10-03-2019 అవ్యక్త బాప్‌దాదా ఓంశాంతి రివైజ్‌: 01-05-1984 మధువనము


'' విస్తారంలో సారానికి గల సౌందర్యము ''

బాప్‌దాదా విస్తారాన్ని కూడా చూస్తున్నారు, విస్తారంలో సార స్వరూప పిల్లలను కూడా చూస్తున్నారు. విస్తారము ఈ ఈశ్వరీయ వృక్షానికి అలంకారము. సార స్వరూప పిల్లలు ఈ వృక్షానికి ఫల స్వరూపులు. విస్తారము సదా వెరైటీ రూపంగా ఉంటుంది, వెరైటీ స్వరూపానికి గల రౌనక్‌ (ప్రకాశము) బాగుందనిపిస్తుంది. వెరైటీ ప్రకాశము(రౌనక్‌) తప్పకుండా వృక్షానికి అలంకారంగా ఉంటుంది. కానీ సార స్వరూపమైన ఫలము శక్తిశాలిగా ఉంటుంది. విస్తారాన్ని చూసి సదా సంతోషిస్తారు. ఫలాన్ని చూసి శక్తిశాలిగా అయ్యే శుభమైన ఆశ ఉంచుకుంటారు. బాప్‌దాదా కూడా విస్తారము మధ్యలో సారమును చూస్తున్నారు. విస్తారములో సారము ఎంత సుందరంగా అనిపిస్తుంది! ఇది అందరూ అనుభవము చేశారు. సారము యొక్క పర్సెంటేజ్‌(శాతము) మరియు విస్తారము యొక్క పర్సెంటేజ్‌ రెండిటిలో ఎంతో తేడా ఉంటుంది. ఇది కూడా తెలుసు కదా! విస్తారము యొక్క విశేషత విస్తారానిది. విస్తారము కూడా అవసరమే కానీ విలువ సార స్వరూప ఫలానికి ఉంటుంది. అందువలన బాప్‌దాదా రెండిటిని చూసి సంతోషిస్తారు. విస్తారము అనే ఆకుల పై ప్రేమ ఉంది, పూల పైనా ప్రేమ ఉంది, ఫలాల పై కూడా ప్రేమ ఉంది. అందువలన బాప్‌దాదా పిల్లల సమానంగా సేవాధారిగా అయ్యి పిల్లలను కలుసుకునేందుకు రావలసే వస్తుంది. సమానంగా అవ్వనంతవరకు సాకార మిలనం జరుపుకోలేరు. విస్తారంగా ఉన్న ఆత్మలు కావచ్చు, సారస్వరూపం గల ఆత్మలు కావచ్చు ఇద్దరూ తండ్రికి చెందినవారిగా అయ్యారు అనగా పిల్లలుగా అయ్యారు. అందువలన తండ్రికి నెంబర్‌వార్‌గా ఉన్న పిల్లలందరి మిలనం చేసుకోవాలి అనే భావనకు ఫలము ఇవ్వవలసే ఉంటుంది. భక్తులకు కూడా భక్తికి ఫలము అల్పకాలిక ప్రాప్తి అవ్వనే అవుతుంది. కనుక పిల్లల అధికారము పిల్లలకు తప్పకుండా ప్రాప్తిస్తుంది.

