05-08-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - విదేహి తండ్రినైన నేను దేహధారులైన మిమ్ములను విదేహీగా చేసేందుకు చదివిస్తాను, ఈ క్రొత్త విషయాలను పిల్లలు మాత్రమే అర్థము చేసుకుంటారు ''
ప్రశ్న :-
బాబా ఒకే విషయాన్ని పిల్లలకు పదే పదే అర్థం చేయించే అవసరము ఎందుకు వస్తుంది?
జవాబు :-
ఎందుకంటే క్షణ-క్షణము పిల్లలు మర్చిపోతారు. బాబా పదే పదే అదే విషయాన్ని ఎందుకు అర్థం చేయిస్తున్నారని కొంతమంది పిల్లలు అడుగుతారు. బాబా చెప్తున్నారు - పిల్లలారా, మీరు మర్చిపోతారు కావున నేను తప్పకుండా అవే విషయాలను చెప్పవలసి ఉంటుంది. మిమ్ములను మాయా తుఫానులు హైరానా(గాభరా) పెడ్తాయి, ఒకవేళ నేను రోజూ అప్రమత్తము చెయ్యకుంటే మీరు మాయ తుఫానులలో చిక్కుకుని ఓడిపోతారు. మీరు ఇంకా సతోప్రధానంగా ఎక్కడ తయారైనారు? అలా తయారైనప్పుడు వినిపించడం ఆపేస్తాను.
ఓంశాంతి.
దీనిని విచిత్రమైన ఆత్మిక చదువు అని కూడా అంటారు. క్రొత్త ప్రపంచమైన సత్యయుగములో కూడా దేహధారులే ఒకరినొకరు చదివిస్తారు. జ్ఞానమునైతే అందరూ చదివిస్తారు. ఇక్కడ కూడా చదివిస్తారు. అక్కడ దేహధారులందరూ ఒకరినొకరు చదివిస్తారు అంతేకాని విదేహీ తండ్రి లేక ఆత్మిక తండ్రి చదివించడం ఎప్పుడూ జరగదు. శాస్త్రాలలో కూడా కృష్ణ భగవానువాచ అని వ్రాసేశారు. కృష్ణుడు కూడా దేహధారియే. ఈ క్రొత్త విషయాలను విని తికమక పడ్తారు. ఆత్మిక తండ్రి ఆత్మలమైన మనకు చదువు నేర్పిస్తున్నారని మీలో కూడా నంబరువారు పురుషార్థానుసారముగా అర్థం చేసుకుంటారు. ఇది కొత్త విషయము. కేవలం ఈ సంగమ యుగములో మాత్రమే తండ్రియే స్వయంగా వచ్చి ఇతని ద్వారా నేను మిమ్ములను చదివిస్తున్నానని చెప్తున్నారు. జ్ఞానసాగరుడు, శాంతిసాగరుడు, ఆత్మలందరికీ తండ్రి కూడా వారే. ఇది అర్థము చేసుకోవలసిన విషయము కదా. ఇది కళ్లకు కనిపించేది కాదు. ఆత్మయే ముఖ్యమైనది. అది అవినాశి, శరీరమైతే వినాశి. ఇప్పుడు ఆ అవినాశి ఆత్మ కూర్చుని చదివిస్తుంది. భలే నేను సాకార శరీరములో కూర్చుని ఉన్నానని మీరు సన్ముఖములో చూస్తూ ఉండవచ్చు. కానీ ఈ జ్ఞానము దేహధారులివ్వడము లేదని మీకు తెలుసు. జ్ఞానమునిచ్చేవారు విదేహి అయిన తండ్రి. ఎలా ఇస్తారు? ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు. మనుష్యులైతే చాలా కష్టము మీద అర్థం చేసుకుంటారు. దీనిని నిశ్చయము చేయించేందుకు మీరు తల కొట్టుకోవలసి వస్తుంది(కష్టపడాల్సి వస్తుంది). నిరాకారునికి నామ-రూప-దేశ-కాలాదులేవీ లేవని వారంటారు. ఆ తండ్రి స్వయంగా కూర్చొని చదివిస్తారు. ''నేను సర్వాత్మల తండ్రిని, నన్ను మీరు చూడలేరు'' అని చెప్తున్నారు. వారు విదేహి అని మీరు అర్థం చేసుకున్నారు. జ్ఞాన, ఆనంద, ప్రేమ సాగరులైన వారు ఎలా చదివిస్తారు? ఎలా వస్తానో ఎవరిని ఆధారము తీసుకుంజ 0 P
