16-01-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసము చేసినట్లైతే వికారీ ఆలోచనలు ఎగిరిపోతాయి. తండ్రి స్మృతి ఉంటుంది, ఆత్మ సతోప్రధానంగా అవుతుంది''

ప్రశ్న :-

మనుష్యులకు ఈ ప్రపంచములో ఏ మార్గమును గురించి కొద్దిగా కూడా తెలియదు ?

జవాబు :-

తండ్రిని కలుసుకునే లేక జీవన్ముక్తిని ప్రాప్తి చేసుకునే దారిని గూర్చి ఎవ్వరికీ తెలియదు. కేవలం శాంతి-శాంతి అని అంటూ ఉంటారు. కాన్ఫరెన్స్‌లు(సమ్మేళనాలు) చేస్తూ ఉంటారు. విశ్వములో శాంతి ఎప్పుడు ఉండేదో, ఆ శాంతి ఎలా స్థాపనయ్యిందో వారికి తెలియదు. మీరు విశ్వములో శాంతి ఉండడం చూచారా? అసలు శాంతి ఎలా ఉంటుంది? అని మీరు వారిని ప్రశ్నించవచ్చు. ఒక్క తండ్రి ద్వారానే విశ్వములో శాంతి స్థాపన జరుగుతూ ఉంది, మీరు వచ్చి అర్థం చేసుకోండి అని వారికి చెప్పండి.

ఓంశాంతి.

ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మొట్టమొదట నేను ఒక ఆత్మను అన్న దృష్టిని పక్కా చేసుకోండి. నేను ఆత్మను, సోదర ఆత్మను చూస్తున్నానని భావించండి. ఉదాహరణానికి నేను పిల్లల(ఆత్మల)ను చూస్తున్నానని తండ్రి అంటారు కదా! ఆత్మయే శరీరములోని కర్మేంద్రియాల ద్వారా వింటుంది, మాట్లాడ్తుంది. ఆత్మ సింహాసనము భృకుటి. కావున తండ్రి ఆత్మలను చూస్తారు. అలాగే ఈ సోదరుడు(బ్రహ్మాబాబా) కూడా తన సోదరులను చూస్తాడు. మీరు కూడా మీ సోదరులను చూడాలి. మొట్టమొదట ఈ దృష్టి పక్కాగా ఉండాలి. అప్పుడు అశుద్ధమైన ఆలోచనలు సమాప్తమైపోతాయి. ఇది అలవాటైపోతుంది. ఆత్మయే వింటుంది, ఆత్మయే కదలికలను కలుగజేస్తుంది. ఈ దృష్టి పక్కా అయితే ఇతర ఆలోచనలన్నీ ఎగిరిపోతాయి. ఇది నెంబర్‌వన్‌ సబ్జెక్టు. దీని వలన దైవీగుణాలు కూడా స్వతహాగానే ధారణ అవుతూ ఉంటాయి. దేహాభిమానములోకి రావడం వల్లనే కర్మేంద్రియాలు చంచలమౌతాయి. దేహీ-అభిమానులుగా అయ్యేందుకు బాగా ప్రయత్నిస్తే, మీలో శక్తి వస్తుంది. సర్వశక్తివంతుడైన తండ్రి శక్తి ద్వారానే ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. తండ్రి అయితే సదా సతోప్రధానమైనవారే. కనుక మొట్టమొదట ఈ దృష్టి పక్కాగా ఉండాలి. అప్పుడే మేము ఆత్మాభిమానులుగా ఉన్నామని భావించండి. ఆత్మాభిమానికి, దేహాభిమానికి రాత్రికి, పగలుకు ఉన్నంత వ్యత్యాసముంది. ఆత్మలైన మనము ఇప్పుడు వాపస్‌ ఇంటికి వెళ్లాలి. ఆత్మాభిమానులుగా అవ్వడం ద్వారానే మనము పవిత్రంగా, సతోప్రధానంగా అవుతాము. ఈ అభ్యాసము చేయడం ద్వారా వికారీ ఆలోచనలన్నీ ఎగిరిపోతాయి.

