14-03-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - తండ్రి మరియు దాదా ఇరువురూ ఎలా నిరహంకారులో, నిష్కామ సేవ చేస్తున్నారో, ఎలాంటి స్వ లాభము వారికి లేదో, అలా పిల్లలైన మీరు కూడా తండ్రి సమానంగా అవ్వండి ''

ప్రశ్న :-

పేదలపెన్నిధి అయిన తండ్రి పేద పిల్లల భాగ్యమును ఏ ఆధారముతో ఉన్నతంగా చేస్తారు?

జవాబు :-

తండ్రి అంటున్నారు - పిల్లలూ, గృహస్థములో ఉంటూ సర్వమూ సంభాళన చేస్తూ సదా బుద్ధి ద్వారా ఇదంతా బాబాదే అని భావించండి. నిమిత్తము(ట్రస్టీ)గా ఉంటే భాగ్యము ఉన్నతంగా తయారవుతుంది. ఇందులో చాలా సత్యంగా ఉండాలి. పూర్తి నిశ్చయముంటే యజ్ఞము ద్వారా పాలన జరిగినట్లు జరుగుతుంది. ఇంటిలో ట్రస్టీగా ఉండి శివబాబా భండారము నుండి భుజిస్తారు. బాబా వద్ద అంతా తెలుపవలసి వస్తుంది.

ఓంశాంతి.

