28-05-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - విశ్వములోని ఆత్మలంతా అజ్ఞాన వశులై దు:ఖములో ఉన్నారు. మీరు వారికి ఉపకారము చేయండి. తండ్రి పరిచయాన్నిచ్చి సంతోషపెట్టండి, వారి కనులు తెరిపించండి. ''

ప్రశ్న :-

ఏ సేవా కేంద్రము వృద్ధికైనా ఆధారమేది ?

జవాబు :-

నిస్వార్థమైన, సత్యమైన హృదయపూర్వక సేవ చేయాలనే ఆసక్తి సదా ఉంటే, హుండి దానంతకదే నిండుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ సేవ జరిగేందుకు వీలు ఉందో అక్కడ ఏర్పాటు చేయాలి. ఎవ్వరినీ యాచించరాదు. యాచించుట కంటే మరణించుట మేలు. వాటంతకవే అన్నీ సమకూరుతాయి. మీరు లౌకికము వారి వలె చందాలు వసూలు చేయరాదు. యాచించుట వలన సేవాకేంద్రములో శక్తి నిండదు. అందువలన ఎవ్వరినీ యాచించకుండా సేవాకేంద్రాన్ని స్థాపించండి.

ఓంశాంతి.

ఆత్మిక పిల్లలు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ప్రారంభములో మనము పై నుండి ఇక్కడకు ఎలా వస్తామో అర్థం చేయించే జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. ఒక నాటకములో విష్ణు అవతరణను విమానములో కూర్చొని క్రిందికి వచ్చినట్లు చూపిస్తారు. వారు చూపించే అవతారాలు మొదలైనవన్నీ అసత్యములని, పిల్లలైన మీకిప్పుడు తెలుసు. ఆత్మలైన మనము మొదట ఎక్కడ ఉండేవారమో పై నుండి ఇక్కడకు ఎలా వచ్చామో, 84 జన్మల పాత్ర చేసి పతితులుగా ఎలా అయ్యామో, పిల్లలైన మీకిప్పుడు తెలుసు. ఇప్పుడు మళ్లీ తండ్రి మనలను పవిత్రంగా చేస్తున్నారు. 84 జన్మల చక్రములో మనమెలా తిరుగుతామో, విద్యార్థులైన మీ బుద్ధిలో తప్పకుండా ఉండాలి. మీరు 84 జన్మలు ఎలా తీసుకుంటారో తండ్రియే అర్థం చేయిస్తారు. కల్పము ఆయువును చాలా ఎక్కువగా చూపించినందున, ఇంత సులభమైన విషయాన్ని కూడా అర్థము చేసుకోలేరు. అందుకే దీనిని మూఢ విశ్వాసము లేక గుడ్డి నమ్మకము అని అంటారు. ఇతర ధర్మాలు ఎలా స్థాపించబడ్తాయో కూడా మీ బుద్ధిలో ఉంది. పునర్జన్మలు తీసుకుంటూ పాత్రను అభినయిస్తూ ఇప్పుడు మీరు అంతిమ జన్మలోకి వచ్చేశారు. ఇప్పుడు మళ్లీ వాపస్‌ వెళ్తారు. ఈ జ్ఞానమంతా పిల్లలైన మీకు తెలిసిపోయింది. ప్రపంచములో మరెవ్వరికీ ఈ జ్ఞానము గురించి తెలియదు. 