14-01-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - మీరు సంపూర్ణ పావనంగా అవ్వాలి. అందువలన ఎప్పుడూ ఎవ్వరికీ దు:ఖమివ్వకండి. కర్మేంద్రియాలతో ఏ వికర్మలూ జరగరాదు. సదా తండ్రి ఆజ్ఞను పాటిస్తూ ఉండండి.''

ప్రశ్న :-

రాతి(రాయి) నుండి పరశువేది(పారసబుద్ధిగలవారు)గా అయ్యేందుకు యుక్తి ఏది? అలా అయ్యేందుకు ఏ జబ్బు విఘ్న రూపంగా అవుతుంది?

జవాబు :-

రాతి నుండి పరశువేదిగా తయారయ్యేందుకు1. నారాయణీ నషా పూర్తిగా ఉండాలి. దేహాభిమానము తొలగిపోయి ఉండాలి. ఈ దేహాభిమానమే అత్యంత కఠినమైన వ్యాధి. ఎంతవరకు దేహీ-అభిమానులుగా అవ్వరో, అంతవరకు పరశువేదిగా తయారవ్వలేరు. అలా తయారయ్యేవారే తండ్రికి సహాయకారులుగా అవ్వగలరు. 2. సేవ కూడా మీ బుద్ధిని బంగారు బుద్ధిగా తయారు చేస్తుంది. అందుకొరకు చదువు పై పూర్తిగా గమనముండాలి.

ఓంశాంతి.