భూలోక తారలు అని మనుష్యులంటారు. తప్పకుండా ఆత్మలమైన మనము నక్షత్రాలమే, కర్మ చేసేందుకు ఈ శరీరము లభించింది. ఇప్పుడు మనము తమోప్రధానంగా అయ్యాము. మనము మళ్లీ సతోప్రధానంగా అవ్వాలి. తండ్రి రావడం కూడా పురుషోత్తమ సంగమ యుగములోనే జరుగుతుంది. క్రీస్తు శరీరములోకి వస్తారని ఎప్పుడూ అనరు. అతడు(క్రీస్తు) వచ్చేదే రజోప్రధాన సమయములో. బుద్ధుడు లేక క్రీస్తు తనువులో భగవంతుడు రావడమనేది జరగదు. వారు ఒక్కసారి మాత్రమే నూతన ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు పురాతన ప్రపంచములోకి వస్తారు. వారు తమోప్రధాన ప్రపంచాన్ని మార్చి సతోప్రధానంగా చేసేందుకు వస్తారు. మరి వారు తప్పకుండా సంగమ యుగములోనే వస్తారు కదా! ఇంకే సమయములోనూ వారు రాజాలరు. వారు వచ్చి నూతన ప్రపంచాన్ని స్థాఫించాలి. వారిని స్వర్గ స్థాపకుడైన తండ్రి అని అంటారు. డ్రామానుసారము సంగమ యుగము కూడా ప్రఖ్యాతి గాంచింది. కృష్ణుడిని తండ్రి అని లేక పతితపావనుడు అని అనరు. వారి మహిమ పూర్తి వేరుగా ఉంది. మొట్టమొదట ఎవరికైనా లక్ష్యమును, ఉద్ధేశ్యమును అర్థము చేయించమని బాబా చెప్తూ ఉంటారు. భారతదేశములో లక్ష్మీనారాయణుల రాజ్యము ఉన్నప్పుడు ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉండేది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఉండేది. ఒకే అద్వైత ధర్మముండేది. స్వర్గ స్థాపన చేసే కర్తవ్యము తండ్రిదే. వారు ఏ విధంగా చేస్తారో కూడా స్పష్టంగా ఉంది. దేహము, దేహ సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి సంగమ యుగములోనే వచ్చి అర్థము చేయిస్తారు. లక్ష్మీనారాయణుల చిత్రము ద్వారానే పూర్తి వివరణనివ్వాలి(జ్ఞానమునివ్వాలి). శివబాబా చిత్రము కూడా ఉంది. బాబా గుణాల మహిమ ఉన్న చిత్రము చాలా బాగా తయారు చేయబడి ఉంది. ఇది నరుని నుండి నారాయణునిగా తయారయ్యే సత్యమైన కథ. దీనిని రాధా-కృష్ణుల కథ అని అనరు. ఇది సత్యనారాయణ కథ. మిమ్ములను నరుని నుండి నారాయణునిగా తయారు చేస్తారు. మొదట చిన్న బాలునిగా ఉంటాడు. చిన్న బాలుని నరుడు అని అనరు. నరుని నారాయణుడని, నారిని శ్రీ లక్ష్మి అని అంటారు. పిల్లలైన మీరు ఈ చిత్రము పైనే అర్థము చేయించాలి. సన్యాసులైతే ఆది సనాతన దేవీ దేవతా ధర్మమును స్థాపన చేయలేరు. శంకరాచార్యుడైతే రజోప్రధాన సమయములో వస్తాడు. అతడు రాజయోగాన్ని నేర్పించజాలడు. తండ్రి సంగమ యుగములోనే వస్తారు. అనేక జన్మల అంతిమ జన్మలోని అంతిమ సమయములోనే నేను ప్రవేశిస్తానని వారు అంటారు. పైన త్రిమూర్తి చిత్రము కూడా ఉంది. బ్రహ్మ యోగములో కూర్చున్నాడు. శంకరుని విషయమే వేరు. నంది పై స్వారీ చేయజాలడు. తండ్రి అయితే ఇక్కడకు వచ్చి అర్థము చేయించాలి. వినాశనము కూడా ఇక్కడే జరుగుతుంది. విశ్వములో శాంతి ఏర్పడాలని మనుష్యులంటారు. అది జరుగనున్నది కనుకనే బుద్ధిలోకి వస్తుంది. చిత్రాల పై మీరు బాగా అర్థము చేయించవచ్చు. ఎవరైతే శివుని లేక దేవతలను భక్తి చేస్తారో వారికి అర్థము చేయించాలి. వారు వెంటనే అంగీకరిస్తారు. అంతేకాని ప్రకృతిని లేక సైన్స్‌ను మొదలైనవాటిని నమ్మేవారి బుద్ధిలో ఇది కూర్చోదు. ఈ విషయాలు ఇతర ధర్మాలకు చెందినవారి బుద్ధిలోకి కూడా రావు. ఎవరైతే ఈ ధర్మము నుండి బదిలీ(కన్వర్ట్‌) అయ్యి ఉంటారో వారే బయటకు వస్తారు. వారిని గురించి ఎందుకు చింతించాలి? దేవతా ధర్మము వారు లేక చాలా భక్తి చేసేవారు తమ ధర్మములో చాలా పక్కాగా ఉంటారు. కావున దేవతల పూజారులకు అర్థము చేయించండి. గొప్పవారు ఎప్పుడూ రారు. ఉదాహరణకు బిర్లా ఉన్నాడు. ఇతడు ఎన్నో మందిరాలను నిర్మిస్తున్నాడు కాని అతడి వద్ద జ్ఞానము వినేందుకు తీరిక ఎక్కడుంది? రోజంతా బుద్ధి వ్యాపారాలలోనే చిక్కుకొని ఉంటుంది. ధనము ఎక్కువగా లభిస్తే మందిరాలను తయారు చేయడము ద్వారా ధనము లభిస్తుందని, ఇదంతా దేవతల కృప అని భావిస్తాడు.

