23-04-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - రోజంతటిలో తండ్రికి ఎంత సమయము ఇచ్చాను, ఏ తప్పు చేయలేదు కదా ? అని మీ లెక్కాచారాన్ని చెక్ చేసుకోండి.
ప్రశ్న :-
అంతర్ముఖులుగా అయ్యి ఏ శ్రమను చేస్తూ ఉంటే అపారమైన సంతోషము ఉంటుంది?
జవాబు :-
జన్మ-జన్మాంతరాల నుండి ఏమి చేశారో, ఏవైతే మీ ముందుకు వస్తాయో వాటన్నింటి నుండి బుద్ధి యోగాన్ని తొలగించి సతోప్రధానంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేసే శ్రమ చేస్తూ ఉండండి. నలువైపుల నుండి బుద్ధిని తొలగించి అంతర్ముఖులుగా అయ్యి తండ్రిని స్మృతి చేయండి. సర్వీసుకు ఋజువిస్తే అపారమైన సంతోషముంటుంది.
ఓంశాంతి.
తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారని పిల్లలకు తెలుసు. ఆత్మిక తండ్రి అనంతమైన తండ్రి. ఆత్మిక పిల్లలు కూడా అనంతమైన పిల్లలే. తండ్రి పిల్లలందరికి సద్గతినివ్వాలి. ఎవరి ద్వారా? ఈ పిల్లల ద్వారా విశ్వానికి సద్గతినివ్వాలి. విశ్వములోని పిల్లలంతా ఇక్కడకు వచ్చి చదువుకోరు. దీని పేరే ఈశ్వరీయ విశ్వ విద్యాలయము. అయితే అందరికీ ముక్తి లభిస్తుంది. ముక్తి అనండి లేక జీవన్ముక్తి అనండి, ముక్తిలోకి వెళ్లి తిరిగి అందరూ జీవన్ముక్తిలోకి వచ్చే తీరాలి అంటే అందరూ ముక్తిధామము ద్వారా(వయా) జీవన్ముక్తిలోకి వస్తారు. ఒకరి వెనుక ఒకరు పాత్రను అభినయించేందుకు రానే రావాలి. అంతవరకు ముక్తిధామములో ఉండవలసి వస్తుంది. పిల్లలకిప్పుడు రచయిత-రచనల గురించి తెలిసింది. ఇదంతా అనాది రచన. రచయిత అయితే ఒక్క తండ్రి మాత్రమే. ఆత్మలంతా అనంతమైన తండ్రి పిల్లలే. వారికి తెలిసినప్పుడు వారే వచ్చి యోగము నేర్చుకుంటారు. ఈ యోగము భారతదేశము కొరకే. తండ్రి భారతదేశములోనే వస్తారు. భారతవాసులకే స్మృతి యాత్రను నేర్పించి పావనంగా చేస్తారని మరియు సృష్టి చక్రము ఎలా తిరుగుతూ ఉంది అనే జ్ఞానము కూడా ఇస్తారని పిల్లలకు తెలుసు. ఏదైతే గాయనము చేయబడి, పూజింపబడు రుద్రమాల ఉందో, దానిని స్మరిస్తారు. భక్తమాల కూడా ఉంది. సర్వ శ్రేష్ఠమైన భక్తుల మాల కూడా ఉంది. భక్త మాల తర్వాత జ్ఞన మాల ఉండాలి. భక్తి మరియు జ్ఞానము ఉన్నాయి కదా. భక్త మాలతో పాటు రుద్ర మాల కూడా ఉంది. తర్వాత రుండ్ మాల అని అంటారు ఎందుకంటే సృష్టిలో సర్వ శ్రేష్ఠ మానవుడు విష్ణువైనందున వారిని సూక్ష్మవతనములో చూపిస్తారు. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడే ఉన్నాడు. ఇతని మాల కూడా ఇక్కడే ఉంది. చివరికి వీరి మాల తయారైతేనే రుద్రమాల మరియు విష్ణువు యొక్క వైజయంతి మాల తయారవుతుంది. ఉన్నతోన్నతమైనవారు శివబాబా, ఆ తర్వాత సర్వ శ్రేష్ఠమైనది విష్ణు రాజ్యము. భక్తిమార్గములో శోభ కొరకు ఎన్నో చిత్రాలను తయారు చేశారు కానీ అందులో జ్ఞానము ఏమాత్రమూ లేదు. మీరు తయారుచేసిన చిత్రాల అర్థమును తెలిపిస్తే మనుష్యులు అర్థం చేసుకుంటారు లేకుంటే శివ, శంకరులను కలిపేస్తారు.