šī P @ P #3077;ర్థం చేయిస్తాను. నేను ఎవరి గర్భము ద్వారా జన్మించను. నేను ఎప్పటికీ మనిషిగా లేక దేవతగా అవ్వను. దేవతలు కూడా శరీరాలను తీసుకుంటారు. నేనయితే సదా అశరీరిగానే ఉంటాను. డ్రామాలో పునర్జన్మలు ఎప్పటికీ తీసుకోని పాత్ర నాకొక్కరికే ఉంది. కనుక ఇది అర్థము చేసుకోవలసిన విషయము కదా. కంటికి కనిపించనే కనిపించను. కృష్ణ భగవానువాచ అని వారు భావిస్తారు. భక్తిమార్గములో రథమును కూడా ఎలా తయారు చేశారు? తండ్రి చెప్తున్నారు - పిల్లలారా, మీరు తికమక చెందడం లేదు కదా? ఒకవేళ ఏదైనా అర్థము కాకుంటే తండ్రి వద్దకు వచ్చి అర్థం చేసుకోండి. మీరు అడగకనే తండ్రియే పూర్తిగా అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఏమీ అడిగే అవసరమే లేదు. నేను ఈ పురుషోత్తమ సంగమ యుగములోనే అవతరిస్తాను. నా జన్మ కూడా అద్భుతమైనది. పిల్లలైన మీకు కూడా ఆశ్చర్యమేస్తుంది. ఎంత అత్యంత గొప్ప పరీక్షను పాస్ చేయిస్తారు. అత్యంత గొప్ప విశ్వాధికారులుగా చేసేందుకు చదివిస్తారు. అద్భుతమైన విషయము కదా. హే ఆత్మలారా! ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత నేను మీ సేవ కొరకు వస్తాను. ఆత్మలను చదివిస్తాను కదా. కల్ప-కల్పము, కల్పపు సంగమ యుగములో మీ సేవ చేసేందుకు వస్తాను. ఓ బాబా, ఓ పతితపావనా! రండి అని అర్ధకల్పము నుండి మీరు వేడుకుంటూ వచ్చారు. కృష్ణుని పతిత పావనుడని ఎవ్వరూ అనరు. పరమపిత పరమాత్మనే పతితపావనా! అని అంటారు. కావున పతితులను పావనంగా చేసేందుకు బాబా కూడా రావలసి ఉంటుంది. అందువలన అకాలమూర్తి(అమరులు) - సత్యమైన బాబా, అకాలమూర్తి - సత్యమైన టీచరు, అకాలమూర్తి - సద్గురువు అని సిక్కుల వద్ద కూడా చాలా మంచి స్లోగన్లు ఉన్నాయి. కానీ సద్గురువైన అకాలమూర్తి ఎప్పుడు వస్తారో వారికి తెలియదు. మానవులను దేవతలుగా చేసిన నీ కర్తవ్యమును వర్ణించడము అసాధ్యమని,............ సిక్కులు మహిమ చేస్తారు, కానీ ఎప్పుడు వచ్చి మానవులను దేవతలుగా చేస్తారు? వారే సర్వులకు సద్గతినిస్తారని దృఢ నిశ్చయముండాలి. వారు వచ్చి ఏం చెప్తారు? కేవలం '' మన్మనాభవ '' అని అంటారు. దాని అర్థమును కూడా అర్థం చేయిస్తారు. మరెవ్వరూ ఈ విషయాలను అర్థం చేయించరు. సద్గురువైన అకాలమూర్తి వచ్చి స్వయాన్ని ఆత్మ అని తెలుసుకోండని ఈ దేహము ద్వారా అర్థం చేయిస్తున్నారు. కావున ఇది అర్థం చేసుకోవాలి. విశ్వాధికారులుగా చేసేందుకు, పిల్లలైన మీకు సేవ చేసేందుకు తండ్రి రావలసి వస్తుంది. వారు అర్థం చేయిస్తున్నారు - ఓ ఆత్మిక