16-04-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - బాబా ఇస్తున్న శిక్షణలను అమలుపరచండి, మీరు ప్రతిజ్ఞ చేసి ఇచ్చిన మాటను దాటరాదు, ఆజ్ఞను ఉల్లంఘించరాదు.''

ప్రశ్న :-

మీ చదువులోని సారమేది? మీరు ఏ అభ్యాసమును తప్పకుండా చేయాలి ?

జవాబు :-

వానప్రస్థములోనికి వెళ్లేందుకే మీ చదువు. శబ్ధానికి అతీతంగా వెళ్లడమే ఈ చదువు యొక్క సారము, స్వయం తండ్రియే అందరినీ వాపస్‌ తీసుకెళ్తారు. ఇంటికి వెళ్లేందుకు ముందు పిల్లలైన మీరు సతోప్రధానంగా అవ్వాలి. దీని కొరకు ఏకాంతములోకి వెళ్ళి ఆత్మాభిమానులుగా ఉండే అభ్యాసము చేయండి. అశరీరులుగా అయ్యే అభ్యాసమే ఆత్మను సతోప్రధానంగా చేస్తుంది.

ఓంశాంతి.

స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినందున మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. అంతేకాక మళ్లీ ఇటువంటి విశ్వానికి అధికారులుగా అవుతారు. కల్ప-కల్పము మీరు ఇదే విధంగా తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. మళ్లీ 84 జన్మలు తీసుకొని తమోప్రధానంగా అవుతారు. మళ్లీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండని బాబా శిక్షణను ఇస్తారు. భక్తిమార్గములో కూడా స్మృతి చేసేవారు. అయితే ఆ సమయంలో తండ్రిని ప్రాక్టికల్‌గా స్మృతి చేయాలి. ఆత్మ కూడా నక్షత్రము వలె ఉంది, తండ్రి కూడా నక్షత్రము వలె ఉన్నారని కూడా అర్థం చేయించాలి. తండ్రి పునర్జన్మను తీసుకోరు. మీరు పునర్జన్మలు తీసుకుంటారు. అందువలన మీరు తమోప్రధానంగా అవ్వవలసి వస్తుంది. మళ్లీ సతోప్రధానంగా అయ్యేందుకు శ్రమ చేయవలసి వస్తుంది. క్షణ-క్షణము మాయ మరిపింపజేస్తుంది. ఇప్పుడు తప్పులు చేయని(అభూల్‌) వారిగా తయారవ్వాలి. ఏ తప్పులూ చేయరాదు. ఒకవేళ తప్పులు చేస్తూనే ఉంటే మీరింకా తమోప్రధానంగా అవుతారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని ఆదేశము లభిస్తుంది. ఆత్మ బ్యాటరీని ఛార్జ్‌ చేసుకుంటే మీరు సతోప్రధాన విశ్వానికి అధికారులుగా అవుతారు. టీచరేమో అందరినీ చదివిస్తారు. విద్యార్థులు మాత్రము నంబరువారుగా ఉత్తీర్ణులవుతారు. తర్వాత నంబరువారుగా సంపాదిస్తారు. మీరు కూడా నంబరువారుగా పాస్‌ అవుతారు, నంబరువారుగా పదవిని పొందుతారు. విశ్వమంతటికి యజమానులెక్కడ, ప్రజలు, దాస-దాసీలు ఎక్కడ? ఏ విద్యార్థులైతే, మంచి సుపుత్రులుగా, ఆజ్ఞాకారులుగా, నమ్మకస్థులుగా, విశ్వాసపాత్రులుగా ఉంటారో, వారు తప్పకుండా టీచరు మతము(సలహా)ను అనుసరిస్తారు. రిజిస్టరు ఎంత బాగుంటుందో అంత ఎక్కువ మార్కులు లభిస్తాయి. అందువలన తండ్రి కూడా పిల్లలకు మాటిమాటికి తెలియజేస్తారు - ''అజాగ్రత్తగా ఉండకండి, తప్పులు చేయకండి, కల్పక్రితము కూడా ఫెయిల్‌ అయ్యామని భావించకండి, సేవ చేయకుంటే మేము తప్పకుండా ఫెయిల్‌ అవుతామని ఎంతో మంది