10-05-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీరు కర్మాతీతులుగా అయ్యి వెళ్లాలి కనుక లోపల ఎటువంటి లోపాలు ఉండరాదు. స్వయాన్ని పరిశీలించుకొని లోపాలను తొలగించుకుంటూ ఉండండి.''
ప్రశ్న :-
ఎటువంటి స్థితిని తయారు చేసుకునేందుకు శ్రమ చేయవలసి ఉంటుంది? అందుకు పురుషార్థమేది?
జవాబు :-
ఈ కనులతో చూచే ఏ వస్తువూ మనసులో మెదలరాదు, చూస్తున్నా చూడనట్లు ఉండాలి. దేహములో ఉంటూ దేహీ-అభిమానులుగా ఉండండి. ఈ స్థితిని స్థిరము చేసుకునేందుకు సమయము పడ్తుంది. బుద్ధిలో ఒక్క తండ్రి, ఇల్లు తప్ప ఏ ఇతర వస్తువు గుర్తు రాకూడదు. ఇలా తయారయ్యేందుకు అంతర్ముఖులుగా అయ్యి స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. చార్టు వ్రాస్తూ ఉండాలి.
ఓంశాంతి.
మధురాతి మధురమైన అపురూప పిల్లలకు మనము మన దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నామని తెలుసు. ఇందులో రాజులు కూడా ఉన్నారు, ప్రజలు కూడా ఉన్నారు. పురుషార్థమైతే అందరూ చేస్తారు. ఎవరు ఎక్కువ పురుషార్థము చేస్తారో వారు ఎక్కువ బహుమతిని తీసుకుంటారు. ఇది ఒక సాధారణ నియమము. ఇదేమీ కొత్త మాట కాదు. దీనిని దైవీ తోట అనండి లేక రాజధాని అని అనండి. ఇప్పుడిది కలియుగపు తోట లేక ముళ్ల అడవి. అక్కడ కూడా కొన్ని చాలా ఎక్కువ ఫలములిచ్చే వృక్షములుంటాయి. కొన్ని తక్కువ ఫలములిచ్చేవిగా ఉంటాయి. కొన్ని తక్కువ రసముండే మామిడి పళ్లుంటాయి, కొన్ని మరొక విధంగా ఉంటాయి. రకరకాల ఫల పుష్పాల వృక్షాలుంటాయి. అదే విధంగా పిల్లలైన మీలో కూడా నంబరువారు పురుషార్థానుసారముగా ఉన్నారు. కొంతమంది చాలా మంచి ఫలాలనిస్తారు. కొంతమంది తేలిక ఫలాలనిస్తారు. రకరకాల వృక్షాలు ఉండనే ఉంటాయి. ఇది ఫలములనిచ్చే తోట. దైవీ వృక్ష స్థాపన జరుగుతూ ఉంది లేక పుష్పాల తోట కల్పక్రితము వలె స్థాపన అవుతూ ఉంది. నెమ్మది నెమ్మదిగా మధురంగా, సుగంధభరితంగా కూడా తయారౌతూ ఉంది. అది కూడా నంబరువారు పురుషార్థానుసారము జరుగుతూ ఉంది. అన్ని రకాలు ఉంటాయి కదా. తండ్రి ముఖము చూచేందుకు తండ్రి వద్దకు కూడా వస్తారు. బాబా మనలను స్వర్గాధికారులుగా చేస్తారని కూడా బాగా అర్థము చేసుకున్నారు. పిల్లలకు ఈ నిశ్చయము తప్పకుండా ఉంది. అనంతమైన తండ్రి మనలను అనంతానికి అధికారులుగా చేస్తున్నారు. అధికారులుగా అవ్వడంలో చాలా సంతోషముంటుంది. హద్దు అధికారములో దు:ఖముంది. ఈ డ్రామా సుఖ-దు:ఖాలతో కూడినది. ఇది కూడా భారతవాసుల కొరకే. మొట్టమొదట మీ ఇంటిని