28-08-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - ఈ బ్రహ్మ సద్గురువైన శివుని దర్బారు. ఈ భృకుటిలో సద్గురువు విరాజమానమై ఉన్నారు, వారే పిల్లలైన మీకు సద్గతినిస్తారు ''

ప్రశ్న :-

తండ్రి తన పిల్లలైన మిమ్ములను ఏ బానిసత్వము నుండి విడిపించేందుకు వచ్చారు ?

జవాబు :-

ఈ సమయములో పిల్లలందరూ ప్రకృతి మరియు మాయకు బానిసలై ఉన్నారు. తండ్రి ఇప్పుడు ఈ బానిసత్వము నుండి విడిపిస్తారు. ఇప్పుడు మాయ - ప్రకృతి రెండూ విసిగిస్తాయి. అప్పుడప్పుడు తుఫానులు, అప్పుడప్పుడు కరువులు వస్తాయి. తర్వాత ప్రకృతి అంతా మీకు దాసిగా అయ్యే విధంగా మీరు అధిపతులుగా అవుతారు. మాయ దాడి కూడా ఉండదు.

ఓంశాంతి.

వీరు సుప్రీమ్‌ తండ్రి, సుప్రీమ్‌ శిక్షకులు కూడా అని మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అర్థం చేసుకున్నారు. వారు విశ్వము ఆది-మధ్య-అంత్యముల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. సుప్రీమ్‌ గురువు కూడా వారే. కనుక ఇది సద్గురువు దర్బారు(ఆస్థానం). దర్బారు ఉంటుంది కదా! గురువు దర్బారు. వారు కేవలం గురువులు మాత్రమే. సద్గురువు లేనే లేడు. శ్రీ శ్రీ 108 అని చెప్పుకుంటారు. కానీ సద్గురువు అని వ్రాసుకోరు. వారు కేవలం గురువులు అని మాత్రమే అంటారు. వీరు సద్గురువు. మొదట తండ్రి తర్వాత టీచరు తర్వాత సద్గురువు. సద్గురువే సద్గతినిస్తారు. సత్య-త్రేతా యుగాలలో అయితే గురువులు ఉండరు. ఎందుకంటే అక్కడ అందరూ సద్గతిలో ఉంటారు. ఒక్క సద్గురువు లభించగానే గురువులందరి పేర్లు సమాప్తమైపోతాయి. సుప్రీమ్‌ అనగా గురువులందరికీ గురువు. ఉదాహరణానికి పతులకు పతి అని అంటారు కదా. వారు అందరికంటే శ్రేష్ఠులైన కారణంగా ఇలా అంటారు. మీరు సుప్రీమ్‌ తండ్రి వద్ద కూర్చున్నారు - ఎందుకు? బేహద్‌ వారసత్వమును తీసుకునేందుకు. ఇది అనంతమైన వారసత్వము. వీరు తండ్రే కాక టీచరు కూడా. ఈ వారసత్వము కొత్త ప్రపంచమైన అమరలోకము, నిర్వికార ప్రపంచము కొరకు. కొత్త ప్రపంచాన్ని నిర్వికార ప్రపంచమని, పాత ప్రపంచాన్ని వికారీ ప్రపంచమని అంటారు. సత్యయుగాన్ని శివాలయమని అంటారు. ఎందుకంటే అది శివబాబాచే స్థాపించబడింది. వికారి ప్రపంచాన్ని రావణుడు స్థాపించాడు. ఇప్పుడు మీరు సద్గురువు దర్బారులో కూర్చుని ఉన్నారు. ఇది కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. తండ్రియే శాంతిసాగరుడు. ఆ తండ్రి ఎప్పుడు వస్తారో, అప్పుడు శాంతి వారసత్వమును ఇచ్చి దారి తెలుపుతారు. పోతే అడవిలో శాంతి ఎక్కడ నుండి లభిస్తుంది? అందుకే కంఠహారమును ఉదాహరణగా ఇస్తారు. శాంతి ఆత్మకు కంఠహారము(శాంతి ఆత్మాకా గలే కా హార్‌ హై). మళ్లీ ఎప్పుడు రావణరాజ్యము వస్తుందో అప్పుడు అశాంతి కలుగుతుంది. వాటిని సుఖధామము, శాంతిధామము అని అంటారు. అక్కడ దు:ఖమనే మాటే ఉండదు. మహిమ కూడా సదా సద్గురువుదే చేస్తారు. గురువు మహిమ అని ఎప్పుడూ విని ఉండరు. జ్ఞానసాగరులు ఆ ఒక్క తండ్రి మాత్రమే. ఇలా ఎప్పుడైనా గురువు మహిమను విన్నారా? లేదు. ఆ గురువులు జగత్తుకు పతితపావనులు అవ్వలేరు. పతిత పావనులని కేవలం ఆ నిరాకార బేహద్‌(పెద్ద) తండ్రిని(బాబా)మాత్రమే అంటారు.

