17-07-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీరు మీ సమయాన్ని వృథా చేసుకోరాదు. లోలోపల జ్ఞానమును స్మరణ చేస్తూ ఉంటే నిద్రాజీతులుగా అవుతారు, ఆవలింతలు మొదలైనవి రావు.''
ప్రశ్న :-
పిల్లలైన మీరు తండ్రికి ఎందుకు బలిహారమయ్యారు? బలిహారమవ్వడం అనగా ఏమి?
జవాబు :-
బలిహారమవ్వడమంటే తండ్రి స్మృతిలో ఇమిడిపోవడం. స్మృతిలో ఇమిడిపోయినప్పుడు ఆత్మ రూపి బ్యాటరీ చార్జ్ అవుతుంది. ఆత్మ నిరాకార తండ్రితో బుద్ధిని జోడించినప్పుడు ఆత్మ రూపి బ్యాటరీ చార్జ్ అవుతుంది. వికర్మలు వినాశనమైపోతాయి, సంపాదన జమ అవుతుంది.
ఓంశాంతి.
ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఇక్కడ మీరిప్పుడు శరీరముతో పాటు కూర్చుని ఉన్నారు. మృత్యు లోకములో ఇది మీ చివరి జన్మ అని మీకు తెలుసు. తర్వాత ఏమవుతుంది? మళ్లీ తండ్రితో కలిసి శాంతిధామములో ఉంటారు. అక్కడ ఈ శరీరము ఉండదు. మళ్లీ స్వర్గములోకి నెంబరువారు పురుషార్థనుసారముగా వస్తారు. అందరూ ఒకేసారి రారు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతూ ఉంది. తండ్రి ఎలాగైతే శాంతికి, సుఖానికి సాగరులో, అలాగే పిల్లలను కూడా శాంతికి, సుఖానికి సాగరులుగా తయారు చేస్తున్నారు. మళ్లీ శాంతిధామములోకి వెళ్లి విరాజమానమవ్వాలి. అందుకు తండ్రిని, ఇంటిని, సుఖధామాన్ని స్మృతి చేయాలి. మీరిక్కడ ఎంతెంత ఈ స్థితిలో కూర్చుంటారో అంత మీ జన్మ-జన్మల పాపాలు భస్మమవుతాయి. దీనిని యోగాగ్ని అని అంటారు. సన్యాసులు సర్వశక్తివంతునితో యోగము చేయరు. వారు నివాస స్థానమైన బ్రహ్మ తత్వముతో యోగము జోడిస్తారు. వారు తత్వయోగులు. బ్రహ్మము లేక తత్వముతో యోగము చేసేవారు. ఇక్కడ జీవాత్మల ఆట నడుస్తుంది. అక్కడ స్వీట్ హోమ్(మధురమైన ఇంటి)లో కేవలం ఆత్మలే ఉంటాయి. ఆ స్వీట్ హోమ్కు వెళ్లేందుకు ప్రపంచమంతా పురుషార్థము చేస్తున్నారు. సన్యాసులు కూడా మేము బ్రహ్మములో లీనమవ్వాలని అంటారు. బ్రహ్మములోకి వెళ్లి నివసిస్తామని అనరు. ఇది మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. భక్తిమార్గములో ఏదో ఒకటి వింటూనే ఉంటారు. తండ్రి ఇక్కడకు వచ్చి కేవలం రెండు విషయాలనే అర్థం చేయిస్తారు. మంత్రము జపిస్తారు కదా, కొందరు గురువును స్మృతి చేస్తారు. కొందరు ఇంకెవరినో స్మృతి