21-02-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - ఆత్మాభిమానము విశ్వాధికారులుగా చేస్తుంది. దేహాభిమానము నిరుపేదలుగా చేస్తుంది. అందువల్ల ఆత్మాభిమానీ భవ ''
ప్రశ్న :-
ఏ అభ్యాసము అశరీరులుగా అవ్వడంలో చాలా సహయోగము చేస్తుంది?
జవాబు :-
స్వయాన్ని సదా పాత్రధారినని భావించండి. ఎలాగైతే పాత్రధారి పాత్ర పూర్తవ్వగానే వస్త్రాలను(వేషాన్ని) తీసేస్తాడో, అలా పిల్లలైన మీరు కూడా ఈ అభ్యాసము చేయాలి - కర్మ పూర్తవ్వగానే పురాతన శరీరమనే వస్త్రాన్ని వదిలి అశరీరులుగా అయిపోండి. ఆత్మా - ఆత్మా, భాయి - భాయి అనే అభ్యాసము చేస్తూ ఉండండి. పావనంగా అయ్యేందుకు ఇదే సహజ సాధనము. శరీరాన్ని చూడటంతో వికారీ(క్రిమినల్) ఆలోచనలు నడుస్తాయి. అందువల్ల అశరీరీ భవ.
ఓంశాంతి.
తండ్రి కూర్చుని పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. ఎందుకంటే పిల్లలు చాలా అవివేకులుగా అయిపోయారు. 5 వేల సంవత్సరాల క్రితము కూడా మీకు అర్థం చేయించాను. అంతే కాకుండా దైవీ కర్మలను కూడా నేర్పించాను. మీరు దేవీ దేవతా ధర్మములోకి వచ్చారు. తర్వాత డ్రామా ప్లాను అనుసారము పునర్జన్మ తీసుకుంటూ తీసుకుంటూ కళలు తగ్గిపోతూ తగ్గిపోతూ ఇక్కడ ప్రాక్టికల్గా పూర్తిగా కళా రహితంగా అయిపోయారు. ఎందుకంటే ఇది తమోప్రధాన రావణ రాజ్యము. ఈ రావణరాజ్యము కూడా మొదట సతోప్రధానంగా ఉండేది. తర్వాత సతో, రజో, తమోగా అయ్యింది. ఇప్పుడు పూర్తిగా తమోప్రధానంగా ఉంది. ఇప్పుడిది దీని అంతిమ సమయము. రావణ రాజ్యమును ఆసురీ రాజ్యమని అంటారు. రావణుని తగులబెట్టే ఫ్యాషన్ భారతదేశములో ఉంది. రామ రాజ్యము మరియు రావణ రాజ్యమని కూడా భారతవాసులే అంటారు. రామరాజ్యము సత్యయుగములో ఉంటుంది. రావణ రాజ్యము కలియుగములో ఉంటుంది. ఇవి బాగా అర్థము చేసుకోవలసిన విషయాలు. బాబాకు ఆశ్చర్యము కలుగుతుంది - ఎంతో మంచి మంచి పిల్లలు పూర్తిగా అర్థం చేసుకోని కారణంగా తమ అదృష్టానికి అడ్డుగీత గీసుకుంటారు. రావణుని అవగుణాలు అంటుకుంటాయి(ఆకర్షిస్తాయి). దైవీగుణాలను కూడా స్వయమే వర్ణన చేస్తారు. మీరే ఆ దేవతలుగా ఉండేవారని తండ్రి అర్థం చేయించారు. మీరే 84 జన్మలు అనుభవించారు. మీరు ఎందుకు తమోప్రధానంగా అయ్యారో మీకు వ్యతాసము తెలియజేయడం జరిగింది. ఇది రావణరాజ్యము. రావణుడు అందరికంటే గొప్ప శత్రువు. అతడే భారతదేశాన్ని ఇంత నిరుపేదగా, తమోప్రధానంగా చేశాడు. రామరాజ్యములో ఇంతమంది మనుష్యులు ఉండరు. అక్కడైతే ఒకే ధర్మము