పిల్లలారా, మీరు సతోప్రధానంగా ఉండేవారు, తర్వాత తమోప్రధానంగా అయ్యారు. ఈ సృష్టిచక్రము తిరుగుతోంది కదా. పావనమైన దేవతలకు పావనమైన ప్రపంచము ఉండేది, వారంతా ఎక్కడకు వెళ్లారు? ఇది ఎవ్వరికీ తెలియదు. తికమక చెంది ఉన్నారు. తండ్రి వచ్చి మిమ్ములను వివేకవంతులుగా తయారు చేస్తున్నారు. పిల్లలారా, నేను ఒక్కసారే వస్తాను, పావన ప్రపంచములో నేనెందుకు రావాలి! అక్కడికైతే మృత్యువు రాలేదు. తండ్రి మృత్యువుకే మృత్యువు. సత్యయుగములో వారు వచ్చే అవసరమే లేదు. అక్కడ మృత్యువు కూడా రాదు. కావున మహాకాలుడు(బాబా) కూడా రారు. ఇక్కడికి వచ్చి ఆత్మలందరినీ తీసుకెళ్తారు. సంతోషంగా వెళ్తారు కదా! అవును, ఖుషీగా వెళ్లేందుకు మేము తయారుగా ఉన్నాము. బాబా, అందుకే ఈ పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచానికి వయా శాంతిధామము తీసుకెళ్లమని మిమ్ములను పిలిచాము. ఈ విషయాలను క్షణ-క్షణము మర్చిపోకండి. కానీ మాయా శత్రువు నిలబడి ఉంది. క్షణ-క్షణము మరిపి0 0 P
šī P @ P 149;టర్ సర్వశక్తివంతుడను కనుక మాయ కూడా శక్తివంతమైనది. అది కూడా అర్ధకల్పము మీ పై రాజ్యము చేస్తుంది, మరిపిస్తుంది. అందువలన ప్రతిరోజూ తండ్రి అర్థం చేయించవలసి ఉంటుంది. ప్రతి రోజు సావధానపరచకపోతే మాయ చాలా నష్టపరుస్తుంది. ఇది పవిత్రత మరియు అపవిత్రతల ఆట. ఇప్పుడు తమ నడవడికను సరిదిద్దుకునేందుకు పవిత్రంగా అవ్వండి. కామ వికారము కొరకు ఎన్ని కొట్లాటలు, గొడవలు జరుగుతాయి.
తండ్రి చెప్తున్నారు - మీకిప్పుడు జ్ఞాన మూడవ నేత్రము లభించింది. కావున ఆత్మనే చూడండి. ఈ చర్మ చక్షువులతో చూడనే చూడకండి. ఆత్మలమైన మనమందరము భాయీ-భాయీ (సోదరులము). వికారాలలోకి ఎలా వెళ్తారు! మనము అశరీరులుగా వచ్చాము, మళ్లీ అశరీరులుగా అయ్యి వెళ్లాలి. ఆత్మ సతోప్రధానంగా వచ్చింది, మళ్లీ సతోప్రధానంగా తయారై మధురమైన ఇంటికి వెళ్లాలి. పవిత్రతయే ముఖ్యమైన విషయము. ప్రతిరోజూ అవే విషయాలను అర్థం చేయిస్తారని మనుష్యులు అంటారు. ఇది నిజమే కానీ అర్థం చేయించిన దాని అనుసారముగా నడుచుకోవాలి కదా. ఆచరించేందుకే అర్థం చేయించబడ్తుంది. కానీ ఎవ్వరూ ఆచరించడం లేదు కనుక ప్రతి రోజూ అర్థం చేయించవలసి ఉంటుంది. ''బాబా, మీరు ఏదైతే ప్రతి రోజూ అర్థం చేయిస్తున్నారో అది మేము బాగా అర్థము చేసుకున్నాము, మేమిప్పుడు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతాము, మీరు వెళ్లండి అని ఎవ్వరూ చెప్పరు. ఇలా చెప్తున్నారా? అందువలన బాబా ప్రతిరోజూ అర్థం చేయించవలసి వస్తుంది. విషయమేమో ఒక్కటే, అయితే చెయ్యడం లేదు కదా. తండ్రిని స్మృతే చెయ్యరు. బాబా క్షణ-క్షణము మర్చిపోతున్నామని అంటారు. స్మృతి