ఈ రోజు మురళి నడిపించేందుకు రాలేదు. దూర-దూరం నుండి అందరూ వచ్చారు కావున మిలనం చేస్తాననే ప్రతిజ్ఞను నిలబెట్టుకునేందుకు వచ్చాను. కొంతమంది కేవలం ప్రేమతో కలుస్తారు, కొంతమంది జ్ఞానంతో కలుస్తారు, కొంతమంది సమాన స్వరూపంతో కలుస్తారు. కానీ తండ్రి అయితే అందరినీ కలవాల్సిందే. ఈ రోజు అన్ని వైపుల నుండి వచ్చిన పిల్లల విశేషతను చూస్తున్నారు. ఒకటి ఢిల్లీ వారి విశేషతను చూస్తున్నారు. ఢిల్లీ సేవకు ఆది స్థానము అంతేకాక ఆదిలో కూడా సేవాధారులకు సేవను ప్రారంభించేందుకు యమునా నది తీరమే లభించింది(ప్రాప్తించింది). యమునా నది తీరానికి వెళ్లి సేవ చేశారు కదా! సేవకు బీజం కూడా ఢిల్లీలో యమునా నది తీరములోనే మొదలయ్యింది అంతేకాక రాజమహల్‌ కూడా యమునా నదీ తీరంలోనే ఉంటుంది. అందువలన గోపీవల్లభుడు, గోప-గోపికలతో పాటు యమునా నదీ తీరం కూడా మహిమ చేయబడింది. బాప్‌దాదా స్థాపనకు నిమిత్తమైన ఆ శక్తిశాలీ పిల్లల టి.వి చూస్తున్నారు. కావున ఢిల్లీవారి విశేషత వర్తమాన సమయంలోనూ ఉంది, భవిష్యత్తులో కూడా ఉంది. సేవకు పునాది స్థానమే కాక రాజ్యానికి కూడా పునాది స్థానమే. పునాది స్థానపు నివాసులు ఇంత శక్తిశాలిగా ఉన్నారు కదా! ఢిల్లీ వారి పై సదా శక్తిశాలిగా ఉండే బాధ్యత ఉంది. ఢిల్లీ నివాసి నిమిత్త ఆత్మలకు సదా ఈ బాధ్యతా కిరీటం పెట్టబడి ఉంది కదా! కిరీటం ఎప్పుడూ తీసేయడం లేదు కదా! ఢిల్లీ నివాసులు అనగా సదా బాధ్యతా కిరీటధారులు. ఢిల్లీ వారి విశేషత అర్థమయ్యిందా! సదా ఈ విశేషతను కర్మలలోకి తీసుకురావాలి. మంచిది.

రెండవవారు - అల్లారు ముద్దు అపురూపమైన కర్ణాటక పిల్లలు. వీరు భావనను మరియు స్నేహపూరిత నాటకాన్ని చాలా బాగా చూపిస్తారు. ఒకవైపు అత్యంత భావన మరియు చాలా చాలా స్నేహీలు. రెండవ వైపు ప్రపంచం లెక్కతో(దృష్టిలో) ఉన్నత విద్యలో ప్రసిద్ధి గాంచిన వారు కూడా కర్ణాటకలో ఉన్నారు. కావున భావన మరియు పదవికి అధికారులు ఇరువురూ ఉన్నారు. అందువలన కర్ణాటక ద్వారా శబ్ధం పెద్దగా వ్యాపించవచ్చు. ఇది శబ్ధాన్ని బిగ్గరగా చేసే ధరణి. ఎందుకంటే వి.ఐ.పి.లు ఉన్నప్పటికీ భావన మరియు శ్రద్ధ గల ధరణి అయిన కారణంగా నిరహంకారులుగా ఉన్నారు. వారు సహజ సాధనంగా అవ్వగలరు. కర్ణాటక భూమి ఈ విశేష కార్యము కొరకు నిమిత్తంగా ఉంది. కేవలం తమ ఈ విశేషతను భావన మరియు నిరహంకార స్థితి రెండిటిని సేవలో సదా తోడుగా ఉంచుకోవాలి. ఈ విశేషతను ఎలాంటి వాతావరణములోనూ వదిలేయరాదు. కర్ణాటక అనే నావకు ఈ రెండు చేతుల వంటివి. ఈ రెండిటిని జత జతలో ఉంచుకోవాలి. ముందు వెనుక కాదు. అలా జత జతలో ఉంటే సేవ అనే నావ ధరణికి గల సఫలత అను విశేషతను చూపిస్తుంది. రెండిటి బ్యాలన్స్‌ పేరును ప్రసిద్ధి చేస్తుంది. మంచిది.

