02-02-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - విదేహులుగా అయ్యి తండ్రిని స్మృతి చేయండి, స్వధర్మములో స్థితమైతే శక్తి లభిస్తుంది. సంతోషము మరియు ఆరోగ్యము ఉంటాయి, (ఆత్మ రూపీ) బ్యాటరీ నిండుతూ ఉంటుంది ''
ప్రశ్న :-
డ్రామాలో ఏ నిశ్చితాన్ని తెలుసుకున్న కారణంగా పిల్లలైన మీరు సదా అచలంగా ఉంటారు?
జవాబు :-
వినాశనము కొరకు ఈ బాంబులు మొదలైనవి ఏవైతే తయారై ఉన్నాయో అవన్నీ తప్పకుండా పేలవలసిందే అని మీకు తెలుసు. వినాశనము జరిగినప్పుడే మన నూతన ప్రపంచము వస్తుంది. ఇది డ్రామాలో అనాదిగా నిశ్చితమై ఉంది. అందరూ మరణించవలసిందే. మేము ఈ పురాతన శరీరాలను వదిలి నూతన రాజ్యములో జన్మ తీసుకుంటామని మీకు సంతోషముంటుంది. మీరు నాటకాన్ని సాక్షిగా ఉండి చూస్తారు. ఇందులో చలించవలసిన విషయమూ లేదు, ఏడ్వవలసిన అవసరమూ ఏదీ లేదు.
ఓంశాంతి.
తండ్రి కూర్చొని పిల్లలకు వివరిస్తున్నారు - ఏదైతే ఆది సనాతన దేవీ దేవతా ధర్మముండేదో దానిని హిందూ ధర్మములోకి ఎందుకు తీసుకొచ్చారు? అందుకు కారణాన్ని వెలికి తీయాలి. మొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే ఉండేది. వికారులుగా అయినప్పుడు స్వయాన్ని దేవతలమని చెప్పుకోలేరు కనుక స్వయాన్ని ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి బదులు ఆదిసనాతన హిందువులు అని చెప్పుకున్నారు. '' ఆది సనాతన '' అనే పదాన్ని కూడా ఉంచారు. కేవలం '' దేవతలు '' అనే పదాన్ని మార్చి '' హిందువులు '' అని ఉంచుకున్నారు. ఆ సమయములో ఇస్లామ్వారు భారతదేశములో ప్రవేశించినప్పుడు బయట నుండి వచ్చిన ఆ ఇస్లామ్ వారు హిందూ ధర్మము అనే పేరును ఉంచేశారు. మొదట హిందూస్తాన్ అనే పేరు కూడా లేదు. అందువల్ల ఆదిసనాతన హిందువులు దేవతా ధర్మము వారేనని భావించాలి. వారు ఎక్కువగా ధర్మాత్మలుగానే ఉంటారు. అందరూ సనాతనులు కారు. తర్వాత వచ్చిన వారిని ఆదిసనాతనులు అని అనరు. హిందువులలో కూడా వెనుకగా వచ్చేవారుంటారు. ఆదిసనాతన హిందువులకు - మనది ఆది సనాతన దేవీ దేవతా ధర్మముగా ఉండేదని చెప్పాలి. మీరే సతోప్రధాన ఆదిసనాతనులుగా ఉండేవారు తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తమోప్రధానులుగా అయ్యారు. ఇప్పుడు మళ్లీ స్మృతియాత్ర ద్వారా సతోప్రధానంగా అవ్వండి అని వారికి చెప్పాలి. వారికి ఈ ఔషధము(ఇలా వివరించిన విధానము) బాగా నచ్చుతుంది. బాబా సర్జన్ కదా, ఎవరికి ఈ ఔషధము మంచిగా అనిపిస్తుందో వారికే ఇవ్వాలి. ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు ఎవరైతే ఉండేవారో వారికే మళ్లీ స్మృతిని కలుగజేయాలి. పిల్లలైన మీకు కూడా ఇప్పుడు స్మృతి కలిగింది. ''మీరు సతోప్రధానము నుండి ఎలా తమోప్రధానంగా అయ్యారో బాబా అర్థం చేయించారు. ఇప్పుడు మళ్లీ తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వాలి.'' పిల్లలైన మీరు స్మృతియాత్ర ద్వారా సతోప్రధానంగా అవుతున్నారు. ఆది సనాతన హిందువులైన వారే వాస్తవానికి దేవీ దేవతలుగా ఉంటారు అంతేకాక దేవతలను పూజించేవారుగా కూడా వారే అవుతారు. అందులో కూడా ఎవరైతే శివుని భక్తులు లేక లక్ష్మీ నారాయణుల లేదా రాధా - కృష్ణుల లేదా సీతా-రాముల......... మొదలైన దేవతల భక్తులుగా ఉంటారో వారు దేవతా కులానికి చెందినవారు. ఎవరైతే సూర్య వంశీయులుగా ఉంటారో వారే చంద్ర వంశస్థులుగా అవుతామని మీకు ఇప్పుడు స్మృతి కలిగింది. అందువల్ల అటువంటి భక్తులను వెతకాలి. ఎవరు తెలుసుకునేందుకు వస్తారో, వారిచే ఫారమ్ను నింపించాలి. ముఖ్య సేవాకేంద్రాలలోనైనా తప్పకుండా ఫారమ్ను నింపించే విధానముండాలి. ఎవరు వచ్చినా వారికి పాఠము(లెసన్) ప్రారంభము నుండే తెలియజేస్తారు. మొదటి ముఖ్య విషయము, తండ్రిని గురించి తెలియనివారికి మీకు మీ పెద్ద తండ్రిని గురించి తెలియదు. మీరు వాస్తవానికి పారలౌకిక తండ్రికి చెందినవారు. ఇక్కడికి వచ్చి లౌకిక తండ్రికి చెందినవారిగా అయ్యారు. మీరు మీ పారలౌకిక తండ్రిని మర్చిపోయారు. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత అక్కడ ఈ అనేక ధర్మాలుండవు అని వారికి అర్థం చేయించాలి. కనుక ఏ ఫారమ్ను నింపుతారో దాని ఆధారంగానే తెలియజేయు విధానమంతా ఆధారపడి ఉండాలి. కొంతమంది పిల్లలు బాగా అర్థము చేయిస్తారు కాని యోగము ఉండదు. అశరీరులుగా అయ్యి తండ్రిని స్మృతి చేయడం లేదు. యోగములో నిలువలేరు. మేము బాగా అర్థం చేయిస్తామని భావిస్తారు. మ్యూజియమ్ మొదలైనవి కూడా తెరుస్తారు కాని యోగము చాలా తక్కువగా ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉండడంలోనే శ్రమ ఉంది. తండ్రి వార్నింగ్ ఇస్తున్నారు - మేము చాలా బాగా అర్థము చేయించి ఒప్పించగలమని భావించకండి. అయితే దీని వలన లాభమేమిటి? భలే స్వదర్శన చక్రధారులుగా అయ్యారు అయితే ఇందులో విదేహులుగా అవ్వాలి. కర్మ చేస్తున్నా స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మ ఈ శరీరము ద్వారా కర్తవ్యము చేస్తుంది - దీనిని స్మృతి చేయడం కూడా రాదు. అలాంటివారిని తెలివిహీనులని అంటారు. తండ్రిని స్మృతియే చేయలేరు. సేవ చేసే శక్తి వారి వద్ద లేదు. స్మృతి లేకుండా ఆత్మలో శక్తి ఎక్కడ నుండి వస్తుంది? ఆత్మ బ్యాటరీ ఎలా నిండుతుంది? నడుస్తూ - నడుస్తూ నిలిచిపోతారు, శక్తి ఉండదు.
