02-03-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - డెడ్సైలెన్స్ ( సంపూర్ణ నిశ్శబ్ధము) లోకి వెళ్ళే అభ్యాసము చేయండి. బుద్ధి తండ్రి వైపు ఉంటే, తండ్రి కూడా మీకు అశరీరులుగా అయ్యేందుకు సకాశ్ ( శక్తి ) ఇస్తారు.''
ప్రశ్న :-
పిల్లలైన మీకు జ్ఞాన మూడవ నేత్రము లభిస్తే ఏ సాక్షాత్కారమవుతుంది ?
సమా :-
సత్యయుగము ఆది నుండి కలియుగము అంతము వరకు ఏ ఏ పాత్రలు అభినయిస్తామో - అదంతా సాక్షాత్కారమైపోతుంది. ఈ విశ్వమంతటి ఆది-మధ్య-అంత్యముల వరకు మీరు తెలుసుకుంటారు. అలా తెలుసుకోవడాన్నే సాక్షాత్కారమని అంటారు. మేము దైవీ గుణాలు గల దేవతలుగా ఉండేవారమని, ఇప్పుడు ఆసురీ గుణాలు గలవారిగా అయ్యామని, ఇప్పుడు మళ్లీ దైవీ గుణాలు గల దేవతలుగా అవుతున్నామని, నూతన ప్రపంచానికి, నూతన ఇంటికి వెళ్తామని మీరు అర్థము చేసుకున్నారు.
ఓంశాంతి.
స్మృతియాత్రలో పిల్లలు కూర్చుని ఉన్నారు. అనంతమైన తండ్రి అయితే యాత్రలో కూర్చోలేదు. వారు పిల్లలకు శక్తి(సకాశ్) ఇచ్చే సహయోగము చేస్తున్నారు. అనగా ఈ శరీరాన్ని మరపింపజేస్తున్నారు. పిల్లలు తమ శరీరాన్ని మర్చిపోయేందుకు తండ్రి సహయోగము లభిస్తుంది. సకాశ్(శక్తి) ఆత్మలకే ఇస్తారు. ఎందుకంటే తండ్రి చూసేదే ఆత్మల వైపు. మీ ప్రతి ఒక్కరి బుద్ధి తండ్రి వైపు వెళ్తుంది. తండ్రి బుద్ధి మరియు దృష్టి కేవలం పిల్లల వైపుకే వెళ్తుంది. తేడా ఉంది కదా! డెడ్ సైలెన్స్ (సంపూర్ణ శాంతి)లో ఉండే అభ్యాసము పిల్లలు చేస్తారు. శరీరము వదిలి భిన్నమవ్వాలని అనుకుంటారు. ఎంత స్మృతి చేస్తూ ఉంటామో, అంత ఈ శరీరము నుండి దూరమవుతామని ఆత్మలకు తెలుసు. సర్వమూ ఉదాహరణ ఇస్తారు కదా. ఏ ఉదాహరణ ఇస్తారో అందులో తప్పకుండా కొంత మంచి ఉంటుంది. మనము శరీరాలను వదిలి వాపసు వెళ్ళి మళ్లీ వస్తామని మీకు తెలుసు. ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియదు. ఈ డ్రామా గురించి మరెవ్వరికీ తెలియదు. ఈ తలంపు ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయని ఎవ్వరూ గ్యారెంటీ ఇవ్వరు. ఇలాంటి విషయాలు ఎవ్వరూ వినిపించరు. ఇప్పుడు మనది తిరుగు ప్రయాణమని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మ యొక్క బుద్ధి యోగము అటు వైపు ఉంది. నాటకము ఇప్పుడు పూర్తి అయ్యింది. ఇంటికి వెళ్ళాలి. కేవలం తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. వారే పతితపావనులు. గంగాజలమునైతే లిబరేటర్(ముక్తిదాత), గైడ్ (మార్గదర్శకులు) అని