ఇప్పుడు మీరు సంగమ యుగములో నిల్చొని ఉన్నారు. ఒకవైపు పురాతన పతిత ప్రపంచము ఉంది, రెండవవైపు నూతన పావన ప్రపంచము. పతిత ప్రపంచములో గురువులైతే అనేకమంది ఉన్నారు. ఇంతకుముందు మీకు ఈ సంగమ యుగము గురించి తెలియదు. ఇది పురుషోత్తమ సంగమ యుగమని తండ్రి మీకు అర్థం చేయించారు. దీని తర్వాత మళ్లీ సత్యయుగము రానున్నది. చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇది బుద్ధిలో గుర్తుంచుకోవాలి. మనమంతా సోదరులము(భాయి - భాయి) కనుక బేహద్‌ తండ్రి నుండి ఆస్తి తప్పకుండా లభిస్తుంది. ఈ సమాచారము ఎవ్వరికీ తెలియదు. ఎంతో పెద్ద పెద్ద పొజిషన్‌ గల మనుష్యులున్నారు కానీ కొంచెము కూడా తెలియదు. తండ్రి చెప్తున్నారు - ' నేను మీ అందరికి సద్గతినిస్తాను.' ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు. ఇంతకుముందు అయితే కొంచెము కూడా తెలిసేది కాదు. ఈ దేవతల ముందుకు వెళ్లి మేము బుద్ధిహీనలమని, మాలో ఏ గుణాలూ లేవని, మీరు దయ చూపండి అని మీరు చెప్పేవారు. ఇప్పుడు దేవతల చిత్రాలు దయ(జాలి) చూపిస్తాయా? దయాహృదయులు ఎవరో తెలియనే తెలియదు. ఓ గాడ్‌ ఫాదర్‌! దయ చూపండి,............ అని కూడా అంటారు. ఏవైనా దు:ఖము కలిగించే విషయాలు వచ్చినప్పుడు తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తారు. ఇప్పుడు మీరు అలా అనరు. తండ్రి అయితే విచిత్రులు. వారు సన్ముఖములో కూర్చుని ఉన్నారు. అందుకే నమస్కారము చేస్తారు. మీరందరూ చిత్రధారులు (శరీరధారులు), నేను విచిత్రుడను. నేను ఎప్పుడూ శరీరాన్ని ధరించను. ఏదైనా నా చిత్రము యొక్క పేరును తెలపండి. శివబాబా అనే చెప్తారు, అంతే. నేను దీనిని అప్పుగా తీసుకున్నాను. అది కూడా అన్నింటికంటే పురాతనమైన చెప్పు(శరీరము). అందులోనే నేను వచ్చి ప్రవేశిస్తాను. ఈ శరీరాన్ని మహిమ ఎందుకు చేస్తారు? ఇది పురాతన శరీరము. దత్తు తీసుకున్నాను కనుక మహిమ చేస్తారా? లేదు. నల్లగా ఉండేవాడు ఇప్పుడు మళ్లీ నా ద్వారా సుందరంగా అవుతాడని అర్థం చేయిస్తున్నాడు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - నేను ఏదైతే వినిపిస్తానో దాని పై నిర్ణయము తీసుకోండి. ఒకవేళ నేను రైట్‌ అయితే రైటునే స్మృతి చేయండి. వారిదే వినండి. అసత్య మాటలను విననే వినకండి. వాటిని చెడు(ఈవిల్‌) అని అంటారు. చెడు మాట్లాడకండి, చెడు చూడకండి.............(టాక్‌ నో ఈవిల్‌, సీ నో ఈవిల్‌,............) ఈ కనుల ద్వారా ఏదైతే చూస్తారో అవన్నీ మర్చిపోండి. ఇప్పుడైతే ఇంటికి వెళ్లాలి. మళ్లీ వాపస్‌ మీ సుఖధామానికి వస్తారు. మిగిలిన వారంతా మరణించినట్లుగా ఉన్నారు. అంతా తాత్కాలికమే. ఈ పాత శరీరమూ ఉండదు, ఈ పాత ప్రపంచమూ ఉండదు. మనం నూతన ప్రపంచములోకి వెళ్లేందుకు పురుషార్థము చేస్తున్నాము. మళ్లీ ప్రపంచ చరిత్ర - భూగోళము రిపీట్‌ అవుతుంది. మీరు మీ రాజ్య భాగ్యమును తీసుకుంటున్నారు. కల్ప-కల్పము తండ్రి రాజ్యభాగ్యమును ఇచ్చేందుకు వస్తారని మీకు తెలుసు. బాబా, కల్పక్రితము కూడా కలుసుకున్నాము, వారసత్వము తీసుకున్నాము, నరుని నుండి నారాయణునిగా అయ్యామని మీరు కూడా అంటారు. పోతే అందరూ ఒకే విధమైన పదవినైతే పొందలేరు. నెంబరువారుగా అయితే ఉండనే ఉంటారు. ఇది ఆధ్యాత్మిక యూనివర్సిటీ. స్పిరిచువల్‌ తండ్రి చదివిస్తారు. పిల్లలు కూడా చదివిస్తారు. ఎవరైనా ప్రిన్సిపల్‌ కొడుకు ఉంటే అతడు కూడా సర్వీసులో నిమగ్నమైపోతాడు. స్త్రీ కూడా చదివించడంలో లగ్నమౌతుంది. కూతురు కూడా బాగా చదువుకొని ఉంటే ఆమె కూడా చదివించగలదు, అయితే కూతురు మరో ఇంటికి వెళ్లిపోతుంది. ఇక్కడ ఆడపిల్లలు ఉద్యోగము చేసే నియమము లేదు. క్రొత్త ప్రపంచములో పదవిని పొందేందుకు ఆధారమంతా ఈ చదువు పైనే ఉంది. ఈ విషయాల గురించి ప్రపంచానికి తెలియదు. భగవానువాచ - '' హే పిల్లలూ! నేను మిమ్ములను రాజాధి రాజులుగా తయారు చేస్తాను '' అని వ్రాయబడి ఉంది. నేను దేవీల చిత్రాలను తయారు చేసినట్లు ఏ నమూనా(మాడల్‌)ను తయారు చేయను. మీరు చదువుకొని ఆ పదవిని పొందుతారు. వారేమో పూజ కొరకు మట్టి చిత్రాలను తయారు చేస్తారు. ఇక్కడేమో ఆత్మ చదువుకుంటుంది. మళ్లీ మీరు సంస్కారాలను తీసుకెళ్తారు. నూతన ప్రపంచములో శరీరాలు తీసుకుంటారు. ప్రపంచము అంతమైపోదు. కేవలంకాలం మారిపోతుంది. స్వర్ణ యుగము, వెండి యుగము, రాగి యుగం, ఇనుప యుగం, 16 కళల నుండి 14 కళలు అవుతాయి. ప్రపంచమేమో అదే కొనసాగుతూ ఉంటుంది. కొత్తదిగా ఉండేది పాతదిగా అవుతుంది. తండ్రి మిమ్ములను ఈ చదువు ద్వారా రాజాధి రాజులుగా చేస్తారు. ఈ విధంగా చదివించే శక్తి ఇంకెవ్వరికీ లేదు. ఎంత బాగా అర్థము చేయిస్తారు! మళ్లీ చదువుతూ చదువుతూ ఉన్నప్పుడు మధ్యలో మాయవారిగా చేసేసుకుంటుంది. అయినా ఎంతెంత చదివారో దాని అనుసారము అంతంత వారు స్వర్గములోకి తప్పకుండా వస్తారు. సంపాదన ఊరకే పోదు. అవినాశి జ్ఞానము వినాశనమవ్వజాలదు. పోను పోను అందరూ వస్తారు. ఇక ఎక్కడకు వెళ్తారు? ఉన్నది ఒకే దుకాణము కదా! వస్తూనే ఉంటారు. మనుష్యులు శ్మశానములోనికి వెళ్లినప్పుడు వారికి అక్కడ ఎంతో వైరాగ్యము వస్తుంది. ఈ శరీరము ఇలా వదిలి వేయల్సిందే. మరి మనము పాపాలు ఎందుకు చేయాలి? పాపాలు చేస్తూ చేస్తూ మనము కూడా ఇలాగే మరణిస్తాము కదా! అని భావిస్తారు. ఇటువంటి ఆలోచనలు వస్తాయి. దానిని శ్మశాన వైరాగ్యము అని అంటారు. మళ్లి మరో శరీరము తీసుకుంటారని కూడా భావిస్తారు. కాని జ్ఞానమైతే లేదు కదా! ఇక్కడైతే పిల్లలైన మీకు అర్థము చేయించడం జరుగుతుంది. ఈ సమయములో మీరు విశేషంగా మరణించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు తాత్కాలికమే. పాత శరీరాన్ని వదిలి మళ్లీ కొత్త ప్రపంచములోకి వెళ్తారు.

పిల్లలూ! మీరు నన్ను ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా పాపాలు నశిస్తూపోతాయని తండ్రి అంటారు. ఇది ఎంతో సహజమైనది. అలాగే ఎంతో కష్టమైనది కూడా. పిల్లలు పురుషార్థము చేయడం మొదలు పెట్టినప్పుడు మాయతో చాలా పెద్ద యుద్ధము జరుగుతుందని తెలుసుకుంటారు. తండ్రి ఏమో సహజము అని అంటారు. కానీ మాయ దీపాన్నే ఆర్పేస్తుంది! గులేబకావళి కథ కూడా ఉంది కదా! మాయ పిల్లి దీపాన్ని ఆర్పేస్తుంది. ఇక్కడ అందరూ మాయకు దాసులే. తర్వాత మీరు మళ్లీ మాయను దాసిగా చేసుకుంటారు. మొత్తం ప్రకృతి అంతా మీ అధీనములో ఉంటుంది. ఎటువంటి తుఫానులూ ఉండవు, కరువులూ ఉండవు. ప్రకృతిని దాసిగా చేసుకోవాలి. అక్కడ ఎప్పుడూ మాయ మీ పై దాడి చేయదు. ఇప్పుడు ఎంతగా విసిగిస్తుంది? నేను నీ దాసిని.......... అన్న మహిమ కూడా ఉంది కదా! మళ్లీ మాయ నీవు నా దాసివి అని అంటుంది. ఇప్పుడు నేను మిమ్ములను ఈ బానిసత్వము నుండి విడిపించేందుకు వచ్చానని తండ్రి అంటారు. మీరు అధికారులుగా అవుతారు. మాయ బానిసగా అవుతుంది. కొద్దిగా కూడా గొడవ ఉండదు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. బాబా మాయ ఎంతగానో విసిగిస్తుందని మీరు అంటారు. ఎందుకు విసిగించదు? దీనిని యుద్ధ మైదానము అని అంటారు. మాయను దాసిగా చేసుకునేందుకు మీరు ప్రయత్నిస్తారు. కనుక మాయ కూడా ఓడిస్తుంది. ఎంతగానో విసిగిస్తుంది. చాలా మందిని ఓడిస్తుంది! కొందరినైతే పూర్తిగా తినేస్తుంది, మింగేస్తుంది. భలే స్వర్గాధిపతులుగా అవుతారు. కాని మాయ అయితే తింటూనే ఉంటుంది. దాని కడుపులో పడినట్లు అవుతారు. కేవలం పిలక మాత్రమే బయట ఉంది. మిగిలినదంతా దాని లోపల ఉంది. దానిని ఊబి అని కూడా అంటారు. ఎంతమంది పిల్లలు ఊబిలో పడి ఉన్నారు! కొద్దిగా కూడా స్మృతి చేయలేరు! తాబేలు భ్రమరముల ఉదాహరణను ఇచ్చినట్లు మీరు కూడా పురుగులను భూ - భూ చేసి ఎలా ఉన్నవారిని ఎలా చేయగలరు! పూర్తిగా స్వర్గములోని దేవకన్యలుగా చేసేస్తారు. సన్యాసులు భలే భ్రమరము ఉదాహరణను ఇస్తారు. కాని వారు భూ - భూ అంటూ పరివర్తన చేయరు. సంగమ యుగములోనే పరివర్తన జరుగుతుంది. ఇప్పుడిది సంగమ యుగము. మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. కావున వికారీ మనుష్యులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు తీసుకొస్తారు. పురుగులలో కూడా కొన్ని భ్రమరాలుగా అవుతాయి. కొన్ని కుళ్ళిపోతాయి. కొన్ని అసంపూర్ణంగా మిగిలిపోతాయి. బాబా, ఇలాంటివి ఎన్నో చూశారు. ఇక్కడ కూడా కొందరు బాగా చదువుతారు, జ్ఞానమనే రెక్కలు వచ్చేస్తాయి. కొందరినైతే మాయ సగములోనే పట్టుకుంటుంది. దానితో - అపరిపక్వంగానే ఉండిపోతారు. కావున ఈ ఉదాహరణలు కూడా ఈ సమయానికి చెందినవే. అద్భుతము కదా! భ్రమరము పురుగును తీసుకెళ్లి తన సమానంగా చేస్తుంది. తన సమానముగా చేసేది ఇదొక్కటే. ఇంకొక ఉదాహరణ సర్పముది. సత్యయుగములో ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. ఇప్పుడిక శరీరాన్ని వదలబోతున్నామని సాక్షాత్కారమవుతుంది. ఆత్మ వెళ్లి మరో గర్భమహలులో కూర్చుంటుంది. మహలులో కూర్చునేవారని, అందులో నుండి వెలుపలికి వచ్చేందుకు ఇష్టపడనేలేదని ఒక ఉదాహరణ కూడా చెప్తారు. అయినా తప్పకుండా బయటకు రావాల్సిందే. ఇప్పుడు పిల్లలైన మీరు సంగమ యుగములో ఉన్నారు. జ్ఞానము ద్వారా ఇలా పురుషోత్తములుగా అవుతారు. భక్తినైతే జన్మ-జన్మాంతరాలు చేశారు. కావున ఎవరైతే ఎక్కువగా భక్తి చేశారో వారే వచ్చి నంబర్‌వార్‌ పురుషార్థానుసారము పదవిని పొందుతారు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. అంతేకాని శాస్త్రాల జ్ఞానము జ్ఞానమే కాదు. అది భక్తి. దాని ద్వారా సద్గతి లభించదు. సద్గతి అనగా వాపస్‌ ఇంటికి వెళ్ళడము. ఇంటికి ఎవ్వరూ వెళ్లరు. నాతో ఎవ్వరూ కలుసుకోరు అని స్వయం తండ్రే చెప్తున్నారు. చదివించేవారు తమ తోడుగా తీసుకెెళ్లేవారు కూడా కావాలి కదా! తండ్రికి ఎంత ఆలోచన ఉంటుంది! 5 వేల సంవత్సరాలలో తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి చదివిస్తారు. మనము ఒక ఆత్మ అని మీరు ఘడియ, ఘడియ మర్చిపోతారు. ఆత్మలైన మనలను చదివించేందుకు తండ్రి వచ్చారని పూర్తి పక్కా చేసుకోండి. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానమునిస్తారు. పరమాత్మ, ఆత్మలైన మనకు జ్ఞానమును ఇస్తారు. సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి. శరీరమైతే సమాప్తమైపోతుంది. ఆత్మ అవినాశి.

