14-08-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత ఆత్మలో ప్రకాశము వస్తుంది. జ్ఞానవంత ఆత్మ మెరుస్తూ ఉంటుంది.''
ప్రశ్న :-
మాయ ఎటువంటి పిల్లలను కొద్దిగా కూడా విసిగించలేదు?
జవాబు :-
ఎవరైతే పక్కా యోగులో, యోగబలముతో సర్వ కర్మేంద్రియాలను శీతలంగా చేసుకున్నారో, సదా యోగములోనే ఉండేందుకు శ్రమ చేస్తారో వారిని మాయ కొద్దిగా కూడా విసిగించలేదు. మీరు ఎప్పుడైతే పక్కా యోగులుగా అవుతారో అప్పుడు అర్హులుగా అవుతారు. అర్హులుగా అవ్వాలంటే పవిత్రత ముఖ్యమైనది.
ఓంశాంతి.
మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - అజ్ఞాన కారణంగా ఆత్మలైన మీరు కాంతిహీనమైపోయారు. వజ్రములో మెరుపు ఉంటుంది కదా. రాయిలో మెరుపు ఉండదు. అందుకేే రాయి సమానం డల్గా అయిపోయారని అంటారు. ఆత్మ జాగృతమవుతే పారసమణుల వలె ఉన్నారని అంటారు. అజ్ఞాన కారణంగా ఆత్మ జ్యోతిలోని ప్రకాశము పూర్తిగా తగ్గిపోయింది, అంతేగాని నల్లగా అవ్వదు. అలా పేరు పెట్టడం జరిగింది. ఆత్మ అందరిలో ఒకే రకంగా ఉంటుంది. శరీరాలు ఎంత నల్లగా ఉంటాయి. ఆఫ్రికా వైపు వారు ఎంత నల్లగా ఉన్నారు! శరీరాల నిర్మాణము అనేక రకాలుగా ఉంటుంది. ఆత్మలైతే అన్నీ ఒకే రకంగా ఉంటాయి. మేము ఆత్మలమని, తండ్రికి పిల్లలమని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఇంతకు ముందు మీకు ఈ జ్ఞానమంతా ఉండేది కానీ మెల్ల-మెల్లగా అదంతా తొలగిపోయింది. తగ్గుతూ తగ్గుతూ చివరికి కొంచెము కూడా లేనప్పుడు దానిని అజ్ఞానమని అంటారు. మీరు కూడా అజ్ఞానులుగా ఉండేవారు ఇప్పుడు జ్ఞానసాగరుని ద్వారా జ్ఞానులుగా అవుతూ ఉంటారు. ఆత్మ అయితే చాలా సూక్ష్మమైనది. ఈ కన్నులతో చూడలేము. తండ్రి వచ్చి అర్థం చేయించి పిల్లలను జ్ఞానపూర్ణులుగా చేసినప్పుడు జాగృతులుగా అవుతారు. ప్రతి ఇల్లు ప్రకాశమయమైపోతుంది. ఇప్పుడు ప్రతి ఇంటిలో అంధకారముంది అనగా ఆత్మ డిమ్గా (కాంతిహీనముగా) అయిపోయింది. ఇప్పుడు తండి చెప్తున్నారు - నన్ను స్మృతి చేస్తే మీలో పక్రాశము వచ్చేస్తుంది. మళ్లీ మీరు జ్ఞానవంతులుగా అవుతారు. తండ్రి ఎవ్వరినీ నిందించరు. డ్రామా రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. అందరూ మూఢమతులైపోయారని పిల్లలకు చెప్పారు కదా. ఎవరు చెప్తున్నారు? - తండ్రి. పిల్లలారా, శ్రీమతానుసారము మీ బుద్ధి ఎంత సుందరంగా ఉండేది! ఇప్పుడు మీరు దానిని అనుభవము చేస్తున్నారు కదా. మీకు జ్ఞానము లభించింది. జ్ఞానమును చదువు అని అంటారు. తండ్రి చెప్పే చదువు ద్వారా మన జ్యోతి జాగృతమయ్యింది. దీనినే సత్య-సత్యమైన దీపావళి అని అంటారు. చిన్నతనములో మట్టి దీపములో నూనె వేసి జ్యోతిని వెలిగించేవారు. ఆ పద్ధతులు నడుస్తూనే ఉంటాయి. వాటి ద్వారా ఏ దీపావళి పండుగ జరగదు. ఇక్కడ ఆంతరికములో ఉన్న ఆత్మ తన ప్రకాశము కోల్పోయి డిమ్ అయిపోయింది. ఆత్మ జ్యోతిని తండ్రి వచ్చి మేల్కొల్పుతారు. వారు వచ్చి పిల్లలకు జ్ఞానమునిస్తారు, చదివిస్తారు. పాఠశాలలో టీచరు చదివిస్తారు