5 వేల సంవత్సరాల ముందు స్వర్గము(ప్యారడైజ్‌) ఉండేదని కూడా అంటారు. అయితే అది ఏమిటో, ఎలా ఉండేదో ఎవ్వరికీ తెలియదు. తప్పకుండా ఆది సనాతన దేవీ దేవతల రాజ్యముండేది. అయితే ఆ ధర్మము గురించి కొద్దిగా కూడా తెలియదు. మీకు కూడా ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదని మీకు తెలుసు. ఇతర ధర్మాలలోనివారు వారి ధర్మ స్థాపకులను గురించి తెలియదని చెప్పరు. ఇప్పుడు మీరు తెలుసుకుని జ్ఞాన స్వరూపులుగా అయ్యారు. మిగిలిన ప్రపంచమంతా అజ్ఞానములో ఉంది. మనము ఎంతో వివేకవంతులుగా ఉండేవారము. ఇప్పుడు మళ్లీ తెలివిహీనులుగా, అజ్ఞానులుగా అయిపోయాము. మానవులుగా ఉంటూ లేక పాత్రధారులుగా ఉండి మనకు ఏమియూ తెలిసేది కాదు. జ్ఞాన ప్రభావము ఎలా ఉందో చూడండి! ఇది మీకు మాత్రమే తెలుసు. కావున పిల్లలు లోలోపల సంతోషముతో గద్గదమవ్వాలి. ధారణ జరిగినప్పుడు ఆ సంతోషము ఆంతరికము నుండి వస్తుంది. ప్రారంభములో మనమిచ్చటకు ఎలా వచ్చామో, తర్వాత ఎలా శూద్ర కులము నుండి బ్రాహ్మణ కులములోకి బదిలీ అయ్యామో మీకు తెలుసు. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతూ ఉందో మీకు తప్ప ఈ ప్రపంచములో మరెవ్వరికీ తెలియదు. ఆంతరికములో ఈ జ్ఞాన డ్యాన్స్‌ చేస్తూ జరుగుతూ ఉండాలి. బాబా మనకు ఎంతో ఆద్భుతమైన జ్ఞానమునిస్తారు. ఈ జ్ఞానము ద్వారా మనము మన వారసత్వమును పొందుతాము. ఈ రాజయోగము ద్వారా నేను మిమ్ములను రాజాధి రాజులుగా తయారుచేస్తానని కూడా వ్రాయబడి ఉంది. అయితే ఏ మాత్రము అర్థమయ్యేది కాదు. ఇప్పుడు మీ బుద్ధిలోకి మొత్తం రహస్యమంతా వచ్చేసింది. మనము శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతాము. ఈ మంత్రము కూడా బుద్ధిలో ఉంది. మనమే బ్రాహ్మణులము, మళ్లీ దేవతలుగా అవుతాము. ఆ తర్వాత మళ్లీ దిగుతూ దిగుతూ క్రిందకు వచ్చేస్తాము(హం సో బ్రాహ్మణ్‌ ఫిర్‌ దేవతా ఫిర్‌ నీచే ఆతే హై......) ఎన్ని పునర్జన్మలు తీసుకుంటూ చక్రములో తిరుగుతామో బుద్ధిలో ఉన్న కారణంగా సంతోషము కూడా ఉండాలి. ఇతరులకు కూడా ఈ జ్ఞానము ఎలా లభించాలి? అని ఎన్నో ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. అందరికీ తండ్రి పరిచయము ఎలా ఇవ్వాలి? బ్రాహ్మణులైన మీరు ఎంత ఉపకారము చేస్తారు! తండ్రి కూడా ఉపకారము చేస్తారు కదా. పూర్తిగా అజ్ఞానములో ఉన్నవారిని సదా సుఖవంతులుగా చేయాలి. వారి కనులు తెరిపించాలి. సంతోషమౌతుంది కదా. ఎవరికి సేవ చేయాలని ఆసక్తి ఉంటుందో, వారి ఆంతరికములో చాలా సంతోషము ఉండాలి. ఆత్మలమైన మనము ఎక్కడ ఉండేవారమో పాత్ర చేసేందుకు ఎలా వస్తామో ఎంత ఉన్నతంగా అయ్యి మళ్లీ ఎలా క్రిందకు వస్తామో రావణరాజ్యము మళ్లీ ఎప్పుడు ప్రారంభమౌతుందో ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలోకి వచ్చాయి.

