24-01-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - ఆత్మిక సర్జన్‌ మీకు జ్ఞాన - యోగాలనే ఫస్ట్‌క్లాసైన, అద్భుతమైన బలవర్థక ఔషధాన్ని(ఖురాక్‌ను) తినిపిస్తున్నారు. ఈ ఆత్మిక శక్తివంతమైన ఔషధము (లేహ్యము) పరస్పరములో తినిపించుకుంటూ అందరినీ గౌరవిస్తూ ఉండండి.''

ప్రశ్న :-

విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకునేందుకు ఏ శ్రమ చేయాలి? ఏ అలవాటును పక్కా చేసుకోవాలి?

జవాబు :-

జ్ఞానమనే మూడవ నేత్రము ద్వారా అకాల సింహాసనాధికారులై ఆత్మిక సోదరులను చూసేందుకు కృషి చేయండి. పరస్పరం సోదరులుగా భావిస్తూ అందరికీ జ్ఞానమును ఇవ్వండి. మొదట స్వయాన్ని ఆత్మగా భావించి, ఆ తర్వాత సోదరులకు అర్థం చేయించండి. ఈ అలవాటు చేసుకుంటే విశ్వ రాజ్యభాగ్యము లభిస్తుంది. ఈ అలవాటు ద్వారా శరీరమనే భావము తొలగిపోతుంది. మాయావీ తుఫానులు లేక చెడు సంకల్పాలు కూడా రావు. ఇతరులకు జ్ఞాన బాణాలు కూడా బాగా తగులుతాయి.

ఓంశాంతి.

జ్ఞాన మూడవ నేత్రాన్ని ఇచ్చే ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. జ్ఞాన మూడవ నేత్రమును తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞాన మూడవ నేత్రము లభించింది. ఇప్పుడు ఈ పాత ప్రపంచము మారనున్నదని మీకు తెలుసు. దీనిని మార్చేవారు ఎవరో ఏ విధంగా మారుస్తారో పాపం మనుష్యులకు తెలియదు. ఎందుకంటే వారికి జ్ఞానమనే మూడవ నేత్రమే లేదు. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞాన మూడవ నేత్రము లభించింది. దీని ద్వారా మీరు సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు. ఇది జ్ఞానమనే శ్యాక్రీన్‌(మధుర రసము) ఒక్క బిందువు వేసినా ఎంతో తియ్యగా అయిపోతుంది! అలాగే జ్ఞానములో కూడా 'మన్మనాభవ' అన్న ఒక్క పదమే చాలు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. తండ్రి శాంతిధామము మరియు సుఖధామానికి మార్గాన్ని తెలుపుతున్నారు. పిల్లలకు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. కావున పిల్లలకు ఎంత సంతోషము ఉండాలి! సంతోషం వంటి టానిక్‌ ఏదీ లేదు(ఖుషీ జైసీ ఖురాక్‌ నహీ) అని అంటారు కూడా. ఎవరైతే సదా సంతోషముగా, ఆనందంగా ఉంటారో వారి కొరకు అది టానిక్‌లా పని చేస్తుంది. 21 జన్మలు ఆనందంలో ఉండేందుకు ఇది శక్తివంతమైన ఔషధము. ఈ ఖురాక్‌ను సదా పరస్పరం తినిపించుకుంటూ ఉండండి. మీరు శ్రీమతం పై అందరి ఆత్మిక పాలనను చేస్తారు. ఎవరికైనా బాబా పరిచయమును ఇవ్వడమే సత్యమైన యోగ క్షేమాలను కలుగజేయడము. అనంతమైన తండ్రి ద్వారా మనకు జీవన్ముక్తి అనే ఖురాక్‌(ఔషధము) లభిస్తోందని మధురమైన పిల్లలకు తెలుసు. సత్యయుగములో భారతదేశము జీవన్ముక్తముగా, పావనంగా ఉండేది. తండ్రి చాలా గొప్ప ఉన్నతమైన ఖురాక్‌ను ఇస్తారు. అందుకే అతీంద్రియ సుఖమును గూర్చి అడగాలనుకుంటే గోప-గోపికలను అడగండి అన్న గాయనము ఉంది. ఇది జ్ఞాన-యోగాలనే ఎంతో ఫస్ట్‌క్లాసైన అద్భుతమైన టానిక్‌. ఇది ఒక్క ఆత్మిక సర్జన్‌ వద్ద మాత్రమే ఉంది. ఇంకెవ్వరికీ ఈ ఔషధము గురించి తెలియనే తెలియదు.

