21-05-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - అనంతమైన తండ్రి మనకు తండ్రి, శిక్షకుడు, సద్గురువు కూడా అయ్యారు. వారు సర్వవ్యాపి కాదు అని మీరు ఋజువు చేసి తెలపండి.''

ప్రశ్న :-

ఇప్పుడు ప్రపంచములో అతి దు:ఖము ఎందుకు ఉంది? దు:ఖానికి కారణాలు వినిపించండి.

జవాబు :-

మొత్తము ప్రపంచమంతటి పై ఇప్పుడు రాహదశ ఉంది. దు:ఖమునకు కారణము ఇదే. వృక్షపతి అయిన తండి వచ్చినప్పుడు అందరి పై బృహస్పతి దశ కూర్చుంటుంది. సత్య-త్రేతా యుగాలలో బృహస్పతి దశ ఉంటుంది. రావణుని నామ-రూపాలు కూడా ఉండవు. అందువలన అక్కడ దు:ఖముండదు. తండ్రి సుఖధామాన్ని స్థాపన చేసేందుకు వచ్చారు. అందులో దు:ఖము ఉండజాలదు.

ఓంశాంతి.

మధురాతి మధురమైన పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - ఎందుకంటే పిల్లలందరు ''మనము ఆత్మలము, మన ఇంటి నుండి చాలా దూరము నుండి ఇక్కడకు వచ్చామని తెలుసుకున్నారు.'' ఇక్కడకు వచ్చి పాత్ర చేసేందుకు ఈ శరీరములో ప్రవేశిస్తాము. పాత్రను అభినయించేది ఆత్మ. ఇక్కడ పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతిలో కూర్చుని ఉన్నారు. ఎందుకంటే స్మృతి ద్వారా పిల్లలైన మీ జన్మ-జన్మల పాపాలు భస్మమైపోతాయని తండ్రి అర్థం చేయించారు. వాస్తవానికి దీనిని యోగమని కూడా అనరాదు. యోగము నేర్పించేవారు సన్యాసులు. విద్యార్థులకు టీచరుతో కూడా యోగముంటుంది. అలాగే పిల్లలకు తండ్రితో యోగముంటుంది. ఇది ఆత్మ - పరమాత్మల అనగా తండ్రి-పిల్లల కలయిక(మేళా). ఇది కళ్యాణకారి మిలనము. మిగిలినవన్నీ అకళ్యాణమైనవి. ఇది పతిత ప్రపంచము కదా. మీరు ప్రదర్శిని లేక మ్యూజియంలో అర్థం చేయించునప్పుడు ఆత్మ - పరమాత్మల పరిచయమును ఇవ్వడం బాగుంటుంది. ఆత్మలంతా పిల్లలు. వారేమో పరమపిత పరమాత్మ పరంధామములో ఉంటారు. ఏ పిల్లలైనా వారి లౌకిక తండ్రిని పరమపిత అని అనరు. దు:ఖములోనే ''ఓ పరమపిత పరమాత్మా'' అని వారిని తల్చుకుంటారు. పరమాత్మ ఉండేదే పరంధామములో. ఇప్పుడు మీరు ఆత్మ - పరమాత్మల జ్ఞానము అర్థం చేయించునప్పుడు కేవలం ఇద్దరు తండ్రులని మాత్రమే అర్థం చేయించరాదు. వారు తండ్రే కాక శిక్షకులు కూడా అని తప్పకుండా అర్థం చేయించాలి. మనమంతా భాయి-భాయి(సోదరులము). వారు ఆత్మలందరి తండ్రి. భక్తిమార్గములో అందరూ భగవంతుడైన తండ్రిని స్మృతి చేస్తారు. ఎందుకంటే భగవంతుని ద్వారా భక్తికి ఫలితము లభిస్తుంది లేక తండ్రి నుండి పిల్లలు వారసత్వము తీసుకుంటారు. భగవంతుడు పిల్లలకు భక్తి ఫలితమునిస్తారు. ఏమిస్తారు? ఈ విశ్వానికే చక్రవర్తులుగా చేస్తారు. అయితే మీరు కేవలం తండ్రి అని మాత్రమే ఋజువు చేయరాదు. వారు