చేయించేందుకు బాబా పదే పదే చెప్పవలసి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మను స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమవుతాయి, ఇంతకుమించి మరే ఉపాయము లేదని మీరు కూడా ఒకరికొకరు ఇదే అర్థం చేయించండి. ప్రారంభములో మరియు చివరిలో ఈ విషయాన్నే చెప్తారు. స్మృతి ద్వారానే సతోప్రధానంగా అవ్వాలి. బాబా, మాయా తుఫానులు మరిపిస్తున్నాయని మీరే వ్రాస్తారు. మరి తండ్రి సావధానపరచకుండా వదిలేయాలా? నంబరువారు పురుషార్థానుసారముగా ఉన్నారని తండ్రికి తెలుసు. సతోప్రధానంగా అవ్వనంతవరకు వెళ్ళలేరు. యుద్ధానికి కూడా సంబంధముంది కదా. మీరు నెంబరువారు పురుషార్థానుసారము సతోప్రధానంగా అయినప్పుడు యుద్ధము ప్రారంభమవుతుంది. జ్ఞానమైతే ఒక్క సెకండుదే. బేహద్ తండ్రిని పొందుకున్నారు. ఇప్పుడు పవిత్రమైనప్పుడు వారి ద్వారా బేహద్ సుఖము లభిస్తుంది. పురుషార్థము బాగా చేయాలి. కొందరైతే కొద్దిగా కూడా అర్థము చేసుకోరు. తండ్రిని స్మృతి చేయాలనే తెలివి కూడా ఉండదు. ఈ చదువునైతే ఎప్పుడూ చదవలేదు. మొత్తం చక్రమంతటిలో నిరాకార తండ్రి ద్వారా ఎవ్వరూ చదువుకోలేదు. కనుక ఇది క్రొత్త విషయము కదా. తండ్రి చెప్తున్నారు - నేను ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత మిమ్ములను సతోప్రధానంగా చేసేందుకు వస్తాను. సతోప్రధానంగా అవ్వనంతవరకు ఈ పదవిని పొందలేరు. ఎలాగైతే ఇతర చదువులలో ఫెయిల్ అవుతారో, అలా ఇందులో కూడా ఫెయిల్ అవుతారు. శివబాబాను స్మృతి చేయడం ద్వారా ఏమవుతుందో కొంచెం కూడా అర్థము చేసుకోరు. తండ్రి కనుక వారి ద్వారా స్వర్గ వారసత్వము తప్పకుండా లభించాలి. తండ్రి ఒకేసారి వచ్చి అర్థము చేయిస్తారు తద్వారా మీరు దేవతలుగా అవుతారు. మీరు దేవతలుగా అవుతారు, తర్వాత మళ్లీ పాత్ర చేసేందుకు అందర 0 P
šī P @ P 3108;ారు. ఈ విషయాలన్నీ వృద్ధులు మొదలైనవారి బుద్ధిలో నిలువలేవు. అందువలన తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి, చాలు. ఆ శివబాబాయే సర్వాత్మలకు తండ్రి. శారీరిక తండ్రి అయితే ప్రతి ఒక్కరికీ ఉన్నారు. శివబాబా అయితే నిరాకారులు. వారిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రమై శరీరాన్ని వదిలి మళ్లీ తండ్రి వద్దకు చేరుకోవాలి. తండ్రి చాలా విషయాలు అర్థం చేయిస్తున్నా అందరూ ఒకే విధంగా అర్థము చేసుకోరు. మాయ మరిపిస్తుంది. దీనిని యుద్ధమని అంటారు. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తున్నారు! ఎన్ని విషయాలు గుర్తు చేయిస్తున్నారు. ముఖ్యంగా జరిగిన తప్పుల లిస్టును తయారు చేయండి. తండ్రిని సర్వవ్యాపి అని చెప్పడం ఒక తప్పు. భగవానువాచ - నేను సర్వవ్యాపిని కాదు. 