కదా. అది హద్దులోని జ్ఞానము ఇది అనంతమైన జ్ఞానము. ఈ చదువును సాధు-సత్పురుషులు ఎవరైనా చదివిస్తారా! రచయిత, రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా ఎవరైనా వచ్చి చదివించారా? ఈ జ్ఞానము ఎవరైనా చదివిస్తున్నారా అని అంతటా వెళ్లి చూడండి. ఒక్క తండ్రి మాత్రమే చదివిస్తారు. కావున వారి వద్ద చదువుకోవాలి. తండ్రి అకస్మాత్తుగా వచ్చేస్తారు. నేను వస్తున్నానని దండోరా వేయించరు. అనాయాసంగానే(అప్రయత్నంగానే) వచ్చి ప్రవేశిస్తారు. వారికి కర్మేంద్రియాలు దొరకనంత వరకు వారు శబ్ధము చేయలేరు(మాట్లాడలేరు). ఆత్మ కూడా కర్మేంద్రియాలు లేకుండా శబ్ధము చేయలేదు. శరీరములోకి వచ్చినప్పుడే శబ్ధము చేస్తుంది. ఇలా మీరు అర్థం చేయిస్తే ఎవ్వరూ ఒప్పుకోరు. ఈ జ్ఞానాన్ని పిల్లలకు ఇచ్చినప్పుడు వారు అర్థము చేసుకుంటారు. ఈ జ్ఞానాన్ని ఒక్క తండ్రి తప్ప ఎవ్వరూ ఇవ్వలేరు. వినాశ సాక్షాత్కారము కూడా ఎవ్వరూ ఇష్టపడరు. ఇది తండ్రే వచ్చి చేయిస్తారు. డ్రామానుసారము పాత ప్రపంచము ఇప్పుడు సమాప్తి అవ్వనున్నది. నూతన ప్రపంచము స్థాపన అవుతోంది. ఎవరైతే తండ్రి నుండి జ్ఞానము తీసుకోవాలో వారు వస్తూ ఉంటారు. ఎంత మందికి జ్ఞానము ఇచ్చి ఉండవచ్చు ? లెక్కలేెనన్ని గ్రామాల నుండి ఎంతోమంది వస్తారు. ఈ ఆత్మ-పరమాత్మల మేళా ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. తండ్రి సంగమ యుగములోనే వచ్చి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. ఎవరి జ్యోతిని వెలిగిస్తారో వారు వెళ్లి ఇతరుల జ్యోతిని వెలిగిస్తారు. ఇప్పుడు మీరంతా వాపస్ వెళ్లాలి. ఇందులో బుద్ధితో పని చేయాల్సి ఉంటుంది. భక్తిమార్గములో అంతా అంధకారమే. జ్ఞానమిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారు సంగమ యుగములోనే వస్తారు. పాత ప్రపంచములో జ్ఞానము లభించదు. మనుష్యుల లెక్క ప్రకారము ఇంకా 40 వేల సంవత్సరాలున్నాయని భావిస్తూ గాడాంధకారములో ఉన్నారు. 40 వేల సంవత్సారాల తర్వాత భగవంతుడు వస్తారని భావిస్తారు. వారు జ్ఞానమునిచ్చి తప్పకుండా సద్గతినిస్తారని అంటే ఇప్పుడు అజ్ఞానములో ఉన్నట్లే కదా. దీనిని అజ్ఞానాంధకారము అని అంటారు. అజ్ఞానులకు జ్ఞానము కావాలి. భక్తిని జ్ఞానమని అనరు. ఆత్మలో జ్ఞానము లేనే లేదు. కాని డల్ బుద్ధి గలవారైనందున భక్తినే జ్ఞానమని భావిస్తారు. ఒకవైపు జ్ఞానసూర్యుడు వస్తూనే ప్రకాశమవుతుందని కూడా అంటారు. కానీ కొంచెము కూడా అర్థము చేసుకోరు. జ్ఞాన సూర్యుడు ఉదయించగానే................. అని పాడ్తారు కానీ జ్ఞానసూర్యుడెవరో, ఎప్పుడు వచ్చారో ఎవ్వరికీ తెలియదు. కలియుగము పూర్తి అయినప్పుడు ప్రకాశము వస్తుందని పండితులు మొదలైనవారు అంటూ ఉంటారు. ఈ విషయాలన్నీ తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. పిల్లలు నంబరువారుగా అర్థము చేసుకుంటారు. టీచరు పిల్లలను చదివిస్తారు కానీ పిల్లలందరూ ఏకరసంగా చదవలేరు. చదువులో ఒకే రకంగా ఎప్పుడూ మార్కులు తీసుకోలేరు.
అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారని మీకు తెలుసు. ఇప్పుడు పాత ప్రపంచము వినాశము కూడా ఎదురుగా నిల్చొని ఉంది. ఇప్పుడే తండ్రి నుండి జ్ఞానము తీసుకోవాలి, యోగము కూడా నేర్చుకోవాలి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశమౌతాయి. తండ్రి చెప్తున్నారు - ఈ సంగమ యుగములోనే వచ్చి ఈ శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను అనగా ప్రకృతిని ఆధారంగా తీసుకుంటాను. గీతలో కూడా ఈ శబ్ధముంది. ఏ ఇతర శాస్త్ర్రాల పేర్లను బాబా తీసుకోరు. గీత ఒక్కటే. ఇది రాజయోగ విద్య. దీనికి గీత అని పేరుంచారు. ఇందులో మొట్టమొదట భగవానువాచ అని వ్రాసి ఉన్నారు. ఇప్పుడు భగవంతుడని ఎవరిని అంటారు? భగవంతుడు నిరాకారుడు. వారికి తన శరీరము లేదు. అది ఆత్మలు నివసించే నిరాకారి ప్రపంచము. సూక్ష్మలోకాన్ని ప్రపంచమని అనరు. ఇది స్థూల సాకార ప్రపంచము, అది ఆత్మల ప్రపంచము. ఆటంతా ఇక్కడే నడుస్తుంది. నిరాకార ప్రపంచములో ఆత్మలు చాలా చిన్న చిన్నవిగా ఉంటాయి. సూక్ష్మంగా ఉంటాయి. తర్వాత పాత్రను అభినయించేందుకు వస్తాయి. ఈ ఆలోచనలను పిల్లలైన మీ బుద్ధిలో కూర్చోబెడ్తారు. దీనినే జ్ఞానమని అంటారు. వేద శాస్త్రాలను భక్తి అని అంటారు, జ్ఞానమని అనరు. సాధు సన్యాసులతో మీకంతగా సంబంధము లేదు కాని బాబాకు(బ్రహ్మబాబాకు) చాలా పరిచయముంది. చాలా మంది గురువులను ఆశ్రయించాడు. మీరెందుకు సన్యసించారు? ఇల్లు-వాకిళ్లు ఎందుకు విడిచిపెట్టారు? అని ప్రశ్నిస్తే, వికారాల వలన బుద్ధి భ్రష్ఠమౌతుంది, అందుకే ఇల్లు-వాకిళ్లు వదిలేశామని చెప్పేవారు. సరే అడవిలో వెళ్లి కూర్చుంటే ఇల్లు-వాకిలి గుర్తు రాదా? అని అడిగితే అవును గుర్తు వస్తుంది అని చెప్పేవారు. ఒక సన్యాసి తిరిగి వాపస్ ఇంటికి వెళ్లడాన్ని కూడా బాబా చూశారు. ఇది కూడా శాస్త్రాలలో ఉంది. మనుష్యులు వృద్ధులైనప్పుడే వానప్రస్థ స్థితిలోకి వెళ్తారు. చిన్న వయసులో వానప్రస్థమును తీసుకోరు. కుంభమేళాలలో చాలా చిన్న వయసు గల దిగంబరులు వస్తారు, ఔషధాలు తినిపిస్తారు. దీని ద్వారా కర్మేంద్రియాలు చల్లబడ్తాయి. మీరైతే యోగబలము ద్వారా కర్మేంద్రియాలను వశపరచుకుంటారు. యోగబలముతో వశమౌతూ వశమౌతూ చివరికి తప్పకుండా శీతలమైపోతాయి. బాబా, మాయ చాలా సతాయిస్తుందని చాలా మంది అంటారు. అక్కడ ఇలాంటి విషయాలేవీ ఉండవు. యోగములో పక్కాగా అయినప్పుడే కర్మేంద్రియాలు వశమౌతాయి, శాంతమైపోతాయి. ఇందులో చాలా శ్రమ ఉంది. అక్కడ ఇటువంటి అసహ్యపు ఛీ-ఛీ కర్మలే ఉండవు. అటువంటి స్వర్గ ధామానికి తీసుకెళ్లేందుకే తండ్రి వచ్చారు. మిమ్ములను అర్హులుగా చేస్తున్నారు. మాయ మిమ్ములను అనర్హులుగా చేస్తుంది. అనగా స్వర్గములో లేక జీవన్ముక్తిధామములోకి వెళ్లే యోగ్యత ఉండదు. తండ్రి కూర్చుని యోగ్యులుగా తయారు చేస్తారు. దాని కొరకు పవిత్రత మొదటిది(చాలా ముఖ్యమైనది). బాబా, మేము పతితమై పడి ఉన్నాము, మీరు వచ్చి మమ్ములను పావనంగా చేయండి అని కూడా పాడ్తారు. పావనులు అంటే పవిత్రులు. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు త్రాగుతారని గాయనము కూడా ఉంది. ఆదిమధ్యాంతాలు దు:ఖమిచ్చు దానిని విషమని కూడా అంటారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. తండ్రి ఎన్నోసార్లు వచ్చి పిల్లలైన మీతో కలిశారు. మిమ్ములను కనిష్ఠము నుండి ఉత్తమ పురుషులుగా చేస్తారు. ఆత్మ పవిత్రమైతే ఆయువు కూడా పెరుగుతుంది. ఆరోగ్యము, ఐశ్వర్యము మరియు సంతోషము అన్నీ లభిస్తాయి. దీనిని కూడా మీరు బోర్డు పై వ్రాయించవచ్చు. '' 21 తరాలకు క్షణములోనే ఆరోగ్య, ఐశ్వర్య, ఆనందాలను ప్రాప్తి చేసుకోండి'' అని వ్రాయండి. తండ్రి నుండి 21 జన్మల కొరకు ఈ వారసత్వము లభిస్తుంది. కొందరు పిల్లలు బోర్డు ఉంచుకునేందుకు కూడా భయపడ్తారు. బోర్డు అందరి ఇండ్లలో ఉండాలి. మీరు సర్జన్ పిల్లలు కదా. మీకు ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము అన్నీ లభిస్తాయి. వాటిని మీరు ఇతరులకు ఇవ్వండి. ఇవ్వగలిగినప్పుడు బోర్డు పైన ఎందుకు వ్రాయరు! అప్పుడే మనుష్యులు వచ్చి భారతదేశములో నేటికి 5 వేల సంవత్సరాల క్రితము ఆరోగ్యము, ఐశ్వర్యములుండేవి, పవిత్రత కూడా ఉండేదని అర్థము చేసుకుంటారు. బేహద్ తండ్రి వారసత్వము ఒక్క క్షణములో ప్రాప్తిస్తుంది. మీ వద్దకు చాలామంది వస్తారు. ఇదే భారతదేశము బంగారు పిచుకగా ఉండేదని, వీరి రాజ్యముండేదని(లక్ష్మినారాయణుల) కూర్చుని అర్థం చేయించండి. మరి వీరు ఎక్కడకు పోయారు? మొదట 84 జన్మలు వీరు తీసుకుంటారు. ఇతడు నంబరువన్ కదా. మళ్లీ ఇతడే చివరిలో వస్తాడు. తండ్రి చెప్తున్నారు - ఇప్పుడు మీ 84 జన్మల చక్రము పూర్తి అయ్యింది. మళ్లీ ఆరంభమవ్వాలి. బేహద్ తండ్రే వచ్చి ఆ పదవిని ప్రాప్తి చేయిస్తారు. మీరు నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారని చెప్తున్నారు. 84 జన్మలను తెలుసుకొని తండ్రి నుండి వారసత్వమును తీసుకోవాలి. కాని చదువైతే కావాలి కదా.