సరిచేసుకోండి,......... అని పిల్లలకు బాబా చెప్తున్నారు. ఇంటి పై దాని యజమాని దృష్టి ఉంటుంది కదా. అందుకే తండ్రి కూడా ఒక్కొక్క పుత్రుని కూర్చోబెట్టుకొని ఎవరెవరిలో ఏ ఏ అవగుణాలున్నాయి అని చూస్తున్నారు. ఈ విషయాలు పిల్లలకు స్వయంగా కూడా తెలుసు. ఒకవేళ బాబా ''పిల్లలూ, మీరు మీలోని లోపాలను మీరే వ్రాసుకొని రండి'' అని చెప్తే వెంటనే వ్రాయగలరు. మనలో ఏ ఏ లోపాలున్నాయో మనము అర్థము చేసుకోగలము. ఏదో ఒక లోపము తప్పకుండా ఉండనే ఉంది. ఇంకా ఎవ్వరూ సంపూర్ణమవ్వలేదు. కానీ తప్పకుండా సంపూర్ణమవ్వాలి. కల్ప-కల్పము సంపూర్ణమయ్యామనుటలో ఏ సందేహమూ లేదు. కానీ ఈ సమయములో లోపాలున్నాయి. అవి మీరు తెలిపితే బాబా వాటిని గురించి అర్థం చేయిస్తారు. ఇప్పుడు చాలా లోపాలున్నాయి. ముఖ్యంగా అన్ని లోపాలు దేహాభిమాన కారణంగా ఏర్పడ్తాయి. ఆ లోపాలు చాలా కలవరపెడ్తాయి. స్థితిని ముందుకు పోనీయవు. అందుకే ఇప్పుడు పూర్ణ రీతిలో పురుషార్థము చేయాలి. ఈ శరీరము కూడా ఇప్పుడు వదిలి వెళ్లాలి. దైవీగుణాలు కూడా ఇక్కడే ధారణ చేసి వెళ్లాలి. కర్మాతీత స్థితికి వెళ్లడం - దీనికి అర్థము కూడా బాబా తెలిపిస్తున్నారు. కర్మాతీతులుగా అయ్యి వెళ్లాలంటే ఏ విధమైన మచ్చ ఉండరాదు. ఎందుకంటే మీరు వజ్రాలుగా తయారౌతున్నారు కదా. స్వయంలో ఏ ఏ మచ్చలున్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే మీరు చైతన్యము. జడ వజ్రాలలో మచ్చలుంటే వాటంతకవే తొలగించుకోలేవు. కానీ మీరు చైతన్యమైనవారు. మీరు మీలోని మచ్చలను తొలగించుకోగలరు. మీరు గవ్వ నుండి వజ్ర సమానంగా తయారౌతారు. మిమ్ములను గురించి మీకు చాలా బాగా తెలుసు. మిమ్ములను ఆటంకపరచే, ముందుకు పోనివ్వక అడ్డగించే తప్పులు మీలో ఏమున్నాయి? అని సర్జన్ అడుగుచున్నారు. చివర్లో మచ్చలేని వారిగా తయారౌతారు. వాటన్నింటిని ఇప్పుడే తొలగించుకోవాలి. ఒకవేళ మచ్చలు తొలగిపోకుంటే వజ్రము విలువ చాలా తగ్గిపోతుంది. ఇతడు కూడా చాలా గొప్ప వజ్రాల వ్యాపారి కదా. జీవితమంతా ఇతడు తన కనులతో వజ్రాలనే చూశాడు. ఇటువంటి వజ్రాల వ్యాపారి మరెవ్వరూ ఉండరు. వజ్రాలను పరిశీలించే శక్తి, ఆసక్తి ఉన్నవారు మరెవ్వరూ లేరు. మీరు కూడా వజ్రాలుగా తయారౌతూ ఉన్నారు. ఏదో ఒక మచ్చ ఉందని మీకు బాగా తెలుసు. ఇంకా సంపూర్ణము కాలేదు. చైతన్యమైన కారణంగా మీరు పురుషార్థము ద్వారా మచ్చలను తొలగించుకోగలరు. వజ్ర సమానంగా కూడా తప్పకుండా అవ్వాలి. పురుషార్థము పూర్తిగా చేసినప్పుడే అలా అవుతారు.