కనుక ఈ బ్రహ్మ భృకుటి సద్గురువైన శివుని దర్బారు. ఈ ఆత్మ దర్బారు కూడా ఇదే. సద్గురువు కూడా వచ్చి ఇతనిలో ప్రవేశించారు. దీనిని రథము అని కూడా అంటారు. దర్బారు అని కూడా అంటారు. పిల్లలైన మీరు శ్రీమతానుసారము స్వర్గ ద్వారాలను తెరుస్తున్నారు. ఎంత బాగా చదువుకుంటారో సత్యయుగములో అంత ఉన్నత పదవి పొందుతారు కనుక బాగా చదువుకోవాలి. టీచరు పిల్లలైతే చాలా చురుకుగా ఉంటారు కాని ఇంటిలోని గంగకు విలువ ఉండదని అంటారు కదా. పట్టణములోని చెత్త అంతా గంగా నదిలో పడడం బాబా చూశారు. మరి గంగను పతితపావని అని అంటారా? మానవుల బుద్ధి ఎలా పాడైపోయిందో చూడండి. దేవీలను అలంకరించి పూజలు మొదలైనవి చేసి నీటిలో ముంచేస్తారు. కృష్ణుని కూడా ముంచేస్తారు కదా. అది కూడా ఎంతో అగౌరవంగా ముంచుతారు. బెంగాలు వైపు ముంచునప్పుడు కాళ్ళతో తొక్కి కూడా ముంచుతారు. ఇంతకు ముందు బెంగాలులో ఎవరైనా చివరి స్థితికి చేరుకుంటే వారిని గంగ నీటిలో ముంచి హరి బోల్‌ హరి బోల్‌(హరి అని చెప్పు, హరి అని చెప్పు) అంటూ నోటిలో నీళ్ళు పోసి పోసి ప్రాణాలు తీసేవారు. ఈ ఆచారము పూర్వముండేది. ఇది ఆశ్చర్యము కదా. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో పైకి ఎక్కడం, దిగడం - వీటిని గురించిన పూర్తి జ్ఞానమంతా నంబరువారు పురషార్థానుసారముగా ఉంది. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. తండ్రి ఏదైతే వినిపిస్తారో దానినే వినాలి, తర్వాత ఏది సరియైనదో నిర్ణయించాలి. సత్యమునే (రైటునే) స్మృతి చేయాలి. అసత్య విషయాలను వినరాదు, మాట్లాడరాదు, చూడరాదు.