సూక్ష్మవతనములో కూడా అంతా సాక్షాత్కార విషయమే ఉంటుందని బాబా అర్థం చేయించారు. అక్కడ ఎముకలు, రక్తమాంసములు ఉండవు. సాక్షాత్కారము చేసుకుంటారు. సంపూర్ణ బ్రహ్మ కూడా ఉన్నాడు కానీ అతడు సంపూర్ణుడు, అవ్యక్తుడు. ఇప్పుడున్న వ్యక్త బ్రహ్మ అవ్యక్తంగా అవ్వాలి. వ్యక్తములో ఉన్నవాడే అవ్యక్తమవుతాడు. అప్పుడు ఫరిస్తా అని అంటారు. సూక్ష్మవతనములో అతని చిత్రమునుంచారు. సూక్ష్మవతనానికి వెళ్తారు, బాబా శూబీ రసము త్రాగించారని అంటారు. కానీ అక్కడ వృక్షాలు మొదలైనవేవీ ఉండవు. వైకుంఠములో ఉంటాయి. కానీ అక్కడ నుండి తీసుకొచ్చి త్రాగిస్తారని కాదు. ఇవన్నీ సూక్ష్మవతనములోని సాక్షాత్కార విషయాలే. ఇప్పుడు వాపస్ ఇంటికెళ్లాలి అందుకు ఆత్మాభిమానులుగా అవ్వాలి. నేను ఆత్మ అవినాశిని, ఈ శరీరము వినాశి. ఆత్మ జ్ఞానము కూడా పిల్లలైన మీలో ఉంది. వారికి ఆత్మ అంటే ఏమిటో, అందులో 84 జన్మల పాత్ర ఎలా నిండి ఉందో కూడా తెలియదు. ఈ జ్ఞానము కేవలం తండ్రి మాత్రమే ఇస్తారు. తనను గురించిన జ్ఞానమును కూడా ఇస్తారు. తమోప్రధానము నుండి సతోప్రధానంగా కూడా చేస్తారు. నేను ఆత్మను, ఇప్పుడు పరమాత్మునితో యోగము చేయాలనే పురుషార్థము చేస్తూ ఉంటే చాలు. సర్వశక్తివంతుడు, పతితపావనుడని ఒక్క తండ్రినే అంటారు. 'ఓ పతితపావనా రండి' అని సన్యాసులు పిలుస్తారు. కొందరు బ్రహ్మ తత్వమునే పతిత పావనుడని అనేస్తారు. భక్తి ఎంత సమయము నడుస్తుంది, జ్ఞానము ఎంత సమయము నడుస్తుంది. ఈ జ్ఞానము పిల్లలకిప్పుడే లభిస్తుంది. ఇది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు. మనుష్యులై ఉండి కూడా తుచ్ఛ బుద్ధిగలవారిగా ఉండేవారు. సత్యయుగములో సంపూర్ణ స్వచ్ఛ బుద్ధిగలవారుగా ఉండేవారు. వారిలో ఎన్నో దైవీగుణాలుండేవి. పిల్లలైన మీరు తప్పకుండా దైవీగుణాలను కూడా ధారణ చేయాలి. వీరు దేవతల వలె ఉన్నారని అంటారు కదా. సాధు సన్యాసులు, మహాత్ములను మనుష్యులు గౌరవించినా వారిలో దైవీబుద్ధి లేదు. రజోగుణ బుద్ధి గలవారిగా అయిపోతారు. రాజు-రాణి, ప్రజలు ఉంటారు కదా. రాజధాని ఎప్పుడు, ఎలా స్థాపనౌతుందో ప్రపంచానికి తెలియదు. ఇక్కడ మీరన్నీ కొత్త విషయాలే వింటారు. కనుకనే మాల రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు. తండ్రి సర్వ శ్రేష్ఠులు, వారి మాల పైన ఉంది. రుద్రుడైన వారు నిరాకారులు. తర్వాత సాకారులైన లక్ష్మీనారాయణులు. వారి మాల కూడా ఉంది. బ్రాహ్మణుల మాల ఇప్పుడే తయారవ్వదు. చివర్లో బ్రాహ్మణులైన మీ మాల కూడా తయారైపోతుంది. ఈ విషయాలలో ఎక్కువగా ప్రశ్నోత్తరాలు చేయవలసిన అవసరము లేదు. స్వయాన్ని ఆత్మగా భావించి పరమపిత పరమాత్ముని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయము. ఈ నిశ్చయము పక్కాగా ఉండాలి. పతితులను పావనంగా చేయడమే ముఖ్యమైన విషయము. ప్రపంచమంతా పతితంగా ఉంది. మళ్లీ పావనంగా అవ్వాలి. మూలవతనములో మరియు సుఖధామములో అందరూ పావనంగా ఉంటారు. మీరు పావనంగా అయ్యి పావన ప్రపంచానికి వెళ్తారు అంటే ఇప్పుడు పావన ప్రపంచము స్థాపనవుతూ ఉంది. ఇదంతా డ్రామాలో నిర్ణయించబడి ఉంది.