ఆత్మిక పిల్లలను ఆత్మిక తండ్రి అప్రమత్తము చేస్తున్నారు - పిల్లలూ! స్వయాన్ని సంగమ యుగము వారిగా భావించండి. సత్యయుగమువారిగా అయితే భావించలేరు కదా. బ్రాహ్మణులైన మీరు మాత్రమే స్వయాన్ని సంగమయుగ వాసులుగా భావిస్తారు. మిగిలిన వారందరూ స్వయాన్ని కలియుగములోని వారిగా భావిస్తారు. సత్యయుగానికి, కలియుగానికి, స్వర్గవాసులకు - నరకవాసులకు చాలా వ్యత్యాసము ఉంది. మీరు స్వర్గవాసులుగా లేరు, నరకవాసులుగా లేరు. మీరు పురుషోత్తమ సంగమయుగ వాసులు. ఈ సంగమ యుగాన్ని గురించి బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. ఇతరులెవ్వరికీ తెలియదు. మీకు తెలిసినా మర్చిపోతారు. ఇప్పుడు దీనిని గురించి మనుష్యులకు ఎలా అర్థము చేయించాలి? వారైతే రావణుని సంకెళ్ళలో చిక్కుకొని ఉన్నారు. రామరాజ్యమైతే లేనే లేదు. రావణుని తగులబెడ్తూ ఉంటారు. దీని ద్వారా ఇది రావణ రాజ్యమని ఋజువు అవుతుంది. రామరాజ్యమంటే ఏమిటో, రావణ రాజ్యమంటే ఏమిటో - ఇది కూడా మీకు నెంబరువారుగా తెలుసు. తండ్రి సంగమ యుగములో వస్తారు. కనుక సత్యయుగము, కలియుగాలను కూడా ఇప్పుడే పోల్చి రెండిటికి వ్యత్యాసము తెలుపుతారు. కలియుగములో ఉండేవారిని నరకవాసులని, సత్యయుగములో ఉండేవారిని స్వర్గవాసులని అంటారు. స్వర్గవాసులను పవిత్రులని, నరకవాసులను పతితులని అంటారు. అసలు మీ విషయాలే సాటిలేనివి. ఇప్పుడు మీకు ఈ పురుషోత్తమ సంగమ యుగమును గురించి తెలుసు. మనము బ్రాహ్మణులమని ఇప్పుడు మీరు భావిస్తారు. వర్ణముల చిత్రము కూడా చాలా బాగుంది. ఈ చిత్రమును చూపి కూడా మీరు ఇతరులకు అర్థం చేయించగలరు. మనుష్యులు స్వయాన్ని నరకవాసులమని, పతితులమని, నిరుపేదలమని అర్థము చేసుకొనునట్లు వ్యత్యాసము తెలపాలి. ఇప్పుడిది పురాతన కలియుగ ప్రపంచమని, సత్యయుగ స్వర్గము నూతన ప్రపంచమని (చిత్రములో) వ్రాయాలి. మీరు నరకవాసులా లేక స్వర్గవాసులా? మీరు దేవతలా లేక అసురులా? అని ప్రశ్నించాలి. మేము స్వర్గవాసులమని ఎవ్వరూ చెప్పరు. కొంతమంది మేము స్వర్గములో కూర్చుని ఉన్నామని భావిస్తారు. అరే! ఇది నరకము కదా! సత్యయుగము ఎక్కడుంది? ఇది రావణ రాజ్యము అందుకే రావణుని తగులబెడ్తారు. వారి వద్ద కూడా చాలా జవాబులుంటాయి. సర్వవ్యాపి అను విషయము పై కూడా చాలా వాదిస్తారు. ఇప్పుడిది నూతన ప్రపంచమా లేక పాత ప్రపంచమా అని పిల్లలైన మీరు స్పష్టముగా అడుగుతారు. ఈ విధంగా స్పష్టంగా రెండిటికి వ్యత్యాసము తెలిపించాలి. అందుకు చాలా మంచి తెలివి(మెదడు) కావాలి. నేను నరకవాసినా లేక స్వర్గవాసినా? అని మనుష్యులు స్వయాన్ని ప్రశ్నించుకొనునట్లు యుక్తిగా వ్రాయాలి. ఇది పాత ప్రపంచమా, కొత్త ప్రపంచమా? ఇది రామ రాజ్యమా లేక రావణ రాజ్యమా? మేము పాత కలియుగ ప్రపంచ నివాసులమా లేక నూతన ప్రపంచ నివాసులమా? అని స్వయాన్ని ప్రశ్నించుకొనునట్లు హిందీలో వ్రాసి తర్వాత ఇంగ్లీషు, గుజరాతీ భాషలలో అనువాదము చేయాలి. అలా వ్రాసినందున మనుష్యులు స్వయాన్ని మేము ఎక్కడి నివాసులము? అని ప్రశ్నించుకోవాలి. ఎవరైనా శరీరాన్ని వదిలితే స్వర్గస్థులయ్యారని అంటారు. కాని ఇప్పుడు స్వర్గమెక్కడుంది? ఇప్పుడిది కలియుగము. తప్పకుండా పునర్జన్మ కూడా ఇక్కడే తీసుకుంటారు కదా. స్వర్గమని సత్యయుగమును అంటారు. అచ్చటికి ఇప్పుడే ఎలా వెళ్లగలరు? ఇవన్నీ విచార సాగర మథనము చేయవలసిన విషయాలు. ఈ విధంగా స్పష్టంగా వ్యత్యాసము వ్రాసి ఉండాలి. అందులో భగవానువాచ అని ఇలా వ్రాయండి - ప్రతి ఒక్కరూ స్వయాన్ని నేను సత్యయుగ రామరాజ్య నివాసినా లేక కలియుగ రావణరాజ్య నివాసినా? అని ప్రశ్నించుకోవాలి. బ్రాహ్మణలైన మీరు సంగమయుగ నివాసులు. మిమ్ములను గురించి ఇతరులెవ్వరికీ తెలియదు. మీరు ఇతరులందరి కంటే భిన్నమైనవారు. మీకు సత్యయుగము, కలియుగముల గురించి యధార్థంగా తెలుసు. మీరు వికారి భ్రష్ఠాచారులా లేక నిర్వికారి శ్రేష్ఠాచారులా? అని మీరే ప్రశ్నించవచ్చు. ఈ విషయాలతో ఒక పుస్తకము కూడా తయారు చేయవచ్చు. క్రొత్త క్రొత్త విషయాలు వెలికి తీయవలసి వస్తుంది కదా. వాటి ద్వారా ఈశ్వరుడు సర్వవ్యాపి కాదని మనుష్యులు అర్థము చేసుకోవాలి. మీరు వ్రాసిన ఈ విషయాలు చదువుకొని వారంతకు వారే లోలోపల ప్రశ్నించుకుంటారు. దీనిని ఇనుప యుగమని అందరూ అంటారు. దీనిని సత్యయుగ, దైవీ ప్రపంచమని ఎవ్వరూ అనలేరు. ఇది నరకమా? లేక స్వర్గమా ? - ఇటువంటి ఫస్ట్‌క్లాస్‌ వ్రాతలు వ్రాయండి. వాటిని చదివి మనుష్యులకు మేము వాస్తవంగా నరకవాసులము, పతితులమని మాలో దైవీగుణాలు లేవని వారంతకు వారే అర్థం చేసుకోవాలి. కలియుగములో సత్యయుగవాసులు ఒక్కరు కూడా ఉండరు. ఈ విధంగా విచార సాగర మథనము చేసి వ్రాయాలి. ఎవరు చేస్తారో వారే అర్జునుడు,........................గీతలో అర్జునుని పేరు ప్రస్తావించారు.