ధర్మమే శక్తి అని అంటారు. ఆత్మ తన స్మధర్మములో నిలిచినప్పుడే శక్తి లభిస్తుంది. చాలా మందికి తండ్రిని స్మృతి చేయడం రాదు. ముఖము చూస్తూనే తెలిసిపోతుంది. మిగిలిన విషయాలన్నీ గుర్తొస్తాయి కాని బాబా స్మృతి నిలవనే నిలువదు. యోగము ద్వారానే బలము లభిస్తుంది. స్మృతి ద్వారానే చాలా ఆనందము మరియు ఆరోగ్యము కలుగుతాయి. మళ్లీ మరో జన్మలో కూడా అలాంటి తేజోవంతమైన శరీరమే లభిస్తుంది. ఆత్మ పవిత్రంగా ఉన్నట్లైతే శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది. 24 క్యారెట్ల బంగారమైతే నగ కూడా 24 క్యారెట్లదే ఉంటుందని అంటారు. కాని ఈ సమయములో అందరూ 9 క్యారెట్లుగా అయిపోయారు. సతోప్రధానులను 24 క్యారెట్లు అని అంటారు. సతో సమాన్యాన్ని (త్రేతా యుగము) 22 క్యారెట్లు అని అంటారు. ఇవన్నీ బాగా అర్థము చేసుకోవలసిన విషయాలు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మొదట క్రొత్తగా వచ్చిన వారితో ఫారమ్ నింపించాలి. అప్పుడే వారు ఎక్కడి వారు ఎక్కడి వరకు జవాబు చెప్పగలరో, ఎంతవరకు ధారణ చెయ్యగలరో తెలుస్తుంది. తర్వాత తలంపు యాత్రలో ఉంటున్నారా? అనే ప్రశ్న కూడా వస్తుంది. తమోప్రధానము నుండి సతోప్రధానంగా స్మృతి యాత్ర ద్వారానే అవుతారు. అవన్నీ భక్తి మార్గపు శారీరిక యాత్రలు. ఇది ఆత్మిక యాత్ర. ఇందులో ఆత్మ యాత్ర చేస్తుంది. శారీరిక తీర్థయాత్రలో ఆత్మ మరియు శరీరము రెండూ యాత్ర చేస్తాయి. పతితపావనుడైన తండ్రిని స్మృతి చేయడం ద్వారానే ఆత్మలో తీక్షణత, శక్తి వస్తుంది. ఏ జిజ్ఞాసువుకైనా ప్రభావము మొదలైనవి చూపవలసి ఉన్నప్పుడు బాబా ప్రవేశత కూడా జరుగుతుంది. మాతా-పితలు ఇద్దరూ సహాయము చేస్తారు. కొన్ని చోట్ల జ్ఞానము, కొన్ని చోట్ల యోగములో సహయోగము చేస్తారు. తండ్రి అయితే సదా విదేహి, శరీర భావమే ఉండదు. కనుక ఇరువురు తండ్రులు శక్తిని సహాయముగా ఇవ్వగలరు. యోగము లేనట్లైతే శక్తి ఎక్కడి నుండి లభిస్తుంది? ఇతను యోగియా లేక జ్ఞానియా? అనేది అర్థము చేయించబడ్తుంది. యోగము కొరకు రోజు రోజు క్రొత్త క్రొత్త విషయాలు కూడా అర్థం చేయిస్తారు. ఇంతకుముందు ఇలా అర్థం చేయించేవారు కాదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అని మాత్రము చెప్పేవారు. ఇప్పుడు బాబా తీక్షణంగా లేవనెత్తుతారు(శక్తిని నింపుతారు). దీని ద్వారా సోదర - సోదరీ అనే సంబంధము కూడా తొలగిపోయి కేవలం సోదర-సోదర దృష్టి మాత్రమే మిగిలిపోతుంది. ఆత్మలమైన మనము పరస్పరములో సోదరులము. ఇది చాలా ఉన్నతమైన దృష్టి. చివరి వరకు ఈ పురుషార్థము నడవాలి. సతోప్రధానమైనప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తారు. అందువల్ల ఎంతగా వీలైతే అంత పురుషార్థాన్ని పెంచండి. వృద్ధులకు ఇంకా సహజము. ఇప్పుడు మనము తప్పకుండా వాపస్ వెళ్లాలి. యువకులకు ఇటువంటి ఆలోచనలు ఎప్పుడూ రావు. వృద్ధులు వానప్రస్థులుగా ఉంటారు అందువల్ల ఇప్పుడు వాపస్ వెళ్లాలని అర్థము చేయించబడ్తుంది. ఈ జ్ఞాన విషయాలన్నీ అర్థము చేసుకోవాలి. వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. వృద్ధి