శరీరము వదిలే సమయములో మరెవ్వరూ గుర్తు రానంతగా మీ స్థితి పక్కాగా ఉండాలని తండ్రి చెప్తున్నారు. ఇదైతే చాలా స్పష్టంగా ఉంది. బంధు-మిత్రులు మొదలైన వారందరినీ మర్చిపోవాలి. ఒక్క తండ్రితోనే సంబంధముంచుకోవాలి. ఇప్పుడు మీరు వజ్రంగా అవుతున్నారు. ఇది వజ్రాల దుకాణము. మీలో ప్రతి ఒక్కరూ ఒక రత్నాల వ్యాపారి. ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియదు. ప్రతి ఒక్కరి హృదయములో మేము విశ్వానికి అధికారులుగా పురుషార్థానుసారము తయారౌతున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఎవరికి ఉన్నత పదవి లభించిందో వారు తప్పకుండా పురుషార్థము చేసి ఉంటారు కదా. వారు కూడా మీలోని వారే కదా. పిల్లలైన మీరే ఇంతటి పురుషార్థము చేయాలి. అందువలన బాబా ఒక్కొక్క పుత్రుని చూస్తూ ఉంటారు. పుష్పాలు ఎలా ఉన్నాయో చూస్తుంటారు కదా. ఈ పుష్పము ఎంత సుగంధభరితంగా ఉంది, ఇది ఎలా ఉంది, ఇందులో ఏమైనా లోపాలున్నాయా? అని చూస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు చైతన్యము కదా. చైతన్యమైన వజ్రాలు తమలో ఏమేమి లోపాలున్నాయో ఆ లోపాల వలన తండ్రి నుండి బుద్ధియోగము వేరై ఎక్కడెక్కడ తిరుగుతూ ఉందో తెలుసుకోగలరు కదా. తండ్రి ఏమో అందరికీ - పిల్లలూ, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి ఇతరులెవ్వరూ గుర్తు రాకూడదు అని చెప్తున్నారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. తయారై సేవ కొరకు వెలువడేందుకు వీరి భట్టి జరగవలసి ఉంది. పాతవారు సేవ చాలా బాగా చేస్తున్నారు. కొంతమంది కొత్తవారు కూడా పాతవారికి సేవలో తోడవుచున్నారు. పాతవారి భట్టి తయారు కావలసి ఉంది. పాతవారైనా వారిలో కూడా లోపాలుండనే ఉన్నాయి. బాబా ఏ స్థితిని తయారు చేసుకోమని చెప్తున్నారో అది ఇంకా తయారవ్వలేదని ప్రతి ఒక్కరి మనసుకు తెలుసు. లక్ష్యమేమిటో బాబా తెలుపుతున్నారు. అన్నిటికంటే పెద్ద మలినము దేహాభిమానము. అందుకే దేహము వైపు బుద్ధి పరిగెడ్తుంది. దేహములో ఉంటూ దేహీ-అభిమానులుగా అవ్వాలి. ఈ కంటితో చూచే వస్తువేదీ బుద్ధిలోకి రానంతగా స్మృతిని తయారు చేసుకోవాలి. మన బుద్ధికి ఒక్క తండ్రి మరియు శాంతిధామము తప్ప ఏ వస్తువు గుర్తు రాకూడదు. ఎందుకంటే దేనినీ వెంట తీసుకెళ్లము. మొట్టమొదట మనము కొత్త సంబంధములోకి వచ్చాము. ఇప్పుడున్నవన్నీ పాత సంబంధాలు. పాత సంబంధాలు ఏ మాత్రము గుర్తు రాకూడదు. అంతిమ సమయములో......... అనే గాయనము కూడా ఉంది. ఇది కూడా ఇప్పటి మాటే. పాట తయారుచేసింది కలియుగములోని మనుష్యులు. కానీ వారికి దాని అర్థము ఏ మాత్రము తెలియదు. ఒక్క బాబా తప్ప మరేదీ గుర్తు రాకూడదనే ముఖ్యమైన విషయాన్ని బాబా అర్థం చేయిస్తారు. ఒక్క బాబా స్మృతి ద్వారానే మీ పాపాలు తొలగిపోతాయి. అంతేకాక పవిత్రమైన వజ్రంగా కూడా అవుతారు. కొన్ని రాళ్లు కూడా చాలా విలువైనవిగా ఉంటాయి. మాణిక్యము కూడా చాలా విలువైనది. బాబా తన పిల్లలను తనకంటే విలువైనవారిగా చేస్తున్నారు. స్వయం మీకు మీరే