11-04-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - తండ్రి దాత అయినారు. పిల్లలైన మీరు తండ్రిని ఏమీ అడగవలసిన అవసరము లేదు. అడుక్కోవడము కంటే మరణించడం మేలు అను సామెత కూడా ఉంది.''
ప్రశ్న :-
ఏ స్మృతి సదా ఉన్నట్లైతే ఏ విషయములోనూ చింత లేక చింతన(వ్యర్థ చింతన) ఉండదు?
జవాబు :-
ఏది గతించిందో - మంచిది గానీ, చెడ్డది గానీ డ్రామాలో ఉండేదే జరిగింది. మొత్తం చక్రమంతా పూర్తి అయ్యి మళ్లీ పునరావృతమౌతుంది. ఎవరు ఎలా పురుషార్థము చేస్తారో అలాంటి పదవిని పొందుతారు. ఈ విషయము స్మృతిలో ఉన్నట్లయితే ఏ విషయములోనూ చింత లేక చింతన జరగదు. తండి ఆదేశము ఏమంటే - పిల్లలూ! గతించిన దానిని గూర్చి చింతించకండి. ఉల్టా - సుల్టా మాటలేవీ వినకండి, వినిపించకండి. గతించిన విషయము గురించి విచారించకండి. రిపీట్ చేయకండి.
ఓంశాంతి.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రిని దాత అని అంటారు. వారు తమకు తాముగానే పిల్లలకు అన్నీ ఇచ్చేస్తారు. వారు విశ్వాధికారులుగా చేసేందుకే వస్తారు. ఎలా అవ్వాలో పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆదేశాలను ఇస్తూ ఉంటారు. వారు దాత కదా. కనుక అన్నీ తమకు తాముగానే ఇస్తూ ఉంటారు. అడుక్కోవడం కంటే మరణించడం ఉత్తమము. ఏ వస్తువునూ అడుక్కోరాదు. శక్తి, ఆశీర్వాదము, కృప మొదలైనవాటిని చాలామంది పిల్లలు అడుగుతూ ఉంటారు. భక్తిమార్గములో వేడుకుంటూ వేడుకుంటూ తల పాడై మెట్లన్నీ క్రిందకు దిగుతూ వచ్చారు. ఇప్పుడు వేడుకునే అవసరము లేదు. ఆదేశానుసారము నడవండని తండ్రి చెప్తున్నారు. ఒకటేమో గతాన్ని ఎప్పుడూ స్మృతించకండి అని చెప్తారు. డ్రామాలో ఏమి జరిగిపోయిందో అది గతించిపోయింది. దానిని గురించి ఆలోచించకండి. రిపీట్ చేయకండి. తండ్రి కేవలం రెండు పదాలే చెప్తారు. ''నన్నొక్కరినే స్మృతి చేయండి(మామేకం యాద్ కరో).'' తండ్రి ఆదేశము లేక శ్రీమతమునిస్తారు. దాని అనుసారంగా నడవడం పిల్లల కర్తవ్యము. ఇది అన్నిటికంటే శ్రేష్ఠమైన ఆదేశము(డైరెక్షన్). ఎవరు ఎన్ని ప్రశ్నలు అడిగినా బాబా రెండు శబ్ధాలే తెలుపుతారు. ''నేను పతిత పావనుడను, నన్ను స్మృతి చేస్తూ ఉంటే, మీ పాపాలు భస్మమైపోతాయి.'' అంతే. స్మృతి కొరకు ఏదైనా ఆదేశము ఇవ్వబడుతుందా! తండ్రిని స్మృతి చేయాలి. ఇందుకు అరిచే పని లేదు. ఆంతరికంగా కేవలం అనంతమైన తండ్రి ఒక్కరినే స్మృతి చేయాలి. రెండవ ఆదేశము ఏమి ఇస్తారు? 84 జన్మల చక్రమును స్మృతి చేయండి. ఎందుకంటే మీరు దేవతలుగా అవ్వాలి. దేవతలను మీరు అర్ధకల్పము మహిమ చేశారు.