చెందుతూ చెందుతూ వృక్షమంతా తయారైపోతుంది. ముళ్ళను పరివర్తన చేసి నూతనమైన చిన్న పుష్పాల వృక్షమును తయారు చేయాలి. నూతనంగా తయారై మళ్లీ పురాతనమైనదిగా అవ్వాలి. మొదట వృక్షము చిన్నదిగా ఉంటుంది తర్వాత వృద్ధి చెందుతూ ఉంటుంది. అలా వృద్ధి చెందుతూ చెందుతూ చివరకు ముళ్ళుగా తయారవుతుంది. మొదట పుష్పాలుగా ఉంటారు. దాని పేరే స్వర్గము. తర్వాత ఆ సువాసన, ఆ శక్తి ఉండవు. ముళ్ళలో సువాసన ఉండదు. తేలికైన పుష్పాలలో కూడా సువాసన ఉండదు. తండ్రి తోటమాలి మరియు నావికుడు కూడా అయ్యారు. అందరి నావను తీరానికి చేరుస్తారు. నావను ఎలా తీరానికి చేర్చుతారో, ఎక్కడికి తీసుకెళ్తారో తెలివైన పిల్లలే అర్థము చేసుకోగలరు. ఎవరైతే అర్థము చేసుకోరో వారు పురుషార్థము కూడా చేయరు. నంబరువారుగా ఉంటారు కదా. కొన్ని విమానాలు శబ్ధ వేగము కంటే తీక్షణంగా(వేగంగా) వెళ్తాయి. ఆత్మ ఎలా పరుగెడుతుందో(ఒక శరీరమును వదలి మరొక శరీరమును తీసుకోవడం) కూడా ఎవ్వరికీ తెలియదు. ఆత్మ రాకెట్ కంటే కూడా తీక్షణంగా వెళ్తుంది. ఆత్మ వంటి వేగవంతమైన వస్తువు ఇంకేదీ లేదు. ఆ రాకెట్ మొదలైన వాటిలో అది వేగంగా ఎగురగలిగేలా చేసే వస్తువును(డబల్ రిఫైన్ పెట్రోల్) వినియోగిస్తారు. వినాశనము కొరకు ఎన్నో మారణాయుధాలు మొదలైనవి తయారుచేస్తారు. స్టీమర్లు, విమానాలలో కూడా బాంబులు తీసుకెళ్తారు. ఈ రోజుల్లో పూర్తి ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉంటారు. బాంబులను వినియోగించమని ఎవ్వరూ చెప్పరు. బాంబులు ఉపయోగించమని వార్తాపత్రికలలో వ్రాయరు. అవసరమైతే బాంబులను వినియోగించేందుకు అవకాశముందని అంటూ ఉంటారని పత్రికలలో కూడా వ్రాస్తూ ఉంటారు. ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. వినాశనమైతే తప్పకుండా జరుగుతుంది. బాంబులను ప్రయోగించకుండా ఉండడము, వినాశనము జరగకుండా ఉండడము - ఇది అసంభవము. మీ కొరకు నూతన ప్రపంచము తప్పకుండా కావాలి. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. అందువల్ల మీకు చాలా సంతోషము కలగాలి. పిల్లికి చెలగాటము, ఎలుకకు ప్రాణ సంకటము......... (వేటగానికి వేట, వేటకు మృత్యువు/మిరువా మౌత్ మలుకా శికార్........) డ్రామానుసారంగా అందరూ మరణించవలసిందే. పిల్లలైన మీరు డ్రామా జ్ఞానము ఉన్న కారణంగా ఏ మాత్రము చలించకుండా ఉండగలరు. సాక్షిగా ఉండి చూస్తారు. విలపించవలసిన అవసరము లేదు. సమయానుసారము శరీరమును వదలాల్సిందే. మనము వెళ్లి మరో జన్మను నూతన రాజ్యములో పొందుతామని ఆత్మలైన మీకు తెలుసు. నేను రాజకుమారుడిగా అవుతానని ఆత్మకు తెలుసు అందువల్లనే ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటుంది. సర్పములో కూడా ఆత్మ ఉంటుంది కదా. నేను ఒక శరీరాన్ని వదిలి మరో దానిని తీసుకుంటున్నానని ఆత్మ చెప్తుంది. అందుకే అది కూడా శరీరాన్ని వదిలి వెళ్ళి క్రొత్తగా చిన్న బిడ్డగా జన్మిస్తుంది. పిల్లలైతే జన్మిస్తారు కదా. పునర్జన్మలైతే అందరూ తీసుకోవలసిందే. ఇవన్నీ విచార సాగర మథనము చేయవలసి ఉంటుంది.