ఉంటుంది. ఇక్కడ అందరిలోనూ భూతాలు ప్రవేశించి ఉన్నాయి. క్రోధము, లోభము, మోహములు భూతాలు కదా. మనము(ఆత్మలము) అవినాశీ. ఈ శరీరము వినాశి. ఈ విషయము మర్చిపోతారు. ఆత్మాభిమానులుగా అవ్వనే అవ్వరు. చాలా దేహాభిమానులుగా ఉన్నారు. దేహాభిమానము మరియు ఆత్మాభిమానానికి రాత్రికి - పగలుకున్నంత వ్యతాసముంది. ఆత్మాభిమాని దేవీదేవతలు పూర్తి విశ్వాధిపతులుగా అవుతారు. దేహాభిమానములోకి రావడం వలన నిరుపేదలుగా అయిపోతారు. భారతదేశము బంగారు పిచుకగా ఉండేది. ఈ మాట అంటూ ఉంటారే కాని అర్థం తెలియదు. దైవీబుద్ధి గలవారిగా తయారుచేసేందుకే శివబాబా వస్తారు. తండ్రి చెప్తున్నారు - అత్యంత మధురమైన పిల్లలూ! మిమ్ములను విశ్వాధిపతులుగా చేస్తాను. ఈ లక్ష్మీనారాయణులు విశ్వాధికారులుగా ఉండేవారు. వీరికి ఈ రాజ్యమును వవరు ఇచ్చారో ఎప్పుడైనా విన్నారా? వారు ఇంతటి ఉన్నతపదవిని పొందేందుకు ఏ కర్మ చేశారు? కర్మల విషయము కదా. మనుష్యులు ఆసురీ కర్మలు చేస్తే ఆ కర్మలు వికర్మలు అయిపోతాయి. సత్యయుగములో కర్మ అకర్మగా ఉంటుంది. అక్కడ కర్మల ఖాతా ఉండదు. తండ్రి అర్థము చేయిస్తున్నారు కాని అర్థము చేసుకోనందున చాలా విఘ్నాలను కలిగిస్తారు. శివ-శంకరులు ఒక్కరే అని చెప్పేస్తారు. అరే! శివుడు నిరాకారుడు. ఒంటరిగా చూపిస్తారు. శంకర-పార్వతులను కలిపి చూపిస్తారు. ఇరువురి కర్తవ్యాలు(శివుడు మరియు శంకరుడు) పూర్తిగా వేరు వేరు. మినిష్టర్, ప్రసిడెంట్ ఇద్దరూ ఒక్కటే అని ఎలా అంటారు! ఇరువురి పదవులు పూర్తిగా వేరు. కనుక శివుడు-శంకరులు ఒక్కరే అని ఎలా అంటారు? ఎవరైతే రాముని సంప్రదాయములోకి రారో వారు ఏమీ అర్థం చేసుకోరని కూడా మీకు తెలుసు. ఆసురీ సంప్రదాయానికి చెందినవారు నిందిస్తారు. విఘ్నాలు వేస్తారు. ఎందుకంటే వారిలో 5 వికారాలు ఉన్నాయి కదా. దేవతలు సంపూర్ణ నిర్వికారులు. వారిది ఎంత ఉన్నత పదవి! ఎంతటి వికారులుగా ఉండేవారమో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వికారాల నుండే జన్మిస్తారు. సన్యాసులు కూడా వికారాల ద్వారానే జన్మ తీసుకోవలసి వస్తుంది. తర్వాత సన్యసిస్తారు. సత్యయుగములో ఈ విషయాలే ఉండవు. సన్యాసులకు సత్యయుగము గురించి తెలియదు. సత్యయుగము ఉండనే ఉంది అని అనేస్తారు. ఉదాహరణానికి కృష్ణుడు అంతటా ఉన్నాడని కొందరంటే, మరికొందరు రాధ కూడా అంతటా ఉందని అంటారు. అనేక మతమతాంతరాలు, అనేక ధర్మాలున్నాయి. అర్ధకల్పము దైవీ మతము నడుస్తుంది. అదే మీకు ఇప్పుడు లభిస్తోంది. మీరే