ఇప్పుడున్న గీతలో పిండిలో ఉప్పు ఉన్నంత మాత్రమే నిజముందని తండ్రి చెప్తున్నారు. ఉప్పుకు, పంచదారకు ఎంత తేడా ఉంది?.............. ఒకటేమో తీపిగా, మరొకటేమో ఉప్పుగా ఉంటుంది. కృష్ణ భగవానువాచ అని వ్రాసి గీతను ఉప్పుగా(అసత్యంగా) చేసేశారు. మనుష్యులు ఎంతగానో ఊబిలో చిక్కుకుపోతారు. పాపం వారికి జ్ఞాన రహస్యాల గురించి తెలియదు. భగవంతుడు జ్ఞానమును మీకు మాత్రమే వినిపిస్తారు. ఇతరులెవ్వరికీ ఈ జ్ఞానము గురించి తెలియనే తెలియదు. జ్ఞానమైతే చాలా సహజమైనది. అయితే ఇది భగవంతుడే చదివిస్తున్నారనే విషయాన్ని మర్చిపోతారు. టీచరునే మర్చిపోతారు. వాస్తవానికి విద్యార్థులు తమ టీచరును ఎప్పుడూ మర్చిపోరు. ఘడియ - ఘడియ ''బాబా మేము మిమ్ములను మర్చిపోతామని పిల్లలంటారు.'' మాయ తక్కువైనది కాదని బాబా చెప్తారు. మీరు దేహాభిమానులుగా అవుతారు. దాని వలన అనేక వికర్మలు తయారవుతాయి. వికర్మలు చేయని రోజు ఒక్కటి కూడా ఉండదు. మీరు చేసే ముఖ్యమైన వికర్మ ఏమిటంటే తండ్రి ఆజ్ఞనే మర్చిపోవడము. 'మన్మనాభవ' - స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి అందరినీ ఆజ్ఞాపిస్తున్నారు. ఈ ఆజ్ఞను పాటించకపోతే తప్పకుండా వికర్మలే జరుగుతాయి. చాలా పాప కర్మలు జరిగిపోతాయి. తండ్రి ఇచ్చే ఆజ్ఞ చాలా సహజమైనది మరియు చాలా కఠినమైనది కూడా. ఎంత కష్టపడినా మళ్లీ మర్చిపోతారు. ఎందుకంటే అర్ధకల్పము దేహాభిమానులుగా ఉన్నారు కదా. 5 నిమిషాలు కూడా యధార్థ రీతిగా స్మృతిలో కూర్చోలేరు. పూర్తి రోజంతా స్మృతిలో ఉంటే కర్మాతీత అవస్థ వచ్చేస్తుందని అయితే ఇందులో చాలా కష్టముందని తండ్రి అర్థం చేయించారు. ఆ భౌతికమైన చదువునైతే మీరు బాగా చదువుకుంటారు. చరిత్ర-భూగోళము చదివే అభ్యాసము మీకు చాలా ఉంది. కాని స్మృతియాత్ర చేసే అభ్యాసము బొత్తిగా లేదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడం - ఇది కొత్త విషయము. ఇటువంటి తండ్రిని చాలా బాగా స్మృతి చేయాలని వివేకము చెప్తుంది. రొట్టె ముక్కలు తినేందుకు కొంత సమయాన్ని కేటాయిస్తారు. అది కూడా బాబా స్మృతిలోనే తింటారు. ఎంత స్మృతి చేస్తే అంత పవిత్రంగా అవుతారు. చాలామంది పిల్లల వద్ద వడ్డీ లభించేటంత అధికంగా ధనముంది. తండ్రిని స్మృతి చేస్తూ ఆహారము భుజిస్తూ ఉంటే చాలు. అయితే మాయ ఈ మాత్రము స్మృతి కూడా చేయనివ్వదు. కల్పక్రితము ఎవరు ఎంత పురుషార్థము చేశారో ఇప్పుడు కూడా అంతే చేస్తారు. సమయము పడ్తుంది. ఎవరైనా త్వరగా పరుగు తీసి చేరుకోవాలని అనుకుంటే అది సాధ్యము కాదు. వీరిలో ఇద్దరు తండ్రులున్నారు. అనంతమైన తండ్రికి తమ స్వంత శరీరము లేనే లేదు. వారు ఇతనిలో ప్రవేశించి మాట్లాడ్తారు. కావున తండ్రి శ్రీమతమును అనుసరించాలి. దేహ సహితము సర్వ ధర్మాలను వదలి స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి పిల్లలైన మనకు శ్రీమతమునిస్తున్నారు. మీరు ఇక్కడకు పవిత్రంగా వచ్చారు. 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఆత్మలైన మీరు పతితంగా అయ్యారు. ఇప్పుడు పావనంగా అయ్యేందుకు శ్రీమతమును అనుసరించండి. అప్పుడు మీ పాపాలు తొలగిపోతాయని తండ్రి గ్యారెంటీ ఇస్తున్నారు. మీ ఆత్మలు బంగారు వలె తయారైపోతాయి. కావున అచ్చట దేహాలు కూడా బంగారు సమానమైనవి లభిస్తాయి. ఈ కులానికి చెందినవారైతే మీ మాటలు విని ఆలోచనలో పడ్తారు. మీరు చెప్పే మాటలు బాగున్నాయని అంటారు. పావనంగా తయారవ్వాలంటే ఎవ్వరికీ దు:ఖమునివ్వరాదు. మనసా, వాచా, కర్మణా పవిత్రంగా అవ్వాలి. మనసులో తుఫానులు వస్తాయి. మీరు అనంతమైన సామ్రాజ్యాన్ని తీసుకుంటారు కదా. మీరు భలే సత్యము తెలిపినా, తెలుపకపోయినా తండ్రి స్వయంగా చెప్తున్నారు - మాయ ద్వారా చాలా వికల్పాలు వస్తాయి. అయితే కర్మేంద్రియాలతో ఎప్పుడూ వికర్మలు చేయకండి. కర్మేంద్రియాలతో ఎలాంటి పాపమూ చేయరాదు.