5 వికారాలు సర్వవ్యాపిగా ఉన్నాయి. ఇది చాలా పెద్ద తప్పు. గీతా భగవంతుడు కృష్ణుడు కాదు, పరమపిత పరమాత్మ అయిన శివుడు. ఈ తప్పులను సరిదిద్దుకుంటే దేవతలుగా అవుతారు. ఈ తప్పులు జరిగినందు వల్లనే పావనమైన భారతదేశము పతితమైనదని మేము అర్థం చేయించామని ఇంతవరకు ఏ పిల్లలు వ్రాయలేదు. ఇది కూడా తెలిపించాలి. భగవంతుడు సర్వవ్యాపి ఎలా అవ్వగలరు? భగవంతుడైతే ఒక్కరే, వారే పరమపిత, పరమ శిక్షకులు, పరమ సద్గురువు. ఏ దేహధారిని పరమపిత, పరమ శిక్షకులు, సద్గురువు అని అనలేరు. కృష్ణుడైతే సృష్టి అంతటిలో అందరికంటే ఉన్నతమైనవారు. సృష్టి సతోప్రధానంగా అయినప్పుడు అతడు వస్తాడు తర్వాత సతోగా ఉన్నప్పుడు రాముడు, తర్వాత నంబరువారుగా తమ సమయానుసారంగా వస్తారు. అందరి వికారాలు తీసుకొని కంఠమే నల్లగా అయ్యిందని శాస్త్రాలలో చూపిస్తారు. కానీ ఇప్పుడు అర్థం చేయిస్తూ, అర్థం చేయిస్తూ కంఠమే ఎండిపోతుంది. ఎంతో చిన్న విషయము కానీ మాయ ఎంత శక్తివంతమైనది! మనము ఇటువంటి సతోప్రధానమైన గుణవంతులుగా అయినామా? అని ప్రతి ఒక్కరు తమ మనస్సును ప్రశ్నించుకోండి.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - వినాశనము జరగనంతవరకు ఎంతగా తల కొట్టుకున్నా కర్మాతీత స్థితిని పొందలేరు. రోజంతా శివబాబాను స్మృతి చేయండి, ఇంకేమీ చేయకండి. బాబా, యుద్ధానికి ముందే కర్మాతీత స్థితి పొందుకొని చూపిస్తానని చెప్పేవారు ఈ డ్రామాలో ఎవ్వరూ ఉండజాలరు. మొదటి నంబరులో అయితే ఒక్కరే వెళ్లాలి. ఇతను కూడా చెప్తారు - నేను ఎంత కష్టపడవలసి వస్తుంది! మాయ అయితే ఇంకా శక్తిశాలిగా అయ్యి వస్తుంది. నా భృకుటి మధ్యలో నా పక్కనే శివబాబా ఉన్నా, నేను స్మృతి చేయలేను, మర్చిపోతానని బాబానే స్వయంగా చెప్తున్నారు. నాతో పాటు బాబా ఉన్నారని తెలుసు, అయినా మీరు చేసిన విధంగా నేను కూడా స్మృతి చేయవలసి ఉంటుంది. నేను బాబా జతలోనే ఉన్నానని ఇందులోనే సంతోషించరాదు. నిరంతరము స్మృతి చేయమని నాకు కూడా చెప్తారు. తోడుగా ఉన్న నీవు రుస్తుమ్వు(బ్రహ్మాబాబా), నీకు ఇంకా ఎక్కువగా తుఫానులు వస్తాయి, లేకుంటే పిల్లలకెలా అర్థం చేయిస్తావు. ఈ తుఫానులన్నీ నీ నుండి మొదలవుతాయని శివబాబా బ్రహ్మాబాబాకు కూడా చెప్తారు. నేను తండ్రికి ఇంత సమీపంగా ఉన్నా కర్మాతీత స్థితిని పొందలేకున్నాను, మరి ఇతరులెలా అవుతారు. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. డ్రామానుసారంగా అందరూ పురుషార్థము చేస్తూ ఉంటారు. బాబా, మేము మీ కంటే ముందు కర్మాతీత స్థితిని పొంది చూపిస్తామని ఎవరైనా ప్రయత్నము చేసి చూపించండి. అలా జరిగేందుకు వీలు లేదు. ఇది తయారైన డ్రామా.