(చిన్న పిల్లలు ఏడ్చే ధ్వని వినిపించింది) ఎవ్వరూ పిల్లలను తీసుకు రాకూడదు. ఇప్పుడు ఈ ఆదేశాన్ని అన్ని సేవాకేంద్రాల వారికి ఇవ్వబడ్తుంది. వారికి ఏదైనా ఏర్పాటు చేయాలి. తండ్రి నుండి ఎవరైతే ఆస్తి తీసుకోవాలో వారు తమంతకు తామే ఏర్పాటు చేసుకుంటారు. ఇది ఆత్మిక తండ్రి విశ్వవిద్యాలయము. ఇందులో చిన్న పిల్లల అవసరము లేదు. సర్వీసుకు యోగ్యులుగా ఎప్పుడు తయారౌతారో అప్పుడు వారిని రిఫ్రెష్ చేసేందుకు తీసుకు రావడం బ్రాహ్మణి(టీచరు) పని. ఎంత పెద్ద వ్యక్తి అయినా, చిన్నవారైనా, ఇది విశ్వవిద్యాలయము. ఇక్కడికి పిల్లలను తీసుకుని వచ్చేవారికి ఇది విశ్వవిద్యాలయమని అర్థమై ఉండదు. ముఖ్యమైన విషయము -''ఇది విశ్వవిద్యాలయము''. ఇందులో చదువుకునేవారు చాలా వివేకవంతులుగా ఉండాలి. అపరిపక్వమైనవారు కూడా ఆటంకపరుస్తారు. ఎందుకంటే బాబా స్మృతిలో ఉండరు. కనుక బుద్ధి అటు-ఇటు భ్రమిస్తూ ఉంటుంది. వారు నష్టపరుస్తారు. స్మృతిలో ఉండలేరు. చిన్న పిల్లలను తెచ్చినట్లయితే అందులో వారికే నష్టము. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయమని, ఇక్కడ మనుష్యుల నుండి దేవతలుగా అవ్వవలసి ఉంటుందని కొందరికి తెలియనే తెలియదు. భలే గృహస్థ వ్యవహారములో పిల్లల జతలో ఉండండి, ఇక్కడ కేవలం ఒక వారము లేక 3-4 రోజులైనా చాలు అని బాబా చెప్తున్నారు. జ్ఞానమైతే చాలా సహజము. తండ్రిని గుర్తించాలి. అనంతమైన తండ్రిని గుర్తించడం వలన అనంతమైన వారసత్వము లభిస్తుంది. ఎలాంటి వారసత్వము? అనంతమైన సామ్రాజ్యము. ప్రదర్శిని మరియు మ్యూజియంలలో సేవ జరగదని అనుకోకండి. లెక్కలేనంతమంది ప్రజలు తయారౌతారు. బ్రాహ్మణ కులము, సూర్యవంశము, చంద్రవంశము - ఈ మూడు ఇక్కడే స్థాపన అవుతున్నాయి. అందుకే ఇది చాలా పెద్ద విశ్వవిద్యాలయము. అనంతమైన తండ్రి చదివిస్తున్నారు. ఒక్కసారిగా బుద్ధి పూర్తిగా నిండిపోవాలి. కానీ తండ్రి సాధారణ తనువులో ఉన్నారు. చదువు కూడా సాధారణ రీతిలోనే చదివిస్తారు. కనుక మనుష్యులకు స్ఫురించదు. ఈశ్వరీయ విశ్వవిద్యాలయము ఇలా ఉంటుందా అని అంటారు. నేను పేదలపెన్నిధిని, పేదలనే చదివిస్తానని తండ్రి చెప్తున్నారు. ధనవంతులకు చదువుకునే శక్తి ఉండదు. వారి బుద్ధిలో మహళ్లు, మాడీలే ఉంటాయి. పేదవారే ధనవంతులుగా అవుతారు. ధనవంతులు పేదవారిగా అవుతారు - ఇది నియమము. దానము ఎప్పుడైనా ధనవంతులకు ఇవ్వబడుతుందా? ఇది కూడా అవినాశి జ్ఞాన రత్నాల దానము. ధనవంతులు దానము తీసుకోలేరు. వారి బుద్ధిలో కూర్చోదు. వారు వారి హద్దులోని రచన అయిన ధన-సంపదలలోనే చిక్కుకొని ఉంటారు. వారికైతే ఇక్కడ ఇదే స్వర్గముగా ఉంటుంది. మాకు మరొక స్వర్గము అవసరము లేదని అంటారు. ఎవరైనా గొప్ప వ్యక్తి మరణిస్తే స్వర్గస్థులయ్యారని అంటారు. వారు స్వర్గానికి పోయారని వారంతకు వారే అంటారు. అనగా