చేస్తారు. విద్యార్థులు టీచరును స్మృతి చేస్తారు. పిల్లలైన మీకిప్పుడు తండ్రి మరియు ఇల్లు మాత్రమే గర్తుంటాయి. తండ్రి ద్వారా మీరు శాంతిధామము మరియు సుఖధామాల వారసత్వాన్ని తీసుకుంటారు. అదే మీ మనసులో గుర్తుంటుంది. నోటితో పలికే అవసరము లేదు. శాంతిధామము తర్వాత సుఖధామము వస్తుందని బుద్ధి ద్వారా మీరు తెలుసుకున్నారు. మనము మొదట ముక్తికి తర్వాత జీవన్ముక్తిలోకి వెళ్తాము. ముక్తి-జీవన్ముక్తుల దాత తండ్రి ఒక్కరే. సమయాన్ని వృథా చేయకండి అని తండ్రి పదే పదే చెప్తున్నారు. జన్మ-జన్మల పాపభారము తల పై ఉంది. ఈ జన్మలోని పాపాలు మొదలైనవి గుర్తుంటాయి. సత్యయుగములో ఈ విషయాలేవీ ఉండవు. జన్మ-జన్మల పాపభారముందని పిల్లలు తెలుసుకున్నారు. మొదటిది జన్మ-జన్మాంతరాల నుండి చేస్తూ వచ్చిన కామ వికారపు వికర్మలు. అంతేకాక తండ్రిని కూడా చాలా నిందించారు. సర్వులకు సద్గతినిచ్చే తండ్రిని ఎంతగానో నిందించారు. ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు వీలైనంత ఎక్కువగా స్మృతి చేసే పురుషార్థము చేయాలి. వాస్తవానికి వాహ్! అని సద్గురువునే మహిమ చేస్తారు. గురువును కాదు, వాహ్(ఓహో) గురు అని అనడంలో ఏ అర్థమూ లేదు. వాహ్ సద్గురువు అని అనాలి. ముక్తి-జీవన్ముక్తిని ఇచ్చేది వారే కదా. ఆ గురువులైతే చాలా మంది ఉన్నారు. సద్గురువు వీరొక్కరే. మీరందరూ చాలా మంది గురువులను ఆశ్రయించారు. ప్రతి జన్మలో ఇరువురు, నలుగురిని గురువులుగా చేసుకుంటారు. గురువులుగా చేసుకొని మళ్లీ వేరు వేరు స్థానాలకు వెళ్తారు. బహుశా ఇంతకంటే మంచి దారి లభిస్తుందేమో అని అనేక గురువుల వద్ద ప్రయత్నము చేస్తూ ఉంటారు. కానీ ఏమీ లభించదు. ఇప్పుడిక్కడ ఉండేది లేదని, అందరూ శాంతిధామానికి వెళ్లాలని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి మీ ఆహ్వానము పై వచ్చారు. మీరు రండి, మమ్ములను పతితుల నుండి పావనంగా చేయండి అని పిలిచారని తండ్రి మీకు గుర్తు చేయిస్తున్నారు. శాంతిధామము పావనంగా ఉంటుంది. సుఖధామము కూడా పావనంగా ఉంటుంది. మమ్ములను ఇంటికి తీసుకెళ్లమని పిలుస్తారు. అందరికీ ఇల్లు గుర్తుంది. మన నివాస స్థానము పరంధామమని ఆత్మ వెంటనే చెప్తుంది. పరమపిత పరమాత్మ కూడా పరంధామములో ఉంటారు. మనము కూడా పరంధామములో ఉంటాము.