పరిశీలించుకుంటూ ఉండాలి. అంతర్ముఖులుగా అయ్యి మాలో ఏ లోపముందో పరిశీలించుకోవాలని తండ్రి చెప్తున్నారు. ''ఆత్మాభిమానిగా ఎంతవరకు తయారయ్యాను?'' పురుషార్థము కొరకు బాబా అనేక విధాలైన యుక్తులు తెలిపిస్తూ ఉంటారు. ఎంత ఎక్కువ వీలైతే అంత ఒక్కరి స్మృతిలోనే ఉండాలి. ఎంత ప్రియమైనవారైనా, అందమైన పిల్లలు ఎంత ప్రియంగా ఉన్నా వారెవ్వరూ గుర్తు రాకూడదు. కొంతమందికి తమ పిల్లల పై చాలా మోహముంటుంది. వారందరి నుండి మమకారము తొలగించుకోండని బాబా చెప్తున్నారు. ఒక్కరి స్మృతిని మాత్రమే ఉంచుకోండి. అత్యంత ప్రియమైన తండ్రితోనే యోగము జోడించాలి. వారి ద్వారానే సర్వస్వమూ లభిస్తాయి. యోగము ద్వారానే మీరు అత్యంత ప్రియమైనవారిగా అవుతారు. ఆత్మ ప్రియమైనదిగా అవుతుంది. తండ్రి అత్యంత ప్రియంగా, పవిత్రంగా ఉన్నారు కదా. ఆత్మను ప్రియంగా, పవిత్రంగా తయారు చేసేందుకు తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, మీరు నన్ను ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో అంత ప్రియంగా అవుతారు. మీరు ఎంత ప్రియంగా అవుతారంటే దేవీదేవతలుగా ఉన్న మీకు ఇప్పటివరకు పూజలు జరుగుతూనే ఉన్నాయి. చాలా ప్రియంగా అవుతారు. అర్ధకల్పము మీరు రాజ్యపాలన చేస్తారు. ఆ తర్వాత అర్ధకల్పము పూజింపబడ్తారు. మీరే స్వయం పూజారులై మీ చిత్రాలను మీరే పూజిస్తూ ఉంటారు. మీరు అందరికంటే చాలా ప్రియంగా తయారయ్యేవారు. అయితే అత్యంత ప్రియమైన తండ్రిని చాలా బాగా స్మృతి చేసినప్పుడే లవ్లీగా(ప్రియమైనవారిగా) అవుతారు. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తు రాకూడదు. తండ్రిని అత్యంత ప్రీతిగా మృతి చేస్తున్నానా? అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. తండ్ర్రి స్మృతిలో ప్రేమ బాష్పాలు ప్రవహించాలి. బాబా, నాకు మీరు తప్ప మరెవ్వరూ లేరు. ఇతరులెవ్వరి స్మృతి రాకూడదు. మాయ కలిగించే తుఫాన్లు కూడా రాకూడదు. తుఫాన్లు చాలా వస్తాయి కదా. స్వయం మిమ్ములను మీరు చాలా పరిశీలించుకుంటూ ఉండాలి. నా ప్రేమ తండ్రి వైపు తప్ప మరెవ్వరి వైపు పోలేదు కదా? అని స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎంత ప్రియమైన వస్తువైనా ఒక్క తండ్రి మాత్రమే గుర్తు రావాలి. మీరంతా ఒకే ప్రియునికి ప్రేయసులుగా అవుతారు. ప్రేయసీ-ప్రియులు ఒక్కసారి ఒకరినొకరు చూచుకుంటే చాలు, వివాహము మొదలైనవి కూడా చేసుకోరు, వేరు వేరుగానే ఉంటారు. కానీ ఒకరి స్మృతి మరొకరి బుద్ధిలో గాఢంగా నాటుకుంటుంది. మనమంతా ఒక్క ప్రియునికి ప్రేయసులమని మీకు తెలుసు. ఆ ప్రియుని మీరు భక్తిమార్గములో కూడా చాలా స్మృతి చేస్తూ వచ్చారు. ఇక్కడ కూడా మీరు వారిని చాలా స్మృతి చేయాలి ఎందుకంటే వారిప్పుడు మీ సన్ముఖములో ఉన్నారు. నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే నీ నావ ఆవలి తీరానికి చేరుకుంటుందని తండ్రి చెప్తున్నారు. ఇందులో సంశయించే మాట ఏదీ లేదు. భగవంతుని కలుసుకునేందుకు అందరూ భక్తి చేస్తారు.