సదా స్వయాన్ని సార స్వరూపం అనగా ఫల స్వరూపంగా తయారు చేసుకునేవారు, సదా సార స్వరూపంలో స్థితులై ఇతరులను కూడా సార స్థితిలో స్థితం చేసేవారు, సదా శక్తిశాలి ఆత్మలు, శక్తిశాలి స్మృతి స్వరూపులు, శక్తిశాలి సేవాధారులు, ఇటువంటి సమాన స్వరూపంతో మిలనం జరుపుకునే శ్రేష్ఠ ఆత్మలకు బాప్‌దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే.

10-03-2019 అవ్యక్త బాప్‌దాదా ఓంశాంతి రివైజ్‌: 03-05-1984 మధువనము

'' అందరికంటే మొదటి శ్రేష్ఠమైన పరమాత్మ రచన - బ్రాహ్మణులు ''

ఈ రోజు రచయిత అయిన తండ్రి తన రచనను, అందులో కూడా మొదటి రచన అయిన బ్రాహ్మణ ఆత్మలను చూస్తున్నారు. అందరికంటే మొదటి శ్రేష్ఠ రచన శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలైన మీరు. అందువలన మీరు మొత్తం రచన అంతటికంటే ప్రియమైనవారు. బ్రాహ్మణాత్మలు బ్రహ్మ ద్వారా రచింపబడిన ఉన్నతోన్నతమైన ముఖవంశావళి మహాన్‌ ఆత్మలు. దేవతల కంటే బ్రాహ్మణులు శ్రేష్ఠమైనవారని మహిమ చేయబడింది. బ్రాహ్మణులే ఫరిస్తాల నుండి దేవతలుగా అవుతారు. కానీ బ్రాహ్మణ జీవితము, ఆదిపిత ద్వారా లభించిన సంగమయుగీ ఆది జీవితము. ఆది సంగమ వాసులు జ్ఞాన స్వరూపులు, త్రికాలదర్శి, త్రినేత్రి బ్రాహ్మణ ఆత్మలు. సాకార స్వరూపంలో సాకార సృష్టి పై ఆత్మ మరియు పరమాత్మల కలయిక, సర్వ సంబంధాల ప్రేమ యొక్క అనుభవం, పరమాత్మ అవినాశీ ఖజానాలకు అధికారులు. ''బ్రహ్మాబాబా ద్వారా శివతండ్రిని మేము చూశాము, మేము పొందాము'' అని సాకార స్వరూపంతో పాడిన పాట బ్రాహ్మణులదే. ఇది దేవతల జీవితంలోని పాట కాదు. సాకార సృష్టి పై ఈ సాకార నేత్రాల ద్వారా ఇరువురు తండ్రులను చూడడం, వారితో పాటు తినడం, తాగడం, నడవడం, మాట్లాడడం, వినడం, ప్రతి చరిత్రను అనుభవం చెయ్యడం, విచిత్రుడిని చిత్రంలో చూడడం ఈ శ్రేష్ఠ భాగ్యము బ్రాహ్మణ జీవితానికే ఉంది.