ఇప్పుడు మీ పై బృహస్పతి దశ ఉందని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది అనంతమైన విషయము. బేహద్ దశ అందరి పైన ఉంది. చక్రము తిరుగుతూ ఉంటుంది. మనమే సుఖము నుండి దు:ఖములోకి మళ్లీ దు:ఖము నుండి సుఖములోకి వస్తాము. శాంతిధామము, సుఖధామము తర్వాత ఇది దు:ఖధామము. ఇది కూడా పిల్లలైన మీరిప్పుడు అర్థము చేసుకున్నారు. మనుష్యుల బుద్ధిలో ఈ విషయాలు కూర్చోవు. తండ్రి ఇప్పుడు జీవించి ఉండే మరణించడం నేర్పిస్తున్నారు. దీపపు పురుగులు దీపము పై బలి అవుతాయి. కొన్ని ప్రేయసులై కాలిపోతాయి, బలిహారమవుతాయి. కొన్ని చుట్టూ తిరిగి వెళ్లిపోతాయి. ఇతడు(బ్రహ్మ) కూడా బ్యాటరీయే కదా. అందరి బుద్ధియోగము వారొక్కరితోనే ఉంది. నిరాకార తండ్రితో ఈ బ్యాటరీ జోడింపబడి ఉంది. ఈ ఆత్మకైతే వారు చాలా సమీపంగా ఉన్నారు. కావున ఇతనికి చాలా సులభమవుతుంది. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీ బ్యాటరీ చార్జ్ (నిండుట) అవుతూ ఉంటుంది. పిల్లలైన మీకు కొద్దిగా కష్టమవుతుంది. ఇతడికి(బ్రహ్మాబాబాకు) సులభంగా ఉంటుంది. అయినా మీరెంత పురుషార్థము చేయవలసి ఉంటుందో అంత ఇతడు కూడా చేయవలసి ఉంటుంది. ఇతడు ఎంత దగ్గరగా ఉన్నాడో అంత ఇతని పై భారము కూడా ఉంది. ఎవరి తల పై బరువు, బాధ్యత ఉంటుందో,...............(అతనికి నిదుర ఎలా పడ్తుంది) అని గాయనము కూడా ఉంది కదా. ఇతడి పై కూడా చాలా బరువు-బాధ్యతలున్నాయి కదా. తండ్రి అయితే సంపూర్ణంగానే ఉన్నారు. ఇతడు(బ్రహ్మాబాబా) సంపూర్ణంగా అవ్వాలి. వీరు అందరి బాగోగులను చాలా చూసుకోవలసి ఉంటుంది. ఇరువురు(శివబాబా, బ్రహ్మబాబా) కలిసి ఉన్నా చింత అయితే ఉంటుంది కదా. దు:ఖము కలిగించే దెబ్బలు పిల్లల పైన ఎంతగా పడుతుంటాయి. కర్మాతీత స్థితి అయితే చివర్లో వస్తుంది. అంతవరకు ఆలోచన కలుగుతూ ఉంటుంది. పిల్లల వద్ద నుండి జాబు రాకపోతే, ఆరోగ్యము బాగలేదేమో అని ఆలోచన వస్తుంది. సర్వీసు సమాచారము వస్తే వారిని తప్పకుండా తండ్రి స్మృతి చేస్తారు. బాబా ఈ తనువు ద్వారా సర్వీసు చేస్తారు. అప్పుడప్పుడు మురళి తక్కువగా చెప్త్తారు. 2-3 రోజులు మురళి రాకపోయినా మీ వద్ద జ్ఞానము పాయింట్లు ఉంటాయి. మీరు కూడా మీ డైరీ చూసుకోవాలి. బ్యాడ్జి పై కూడా మీరు బాగా అర్థం చేయించవచ్చు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మమున్నప్పుడు ఇతర ఏ ధర్మమూ ఉండదు. వృక్షము చిత్రము కూడా మీ వద్ద తప్పకుండా ఉండాలి. వెరైటీ ధర్మాల రహస్యము గురించి అర్థము చేయించాల్సి ఉంటుంది. మొట్ట మొదట ఒకే అద్వైత ధర్మముండేది. అప్పుడు విశ్వములో శాంతి, సుఖము, పవిత్రత ఉండేవి. తండ్రి ద్వారానే వారసత్వము లభిస్తుంది. ఎందుకంటే తండ్రి శాంతిసాగరులు, సుఖసాగరులు కదా. ఇంతకుముందు మీకు