ఇది తప్పకుండా నరకమే కదా. కానీ ఎంత రాతిబుద్ధి గలవారిగా ఉన్నారంటే నరకము అంటే ఏమిటో కూడా అర్థము చేసుకోరు. ఇది మీ అతిపెద్ద విశ్వవిద్యాలయము. ఎవరి బుద్ధికి తాళము వేయబడి ఉంటుందో వారినే నేను వచ్చి చదివిస్తానని తండ్రి చెప్తారు. తండ్రి ఎప్పుడు వస్తారో అప్పుడే తాళము తెరుస్తారు. తండ్రి స్వయంగా ఆదేశాలిస్తారు. మీ బుద్ధికి వేసిన తాళము ఎలా తెరవబడ్తుంది? తండ్రిని ఏమీ అడగవలసిన పని లేదు. ఇందులో నిశ్చయము ఉండాలి. తండ్రి ఎంత ప్రియాతి ప్రియమైనవారు! వారిని భక్తిలో స్మృతి చేసేవారు. ఎవరు స్మృతించబడ్తారో వారు తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు వస్తారు కదా. మళ్లీ పునరావృతమయ్యేందుకే స్మృతి చేస్తారు. తండ్రి వచ్చి పిల్లలకు మాత్రమే అర్థము చేయిస్తారు. బాబా ఎలా వచ్చి ఉన్నారో వెలుపల ఉన్నవారికి పిల్లలు అర్థం చేయించాలి. వారు వచ్చి ఏం చెప్తారు? ''పిల్లలారా! ఇప్పుడు మీరంతా పతితులుగా ఉన్నారు. నేనే వచ్చి పావనంగా చేస్తాను. పతిత ఆత్మలైన మీరంతా ఇప్పుడు కేవలం పతితపావనుడైన నన్ను స్మృతి చేయండి. సుప్రీమ్ ఆత్మనైన నన్ను స్మృతి చేయండి. ఇందులో ఏమీ అడగవలసిన అవసరము లేదు. మీరు భక్తిమార్గములో అర్ధకల్పము అడుక్కుంటూనే ఉండినారు. కానీ ఏమీ లభించలేదు. ఇప్పుడు అడుక్కోవడము ఆపేయండి. నాకు నేనుగా మీకు ఇస్తూ ఉంటాను. తండ్రి వారిగా అయినందున వారసత్వమైతే తప్పకుండా లభిస్తుంది. ఎవరు పెద్ద పిల్లలుగా ఉంటారో వారు వెంటనే తండ్రిని అర్థము చేసుకుంటారు. తండ్రి వారసత్వమే 21 తరాలకు స్వర్గ సామ్రాజ్యము. ఎప్పుడు నరకవాసులుగా ఉంటారో అప్పుడు ఈశ్వరార్థముగా దాన-పుణ్యాలను చేయడము వలన అల్పకాలానికి సుఖము లభిస్తుందని మీకు తెలుసు. మనుష్యులు దానము చేయడానికి(ధనము, వస్తువులను) ప్రక్కన పెడ్తారు. తరచుగా వ్యాపారస్థులు అలా తీసి పెడ్తారు. మేము తండ్రితో వ్యాపారము చేసేందుకు వచ్చామని చెప్తారు. పిల్లలు తండ్రితో వ్యాపారము చేస్తారు కదా. తండ్రి ఆస్తిని తీసుకుని, దాని ద్వారా శ్రాద్ధము మొదలైనవాటిని తినిపిస్తారు, దాన-పుణ్యాలు చేస్తారు. ధర్మశాలలు, మందిరాలు మొదలైనవి తయారుచేస్తే దాని పై తండ్రి పేరును పెడ్తారు. ఎందుకంటే ఎవరి నుండి వారసత్వము లభిస్తుందో వారి కొరకు తప్పకుండా చేయాలంటే అది కూడా వ్యాపారమైపోయింది. కానీ అవన్నీ శారీరిక విషయాలు. ఇప్పుడు బాబా చెప్తున్నారు - గతించిన దానిని స్మరించకండి. ఉల్టా - సుల్టా మాటలేవీ వినకండి. ఎవరైనా ఉల్టా-సుల్టా ప్రశ్నలు(తల తిక్క ప్రశ్నలు) అడిగితే ఈ విషయాలలోకి పోయే అవసరము లేదని, మీరు మొదట తండ్రిని స్మృతి చేయమని చెప్పండి. భారతదేశపు ప్రాచీన రాజయోగము ప్రసిద్ధమైనది. ఎంతగా స్మృతి చేస్తారో, దైవీగుణాలను ధారణ చేస్తారో, అంత శ్రేష్ఠమైన పదవిని పొందుతారు. ఇది విశ్వ విద్యాలయము. దీని ముఖ్య ఉద్ధేశ్యము స్పష్టంగా ఉంది. పురుషార్థము చేసి ఇలా(లక్ష్మినారాయణులుగా) అవ్వాలి. దైవీగుణాలను ధారణ చేయాలి. ఎవ్వరికీ ఎటువంటి దు:ఖమును ఇవ్వరాదు. మీరు దు:ఖహర్త - సుఖకర్త అయిన తండ్రి పిల్లలు కదా, అది సర్వీసు ద్వారా తెలిసిపోతుంది. చాలామంది కొత్త కొత్త వారు కూడా వస్తారు. 