హృదయాలకు తోస్తూ ఉంటుంది''. తండ్రి ఏమో గమనమిప్పిస్తూనే ఉంటారు - మీరు సత్యయుగీ సతోప్రధానుల నుండి కలియుగీ తమోప్రధానులుగా అయ్యారు. మళ్లీ ప్రపంచ చరిత్ర-భూగోళము రిపీట్‌(పునరావృతము) అవుతుంది. సతోప్రధానంగా అయ్యేందుకు తండ్రి చాలా సులభమైన మార్గము తెలుపుతున్నారు - నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. మీరు ఉన్నతి చెందుతూ చెందుతూ సతోప్రధానంగా అవుతారు. చాలా నెమ్మది నెమ్మదిగా ఉన్నతి అవుతారు కావున మర్చిపోకండి, కానీ మాయ మరపింపజేస్తుంది, అవజ్ఞాకారులుగా చేస్తుంది. తండ్రి ఏ ఆదేశమునిస్తారో దానిని అంగీకరిస్తారు, ప్రతిజ్ఞ కూడా చేస్తారు. అయితే దాని అనుసారము నడుచుకోరు. అందువలన తండ్రి - ఆజ్ఞను ఉల్లంఘించి మాట(వచనము) తప్పుతారని అంటారు. తండ్రితో ప్రతిజ్ఞ చేసి దానిని అమలులో పెట్టాలి. అనంతమైన తండ్రి ఎటువంటి శిక్షణలనిస్తారో అటువంటి శిక్షణలను ఇతరులెవ్వరూ ఇవ్వరు. పరివర్తన కూడా తప్పకుండా అవ్వాలి. చిత్రాలు ఎంతో బాగున్నాయి. ఇప్పుడు మీరు బ్రహ్మ వంశస్థులుగా అయ్యారు, తర్వాత మళ్లీ విష్ణు వంశస్థులుగా అవుతారు. ఇది నూతన ఈశ్వరీయ భాష. ఈ భాషను కూడా అర్థము చేసుకోవలసి ఉంటుంది. ఈ ఆత్మిక జ్ఞానాన్ని తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. ఈ కాలములో ఆత్మిక(ఆధ్యాత్మిక) సంస్థ అని పేరు పెట్టుకున్న కొన్ని సంస్థలు వెలువడ్డాయి. కానీ వాస్తవానికి మీది తప్ప ఏ ఇతర ఆత్మిక సంస్థ ఉండేందుకు వీలు లేదు. ఇమిటేషన్‌(అనుకరణ) చాలా ఉంటుంది. ఇది క్రొత్త విషయము, మీరు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఇతరులెవ్వరూ ఈ విషయాలు అర్థము చేసుకోలేరు. ఇప్పుడు పూర్తి వృక్షమంతా నిలబడి ఉంది కానీ కాండము మాత్రము లేదు మళ్లీ కాండము వెలువడ్తుంది. మిగిలిన కొమ్మ-రెమ్మలేవీ ఉండవు, అవన్నీ సమాప్తమైపోతాయి. అనంతమైన తండ్రి మాత్రమే అనంతమైన జ్ఞానమును ఇస్తారు. ఇప్పుడు పూర్తి ప్రపంచమంతటా రావణ రాజ్యముంది. ఇది లంక, ఆ లంక సముద్రము అవతల ఉంది. అనంతమైన ప్రపంచము కూడా సముద్రము పై ఉంది. ఈ ప్రపంచానికి నలువైపులా నీరు ఉంది. అవన్నీ హద్దులోని విషయాలు, తండ్రి అనంతమైన విషయాలను అర్థం చేయిస్తున్నారు, ఈ విషయాలను ఒక్క తండ్రి మాత్రమే అర్థం చేయించగలరు. ఇది చదువు. ఎప్పటివరకు ఉద్యోగము లభిస్తుందో, చదువుకు ఫలితము వెలువడ్తుందో, అంతవరకు చదువులో తత్పరులై ఉంటారు. అందులోనే బుద్ధి నడుస్తూ ఉంటుంది. చదువు పై అటెన్షన్‌ ఇవ్వడం విద్యార్థుల కర్తవ్యము. కూర్చుంటూ, లేస్తూ, నడుస్తూ, తిరుగుతూ స్మృతి చేయాలి. విద్యార్థి బుద్ధిలో చదువు ఉంటుంది. పరీక్ష రోజులలో ఫెయిల్‌ అవ్వరాదని చాలా కష్టపడ్తారు. ముఖ్యంగా ఉదయము పూట తోటలకు వెళ్ళి కూర్చుని చదువుతారు. ఎందుకంటే ఇంటిలోని శబ్ధాల ప్రకంపనాలు చెడుగా ఉంటాయి.