భక్తిమార్గములోని సత్సంగాల కంటే ఈ జ్ఞానమార్గములోని సత్సంగము చాలా విచిత్రమైనది. భక్తిని గురించి మీకు అనుభవముంది. అనేకమంది సాధు-సత్పురుషులు భక్తిమార్గములోని శాస్త్ర్రాలు మొదలైనవి వినిపిస్తారని మీకు తెలుసు. కానీ ఇచ్చట వాటన్నిటికంటే పూర్తి వేరుగా ఉంటుంది. ఇచ్చట మీరు ఎవరి ముందు కూర్చున్నారు? డబల్‌ తల్లి మరియు తండ్రి. అచ్చట ఇలా ఉండదు. ఇచ్చట అనంతమైన తండ్రి, మమ్మా, చిన్న మమ్మా కూడా ఉన్నారని మీకు తెలుసు. ఇచ్చట ఇన్ని సంబంధాలు ఉంటాయి. అచ్చట ఇటువంటి సంబంధాలు ఉండవు. వారు అనుచరులు(శిష్యులు) కూడా కారు. వారేమో నివృత్తిమార్గానికి చెందినవారు. వారి ధర్మము వేరు, మీ ధర్మము వేరు. వారికి, మీకు రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. లౌకిక తండ్రి నుండి అల్పకాల క్షణభంగుర సుఖము ఒక్క జన్మకు మాత్రమే లభిస్తుందని మీకు కూడా తెలుసు. తర్వాత నూతన తండ్రి, నూతన విషయాలు. ఇచ్చట లౌకిక తండ్రి కూడా ఉన్నారు, పారలౌకిక తండ్రి కూడా ఉన్నారు. అంతేకాక అలౌకిక తండ్రి కూడా ఉన్నారు. లౌకికము నుండి కూడా వారసత్వము లభిస్తుంది, పారలౌకికము నుండి కూడా వారసత్వము లభిస్తుంది. అలౌకిక తండ్రి అద్భుతమైనవారు. వీరి నుండి ఏ వారసత్వము లభించదు కానీ వీరి ద్వారా శివబాబా వారసత్వమునిస్తారు. అందుకే ఆ పారలౌకిక తండ్రిని స్మృతి చాలా చేస్తారు. లౌకిక తండ్రిని కూడా స్మృతి చేస్తారు. ఈ అలౌకిక బ్రహ్మబాబాను ఎవరూ స్మృతి చేయరు. ఇతను ప్రజాపిత అని మీకు తెలుసు. ఏ ఒక్కరికో తండ్రి కాదు. ప్రజాపిత అనగా గ్రేట్ గ్రేట్ గాండ్‌ఫాదర్. శివబాబాను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అనరు. లౌకిక సంబంధములో లౌకిక తండి, తాత ఉంటారు. వీరు గేట్ర్‌ గేట్ర్‌ గాండ్‌ఫాదర్‌. ఈ విధముగా లౌకికమును గాని, పారలౌకికమును గాని పిలువము. ఇప్పుడు ఇటువంటి గేట్ర్‌ గేట్ర్‌ గాండ్‌ఫాదర్‌ ద్వారా వారసత్వము లభించదు. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. భక్తిమార్గములోని విషయాలు చాలా భిన్నంగా ఉంటాయి. డ్రామాలో ఆ పాత్ర కూడా ఉంది. అది మళ్లీ నడుస్తూనే ఉంటుంది. మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారో తండ్రి తెలిపిస్తున్నారు. 84 లక్షల జన్మలు తీసుకోరు. తండి వచ్చి పూర్తి పప్రంచాన్ని మరియు మనలను ధర్మ యుక్తముగా తయారు చేస్తున్నారు. ఈ సమయములో ఎవరూ ధర్మాత్మలుగా అవ్వరు. పుణ్యాత్మల ప్రపంచమే వేరుగా ఉంటుంది. ఎక్కడ పాపాత్మలుంటారో, అక్కడ పుణ్యాత్మలు ఉండరు. ఇక్కడ పాపాత్మలు పాపాత్మలకే దాన-పుణ్యాలు చేస్తారు. పుణ్యాత్మల ప్రపంచములో దాన-పుణ్యాలు మొదలైనవి చేసే అవసరమే ఉండదు. అక్కడ ఈ జ్ఞానముండదు అనగా మనము సంగమ యుగములో 21 జన్మల వారసత్వము తీసుకున్నామనే విషయము కూడా తెలియదు. ఈ జ్ఞానము ఇక్కడ మాత్రమే అనంతమైన తండ్రి ద్వారా మీకు మాత్రమే లభిస్తుంది. దీని ద్వారా 21 జన్మలకు సదా సుఖము, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము సర్వమూ లభిస్తాయి. అక్కడ మీ ఆయువు ఎక్కువగా ఉంటుంది. దాని పేరే అమరపురము. శంకరుడు పార్వతికి కథ వినిపించారని అంటారు. సూక్ష్మవతనములో ఈ విషయాలే ఉండవు. అలా అనుకున్నా అమరకథను ఒక్కరికి మాత్రమే వినిపించరు. ఇవి భక్తిమార్గములోని విషయాలు. ఇంకా వాటినే పట్టుకొని ఉన్నారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అనడం అన్నిటికంటే పెద్ద తప్పు. ఇది వారిని అవమానపరచినట్లు అవుతుంది. విశ్వాధికారులుగా తయారుచేసే అనంతమైన తండ్రిని సర్వవ్యాపి అనడం, రాయి-రప్పలలో, కణ కణములో ఉన్నారని అంటారు. స్వయం కంటే ఎక్కువగా గ్లాని చేసేశారు. నేను మీకు ఎంతో నిష్కామ సేవ చేస్తాను. నంబర్‌వన్‌ కావాలనే లోభము నాకు ఏ మాత్రము లేదు. ఇతరులను తయారుచేయాలనే లోభము ఉంది. దీనినే నిష్కామ సేవ అని అంటారు.