మీ వద్దకు ఎవరైనా వస్తే వారికి లక్ష్మీనారాయణుల చిత్రాన్ని చూపించండి. వారికి మీరు చెప్పండి - '' మీరు విశ్వములో శాంతిని కోరుకుంటున్నారా ? విశ్వములో శాంతి రాజ్యము ఈ ప్రపంచములోనే ఉండేది. ఫలానా తారీఖు నుండి ఫలానా తారీఖు వరకు సూర్యవంశీ రాజధానిలో ఎంతో శాంతి ఉండేది. తర్వాత రెండు కళలు తగ్గిపోతాయి'' అని చెప్పండి. ఆధారమంతా ఈ చిత్రము పైనే ఉంది. ఇప్పుడు మీరు విశ్వములో శాంతిని కోరుకుంటున్నారు. మరి ఎక్కడకు వెళ్తారు? ఇంటిని గురించి అయితే తెలియనే తెలియదు. ఆత్మలైన మనము శాంతి స్వరూపులము. మూలవతనములో ఉంటాము. అదే శాంతిధామము. అది ఈ ప్రపంచములో లేదు. దానిని నిరాకార ప్రపంచమని అంటారు. దీనినే విశ్వము అని అంటారు. క్రొత్త ప్రపంచములో విశ్వశాంతి ఉంటుంది. విశ్వాధిపతులు ఇక్కడ కూర్చుని ఉన్నారు. పేదవారు ఈ విషయాలను చాలా బాగా అర్థము చేసుకుంటారు. ఈ మార్గము చాలా మంచిదని కొంతమంది అంటారు. మేము మార్గము కొరకు వెతుకుతూ ఉండేవారమని అంటారు. కాని అసలు మార్గము గూర్చే తెలియనప్పుడు దానిని ఎక్కడ వెతుకుతారు? తండ్రిని మరియు జీవన్ముక్తిని పొందే దారి తెలిసినవారు ఎవ్వరూ లేరు. శాంతి-శాంతి,....... అని అంటూ ఉంటారు. కాని శాంతి ఎప్పుడు ఉండేదో, అది ఎలా ప్రాప్తించిందో ఎవ్వరికీ తెలియదు. ఎన్నో కాన్ఫరెన్స్‌లు (సమావేశాలు) మొదలైనవి చేస్తూ ఉంటారు! మీరు విశ్వములో శాంతి ఎప్పుడైనా చూశారా? విశ్వములో శాంతి ఎలా ఏర్పడ్తుంది? అని వారిని అడగండి. ప్రజలైన మీరు పరస్పరము ఎందుకు తికమక పడ్తున్నారు. కాన్ఫరెన్స్‌లు మొదలైనవి చేస్తున్నారు కాని జవాబు దేని నుండీ లభించదు. విశ్వములో శాంతి అయితే ఇప్పుడు తండ్రి ద్వారా స్థాపన అవుతూ ఉందని వారికి చెప్పండి. మీరు క్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రితము స్వర్గముండేదని అంటారు. కావున ఆ స్వర్గములోనే శాంతి ఉండేది. అక్కడ కూడా అశాంతి ఉన్నట్లైతే మరి ఇక శాంతి ఎక్కడి నుండి లభిస్తుంది? వారికి బాగా అర్థము చేయించాలి. ఇప్పుడు మిమ్ములను ఇంత సమయము చెప్పనివ్వడం లేదు. ఎందుకంటే ఇప్పుడింకా వారికి