అన్నిటికన్నా ముఖ్యమైన విషయము తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయడం. ఉదాహరణకు పిల్లలు వారి తల్లిదండ్రులకు ఒక్కసారిగా అతుక్కుపోతారో అదే విధంగా చాలా ప్రేమతో బుద్ధియోగము ద్వారా తండ్రిని పూర్తిగా అతుక్కుపోవాలి. మేము ఎంతవరకు ధారణ చేస్తున్నాము? అని స్వయాన్ని చూసుకోవాలి (నారదుడి ఉదాహరణ). భక్తులు జ్ఞానము తీసుకోనంతవరకు దేవతలుగా అవ్వలేరు. ఇది కేవలం లక్ష్మిని వరించే విషయము కాదు. ఇది అర్థము చేసుకోవలసిన విషయము. మేము సతోప్రధానంగా ఉన్నప్పుడు, విశ్వము పై రాజ్యపాలన చేసేవారమని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ సతోప్రధానంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయాలి. యథా యోగము, యథా శక్తి అనుసారంగా కల్ప-కల్పము మీరు ఈ శ్రమ చేస్తూనే వచ్చారు. మేము ఎంతవరకు ఇతరులకు అర్థం చేయించగలము? మేము దేహాభిమానమును ఎంతవరకు తొలగిస్తూ వస్తున్నాము? అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని అర్థము చేసుకోగలరు. ఆత్మనైన నేను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటాను. ఆత్మనైన నేను దీనిని వినియోగిస్తాను. ఇవి నా అవయవాలు. మనమందరమూ పాత్రధారులము. ఈ డ్రామాలో ఇది అనంతమైన పెద్ద నాటకము. ఆ నాటకములో పాత్రధారులందరూ నంబరువారుగా ఉంటారు. ఇందులో ఎవరెవరు ముఖ్యమైన పాత్రధారులని మనము అర్థము చేసుకోవచ్చు. ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్ ఎవరెవరు? పిల్లలైన మీరు తండ్రి ద్వారా డ్రామా ఆది-మధ్య-అంత్యములు తెలుసుకున్నారు. రచయిత ద్వారా రచన జ్ఞానము లభిస్తుంది. రచయితయే వచ్చి తన మరియు రచనల రహస్యాలను అర్థం చేయిస్తారు. ఇది వారి రథము. ఇందులో ప్రవేశించి వచ్చారు. అప్పుడే కదా వీరిలో రెండు ఆత్మలు ఉన్నాయని అంటారు. ఇది కూడా సాధారణమైన విషయమే. పితృ దేవతలకు తినిపించినప్పుడు ఆత్మ వస్తుంది కదా. ఇంతకుముందు అలా చాలా జరిగేది. అలా వచ్చిన వారిని ప్రశ్నించేవారు. ఇప్పుడైతే తమోప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు కూడా కొంతమంది తాము క్రితం జన్మలో ఫలానావారుగా ఉండేవారమని చెప్తారు. భవిష్యత్తును గురించి ఎవ్వరూ చెప్పరు. వెనుకటి జన్మ గురించి మాత్రమే వినిపిస్తారు. అందరూ చెప్పేదానిని ఎవ్వరూ నమ్మరు.