బ్రహ్మ ముఖవంశావళిగా తర్వాత విష్ణు వంశీయులుగా తర్వాత చంద్ర వంశీయులుగా అవుతారు. ఆ రెండు రాజ్య వంశాలు మరొకటి బ్రాహ్మణ కులమని అంటారు. ఈ బ్రాహ్మణ కులమును వంశము(డినాస్టీ) అని అనరు. వీరికి రాజ్యము ఉండదు. దీనిని కూడా మీరే అర్థము చేసుకున్నారు. మీలో కూడా చాలా తక్కువ మందే అర్థము చేసుకుంటారు. కొందరైతే బాగుపడనే పడరు. ఏదో ఒక భూతము ఉంటుంది. లోభము, క్రోధము భూతాలు కదా. సత్యయుగములో ఏ భూతాలు ఉండవు. సత్యయుగములో దేవతలు ఉంటారు. వారు చాలా సుఖీలుగా ఉంటారు. దు:ఖమునిచ్చేవి భూతాలే. కామ భూతము ఆది-మధ్య-అంత్యములు దు:ఖమునిస్తుంది. దానిని జయించేందుకు చాలా శ్రమ చేయాలి. పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులుభము కాదు. తండ్రి చెప్తున్నారు - సోదర-సోదరీలని భావించినట్లయితే వికారీ దృష్టి ఉండదు. ప్రతి విషయములో ధైర్యము ఉండాలి. కొందరు తాము వివాహము చేసుకోమని చెప్తే ఇంట్లో నుండి బయటకు వెళ్లు అని అంటారు. అందువల్ల ధైర్యముండాలి. తమను తాము పరిశీలించుకోవాలి.
పిల్లలైన మీరు చాలా పదమాపదమ్ భాగ్యశాలురుగా అవుతున్నారు. ఇవన్నీ సమాప్తమైపోతాయి. అంతా మట్టిలో కలిసి పోవలసిందే. కొందరు మంచి ధైర్యముతో ముందుకు నడుస్తారు. కొందరు ధైర్యము చేసి మళ్లీ ఫెయిల్ అవుతారు. తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తూ ఉంటారు. కాని చెప్పినట్లు చేయకపోతే వారికి పూర్తి యోగము లేదని భావిస్తారు. భారతదేశపు ప్రాచీన రాజయోగమైతే ప్రసిద్ధి చెందింది. ఈ యోగము ద్వారానే మీరు విశ్వాధిపతులుగా అవుతారు. చదువే సంపాదనకు మూలము. చదువు నుండే మీరు నంబరువారుగా ఉన్నత పదవిని పొందుతారు. సోదర-సోదరీ దృష్టిలో కూడా బుద్ధి చంచలమవుతుంది. అందువల్ల తండ్రి దీని కంటే ఉన్నతములోకి తీసుకెళ్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇతరులను కూడా ఆత్మ భాయి - భాయి అని భావించండి. మనమంతా భాయి - భాయి(సోదరులము). అప్పుడు ఇక మరో దృష్టి వెళ్లనే వెళ్లదు. శరీరాన్ని చూడడం ద్వారానే వికారీ దృష్టి వస్తుంది. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ! ''అశరీరి భవ, దేహీ-అభిమానీ భవ''. స్వయాన్ని ఆత్మ అని భావించండి. ఆత్మ అవినాశి. శరీరము ద్వారా పాత్రను అభినయిస్తుంది. మళ్లీ శరీరము నుండి వేరు కావలసిందే. ఆ పాత్రధారులు పాత్రను పూర్తి చేసి వస్త్రాలను మార్చుకుంటారు. మీరు కూడా ఇప్పుడు పురాతన వస్త్రము(శరీరము)ను వదిలి