చదువు నేర్పించే టీచరు కూడా అయ్యారు, అంతేకాక సద్గురువు కూడా అయ్యారు. ఈ విధంగా అర్థం చేయించినట్లయితే సర్వవ్యాపి అనే భావన మనుష్యుల బుద్ధి నుండి ఎగిరిపోతుంది. ఈ విషయాన్ని చేర్చండి. ఆ తండ్రి జ్ఞాన సాగరులు. వారు వచ్చి రాజయోగము నేర్పిస్తారు. వారు శిక్షణనిచ్చే టీచరు కూడా అయ్యారు. విద్య నేర్పుతారు. కావున వారు సర్వవ్యాపి ఎలా అవుతారు? టీచరు వేరు, విద్యార్థులు వేరు కదా. ఏ విధంగా తండ్రి వేరుగా, పిల్లలు వేరుగా ఉంటారో ఇది కూడా అంతే. ఆత్మలు పరమాత్మ అయిన తండ్రిని స్మృతి చేస్తాయి. వారిని మహిమ కూడా చేస్తారు. తండ్రియే మానవ సృష్టికి బీజము. వారు వచ్చి మనకు మానవ సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. తండ్రి స్వర్గస్థాపన చేస్తారు. మనం స్వర్గవాసులుగా అవుతాము. అలాగే ఇద్దరు తండ్రులు ఉన్నారని కూడా అర్థం చేయిస్తారు. లౌకిక తండ్రి పాలన చేస్తారు. టీచరు వద్దకు చదువుకునేందుకు వెళ్లవలసి ఉంటుంది. 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థ అవస్థలోకి వెళ్లేందుకు గురువులను ఆశ్రయించవలసి ఉంటుంది. తండ్రి, టీచరు, గురువులు వేరు వేరుగా ఉంటారు. ఈ అనంతమైన తండ్రి ఆత్మలందరికీ తండ్రి, జ్ఞానసాగరులు, మానవ సృష్టికి బీజరూపులు. సత్‌-చిత్‌-ఆనంద స్వరూపులు, సుఖసాగరులు, శాంతి సాగరులు అని వారి మహిమను ప్రారంభించి వర్ణించండి. ఎందుకంటే ప్రపంచములో అనేక మత భేదాలున్నాయి. సర్వవ్యాపి అయితే టీచరుగా అయ్యి ఎలా చదివిస్తారు? అంతేకాక వారు సద్గురువు కూడా అయ్యారు. అందరికీ మార్గదర్శకులై వాపస్‌ తీసుకెళ్తారు. శిక్షణ కూడా ఇస్తారు. అంటే స్మృతి కూడా నేర్పిస్తారు. భారతదేశపు ప్రాచీన యోగము కూడా మహిమ చేయబడింది. అతిపురాతనమైనది సంగమ యుగము, ఇది కొత్త ప్రపంచానికి పాత ప్రపంచానికి మధ్య ఉంటుంది. ఇప్పటి నుండి 5 వేల సంవత్సరాల క్రితము తండ్రి వచ్చి తనవారిగా చేసుకున్నారని అంతేకాక మన టీచరుగా, సద్గురువుగా కూడా ఉన్నారని మీకు తెలుసు. వీరు కేవలం మనకు తండ్రి మాత్రమే కాదు. వారు జ్ఞానసాగరులు అనగా టీచరు కూడా అయ్యారు. చదువు నేర్పిస్తారు. సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాలను అర్థం చేయిస్తారు. ఎందుకంటే వారు బీజరూపులు, వృక్షపతి కూడా. వారు భారతదేశములోనికి వచ్చినప్పుడు భారతదేశము పై బృహస్పతి దశ కూర్చుంటుంది. సత్యయుగములో అందరూ సదా సుఖప్రదమైన దేవీ దేవతలుంటారు. అందరి పై బృహస్పతి దశ ఉంటుంది. మళ్లీ ప్రపంచము తమోప్రధానమైనప్పుడు అందరి పై రాహుదశ కూర్చుంటుంది. వృక్షపతిని గురించి ఎవ్వరికీ తెలియదు. తెలియనందున వారసత్వము ఎలా లభిస్తుంది?

మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు అశరీరులుగా అయ్యి కూర్చోండి. ఆత్మ వేరే, ఇల్లు వేరే అనే జ్ఞానమైతే మీకు లభించింది. ఈ శరీరము 5 తత్వాల బొమ్మ. అందులో ఆత్మ ప్రవేశిస్తుంది. అందరి పాత్ర నిశ్చయింపబడి ఉంది. మొట్టమొదట తండ్రి, సుప్రీమ్‌ తండ్రే కాక సుప్రీమ్‌ టీచరు కూడా అని అందరికీ అర్థం చేయించాలి. లౌకిక తండ్రి, టీచరు, గురువుల తేడాను తెలిపితే వెంటనే అర్థము చేసుకంటారు, వాదించరు. ఆత్మల తండ్రిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. ఇది వారి ప్రత్యేకత. వారే మనకు రచన ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇంతకుముందు ఋషులు, మునులు మొదలైనవారు మాకు రచయిత-రచనల ఆదిమధ్యాంతాలు తెలియవని చెప్పేవారు. ఎందుకంటే అప్పుడు వారు సతోగుణములో ఉండేవారు. ప్రతి వస్తువు సతోప్రధానము, సతో, రజో, తమోలలోకి తప్పకుండా వస్తుంది. కొత్తది నుండి పాతదిగా తప్పకుండా అవుతుంది. మీకు ఈ సృష్టి చక్రము ఆయువును గురించి కూడా తెలుసు. మానవులు దీని ఆయువు ఎంతో కూడా మర్చిపోయారు. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తిమార్గము కొరకు తయారు చేశారు. చాలా తప్పులు వ్రాసేశారు. అందరి తండ్రి ఒక్కరే, సద్గతిదాత కూడా ఒక్కరే. గురువులు అనేకమంది ఉన్నారు కానీ సద్గతినిచ్చే సద్గురువు ఒక్కరే. సద్గతి ఎలా జరుగుతుందో కూడా మీ బుద్ధిలో ఉంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మమునే సద్గతి అంటారు. అచ్చట చాలా కొద్ది మంది మనుష్యులు మాత్రమే ఉంటారు. ఇప్పుడు లెక్కలేనంతమంది మనుష్యులు ఉన్నారు. అక్కడ కేవలం దేవతల రాజ్యముంటుంది. ఆ తర్వాత వంశము వృద్ధి చెందుతుంది. ఒకటవ లక్ష్మీనారాయణ, రెండవ, మూడవ................... కొనసాగుతూ వస్తుంది. మొదటివారు ఉన్నప్పుడు చాలా కొద్ది మంది మనుష్యులు మాత్రమే ఉంటారు. కేవలం మీకు మాత్రమే ఈ ఆలోచనలు వస్తాయి. సర్వాత్మలకు తండ్రి ఒక్కరేనని, వారు భగవంతుడని పిల్లలైన మీకు తెలుసు. వారు అనంతమైన తండ్రి. హద్దులోని తండ్రి ద్వారా హద్దు వారసత్వము లభిస్తుంది. బేహద్‌ తండ్రి ద్వారా బేహద్‌ వారసత్వము లభిస్తుంది. 21 తరాల స్వర్గ చక్రవర్తిత్వ పదవి, 21 తరాలనగా ముసలితనము వచ్చినప్పుడు శరీరాన్ని వదులుతారు. అక్కడ స్వయాన్ని ఆత్మగా తెలుసుకుంటారు. ఇక్కడ దేహాభిమానములో ఉన్నందున ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుందని అర్థము చేసుకోరు. ఇప్పుడు దేహాభిమానులను ఆత్మాభిమానులుగా తయారు చేసేదెవరు? ఈ సమయంలో ఒక్కరు కూడా ఆత్మాభిమానులుగా లేరు. తండ్రియే వచ్చి ఆత్మాభిమానులుగా చేస్తారు. అక్కడ వారికి ఆత్మ ఒక పెద్ద శరీరాన్ని వదిలి చిన్న శిశువుగా అవుతుందని తెలుస్తుంది. సర్పం ఉదాహరణ కూడా ఉంది. ఈ సర్పము, భ్రమరము మొదలైన ఉదాహరణలన్నీ ఇక్కడివే. ఈ సమయానికి చెందినవే. ఇవి తర్వాత భక్తి మార్గములో కూడా పనికొస్తాయి. వాస్తవానికి బ్రాహ్మణీలైన మీరే భ్రమరాలు. మీరు పేడ పురుగుల వంటి మనుష్యులను భూ-భూ చేసి దేవతలుగా చేస్తారు. తండ్రిలో జ్ఞానముంది కదా. వారే జ్ఞానసాగరులు, శాంతిసాగరులు. అందరూ శాంతిని యాచిస్తూ ఉంటారు. శాంతిదేవా............ అని ఎవరిని పిలుస్తారు? శాంతిదాతను లేక శాంతి సాగరుని పిలుస్తారు. వారి మహిమను కూడా గానము చేస్తారు. కానీ అర్థము తెలియదు. నోటితో అలా చెప్తారు కానీ ఏ మాత్రము అర్థము చేసుకోరు. తండ్రి చెప్తున్నారు - ఈ వేదశాస్త్రాలు మొదలైనవన్నీ భక్తిమార్గానికి చెందినవి. 63 జన్మలు భక్తి చేయాల్సిందే. అనేక శాస్త్రాలున్నాయి. నేను శాస్త్రాలను చదివినందున లభించను. మీరు వచ్చి పావనంగా చేయమని నన్ను అందరూ పిలుస్తారు. ఇది తమోప్రధానమైన మురికి ప్రపంచము. దేనికీ పనికిరానిది. ఎంతో దు:ఖముంది. ఈ దు:ఖము ఎలా వచ్చింది? తండ్రి అయితే మీకు చాలా సుఖమునిచ్చారు. మళ్లీ మీరు మెట్లు ఎలా దిగారు? జ్ఞానము మరియు భక్తి అని గాయనము కూడా ఉంది. జ్ఞానము తండ్రి వినిపిస్తారు. భక్తి రావణుడు నేర్పిస్తాడు. చూడాలంటే తండ్రి కనిపించడు అలాగే రావణుడు కూడా కనిపించడు. ఇరువురినీ ఈ కనులతో చూడలేము. ఆత్మలను తెలుసుకోవచ్చు. మనము ఆత్మలమైతే ఆత్మలకు తండ్రి కూడా తప్పకుండా ఉంటారు. తండ్రి టీచరుగా కూడా అవుతారు. ఈ విధంగా మరెవ్వరూ అవ్వనే అవ్వరు.

