుందరంగా(పవిత్రంగా) చేసి జతలో తీసుకెళ్తారు. పిల్లలైన మీరు పవిత్రంగా అయ్యి ఇతరులను కూడా పవిత్రంగా చేయాలి. తండ్రి శ్యామసుందరులుగా అవ్వరు. గీతలో తండ్రికి బదులు కృష్ణుని పేరు వేసి తప్పు చేసేశారు. దీనిని ఏకైక తప్పు అని అంటారు. పూర్తి విశ్వాన్ని సుందరంగా చేసేవారు శివబాబా. వారికి బదులు స్వర్గములో ఫస్ట్ నంబరులో సుందరంగా అయ్యే వారి పేరును వేసేశారు. ఇది ఎవ్వరూ అర్థము చేసుకోరు. భారతదేశము మళ్లీ సుందరంగా అవుతుంది. 40 వేల సంవత్సరాల తర్వాత స్వర్గంగా అవుతుందని వారు భావిస్తారు. పూర్తి కల్పమే 5 వేల సంవత్సరాలని మీరు తెలుపుతారు. తండ్రి ఆత్మలతో మాట్లాడ్తారు. నేను అర్ధకల్పపు ప్రియుడను. ''ఓ పతితపావనా! రండి, వచ్చి ఆత్మలమైన మీ ప్రేయసులైన మమ్ములను పావనంగా చెయ్యండి'' అని పిలుస్తూనే ఉన్నారు. మరి వారి మతమును అనుసరించాలి కదా. శ్రమ చేయాలి. మీరు వ్యాపారాలు మొదలైనవి చేయరాదని బాబా చెప్పరు. అవన్నీ చెయ్యాల్సిందే. గృహస్థ వ్యవహారములో ఉంటూ పిల్లలు మొదలైనవారిని సంభాళన చేస్తూ కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి. ఎందుకంటే నేను పతితపావనుడను. పిల్లలను భలే సంభాళించండి. కాని ఇప్పుడు ఇంకా పిల్లలకు జన్మనివ్వకండి. లేకుంటే వారే గుర్తుకు వస్తూ ఉంటారు. వీరందరిలో ఉంటున్నా వీరిని మర్చిపోవాలి. మీరు ఏమేమి చూస్తున్నారో అవన్నీ సమాప్తమవ్వనున్నవి. శరీరము కూడా సమాప్తమైపోతుంది. తండ్రి స్మృతి ద్వారా ఆత్మ పవిత్రమైపోతుంది. తర్వాత శరీరము కూడా కొత్తది లభిస్తుంది. ఇది అనంతమైన సన్యాసము. తండ్రి నూతన ఇంటిని నిర్మిస్తే మరి పాత ఇంటి నుండి మనసు తొలగిపోతుంది. స్వర్గములో లేనిదేమీ ఉండదు. అపారమైన సుఖముంటుంది. స్వర్గమైతే ఇక్కడే ఉంటుంది. దిల్వాడా మందిరము కూడా పూర్తి స్మారకచిహ్నంగా ఉంది. క్రింద తపస్సు చేస్తున్నారు. స్వర్గమును ఎక్కడ చూపించాలి? వారు పౖెె కప్పులో చూపించారు. క్రింద రాజయోగ తపస్సు చేస్తున్నారు, పైన రాజ్య పదవులున్నాయి. ఎంత మంచి మందిరము! పైన అచల్ఘర్ ఉంది, స్వర్ణిమ మూర్తులున్నాయి. దాని పైన గురు శిఖరముంది. గురువు అందరికంటే పైన కూర్చుని ఉన్నారు. శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు సద్గురువు. తర్వాత మధ్యలో స్వర్గము చూపించారు. కావున ఈ దిల్వాడా మందిరము పూర్తి జ్ఞాపక చిహ్నంగా ఉంది. మీరు రాజయోగమును నేర్చుకుంటారు మళ్లీ స్వర్గము ఇక్కడే ఉంటుంది. దేవతలు ఇక్కడే ఉండేవారు కదా. వారి కొరకు పావన ప్రపంచము ఇప్పుడు తయారవుతోంది. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఈ కనులతో అన్నీ చూస్తున్నా వాటిని మర్చిపోయే అభ్యాసము చెయ్యాలి. పాత ఇల్లు, పాత ప్రపంచము నుండి మనసును తొలగించి నూతన ఇంటిని స్మృతి చేయాలి.
2. జ్ఞాన స్నానము చేసి సుందరమైన దేవకన్యలుగా అవ్వాలి. ఎలాగైతే తండ్రి సుందరమైన తెల్లని బాటసారి అయినారో అలా వారి స్మృతిలో ఆత్మను వికారి(నలుపు) నుండి సుందరంగా (తెల్లగా) తయారు చేసుకోవాలి. మాయ యుద్ధములో భయపడరాదు. విజయులుగా అయి చూపించాలి.
వరదానము :-
'' అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా పాత సంస్కారాల దాడి నుండి సురక్షితంగా ఉండే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ భవ ''
పాత సంస్కారాల వలన సేవలో లేక సంబంధ-సంపర్కములో విఘ్నాలు ఏర్పడ్తాయి. సంస్కారాలే భిన్న-భిన్న రూపాలతో తమ వైపు ఆకర్షిస్తాయి. ఎక్కడైతే ఏ వైపు అయినా ఆకర్షణ ఉంటుందో, అక్కడ వైరాగ్యము ఉండజాలదు. సంస్కారాల అంశము దాగి ఉన్నా అది సమయ ప్రమాణంగా వంశ రూపాన్ని తీసుకుంటుంది, పరవశము చేసేస్తుంది. అందువలన నాలెడ్జ్ఫుల్గా అయి అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా పాత సంస్కారాలు, సంబంధాలు, పదార్థాల దాడి నుండి ముక్తులుగా అయితే సురక్షితంగా ఉంటారు.
స్లోగన్ :-
'' మాయతో నిర్భయులుగా అవ్వండి, పరస్పర సంబంధాలలో నిరహంకారులుగా అవ్వండి. ''