భక్తి మార్గము, జ్ఞాన మార్గాలకు రాత్రికి పగులుకున్నంత తేడా ఉంది. ప్రారంభము నుండి భక్తి చేసింది ఎవరు? మొట్టమొదట మనమే వచ్చాము, కావున చాలా సుఖమనుభవించాము. మళ్లీ మేమే భక్తి చేయడం ప్రారంభించామని మీరు చెప్తారు. పూజ్యులకు, పూజారులకు రాత్రికి పగులుకు ఉన్నంత బేధముంది. ఇప్పుడు మీ వద్ద ఎంతో జ్ఞానముంది. అపారమైన సంతోషముండాలి కదా. మనము 84 జన్మల చక్రము ఎలా పూర్తి చేశామో మీకు తెలుసు. 84 జన్మలెక్కడ, 84 లక్షలెక్కడ! ఇంత చిన్న విషయము కూడా ఎవ్వరికి ధ్యానంలోకి రాదు. లక్షల సంవత్సరాలలో పోల్చుకుంటే ఇది ఒకటి రెండు రోజులకు సమానమవుతుంది. మంచి మంచి పిల్లల బుద్ధిలో ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. అందుకే వారిని స్వదర్శన చక్రధారులని అంటారు. సత్యయుగములో ఈ జ్ఞానముండదు. స్వర్గానికి ఎంత గొప్ప మహిమ ఉంది. అక్కడ కేవలం భారతదేశమే ఉండేది. ఏది ఒకప్పుడు ఉండేదో అది మళ్లీ తయారవ్వాల్సిందే. బయటి నుండి ఏమీ కనిపించదు. సాక్షాత్కారాలు జరుగుతాయి. ఈ పాత ప్రపంచము ఇప్పుడు సమాప్తమైపోతుందని మీకు తెలుసు. తర్వాత మళ్లీ నెంబరువారుగా మనము నూతన ప్రపంచములోకి వస్తాము. పాత్రలు చేసేందుకు ఆత్మలు ఎలా వస్తాయో కూడా మీరు తెలుసుకున్నారు. నాటకములో చూపునట్లు ఆత్మలు పై నుంచి క్రిందకు దిగి రావు. ఆత్మనైతే ఈ కనుల ద్వారా ఎవ్వరూ చూడలేరు. ఆత్మ ఎలా వస్తుందో, చిన్న శరీరములో ఎలా ప్రవేశిస్తుందో, ఇదంతా చాలా అద్భుతమైన నాటకము. ఇది ఈశ్వరీయ చదువు. దీనిని గురించి రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ ఉండాలి. మనము ఒక్కసారి అర్థం చేసుకుంటాము. దానిని చూచినట్లు వర్ణన చేస్తాము. పూర్వము ఇంద్రజాలము చేయువారు చాలా వస్తువులు వెలుపలికు తీసి చూపేవారు. అందుకే తండ్రిని ఇంద్రజాలికుడు, వ్యాపారి(సౌదాగర్‌), రత్నాగరుడు అని అంటారు కదా. ఆత్మలోనే జ్ఞానమంతా భద్రపరచబడ్తుంది. ఆత్మయే జ్ఞానసాగరము. పరమాత్మను జ్ఞానసాగరులని అంటారు. కానీ వారు ఎవరో, ఇంద్రజాలుకునిగా ఎలా అవుతారో, ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. ఇంతకు ముందు మీకు కూడా అర్థమయ్యేది కాదు. ఇప్పుడు తండ్రి వచ్చి దేవతలుగా తయారుచేస్తారు. లోపల మీకు చాలా సంతోషముండాలి. ఒక్క తండ్రి మాత్రమే జ్ఞానసాగరులు. వారే మనలను చదివిస్తారు. ఈ విషయాలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. రాత్రింబవళ్ళు దీనిని ఆంతరికములో స్మరిస్తూ ఉండాలి. ఈ బేహద్‌ నాటక జ్ఞానము కేవలం ఒక్క తండ్రి మాత్రమే వినిపించగలరు. మరెవ్వరూ వినిపించలేరు. బాబా ఈ డ్రామానేమీ చూడలేదు కానీ వారిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. నేను సత్య-త్రేతా యుగాలలో రాను కానీ దానికి సంబంధించిన జ్ఞానమంతా వినిపిస్తానని తండ్రి అంటారు. ఆశ్చర్యమనిపిస్తుంది కదా. ఎవరైతే ఎప్పుడూ ఆ పాత్రనే చూడలేదో అటువంటివారు ఎలా తెలిపిస్తున్నారు! నేను ఏమీ చూడను, అంతేకాక సత్య-త్రేతా యుగాలలోకి రాను కానీ నాలో జ్ఞానము ఎంత నిండుగా ఉందంటే నేను ఒక్కసారి మాత్రమే వచ్చి మీకు ఆ జ్ఞానమంతా వినిపిస్తాను. మీరు పాత్ర చేశారు, కాని మీకు ఏమీ తెలియదు. ఎవరైతే పాత్రను అభినయించనే లేదో వారు అన్నీ వినిపిస్తారు. ఇది అద్భుతము, ఆశ్చర్యము కదా. పాత్రధారులైన మనకు ఏమీ తెలియదు. కానీ తండ్రిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. నేను మీకు అనుభవము వినిపించేందుకు సత్య, త్రేతా యుగాలలో రాను కదా అని బాబా అంటారు. డ్రామానుసారము చూడకుండా, అనుభవము చేయకుండా మీకు మొత్తం జ్ఞానమంతా ఇస్తారు. ఇది ఎంత అద్భుతము - నేను పాత్రను అభినయించేందుకు రాను కానీ మొత్తం పాత్రనంతటిని తెలిపిస్తాను. అందుకే నన్ను జ్ఞానసాగరులని అంటారు.

ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, మీరు మీ ఉన్నతి చేసుకోవాలంటే స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇది ఒక ఆట. మీరు మళ్లీ ఇదే డ్రామాను అభినయిస్తారు, దేవీ దేవతలుగా అవుతారు. చివర్లో చక్రమంతా పూర్తి చేసి చివరిలో మనుష్యులుగా అవుతారు. బాబాలో ఈ జ్ఞానమంతా ఎలా వచ్చింది? అని ఆశ్చర్యపడాలి కదా! వారికి ఏ గురువూ లేరు. డ్రామానుసారము ముందే వారిలో ఈ పాత్ర అభినయించాలని నిశ్చయింపబడి ఉంది. దీనిని స్వాభావికము అని అంటారు కదా. ప్రతి విషయము అద్భుతంగా ఉంటుంది. కావున తండ్రి కూర్చుని క్రొత్త క్రొత్త విషయాలు అర్థం చేయిస్తారు. ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి. 84 జన్మల చక్రమును కూడా స్మృతి చేయాలి. ఈ రహస్యము కూడా బాబాయే అర్థం చేయించారు. విరాట రూప చిత్రము ఎంత బాగుంది! లక్ష్మీనారాయణుల చిత్రము లేక విష్ణు చిత్రమును తయారు చేయువారు మనము 84 జన్మలు ఎలా తీసుకుంటామో చూపిస్తారు. మనమే దేవతలు, తర్వాత క్షత్రియులు, వైశ్యులు, మళ్లీ శూద్రులుగా అవుతాము. దీనిని స్మృతి చేయడంలో ఏమైనా కష్టముందా? తండ్రి జ్ఞానసాగరులు. వారు ఎవరి వద్దా చదువుకోలేరు. శాస్త్ర్రాలు మొదలైనవి కూడా చదవలేదు. ఏమీ చదవకుండా ఏ గురువు లేకుండా ఇంత గొప్ప జ్ఞానమును కూర్చుని వినిపిస్తున్నారు. ఇటువంటి వారిని ఎప్పుడూ చూడలేదు. తండ్రి ఎంత మధురమైనవారు! భక్తిమార్గములో కొంతమంది ఒకరిని, మరి కొంతమంది మరొకరిని మధురమని భావిస్తారు. ఎవరికి ఎలా తోస్తే, ఎవరిని మనస్సులో ఇష్టపడ్తారో వారిని పూజిస్తారు. బాబా కూర్చుని అన్ని రహస్యాలను తెలిపిస్తున్నారు. ఆత్మయే ఆనంద స్వరూపము, తర్వాత ఆత్మనే దు:ఖ స్వరూపముగా ఛీ-ఛీగా తయారౌతుంది. భక్తిమార్గములో మీకు ఏమీ తెలిసేది కాదు. నన్ను ఎంతో మహిమ చేసేవారు కానీ నన్ను గురించి ఏ మాత్రమూ తెలియదు. ఇది కూడా ఎంతో అద్భుతమైన ఆట. ఈ ఆటనంతా పూర్తిగా బాబాయే అర్థము చేయిస్తారు. ఇన్ని చిత్రాలు, మెట్లు(సీడీ) మొదలైనవి ఎప్పుడూ చూడను కూడా లేదు. ఇప్పుడు చూస్తున్నారు, వింటున్నారు అందువలన ఈ జ్ఞానము యథార్థమైనదని అంటారు. కానీ కామము మహాశత్రువు. దీని పై విజయము పొందాలి అని వింటూనే దృఢత్వమును కోల్పోయి ఢీలా పడిపోతారు. మీరు ఎంతగా అర్థం చేయించినా వారికి అర్థము కాదు. ఎంతో శ్రమ చేయాల్సి వస్తుంది. కల్పక్రితము ఎవరైతే అర్థము చేసుకున్నారో వారే ఇప్పుడు కూడా అర్థము చేసుకుంటారని మీకు తెలుసు. ఎంతమంది దైవీ పరివారము వారిగా అవ్వాలో వారికే ఇవి ధారణ అవుతాయి. మనము శ్రీమతముననుసరించి మన రాజధానిని స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. ఇతరులను కూడా మీ సమానంగా చేయమని తండ్రి ఆదేశమునిస్తున్నారు. తండ్రి ఈ జ్ఞానమంతటిని వినిపిస్తున్నారు. మీరు కూడా వినిపిస్తున్నారు. కావున ఈ శివబాబా రథము కూడా తప్పకుండా వినిపించగలరు. కానీ స్వయాన్ని గుప్తము చేసుకుంటాడు. మీరు శివబాబానే స్మృతి చేస్తూ ఉండండి. ఈ రథమును కూడా మహిమ చేయరాదు. సర్వుల సద్గతిదాత, మాయ సంకెళ్ళ నుండి విడిపించేవారు ఒక్కరే.