2. బాగా చదువుకొని స్వయాన్ని రాజాధి రాజులుగా తయారు చేసుకోవాలి. ఈ పాత శరీరములో, పాత ప్రపంచములో స్వయాన్ని తాత్కాలికమని భావించాలి.

వరదానము :-

'' జ్ఞానామృతము కొరకు దాహముతో ఉన్న ఆత్మల దాహాన్ని తీర్చి తృప్తి పరచే మహాన్‌ పుణ్యాత్మా భవ ''

ఎవరి దాహార్తి దాహమునైనా తీర్చడం చాలా గొప్ప పుణ్యము. నీరు లభించకుంటే ఎలాగైతే తహ తహలాడ్తారో అలా జ్ఞానామృతము లభించక ఆత్మలు దు:ఖము, అశాంతితో విలవిలలాలాడ్తున్నారు. వారికి జ్ఞానామృతమునిచ్చి వారి దాహమును తీర్చేవారిగా అవ్వండి. ఎలాగైతే అవసరం(తప్పనిసరి) కనుక భోంచేసేందుకు తీరిక చేసుకుంటారో, అలా ఈ పుణ్య కార్యము చేయడం కూడా అవసరము. అందువలన ఈ అవకాశము తీసుకోవాలి, సమయం చేసుకోవాలి - అప్పుడు వారిని మహాన్‌ పుణ్యాత్మలని అంటారు.

స్లోగన్‌ :-

'' గతించిన దానికి బిందువు ఉంచి ధైర్యముతో ముందుకు సాగుతూ ఉంటే, తండ్రి సహాయము లభిస్తూ ఉంటుంది. ''