తండ్రి అర్థం చేయించారు - ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసము చేస్తే మర్చిపోరు. ఏకాంత స్థానాలు చాలా ఉన్నాయి. ప్రారంభములో క్లాసు విన్న తర్వాత మీరంతా పర్వతాల పైకి వెళ్ళేవారు. ఇప్పుడు రోజురోజుకు జ్ఞానము లోతుగా అవుతూ ఉంది. విద్యార్థులకు వారి లక్ష్యము ఉద్ధేశ్యము ఏమిటో జ్ఞాపకముంటుంది. ఇది వానప్రస్థ అవస్థలోకి వెళ్ళే చదువు. బాబా తప్ప ఈ చదువును ఎవ్వరూ చదివించలేరు. సాధు - సత్పురుషులు మొదలైన వారందరూ భక్తిని నేర్పిస్తారు. శబ్ధానికి అతీతంగా వెళ్ళే మార్గాన్ని ఒక్క తండ్రి మాత్రమే తెలుపుతారు. వారు మాత్రమే అందరినీ వాపస్‌ తీసుకెళ్తారు. ఇప్పుడు మీది అనంతమైన వానప్రస్థ అవస్థ, దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ! మీరందరూ ఇప్పుడు వానప్రస్థులు, మొత్తము ప్రపంచానికి ఇది వానప్రస్థ స్థితి. ఎవరు చదివినా, చదవకపోయినా, అందరూ వాపస్‌ వెళ్ళవలసిందే. మూలవతనానికి వెళ్ళే ఆత్మలన్నీ వాటి వాటి విభాగాలలోకి వెళ్ళిపోతాయి. ఆత్మల వృక్షము కూడా అద్భుతంగా తయారు చేయబడి ఉంది. ఈ పూర్తి డ్రామా చక్రమంతా చాలా ఖచ్ఛితంగా(ఆక్యురేట్‌లూషషబతీa్‌వ) ఉంది. కొంచెము కూడా వ్యత్యాసము ఉండదు. లివర్‌ గడియారము, సిలెండర్‌ గడియారాలు ఉంటాయి కదా. లివర్‌ గడియారము చాలా ఖచ్ఛితంగా నడుస్తుంది. అలాగే ఇందులో కూడా కొందరి బుద్ధియోగము లీవర్‌ వలె ఖచ్ఛితంగా ఉంటుంది. కొందరిది సిలెండర్‌ వలె ఉంటుంది అంటే కొంతమంది బుద్ధియోగము అసలే జోడింపబడదు. గడియారము అసలు నడవనే నడవదు. మీరు పూర్తిగా లివర్‌ గడియారము వలె తయారవుతే, రాజులలోకి వెళ్ళిపోతారు. సిలెండర్‌ గడియారాల వలె ఉన్నవారు ప్రజలలోకి వెళ్ళిపోతారు. లివర్‌ గడియారంగా అయ్యేందుకు పురుషార్థము చేయాలి. రాజ్యపదవిని పొందేవారు కోటికొక్కరే అని చెప్తారు, వారే విజయమాలలో కూర్చబడ్తారు, స్మరింపబడ్తారు. శ్రమ చాలా ఉందని పిల్లలకు తెలుసు. బాబా, క్షణ-క్షణము మర్చిపోతామని పిల్లలు అంటారు. పిల్లలు ఎంత పహిల్వానులుగా(శక్తివంతంగా) అవుతారో, మాయ కూడా అంత తీవ్రంగా యుద్ధము చేస్తుంది అని బాబా అర్థం చేయిస్తారు. మల్లయుద్ధము గురించి విన్నారు కదా. అందులో చాలా సంభాళన చేసుకుంటారు. పహిల్వానులను(శక్తివంతులను) పహిల్వానులే అర్థం చేసుకుంటారు. ఇక్కడ కూడా అలాగే మహావీర పిల్లలున్నారు. వీరిలో కూడా నంబరువారుగా