నూతన వస్త్రమును ధరించాలి. ఈ సమయంలో ఆత్మ కూడా తమోప్రధానము, శరీరము కూడా తమోప్రధానముగా ఉన్నాయి. తమోప్రధాన ఆత్మ ముక్తిలోకి వెళ్లలేదు. పవిత్రమైనప్పుడే వెళ్ళగలదు. అపవిత్ర ఆత్మ వాపస్ వెళ్లలేదు. ఫలానావారు బ్రహ్మములో లీనమైనారని అసత్యము చెప్తారు. అలా ఒక్కరు కూడా తిరిగి వెళ్ళలేరు. అక్కడ ఎలాగైతే వంశ వృక్షము(ఆత్మిక వృక్షము) తయారై ఉందో, అది అలాగే ఉంటుంది. దీనిని గురించి బ్రాహ్మణ పిల్లలైన మీకు తెలుసు. భగవద్గీతలో బ్రాహ్మణుల పేరును కొంచెం కూడా చూపించలేదు. ప్రజాపిత బ్రహ్మ తనువులో ప్రవేశిస్తానని అర్థం చేయించాను. కనుక తప్పకుండా దత్తత(ఎడాప్షన్) తీసుకోవలసి ఉంటుంది. ఆ బ్రాహ్మణులు వికారులు. మీరు నిర్వికారులు. నిర్వికారులుగా అవ్వడంలో చాలా కష్టాలు సహించవలసి ఉంటుంది. ఈ నామ-రూపాలను చూడడం ద్వారా చాలా వికల్పాలు వస్తాయి. సోదర-సోదరీ సంబంధములో కూడా క్రిందపడిపోతారు. బాబా! మేము క్రిందపడిపోయాము, ముఖము నల్లగా చేసుకున్నామని వ్రాస్తారు. తండ్రి చెప్తున్నారు - వాహ్! సోదర-సోదరీలై ఉండమని నేను చెప్తే మీరు ఈ చెడు పని చేశారు. దానికి చాలా కఠినమైన శిక్ష లభిస్తుంది. సాధారణంగా ఎవరైనా ఎవరినైనా చెరిపినట్లయితే వారిని జైలులో వేయడం జరుగుతుంది. నేను స్థాపించిన భారతదేశము ఎంత పవిత్రంగా ఉండేది! దాని పేరే శివాలయము. ఈ జ్ఞానము కూడా ఎవరిలోనూ లేదు. ఇక ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందిన కర్మకాండలు. సత్యయుగములో అందరూ సద్గతిలో ఉంటారు. అందువల్ల అక్కడ ఏ పురుషార్థము చేయరు. ఇక్కడ అందరూ గతి-సద్గతి కొరకు పురుషార్థము చేస్తారు. ఎందుకంటే దుర్గతిలో ఉన్నారు. గంగా స్నానము చేసేందుకు వెళ్తారు. ఆ గంగ నీరేమైనా సద్గతిని కలుగజేస్తుందా? అది పావనంగా తయారుచేస్తుందా? కొంచెం కూడా తెలియదు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. ఎవరైనా స్వయం తెలుసుకోలేదంటే ఇక వారు ఇతరులకు ఏం అర్థం చేయిస్తారు? అందువల్లనే బాబా వారిని పంపించరు. బాబా! మీరు వచ్చినట్లయితే మీ శ్రీమతము అనుసారము నడుచుకొని దేవతలుగా అవుతామని పాడుతూ ఉంటారు. దేవతలు సత్య, త్రేతా యుగాలలో ఉంటారు. ఇక్కడ అన్నిటికంటే ఎక్కువగా కామ వికారాలలో చిక్కుకొని ఉన్నారు. కామ వికారము లేకుండా ఉండలేరు. ఈ వికారాలు మాత-పితల(లౌకిక) వారసత్వం వలె ఉన్నాయి. ఇక్కడ మీకు రాముని వారసత్వము లభిస్తుంది. పవిత్రత వారసత్వంగా లభిస్తుంది. అక్కడ వికారాల మాటే ఉండదు.