నేను పిల్లలైన మీకు నమస్కరిస్తున్నాను. బాబా నిరాకారులు, ఎంతో నిరహంకారి. వారికి ఎలాంటి అహంకారము లేదు. దుస్తులు కూడా అవే దుస్తులు, ఏ మార్పూ లేదు. వారు మొత్తం దుస్తులన్నీ మార్చుకుంటారు. వీరిది అప్పటికీ, ఇప్పటికీ ఒకే సాధారణ డ్రస్సు. ఆఫీసర్లు కూడా డ్రస్సు మార్చుకుంటారు. వీరిది మాత్రము ఎప్పటికీ ఒకే సాధారణమైన డ్రస్సు. ఏ తేడా లేదు, ఏ మార్పూ లేదు. తండ్రి కూడా నేను సాధారణ శరీరము తీసుకుంటానని అంటున్నారు. అది కూడా ఎటువంటిది? స్వయం తన జన్మల గురించి తెలియనివారి శరీరములో, ఎన్ని పునర్జన్మలు తీసుకున్నాడో తెలియనివారి శరీరములో వస్తాను. వారేమో 84 లక్షలని అంటారు. ఇవి ఎవరో విని వినిపించిన మాటలు. దీని వలన ఏ లాభమూ లేదు. ఇటువంటి కర్మలు చేస్తే గాడిద, కుక్కలుగా పుడతారని భయపెడ్తారు. ఆవు తోకను పట్టుకుంటే దాటుకుంటారని అంటారు. ఆవు ఎక్కడి నుండి వచ్చింది? స్వర్గములోని ఆవులు చాలా భిన్నంగా, ఫస్ట్‌క్లాస్‌గా ఉంటాయి. ఎలాగైతే మీరు నూరు శాతము సంపూర్ణంగా ఉంటారో ఆవులు కూడా అలాగే ఫస్ట్‌క్లాస్‌గా ఉంటాయి. కృష్ణుడు ఏ ఆవులను మేపడు. ఆయనకేం పట్టింది? అక్కడి అందమును చూపిస్తారు అంతేకాని కృష్ణుడు ఆవులను పాలన-పోషణ చేయలేదు. కృష్ణుని గొల్లపిల్లవానిగా చేసేశారు. సర్వగుణ సంపన్నులైన సత్యయుగములోని మొట్టమొదటి రాకుమారుడెక్కడ, గొల్లవాడెక్కడ? ఏ మాత్రము అర్థము చేసుకోరు. ఎందుకంటే దేవతా ధర్మము ఇప్పుడు లేనే లేదు. ఈ ఒక్క ధర్మము మాత్రమే లోపించిపోతుంది. ఈ విషయాలేవీ శాస్త్రాలలో లేవు. ఈ జ్ఞానము పిల్లలైన మీకు నేను మాత్రమే విశ్వాధికారులుగా తయారుచేసేందుకు ఇస్తున్నాను. అధికారులుగా తయారైతే ఇక జ్ఞానము అవసరముండదు. సదా అజ్ఞానులకు మాత్రమే జ్ఞానము ఇవ్వబడ్తుంది. జ్ఞాన సూర్యుడు ఉదయించిన వెంటనే అజ్ఞాన అంధకారము వినాశనము............. అనే మహిమ కూడా ఉంది. ఇప్పుడు ప్రపంచమంతా అంధకారములో ఉందని పిల్లలకు తెలుసు. లెక్కలేనన్ని సత్సంగాలున్నాయి. ఇది భక్తి మార్గము కాదు. ఇది సద్గతి మార్గము. ఒక్క తండ్రి మాత్రమే సద్గతినిస్తారు. మీరు భక్తిమార్గములో నన్ను - '' మీరు వస్తే మేము మీ వారిగా అయిపోతాము. మీ కంటే మరెవ్వరూ లేరు. ఎందుకంటే మీరే జ్ఞాన సాగరులు, సుఖ సాగరులు, పవిత్రతా సాగరులు, సంపదల సాగరులు'' అని పిలిచారు. సంపద కూడా ఇస్తారు