ఉన్నారు. మంచి మంచి మహారథులను కూడా మాయ బాగా తుఫానులలోకి తెస్తుంది. బాబా చెప్తున్నారు - మాయ ఎంత హైరానా (ఆందోళన) పెట్టినా, తుఫానులు తెచ్చినా, మీరు హెచ్చరికగా ఉండాలి. ఏ విషయములోనూ ఓడిపోరాదు. మనస్సులో భలే తుఫానులు వచ్చినా, కర్మేంద్రియాలతో చేయరాదు. తుఫానులు క్రింద పడవేసేందుకే వస్తాయి, మాయతో యుద్ధము లేనట్లైతే శక్తిశాలురని ఎలా చెప్తారు? మాయావి తుఫానులను లక్ష్యపెట్టరాదు, కానీ నడుస్తూ నడుస్తూ కర్మేంద్రియాలకు వశమై వెంటనే క్రింద పడిపోతారు. కర్మేంద్రియాల ద్వారా ప్రతి రోజూ నియమ విరుద్ధమైన పనులను చేయడం వదలకుంటే చాలా చిన్న పదవిని పొందుతారు. మేము ఉత్తీర్ణము అవ్వమని ఆంతరికముగా స్వయం కూడా అర్థము చేసుకుంటారు. అందరూ వాపస్‌ వెళ్ళవలసిందే. తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేస్తే, ఆ స్మృతి కూడా వినాశనమవ్వదు. కొద్దిగా స్మృతి చేసినా, స్వర్గములోకి వచ్చేస్తారు. కొద్దిగా స్మృతి చేసినందున లేక ఎక్కువగా స్మృతి చేసినందున ఏ ఏ పదవులు లభిస్తాయో కూడా మీరు అర్థము చేసుకోగలరు. ఏది కూడా దాగి ఉండలేదు. ఎవరు ఏమేమి అవుతారనేది స్వయం కూడా తెలుసుకోగలరు. ఒకవేళ ఇప్పుడే మీ గుండె ఆగిపోయినట్లైతే ఏ పదవిని పొందగలరు? ఈ విషయాన్ని బాబాను కూడా అడగవచ్చు. పోను పోను మీరే తెలుసుకుంటారు, వినాశనము సమీపములో ఉంది. తుఫానులు, వర్షాలు, ప్రాకృతిక ఆపదలు అడిగి రావు, రావణుడు కూర్చునే ఉన్నాడు. ఇది చాలా పెద్ద పరీక్ష. ఎవరు ఉత్తీర్ణులవుతారో, వారు శ్రేష్ఠమైన పదవిని పొందుతారు. ప్రజలను సంభాళన చేయగల రాజులు తప్పకుండా బుద్ధివంతులై ఉండాలి. ఐ.సి.యస్‌(I.జ.ూ) పరీక్షలో కొద్దిమంది మాత్రమే పాస్‌ అవుతారు. తండ్రి మిమ్ములను చదివించి స్వర్గాధికారులుగా, సతోప్రధానంగా తయారు చేస్తారు. సతోప్రధానము నుండి మళ్లీ తమోప్రధానంగా అయ్యామని, ఇప్పుడు బాబా స్మృతి ద్వారా సతోప్రధానంగా అవ్వాలని మీకు తెలుసు. పతితపావనుడైన తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి చెప్తున్నారు - '' మన్మనాభవ '' ఇది అదే గీతా అధ్యాయము (ఎపిసోడ్‌లజుజూఱరశీసవ), డబల్‌ కిరీటధారులుగా తయారు చేయునది గీతయే అయినది. తయారు చేయువారు తండ్రియే కదా. మీ బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. ఎవరు మంచి బుద్ధివంతులై ఉంటారో, వారికి ధారణ కూడా బాగుంటుంది. అచ్ఛా!