తండ్రి చెప్తున్నారు - ఎటువంటి తప్పు జరగలేదు కదా? అని రోజంతటి లెక్కాచారాన్ని చూసుకోండి. వ్యాపారస్థులు కూడా తమ లెక్కాచారాన్ని పరిశీలించుకుంటారు. ఇది కూడా సంపాదనే. మీరు ప్రతి ఒక్కరు వ్యాపారస్థులే. బాబాతో వ్యాపారము చేస్తారు. నాలో ఎన్ని దైవీగుణాలు ఉన్నాయి? అని స్వయం చెక్ చేసుకోవాలి. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నాము? ఎంతగా అశరీరిగా అవుతున్నాము? అశరీరిగా వచ్చాము, మళ్లీ అశరీరిగా అయ్యి వెళ్లాలి. ఇప్పటివరకు అందరూ వస్తూనే ఉన్నారు. మధ్యలో ఒక్కరు కూడా వాపస్ వెళ్ళలేరు. అందరూ కలిసే వెళ్లాలి. భలే సృష్టి ఎప్పుడూ ఖాళీ అవ్వదు. రాముడు పోయాడు, రావణుడు పోయాడు..... అని గాయనము ఉంది, కానీ ఇరువురూ ఉంటారు. రావణ సంప్రదాయము వెళ్లిపోతే తిరిగి వాపస్ రారు. మిగిలిన వీరు మిగిలిపోతారు. ఇదంతా పోను పోను సాక్షాత్కారము అవుతుంది. నూతన ప్రపంచము ఎలా స్థాపన అవుతూ ఉంది, చివరిలో ఏమౌతుంది? - ఇవి తెలుసుకోవలసిన విషయాలు. చివరికి మన ధర్మమొక్కటే మిగులుతుంది. సత్యయుగములో మీరు రాజ్యము చేస్తారు. కలియుగము సమాప్తమైపోతుంది. తర్వాత మళ్లీ సత్యయుగము వస్తుంది, ఇప్పుడు రామ సంప్రదాయము, రావణ సంప్రదాయము రెండూ ఉన్నాయి. సంగమ యుగములోనే ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు మీకు ఇదంతా తెలుసు. తండ్రి చెప్తున్నారు - మిగిలిన రహస్యాలన్నీ ముందుకు పోను పోను నిదానంగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఏది రికార్డులో నిండి ఉందో, అది బయటపడ్తూ ఉంటుంది. మీరు అర్థము చేసుకుంటూ ఉంటారు. ముందుగా(అడ్వాన్స్గా) ఏమీ తెలుపబడదు. ఇది కూడా డ్రామా ప్రకారము ప్రణాళిక. రికార్డు తెరవబడ్తూ ఉంటుంది. బాబా చెప్తూ ఉంటారు. మీ బుద్ధిలో ఈ విషయాలన్నిటి జ్ఞానము వృద్ధి చెందుతూ ఉంటుంది. రికార్డు అనుసారంగా బాబా మురళి నడుస్తూ ఉంటుంది. డ్రామా రహస్యమంతా నిండి ఉంది. రికార్డులో ముల్లును పైకెత్తి మధ్యలో పెడితే అది రిపీట్ అయినట్లు మళ్లీ రిపీట్ అవుతుందని కాదు. అలా జరగదు, అక్కడ మళ్లీ అదే రిపీట్ అవుతుంది, నూతన విషయమేదీ ఉండదు. తండ్రి వద్ద ఏదైతే నూతన విషయము ఉంటుందో అది మళ్లీ రిపీట్ అవుతుంది. మీరు వింటూ, వినిపిస్తూ ఉంటారు. మిగిలినవన్నీ గుప్తము. ఇప్పుడు రాజధాని స్థాపన అవుతోంది. పూర్తి మాల తయారౌతూ ఉంది. వేరు వేరుగా వెళ్లి మీరు రాజ్యములో జన్మ తీసుకుంటారు. రాజు-రాణి, ప్రజలు అందరూ కావాలి. ఇదంతా బుద్ధితో చేయవలసిన పని. వాస్తవానికి