వినే సమయము రాలేదు. వినేందుకు కూడా సౌభాగ్యము ఉండాలి. పదమాపదమ్‌ భాగ్యశాలి పిల్లలైన మీరే తండ్రి ద్వారా వినేందుకు హక్కుదారులుగా అవుతారు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ వినిపించలేరు. తండ్రి పిల్లలైన మీకు మాత్రమే వినిపిస్తారు. ఇది రావణ రాజ్యము, మరి ఇందులో శాంతి ఎలా ఉంటుంది? రావణ రాజ్యములో అందరూ పతితులే. మమ్ములను పావనంగా చేయండి అని వారు పిలుస్తారు. పావన ప్రపంచమైతే ఈ లక్ష్మీనారాయణులది ఉండేది. రామరాజ్యానికి మరియు రావణరాజ్యానికి ఎంత తేడా ఉంది? సూర్య వంశీయులుగా, చంద్ర వంశీయులుగా ఉంటారు తర్వాత రావణ వంశీయులుగా అవుతారు. ఈ సమయములో ఇది కలియుగము, రావణ సంప్రదాయము. గొప్ప-గొప్ప వ్యక్తులు కూడా ఒకరి పై ఒకరు గుర్రుగుర్రుమంటూ ఉంటారు. నేను ఫలానా,.......... అన్న అహంకారము చాలా ఉంది. కావున ఈ లక్ష్మీనారాయణుల చిత్రము పై అర్థము చేయించడం చాలా సహజము. వీరి రాజ్యములోనే విశ్వములో శాంతి ఉండేది. అప్పుడు ఇంకే ధర్మము ఉండేది కాదని చెప్పండి. విశ్వములో శాంతి అయితే ఇక్కడనే స్థాపించబడ్తుంది. కావున ముఖ్యమైనది ఈ చిత్రమే. మిగిలిన లెక్కలేనన్ని చిత్రాల పై అర్థము చేయించడం ద్వారా మనుష్యుల ఆలోచనలు ఇతర వైపులకు వెళ్లిపోతాయి. ఏదైతే అర్థము చేసుకున్నారో అది కూడా మర్చిపోతారు. అందుకే వంట చేసేవారు ఎక్కువైతే వంట పాడౌతుంది...... (టూమెనీ కుక్స్‌ స్పాయిల్‌ ద బాత్‌) అని అంటారు. చిత్రాలు చాలా ఉంటే, నవ్వు పుట్టించే మాడళ్ళు లేక డైలాగులు ఉంటే ముఖ్యమైన విషయము బుద్ధి నుండి తొలగిపోతుంది. తండ్రి ఈ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారని ఎవరో ఒకరు అరుదుగా అర్థము చేసుకుంటారు. 84 జన్మలు కూడా వీరి కొరకే ఉంటాయి. ఒక్కరిది మాత్రమే ఉదాహరణంగా చూపుతారు. అందరినీ ఎలా పెట్టగలరు? శాస్త్రాలలో కూడా ఒక్క అర్జునుని పేరే ఉంచారు కదా. స్కూలులో మాస్టారు ఏ ఒక్కరిని మాత్రమే చదివించరు కదా. ఇది కూడా ఒక పాఠశాల. గీతలో పాఠశాల రూపాన్ని చూపించలేదు. కృష్ణుడు చిన్న బాలుడు, అతడు గీతను ఎలా వినిపించగలడు? అది భక్తిమార్గము.

