03-01-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - అల్ఫ్‌, బే ( 1, 2 ) అనగా తండ్రి మరియు వారసత్వము గుర్తుంటే సంతోష పాదరస మీటరు పైకి ఎక్కి ఉంటుంది. ఇది చాలా సహజము. ఒక్క సెకండు మాటే.''

ప్రశ్న :-

అనంతమైన ఖుషీ(సంతోషము) ఏ పిల్లలకు ఉంటుంది? సదా ఖుషీ పాదరస మీటరు ఎక్కి ఉండాలంటే దానికి సాధనమేది?

జవాబు :-

ఏ పిల్లలైతే అశరీరులుగా అయ్యే అభ్యాసము చేస్తారో, తండ్రి వినిపించేదంతా ఎవరైతే బాగా ధారణ చేసి ఇతరులకు ధారణ చేయిస్తారో వారికే అనంతమైన ఖుషీ ఉండగలదు. సంతోష పాదరస మట్టము సదా పైకి ఎక్కి ఉండాలంటే అవినాశీ జ్ఞానరత్నాలను దానము చేస్తూ ఉండండి. అనేకమందికి కళ్యాణము(మేలు) చేయండి. మేము ఇప్పుడు సుఖ-శాంతుల శిఖరానికి పోతున్నామనే స్మృతి సదా ఉంటే సంతోషము ఉంటుంది.

ఓంశాంతి.