బ్రాహ్మణులే - మేము భగవంతుని తండ్రి రూపంలో చూశాము, తల్లి, స్నేహితుడు, బంధువు, ప్రియుని స్వరూపంలో చూశాము అని అంటారు. ఋషులు, మునులు తపస్సు చేయువారు. విద్వాంసులు, ఆచార్యులు, శాస్త్రులు(శాస్త్రాలు చదివినవారు) కేవలం మహిమ పాడుతూనే ఉండిపోయారు. దర్శనం చేసుకోవాలనే అభిలాషలోనే ఉండిపోయారు. ఎప్పుడు వస్తారు? ఎప్పుడు కలుస్తారు..... అని ఎదురుచూస్తూ జన్మ-జన్మల చక్రంలో తిరుగుతూనే ఉండిపోయారు. కానీ బ్రాహ్మణ ఆత్మలు నశాతో, నిశ్చయంతో, సంతోషంగా, హృదయపూర్వకంగా మా తండ్రి ఇప్పుడు లభించారు అని చెప్తారు. వారు తపించేవారు, మీరు మిలనం చేసేవారు. బ్రాహ్మణ జీవితం అనగా సర్వ అవినాశి, తరగని, స్థిరమైన, అచంచల, సర్వ ప్రాప్తి స్వరూప జీవితము. బ్రాహ్మణ జీవితము ఈ కల్పవృక్షం పునాది అయిన వేర్లు. బ్రాహ్మణ జీవితము ఆధారము పై వృక్షము వృద్ధి ప్రాప్తి చేసుకుంటుంది. బ్రాహ్మణ జీవితం యొక్క వేర్ల నుండి వెరైటీ ఆత్మలందరికి బీజం ద్వారా ముక్తి, జీవన్ముక్తుల ప్రాప్తి అనే నీరు లభిస్తుంది. బ్రాహ్మణ జీవితము యొక్క ఆధారముతో ఈ కొమ్మలు, రెమ్మలు విస్తారాన్ని పొందుతాయి. కావున బ్రాహ్మణ ఆత్మలు మొత్తం వెరైటీ వంశావళి అందరికి పూర్వజులు. బ్రాహ్మణ ఆత్మలు విశ్వంలో సర్వ శ్రేష్ఠమైన కార్యానికి, నిర్మాణానికి ముహూర్తము పెట్టేవారు. బ్రాహ్మణ ఆత్మలే అశ్వమేధ రాజస్వ యజ్ఞము, జ్ఞాన యజ్ఞాన్ని రచించే శ్రేష్ఠమైన ఆత్మలు. బ్రాహ్మణ ఆత్మలు ప్రతి ఆత్మ యొక్క 84 జన్మల జాతకం తెలిసినవారు. ప్రతి ఆత్మ యొక్క శ్రేష్ఠ భాగ్యరేఖను విధాత ద్వారా శ్రేష్ఠంగా తయారు చేసేవారు. బ్రాహ్మణ ఆత్మలు ముక్తి-జీవన్ముక్తుల మహాన్‌ యాత్ర చేయించేందుకు నిమిత్తమైనవారు. బ్రాహ్మణ ఆత్మలు సర్వాత్మలకు సామూహికంగా తండ్రితో నిశ్చితార్థము చేయించేవారు. పరమాత్మ చేతిలో చెయ్యి వేయించే కంకణం కట్టించేవారు. బ్రాహ్మణ ఆత్మలు, జన్మ-జన్మల కొరకు సదా పవిత్రత యొక్క బంధనం కట్టేవారు. అమర కథ చెప్పి అమరులుగా చేసేవారు. అర్థమయ్యిందా! ఎంత మహాన్‌ ఆత్మలో, ఎంత బాధ్యత గల ఆత్మలో తెలిసిందా. మీరు పూర్వజులు. పూర్వజులు ఎలా ఉంటారో వారి వంశావళి అలా తయారవుతుంది. సాధారణమైనవారు