మీ ఈ బ్యాడ్జీలు కూడా చాలా పని చేయగలవు. ఇవి అన్నింటికంటే మంచివి. మొదట వారిని శివబాబా చిత్రము ముందుకు తీసుకు రావాలి. ఆ తర్వాత లక్ష్మీనారాయణుల చిత్రము ముందుకు తీసుకు రావాలి. మీరు శాంతి వేడుకుంటారు. అది కల్ప-కల్పము తండ్రి ద్వారానే స్థాపనవుతుంది. మీరు ఈ చక్రాన్ని తెలుసుకున్నారు. మొదట మీరు కూడా తుచ్ఛ బుద్ధిగలవారిగా ఉండేవారు. ఇప్పుడు తండ్రి స్వచ్ఛ బుద్ధిగలవారిగా చేస్తారు. పరమపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఎవ్వరికీ సద్గతినివ్వలేరని, విశ్వములో శాంతిని ఏర్పరచలేరని వ్రాయాలి. తండ్రియే అన్నీ చేస్తున్నారు. స్మృతి కూడా వారినే చేస్తారు. ముఖ్యమైన చిత్రాలు ఈ రెండే. ఎంతవరకు ఈ చిత్రాలను పూర్తిగా అర్థము చేసుకోరో, అంతవరకు వీటి నుండి ప్రక్కకు కదలరాదు. ఇది అర్థము చేసుకోకపోతే ఏమీ అర్థము చేసుకోనట్లే. సమయము వ్యర్థమైపోతుంది. బుద్ధిలో కూర్చోవడం లేదని గమనిస్తే, వారిని వెళ్లనివ్వాలి. ఇందులో అర్థము చేయించేవారు చాలా బాగుండాలి. ఒకవేళ మాతలైతే చాలా బాగుంటుంది. అప్పుడు ఎవ్వరూ కోపగించుకోరు. అర్థము చేయించుటలో చురుకైనవారు ఎవరో అందరికీ తెలుసు - మోహిని, మనోహర్‌, గీత మొదలైన చాలామంది మంచి మంచి పిల్లలున్నారు కావున మొదట లక్ష్మీనారాయణుల చిత్రము పై పూర్తిగా పక్కా చేయించాలి. ఈ విషయాలను బాగా అర్థము చేసుకోండి. అప్పుడు శాంతిమయ ప్రపంచములోనికి వెళ్లగలుగుతారని వారికి చెప్పండి. ముక్తి-జీవన్ముక్తులు రెండూ లభిస్తాయి. ముక్తిలోనికైతే అందరూ వెళ్తారు. మళ్లీ పాత్రను అభినయించేందుకు నంబరువారుగా వస్తారు. ఈ విషయాలు చాలా నషాతో అర్థము చేయించాలి. ఈ చిత్రమే నంబర్‌వన్‌. వీరే విశ్వములో శాంతికి అధిపతులుగా ఉండేవారు. ఈ విషయాలు వివేకవంతుల బుద్ధిలో కూర్చుంటాయి. భలే బాగుంది బాగుంది అని అంటారు, కాళ్ళ పై పడ్తారు కాని తండ్రినైతే తెలుసుకోరు. వారిని కూడా మాయ వదలదు. ఏ తండ్రి అయితే ఇంత ఉన్నతంగా తయారుచేస్తారో ఆ తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి! అందుకే నన్ను స్మృతి చేసినట్లైతే మీ పాపాలు తొలగిపోతాయి, సతోప్రధానంగా అయిపోతారని తండ్రి అంటారు. ఇక్కడకు లోపలకు రావడంతోనే సంతోషంతో