కనుక ఇటువంటి వ్యతాసాన్ని చూపే విషయాలు బాగా స్పష్టంగా వ్రాయాలి. ఉదాహరణానికి కృష్ణుడు 84 జన్మలు పూర్తిగా తీసుకుంటాడు. శివుడు పునర్జన్మ తీసుకోరు. అతడు(శ్రీ కృష్ణుడు) సర్వ గుణ సంపన్నమైన దేవత. వీరు అందరి తండ్రి. పాండవుల చిత్రాలను ఎంతో పెద్దవిగా చేయడం మీరు చూచారు అనగా పాండవులు చాలా విశాలబుద్ధి కలిగినవారని అర్థము. వారి బుద్ధి చాలా విశాలంగా ఉండేది. అయితే మనుష్యులు వారి శరీరాలను పెద్దవిగా తయారు చేశారు. మీ వంటి విశాలబుద్ధి ఇతరులెవ్వరికీ ఉండదు ఎందుకంటే మీది ఈశ్వరీయ బుద్ధి. భక్తిలో ఎన్నో పెద్ద పెద్ద చిత్రాలు తయారు చేసి ధనాన్ని నష్టపరచుకుంటారు. వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు అనేకము తయారు చేసి ఎంతో ఖర్చు చేశారు! మీరు ఎంతో ధనాన్ని పోగొట్టుకొంటూ వచ్చారని తండ్రి చెప్తున్నారు. అనంతమైన తండ్రి ఫిర్యాదు చేస్తున్నారు. బాబా మనకు అపారమైన ధనము ఇచ్చారని మీరు అనుభవము(ఫీల్‌) చేస్తున్నారు. రాజయోగము నేర్పించి రాజాధి రాజులుగా తయారు చేశారు. వారు భౌతిక విద్యను చదువుకొని బ్యారిష్టరు మొదలైన వారిగా అవుతారు. ఆ పదవి వలన ధన సంపాదన జరుగుతుంది. అందుకే జ్ఞానము(చదువు) సంపాదనకు మూలము అని అంటారు. ఇప్పుడు ఈ ఈశ్వరీయ చదువు కూడా సంపాదనకు మూలము. ఈ చదువు ద్వారా అనంతమైన సామ్రాజ్యము లభిస్తుంది. భాగవతము, రామాయణము మొదలైన వాటిలో ఎలాంటి జ్ఞానము లేదు. ఏ లక్ష్యము, ఉద్ధేశ్యమూ లేవు. తండ్రి ఎవరైతే జ్ఞానసాగరులో వారు స్వయంగా కూర్చొని పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. ఇది పూర్తిగా కొత్త చదువు. అది కూడా చదివించేది ఎవరు? స్వయం భగవంతుడు. నూతన ప్రపంచానికి యజమానిగా చేసేందుకు చదివిస్తారు. ఈ లక్ష్మీనారాయణులు ఈ చదువు ద్వారానే ఇంత ఉన్నత పదవి పొందారు. రాజ్య పదవి ఎక్కడ, ప్రజా పదవి ఎక్కడ? అదృష్టము మేల్కొన్నవారి నావ ఆవలి తీరానికి చేరిపోతుంది. చదువుకొని ఇతరులను చదివించగలమా లేదా? అనే విషయము విద్యార్థులు అర్థము చేసుకోగలరు. చదువు పై పూర్తి గమనముంచాలి. రాతిబుద్ధిగా ఉన్నందున కొంచెము కూడా అర్థము కాదు. మీరు బంగారు బుద్ధి గలవారిగా అవ్వాలి. ఎవరు సర్వీసు చేస్తూ ఉంటారో వారి బుద్ధి బంగారుబుద్ధిగా అవుతుంది. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వమును తీసుకోండి అని బ్యాడ్జిని కూడా చూపించి ఎవరికైనా అర్థం చేయించగలరు. భారతదేశము స్వర్గముగా ఉండేది కదా. ఇది నిన్నటి విషయమే. 5 వేల సంవత్సరాలెక్కడ? లక్షల సంవత్సరాలెక్కడ? ఎంత వ్యత్యాసముంది! మీరు అర్థం చేయించినా అర్థము చేసుకోరు. పూర్తిగా రాతిబుద్ధి వలె ఉన్నారు. ఈ బ్యాడ్జియే మీకు ఒక గీత వంటిది. ఇందులో మొత్తం చదువంతా ఇమిడి ఉంది. మనుష్యులకైతే భక్తిమార్గములోని గీత మాత్రమే గుర్తు ఉంటుంది. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా ఏ గీతనైతే వింటారో దాని ద్వారా మీరు 21 జన్మలకు సద్గతి పొందుతారు. మొట్టమొదట గీతను చదివినవారు మీరే. పూజలు ప్రారంభించింది కూడా మీరే. ఇప్పుడు పురుషార్థము చేసి పాపం పేదవారిని భక్తిమార్గపు సంకెళ్ళ నుండి విడిపించాలి. ఎవరో ఒకరికి అర్థం చేయిస్తూ ఉండండి. వారిలో నుండి ఒకరో, ఇద్దరో వెలువడ్తారు. ఒకవేళ 5-6 మంది కలిసి వస్తే వారితో వేరు వేరుగా ఫారమ్‌లు నింపించి వారికి వేరు వేరుగా అర్థం చేయించేందుకు ప్రయత్నము చేయండి. అలా చేయకుంటే వారిలో ఒక్కరు అటువంటివారుగా ఉంటే ఇతరులను కూడా చెడిపేస్తారు. ఫారమ్‌లు అయితే తప్పకుండా వేరు వేరుగా నింపించండి. ఒకరి ఫారమ్‌ ఒకరు చూసుకోరాదు. అప్పుడు వారు అర్థము చేసుకోగలరు. ఇటువంటి యుక్తులు అవలంబించినప్పుడు మీరు విజయవంతము అవుతూ ఉంటారు.