25-30 సంవత్సరాల వారి కంటే 10 -12 రోజుల వారు తీక్షణంగా ముందుకు వెళ్తారు. పిల్లలైన మీరు మళ్లీ తమ సమానంగా తయారు చేయాలి. ఎంతవరకు బ్రాహ్మణులుగా అవ్వరో అంతవరకు దేవతలుగా ఎలా అవుతారు. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మ కదా. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్తారో వారిని మహిమ చేస్తూ ఉంటారు. మళ్లీ వారు తప్పకుండా వస్తారు. ఏవైతే పండుగలు మొదలైనవి గాయనము చేయబడ్తాయో, అవన్నీ ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయాయి. అవి మళ్లీ జరుగుతాయి. ఈ సమయములో రక్షాబంధనము మొదలైన అన్ని పండుగలు జరుగుతున్నాయి. వాటన్నిటి రహస్యాన్ని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు తండ్రి పిల్లలైన కారణంగా పావనంగా తప్పకుండా అవ్వాలి. పతిత పావనుడైన తండ్రిని పిలుస్తారు. కనుక తండ్రి మార్గమును తెలుపుతారు. కల్ప-కల్పము ఎవరు వారసత్వాన్ని తీసుకున్నారో వారు ఖచ్ఛితంగా అలాగే నడుస్తూ ఉంటారు. మీరు కూడా సాక్షిగా ఉండి చూస్తారు. వీరు ఎంతవరకు ఉన్నత పదవిని పొందగలరు? వీరి వ్యక్తిత్వము ఎలాంటిది? అని బాప్దాదా కూడా సాక్షిగా ఉండి చూస్తారు. టీచరుకైతే అన్ని విషయాలు తెలుస్తాయి కదా. ఎంతమందిని తమ సమానంగా తయారు చేశారు, ఎంత సమయము స్మృతిలో ఉన్నారు? ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయమని మొట్టమొదట బుద్ధిలో గుర్తుండాలి. జ్ఞానము కొరకే విశ్వవిద్యాలయము ఉంటుంది. అది హద్దులోని విశ్వవిద్యాలయము. ఇది బేహద్లోనిది. దుర్గతి నుండి సద్గతి, నరకము నుండి స్వర్గము తయారుచేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి దృష్టి అయితే ఆత్మలందరి వైపు వెళ్తుంది. అందరి కళ్యాణము చేయాలి. అందరినీ వాపస్ తీసుకెళ్ళాలి. కేవలం మిమ్ములను మాత్రమే కాదు, పూర్తి విశ్వములోని ఆత్మలందరినీ వారు స్మృతి చేస్తూ ఉంటారు. అందులో పిల్లలనే చదివిస్తారు. నెంబరువారుగా ఎవరు ఎలా వచ్చారో, వారు మళ్లీ అలాగే వెళ్తారు అనునది కూడా మీకు తెలుసు. ఆత్మలందరూ నెంబరువారుగా వస్తారు. మీరు కూడా నెంబరువారుగా ఎలా వెళ్తారో అర్థం చేయించబడ్తుంది. కల్పక్రితము ఏది జరిగిందో అదే జరుగుతుంది. మీరు మళ్లీ ఎలా నూతన ప్రపంచములోకి వస్తారో కూడా మీకు అర్థం చేయించబడ్తుంది. నెంబరువారుగా ఎవరైతే నూతన ప్రపంచములోకి వస్తారో వారికే అర్థం చేయించబడ్తుంది.