కూడా ఏమీ తెలియదు. ఇప్పుడు ఎలాగైతే తండ్రి బుద్ధిలో ఇవన్నీ ఉన్నాయో అలాగే మీరు కూడా అవుతారు. మీరు కూడా సుఖ, శాంతి సాగరులుగా అవుతారు. ఏ విషయాల లోపముందని తమ లెక్కాచారమును చూసుకోవాలి. ఎవరినీ అసంతుష్టపరచకుండా నడచుకునేంతటి ప్రేమసాగరునిలా ఉన్నానా? నా నడవడిక ఎవరైనా అసంతుష్టంగా అయ్యేలా ఉందా? అని మీ పై మీరు గమనముంచుకోవాలి. బాబా ఆశీర్వాదాలిస్తే అలా తయారైపోతాములే అని అనుకోరాదు. నేను డ్రామా అనుసారము నా సమయానికి వచ్చానని తండ్రి చెప్తున్నారు. ఈ కార్యక్రమము నాకు కల్ప-కల్పము ఉంది. ఈ జ్ఞానాన్ని ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. సత్యమైన తండ్రి, సత్యమైన టీచరు, సద్గురువు ఒక్కరే. ఈ నిశ్చయము మీకు దృఢంగా ఉంటే మీకు విజయము లభిస్తుంది. ఇప్పుడున్న అనేక ధర్మాలన్నీ వినాశనము అవ్వాల్సిందే. సత్యయుగీ సూర్యవంశమున్నప్పుడు ఇతర ఏ వంశాలూ ఉండవు. మళ్లీ అదే విధంగా జరుగుతుంది. రోజంతా ఇలా మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. జ్ఞాన పాయింట్లు లోలోపల మెదులుతూ ఉండాలి. సంతోషంగా ఉండాలి. తండ్రిలో జ్ఞానముంది. అది మీకిప్పుడు లభిస్తూ ఉంది. దానిని ధారణ చేయాలి. సమయము వృథా చేయరాదు. రాత్రి కూడా సమయము లభిస్తుంది. ఆత్మ అవయవాలతో పని చేస్తూ చేస్తూ అలసిపోతే నిద్రపోవడం మీరు గమనిస్తారు. భక్తిమార్గములోని మీ అలసటనంతా తండ్రి దూరము చేసి అలసట లేకుండా(అథక్గా) చేస్తారు. ఆత్మ అలసిపోతే రాత్రి శరీరము నుండి భిన్నమైపోతుంది. దీనీనే నిద్ర అని అంటారు. నిద్రించేదెవరు? ఆత్మతో పాటు కర్మేంద్రియాలు కూడా నిదురిస్తాయి. కావున రాత్రి నిదురించే సమమంలో కూడా తండ్రిని స్మృతి చేస్తూ ఈ విధంగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిదురించాలి. చివర్లో రాత్రి, పగలు మీరు నిద్రను జయించేవారుగా అవ్వవచ్చు. తర్వాత స్మృతిలోనే ఉంటారు. చాలా సంతోషంగా ఉంటారు. 84 జన్మల చక్రము తిప్పుతూ ఉంటారు. ఆవలింతలు లేక తూగు రాదు. '' హే నిద్రను జయించే పిల్లలూ! సంపాదన చేయునప్పుడు ఎప్పుడూ నిదురించరాదు. జ్ఞానములో మస్త్ అయిపోయినప్పుడు మీకు అలాంటి స్థితి ఉంటుంది. ఇక్కడ మీరు కొద్ది సమయమే కూర్చుంటున్నారు. ఎప్పుడూ ఆవలింతలు, కునికిపాట్లు రాకూడదు. ఇతర వైపులకు గమనము వెళ్తే ఆవులింతలు వస్తాయి.
పిల్లలైన మీకు ఇతరులను కూడా మన సమానంగా తయారు చేయాలని గమనముండాలి. ప్రజలైతే కావాలి కదా. లేకుంటే రాజులుగా ఎలా అవుతారు? ధనమునిస్తూ ఉంటే ధనము తరగదు,............ అని ఇతరులకు అర్థం చేయిస్తారు. దానము చేస్తూ ఉంటే ఎప్పటికీ తరిగిపోదు. లేకపోతే జమ అవ్వదు. మనుష్యులు చాలా పిసినార్లుగా, ఉదాసీనంగా కూడా ఉంటారు. ధనము గురించి చాలా కొట్లాడుకుంటూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు - ఇక్కడ నేను మీకు అవినాశి ధనమునిస్తాను. దానిని మీరు మళ్లీ ఇతరులకు ఇస్తూ ఉండండి. ఇందులో పిసినారిగా అవ్వరాదు. దానము చేయకపోతే, అది ఉన్నా లేనట్లే. ఈ సంపాదన అలాంటిది. ఇందులో పోట్లాటలు మొదలైనవాటి మాటే లేదు. దీనినే గుప్తమని అంటారు. మీరు గుప్త సైనికులు. 5 వికారాలతో మీరు యుద్ధము చేస్తారు. మిమ్ములను గుప్త సైనికులని అంటారు. కాలి నడక సైన్యము చాలా ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే ప్రజలు చాలామంది ఉన్నారు. కెప్టన్లు(ముఖ్యాధికారులు) మేజర్లు మొదలైనవారందరూ ఉన్నారు. మీరు సైనికులు, మీలో కూడా నెంబరువారుగా ఉన్నారు. ఎవరు కమాండరో, ఎవరు మేజరో బాబా అర్థము చేసుకుంటారు. మహారథులు, అశ్వారూఢులు ఉన్నారు కదా. మూడు విధాలుగా అర్థం చేయించేవారు ఉన్నారని బాబాకు తెలుసు. మీరు అవినాశి జ్ఞాన రత్నాల వ్యాపారము చేస్తున్నారు. గురువులు కూడా వ్యాపారము నేర్పిస్తారు. గురువు వెళ్లిపోతే వారి తర్వాత శిష్యులు నడిపిస్త్తారు కదా. అది స్థూలమైనది. ఇది సూక్ష్మమైనది. అనేక విధాలైన ధర్మాలున్నాయి. ప్రతి ఒక్కరికీ వారి వారి మతముంది. వారు ఏమి నేర్పిస్తున్నారో ఏమేమి చెప్తున్నారో ఆ విషయాలు మీరు కూడా వెళ్లి వినవచ్చు. తండ్రి మీకు 84 జన్మల కథను అర్థం చేయిస్తారు. పిల్లలైన మీకే తండ్రి వచ్చి వారసత్వమునిస్తారు. ఇది డ్రామాలో నిర్ణయించబడింది. కలియుగము చివరి వరకు ఆత్మలు వస్తూనే ఉంటారు. వృద్ధి చెందుతూ ఉంటారు. తండ్రి ఇక్కడున్నంత వరకు సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. తర్వాత ఇంతమంది ఎక్కడుంటారు? ఎక్కడ భోంచేస్తారు? లెక్కాచారమంతా ఉంచవలసి వస్తుంది కదా. అక్కడ (సత్యయుగములో) ఇంతమంది మనుష్యులు ఉండరు. తినేవారు తక్కువ. అందరికి వారి వారి పంట ఉంటుంది. ధాన్యము ఉంచుకొని ఏం చేస్తారు. ఇక్కడ చేస్తున్న విధంగా అక్కడ వర్షము కొరకు యజ్ఞాలు మొదలైనవి చేయాల్సిన పని ఉండదు. ఇప్పుడు తండ్రి యజ్ఞమును రచించారు. మొత్తం పాత సృష్టి అంతా యజ్ఞములో స్వాహా అవ్వాలి. ఇది బేహద్ యజ్ఞము. వారు హద్దు యజ్ఞమును వర్షము కొరకు రచిస్తారు. వర్షము పడితే యజ్ఞము సఫలమయ్యిందని సంతోషిస్తారు. వర్షము కురవకపోతే ధాన్యముండదు. కరువులు వస్తాయి. భలే యజ్ఞాలు మొదలైనవి రచిస్తారు. యజ్ఞము చేసినా వర్షము కురవకపోతే ఏమి చేయగలరు? అనేక ఆపదలు రానున్నాయి. రోకటిలావంత వర్షధారలు, భూకంపాలు మొదలైనవన్నీ జరగనున్నాయి. డ్రామా చక్రాన్ని అయితే పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఈ చక్రము కూడా చాలా పెద్దదిగా ఉండాలి. మంచి-మంచి ముఖ్య స్థానాలలో ఈ చిత్రాలను ప్రదర్శిస్తే గొప్ప-గొప్పవారు చదువుతారు. ఇప్పుడు