శరీరము పులకరించి పోవాలి. నేను ఈ విధంగా తయారౌతాను. నేను లోపలికి రాగానే, ఈ లక్ష్మీ నారాయణుల చిత్రాలను చూడగానే ఎంతో సంతోషిస్తాను. ఓహో! బాబా మమ్ములను ఈ విధంగా తయారుచేస్తారు. వహ్వా! బాబా వహ్వా, లౌకిక ఇంటిలో తండ్రి గొప్ప స్థానములో ఉంటే, మా తండ్రి ఒక మంత్రి అని పిల్లలకు ఎంతో సంతోషముంటుంది. అలాగే మా తండ్రి మమ్ములను ఇలా తయారు చేస్తున్నారని మీకు ఎంతో సంతోషముండాలి! కాని మాయ మరిపింపజేస్తుంది. ఎంతగానో ఎదిరిస్తుంది. పిల్లలైన మీకు ఎంతో సంతోషముండాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఆత్మాభిమాని భవ! ఆత్మ రూపి సోదరుడినే చూసినట్లైతే స్త్రీని కూడా ఆత్మ రూపములోనే చూస్తారు. అశుద్ధమైన దృష్టి కలగదు. ఎప్పుడైతే మీరు సోదర దృష్టితో చూడరో అప్పుడే మనసులో తుఫానులు వస్తాయి. ఇందులో ఎంతో శ్రమ ఉంది. మంచి అభ్యాసము కావాలి. ఆత్మాభిమానులుగా అవ్వాలి. కర్మాతీత స్థితి అయితే చివర్లో వస్తుంది. సేవ చేసే పిల్లలే తండ్రి హృదయాన్ని అధిరోహించగలరు. భలే ఆలస్యంగా వచ్చినా, వారు కూడా త్వరత్వరగా ముందుకు వెళ్ళవచ్చు(గ్యాలప్‌ చేయగలరు). వేగంగా ముందుకు వెళ్ళవచ్చు. పిల్లలైన మీరు ఇల్లు-వాకిళ్ళను ఎలా వదిలారో, రాత్రికి రాత్రే ఎలా పరుగెత్తారో, మళ్లీ ఇంతమంది పిల్లలను ఎలా పాలించారో మీరు యజ్ఞ చరిత్రలో విన్నారు. దీనిని భట్టీ అని అంటారు. మళ్లీ భట్టి నుండి నెంబరువారుగా వెలువడ్డారు. ఇది ఆశ్చర్యం కదా! ఈ తండ్రి మిమ్ములను అద్భుతమైన స్వర్గానికి అధిపతులుగా తయారు చేస్తారు. భగవంతుడైన తండ్రియే మిమ్ములను చదివిస్తారు. వీరు ఎంత సాధారణంగా ఉన్నారు! ప్రతి రోజూ పిల్లలకు ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు అంతేకాక పిల్లలకు నమస్కరిస్తారు. పిల్లలూ! మీరు నా కంటే ఉన్నతంగా అవుతారు. మీరే నిరుపేదల నుండి డబల్‌ కిరీటధారులైన విశ్వాధిపతులుగా అవుతారని తండ్రి అంటారు. తండ్రి ఎంతో ఆసక్తితో వస్తారు. లెక్కలేనన్ని సార్లు వచ్చి ఉంటారు. ఈ రోజు మీరు రాముడినైన నా నుండి రాజ్యాన్ని తీసుకుంటారు. మళ్లీ రావణునితో ఓడిపోయి మీరు మీ రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. ఇది ఒక ఆట. అచ్ఛా! మంచిది.