మధురమైన పిల్లలూ, మీ కొరకు అరచేతిలో కానుకను తీసుకు వచ్చానని తండ్రి అంటారు. ముక్తి - జీవన్ముక్తులనే ఈ బహుమతి కేవలం నా వద్ద మాత్రమే ఉంటుంది. కల్ప-కల్పము నేనే వచ్చి మీకు ఇస్తాను. మళ్లీ దానిని రావణుడు లాక్కుంటాడు. కావున ఇప్పుడు పిల్లలైన మీకు సంతోషమనే పాదరస మీటరు ఎంతో పైకెక్కి ఉండాలి! మన సత్య-సత్యమైన తండ్రియే టీచరు మరియు సద్గురువై మనలను తమ జతలో తీసుకెళ్తారని మీకు తెలుసు. అత్యంత ప్రియమైన తండ్రి నుండి విశ్వరాజ్యాధికారం లభిస్తుంది. ఇదేమైనా చిన్న విషయమా? సదా హర్షితంగా ఉండాలి. ఈశ్వరీయ విద్యార్థి జీవితము అత్యంత శ్రేష్ఠమైనది. మళ్లీ కొత్త ప్రపంచంలో కూడా మీరు సదా సంతోషాలను జరుపుకుంటూ ఉంటారు. సత్యమైన సంతోషము ఎప్పుడు జరుపుకుంటారో ప్రపంచానికి తెలియదు. మనుష్యులకైతే సత్యయుగ జ్ఞానమే లేదు కావున వారు ఇక్కడే జరుపుకుంటూ ఉంటారు. కాని ఈ పాత తమోప్రధాన ప్రపంచంలో సంతోషం ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడైతే త్రాహి-త్రాహి అని అంటూ ఉంటారు. ఇది ఎంతటి దు:ఖ ప్రపంచము!

తండ్రి పిల్లలైన మీకు ఎంత సహజమైన మార్గమును తెలియజేస్తున్నారు! గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండండి. వ్యాపార-వ్యవహారాలు మొదలైనవి చేస్తూ కూడా నన్ను స్మృతి చేస్తూ ఉండండి. ఉదాహరణానికి ప్రేయసీ-ప్రియులు పరస్పరం ఒకరినొకరు తలుచుకుంటూ ఉంటారు. వారు పరస్పరము ప్రేయసి-ప్రియులుగా ఉంటారు. ఇక్కడ ఆ విషయము లేదు. ఇక్కడైతే మీరందరూ ఆ ఒక్క ప్రియునికి జన్మ-జన్మాంతరాల ప్రేయసులుగా ఉంటారు. తండ్రి మీ ప్రేయసిగా అవ్వరు. మీరు ఆ ప్రియుని రమ్మని తల్చుకుంటూ వచ్చారు. దు:ఖము ఎక్కుగా ఉన్నప్పుడు ఎక్కువగా స్మరణ చేస్తారు. అందుకే దు:ఖములో అందరూ స్మరణ చేస్తారు(స్మృతిస్తారు). కాని సుఖములో ఎవ్వరూ స్మరించరు(దు:ఖ్‌మే సుమిరన్‌ సబ్‌ కరే, సుఖమే కరే న కోయీ......) అన్న గాయనముంది. ఈ సమయంలో తండ్రి కూడా సర్వశక్తివంతునిగా ఉన్నారు. రోజురోజుకు మాయ కూడా సర్వశక్తివంతంగా, తమోప్రధానంగా అవుతూ ఉంటుంది. అందుకే తండ్రి చెప్తున్నారు - మధురమైన పిల్లలూ! దేహీ-అభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి, అలాగే దైవీగుణాలను కూడా ధారణ చేసినట్లైతే మీరు ఈ లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఈ చదువులో ముఖ్యమైన విషయమే స్మృతి. ఉన్నతోన్నతమైన తండ్రిని చాలా ప్రేమతో, స్నేహముతో స్మృతి చేయాలి. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయువారు ఆ తండ్రియే. పిల్లలైన మిమ్ములను విశ్వాధిపతులుగా తయారు చేసేందుకు నేను వచ్చాను. ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లైతే మీ అనేక జన్మల పాపాలు అంతమైపోతాయని తండ్రి చెప్తారు. పతితపావనుడైన తండ్రినే అందరూ పిలుస్తారు కదా! ఇప్పుడు ఆ తండ్రి వచ్చారు. కావున తప్పకుండా పావనంగా అవ్వవలసి ఉంటుంది. తండ్రి దు:ఖహర్త-సుఖకర్త. తప్పకుండా సత్యయుగంలో పావన ప్రపంచం ఉండేది. అప్పుడు అందరూ సుఖంగా ఉండేవారు పిల్లలూ! శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేస్తూ ఉండండి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. ఇప్పుడిది సంగమ యుగము. ఇప్పుడు బాబా నావికుడై మిమ్ములను ఈ తీరం నుండి ఆవలి తీరానికి తీసుకు వెళ్తారు. నావ ఒక్కటే కాదు. మొత్తం ప్రపంచమంతా ఒక పెద్ద నావ(స్టీమరు) లాంటిది. దానిని తండ్రి ఆవలి తీరానికి తీసుకెళ్తారు.