అనరు. ఒక్క తండ్రి మాత్రమే ముక్తిదాత మరియు మార్గదర్శకులుగా అవ్వగలరు. ఇవి కూడా చాలా అర్థము చేసుకొని మరియు అర్థము చేయించే విషయాలు. అది భక్తిమార్గము. దాని ద్వారా ఎవరి కళ్యాణమూ జరగదు. నీరు స్నానము చేసేందుకు మాత్రమే ఉపయోగపడ్తుందని, పావనంగా చేయలేదని పిల్లలకు తెలుసు. భావనకు ఫలితము కూడా లభించదు. భక్తిమార్గములో భావనకు మహత్వముంచారు. వీటన్నింటినీ మూఢ విశ్వాసాలు అని అంటారు. అటువంటి నమ్మకాలు ఉంచుకుంటూ - ఉంచుకుంటూ మానవులకు అంధుల పిల్లలు అంధులు అని బిరుదు లభించింది. భగవానువాచ కదా! అంధులెవరో, కనులున్నవారెవరో కూడా మీకు తెలుసు. తండ్రి ద్వారా ఇప్పుడు సృష్టి ఆదిమధ్యాంతాలు తెలుసుకున్నారు. మీరు తండ్రిని తెలుసుకున్నారు. అందువలన సృష్టి ఆదిమధ్యాంతాలను, సృష్టి ఆయువు(డ్యూరేషన్) గురించి కూడా తెలుసుకున్నారు. ఒక్కొక్క విషయము పై విచార సాగర మథనము చేసి మీ అంతకు మీరే నిర్ణయము తీసుకోవాల్సి ఉంటుంది. భక్తికి, జ్ఞానానికి చాలా వ్యతాసముంది. జ్ఞానము పూర్తిగా భిన్నమైనది. ఈ జ్ఞానము ప్రసిద్ధి గాంచినది. ఇది రాజయోగ విద్య కదా! దేవతలు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారని పిల్లలు తెలుసుకున్నారు. రచయిత అయిన తండ్రే కూర్చుని తన పరిచయము కూడా ఇస్తారు. వారు పరమ - ఆత్మ. పరమ ఆత్మనే పరమాత్మ అని అంటారు. ఆంగ్లములో సుప్రీమ్ సోల్ అని అంటారు. సోల్ అనగా ఆత్మ. తండ్రి ఆత్మ పెద్దదిగా ఏమీ ఉండదు. ఏ విధంగా పిల్లలైన మీ ఆత్మ ఉందో, అదే విధంగా తండ్రి ఆత్మ కూడా ఉంటుంది. పిల్లల ఆత్మలు చిన్నవిగా, తండ్రి ఆత్మ పెద్దదిగా ఉంటుందని కాదు. వారు సుప్రీమ్. జ్ఞానసాగరులైన తండ్రి చాలా ప్రీతిగా పిల్లలకు అర్థము చేయిస్తూ ఉంటారు. పాత్ర అభినయించేది ఆత్మయే. తప్పకుండా శరీరాన్ని ధరించే పాత్ర అభినయిస్తుంది. ఆత్మ నివసించు స్థానము శాంతిధామము. ఆత్మలన్నియు బ్రహ్మమహాతత్వములో ఉంటాయని పిల్లలైన మీకు తెలుసు. ఏ విధంగా హిందూస్థాన్లో ఉండేవారు తమను హిందువులని చెప్పుకుంటారో, అదే విధంగా బ్రహ్మాండములో ఉండే బ్రహ్మతత్వమును ఈశ్వరుడని భావించి కూర్చుని ఉన్నారు. డ్రామాలో క్రిందపడే విధానము కూడా నిర్ణయింపబడింది. ఎవరు ఎంత శ్రమించినా వాపస్ వెళ్ళలేరు. నాటకము పూర్తి అయినప్పుడు పాత్రధారులందరూ వచ్చి కలుస్తారు. సృష్టికర్త(క్రియేటర్) ముఖ్యపాత్రధారులు కూడా స్టేజి పై నిలబడ్తారు. ఇప్పుడు నాటము పూర్తి అవుతూ ఉందని పిల్లలకు తెలుసు. ఈ విషయాలు ఏ సాధు - సత్పురుషులు మొదలైన వారెవ్వరికీ తెలియదు. ఈ ఆత్మిక జ్ఞానము ఎవ్వరికీ లేదు. తండ్రి అయిన పరమాత్మ ఇక్కడకు ఒక్కసారి మాత్రమే వస్తారు. మిగిలిన వారందరూ ఇక్కడ పాత్రను అభినయించవలసిందే. వృద్ధి జరుగుతూ ఉంటుంది కదా. ఆత్మలన్నీ ఎక్కడ నుండి వచ్చాయి? ఒకవేళ ఎవరైనా వాపస్ వెళ్ళినట్లైతే, మళ్లీ అదే ఆచారము ఏర్పడ్తుంది. ఒకరు వచ్చి మరొకరు పోతే దానిని పునర్జన్మ అని అనరు. పునర్జన్మలైతే ప్రారంభము నుండి కొనసాగుతూనే ఉన్నాయి. మొదటి నంబరులో ఈ లక్ష్మీనారాయణులు ఉన్నారు. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ చివరికి వచ్చినప్పుడు మళ్లీ మొదటి నంబరులో వెళ్ళవలసి ఉంటుందని తండ్రి తెలిపించారు. దీనిలో సంశయించే మాటలు ఉండవు. ఆత్మల తండ్రే స్వయంగా వచ్చి ఆత్మలకు అర్థము చేయిస్తున్నారు. ఏమి తెలిపిస్తున్నారు? తమ పరిచయమును కూడా ఇస్తున్నారు. పరమాత్మ అనగా ఏమిటో ఇంతకు ముందు తెలుసా! కేవలం శివుని మందిరానికి వెళ్ళేవారు. ఇక్కడైతే అనేక మందిరాలున్నాయి. సత్యయుగములో మందిరాలు, పూజలు మొదలైనవి ఉండనే ఉండవు. అక్కడ మీరు పూజ్య దేవీ దేవతలుగా అవుతారు. మళ్లీ అర్ధకల్పము తర్వాత పూజారులైనప్పుడు, వారిని దేవీ దేవతలు అని అనరు. మళ్లీ తండ్రే వచ్చి మళ్లీ పూజ్యులుగా చేస్తారు. ఏ ఇతర దేశాలలో ఈ మహిమ లేదు. రామ రాజ్యము, రావణ రాజ్యము - వీటి గురించి మీరిప్పుడే తెలుసుకున్నారు. రామరాజ్యము ఎంత కాలము ఉంటుందో నిరూపించాలి. ఇది నాటము. దీనిని అర్థము చేసుకోవాలి. ఉన్నతాతి ఉన్నతమైనవారు తండ్రి. వారు కూడా జ్ఞానసాగరులు. మనము వారి ద్వారా ఉన్నతాతి ఉన్నతంగా అవుతాము. అత్యంత ఉన్నతమైన పదవి లభిస్తుంది. తండ్రి మనలను చదివిస్తున్నారు. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి.
బాబా మీరిలా ఉన్నారు. మేము ఇలా ఉన్నామని పిల్లలు వర్ణన చేస్తారు. మనము వీరిలాగా సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలని ఈ సమయములో మీరు తెలుసుకున్నారు. అలా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయడం తప్ప ఇతర ఉపాయమేదీ లేదు. ఒకవేళ ఎవరికైనా తెలిసి ఉంటే, తెలపనీయండి. బ్రహ్మ తత్వమును లేక బ్రహ్మమును నిర్వికారి అని అనరు. ఆత్మనే నిర్వికారంగా అవుతుంది. బ్రహ్మమును లేక బ్రహ్మతత్వమును ఆత్మ అని పిలువరు. బ్రహ్మతత్వము నివసించు స్థానము. ఆత్మలోనే బుద్ధి ఉందని పిల్లలకు అర్థము చేయించబడింది. అది(ఆత్మ) తమోప్రధానమైనప్పుడు