పిల్లలైన మీరు తండ్రిని తెలుసుకోవడము వలన మీ ధర్మాన్ని మరియు సర్వ ధర్మాల వృక్షాన్ని పూర్తిగా తెలుసుకుంటారు. ఇందులో ఏమీ అడగవలసిన అవసరము లేదు. ఆశీర్వాదము కూడా అడగరాదు. ''బాబా దయ చూపండి, కృప చూపండి'' అని వ్రాస్తారు. తండ్రి ఏమీ చూపరు. తండ్రి మార్గమును తెలిపేందుకే వచ్చారు. అందరినీ పావనంగా చేయడమే డ్రామాలో నా పాత్ర. ఎలా కల్ప- కల్పము పాత్రను అభినయించానో అలాగే అభినయిస్తాను. మరచి లేక చెడు ఏదైతే గడచిపోయిందో అదంతా డ్రామాలో ఉంది. ఏ విషయమును గురించి కూడా చింత చేయరాదు. మనము ముందుకు వెళ్తూ ఉంటాము. ఇది అనంతమైన డ్రామా కదా. పూర్తి చక్రమంతా సమాప్తమై మళ్లీ పునరావృతమవుతుంది. ఎవరు ఎలాంటి పురుషార్థము చేస్తారో అలాంటి పదవినే పొందుతారు. అడుక్కునే అవసరము లేదు. భక్తిమార్గములో మీరు అపారంగా వేడుకున్నారు. ధనాన్నంతా సమాప్తి చేసేశారు. ఇదంతా డ్రామాలో తయారై ఉంది. వారు కేవలం అర్థం చేయిస్తారు. అర్ధకల్పము భక్తి చేస్తూ, శాస్త్రాలు చదువుతూ ఎంతో ఖర్చు చేశారు. ఇప్పుడు మీరు ఏ ఖర్చు చేయవలసిన అవసరము లేదు. తండ్రి అయితే దాత కదా. దాతకు ఏమీ అవసరము లేదు. వారు వచ్చిందే ఇచ్చేందుకు. మేము శివబాబాకు ఇచ్చామని ఎప్పుడూ అనుకోకండి. అరే! శివబాబా నుండి మీకు చాలా చాలా లభిస్తుంది. ఇక్కడకు మీరు తీసుకునేందుకు వచ్చారు కదా. టీచరు వద్దకు స్టూడెంట్లు తీసుకునేందుకు వస్తారు. ఆ లౌకిక తండ్రి, టీచరు, గురువు ద్వారా మీరు నష్టమునే పొందుతూ వచ్చారు. ఇప్పుడు పిల్లలు శ్రీమతమును అనుసరించాలి. అప్పుడే ఉన్నత పదవిని పొందగలరు. శివబాబా డబల్ శ్రీ శ్రీ. మీరు సంగిల్గా అవుతారు. శ్రీ లక్ష్మి - శ్రీ నారాయణ అని అంటారు. శ్రీ లక్ష్మి - శ్రీ నారాయణ ఇద్దరూ వేరు వేరు. విష్ణువుకు శ్రీ శ్రీ అని చెప్తారు. ఎందుకంటే ఇరువురు సంయుక్తంగా ఉన్నారు. అయినా ఇరువురినీ అలా తయారు చేస్తున్నది ఎవరు? వారు ఒక్కరే శ్రీ శ్రీ. వేరే శ్రీ శ్రీ లు ఎవ్వరూ ఉండరు. వర్తమాన సమయములో శ్రీలక్ష్మీ నారాయణ, శ్రీ సీతారామ అను పేర్లు కూడా ఉంచుకుంటారు. కనుక పిల్లలు ఇదంతా ధారణ చేసి సంతోషంగా ఉండాలి.