మిమ్ములను స్వదర్శన చక్రధారులని అంటారు. కొత్తవారెవ్వరూ అర్థము చేసుకోలేరు. ' స్వ' అనగా ఆత్మ అని మీకు తెలుసు. పవిత్ర ఆత్మలమైన మనము ప్రారంభము నుండి 84 జన్మల చక్రములో తిరిగాము. మీరు మొట్టమొదట శివుని భక్తి ప్రారంభము చేశారని తండ్రి కూడా చెప్తున్నారు. మీరు అవ్యభిచారి భక్తులుగా ఉండేవారు. ఈ విషయాలు తండ్రి తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా, మీరు మొట్టమొదట ఈ జన్మ(దేవతా) తీసుకున్నారు. ఎవరైనా ధనవంతులుగా ఉంటే గత జన్మలో మీరు అటువంటి కర్మలు చేసి ఉంటారని అంటారు కదా. ఎవరైనా వ్యాధిగ్రస్థులుంటే వెనుకటి జన్మల కర్మల లెక్కాచారము అని అంటారు. సరే, ఈ లక్ష్మినారాయణులు ఎటువంటి కర్మలు చేశారు? ఇది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. వీరి 84 జన్మలు పూర్తి అయ్యాయి. మళ్లీ ఫస్టు నంబరులో రావాలి. భగవంతుడు సంగమ యుగములోనే వచ్చి రాజయోగము నేర్పిస్తారు. ఇప్పుడు బాబా మనకు రాజయోగము నేర్పిస్తున్నారని మీకు తెలుసు. మళ్లీ మీరే మర్చిపోతారు. కర్మ, అకర్మ, వికర్మల గుహ్య గతిని కూడా తండ్రి అర్థం చేయించారు. రావణ రాజ్యములో మీ కర్మలు వికర్మలుగా అయిపోతాయి. అక్కడ కర్మ అకర్మగా అవుతుంది. అక్కడ రావణ రాజ్యమే లేదు, వికారాలే ఉండవు. అక్కడ యోగబలము ఉంటుంది. యోగబలముతోనే మనము విశ్వాధికారులుగా అవుతాము. కనుక మనకు పవిత్ర ప్రపంచము కూడా కావాలి. పాత ప్రపంచాన్ని అపవిత్రమని, నూతన ప్రపంచాన్ని పవిత్ర ప్రపంచమని అంటారు. అది నిర్వికార ప్రపంచము, ఇది వికారి ప్రపంచము. తండ్రే వచ్చి వేశ్యాలయాన్ని శివాలయంగా చేస్తారు. సత్యయుగము శివాలయము. శివబాబా వచ్చి మిమ్ములను సత్యయుగానికి అర్హులుగా చేస్తున్నారు. లక్ష్మినారాయణుల మందిరాలకు వెళ్లి - వీరు ఈ పదవిని ఎలా పొందారో మీకు తెలుసా? విశ్వాధికారులుగా ఎలా అయ్యారు? అని మీరు ప్రశ్నించవచ్చు. మీకు తెలియదు, నాకు తెలుసు అని తండ్రి చెప్తున్నారు. వీరు ఈ పదవిని ఎలా పొందారో మేము మీకు తెలిపించగలము అని తండ్రి పిల్లలైన మీరు మాత్రమే చెప్పగలరు. వీరే పూర్తి 84 జన్మలు తీసుకున్నారు. మళ్లీ పురుషోత్తమ సంగమ యుగములో తండ్రియే వచ్చి రాజయోగము నేర్పించారు, రాజ్యము కూడా ఇచ్చారు. అంతక్రితము నంబరువన్ పతితులుగా ఉండేవారు, తర్వాత నంబరువన్ పావనంగా అయ్యారు. పూర్తి రాజధాని ఉంది కదా. వీరికి రాజయోగము ఎవరు నేర్పించారో, చిత్రాలలో స్పష్టంగా ఉంది. పరమాత్మ సర్వ శ్రేష్ఠులు. దేవతలు నేర్పించలేరు. భగవంతుడే నేర్పిస్తారు. వారినే జ్ఞానసాగరులని అంటారు. వారిని తండ్రి, టీచరు, సద్గురువు అని కూడా అంటారు.