మధురమైన పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి! మీ కొరకు సదా సంతోషమే సంతోషముంది. అనంతమైన తండ్రి మనలను చదివిస్తున్నారు. ఓహో! ఇది ఎప్పుడూ వినలేదు, చదవలేదు. భగవానువాచ - నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఆత్మిక పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. కావున దీనిని పూర్తిగా నేర్చుకోవాలి, ధారణ చేయాలి, పూర్తిగా చదవాలి. చదువులో ఎల్లప్పుడూ నెంబరువారుగా ఉండనే ఉంటారు. నేను ఉత్తమునిగా ఉన్నానా, మధ్యముగా ఉన్నానా లేక కనిష్ఠముగా ఉన్నానా? అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని చూసుకోండి - '' నేను ఉన్నత పదవిని పొందేందుకు యోగ్యునిగా ఉన్నానా? ఆత్మిక సేవ చేస్తున్నానా? ఎందుకంటే పిల్లలూ, సేవాధారులుగా అవ్వండి, అనుసరించండి'' అని తండ్రి అంటారు. నేను సేవ చేసేందుకే వచ్చాను. నేను రోజూ సేవ చేస్తాను. అందుకే ఈ రథాన్ని తీసుకున్నాను. ఇతడి రథము అనారోగ్యంగా ఉంటే నేను ఇతడిలో కూర్చొని మురళీ వ్రాస్తాను. నోటితో మాట్లాడలేనప్పుడు నేనే వ్రాస్తాను. తద్వారా పిల్లలు మురళీని మిస్‌ కాకుండా ఉంటారు. కావున నేను కూడా సేవలో తత్పరమై ఉన్నాను కదా! ఇది ఆత్మిక సేవ.

తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తారు - పిల్లలూ, మీరు కూడా తండ్రి సేవలో నిమగ్నమైపోండి. ఈశ్వరీయ సేవలో తత్పరులవ్వండి. మొత్తం విశ్వానికి అధిపతి అయిన తండ్రియే మిమ్ములను విశ్వాధిపతులుగా తయారు చేసేందుకు వచ్చారు. ఎవరైతే బాగా పురుషార్థం చేస్తారో వారిని మహావీరులని అంటారు. బాబా ఆదేశానుసారము నడిచే మహావీరులెవరో గమనించబడ్తుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సోదర ఆత్మలను చూడండి అని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. ఈ శరీరాన్ని మర్చిపోండి. బాబా కూడా ఈ శరీరాలను చూడరు. నేను ఆత్మలనే చూస్తానని తండ్రి అంటారు. పోతే ఆత్మ శరీరం లేకుండా మాట్లాడలేదన్న జ్ఞానముంది. నేను కూడా ఈ శరీరములోకి వచ్చాను. దీనిని అప్పుగా తీసుకున్నాను. శరీరం ద్వారా మాత్రమే ఆత్మ చదవగలదు. బాబా ఇక్కడే కూర్చొని ఉన్నారు. ఇది అకాల సింహాసనము. ఆత్మ అకాలమూర్తి. ఆత్మ ఎప్పుడూ చిన్నదిగా, పెద్దదిగా అవ్వదు. శరీరము చిన్నగా, పెద్దగా అవుతుంది. ఆత్మలందరి సింహాసనము భృకుటి మధ్యలోనే ఉంటుంది. శరీరాలైతే అందరివీ భిన్న-భిన్నంగా ఉంటాయి. కొందరి అకాల సింహాసనము తండ్రి కూర్చొని పిల్లలకు ఆత్మిక డ్రిల్లు నేర్పిస్తారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మొదట స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మనైన నేను ఫలానా సోదరునితో మాట్లాడుతున్నాను. శివబాబాను స్మృతి చేయండి అని తండ్రి సందేశమును ఇస్తారు. స్మృతి ద్వారానే తుప్పు వదులుతుంది. బంగారంలో మిశ్రమము కలిసినప్పుడు దాని విలువ తగ్గిపోతుంది. ఆత్మలైన మీలో కూడా తుప్పు పడడం ద్వారానే మీరు విలువ లేనివారిగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వాలి. ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞానమనే మూడవ నేత్రము లభించింది, దీని ద్వారా మీ సోదరులను చూడండి. సోదర దృష్టితో చూసినట్లైతే కర్మేంద్రియాలు ఎప్పుడూ చంచలమవ్వవు. రాజ్యభాగ్యమును తీసుకోవాలి. విశ్వాధిపతులుగా అవ్వాలనుకుంటే ఈ శ్రమ చెయ్యండి. సోదర దృష్టితో అందరికీ జ్ఞానమును ఇవ్వండి. అప్పుడు ఈ అలవాటు పక్కా అయిపోతుంది. మీరందరూ సత్య-సత్యమైన సోదరులు. తండ్రి కూడా పై నుండి వచ్చారు. అలాగే మీరు కూడా పై నుండి వచ్చారు. తండ్రి పిల్లలతో కలిసి సేవ చేస్తున్నారు. తండ్రి పిల్లలకు సేవ చేసే ధైర్యమును ఇస్తారు(హిమ్మతే మర్దా, మదదే ఖుదా.... ధైర్యము పిల్లలది, సహాయము తండ్రిది). కావున ఆత్మనైన నేను సోదర ఆత్మను చదివిస్తున్నాను అని అభ్యాసము చెయ్యండి. ఆత్మయే చదువుతుంది కదా! దీనిని ఆత్మిక జ్ఞానము అని అంటారు. ఈ జ్ఞానము ఆత్మిక తండ్రి నుండే లభిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించండి అనే జ్ఞానమును తండ్రి సంగమ యుగములోనే వచ్చి ఇస్తారు. మీరు అశరీరులుగా వచ్చారు. మళ్లీ ఇక్కడ శరీరమును ధరించి మీరు 84 జన్మల పాత్రను అభినయించారు. ఇప్పుడు మళ్లీ తిరిగి వెళ్లాలి. కావున స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సోదర దృష్టితో చూడాలి. ఈ విషయంలో కష్టపడాలి. మీకు మీరుగా కష్టపడాలి. ఇతరులు చేయకుంటే మనకేమి నష్టము! దానము ఇంటి నుండి ప్రారంభమౌతుంది(చారిటి బిగిన్స్‌ ఎట్‌ హోమ్‌) అనగా మొదట స్వయాన్ని ఆత్మగా భావించి ఆ తర్వాత సోదరులకు అర్థం చేయించినట్లైతే బాణము బాగా తగులుతుంది. ఈ శక్తిని(పదును) నింపుకోవాలి. కష్టపడితేనే ఉన్నత పదవిని పొందుతారు. ఫలమును ఇచ్చేందుకే తండ్రి వచ్చారు. కావున కష్టపడాలి. కొంత సహించాలి కూడా.