కాదు. పరివారానికి బాధ్యులము లేక ఏదైనా సేవాస్థానానికి బాధ్యులము అని హద్దుకు మాత్రమే బాధ్యులు కారు. విశ్వంలోని ఆత్మలకు ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తులు. బేహద్‌ బాధ్యత ప్రతి బ్రాహ్మణ ఆత్మ పై ఉంది. బేహద్‌ బాధ్యత నిభాయించకుంటే తమ లౌకిక ప్రవృత్తిలో, అలౌకిక ప్రవృత్తిలో అప్పుడప్పుడు ఎగిరే కళ, అప్పుడప్పుడు ఉన్నతమయ్యే కళ, అప్పుడప్పుడు నడిచేకళ, అప్పుడప్పుడు ఆగిపోయే కళ ఈ నటనలోనే (కళాబాజీలోనే) సమయం వినియోగిస్తారు. అటువంటివారు బ్రాహ్మణులు కారు, క్షత్రియ ఆత్మలు. పురుషార్థం యొక్క అద్భుతంతో ఇది చేస్తాము, ఇలా చేస్తాము, చేస్తాము అనే బాణాలు సంధిస్తూ(ఎక్కుపెట్తూ) ఉంటారు. ఎక్కుపెట్టడానికి, బాణం గమ్యానికి చేరుకోవడానికి తేడా ఉంది. గురి పెట్తూ ఉండిపోతారు. బ్రాహ్మణ ఆత్మలు గమ్యాన్ని ఎక్కుపెట్టరు. సదా గమ్యంలోనే స్థితమై ఉంటారు. సంపూర్ణ గమ్యం సదా బుద్ధిలో ఉండనే ఉంటుంది. సెకండ్‌ సంకల్పంతో విజయులుగా అవుతారు. బాప్‌దాదా బ్రాహ్మణ పిల్లలు మరియు క్షత్రియ పిల్లలు ఇరువురి ఆటను చూస్తూ ఉంటారు. బ్రాహ్మణులది విజయం పొందే ఆట, క్షత్రియులది సదా అంబులపొది(బాణాలు పెట్టే పొడవుగా ఉండే పెట్టె) భారాన్ని మోసే ఆట. ప్రతి సమయం పురుషార్థం అనే విల్లు(బాణం) ఉండనే ఉంటుంది. ఒక సమస్యను సమాధాన పరుస్తూనే ఇంకొక సమస్య నిలబడ్తుంది. బ్రాహ్మణులు సమాధాన స్వరూపులు. క్షత్రియులు పదే పదే సమస్యను సమాధాన పరుచుకోవడంలోనే నిమగ్నమై ఉంటారు. ఉదాహరణానికి సాకార రూపంలో ఒక నవ్వు వచ్చే కథ వినిపించేవారు కదా! క్షత్రియులు ఏం చేస్తారంటే దీనికి కథ కూడా ఉంది కదా. ఎలుకను తీస్తే పిల్లి వస్తుంది, ఈ రోజు ధనానికి సంబంధించిన సమస్య, రేపు మనసుకు సంబంధించిన సమస్య, ఎల్లుండి శరీర సంబంధమైన సమస్య లేక సంబంధ-సంపర్కంలోని వారి సమస్య. ఇలా కష్టపడ్తూనే ఉంటారు. సదా ఏదో ఒక కంప్లైంట్‌(ఫిర్యాదు) తప్పకుండా ఉంటుంది. సమస్య స్వయంది కావచ్చు, ఇతరులది కావచ్చు. బాప్‌దాదా ఇలా ప్రతి సమయంలో ఏదో ఒక శ్రమ(కష్టము)లోనే నిమగ్నమై ఉండే పిల్లలను చూసి దయ, కృప చూపించే రూపంతో దయ కూడా చూపిస్తారు.