పురుషోత్తమ సంగమ యుగమని అందరూ తప్పకుండా అర్థం చేసుకుంటారు. కలియుగములో చాలా మంది మనుష్యులున్నారు. సత్యయుగములో మనుష్యులు కొద్దిమంది మాత్రమే ఉంటారు. మిగలిన వారంతా తప్పకుండా సమాప్తమైపోతారు. శివజయంతి అంటేనే స్వర్గజయంతి. లక్ష్మీనారాయణుల జయంతి. చాలా సహజమైన విషయము. శివజయంతిని జరుపుకుంటారు. వారు అనంతమైన తండ్రి. వారే స్వర్గ స్థాపన చేశారు. మీరు స్వర్గవాసులుగా ఉండేవారు. ఇది నిన్నటి విషయమే. ఇది చాలా సహజమైన విషయము. పిల్లలు బాగా అర్థము చేసుకుని, ఇతరులకు అర్థము చేయించాలి. సంతోషంగా కూడా ఉండాలి. ఇప్పుడు మనము సదా కాలము వరకు జబ్బుల నుండి దూరమై 100% (శాతము) ఆరోగ్యంగా, సంపన్నంగా అవుతాము. ఇక కొద్ది సమయము మాత్రమే ఉంది. ఎన్ని దు:ఖాలున్నా, మృత్యువు మొదలైనవి జరిగినా మీరు ఆ సమయములో చాలా సంతోషంగా ఉంటారు. మృత్యువు రావలసిందేనని మీకు తెలుసు. ఇది కల్ప-కల్పము జరిగే ఆట. ఏ చింతా ఉండదు. ఎవరైతే పక్కాగా(దృఢంగా) ఉంటారో వారు ఎప్పటికీ అయ్యో! అయ్యో! అని అనరు. ఆపరేషన్ జరిగేటప్పుడు చూసినా కొందరికి కళ్ళు, తల తిరుగుతాయి. ఇప్పుడైతే ఎంతో పెద్ద మృత్యువు జరుగుతుంది. ఇదంతా జరగాల్సిందేనని పిల్లలైన మీకు తెలుసు. ఎలుకకు ప్రాణ సంకటము, పిల్లికి చెలగాటము,.................... అని సామెత కూడా ఉంది. ఈ పాత ప్రపంచములో చాలా దు:ఖమును అనుభవించారు. ఇప్పుడు కొత్త ప్రపంచములోకి వెళ్లాలి. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి నుండి అవినాశి జ్ఞాన ధనమును తీసుకుని ఇతరులకు దానము చేయాలి. జ్ఞాన దానము చేయుటలో పిసినారిగా అవ్వరాదు. జ్ఞాన బిందువులు(పాయింట్సు) లోలోపల మెదులుతూ ఉండాలి. రాజులుగా అయ్యేందుకు ప్రజలను తప్పకుండా తయారు చేసుకోవాలి.
2. తమ లెక్కాచారాన్ని చూసుకోవాలి. 1. నేను తండ్రి సమానంగా ప్రేమసాగరుడిగా అయ్యానా? 2. ఎప్పుడూ ఎవ్వరినీ అసంతుష్టపరచడం లేదు కదా? 3. నా నడవడిక పై పూర్తి ధ్యాస ఉందా?
వరదానము :-
'' ప్రతి సమయంలో మీ దృష్టి, వృత్తి, కృతి ద్వారా సేవ చేసే పక్కా సేవాధారీ భవ ''
సేవాధారులనగా ప్రతి సమయంలో శ్రేష్ఠమైన దృష్టి ద్వారా, వృత్తి ద్వారా, కృతి ద్వారా సేవ చేసేవారు. ఎవరైనా శ్రేష్ఠమైన దృష్టితో చూస్తే ఆ దృష్టి కూడా సేవ చేస్తుంది. వృత్తి ద్వారా వాయుమండలం తయారవుతుంది. ఏ కార్యమునైనా స్మృతిలో ఉండి చేస్తే వాయుమండలం శుద్ధంగా అవుతుంది. బ్రాహ్మణ జీవిత శ్వాసయే 'సేవ'. ఎలాగైతే శ్వాస ఆడకుంటే మూర్ఛితులుగా అవుతారో అలా బ్రాహ్మణాత్మలు సేవలో బిజీగా లేకుంటే మూర్ఛితులుగా అవుతారు. అందువలన ఎంత స్నేహీలో అంత సహయోగులుగా, అంత సేవాధారులుగా కూడా అవ్వండి.
స్లోగన్ :-
'' సేవను ఆటగా భావిస్తే అలసిపోరు, సదా లైట్గా, తేలికగా ఉంటారు. ''