మధురమైన పిల్లలారా! - ఇప్పుడు మీరు శాంతిగా ఉండాలని బాబా చెప్తున్నారు. మీరు ఎంతెంత జ్ఞాన-యోగాలలో దృఢంగా ఉంటారో, అంతే శక్తివంతంగా అవుతారు. ఇప్పుడింకా చాలామంది పిల్లలు అమాయకులుగా ఉన్నారు. భారతవాసులు దేవీ దేవతలున్నప్పుడు ఎంతో శక్తివంతంగా ఉండేవారు. ధన-సంపత్తులలో కూడా సంపన్నంగా ఉండేవారు. ఇప్పుడైతే ఖాళీ అయిపోయారు. వారు సంపన్నంగా ఉండేవారు, మీరు నిరుపేదలుగా అయ్యారు. భారతదేశము ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? అనే విషయాలు స్వయంగా మీకు కూడా తెలుసు. ఆకలితో మరణించాల్సిందే. ధాన్యము, నీరు మొదలైనవేవీ లభించవు. ఒక్కో చోట వరదలు వస్తాయి. కొన్ని చోట్ల నీటి చుక్క కూడా లభించదు. ఈ సమయములో దు:ఖపు మేఘాలు అలుముకొని ఉన్నాయి. సత్యయుగములో సుఖపు మేఘాలు ఉంటాయి. ఈ ఆటను పిల్లలైన మీరే అర్థము చేసుకున్నారు. ఇతరులెవ్వరికీ తెలియదు. బ్యాడ్జ్ పై అర్థము చేయించడం కూడా చాలా బాగుంటుంది. వారు లౌకిక హద్దు తండ్రి. వీరు పారలౌకిక బేహద్ తండ్రి. ఈ తండ్రి ఒక్కసారి మాత్రమే సంగమ యుగములోనే వచ్చి బేహద్ వారసత్వమును ఇస్తారు. నూతన ప్రపంచము తయారవుతుంది. ఇది ఇనుప యుగము తర్వాత తప్పకుండా బంగారు యుగము తయారవుతుంది. ఇప్పుడు మీరు సంగమ యుగములో ఉన్నారు. హృదయము స్వచ్ఛంగా ఉన్నట్లైతే కోరికలన్నీ నెరవేరుతాయి. ప్రతి రోజూ నేను ఎలాంటి చెడు కర్మలు చేయలేదు కదా? ఎవ్వరి పట్ల వికారీ ఆలోచనలు నడవలేదు కదా? వ్యర్థ విషయాలలో సమయాన్ని పోగొట్టుకున్నానా? లేక స్వ ఆనందములో నిమగ్నమై ఉన్నానా? అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. నన్నొక్కరినే స్మృతి చేయండి అనేది తండ్రి ఆజ్ఞ, స్మృతి చేయకపోతే ఆజ్ఞానువర్తులు కారు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. జ్ఞాన-యోగాల మస్తీలో ఉండాలి, హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలి, వ్యర్థ చింతనలో (ఝర్ముయి-ఝగ్ముయి) మీ సమయాన్ని పోగొట్టుకోరాదు.
2. ఆత్మలమైన మనము పరస్పరము సోదరులము, ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్లాలి - ఈ అభ్యాసాన్ని పక్కాగా చెయ్యాలి. విదేహులై స్వధర్మములో స్థితమై తండ్రిని స్మృతి చేయాలి.
వరదానము :-
''అకళ్యాణకర సంకల్పాలను సమాప్తం చేసి అపకారులకు కూడా ఉపకారము చేసే జ్ఞానయుక్త ఆత్మా భవ ''
ఎవరైనా ప్రతిరోజు మిమ్ములను నిందిస్తున్నా, అకళ్యాణము చేస్తున్నా, తిట్తున్నా వారి పట్ల మీకు మనసులో ఘృణా భావము ఉండరాదు. '' అపకారికి కూడా ఉపకారము '' చేయడమే జ్ఞానయుక్త ఆత్మల కర్తవ్యము. ఎలాగైతే పిల్లలైన మీరు తండ్రిని 63 జన్మలు తిట్టినా(నిందించినా) తండ్రి మిమ్ములను కళ్యాణకారి దృష్టితో చూశారో అలా మీరు కూడా తండ్రిని అనుసరించండి. జ్ఞానయుక్త ఆత్మలంటేనే సర్వుల పట్ల కళ్యాణ భావన ఉండేవారు. సంకల్పములో కూడా అకళ్యాణముండరాదు.
స్లోగన్ :-
''ఇతరుల మనోభావాలను తెలుసుకోవాలంటే మన్మనాభవ స్థితిలో స్థితమై ఉండండి.''