సంగమయుగ బ్రాహ్మణ జీవితం హృదయాభిరాముని హృదయం పై విశ్రాంతి తీసుకునే సమయము. హృదయం పై విశ్రాంతిగా ఉండండి. బ్రహ్మాభోజనం తినండి, జ్ఞానామృతం తాగండి. శక్తిశాలి సేవ చేయండి, విశ్రాంతిగా సంతోషంతో హృదయ సింహాసనం పై ఆనందంగా ఉండండి. ఎందుకు కలవరపడ్తారు? హే రాం అని అనరు. ఓ బాబా లేక ఓ దాదీ, దీదీ అని అంటారు కదా. ఓ బాబా, ఓ దాదీ, దీదీ కొంచెం వినండి, ఏదైనా చేయండి అని అనడమే కలవర పడడం. ఇది విశ్రాంతిగా ఉండే యుగము. ఆత్మిక సంతోషాలు జరుపుకోండి. ఆత్మిక సంతోషాలలో ఈ మనోహరమైన రోజులు గడపండి. వినాశి సంతోషాలు జరుపుకోకండి, పాడుకోండి, నాట్యం చెయ్యండి, వాడిపోకండి. పరమాత్మతో సంతోషాల సమయం ఇప్పుడు కాకుంటే ఎప్పుడు జరుపుకుంటారు? ఆత్మిక గౌరవంలో కూర్చోండి. ఎందుకు వ్యాకులపడ్తారు? తండ్రికి ఆశ్చర్యమనిపిస్తుంది. చిన్న చీమ, బుద్ధి వరకు వెళ్లిపోతుంది. బుద్ధి యోగాన్ని విచలితం చేసేస్తుంది. ఉదాహరణానికి స్థూల శరీరానికి కూడా చీమ కుడితే శరీరం కదిలి, విచలితం అవుతుంది కదా! అలాగే బుద్ధిని కూడా విచలితం చేసేస్తుంది. చీమ, ఏనుగు చెవిలోకి వెళ్లినట్లయితే ఏనుగును మూర్ఛపోయేలా చేస్తుంది కదా. అలా బ్రాహ్మణ ఆత్మ మూర్ఛపోయి క్షత్రియ ఆత్మగా అవుతుంది. ఏ ఆట ఆడ్తారో అర్థమయిందా! క్షత్రియులుగా అవ్వకండి. మళ్లీ రాజధాని కూడా త్రేతా యుగానిది లభిస్తుంది. సత్యయుగీ దేవతలు తిని తాగి ఏది మిగిలించి ఉంటారో అది క్షత్రియులకు త్రేతా యుగంలో లభిస్తుంది. కర్మల పొలంలో మొదటి పంట(పూర్ణ స్వరూపంలో) బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యేవారికి లభిస్తుంది. రెండవ పంట క్షత్రియులకు లభిస్తుంది. పొలంలోని మొదటి పంట రుచి, రెండవ పంట రుచి ఎలా ఉంటుందో తెలుసు కదా! మంచిది.