తండ్రి కూర్చుని ఎలా అర్థము చేయిస్తున్నారో పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ తెలియనే తెలియదు. రావణుడంటే ఎవరో కూడా మనుష్యులకు తెలియదు. ప్రతి సంవత్సరము తగులబెడ్తూనే వస్తున్నారు. శత్రువుల బూతు బొమ్మలే(దిష్టి బొమ్మలే) తయారు చేస్తారు కదా. రావణుడు భారతదేశపు శత్రువని, అతడే భారతదేశాన్ని నిరుపేదగా, దు:ఖమయంగా చేస్తాడని ఇప్పుడు మీకు తెలుసు. అందరూ 5 వికారాల రావణుని పంజరములో చిక్కుకుని ఉన్నారు. ఇతరులను కూడా ఈ రావణుని నుండి ఎలా విడిపించాలో పిల్లల బుద్ధిలోకి రావాలి. సేవ జరిగే అవకాశముంటే అచ్చట ఏర్పాటు చేయాలి. సత్యమైన హృదయముతో, నిస్వార్థ భావముతో సేవ చేయాలి. అటువంటి పిల్లల హుండీని నేను నింపుతానని బాబా చెప్తున్నారు. ఇది డ్రామాలో నిశ్చయింపబడి ఉంది. సేవకు మంచి అవకాశముంటే అడిగే అవసరం కూడా ఉండదు. తండ్రి చెప్పేశారు, కావున సేవ చేస్తూ ఉండండి. ఎవ్వరినీ యాచించకండి. యాచించుట కంటే మరణించుట మేలు. వాటంతకవే అన్నీ మీ వద్దకు వచ్చేస్తాయి. యాచించడం వలన సేవాకేంద్రములో అంత శక్తి నిండదు. యాచించకనే మీరు సేవాకేంద్రమును స్థాపించండి. వాటంతకవే అన్నీ వస్తూ ఉంటాయి. అందులో శక్తి ఉంటుంది. లౌకికులు చందాలు పోగు చేసినట్లు మీరు చేయరాదు.