కదా. ఎంతో గొప్ప ధనవంతులుగా చేసేస్తారు. మనము శివబాబా నుండి 21 జన్మలకు జోలెను నింపుకునేందుకు వచ్చామని, అనగా నరుని నుండి నారాయణునిగా అవుతామని మీకు తెలుసు. భక్తిమార్గములో అనేక కథలు విన్నారు. మెట్లు(సీడీ) క్రిందికి దిగుతూనే వచ్చారు. ఒక్కరు కూడా ఉన్నతము కాలేదు. కల్పము యొక్క ఆయువును కూడా ఎంతో ఎక్కువగా చేసేశారు. డ్రామా గడువు లక్షల సంవత్సరాలని అనేస్తారు. ఇప్పుడు కల్పమంతా కలిసి 5 వేల సంవత్సరాలేనని మీకు తెలిసిపోయింది. ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు, తక్కువలో తక్కువ ఒక జన్మ. చివర్లో వస్తూ ఉంటారు. ఇది నిరాకార వృక్షము కదా. మళ్లీ పాత్రాభినయము చేసేందుకు నంబరువారుగా వస్తారు. వాస్తవానికి మనము నిరాకార వృక్షానికి చెందినవారము. మళ్లీ అక్కడ నుండి ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తాము. అక్కడ అందరూ పవిత్రంగా ఉంటారు. కానీ అందరి పాత్రలు వేరు వేరుగా ఉంటాయి. ఇది బుద్ధిలో ఉంచుకోండి. వృక్షాన్ని కూడా బుద్ధిలో ఉంచుకోండి. సత్యయుగము నుండి కలియుగాంతము వరకు జరుగు విషయాలను తండ్రి ఒక్కరు మాత్రమే తెలిపిస్తారు. మానవ మాత్రులెవ్వరూ తెలుపలేరు. ఈ దాదా కూడా తెలుపలేరు. సర్వులకు సద్గతి ఇవ్వగలిగిన వారు ఒక్క సద్గురువు మాత్రమే. మిగిలిన గురువులందరూ భక్తిమార్గానికి చెందినవారు. ఎన్నో కర్మకాండలు చేస్తూ ఉంటారు. భక్తిమార్గపు ఆడంబరము ఎంత ఎక్కువగా ఉంది. ఇదంతా మృగతృష్ణ వంటిది. ఇందులో వెలుపలికి రాలేనంతగా చిక్కుకొనిపోయారు. ఎవరైనా బయటకు తీయాలని ప్రయత్నిస్తే వారే చిక్కుకునిపోతారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. కొత్త విషయము కాదు. సెకండు సెకండు ఏదైతే గడిచిపోతుందో అదంతా తయారైన డ్రామా. మనము బేహద్‌ తండ్రి నుండి రాజయోగము నేర్చుకొని నరుని నుండి నారాయణునిగా, విశ్వాధికారులుగా అవుతున్నామని మీకు తెలుసు. ఈ నషా పిల్లలైన మీకు ఈ నషా ఉండాలి. బేహద్‌ తండి 5 వేల సంవత్సరాలకు ఒకొక్కసారి భారతదేశములోనే వస్తారు. వారు శాంతి సాగరులు, సుఖ సాగరులు. ఈ మహిమ ఒక్క పారలౌకిక తండ్రికి మాత్రమే ఉంది. తండ్రికి గల ఈ మహిమ చాలా సరైనది. సర్వస్వము ఒక్కరి ద్వారానే లభిస్తుంది. వారు ఒక్కరు మాత్రమే దు:ఖహర్త, సుఖకర్త. అటువంటి వారి ముందు మీరిప్పుడు కూర్చొని ఉన్నారు.

మీరు మీ సెంటర్లో కూర్చున్నప్పుడు యోగము ఎక్కడ జోడిస్తారు. శివబాబా మధువనములో ఉన్నారని బుద్ధిలోకి వస్తుంది. వారినే గుర్తు చేసుకుంటారు. శివబాబా స్వయంగా చెప్తున్నారు - నేను భారతదేశాన్ని మళ్లీ స్వర్గంగా మార్చేందుకు సాధారణ వృద్ధ శరీరములో ప్రవేశించాను. నేను డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నాను. మీరు నన్ను ఎంతో గ్లాని చేశారు. నేను మిమ్ములను పూజ్యనీయులుగా చేస్తాను. ఇది నిన్న జరిగిన విషయమే. మీరు ఎన్నో పూజలు చేసేవారు. మీకు నేను మీ రాజ్యభాగ్యమును ఇచ్చాను. అదంతా మీరు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ మిమ్ములను విశ్వాధికారులుగా చేస్తాను. ఇది ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. మీరు దైవీగుణాలు గల దేవతలు. దేవతలు కూడా మనుష్యులే, అంతేకాని 80-100 అడుగుల పొడవు ఉండరు. వారి ఆయువు పెద్దది. కావున పైకప్పంత పొడవుంటారని అనుకోరాదు. కలియుగములో మీ ఆయువు తగ్గిపోతుంది. తండ్రి వచ్చి మీ ఆయువును పెంచుతారు. కావున ఎప్పుడూ జబ్బులు రాకుండా ఉండే యుక్తిని చెప్తామని ఆరోగ్యమంత్రికి కూడా అర్థం చేయించమని తండ్రి చెప్తున్నారు. వారికి చెప్పండి. భగవానువాచ - స్వయాన్ని ఆత్మ అని భావించి నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీరు పతితుల నుండి పావనమై సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. నేను గ్యారంటీ ఇస్తున్నాను. యోగులు పవిత్రంగా ఉంటారు. కావున వారి ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు రాజయోగులు, రాజఋషులు. ఆ సన్యాసులు ఎప్పుడూ రాజయోగమును నేర్పించలేరు. గంగా నది పతితపావని అని అక్కడ దానము చేయండని వారు చెప్తారు. ఇప్పుడు మీరు గంగా నదిలో దానమివ్వరు. మానవులు నాణెములు అందులో వేస్తారు. పండితులు వాటిని తీసుకుంటారు. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా పవిత్రంగా అవుతున్నారు. తండ్రికి ఏమిస్తున్నారు? ఏమీ ఇవ్వరు. తండ్రి స్వయం దాత. మీరు భక్తిమార్గంలో ఈశ్వరార్పణంగా పేదలకు దానము చేస్తారు అనగా పతితులకు ఇస్తారు. మీరూ పతితులే. తీసుకునేవారు కూడా పతితులే. ఇప్పుడు మీరు పావనంగా అవుతారు. వారు పతితులు పతితులకే దానము చేస్తారు. పవిత్రంగా ఉండే కుమారీలకు దానము చేస్తారు, నమస్కరిస్తారు, తినిపిస్తారు, దక్షిణ కూడా ఇస్తారు. వివాహమైన తర్వాత కుమారీలు సర్వ నాశనమైపోతారు. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. మళ్లీ ఇదే విధంగా పునరావృతమవుతుంది. భక్తిమార్గానికి కూడా పాత్ర ఉంది. సత్యయుగములోని సమాచారము కూడా తండ్రి తెలిపిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానము లభించింది. మొదట మీరు తెలివిహీనులుగా ఉండేవారు. శాస్త్రాలలో భక్తిమార్గములోని విషయాలున్నాయి. వాటి ద్వారా నన్ను ఎవ్వరూ పొందలేరు. నేను వచ్చినప్పుడే మీకందరికీ సద్గతినిస్తాను. నేను ఒక్కసారి మాత్రమే వచ్చి పాతదానిని, కొత్తదిగా తయారుచేస్తాను. నేను పేదల పెన్నిధిని. పేదలను ధనవంతులుగా చేస్తాను. పేదవారు వెంటనే బాబావారిగా అవుతారు. బాబా, మేము కూడా మీవారమే అని అంటారు. ఇదంతా మీదేనని అంటారు. తండి అంటున్నారు - టస్ట్రీలుగా ఉండండి. ఇది మాది కాదు, తండ్రిది అని బుద్ధి ద్వారా భావించండి. ఇందులో చాలా వివేకవంతులుగా ఉండాలి. మీరు మీ ఇంటిలో భోజనము తయారుచేసుకొని భోంచేసినా యజ్ఞము నుండే భుజిస్తారు. ఎందుకంటే మీరు బుద్ధి ద్వారా సర్వమూ ఇచ్చేశారు. మీరు కూడా యజ్ఞములోని వారిగా అయ్యారు. సర్వమూ యజ్ఞముదైపోయింది. ఇంట్లో కూడా టస్ట్రీలుగా ఉంటే శివబాబా భండారము నుండి భుజిస్తారు. అయితే దీని కొరకు సంపూర్ణ నిశ్చయము అవసరము. నిశ్చయములో కొంచెము గడబిడ అయినా.......... హరిశ్చంద్రుని ఉదాహరణ ఇస్తారు. బాబాకు అంతా తెలపాలి. నేను పేదల పెన్నిధిని.