ఎవరైనా తప్పుగా మాట్లాడితే మీరు మౌనంగా ఉండండి. మీరు మౌనంగా ఉంటే ఇతరులు ఏం చేయగలరు? చప్పట్లు మ్రోగాలంటే రెండు చేతులు పని చేయాలి. ఒకరు నోటితో ఏమైనా అంటే, ఇంకొకరు మౌనంగా ఉంటే వారు తమకు తాముగానే మౌనమైపోతారు. చేతికి చేయి కలిస్తేనే చప్పుడు వస్తుంది. పిల్లలు పరస్పరం ఒకరికొకరు కళ్యాణము చేసుకోవాలి. పిల్లలూ, సదా సంతోషంగా ఉండాలనుకుంటే 'మన్మనాభవ'. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. సోదరులైన ఆత్మల వైపు చూడండి. మీ సోదరులకు కూడా జ్ఞానమును ఇవ్వండి. యోగము చేయించేటప్పుడు కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ మీ సోదరులను చూస్తూ ఉంటే సేవ బాగా జరుగుతుంది. మీ సోదరులకు అర్థం చేయించండి అని బాబా అర్థము చేయించారు. సోదరులందరూ తండ్రి నుండే వారసత్వాన్ని తీసుకుంటారు. ఈ ఆత్మిక జ్ఞానము బ్రాహ్మణ పిల్లలైన మీకు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. మీరు ఇప్పుడు బ్రాహ్మణులు, మీరే మళ్లీ దేవతలుగా అవ్వనున్నారు. ఈ సంగమ యుగమునైతే వదలరు కదా! లేకపోతే ఆవలి తీరానికి ఎలా వెళ్తారు? అంత దూరానికి ఎగరలేరు చేసుకోవాలి. ఇది మీకు లాభాన్ని కలిగించే విషయము. తండ్రి శిక్షణలను సోదరులు ఇవ్వాలి. తండ్రి చెప్తున్నారు - '' నేను ఆత్మలైన మీకు జ్ఞానమును ఇస్తున్నాను, నేను ఆత్మనే చూస్తాను, మనుష్యులు మనుష్యులతో మాట్లాడేటప్పుడు వారి ముఖాన్ని చూస్తారు కదా! మీరు ఆత్మతో మాట్లాడ్తారు.'' కావున ఆత్మనే చూడాలి. భలే శరీరం ద్వారా జ్ఞానమును ఇచ్చినా, ఇక్కడ శరీర భావమును తొలగించవలసి ఉంటుంది. పరమాత్మ తండ్రి మాకు జ్ఞానమును ఇస్తున్నారని ఆత్మలైన మీరు భావిస్తారు. నేను ఆత్మలను చూస్తానని తండ్రి కూడా అంటారు. అలాగే నేను పరమాత్మ అయిన తండ్రిని చూస్తున్నాను, వారి నుండి జ్ఞానమును తీసుకుంటున్నానని ఆత్మ కూడా అంటుంది. దీనినే ఆత్మిక జ్ఞానమును ఇచ్చి పుచ్చుకోవడమని అంటారు. ఆత్మయే ఆత్మతో పంచుకుంటుంది. ఆత్మలోనే జ్ఞానముంది. ఆత్మకే జ్ఞానమునివ్వాలి. ఇది పదును పెట్టడం వంటిది. మీకు జ్ఞానములో ఈ పదును ఏర్పడినట్లైతే మీరు ఎవరికి అర్థం చేయించినా వెంటనే బాణం తగులుతుంది. తండ్రి చెప్తున్నారు - మీరు అభ్యాసము చేసి బాణం తగులుతుందో లేదో చూడండి. ఈ క్రొత్త అలవాటు చేసుకుంటే శరీర భావము తొలగిపోతుంది. మాయా తుఫానులు తక్కువగా వస్తాయి. చెడు సంకల్పాలు రావు. దృష్టి కూడా క్రిమినల్‌గా(అశుద్ధ దృష్టిగా) ఉండదు. ఆత్మ అయిన నేను 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చాను. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. ఇప్పుడు బాబా స్మృతిలో ఉండాలి. స్మృతి ద్వారానే తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యి సతోప్రధాన ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. ఇది ఎంత సహజము! పిల్లలకు శిక్షణ ఇవ్వడం కూడా తన పాత్రయే అని తండ్రికి తెలుసు. ఇది కొత్త విషయమేమీ కాదు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత నేను రావలసి ఉంటుంది. అందుకు నేను బంధింపబడి ఉన్నాను. మధురమైన పిల్లలూ, స్మృతియాత్రలో ఉన్నట్లైతే అంతమతిని బట్టి గతి ఏర్పడుతుంది(అంత్‌ మతి సో గతి) అని పిల్లలకు అర్థం చేయిస్తాను. ఇది అంత్య కాలము కదా! నన్నొక్కరినే స్మృతి చేసినట్లైతే మీకు సద్గతి లభిస్తుంది. ఈ దేహీ-అభిమానిగా అయ్యే శిక్షణ ఒక్కసారి మాత్రమే పిల్లలైన మీకు లభిస్తుంది. ఇది ఎంతో అద్భుతమైన జ్ఞానము! తండ్రి అద్భుతమైనవారు కనుక జ్ఞానము కూడా అద్భుతమైనది. దీనిని ఎప్పుడూ ఎవ్వరూ తెలుపలేరు. ఇప్పుడు వాపస్‌ తిరిగి వెళ్ళాలి. కావున మధురమైన పిల్లలూ, ఈ అభ్యాసమును చేయండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మ జ్ఞానమును ఇవ్వండి అని బాబా చెప్తారు. మూడవ నేత్రంతో సోదరులను చూడండి. ఇందులోనే చాలా శ్రమ ఉంది. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. ఎలాగైతే తండ్రి ఆత్మిక పిల్లల ఆత్మిక సేవ చేసేందుకు వచ్చారో, అలా తండ్రిని అనుసరించి ఆత్మిక సేవను చేయాలి. తండ్రి డైరక్షన్‌ పై నడుస్తూ సంతోషమనే బలవర్థకమైన ఔషధాన్ని తినాలి, తినిపించాలి.