తెలివిహీనమైపోతుంది. తెలివిగలవారు మరియు తెలివిలేనివారు ఉన్నారు కదా. మీ బుద్ధి ఎంతో స్వచ్ఛంగా అవుతుంది. మళ్లీ మలినమైపోతుంది. మీకు పవిత్రత మరియు అపవిత్రతల వ్యతాసము తెలిసిపోయింది. అపవిత్ర ఆత్మ వాపస్ వెళ్ళలేదు. ఇప్పుడు అపవిత్రుల నుండి పవిత్రమయ్యేందుకు అరుస్తూ, పిలుస్తూ ఉంటారు. ఇది కూడా డ్రామాలో రచింపబడింది. ఇప్పుడిది సంగమ యుగమని మీకు తెలుసు. తండ్రి తీసుకెళ్ళేందుకు(ఆత్మలను) ఒక్కసారే వస్తారు. అందరూ కొత్త ప్రపంచానికి వెళ్లలేరు. పాత్రలేనివారు (సుఖధామములో) శాంతిధామములో ఉంటారు. కావున చిత్రాలలో కూడా చూపబడింది. మిగిలిన చిత్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఇది జ్ఞాన మార్గము. ఇందులో సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో తెలుపబడ్తుంది. మనము క్రిందికి ఎలా వస్తామో,16 కళల నుండి 14 కళలు ఎలా అవుతాయో మీకు తెలుసు. ఇప్పుడు మళ్లీ ఒక్క కళ కూడా లేదు. నంబరువారుగా ఉన్నారు కదా. పాత్రధారులు కూడా నంబరువారుగా ఉంటారు. కొంతమందికి వెయ్యి రూపాయలు, కొంతమందికి 15 వందలు, మరి కొందరికి వంద రూపాయలు జీతము మాత్రమే ఉంటుంది. ఎంతో తేడా ఉంది కదా. విద్యలో కూడా రాత్రి - పగలుకున్నంత తేడా ఉంది. ఆ పాఠశాలలో ఫెయిల్ అయితే మళ్లీ చదవవలసి ఉంటుంది. ఇక్కడ మళ్లీ చదివే మాటే లేదు. పదవి తగ్గిపోతుంది. మళ్లీ ఎప్పుడూ ఈ చదువు ఉండదు. ఒక్కసారి మాత్రమే ఈ చదువు ఉంటుంది. తండ్రి కూడా ఒక్కసారి మాత్రమే వస్తారు. మొట్టమొదట ఒకే రాజధాని ఉండేదని పిల్లలకు కూడా తెలుసు. ఇది ఎవరికి తెలిపినా దానిని వారు అంగీకరిస్తారు. క్రైస్తవులు సైన్సులో కూడా చాలా ముందున్నారు. మిగిలిన వారందరూ వారి ద్వారానే నేర్చుకున్నారు. వారు అంత రాతి బుద్ధిగలవారు కూడా అవ్వరు, బంగారు బుద్ధి గలవారుగా కూడా అవ్వరు. ఇప్పుడు వారి బుద్ధి అద్భుతము చేస్తోంది. సైన్స్ ప్రచారమంతా ఈ క్రైస్తవుల ద్వారానే జరుగుతుంది. అవి కూడా సుఖము కొరకే ఉన్నాయి. ఈ పాత ప్రపంచము వినాశనమవ్వనే అవుతుందని మీకు తెలుసు. మీరు మళ్లీ శాంతిధామానికి, సుఖధామానికి వెళ్ళిపోతారు. లేకుంటే ఇంతమంది మనుష్యాత్మలు వాపస్ ఇంటికి ఎలా వెళ్ళాలి? సైన్స్ ద్వారా వినాశనమైపోతుంది. ఆత్మలన్నీ శరీరాలు వదిలి ఇంటికి వెళ్ళిపోతాయి. ఈ వినాశనములో ముక్తి కూడా ఇమిడి ఉంది. అర్ధకల్పము ముక్తి కొరకు శ్రమ చేస్తూ వచ్చారు కదా. అందువలన సైన్స్ ద్వారా ఆపదలు, ప్రకృతి వైపరీత్యాలు అనగా ప్రాకృతిక ఆపదలు కూడా జరిగే