మీరు చాలా పురుషార్థము చేయాలి. ముఖ్యమైనవి గుణాలే. దేవతలలోని గుణాలకు, పతిత మనుష్యుల గుణాలకు ఎంత తేడా ఉంది. వికారులైన మిమ్ములను నిర్వికారులుగా తయారు చేయువారు శివబాబాయే. కావున ఇప్పుడు పురుషార్థము చేసి తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది, మర్చిపోకండి. పోతే అబలలు పరవశమై ఉన్నారు అంటే రావణునికి వశమై ఉన్నారు కనుక వారేం చేయగలరు. మీరు రాముడైన ఈశ్వరుని శరణులో ఉన్నారు. వారు రావణుని వశములో ఉన్నారు. కావున యుద్ధము జరుగుతుంది. అంతేగాని రామునికి, రావణునికి యుద్ధము జరగదు. పిల్లలైన మీకు తండ్రి ప్రతి రోజూ అనేక విధాలుగా అర్థం చేయిస్తారు - మధురాతి మధురమైన పిల్లలారా, స్వయాన్ని సరిదిద్దుకుంటూ ఉండండి. ప్రతిరోజు రాత్రి లెక్కాచారము చూసుకోండి, మొత్తం రోజంతటిలో ఎలాంటి ఆసురీ నడవడిక లేదు కదా? తోటలోని పుష్పాలు నంబరువారుగా అయితే ఉండనే ఉంటాయి. ఏ రెండూ ఒకే విధంగా ఎప్పుడూ ఉండవు. ఆత్మలందరికీ తమ-తమ పాత్ర లభించింది. ప్రతి పాత్రధారి తమ-తమ పాత్ర చేస్తూ ఉన్నారు. తండ్రి కూడా వచ్చి స్థాపన చేసే తమ కార్యమును చేయనే చేస్తారు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి తప్పకుండా విశ్వాధికారులుగా తయారు చేస్తారు. అనంతమైన తండ్రి కనుక తప్పకుండా నూతన ప్రపంచ వారసత్వమును ఇస్తారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. జ్ఞాన మూడవ నేత్రముతో ఆత్మనే చూడాలి. చర్మచక్షువులతో చూడనే చూడరాదు. అశరీరిగా అయ్యే అభ్యాసము చేయాలి.
2. తండ్రి స్మృతి ద్వారా తమ దైవీ స్వభావాన్ని తయారు చేసుకోవాలి. నేను ఎంతవరకు గుణవంతునిగా అయ్యాను? మొత్తం రోజంతటిలో ఆసురీ నడవడిక నడవలేదు కదా? అని తమ మనసును ప్రశ్నించుకోవాలి.
వరదానము :-
'' ఆందోళనలో వ్యాకుల పడేందుకు బదులు విశాల హృదయాన్ని ఉంచుకునే ధైర్యశాలి భవ ''
ఎప్పుడు ఏ శారీరిక వ్యాధి వచ్చినా, మానసిక తుఫాను వచ్చినా, ధనములో గాని, ప్రవృత్తిలో గాని ఏదైనా ఆందోళనకర పరిస్థితి వచ్చినా, సేవలో ఏదైనా ఆందోళన జరిగినా అందులో వ్యాకుల పడకండి. విశాల హృదయము గలవారిగా అవ్వండి. ఏదైనా లెక్కాచారము వచ్చినా, బాధ కలిగినా దానిని గురించి ఆలోచిస్తూ వ్యాకులత చెంది దానిని పెంచుకోకండి. ధైర్యశాలురుగా అవ్వండి. అంతేగాని అయ్యో, ఇప్పుడేం చేయాలి.......... అని ధైర్యాన్ని కోల్పోకండి. ధైర్యము వహిస్తే తండ్రి సహాయము స్వతహాగా లభిస్తుంది.
స్లోగన్ :-
'' ఇతరుల బలహీనతలను చూచే కనులను మూసుకొని మనసును అంతర్ముఖము చేయండి. ''