భక్తులు కృష్ణుడు భగవంతుడని అంటారు. మీరు అతనిని 84 జన్మలలో చూపిస్తారు. అరే! భగవంతుడైతే నిరాకారుడు. వారి పేరు శివుడు. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు! వారికి జాలి కూడా కలుగుతుంది. దయాహృదయులు కదా. ఇతడు ఎంత మంచి వివేకవంతుడైన బిడ్డ. ప్రభావము కూడా మంచిగా ఉంది. ఎవరిలో జ్ఞాన-యోగాల శక్తి ఉంటుందో వారు ఆకర్షిస్తారు. బాగా చదువుకున్నవారికి మంచి సత్కారము లభిస్తుంది. చదువుకోనివారికి సత్కారము లభించదు. ఈ సమయములో అందరూ ఆసురీ సాంప్రదాయములో ఉన్నారని మీకు తెలుసు. ఏమీ అర్థం చేసుకోరు. శివ-శంకరులకు గల వ్యత్యాసమైతే పూర్తి స్పష్టంగా ఉంది. వారు మూలవతనములో, వీరు సూక్ష్మవతనములో ఉంటారు. అందరూ ఒకే విధంగా ఎలా ఉంటారు? ఇది తమోప్రధాన ప్రపంచము. రావణుడు శత్రువు. ఆసురీ సంప్రదాయానికి చెందినవాడు ఇతరులను తన సమానంగా చేస్తాడు. ఇప్పుడు తండ్రి మిమ్ములను తమ సమానంగా దైవీ సంప్రదాయము వారిగా చేస్తారు. అక్కడ రావణుడు ఉండడు. అర్ధకల్పము అతనిని తగులబెడ్తారు. రామరాజ్యము సత్యయుగములో ఉంటుంది. గాంధీజీ కూడా రామరాజ్యమును కోరుకునేవారు. కాని అతడు రామరాజ్యము ఎలా స్థాపన చేయగలడు? అతడు ఆత్మాభిమానిగా అయ్యే ఏ శిక్షణను ఇచ్చేవాడు కాదు. తండ్రియే సంగమ యుగములో ఆత్మాభిమానులుగా అవ్వమని చెప్తారు. ఇది ఉత్తములుగా అయ్యే యుగము. తండ్రి ఎంత ప్రేమతో అర్థం చేయిస్తూ ఉంటారు. ఘడియ - ఘడియ ఎంతో ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి - బాబా! మీది అద్భుతము! మేము ఎంత రాతిబుద్ధి గలవారిగా ఉండేవారము! మీరు మమ్ములను ఎంత ఉన్నతంగా చేస్తున్నారు! మీ మతానుసారము తప్ప మేము ఇంకెవరి మతమును అనుసరించము. బ్రహ్మాకుమార్ - బ్రహ్మాకుమారీలు దైవీ మతానుసారము నడుస్తున్నారని చివర్లో అందరూ అంటారు. ఎంతో మంచి మంచి విషయాలు వినిపిస్తారు. ఆది-మధ్య-అంత్యముల పరిచయాన్ని ఇస్తారు. స్వభావాన్ని (క్యారెక్టర్) పరివర్తన చేస్తున్నారు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. దృష్టిని శుద్ధంగా, పవిత్రంగా చేసుకునేందుకు ఎవరి నామ-రూపాలను చూడకుండా అశరీరులుగా అయ్యే అభ్యాసము చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించి సోదర ఆత్మతో మాట్లాడాలి.
2. సర్వుల సత్కారాన్ని ప్రాప్తి చేసుకునేందుకు జ్ఞాన-యోగాల శక్తిని ధారణ చేయాలి. దైవీగుణాలతో సంపన్నంగా అవ్వాలి. గుణాలను సరిదిద్దే సేవ చేయాలి.
వరదానము :-
'' ఉల్లాస - ఉత్సాహాల ద్వారా విశ్వకళ్యాణ బాధ్యతను నిభాయించే సోమరితనం మరియు నిర్లక్ష్యము నుండి ముక్త్ భవ ''
కొత్తవారు గాని, పాతవారు గాని బ్రాహ్మణులుగా అవ్వడం అనగా విశ్వకళ్యాణ బాధ్యతను తీసుకోవడం. ఏదైనా బాధ్యత ఉన్నప్పుడు దానిని తీవ్రవేగంతో పూర్తి చేస్తారు. బాధ్యత లేకుంటే నిర్లక్ష్యంగా, సోమర్లుగా ఉంటారు. బాధ్యత సోమరితనాన్ని, నిర్లక్ష్యాన్ని సమాప్తం చేసేస్తుంది. ఉమంగ-ఉత్సాహాలున్న వారు అథక్గా(అలసిపోకుండా) ఉంటారు. వారు తమ ముఖము మరియు నడవడిక ద్వారా ఇతరుల ఉమంగ-ఉత్సాహాలను కూడా పెంచుతూ ఉంటారు.
స్లోగన్ :-
'' సమయానుసారము శక్తులను ఉపయోగించడమనగా జ్ఞానీ, యోగీ ఆత్మలుగా అవ్వడం ''