తీరాలి. ఈ యుద్ధము ముక్తిధామానికి తీసుకెళ్లేందుకు నిమిత్తమవుతుందని అర్థము చేసుకోవాలి. ఇంతమంది అందరూ ముక్తిధామానికి వెళ్ళాలి. భలే మీరెంతో శ్రమ చేశారు, గురువులను ఆశ్రయించారు, హఠయోగము నేర్చుకున్నారు అయినా ఎవ్వరూ ముక్తిధామానికి వెళ్ళలేకపోయారు. సైన్స్ బాంబులు మొదలైనవి చాలా తయారై ఉన్నాయి. వినాశనము తప్పకుండా జరుగుతుందని అర్థము చేసుకోవాలి. నూతన ప్రపంచములో కొంతమంది మాత్రమే ఉంటారు. మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఈ చదువు బలము ద్వారా జీవన్ముక్తిలోకి వస్తారు. మీరు స్థిరమైన, అఖండమైన రాజ్యపాలన చేస్తారు. ఇచ్చట ఖండాలు అనేక భాగాలుగా అయిపోయాయి. బాబా మిమ్ములను స్థిరమైన అఖండ విశ్వరాజ్యానికి అధికారులుగా చేస్తారు. అనంతమైన తండ్రి ఇచ్చే వారసత్వము - అనంతమైన సామ్రాజ్యము. ఈ వారసత్వము ఎప్పుడు, ఎవరు ఇచ్చారో ఎవరి బుద్ధిలోకి రాదు. కేవలం మీకు మాత్రమే తెలుసు. జ్ఞాన మూడవ నేత్రము ఆత్మకు లభించింది. ఆత్మ జ్ఞాన స్వరూపంగా అవుతుంది. అది కూడా జ్ఞానసాగరులైన తండ్రి ద్వారానే అవ్వవలసి వచ్చింది. తండ్రే వచ్చి రచయిత రచనల ఆది-మధ్య-అంత్యముల జ్ఞానము ఇస్తున్నారు. ఒక్క సెకండు విషయమే. సెకండులో జీవన్ముక్తి, మిగిలిన వారందరికీ ముక్తి లభిస్తుంది. ఇది కూడా తయారైన డ్రామానే. రావణ బంధనము నుండి అందరూ ముక్తులైపోతారు. వారు విశ్వములో శాంతి కొరకు ఎంతో శ్రమ చేస్తారు. విశ్వములో, బ్రహ్మాండములో శాంతి ఎప్పుడు ఉంటుందో కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. బ్రహ్మాండములో శాంతి, విశ్వములో శాంతి-సుఖము రెండూ ఉంటాయి. విశ్వము వేరు, బ్రహ్మాండము వేరు. చంద్రుడు - నక్షత్రాల కంటే ఉపరి భాగాన బ్రహ్మాండము ఉంటుంది. అచ్చట ఇవేవియూ ఉండవు. దానిని సైలెన్స్ ప్రపంచమని అంటారు. శరీరాలను వదిలి నిశ్శబ్ధము(సైలెన్స్)లోకి వెళ్ళిపోతారు. పిల్లలైన మీకు అది కూడా గుర్తుంది. ఇప్పుడు మీరు అచ్చటికి వెళ్లేందుకు తయారౌతున్నారు. ఈ విషయం ఇతరులెవ్వరికీ తెలియదు. మీరు తయారు చేయబడ్తారు. పోతే ఈ యుద్ధము కళ్యాణకారే. అందరి లెక్కాచారము చుక్త అవ్వనే అవ్వాలి. అందరూ పవిత్రులైపోతారు. యోగ అగ్ని కదా. అగ్ని ద్వారా ప్రతి వస్తువు పవిత్రమైపోతుంది. తండ్రికి డ్రామా ఆదిమధ్యాంతములు ఎలా తెలుసో, పాత్రధారులైన మీరు కూడా డ్రామా ఆది, మధ్య, అంతములను తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడాన్నే సాక్షాత్కారమని అంటారు.