ఇప్పుడు మీరు 21 జన్మల కొరకు సద్గతి పొందుతారు. తర్వాత మీకు గురువుల అవసరమే ఉండదు. తండ్రి అందరికీ తండ్రి, అలాగే శిక్షకుడు అనగా చదివించే టీచరు కూడా. అంతేకాక సర్వులకు సద్గతినిచ్చే సద్గురువు, సుప్రీమ్‌ గురువు కూడా అయ్యారు. ముగ్గురిని సర్వవ్యాపి అనేందుకు వీలు లేదు. వారు సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని తెలుపుత్నారు. మానవులు ''ఓ పతిత పావనా! రండి. సర్వుల సద్గతిదాతా! రండి సర్వుల దు:ఖమును హరించండి, సుఖము ఇవ్వండి. ఓ గాడ్‌ఫాదర్‌! ఓ లిబరేటర్‌(కూఱపవతీa్‌శీతీ/ముక్తిదాత)'' అని స్మృతి కూడా చేస్తారు. అంతేకాక మాకు మార్గదర్శకులై మమ్ములను తీసుకెళ్ళండని కూడా అంటారు. ఈ రావణరాజ్యము నుండి ముక్తినిప్పించమని కోరుకుంటారు. రావణరాజ్యము ఏ లంకలోనో లేదు. ఇప్పుడున్న ప్రపంచమంతటి పై ఈ సమయములో రావణరాజ్యముంది. రామరాజ్యము కేవలం సత్యయుగములోనే ఉంటుంది. భక్తిమార్గములో మానవులు ఎంతో తికమక పడిపోయారు.