ఎవరైతే ప్రారంభము నుండి శివుని భక్తి చేశారో వారే ఈ విషయాలను అర్థము చేసుకోగలరు. మందిరాలను నిర్మించే వారి వద్దకు వెళ్లి మీరు ఈ మందిరాన్ని నిర్మించారు, మరి వారు ఈ పదవిని ఎలా పొందారు? వీరి రాజ్యము ఎప్పుడుండేది? తర్వాత వీరంతా ఎక్కడికెళ్లారు? ఇప్పుడు వీరు ఎక్కడున్నారు? అని ప్రశ్నించండి. మీరు 84 జన్మల కథను వినిపిస్తే వారు చాలా సంతోషిస్తారు. చిత్రము జేబులో ఉండాలి. మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. ఎవరైతే ప్రారంభము నుండి శివుని భక్తి చేశారో వారు వింటూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. వీరు మన కులము వారని మీరు అర్థము చేసుకోగలరు. రోజురోజుకు బాబా చాలా సహజమైన యుక్తులు తెలియజేస్తూ ఉంటారు. పరమపిత పరమాత్మయే సర్వుల సద్గతిదాత అని మీకిప్పుడు అర్థమయ్యింది. 21 జన్మలకు సత్యయుగ చక్రవర్తి పదవి లభించేస్తుంది. 21 జన్మల వారసత్వము ఈ చదువు ద్వారానే లభిస్తుంది. అనేక టాపిక్లున్నాయి. ''వేశ్యాలయము మరియు శివాలయమని వేటినంటారు?'' - ఈ విషయము పై మనము పరమపిత పరమాత్ముని జీవన కథను తెలిపించగలము. ''లక్ష్మినారాయణుల 84 జన్మల కథ'' - ఇది కూడా ఒక టాపిక్. ''విశ్వములో శాంతి ఎప్పుడుండేది, తిరిగి అశాంతిగా ఎలా అయింది, ఇప్పుడు మళ్లీ శాంతి ఎలా స్థాపించబడుతూ ఉంది'' - ఇది కూడా ఒక టాపిక్. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఇప్పుడు ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు స్మృతి బలముతో ఆత్మను పవిత్రంగా చేసుకోవాలి. కర్మేంద్రియాలతో ఏ వికర్మా చేయరాదు.
2. జ్ఞానవంతులై ఆత్మలను మేల్కొలిపే సేవ చేయాలి. ఆత్మ రూపి జ్యోతిలో జ్ఞాన - యోగాలనే నేతిని వేయాలి. శ్రీమతానుసారము బుద్ధిని స్వచ్ఛంగా చేసుకోవాలి.
వరదానము :-
'' యజమానత్వ (మాలిక్పన్) స్మృతి ద్వారా 'మన్మనాభవ' స్థితిని తయారు చేసుకునే మాస్టర్ సర్వశక్తివాన్ భవ ''
సదా నేను కరావన్హార్(చేయించే) ఆత్మను, యజమానిని, విశేషమైన ఆత్మను, మాస్టర్ సర్వశక్తివాన్ను' అను స్మృతి ఎమర్జ్ రూపంలో ఉండాలి. అప్పుడు ఈ యజమానత్వ స్మృతి ద్వారా మనసు, బుద్ధి, సంస్కారాలు మీ అదుపులో ఉంటాయి. నేను ''శరీరము కంటే వేరుగా ఉన్నాను, యజమానిని'' - ఈ స్మృతి ద్వారా 'మన్మనాభవ' స్థితి సులభంగా తయారవుతుంది. వేరుగా ఉండే (న్యారేపన్) ఈ అభ్యాసము కర్మాతీతంగా చేసేస్తుంది.
స్లోగన్ :-
'' గ్లాని లేక డిస్టర్బెన్స్ను సహించడం మరియు ఇముడ్చుకోవడం అనగా మీ రాజధానిని నిశ్చయం చేసుకోవడం. ''