ఇప్పుడు మీ జ్ఞాన మూడవ నేత్రము తెరవబడింది. ఈ విశ్వములో సత్యయుగ ప్రారంభము నుండి కలియుగ అంత్యము వరకు పూర్తిగా మనము తెలుసుకున్నాము. ఇతర మానవులెవ్వరికీ తెలియదు. దైవీగుణాలు కలిగిన మనమే మళ్లీ ఆసురీ గుణాలు గలవారిగా అవుతామని మీకు తెలుసు. మళ్లీ తండ్రి వచ్చి దైవీగుణాలు గలవారిగా తయారు చేస్తారు. తండ్రి వచ్చేదే పతితులను పావనంగా చేసేందుకు. ప్రపంచములో మరెవ్వరికీ దేవీదేవతా వంశము వారు పూర్తిగా 84 జన్మలు తీసుకుంటారని తెలియదు. పావనంగా ఉన్నవారే పతితులుగా అవుతారని కూడా ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. ఇవి కేవలం జడ చిత్రములేనని ఇప్పుడు మీకు తెలుసు. వారి అసలు ఫోటోలు ఎవ్వరూ తీయలేరు. వారు సహజ సుందరంగా ఉంటారు. పావన ప్రకృతి ద్వారా శరీరాలు కూడా పవిత్రంగా తయారవుతాయి. ఇచ్చట అపవిత్రంగా ఉన్నాయి. ఈ రంగు రంగుల ప్రపంచము సత్యయుగములో ఉండదు. కృష్ణుని శ్యామసుందరుడని అంటారు. సత్యయుగములో సుందరంగా, కలియుగములో శ్యామంగా ఉంటారు. సత్యయుగము నుండి కలియుగములోకి ఎలా వస్తారు? మీకు నంబర్వన్ నుండి చివరి వరకు తెలిసిపోయింది. కృష్ణుడు గర్భము నుండి జన్మించాడు. అతనికి నామకరణము జరిగింది. పేరు తప్పకుండా కావలసిందే కదా. కావున కృష్ణుని ఆత్మ మొదట సుందరంగా ఉండి తర్వాత శ్యామంగా అయ్యిందని మీరు చెప్తారు. అందుకే శ్యామసుందరుడని అంటారు. వారి జాతము లభించిందంటే సృష్టి చక్రమంతా లభించింది. ఎంతో రహస్యము నిండి ఉంది. దీనిని మీరు మాత్రమే తెలుసుకున్నారు. ఇతరులెవ్వరికీ తెలియదు. మీరిప్పుడు నూతన ప్రపంచములో నూతన ఇంటికి వెళ్ళాలి. ఎవరు బాగా చదువుకుంటారో, వారే నూతన ప్రపంచానికి వెళ్తారు. బాబా అనంతమైన ప్రపంచానికంతా యజమాని. సర్వాత్మలకు తండ్రి. తండ్రిని యజమాని అని అంటారు. దీనిని చదువు అని అంటారు. ఇందులో సంశయపడే విషయము లేక ప్రశ్నలు రాజాలవు. ఇందులో శాస్త్రవాదము చేసే అవసరమే లేదు. అత్యంత ఉన్నతమైన టీచరు స్వయంగా కూర్చుని చదివిస్తున్నారు - వారే సత్యము. సత్యమైన సత్యనారాయణ కథను శిక్షణ రూపములో వినిపిస్తారు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మీ లెక్కాచారమంతా చుక్త చేసుకొని నిశ్శబ్ధ ప్రపంచములోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. స్మృతి బలము ద్వారా ఆత్మను సంపూర్ణ పవిత్రంగా చేసుకోవాలి.
2. జ్ఞాన సాగరుల జ్ఞానాన్ని స్వరూపములోకి. తీసుకు రావాలి. విచార సాగర మథనము చేసి మీ అంతకు మీరే నిర్ణయించుకోవాలి. జీవన్ముక్తిలో శ్రేష్ఠ పదవిని ప్రాప్తి చేసుకునేందుకు దైవీ గుణాలను ధారణ చేయాలి.
వరదానము :-
''సమయం యొక్క మహత్యాన్ని తెలుసుకొని, ఫాస్ట్గా (వేగంగా) వెళ్లి ఫస్టులో వచ్చే తీవ్ర వేగ పురుషార్థీ భవ''
అవ్యక్త పాత్రలో వచ్చిన ఆత్మలకు లాస్ట్ నుండి ఫాస్ట్, ఫాస్ట్ నుండి ఫస్టులో వచ్చే వరదానం ప్రాప్తి అయ్యి ఉంది. కనుక సమయ మహత్యాన్ని తెలుసుకొని లభించిన వరదానాలను స్వరూపములోకి తీసుకు రండి. ఈ అవ్యక్త పాలన సహజంగానే శక్తిశాలిగా చేస్తుంది. అందువలన ఎంత ముందుకు వెళ్లాలనుకుంటారో అంత ముందుకు వెళ్లగలరు. సదా ముందుకు ఎగిరేందుకు అందరి పట్ల బాప్దాదా మరియు నిమత్త ఆత్మల ఆశీర్వాదాలున్నందున తీవ్రగతితో పురుషార్థము చేసే భాగ్యము సులభంగా లభించి ఉంది.
స్లోగన్ :-
'' '' నిరాకారము నుండి సాకారము '' అనే మంత్రము యొక్క స్మృతి ద్వారా నిరంతర యోగులుగా అవ్వండి. ''