పిల్లలు ఎవరి స్మృతిలో కూర్చుని ఉన్నారో ఒక్క సెకండులో వ్రాయించుకోవాలని బాప్‌దాదా ఆలోచిస్తున్నారు. ఈ విషయము వ్రాసేందుకు ఎక్కువ సమయము పట్టదు. ప్రతి ఒక్కరు ఒక్క సెకండులో వ్రాసి బాబాకు చూపించాలి(అందరూ వ్రాసి బాప్‌దాదాకు చూపించారు తర్వాత బాబా కూడా వ్రాశారు. బాబా ఏదైతే వ్రాశారో అది ఎవ్వరూ వ్రాయలేదు). బాబా, అల్ఫ్‌, బే(1, 2) అని వ్రాశారు. ఇది ఎంత సులభము? అల్ఫ్‌ అనగా బాబా, బే అనగా సామ్రాజ్యము (స్వర్గము). బాబా మిమ్ములను చదివిస్తారు. మీరు రాజ్యము ప్రాప్తి చేసుకుంటారు. ఇంతకంటే ఎక్కువ వ్రాసే పని లేదు. మీరు వ్రాసేందుకు రెండు నిమిషాలు తీసుకున్నారు. అల్ఫ్‌, బే అని వ్రాసేందుకు ఒక్క సెకండు చాలు. సన్యాసులు కేవలం అల్ఫ్‌ను స్మృతి చేస్తారు. మీకు బే అనగా సామ్రాజ్యము కూడా గుర్తుంది. స్మృతి చేసే అభ్యాసము ఏర్పడ్తుంది. బుద్ధిలో అల్ఫ్‌, బే కూర్చుంటే ఖుషీ పాదరస మీటరు పైకి ఎక్కి ఉంటుంది. అల్ఫ్‌కు అర్థము ఎంతో గొప్ప అత్యున్నత శిఖరము. అంతకంటే పైన ఇక ఏ వస్తువూ లేదు. వారు నివసించు స్థానము కూడా అత్యంత ఉన్నతమైనది. సెకండులో ముక్తి - జీవన్ముక్తుల అర్థము కూడా ఎవ్వరికీ తెలియదు. దానికి కూడా తప్పకుండా అర్థముంటుంది. పుత్రుడు జన్మిస్తూనే సమయాన్ని ఇన్ని గంటలు, ఇన్ని నిమిషాలు, ఇన్ని సెకండ్లు అని వ్రాసి గుర్తిస్తారు. సమయము టిక్‌-టిక్‌ అని గడచిపోతూనే ఉంటుంది. టిక్‌ అవుతూనే ' అల్ఫ్‌, బే ' కావున ఇందుకు ఒక్క సెకండు కూడా పట్టదు. బయటకు చెప్పే అవసరము కూడా లేదు. స్మృతి అయితే ఉండనే ఉంటుంది. పిల్లలైన మీ స్థితి(అవస్థ) ఇంత మంచిగా(ఒక్క సెకండులోనే తండ్రిని మరియు వారసత్వమును స్మృతి చేయగలిగే విధంగా) ఉండాలి. అయితే స్మృతి ఉన్నప్పుడే ఈ స్థితి ఉంటుంది. ఇక్కడ కూర్చుని ఉన్నారంటే మీకు తండ్రి, వారు ఇచ్చే రాజ్యము స్మృతి ఉండాలి. బుద్ధి చూస్తుంది. దానినే దివ్యదృష్టి అని అంటారు. ఆత్మ కూడా చూస్తుంది. తండ్రిని ఆత్మయే స్మృతి చేస్తూ ఉంటుంది. మీరు కూడా తండ్రిని స్మృతి చేసినట్లైతే వారితో పాటు వారిచ్చే రాజ్యము కూడా ఒకేసారి గుర్తుకొస్తుంది. ఎంత సమయము పడ్తుంది? ఇక్కడ కూడా స్మృతిలో కూర్చుంటే చాలా సంతోషముతో గద్గదమైపోతారు. బాబా కూడా ఈ ఖుషీలో కూర్చుని ఉన్నాడు. తండ్రికి ఇక్కడి మాట ఏదీ గుర్తే లేదు. బాబా అక్కడి విషయాలను గుర్తు చేసుకుంటారు. తండ్రి మరియు తండ్రి ఇచ్చే రాజ్యము, ద్వారము వద్దనే నిలిచి ఉన్నట్లుగా అక్కడి విషయాలను బ్రహ్మాబాబా గుర్తు చేసుకుంటారు. తండ్రి చెప్తున్నారు - పిల్లలైన మీ కొరకు రాజ్యము(స్వర్గము) తీసుకు వచ్చాను, మీరు స్మృతి చేయరు. అందుకే సంతోషము నిలువదు. మీరు లేస్తూ - కూర్చుంటూ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయిన నన్ను, నేను ఇచ్చే వారసత్వాన్ని స్మృతి చేయండి. మీరు ఉండే స్థానము ఎంతో ఉన్నతమైనది. దీనిని గురించి ప్రపంచములోని వారికి తెలియదు. మనుష్యులు ముక్తిలోకి వెళ్లేందుకు ఎంతో తలకొట్టుకుంటారు(కష్టపడ్తారు). ఇప్పుడు ముక్తిధామము ఎక్కడ ఉంది? ఆత్మ రాకెట్‌ వంటిదని మీరు అర్థము చేసుకున్నారు. వారు చంద్రుని వరకు వెళ్తారు. ఆ తర్వాత ఉండేది శూన్యము (పోలార్‌/పంచతత్వాలకు, సూర్య, చంద్ర, నక్షత్ర మండాలాల కంటే అతీతంగా ఉండే శూన్య ప్రదేశము) మీరు శూన్యము కంటే చాలా ఎత్తుకు(పరంధామానికి) వెళ్తారు. చంద్రుడే ఈ ప్రపంచానికి చెందినవాడు. సూర్య చంద్రులకు పైన శబ్ధానికి అతీతంగా అని అంటారు. ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి. మీరు మధురమైన ఇంటి (పరంధామము) నుండి వస్తారు. వచ్చి-పోయేందుకు సమయము పట్టదు. ఇది మీ ఇల్లు. ఇక్కడ (స్థూల ప్రపంచములో) ఎక్కడికి పోవాలన్నా సమయము పడ్తుంది. ఆత్మ శరీరాన్ని వదిలితే ఒక్క సెకండులో ఎక్కడ నుండి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒక శరీరమును వదిలి మరొక శరీరములో ప్రవేశిస్తుంది. కనుక స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు చాలా ఉన్నతమైన శిఖరము పైకి వెళ్తారు. మనుష్యులు శాంతిని కోరుకుంటారు. శాంతికి అత్యంత ఉన్నతమైన శిఖరము నిరాకార ప్రపంచము, సుఖానికి అత్యంత ఉన్నతమైన శిఖరము స్వర్గము. చాలా ఎత్తుగా ఉంటే దానిని టవర్‌ అని అంటారు. మీ ఇల్లు కూడా ఎంత ఎత్తులో ఉంది! ప్రపంచములోని వారు ఎప్పుడూ ఈ విషయాలను గురించి ఆలోచించరు. ఈ విషయాలు వారికి అర్థము చేయించేవారు ఎవ్వరూ లేరు. దానిని(పరంధామమును) శాంతి స్థంభము(టవర్‌) అని అంటారు. ఈ విశ్వంలో శాంతి కావాలని మనుష్యులు అంటూ ఉంటారు. అయితే శాంతి ఎక్కడ ఉంటుందో, దాని అర్థమేదో ఎవ్వరికీ తెలియదు. ఈ లక్ష్మీనారాయణులు సుఖ టవర్‌లో(స్థంభములో) ఉన్నారు. అక్కడ ఎలాంటి లోభము, ఆశలు ఉండవు. అక్కడ ఆహార పానీయాలు, మాటలు చాలా రాయల్‌గా ఉంటాయి. అందులో సుఖము కూడా అత్యంత ఉన్నతంగా ఉంటుంది. వారి మహిమ ఎంత గొప్పగా ఉందో చూడండి. ఎందుకంటే వారు చాలా శ్రమ చేశారు. వీరు ఒక్కరే కాదు మొత్తము మాల అంతా తయారై ఉంది. వాస్తవానికి నవ రత్నాలు గాయనము చేయబడ్డారు. అనగా వారు తప్పకుండా గుప్తమైన శ్రమ చేసి ఉంటారు. తండ్రి మరియు వారసత్వముల స్మృతి ఉన్నప్పుడే వికర్మలు వినాశనమౌతాయి. అయితే మాయ స్మృతి చేయనివ్వదు. అప్పుడప్పుడు కామము, క్రోధము.................. చాలా తుఫానులను తీసుకు వస్తాయి. మీ నాడిని మీరే చూసుకోవాలి. నారదునికి కూడా నీ ముఖాన్ని చూసుకో అని చెప్పారు. కావున ఆ స్థితి ఇంకా లేదు, దానిని ఇప్పుడు తయారు చేసుకోవాలి. బాబా మన లక్ష్యాన్ని తప్పకుండా తెలుపుతారు. లోలోపల పురుషార్థము చేస్తూ ఉండండి. పోను పోను మీకు ఆ స్థితి ఉంటుంది. అశరీరులుగా ఉండే అభ్యాసము చేయాలి. ఇప్పుడు వాపస్‌ వెళ్ళాలి. బాబా చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి. స్మృతి చేయకుంటే శిక్షలు కూడా చాలా అనుభవించవలసి ఉంటుంది. అంతేకాక పదవి కూడా తగ్గిపోతుంది. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. వారు సైన్సులో చాలా లోతుకు వెళ్తారు. ఏదేదో తయారు చేస్తూ ఉంటారు. ఆ సంస్కారము కూడా కావాలి కదా! ఎందుకంటే అక్కడకు(సత్యయుగానికి) కూడా వెళ్ళి ఈ వస్తువులను తయారు చేస్తారు. కేవలం ఈ ప్రపంచము పరివర్తన చెందాలి. ఇచ్చటి సంస్కారము అనుసారమే అక్కడికి వెళ్ళి జన్మ తీసుకుంటారు. యుద్ధము చేయువారి బుద్ధిలో యుద్ధము చేసే సంస్కారము ఉంటుంది. కావున ఆ సంస్కారమునే తీసుకెళ్తారు. వారు కొట్లాడకుండా ఉండలేరు. ఆర్మీ ఆఫీసర్‌ వద్ద క్యూ ఉంటుంది. సైన్యములో చేర్చుకునేటప్పుడు వీరికి ఏ జబ్బు లేదు కదా, కళ్ళు, చెవులు మొదలైనవి సరిగ్గా పని చేస్తున్నాయా లేదా? అని చెక్‌ చేస్తారు. యుద్ధములో అన్ని అవయవాలు బాగుండాలి. ఇక్కడ కూడా ఎవరెవరు విజయమాలలోని పూసలుగా అవుతారని గమనిస్తారు. మీరు పురుషార్థము చేసి కర్మాతీత అవస్థను పొందాాలి. ఆత్మ అశరీరిగా వస్తుంది, అశరీరిగా అయ్యి వెళ్ళాలి. అక్కడ శరీరముతో ఏ సంబంధమూ లేదు. ఇప్పుడు అశరీరులుగా అవ్వాలి. ఆత్మలు అక్కడ నుండి వస్తాయి, వచ్చి శరీరములో ప్రవేశిస్తాయి. లెక్కలేనన్ని ఆత్మలు వస్తూ ఉంటాయి. అందరికీ తమ తమ పాత్రలు లభించి ఉన్నాయి. కొత్తగా పవిత్ర ఆత్మలు ఏవైతే వస్తాయో, వాటికి తప్పకుండా మొదట సుఖము లభించాలి. కావున వారికి మహిమ ఉంటుంది. ఇది చాలా పెద్ద వృక్షము కదా! ఇందులో పేరు ప్రసిద్ధి గల ఎంతో గొప్ప మనుష్యులు ఉన్నారు. తమ తమ శక్తి అనుసారము చాలా సుఖములో ఉంటారు. కావున ఇప్పుడు పిల్లలు శ్రమ చేయాలి. కర్మాతీత స్థితిలో పవిత్రంగా అయ్యి వెళ్ళాలి. మీ నడవడిను గమనించుకోండి - ఎవ్వరికీ దు:ఖమివ్వడం లేదు కదా! తండ్రి ఎంత మధురమైనవారు! అత్యంత ప్రియమైనవారు కదా! కనుక పిల్లలు కూడా అలా తయారవ్వాలి. తండ్రి ఇక్కడ ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి ఇక్కడ స్థాపన చేస్తున్నారని మనుష్యులకు ఏమాత్రము తెలియదు. అయినా వారిని జన్మ-జన్మాంతరాలు స్మృతి చేస్తూ ఉంటారు. శివాలయానికి వెళ్ళి ఎంతగానో పూజిస్తారు. ఎంతో ఉన్నతమైన శిఖరము పైకి, బద్రినాథ్‌ మొదలైన మందిరాలకు వెళ్తారు. ఎన్నో ఉత్సవాలు జరుగుతాయి. ఎందుకంటే చాలా మధురమైనవారు కదా! భగవంతుడు అత్యంత ఉన్నతమైనవారని పాటలు కూడా పాడ్తారు. బుద్ధిలో నిరాకారుడే గుర్తుకు వస్తారు. వారు నిరాకారులే. వారి తర్వాత బ్రహ్మ-విష్ణు-శంకరులు. వారిని భగవంతుడని అనరు.