ఏమి జరుగుతుందో, అది చూస్తారు. ఎవరైతే ఇక్కడి నుండి వెళ్తారో వారు మంచి ధనవంతుల ఇళ్లలో జన్మ తీసుకుంటారు. ఇప్పుడు కూడా మీకు అక్కడ చాలా పాలన జరుగుతుంది. ఈ సమయములో కూడా కొందరి వద్ద రత్నఖచిత వస్తువులు ఉంటాయి. కానీ వారిలో అంత శక్తి లేదు. శక్తి మీలో ఉంది. మీరెక్కడకు వెళ్లినా ప్రకాశిస్తారు. మీరు శ్రేష్ఠంగా అవుతారు కనుక మీరు అచ్చటికి వెళ్లి దైవీ చరిత్రను చూపిస్తారు. ఆసురీ పిల్లలు పుట్టగానే ఏడుస్తూ ఉంటారు. మురికిగా కూడా ఉంటారు. మీరు చాలా నియమానుసారముగా పాలింపబడ్తారు. మలినము మొదలైన విషయములేవీ ఉండవు. ఈ రోజుల్లోని పిల్లలు మలినమైపోతారు. సత్యయుగములో ఇటువంటి విషయాలు ఉండవు. అది స్వర్గము కదా. దుర్వాసన లేని కారణంగా అక్కడ అగరబత్తీలు వెలిగించరు. తోటలలో మంచి సుగంధభరిత పుష్పాలుంటాయి. ఇక్కడి పుష్పాలలో అంత సుగంధము ఉండదు. అక్కడి ప్రతి వస్తువులోనూ 100 శాతము సువాసన ఉంటుంది. ఇక్కడ ఒక్క శాతము కూడా ఉండదు. అక్కడ పుష్పాలు కూడా ఫస్ట్క్లాస్గా ఉంటాయి. ఇక్కడ ఎంత ధనవంతులైనా అక్కడి వలె ఉండరు. అక్కడ రకరకాల వస్తువులుంటాయి. పాత్రలు మొదలైనవన్నీ బంగారువే ఉంటాయి. ఇక్కడ రాళ్లు ఎలా ఉన్నాయో, అక్కడ అంతా బంగారుమయము. ఇసుకలో కూడా బంగారు ఉంటుంది. మరి ఎంత బంగారు ఉంటుందో ఆలోచించండి! బంగారుతోనే భవనాలను కూడా నిర్మిస్తారు. అక్కడ ఎలాంటి వాతావరణము ఉంటుందంటే - వేడి ఉండదు, చలి ఉండదు. అక్కడ వేడి వలన కలిగే దు:ఖము కూడా ఉండదు, ఫ్యాన్ల అవసరముండదు. దాని పేరే స్వర్గము. అక్కడ అపారమైన సుఖము ఉంటుంది. మీ వంటి పదమాపదమ్ భాగ్యశాలురుగా ఎవ్వరూ తయారవ్వరు. లక్ష్మీనారాయణులను ఎంత మహిమ చేస్తారు. వారిని ఆ విధంగా తయారుచేసే వారికి ఎంత మహిమ ఉండాలి. మొదట అవ్యభిచారి భక్తి ఉంటుంది, తర్వాత దేవతల భక్తి ప్రారంభమౌతుంది. దానిని కూడా భూత పూజ అని అంటారు. ఆ శరీరమైతే లేదు. పంచ తత్వాల పూజ జరుగుతుంది. శివబాబా గురించి అలా అనరు. శివపూజ చేసేందుకు బంగారు మొదలైన వస్తువులను ఉపయోగిస్తారు. ఆత్మను బంగారము అని అనరు. ఆత్మ దేనీతో తయారయ్యింది? శివుని చిత్రము ఏ దేనితో తయారుచేయబడిందంటే వెంటనే చెప్పేస్తారు, కానీ ఆత్మ-పరమాత్మలు దేనితో తయారు చేయబడ్డాయో ఎవ్వరూ తెలుపలేరు. సత్యయుగములో పంచ తత్వాలు కూడా శుద్ధంగా ఉంటాయి. ఇక్కడ అశుద్ధంగా ఉన్నాయి. కావున పురుషార్థీ పిల్లలు ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు - ఈ విషయాలన్నీ వదిలేయండి. ఏమి జరగాలో అదే జరుగుతుంది. మొదట