తండ్రి కూడా ఒక వ్యాపారియే. తెలివిగలవారు చాలా బాగా వ్యాపారము చేస్తారు. తండ్రి మనలను ఎంతో లాభములోకి తీసుకెెళ్తారు. గుంపుగా కలసి వస్తే ఫారమ్‌లు వేరు వేరుగా నింపాలని చెప్పండి. ఒకవేళ అందరూ ధార్మిక బుద్ధిని కలిగి ఉంటే అందరినీ కలిపి కూర్చుండబెట్టి మీరు గీతను చదివారా? దేవతలను నమ్ముతారా? అని అడగండి. భక్తులకే వినిపించమని బాబా చెప్పారు. నా భక్తులు మరియు దేవతల భక్తులు ఈ విషయాలను త్వరగా అర్థము చేసుకుంటారు. రాతిని బంగారుగా తయారు చేయడం సులభమైన పని కాదు(పిన్నమ్మ ఇంటిలో గడిపినంత సులువైన పని కాదు). దేహాభిమానము అత్యంత కఠినమైన మురికి జబ్బు. ఎంతవరకు దేహాభిమానము తొలగిపోదో, అంతవరకు బాగుపడడం చాలా కష్టము. ఇందులో పూర్తి నారాయణీ నషా ఉండాలి. మనము ఇచ్చటకు అశరీరులుగా వచ్చాము. మళ్లీ అశరీరులుగా అయ్యి వెళ్లాలి. అసలు ఇప్పుడిక్కడ ఏముంది? తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి. ఇందులోనే శ్రమ ఉంది. గమ్యము చాలా గొప్పది. వీరు కల్పక్రితము వలె మంచి సహాయకారులుగా అవుతారని వారి నడవడిక ద్వారా తెలిసిపోతుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. మనసా, వాచా, కర్మణా పవిత్రంగా ఉండాలి. కర్మేంద్రియాలతో ఎలాంటి వికర్మలు జరగకుండా వాటిని నియంత్రించాలి. ఆత్మను బంగారుగా తయారు చేసేందుకు తప్పకుండా స్మృతిలో ఉండాలి.