మనమే సతోప్రధాన దేవతలుగా ఉండేవారమని, ఈ విశ్వానికి మనము అధికారులుగా ఉన్నప్పుడు ఇంతమంది మనుష్యులు లేరని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. కేవలం భారతదేశములోనే వీరి రాజ్యముంటుంది. మిగిలిన వారందరూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు. అలా చూడాలంటే గొప్ప విశాలబుద్ధి కావాలి. అక్కడ మీరు పర్వతాలు మొదలైన వాటి పైకి వెళ్ళే అవసరముండదు. అచ్చట ఏ ప్రమాదాలు మొదలైనవి జరగవు. అది వండర్‌ ఆఫ్‌ ది స్వర్గ్‌(అది స్వర్గములోని అద్భుతము) స్వర్గ అద్భుతాలు లేనప్పుడు మాయావి అద్భుతాలు తయారవుతాయి. ఈ విషయాలు ప్రపంచములోనివారు అర్థము చేసుకోలేరు. ఇప్పుడు మీరు స్వర్గములోకి వెళ్లేందుకు పురుషార్థము చేస్తున్నారు. అది సుఖమునిచ్చే టవర్‌. ఇది దు:ఖమునిచ్చే టవర్‌. యుద్ధములో ఎంతోమంది మనుష్యులు ప్రతి రోజూ మరణిస్తూ ఉంటారు. మళ్లీ జన్మిస్తూ కూడా ఉంటారు. ఈశ్వరుడు అనంతమని వారి అంతమును తెలుసుకోబడదని గాయనము చేయబడ్తుంది. ఇప్పుడు ఈశ్వరుడు ఒక బిందువు. వారి అంతమును ఎలా పొందుతారు. ఏమి పొందుతారు? తండ్రి చెప్తున్నారు - ఈ రచన ఆదిమధ్యాంతాలు ఎవ్వరికీ తెలియవు. సాధు - సత్పురుషులు మొదలైనవారెవ్వరూ రచయిత, రచనల అంతము(పరమాత్మను, పరమాత్మ రచన అయిన ఈ సృష్టి యొక్క సంపూర్ణ జ్ఞానము)ను తెలుసుకోలేరు. మిమ్ములను తండ్రి చదివిస్తున్నారు. దీనిని చదువు లేక విద్య అని అంటారు. సృష్టిచక్ర రహస్యాన్ని పిల్లలైన మీరు మాత్రమే తెలుసుకుంటూ ఉన్నారు. వారైతే మాకు తెలియదని లేక లక్షల సంవత్సరాలని అంటారు.