2. ఎవరైనా తప్పుగా మాట్లాడినా మౌనంగా ఉండాలి. మాటకు మాట కలపరాదు(బదులు చెప్పరాదు) సహించాలి.

వరదానము :-

''సైలెన్స్‌ సాధనాల ద్వారా మాయను దూరము నుండే గుర్తించి పారద్రోలే మాయాజీత్‌ భవ''

మాయ చివరి ఘడియ వరకు వస్తుంది. కాని మాయ పని రావడం, మీ పని దానిని దూరం నుండే పారదోలడం. మాయ వచ్చి మిమ్ములను కదిలించిన తర్వాత దానిని పారదోలడం కూడా సమయాన్ని వృథా చేయడమే. అందువలన సైలెన్స్‌ సాధనాల ద్వారా మీరు దూరం నుండే ఇది మాయ అని గుర్తించి దానిని మీ వద్దకు రానీయకండి. ఒకవేళ ఏం చేయాలి? ఎలా చేయాలి? ఇప్పుడింకా పురుషార్థినే అని ఆలోచించడం కూడా మాయను గౌరవించడమే(ఆహ్వానించడమే). దాని వలన టెన్షన్‌లోకి వస్తారు. కనుక మాయను దూరము నుండే గుర్తించి పారదోలుతే మాయాజీతులుగా అవుతారు.

స్లోగన్‌ :-

''శ్రేష్ఠ భాగ్యరేఖలను ఎమర్జ్‌ చేస్తే పాత సంస్కారాల రేఖలు మర్జ్‌ అయిపోతాయి''

బ్రహ్మబాబా సమానంగా అయ్యేందుకు విశేషమైన పురుషార్థము

వృక్ష రచయిత అయిన వృక్ష బీజము, ఎప్పుడైతే వృక్షము అంతిమ స్టేజికి వస్తుందో అప్పుడు మళ్లీ పైకి వచ్చేస్తుంది. అలా అనంతమైన మాస్టర్‌ రచయితలుగా అయ్యి సదా స్వయాన్ని ఈ కల్పవృక్షము పై నిల్చొని ఉన్నట్లు అనుభవం చేయండి. తండ్రితో పాటు వృక్షము పై మాస్టర్‌ బీజరూపులై శక్తులు, గుణాలు, శుభ భావన - శుభ కామనల, స్నేహ సహయోగాల కిరణాలను వ్యాపింపజేయాలి.