మహారాష్ట్ర మరియు యు.పి. జోన్‌వారు ఉన్నారు. మహారాష్ట్ర విశేషత ఏమంట, మహారాష్ట్ర అనే పేరు ఎలా ఉందో అలాంటి మహాన్‌ ఆత్మల పుష్పగుచ్ఛము బాప్‌దాదాకు కానుకగా ఇస్తారు. మహారాష్ట్ర రాజధాని సుందరంగా, సంపన్నంగా ఉంది. కావున మహారాష్ట్రవారు ఇలాంటి సంపన్న ప్రసిద్ధ ఆత్మలను సంపర్కంలోకి తీసుకురావాలి. అందువలన మహాన్‌ ఆత్మలను తయారుచేసి సుందరమైన పుష్పగుచ్ఛాన్ని తండ్రి ఎదురుగా తీసుకురండి అని చెప్పాను. ఇప్పుడు అంతిమ సమయంలో ఈ సంపద గలవారి పాత్ర కూడా ఉంది. సంబంధంలో కాదు, సంపర్కంలో పాత్ర ఉంది. అర్థమయిందా!

యు.పి.లో దేశ-విదేశాలలో ప్రసిద్ధమైన ప్రపంచములో అద్భుతమైన(వండర్‌ ఆఫ్‌ ది వరల్డ్‌) తాజ్‌మహల్‌ ఉంది కదా! ఎలాగైతే యు.పి.లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అద్భుత వస్తువు ఉందో అలా యు.పి వారు సేవలో అద్భుతమైన ప్రత్యక్ష ఫలం చూపించాలి. వీరు చాలా అద్భుతమైన పని చేశారని దేశ-విదేశాలలో గల బ్రాహ్మణ ప్రపంచంలో ప్రసిద్ధమవ్వాలి. ప్రపంచమే అద్భుతం చెందేలాగా అద్భుతమైన కార్యము చేయాలి. గీతాపాఠశాలలు ఉన్నాయి, సెంటర్లు ఉన్నాయి. ఇది అద్భుతం కాదు. ఇప్పటి వరకు ఎవ్వరూ చెయ్యనిది చేసి చూపించినప్పుడు అద్భుతం అని అంటారు. అర్థమయ్యిందా! విదేశీయులు కూడా ఇప్పుపడు ప్రతి సీజన్‌లో ప్రత్యక్షంగా ఉంటున్నారు. విదేశీయులు విదేశ సాధనాల ద్వారా విశ్వంలో ఇరువురు తండ్రులను ప్రత్యక్షం చేస్తారు. ప్రత్యక్షం అనగా ఈ కళ్ళతో చూడగలగడం. కావున ఇలాంటి తండ్రిని విశ్వం ముందు ప్రత్యక్షం చెయ్యాలి. విదేశీయులు ఏమి చెయ్యాలో అర్థమయిందా! మంచిది. రేపు మొత్తం ఊరేగింపు అంతా వెళ్లిపోతుంది. చివర్లో హెలికాప్టర్‌ దిగే రోజు కూడా వస్తుంది. అన్ని సాధనాలు మీ కొరకే తయారవుతూ ఉన్నాయి. సత్యయుగంలో విమానాల లైన్‌(వరసగా) ఏర్పడి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ జీపులు మరియు బస్సులు లైనుగా పెట్టబడి ఉన్నాయి. చివరకు విమానాల లైను కూడా ఏర్పడ్తుంది. అందరూ భయపడి పారిపోతారు, అన్నీ మీకు ఇచ్చేసి వెళ్లిపోతారు. వారు భయపడ్తారు, మీరు ఎగురుతారు. మీకు చనిపోతామనే భయం లేదు. ముందే చనిపోయారు. పాకిస్థాన్‌లో స్యాంపుల్‌ చూశారు కదా! అన్ని తాళంచెవులు ఇచ్చేసి వెళ్లిపోయారు. కావున అన్ని తాళంచెవులు మీకు లభించనున్నాయి. కేవలం సంభాళించండి. మంచిది.

సదా బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతలన్నిటినీ జీవితంలోకి తీసుకొచ్చేవారు, సదా హృదయాభిరాముడైన తండ్రి హృదయ సింహాసనం పై ఆత్మిక సంతోషం, ఆత్మిక విశ్రాంతి తీసుకునే వారు, స్థూల విశ్రాంతి తీసుకోకండి, సదా సంగమయుగం యొక్క శ్రేష్ఠ గౌరవంలో ఉండేవారు, కష్టం నుండి ప్రేమ జీవితంలో లవలీనమై ఉండేవారు - ఇటువంటి శ్రేష్ఠమైన బ్రాహ్మణులకు బాప్‌దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే.

వరదానము :-

'' జ్ఞాన రత్నాలను ధారణ చేసి వ్యర్ధాన్ని సమాప్తి చేసే హోలీ హంస భవ ''

హోలీ హంసలకు రెండు విశేషతలున్నాయి. ఒకటి - జ్ఞాన రత్నాలను ఏరుకోవడం, రెండవది నిర్ణయ శక్తి ద్వారా పాలు మరియు నీటిని వేరు చెయ్యడం. పాలు మరియు నీరు అనగా - సమర్థము మరియు వ్యర్థమును నిర్ణయించడం. వ్యర్థమును నీటితో సమానమని, సమర్థమును పాలతో సమానమని అంటారు. కావున వ్యర్థాన్ని సమాప్తి చెయ్యడం అనగా హోలీ హంసగా అవ్వడము. ప్రతి సమయము బుద్ధిలో జ్ఞానరత్నాలే నడుస్తూ ఉండాలి. మననం చేస్తూ (నడుస్తూ) ఉంటే రత్నాలతో సంపన్నంగా అవుతారు.

స్లోగన్‌ :-

''సదా తమ శ్రేష్ఠ స్థితిలో (పొజిషన్‌లో) స్థితులై ఉండి వ్యతిరేకతను (అపోజిషన్‌ను) సమాప్తి చేసేవారే విజయీ ఆత్మలు.''