ఇక్కడ కొంతమంది పిల్లలు చాలా కష్టపడి(హడ్డీ సేవ) సేవ చేస్తారు. సేవ కొరకు తపించి పోతుంటారు. చాలా శ్రమ చేస్తారు. గొప్పవారు ఇంత బాగా అర్థము చేసుకోరు. కానీ మీ శ్రమ వ్యర్థము కాదు. కొంతమంది అర్థము చేసుకొని అర్హులుగా అవుతారు. తర్వాత బాబా ముందుకు వస్తారు. వారు అర్హులా కాదా? అని మీకు తెలుస్తుంది. పిల్లలైన మీ ద్వారా వారికి దృష్టి లభిస్తుంది. వారిని అలంకరించేది పిల్లలైన మీరే. ఇచ్చటకు వచ్చిన వారినంతా పిల్లలైన మీరే అలంకరించారు. బాబా మిమ్ములను అలంకరిస్తే మీరు ఇతరులను అలంకరించి తీసుకొస్తారు. తండ్రి ఎలా అలంకరించారో అలాగే మీరు ఇతరులను అలంకరించాలి. అప్పుడు బాబా మనలను బాగా మెచ్చుకుంటారు. మీరు మీకంటే బాగా ఇతరులను అలంకరించవచ్చు. అందరికి తమ తమ భాగ్యము ఉంది కదా. కొంతమంది తెలుసుకునేవారు తెలిపించేవారి కంటే చురుకుగా ఉంటారు. వీరి కంటే మేము చాలా బాగా అర్థము చేయించగలమని భావిస్తారు. ఇతరులకు తెలిపే నషా పెరిగితే సేవకు బయలుదేరుతారు. బాప్దాదా ఇద్దరి హృదయాలలో చోటు చేసుకుంటారు. చాలా మంది కొత్తవారు పాతవారికంటే చురుకుగా ఉన్నారు. ముళ్ల నుండి చాలా మంచి పుష్పాలుగా అయ్యారు. అందుకే బాబా కూర్చుని వీరిలో ఏ ఏ లోపాలున్నాయి? అని చూస్తూ ఉంటారు. ఆ లోపము వీరి నుండి తొలగిపోయి చాలా మంచి సేవ చేయాలని కోరుకుంటారు. తోటమాలి కదా. లేచి వెళ్లి వెనుక ఉన్నవారిని కూడా చూడాలని మనసుకు అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది వెనుకకు పోయి కూర్చుంటారు. మంచి మంచి మహారథులు ముందు భాగములో కూర్చోవాలి. ఇందులో ఎవరికైనా కష్టము కలిగే మాటే లేదు. ఒకవేళ ఎవరైనా బాధపడి అలిగితే వారి భాగ్యము పై అలిగినట్లవుతుంది. ముందున్న పుష్పాలను చూచి అపారమైన సంతోషము కలుగుతుంది. ఈ పుష్పము చాలా బాగుంది, ఇందులో కాస్త లోపముంది, ఇది చాలా పరిశుభ్రంగా ఉంది, ఈ పుష్పములో కొంత తుప్పు ఏర్పడి ఉంది కనుక ఆ మలినమంతా తీసేయాలి అని బాబా భావిస్తారు. బాబా ప్రేమించినంతగా మరెవ్వరూ ప్రేమించరు. స్త్రీకి కూడా పతి పై చాలా ప్రేమ ఉంటుంది కదా. కానీ పతికి స్త్రీ పై అంత ఉండదు. వారు రెండవ, మూడవ స్త్రీని కూడా వివాహము చేసుకుంటారు. పతి మరణిస్తే ''అయ్యో దేవుడా, అయ్యో దేవుడా'' అంటూ ఏడుస్తూనే ఉంటుంది. పురుషుడైతే ఒక చెప్పు(స్త్రీ) పోతే మరొకటి చేసుకుంటాడు. శరీరమును చెప్పు అని అంటారు. శివబాబాకు కూడా పొడవైన పాదరక్ష(లాంగ్ బూటు) ఉంది కదా. మనము బాబాను స్మృతి చేస్తూ ఫస్ట్క్లాసుగా తయారౌతామని పిల్లలైన మీకు తెలుసు. కొంతమంది చాలా ఫ్యాషన్బుల్గా ఉండేవారు నాలుగైదు జతల చెప్పులు ఉంచుకుంటారు. ఆత్మకైతే ఒకే ఒక శరీరముంటుంది. అలాగే కాలికి కూడా ఒకే జత ఉండాలి కానీ ఎక్కువ చెప్పులు ఉంచుకోవడం ఒక ఫ్యాషనైపోయింది.