ఇప్పుడు తండ్రి అర్థము చేయించారు - ఇక్కడ(కలియుగము) మీరు ఏవైతే చూస్తున్నారో అవి అక్కడ(సత్యయుగములో) ఉండవు. స్వర్గమనగా సుఖమిచ్చు స్తూపము. ఇక్కడ దు:ఖమే దు:ఖముంది. అకస్మాత్తుగా అందరూ సమాప్తమైపోవునట్లు మృత్యువు వస్తుంది. ఆ మృత్యువును చూడడం పిన్నమ్మ ఇల్లంత సులభము కాదు. దీనిని దు:ఖ శిఖరము అని అంటారు. అది సుఖ శిఖరము. ఇది చాలు. మూడవ పదము లేనే లేదు. మీలో కూడా చాలామంది వింటారు. కాని ధారణ చేయరు. బుద్ధి బంగారు యుగముదిగా తయారైనప్పుడు ధారణ జరుగుతుంది. ధారణ జరగకుంటే ఖుషీ కూడా ఉండదు. మీలో పూర్తి అత్యంత ఎక్కువగా చదువుకున్నవారు కూడా ఉన్నారు. అత్యంత తక్కువగా చదువుకున్నవారు కూడా ఉన్నారు. చదువులో వ్యత్యాసముంటుంది కదా. వారికి అనంతమైన తండ్రి ఎంతగా అర్థము చేయించినా ఎప్పటికీ అర్థము చేసుకోరు. స్మృతి చేయకుండా మీరు పవిత్రంగా ఎప్పటికీ అవ్వలేరు. ఆ తండ్రియే అయస్కాంతము. వారు అత్యంత గొప్పశక్తి కలవారు. వారి పై ఎప్పుడూ త్రుప్పు(మైల) పట్టజాలదు. మిగిలిన అందరి పై త్రుప్పు ఏర్పడి ఉంది. దానిని శుభ్రము చేసుకొని మళ్లీ సతోప్రధానంగా అవ్వాలి. తండ్రి చెప్తున్నారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇంక ఏ ఇతరుల పై మమకారముండరాదు. ధనవంతులకైతే రోజంతా ధనము - సంపదలే కంటి ముందు కనిపిస్తూ ఉంటాయి. పేదవారికి అయితే ఇవేమీ లేవు. అయితే పేదవారు కూడా ధారణ చేయాలంటే కొంత వివేకవంతులుగా ఉండాలి. స్మృతి చేయకుంటే మైల ఎలా తొలగిపోతుంది? మనము పవిత్రంగా ఎలా అవుతాము? మీరు ఉన్నతమైన శిఖరము పైకి వెళ్లేందుకు ఇచ్చటకు వచ్చారు. తండ్రి శిక్షణ అనుసారము నడుచుకోవడం ద్వారా మనము ఉన్నతమైన సుఖ శిఖరము పైకి వెళ్తామని మీకు తెలుసు. ఇందులో శ్రమ ఉంది. శిఖరము పైకి తీసుకెళ్లేందుకు తండ్రి వస్తారు. కనుక శ్రీమతమును అనుసరించాల్సి ఉంటుంది. మొదటి నంబరులో ఈ లక్ష్మీనారాయణులకే గాయనముంది. వారు పూర్తిగా సుఖ శిఖరములో ఉంటారు. తర్వాత(త్రేతా యుగములో) ఎంతో కొంత సుఖము తక్కువగా ఉంటుంది. కొత్త ప్రపంచమునే సుఖ స్తూపము అని అంటారు. అక్కడ మురికి వస్తువేదీ ఉండదు. అక్కడ గృహాలను మైలపరిచే ఇటువంటి మట్టి, ధూళి ఉండవు. ఇళ్లను మురికిగా చేసే ఇటువంటి గాలులు వీచవు. స్వర్గానికైతే చాలా మహిమ ఉంది. దాని కొరకు పురుషార్థము చేయాలి. లక్ష్మీనారాయణులు ఎంత ఉన్నతమైనవారు! వారిని చూచినంతనే హృదయము సంతోషిస్తుంది. పోను పోను చాలా మందికి సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. (యజ్ఞ) ప్రారంభములో ఎన్నో సాక్షాత్కారాలు జరిగేవి. బాబా ఎంతో ప్రభావాన్ని(శక్తిని) చూపించారు. కిరీటము మొదలైనవి ధరించి వచ్చేవారు. అటువం#3074;టి వస్తువులు ఇచ్చట లభించవు. బాబా వజ్రాల వ్యాపారస్థుడు. పూర్వము 50 వేల రూపాయలకు లభించే మణి ఇప్పుడు 50 లక్షలకు కూడా లభించదు. మీరు స్వర్గము కొరకు పురుషార్థము చేస్తున్నారు. అక్కడ అపారమైన సుఖముంది. తండ్రి ఇంతగా చదివిస్తున్నారు. కాని పిల్లలలో రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఏర్పడ్తుంది. రాజా - రాణి ఎక్కడ, దాస-దాసీలు ఎక్కడ! ఎవరైతే మంచి రీతిగా చదివి చదివిస్తారో వారు దాగి ఉండలేరు. వారు వెంటనే బాబా మేము ఫలానా చోటుకు వెళ్ళి సేవ చేస్తాము అని అంటారు. చేయవలసిన సర్వీసు ఎంతో ఉంది. మీరు ఈ అడవిని(జంగల్‌ను) మందిరంగా(మంగల్‌గా) చేయాలి. అన్నము తిన్నా తినకున్నా సేవ కొరకు పరుగెత్తుతారు. వ్యాపారస్థులు అలా పరిగెత్తుతూ ఉంటారు. మంచి గిరాకీ(కొనేవారు) వస్తే తిన్నా తినకున్నా పరుగెత్తుతారు. వారికి ధనము సంపాదించాలన్న ఆసక్తి ఉంటుంది. ఇచ్చట అనంతమైన తండ్రి నుండి అపారమైన ధనము లభిస్తుంది. భలే ఇంకా కొంత సమయము ఉంది, కాని రేపే శరీరము వదలవచ్చు. శరీరము పై ఎలాంటి నమ్మము లేదు. వినాశనమైతే జరిగే తీరాలి. పిల్లికి చెలగాటము, ఎలుకకు ప్రాణ సంకటము. (మిరువా మౌత్‌ మలూకా షికార్‌...........) అన్నట్లు చివరిలో మీరు ఆనందంగా వినాశనాన్ని చూస్తూ ఉంటారు. వారు హాహాకారాలు చేస్తూ ఉంటారు. మీ సంతోషానికి అంతు ఉండదు. మీకు అనంతమైన ఖుషీ ఉండాలి. మీరు చాలా మందికి కళ్యాణము చేయాలి. చివరిలో కర్మాతీత స్థితి వస్తుంది. మీరు స్మృతి చేస్తూ చేస్తూ అశరీరులుగా అవుతారు. అప్పుడు అనాయాసంగా ఎగురుతారు. ఇది చాలా శ్రమతో కూడినది. కొంతమంది చాలా సర్వీసు చేస్తారు. మొత్తము రోజంతా మ్యూజియంలో అర్థము చేయించేందుకు నిలబడి ఉంటారు. రాత్రింబవళ్లు సేవలో తత్పరులై ఉంటారు. వందల కొలది మ్యూజియంలు తెరవబడ్తాయి. లక్షల మంది మీ వద్దకు వస్తారు. మీకు తీరిక లభించదు. ఈ అవినాశి జ్ఞానరత్నాల దుకాణాలు అన్నింటికంటే ఎక్కువ సంఖ్యలో తెరువబడ్తాయి. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. జ్ఞాన ధారణ చేసేందుకు మొదట మీ బుద్ధిని స్వర్ణిమ యుగానికి చెందినదిగా చేసుకోండి. తండ్రి స్మృతి తప్ప ఏ ఇతర వస్తువులో మమకారము ఉండరాదు.

2. కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకొని ఇంటికి వెళ్లేందుకు అశరీరులుగా అయ్యే అభ్యాసము చేయండి. ఎవ్వరికీ దు:ఖము ఇవ్వడము లేదు కదా, తండ్రి సమానంగా మధురంగా అయ్యామా? అని మీ నడవడికను చూసుకోండి.

వరదానము :-

''బ్రాహ్మణ జీవితంలో న్యాచురల్‌ స్వభావం ద్వారా రాతిని కూడా నీరుగా చేసే మాస్టర్‌ ప్రేమసాగర్‌ భవ''

ఎలాగైతే ప్రపంచంలోని వారు ప్రేమ రాతిని కూడా నీరుగా చేస్తుందని అంటారో అలా బ్రాహ్మణులైన మీ న్యాచురల్‌ స్వభావము మాస్టర్‌ ప్రేమసాగరము. మీ వద్ద ఎటువంటి ఆత్మిక ప్రేమ, పరమాత్మ ప్రేమల శక్తి ఉందంటే దాని ద్వారా రకరకాల స్వభావాలను పరివర్తన చేయగలరు. ఎలాగైతే ప్రేమ సాగరుడు తమ అనాది ప్రేమ స్వరూప నేచర్‌ ద్వారా పిల్లలైన మిమ్ములను తమవారిగా చేసుకున్నారో, అలా మీరు కూడా మాస్టర్‌ ప్రేమసాగరులుగా అయ్యి విశ్వములోని ఆత్మలకు సత్యమైన నిస్వార్థమైన ఆత్మిక ప్రేమను ఇవ్వండి. అప్పుడు వారి నేచర్‌(స్వభావము) పరివర్తనవుతుంది.

స్లోగన్‌ :-

''మీ విశేషతలను స్మృతిలో ఉంచుకొని వాటిని సేవలో ఉపయోగిస్తే ఎగిరేకళలో ఎగురుతూ ఉంటారు.''

బ్రహ్మబాబా సమానంగా అయ్యేందుకు విశేషమైన పురుషార్థము
అంతర్ముఖతా స్థితిలో ఉండిన తర్వాత బాహ్యముఖతలోకి వచ్చే అభ్యాసము కొరకు మీ పై వ్యక్తిగత అటెన్షన్‌ ఉంచుకునే అవసరముంది. ఎప్పుడైతే మీరు అంతర్ముఖతా స్థితిలో ఉంటారో అప్పుడు బాహ్యముఖతలోని విషయాలు డిస్టర్బ్‌ చేయవు. ఎందుకంటే దేహాభిమానము నుండి దూరంగా ఉంటారు.