తండ్రిని స్మృతి చేయండి. నలువైపుల నుండి బుద్ధిని తొలగించి నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే వికర్మలు వినాశనమౌతాయి. మీరు ఏదైతే వింటున్నారో వాటన్నిటిని వదిలి, మేము సతోప్రధానంగా అవ్వాలి అన్న ఒక్క మాట పక్కా చేసుకోండి. మళ్లీ సత్యయుగములో కల్ప-కల్పమూ ఏమి జరిగి ఉంటుందో అదే జరుగుతుంది. అందులో వ్యత్యాసము రాదు. తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయము. ఇందులోనే శ్రమ ఉంది. ఇది పూర్తి చేయండి. అనేక తుఫాన్లు వస్తాయి. జన్మ-జన్మల నుండి ఏమి చేస్తూ వచ్చారో అవన్నీ ముందుకు వస్తాయి. కావున అన్నివైపుల నుండి బుద్ధి యోగమును తొలగించి అంతర్ముఖులుగా అయ్యి నన్ను స్మృతి చేసే పురుషార్థము చేయండి. పిల్లలైన మీకంతా నెంబరువారు పురుషార్థానుసారము స్మృతిలోకి వచ్చింది. సర్వీసు ద్వారా కూడా తెలిసిపోతుంది. సర్వీసు చేసేవారికి సర్వీసు యొక్క ఖుషీ ఉంటుంది. బాగా సర్వీసు చేసేవారికి, వారి సర్వీసుకు ఋజువు కూడా లభిస్తుంది. మార్గదర్శకులుగా అయ్యి వస్తారు. ఎవరెవరు మహారథులు, అశ్వారోహులు, పాదచారులో వెంటనే తెలిసిపోతుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము -
1. ఇతర విషయాలన్నీ వదిలి, బుద్ధిని నలువైపుల నుండి తొలగించి సతోప్రధానంగా అయ్యేందుకు అశరీరులుగా అయ్యే అభ్యాసము చేయాలి. దైవీగుణాలను ధారణ చేయాలి.
2. బుద్ధిలో మంచి-మంచి ఆలోచనలు తీసుకురావాలి. మా రాజ్యములో(స్వర్గములో) ఏమేమి ఉంటాయి, వాటి పై మననము చేసి, మిమ్ములను మీరు అందుకు అర్హులుగా, చరిత్రవంతులుగా చేసుకోవాలి. ఇక్కడ నుండి బుద్ధిని తొలగించివేయాలి.
వరదా నము :-
'' అల్పకాలిక ఆధారాల తీరాలను వదిలి ఒక్క తండ్రిని ఆధారంగా చేసుకునే యథార్థ పురుషార్థీ భవ ''
పురుషార్థమంటే ఒకసారి చేసిన తప్పును పదే పదే చేస్తూ పురుషార్థమును మీ ఆధారంగా (సాకుగా) తీసుకోవడం కాదు. యథార్థమైన పురుషార్థులనగా పురుషులుగా(ఆత్మలుగా) అయ్యి రథము(శరీరము) ద్వారా కార్యము చేయించేవారు. ఇప్పుడు అల్పకాలిక ఆధారాల తీరాలను వదిలేయండి. చాలామంది పిల్లలు తండ్రికి బదులు హద్దు తీరాలను, తమ స్వభావ సంస్కారాలను, పరిస్థితులను........ ఆధారంగా చేసుకుంటారు. ఈ అల్పకాల ఆధారాలన్నీ బాహ్యానికి చూపించేందుకు మాత్రమే. నిజానికి అవి మోసము చేస్తాయి. తండ్రి ఆధారమొక్కటే నిజమైన ఛత్రఛాయ.
స్లోగన్ :-
'' ఎవరైతే మాయను దూరము నుండే గుర్తించి స్వయాన్ని సమర్థంగా చేసుకుంటారో, వారే నాలెడ్జ్ఫుల్ ఆత్మలు. ''