తండ్రి నుండి మనము ఎటువంటి వారసత్వము పొందుతామో మీకిప్పుడు తెలుసు. మనము స్వర్గానికి అధికారులుగా అవుతున్నాము. స్వర్గమును ప్రపంచములోని అద్భుతము అని అంటారు. హెవన్ లీ గాడ్ఫాదర్(స్వర్గ రచయిత) స్వర్గ స్థాపన చేస్తారు. ఇప్పుడు మీరు శ్రీమతమును అనుసరించి ప్రాక్టికల్గా మీ కొరకు మీరే స్వర్గ స్థాపన చేస్తున్నారు. ఇచ్చట చాలా పెద్ద పెద్ద మహళ్లు నిర్మిస్తారు. కానీ ఇవన్నీ సమాప్తమైపోతాయి. మీరు అక్కడ ఏం చేస్తారు! ఇక్కడ మా వద్ద ఏమీ లేదు అని మనసులో గుర్తుండాలి. అలాగే బయట మీరు గృహస్థములో ఉండవచ్చు, వారు కూడా అంతా బాబాదే అని భావిస్తారు. మా వద్ద ఏమియూ లేదు, మేము కేవలము నిమ్తితము అని భావిస్తారు. ట్రస్టీగా ఉన్నవారు వారి వద్ద ఏమీ ఉంచుకోరు. బాబాయే యజమాని. ఇంటిలో ఉంటున్నా ఇదంతా బాబాదే అని భావించండి. ధనవంతుల బుద్ధికి ఈ విషయాలు తోచవు. ట్రస్టీలుగా ఉండమని బాబా చెప్తున్నారు. మీరేం చేసినా బాబాకు తెలుపుతూ ఉండండి. బాబా, ఇల్లు కట్టుకోమంటారా? అని వ్రాస్తూ ఉంటారు. బాబా, భలే కట్టుకోండి......... కానీ ట్రస్టీలుగా ఉండండి అని చెప్తారు. బాబా కూర్చుని ఉన్నారు కదా. తండ్రి వెళ్లిపోతే బాబాతో పాటు అందరూ ఇంటికి వెళ్లిపోతారు. ఆ తర్వాత మీరు మీ రాజధానిలోకి వెళ్లిపోతారు. కల్ప-కల్పము పవిత్రంగా చేసేందుకు నేను తప్పకుండా రావలసిందే. నేను నా సమయానికి ఖచ్ఛితంగా వస్తాను. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. అన్నిటినుండి మమకారమును తొలగించి అత్యంత ప్రియమైన తండ్రినొక్కరినే స్మృతి చేయాలి. అంతర్ముఖులుగా అయ్యి తమ లోపాలను పరిశీలించి తొలగించుకోవాలి. అమూల్యమైన (వ్యాల్యూబుల్) వజ్రంగా అవ్వాలి.
2. ఎలా తండ్రి మనందరినీ గుణాలతో అలంకరించారో అలా అందరినీ అలంకరించాలి. ముళ్లను పుష్పాలుగా తయారు చేసే సేవలో నిమగ్నమైపోవాలి. ట్రస్టీగా అయ్యి ఉండాలి.
వరదానము :-
'' సదా ఒక్కరి స్నేహములో ఇమిడిపోయి ఒక్క తండ్రినే ఆధారంగా చేసుకునే సర్వ ఆకర్షణ ముక్త్ భవ ''
ఏ పిల్లలైతే ఒక్క తండ్రి స్నేహములో ఇమిడిపోయి ఉంటారో వారు సర్వ ప్రాప్తులతో సంపన్నంగా, సంతుష్టంగా(తృప్తిగా) ఉంటారు. వారిని ఏ విధమైన ఆధారము ఆకర్షించలేదు. వారికి సహజంగా ''ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు'' అని అనుభవం అవుతూ ఉంటుంది. వారి ప్రపంచమంతా ఒక్క తండ్రియే, వారికి ఒక్క తండ్రి ద్వారానే సర్వ సంబంధాల రసము అనుభవమవుతుంది. వారికి సర్వ ప్రాప్తులకు ఆధారము ఒక్క తండ్రియే, ఏ వైభవము లేక సాధనము కాదు. అందువలన వారు సహజంగా ఆకర్షణ ముక్తులైపోతారు.
స్లోగన్ :-
'' స్వయాన్ని నిమిత్తంగా భావించి సదా డబల్లైట్గా ఉంటే ఖుషీ (సంతోషము) అనుభవమవుతూ ఉంటుంది ''