మధురాతి మధురమైన లక్కీ సితారాలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. ఆత్మను సతోప్రధానంగా తయారు చేసుకునేందుకు ఒక్క సర్వశక్తివంతుడైన తండ్రి నుండి శక్తిని తీసుకోవాలి. దేహీ-అభిమానులుగా అయ్యే పురుషార్థము చేయండి. ఆత్మలైన మనమంతా సోదరులము అనే అభ్యాసము నిరంతరము చేస్తూ ఉండండి.

2. తండ్రి మరియు లక్ష్యము(లక్ష్మీనారాయణుల) చిత్రము పై ప్రతి ఒక్కరికి విస్తారంగా అర్థం చేయించండి. మిగిలిన విషయాలలో సమయాన్ని వ్యర్థం చేయకండి.

వరదానము :-

''సేవలో శుభ భావనను అడిషన్‌(చేర్చుట) చేయడం ద్వారా శక్తిశాలి ఫలాన్ని ప్రాప్తి చేసుకునే సఫలతామూర్త్‌ భవ''

ఏ సేవ చేస్తున్నా అందులో సర్వ ఆత్మలకు సహయోగం చేయాలనే భావన, సంతోషంగా ఉండాలనే భావన, సద్భావన ఉంటే ప్రతి కార్యము సహజంగా సఫలమౌతుంది. ఎలాగైతే పూర్వ కాలంలో ఏదైనా పని పై వెళ్లునప్పుడు మొత్తం పరివారంలోని అందరి ఆశీర్వాదాలు తీసుకొని వెళ్లేవారో, అలా వర్తమాన సేవలలో ఈ అడిషన్‌ కావాలి. ఏ కార్యమైనా ప్రారంభించేందుకు ముందు అందరి శుభ భావనలు, శుభ కామనలు తీసుకోండి. అందరి సంతుష్టతా బలము నింపుకోండి. అప్పుడు శక్తిశాలి ఫలము లభిస్తుంది.

స్లోగన్‌ :-

''ఎలాగైతే తండ్రి జీ హాజిర్‌ అని అంటూ ఉంటారో, అలా మీరు కూడా సేవలో జీ హాజిర్‌, జీ హుజూర్‌ అని అంటూ ఉంటే పుణ్యము జమ అవుతుంది.''

బ్రహ్మబాబా సమానంగా అయ్యేందుకు విశేషమైన పురుషార్థము

ఎలాగైతే బ్రహ్మాబాబా పరమాత్మ ప్రేమలో లీనమై ఉండేవారో, తండి తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదో, సంకల్పములోనూ బాబా, కర్మలో కూడా బాబా తోడును ఉంచుకున్నారో అలా లవలీన స్థితిలో ఉండి ఏ మాట మాట్లాడినా ఆ స్నేహపూరిత మాట ఇతర ఆత్మలను కూడా స్నేహములో బంధిస్తాయి. ఇటువంటి లవ్‌లీన్‌ స్థితిలో ఉంటే ఒక్క 'బాబా' అను శబ్ధమే జాదూ(గారడి) మంత్రము చేసే పని చేస్తుంది.