ఇప్పుడు శ్రేష్ఠంగా అయ్యేందుకు మీకు శ్రీమతము లభిస్తూ ఉంది. సత్యయుగములో భారతదేశము శ్రేష్ఠాచారిగా, పూజ్యనీయంగా ఉండేది. ఇంతవరకు కూడా వారిని పూజిస్తూనే ఉన్నారు. భారతదేశము పై బృహస్పతి దశ ఉన్నప్పుడు సత్యయుగము ఉండేది. ఇప్పుడు రాహు దశలో భారతదేశపు గతి ఏమైపోయిందో చూడండి. అందరూ అధర్మ యుక్తంగా అయిపోయారు. తండ్రి ధర్మ యుక్తంగా చేస్తారు. రావణుడు అధర్మ యుక్తంగా చేస్తాడు. రామరాజ్యము కావాలని కూడా అంటారు. అనగా రావణ రాజ్యములో ఉన్నట్లే కదా! అందరూ నరకవాసులుగా ఉన్నారు. రావణ రాజ్యమును నరకమని అంటారు. స్వర్గము, నరకము సగము - సగము ఉంటాయి. రామరాజ్యమని దేనినంటారో, రావణరాజ్యమని దేనినంటారో పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. కావున మొట్టమొదట నిశ్చయబుద్ధి గలవారిగా చెయ్యాలి. వీరు మన తండ్రి, మనమంతా ఆత్మలము, పరస్పరము సోదరులము. తండ్రి నుండి అందరికీ వారసత్వము లభించే హక్కు ఉంది. వారసత్వము లభించింది కూడా. తండ్రి రాజ్యయోగమును నేర్పించి సుఖధామానికి అధిపతులుగా చేశారు. మిగిలినవారంతా శాంతిధామంలోకిి వెళ్లిపోయారు. వృక్షపతి చైతన్యమైనవారని కూడా పిల్లలకు తెలుసు. వారు సత్‌-చిత్‌-ఆనంద స్వరూపులు. ఆత్మ సత్యమైనది, చైతన్యము కూడా. తండ్రి కూడా సత్యము, చైతన్యము. వారు వృక్షపతి కూడా. ఇది తలక్రిందులుగా ఉన్న వృక్షము కదా. దీని బీజము ఉపరి భాగములో ఉంది. మీరు తమోప్రధానంగా అయినప్పుడు తండ్రియే వచ్చి సతోప్రధానంగా చేస్తారు. చరిత్ర - భూగోళము(హిస్టరీ-జాగ్రఫీ) పునరావృతమౌతుంది. ఇప్పుడు మీకు తెలుపుతున్నారు. హిస్టరీ, జాగ్రఫీ ....... అని ఇంగ్లీషు పదాలు వాడకండి. హిందీలో చరిత్ర(ఇతిహాసము)-భూగోళము అని అంటారు. ఇంగ్లీషు అయితే అందరూ చదువుతూనే ఉంటారు. భగవంతుడు గీతను సంస్కృతములో వినిపించాడని భావిస్తారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు సత్యయుగ రాకుమారుడు. అక్కడ ఫలానా భాష ఉండేదని ఎక్కడా వ్రాయబడి లేదు. భాష ఏమో తప్పకుండా ఉంటుంది. ఏ రాజులు ఉంటారో వారి భాషలు ఉంటాయి. సత్యయుగములోని రాజుల భాష వారిదే వేరుగా ఉంటుంది. అచ్చట సంస్కృతము లేదు. సత్యయుగపు ఆచార వ్యవహారాలే వేరుగా ఉంటాయి. కలియుగములోని మనుష్యుల ఆచార-వ్యవహారాలు వేరుగా ఉన్నాయి. మీరంతా మీరాలు. కలియుగపు లోక మర్యాదలను, కుల మర్యాదలను ఇష్టపడరు. మీరు కలియుగ లోకమర్యాదలను వదిలినప్పుడు ఎన్నో కొట్లాటలు జరుగుతాయి. కామము మహాశత్రువు. దీని పై విజయము ప్రాప్తి చేసుకోండని తండ్రి మీకు శ్రీమతమునిస్తున్నారు. జగజ్జీతులుగా అయ్యే వారి చిత్రము కూడా మీ ముందే ఉంది. మీకు బేహద్‌ తండ్రి ద్వారా విశ్వములో శాంతి స్థాపన ఎలా జరుగుతుందో సలహా లభిస్తుంది. శాంతిదేవా! అంటూనే తండ్రియే స్మృతిలోకి వస్తారు. తండ్రే వచ్చి కల్ప-కల్పము విశ్వములో శాంతి స్థాపన చేస్తారు. కల్పము ఆయువును చాలా పెద్దదిగా చూపినందున మనుష్యులు కుంభకర్ణుని నిద్రలో మునిగి ఉన్నారు. మొట్టమొదట మన తండ్రి తండ్రే కాక టీచరు కూడా అయ్యారని మనుష్యులకు పక్కాగా నిశ్చయము చేయించండి. టీచరును సర్వవ్యాపని ఎలా అంటారు? తండ్రి వచ్చి ఎలా చదివిస్తారో పిల్లలైన మనర్చేందుకు. వారు టీచరు కూడా అయ్యారు. తర్వాత వెంట కూడా తీసుకెళ్తారు. ఆత్మలేమో అవినాశి. అవి తమ పాత్రలు పూర్తిగా అభినయించి ఇంటికి వెళ్లిపోతాయి. వాపస్‌ తీసుకెళ్ళేందుకు మార్గదర్శకుడు(గైడ్‌) కూడా కావాలి కదా. వారు దు:ఖము నుండి ముక్తి కలిగిస్తారు. మార్గదర్శకుడైౖ అందరినీ తీసుకెళ్తారు. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. కలియుగ పేరు ప్రతిష్ఠలను, కుల మర్యాదలను వదిలి ఈశ్వరీయ కులమర్యాదలను ధారణ చేయాలి. అశరీరి అయిన తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని అశరీరిగా అయ్యి వినే అభ్యాసాన్ని పక్కాగా చేసుకోవాలి.