పాట:- చివరకు ఆ రోజు ఇప్పుడు వచ్చేసింది........... ( ఆఖిర్‌ వహ్‌ దిన్‌ ఆయా ఆజ్‌...........)

అర్ధకల్పము భక్తిలో స్మృతి చేస్తూ వచ్చారు. చివరికి ఇప్పుడు లభించారు. సత్యయుగము తప్పకుండా వస్తుంది. మధ్యలో సంగమ యుగముంది. అందులో మీరు అత్యుత్తమ పురుషులుగా అవుతారు. మీరు పవిత్ర ప్రవృత్తి మార్గములో ఉండేవారు. 84 జన్మల తర్వాత అపవిత్రంగా అయ్యారు. మళ్లీ పవిత్రంగా అవ్వాలి. కల్పక్రితము కూడా మీరు ఇలాగే అయ్యారు. కల్పక్రితము ఎవరు ఎంత పురుషార్థము చేశారో, మళ్లీ వారే అంతే చేస్తారు. తమ వారసత్వము తీసుకుంటారు. సాక్షిగా ఉండి చూస్తూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు - మీరు సందేశకులు. ఇతరులెవ్వరూ మెసెంజర్లు(దూతలు) గానీ, పైగంబర్లు(సందేశకులు) గానీ ఉండరు. సద్గతినిచ్చే సద్గురువు ఒక్కరు మాత్రమే. ఇతర ధర్మనేతలు ధర్మస్థాపన చేసేందుకు వస్తారు. వారు గురువు ఎలా అవుతారు. నేను అందరికీ సద్గతినిస్తాను. అచ్ఛా.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శాంతి, సుఖము - సంపదల సాగరులైన తండ్రి మాకు లభించారు, మాకు సర్వమూ ఒక్కరి ద్వారానే లభిస్తాయి, అటువంటి తండ్రి ఎదుట మేము కూర్చుని ఉన్నాము, వారు మమ్ములను చదివిస్తున్నారనే నషాలో సదా ఉండాలి.

2. అహంకారమును వదిలి తండ్రి సమానము నిష్కామ సేవ చేయాలి, నిరహంకారులుగా ఉండాలి. సందేశకులై అందరికీ సందేశమునివ్వాలి.

వరదానము :-

''అకాలతక్త్‌ మరియు దిల్‌తక్త్‌ (హృదయ సింహాసనం) పై కూర్చుని సదా శ్రేష్ఠమైన కర్మలు చేసే కర్మయోగీ భవ ''

ఈ సమయంలో పిల్లలైన మీ అందరికీ రెండు సింహాసనాలు లభిస్తాయి. ఒకటి - అకాల సింహాసనము(భృకుటి సింహాసనము), రెండవది - హృదయ సింహాసనము. కానీ ఎవరికి రాజ్యముంటుందో, వారే సింహాసనం పై కూర్చుంటారు. ఎప్పుడైతే అకాల సింహాసనాధికారులుగా ఉంటారో, అప్పుడు వారు స్వరాజ్య అధికారులుగా ఉంటారు, అంతేకాక తండ్రి హృదయ సింహాసనాధికారులుగా కూడా ఉంటారు. కనుక వారు తండ్రి వారసత్వాలకు అధికారులుగా ఉంటారు. అందులో రాజ్య భాగ్యమంతా వచ్చేస్తుంది. కర్మయోగులనగా రెండు సింహాసనాధికారులు. ఇటువంటి సింహాసనాధికారి ఆత్మల ప్రతి కర్మ శ్రేష్ఠంగా ఉంటుంది. ఎందుకంటే వారి కర్మేంద్రియాలన్నీ లా అండ్‌ ఆర్డర్‌లో (నియమానుసారము) ఉంటాయి.

స్లోగన్‌ :-

''ఎవరైతే సదా స్వమానమనే సీటు పై సెట్‌ అయ్యి ఉంటారో, వారే గుణవంతులు మరియు మహోన్నతులు ''