2. దేహాభిమానమనే కఠినమైన జబ్బు నుండి విడుదల అయ్యేందుకు నారాయణీ నషాలో ఉండాలి. మేము అశరీరులుగా వచ్చాము, ఇప్పుడు అశరీరులుగా అయ్యి వాసస్‌ వెళ్లాలని అభ్యాసము చేయండి.

వరదానము :-

''అత్యంత చాతుర్యము గల తండ్రి ముందు చాతుర్యము చూపించేందుకు బదులు అనుభూతి చేసే శక్తి ద్వారా సర్వ పాపాల నుండి ముక్త్‌ భవ''

చాలామంది పిల్లలు అత్యంత చాతుర్యము గల తండ్రి ముందు కూడా చాతుర్యము చూపిస్తారు - తాము చేసిన పనిని సిద్ధము చేసుకునేందుకు, తమ పేరును ప్రసిద్ధము చేసుకునేందుకు ఆ సమయంలో అనుభవం చేస్తారు కానీ ఆ అనుభవంలో శక్తి ఉండదు. అందువలన పరివర్తన జరగదు. చాలామందికి ఇది మంచిది కాదు అని అర్థము చేసుకుంటారు కాని పేరు చెడిపోరాదు అని అనుకుంటారు అందువలన తమ వివేకాన్ని ఖూనీ చేస్తారు, ఇది కూడా పాప ఖాతాలో జమ అవుతుంది. అందువలన చాతుర్యాన్ని వదిలి సత్యమైన, హృదయపూర్వకమైన అనుభూతి ద్వారా స్వయాన్ని పరివర్తన చేసుకొని పాపాల నుండి ముక్తులుగా అవ్వండి.

స్లోగన్‌ :-

''జీవితంలో ఉంటూ రకరకాల బంధనాల నుండి ముక్తులుగా ఉండడమే జీవన్ముక్త స్థితి.''

బ్రహ్మబాబా సమానంగా అయ్యేందుకు విశేషమైన పురుషార్థము

భలే సేవా బంధనమున్నా ఫరిస్తా జీవనమంటే బంధనముక్త జీవితము. కాని ఎంత తీవ్ర వేగంతో సేవ చేస్తారంటే ఎంత సేవ చేస్తున్నా సదా ఫ్రీ గా ఉంటారు. ఎంత ప్రియంగా(ప్యారాగా) ఉంటారో, అంత అతీతంగా(న్యారాగా) ఉంటారు. సదా స్వతంత్ర స్థితి అనుభవమవ్వాలి ఎందుకంటే శరీరము మరియు కర్మలకు అధీనులుగా ఉండరు.