2. అనంతమైన తండ్రి తండ్రిగా, టీచరుగా, సద్గురువుగా కూడా అవుతారు. ఈ భేదాన్ని అందరికీ అర్థము చేయించాలి. అనంతమైన తండ్రి సర్వవ్యాపి కాదని నిరూపించాలి.

వరదానము :-

'' లౌకిక, అలౌకిక జీవితంలో సదా అతీతంగా అయ్యి పరమాత్మ తోడును అనుభవం చేయడం ద్వారా నష్టోమోహా భవ ''

సదా అతీతంగా ఉండేవారి గుర్తు - వారు ప్రభువు ప్రేమను అనుభవం చేస్తారు, ఎంత ప్రేమ ఉంటుందో అంత జతలో ఉంటారు, ఎప్పుడూ వేరుగా ఉండరు. సదా తోడుగా ఉంటే దానిని ప్రేమ అని అంటారు. తండ్రి జతలో ఉన్నప్పుడు భారమంతా తండ్రికి ఇచ్చేసి స్వయం తేలికైపోండి. నష్టోమోహాగా(నిర్మోహులుగా) అయ్యేందుకు విధానము ఇదే. కానీ పురుషార్థము చేసే సబ్జక్టులో 'సదా' అనే శబ్ధాన్ని అండర్‌లైన్‌ చేయండి. లౌకిక మరియు అలౌకిక జీవితంలో సదా అతీతంగా (న్యారాగా) ఉండండి. అప్పుడు సదా బాబా తోడు అనుభవం అవుతుంది.

స్లోగన్‌ :-

'' వికారాలనే సర్పాలను మీ శయ్యగా చేసుకుంటే సహజయోగులుగా అవుతారు. ''