రాత్రి క్లాసు :- పిల్లలు ఇక్కడ క్లాసులో కూర్చుని ఉన్నారు. తమ టీచరు ఎవరో పిల్లలకు తెలుసు. మా టీచరు ఎవరు అనేది విద్యార్థులకు సదా స్మృతిలో ఉంటుంది కానీ విచిత్రమేమంటే ఇక్కడ మర్చిపోతారు. పిల్లలు క్షణ-క్షణము మర్చిపోతారని ఈ టీచరుకు తెలుసు. ఇటువంటి ఆత్మిక తండ్రి ఎప్పుడూ లభించలేదు. సంగమ యుగములోనే లభిస్తారు. సత్యయుగము, కలియుగాలలో శారీరిక తండ్రి లభిస్తారు. ఇది సంగమ యుగము, ఈ యుగములోనే ఇటువంటి పురుషోత్తములుగా అవ్వనున్నామని పిల్లలకు పక్కా నిశ్చయమవ్వాలి. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసినందున ముగ్గురూ గుర్తు రావాలి. టీచరును గుర్తు చేసుకున్నా ముగ్గురూ గుర్తు రావాలి, అలాగే గురువును గుర్తు చేసుకున్నా ముగ్గురూ గుర్తు రావాలి. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ముఖ్యమైన విషయము - పవిత్రంగా అవ్వడం. పవిత్రంగా ఉన్నవారిని సతోప్రధానమనే అంటారు. వారు సత్యయుగములో మాత్రమే ఉంటారు. ఇప్పుడు చక్రములో తిరిగి ఇక్కడకు వచ్చారు. ఇది సంగమ యుగము. కల్ప-కల్పమూ తండ్రి కూడా వస్తారు, మిమ్ములను చదివిస్తారు. మీరు తండ్రి వద్ద ఉంటారు కదా. వీరు సత్యమైన సద్గురువు అని కూడా మీకు తెలుసు. అంతేకాక ముక్తి-జీవన్ముక్తిధామముల మార్గమును కూడా తప్పకుండా చూపిస్తారని మీకు తెలుసు. డ్రామా ప్లాను అనుసారము మనము పురుషార్థము చేసి తండ్రిని అనుసరిస్తాము. ఇచ్చట శిక్షణ పొంది ఫాలో చేస్తాము(అనుసరిస్తాము). ఇక్కడ ఎలా నేర్చుకుంటామో, అలా పిల్లలైన మీరు పురుషార్థము కూడా చేస్తారు. దేవతలుగా అవ్వాలంటే శుద్ధమైన కర్మలు చేయాలి. ఎలాంటి మురికి ఉండరాదు. అంతేకాక ముఖ్యమైన విషయము - తండ్రిని స్మృతి చేయడం. కానీ తండ్రిని మర్చిపోతాము, విద్య(చదువు)ను మర్చిపోతాము, స్మృతియాత్రను కూడా మర్చిపోతామని తెలుసు. తండ్రిని మర్చిపోయినందున జ్ఞానాన్ని కూడా మర్చిపోతాము. నేను విద్యార్థిని అని కూడా మర్చిపోతారు. ముగ్గురు కూడా గుర్తుండాలి. తండ్రిని స్మృతి చేస్తే టీచరు, సద్గురువు తప్పకుండా గుర్తుకు వస్తారు. శివబాబాను స్మృతి చేస్తే, వారితో పాటు దైవీగుణాలు కూడా తప్పకుండా గుర్తు రావాలి. తండ్రి స్మృతిలో చమత్కారముంది. తండ్రి పిల్లలకు ఎంత చమత్కారాన్ని నేర్పిస్తారో అంత వేరెవ్వరూ నేర్పించలేరు. ఈ జన్మలోనే మనము తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతాము. తమోప్రధానంగా అయ్యేందుకు పూర్తి కల్పమంతా పడ్తుంది, కానీ ఇప్పుడు ఈ ఒక్క జన్మలోనే సతోప్రధానంగా అవ్వాలి. ఇందులో ఎవరెంత శ్రమ చేస్తారో అంత ప్రాప్తి లభిస్తుంది. పూర్తి ప్రపంచమైతే దీని కొరకు శ్రమించదు. ఇతర ధర్మాలవారు ఈ శ్రమ చేయరు. పిల్లలు సాక్షాత్కారము చేసుకున్నారు. ధర్మస్థాపకులు వస్తారు, ఫలానా దుస్తులలో పాత్రాభినయము చేసి వెళ్ళారు, వారు తమోప్రధానములో వస్తారు. మనము ఎలా సతోప్రధానంగా అవుతామో, అలా ఇతరులందరూ అవుతారని వివేకము కూడా చెప్తుంది. పవిత్రతా దానమును తండ్రి నుండి తీసుకుంటారు. మమ్ములను ఇక్కడ నుండి ముక్తము(లిబరేట్‌) చేసి ఇంటికి తీసుకెళ్ళండి, మార్గదర్శకులవ్వండి అని అందరూ పిలుస్తారు. డ్రామా ప్లాను అనుసారము అందరూ ఇంటికి వెళ్ళనే వెళ్ళాలి. అనేకసార్లు ఇంటికి వెళ్తారు. కొందరు పూర్తి 5 వేల సంవత్సరాలు ఇంట్లో ఉండరు. కొందరు పూర్తి 5 వేల సంవత్సరాలు ఇంట్లోనే ఉంటారు. వారు అంతిమ సమయములో వస్తారు అప్పుడు 4,999 సంవత్సరాలు శాంతిధామములో ఉంటారని అంటారు. మనము 4,999 సంవత్సరాలు ఈ సృష్టిలోనే ఉన్నామని చెప్తాము. 83 - 84 జన్మలు తీసుకున్నామని పిల్లలకు నిశ్చయముంది. ఎవరైతే చాలా చురుకైనవారుగా ఉంటారో, వారు తప్పకుండా ప్రారంభములోనే వస్తారు. అచ్ఛా !