వర్తమాన సమయములో ఆధ్యాత్మిక సమ్మేళనాలు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ స్పిరిచువల్ అను పదాన్ని అర్థము చేసుకోరు. ఆత్మిక జ్ఞానము ఒక్కరు తప్ప వేరెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి సర్వాత్మల తండ్రి. వారిని స్పిరిచువల్ అని అంటారు. వేదాంతాన్ని కూడా స్పిరిచువల్(ఆధ్యాత్మికత) అని అంటారు. ఇది అడవి. అందరూ ఒకరికొకరు దు:ఖాన్నిచ్చుకుంటూ ఉంటారని మీకు తెలుసు. అహింసయే పరమ దేవీ దేవతా ధర్మము అని గాయనము చేయబడిందని మీకు తెలుసు. అక్కడ ఎలాంటి గొడవలు, దెబ్బలాటలు ఉండవు. కోపము చేసుకోవడము కూడా హింసయే. సెమీ హింస (అర్ధ హింస) అని అనండి, ఏమైనా అనండి. ఇక్కడ పూర్తి అహింసకులుగా అవ్వాలి. మనసా-వాచా-కర్మణా ఏ చెడు విషయాలు జరగరాదు. కొందరు పోలీస్ మొదలైన వాటిలో పని చేస్తూ ఉంటారు. కనుక అందులో కూడా యుక్తితో పని చేయాలి. ఎంత సాధ్యమైతే అంత ప్రీతిగా పని చేయించాలి. బాబాకు స్వంత అనుభవముంది. ప్రీతిగా తన పని చేయించుకుంటారు. ఇందులో చాలా యుక్తి కావాలి. ఒకటికి వంద రెట్ల శిక్ష ఎలా పడ్తుందో వారికి చాలా ప్రీతిగా తెలియచేయాలి. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మనము దు:ఖహర్త - సుఖకర్త అయిన తండ్రి పిల్లలము. కనుక ఎవ్వరికీ దు:ఖమివ్వరాదు. ముఖ్య లక్ష్యమును ముందు ఉంచుకొని దైవీగుణాలను ధారణ చేయాలి. తమ సమానంగా తయారు చేసే సేవ చేయాలి.
2. డ్రామాలోని ప్రతి పాత్రను తెలుసుకొని గతించిన ఏ విషయము గురించి చింతించరాదు. మనసా, వాచా, కర్మణా ఎటువంటి చెడు కర్మ జరగరాదు - దీని పై గమనముంచి డబల్ అహింసకులుగా అవ్వాలి.
వరదానము :-
''నాలుగు సబ్జెక్టులలో తండ్రికి ఇష్టమైన (దిల్పసంద్) మార్కులు తీసుకునే దిల్తక్త్ నశీన్ భవ (హృదయ సింహాసనాధికారులుగా అవ్వండి).''
ఏ పిల్లలైతే నాలుగు సబ్జెక్టులలో మంచి మార్కులు తీసుకుంటారో, ఆది నుండి అంతము వరకు మంచి నంబర్లో పాస్ అవుతారో వారినే పాస్ విత్ ఆనర్ అని అంటారు. మధ్యమధ్యలో మార్కులు తక్కువైతూ మళ్లీ మేకప్ చేసుకుంటూ కాదు, అన్ని సబ్జెక్టులలో తండ్రికి ఇష్టమైన వారే (దిల్ పసంద్ అయిన వారే) దిల్తక్త్ నశీన్ అనగా తండ్రి హృదయ సింహాసనాధికారులుగా అవుతారు.
స్లోగన్ :-
''ఎవరి హృదయంలో (దిల్ లో) సదా '' నేను తండ్రి వాడిని, తండ్రి నా వాడు'' అనే పాట స్వతహాగా మోగుతూ ఉంటుందో వారే ప్రియమైన వారు (దిల్రూబా).''