మనుష్యులను భగవంతుడని ఎప్పుడూ అనరు. జ్ఞానమనేది బీజము కూడా. బీజరూపులైన తండ్రి కూర్చుని మీకు జ్ఞానమునిస్తున్నారు. బీజమే జ్ఞానసాగరము కదా. ఆ జడబీజమైతే తనను గురించి వర్ణన చేయలేదు. మీరు వర్ణన చేస్తారు. అన్ని విషయాలను అర్థము చేసుకోగలరు. ఈ అనంతమైన వృక్షమును గురించి ఎవ్వరూ అర్థం చేసుకోరు. నెంబరువారు పురుషార్థానుసారము అనన్య పిల్లలైన మీకు తెలుసు. మాయ కూడా చాలా శక్తివంతమైనదని తండ్రి అర్థం చేయిస్తారు. కొంత సహనము కూడా చేయవలసి వస్తుంది. వికారాలు చాలా కఠినమైనవి. మంచి సేవ చేయువారికి కూడా మాయ చెంపదెబ్బ ఎంత గట్టిగా తగుల్తుందంటే మేము నడుస్తూ నడుస్తూ క్రింద పడిపోయామని అంటారు. మెట్లు పైకి ఎక్కుతూ ఎక్కుతూ క్రింద పడిపోతారు. అందువలన అంతవరకు చేసిన సంపాదనంతా అంతమైపోతుంది, శిక్ష తప్పకుండా లభిస్తుంది. తండ్రితో ప్రతిజ్ఞ చేశారు, రక్తముతో కూడా వ్రాసి ఇచ్చారు అయినా మాయమైపోయారు. బాబా, పక్కా చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇన్ని యుక్తులు చేస్తున్నా మళ్లీ ప్రపంచము వైపుకు వెళ్ళిపోతారు. ఎంతో సులభంగా అర్థం చేయిస్తారు. పాత్రధారులు తమ పాత్రనే స్మృతి చేస్తూ ఉండాలి. తమ పాత్ర తాము ఎవ్వరూ మర్చిపోలేరు. తండ్రి ప్రతి రోజు రకరకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు కూడా అనేకమందికి అర్థం చేయిస్తారు. అయినా మేము బాబా సన్ముఖానికి వెళ్ళాలని అంటారు. తండ్రిది అద్భుతము, విచిత్రము, ప్రతి రోజు మురళి వినిపిస్తారు. వారు నిరాకారులు, నామము, రూపము, దేశము, కాలము వారికి లేవంటారే అయితే మురళి ఎలా వినిపిస్తారు? అని ఆశ్చర్యచకితులౌతారు. మళ్లీ పక్కా అయ్యి వస్తారు. ఇటువంటి తండ్రి వారసత్వము ఇచ్చేందుకు వచ్చారు, వారిని కలవాలని ఇష్టపడ్తారు. ఇదంతా తెలుసుకుని వచ్చి కలుసుకుంటే తండ్రి నుండి జ్ఞాన రత్నాలను ధారణ చేయగలరు. శ్రీమతమును పాలన చేయగలరు. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. జ్ఞానమును జీవితములో ధారణ చేసి సంతోషముతో గద్గదమవ్వాలి. అద్భుతమైన జ్ఞానమును, జ్ఞాన దాతను స్మృతి చేస్తూ జ్ఞాన నృత్యము చేయాలి.

2. మీ పాత్రనే మీరు స్మృతి చేయాలి. ఇతరుల పాత్రను చూడరాదు. మాయ చాలా శక్తివంతమైనది, అందువలన చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఉన్నతిలో మీరు నిమగ్నులై ఉండాలి. సేవ చేయాలనే ఆసక్తి కలిగి ఉండాలి.

వరదానము :-

'' సదా స్మృతి అనే ఛత్రఛాయ క్రింద, మర్యాదలనే రేఖ లోపల ఉండే మాయాజీత్‌ విజయీ భవ ''

తండ్రి స్మృతియే ఛత్రఛాయ. ఛత్రఛాయలో ఉండడమంటే మాయాజీత్‌ విజయులుగా అవ్వడం. సదా స్మృతి అనే ఛత్రఛాయ క్రింద, మర్యాదలనే రేఖ లోపల ఉంటే, లోపలకు వచ్చే ధైర్యము ఎవ్వరికీ ఉండదు. మర్యాదల రేఖకు బయటకు వచ్చారంటే మాయ కూడా తనవారిగా చేసుకోవడంలో తెలివి గలది. కానీ మనం అనేకసార్లు విజయులుగా అయ్యాము, విజయమాల మా స్మృతిచిహ్నమే అను స్మృతి ద్వారా సదా సమర్థంగా ఉంటే మాయతో ఓటమి జరగజాలదు.

స్లోగన్‌ :-

'' అన్ని ఖజానాలను స్వయంలో ఇముడ్చుకుంటే సంపన్నత అనుభవం అవుతూ ఉంటుంది. ''