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. సతోప్రధానంగా అయ్యేందుకు స్మృతియాత్ర ద్వారా మీ బ్యాటరీ ఛార్జ్‌ చేసుకోవాలి. తప్పులేనివారిగా అవ్వాలి. మీ రిజిష్టరు మంచి(గుడ్‌)గా ఉంచుకోవాలి. ఏ పొరపాట్లు చేయరాదు.

2. ఎప్పుడూ నియమ విరుద్ధమైన ఏ కర్మనూ చేయరాదు. మాయావీ తుఫానులను లక్ష్యపెట్టక, కర్మేంద్రియజీతులుగా అవ్వాలి. లివర్‌ గడియారము సమానము ఖచ్ఛితమైన(ఆక్యురేట్‌) పురుషార్థము చేయాలి.

వరదానము :-

''సంబంధము మరియు ప్రాప్తుల స్మృతి ద్వారా సదా సంతోషంగా ఉండే సహజయోగీ భవ''

సహజయోగానికి ఆధారము - సంబంధము మరియు ప్రాప్తులు. సంబంధము ఆధారము పై ప్రేమ జన్మిస్తుంది. ఎక్కడ ప్రాప్తులుంటాయో, మనసు-బుద్ధి సహజంగా అక్కడకే వెళ్తాయి. కనుక సంబంధములో 'నావారు(నా బాబా)' అనే అధికారముతో స్మృతి చేయండి. హృదయపూర్వకంగా మేరా బాబా(నా బాబా) అని అనండి. తండ్రి ద్వారా లభించిన శక్తులు, జ్ఞానము, గుణాలు, సుఖ-శాంతులు, ఆనందము, ప్రేమ ఖజానాలను స్మృతిలో ఎమర్జ్‌ చేయండి, తద్వారా అపారమైన సంతోషముంటుంది. అంతేకాక సహజయోగులుగా కూడా అవుతారు.

స్లోగన్‌ :-

''దేహ భావము నుండి ముక్తులుగా అయితే ఇతర అన్ని బంధనాలు స్వతహాగా సమాప్తమైపోతాయి''