10-08-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీరు మొత్తం కల్పంలో ఆల్రౌండ్ పార్ట్ అభినయించారు, ఇప్పుడు పార్ట్ పూర్తయ్యింది, ఇంటికి వెళ్లాలి.''
ప్రశ్న :-
పిల్లలైన మీరు మీ భాగ్యాన్ని ఎటువంటి శబ్ధాలతో మహిమ చేస్తారు?
జవాబు :-
మేము పిలక బ్రాహ్మణులము(శిఖరం). నిరాకార భగవంతుడు కూర్చొని మమ్ములను చదివిస్తారు. ప్రపంచంలో మనుష్యులను మనుష్యులు చదివిస్తారు కానీ మమ్ములను స్వయంగా భగవంతుడే చదివిస్తారు, కనుక ఎంత భాగ్యశాలురమయ్యాము!
ప్రశ్న :-
ఈ డ్రామాలో అందరికంటే గొప్ప పొజిషన్(¬దా) ఎవరిది?
జవాబు :-
నిరాకార తండ్రిది. వారు ఆత్మలందరి తండ్రి. ఆత్మలన్నీ డ్రామా సూత్రంలో బంధింపబడి ఉన్నాయి. అందరికంటే గొప్ప పొజిషన్ తండ్రిది.
ఓంశాంతి.
ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను ప్రశ్నిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, మీ ఇల్లు శాంతిధామం గుర్తుందా? మర్చిపోలేదు కదా? ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తయ్యింది, ఎలా పూర్తయ్యింది - ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు. సత్యయుగం మొదలుకొని కలియుగం అంత్యం వరకు ఈ విధంగా మరెవ్వరూ ప్రశ్నించలేకపోయారు. మధురాతి మధురమైన అల్లారు ముద్దు పిల్లలను బాబా అడుగుతున్నారు, ఇప్పుడు ఇంటికి వెళ్లాలి కదా? ఇంటికి వెళ్లి మళ్లీ సుఖధామానికి రావాలి. ఇది సుఖధామమైతే కాదు, పాత ప్రపంచము, ఇది దు:ఖధామము. అది శాంతిధామము, సుఖధామము. ఇప్పుడు ఈ దు:ఖం నుండి ముక్తులై ముక్తిధామానికి వెళ్లాలి. ముక్తిధామము మరియు శాంతిధామము ఎదురుగా నిలబడినట్లుగా ఉన్నాయి. అది ఇల్లు. తర్వాత మీరు మళ్లీ క్రొత్త విశ్వంలోకి వస్తారు, అక్కడ పవిత్రత, సుఖము, శాంతి కూడా ఉంటాయి. ఇదైతే అర్థం చేసుకుంటారు కదా - పాడ్తారు కూడా. తండ్రిని కూడా పిలుస్తారు - హే! పతితపావనా! ఈ పతిత ప్రపంచం నుండి మమ్ములను తీసుకెళ్లండి ఇందులో చాలా దు:ఖముంది. మమ్ములను సుఖ ప్రపంచంలోకి తీసుకెళ్లండి. సుఖ ప్రపంచం గుర్తొస్తోంది. స్వర్గాన్ని అందరూ గుర్తు చేసుకుంటారు. ఎవరైనా శరీరం వదిలారంటే స్వర్గస్థులయ్యారని అంటారు. లెఫ్ట్ ఫర్ హెవెన్లీ అబోడ్. ఎవరు లెఫ్ట్ (వెళ్ళిపోయారు)? ఆత్మ వెళ్లిపోయింది. శరీరమైతే వెళ్లదు. ఆత్మయే వెళ్తుంది. ఇప్పుడు పిల్లలైన మీకే శాంతిధామము, సుఖధామము తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. పిల్లల బుద్ధిలో ఈ నాలెడ్జ్ ఉంది - శాంతిధామము ఏది, సుఖధామము ఏది. మీరు సుఖధామంలో ఉండేవారు, ఇప్పుడు దు:ఖధామంలోకి వచ్చారు. సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు, సంవత్సరాలు గడిచిపోయాయి. 5 వేల సంవత్సరాలలో ఇప్పుడు కొద్ది రోజులు మిగిలి ఉన్నాయి. తండ్రి పిల్లలకు స్మృతినిప్పిస్తూ ఉంటారు. చF F F F @ F 9;ందులో సంశయపడాల్సిన అవసరమే లేదు. ఆత్మ 84 జన్మలు ఎలా తీసుకుంటుంది, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. లక్షల సంవత్సరాల విషయమైతే ఎవరికైనా గుర్తుండడం కూడా కష్టం, ఇది 5 వేల సంవత్సరాల విషయమే. వ్యాపారులు కూడా స్వస్తిక్ గుర్తును అకౌంటు పుస్తకాల పై గీస్తారు, దానిని గణేశుడని అంటారు. గణేశుని ఏనుగు తొండంతో చూపిస్తారు. మనుష్యులు ధనము ఖర్చు చేసి, చిత్రాలు మొదలైనవి తయారు చేస్తారు, దీనిని వేస్ట్ ఆఫ్ టైమ్ అని అంటారు. మీలో ఎంత శక్తి ఉండేది! మోటరు(కారు)లో పెట్రోలు తగ్గిపోయినట్లుగా మీలో శక్తి రోజురోజుకూ తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు చాలా బలహీనంగా అయిపోయారు. 5 వేల సంవత్సరాల క్రితం భారతదేశం ఎలా ఉండేది, అపారమైన సుఖం ఉండేది. ఎంత గొప్ప ధనం ఉండేది! ఇటువంటి రాజ్యాన్ని వారు ఎలా పొందారు? రాజయోగం నేర్చుకున్నారు. ఇందులో యుద్ధము మొదలైన విషయాలే లేవు. వీటిని జ్ఞాన అస్త్ర-శస్త్రాలని అంటారు. ఇంకా ఎటువంటి స్థూల విషయం లేదు. జ్ఞాన అస్త్ర-శస్త్రాలు. జ్ఞానము, విజ్ఞానము, స్మృతి మరియు జ్ఞానాల ఎంత గొప్ప బలమైన అస్త్ర-శస్త్రాలు! మొత్తం విశ్వం పై మీరు రాజ్యపాలన చేస్తారు. దేవతలను అహింసకులు అని అంటారు.
ఇప్పుడు పిల్లలైన మీకు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే శిక్షణ లభిస్తోంది. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఇది ఆత్మకు సంబంధించిన విషయం. ఇందులో స్థూలమైన యుద్ధము మొదలైన విషయాలేవీ లేవు. ఆత్మ పతితమైపోయింది, కనుక పావనంగా అయ్యేందుకు అది తండ్రిని పిలుస్తుంది. ఇప్పుడు తండ్రి చెప్తారు - మధురాతి మధురమైన పిల్లలూ, ఇప్పుడు ఇంటికి వెళ్లాలి. ఇది జీవాత్మల ప్రపంచము. అది ఆత్మల ప్రపంచము. దానిని జీవాత్మల ప్రపంచమని అనరు. మనము దూరదేశ నివాసులమని ఘడియ-ఘడియ స్మృతిలోకి తెచ్చుకోవాలి. ఆత్మలమైన మన ఇల్లు బ్రహ్మాండము. ఈ ఆకాశ తత్వానికి ఆవల ఎక్కడైతే సూర్య-చంద్రులు కూడా ఉండరో అక్కడ మనము ఉంటాము అని కూడా బుద్ధిలో ఉండాలి. మనము అక్కడ ఉండేవాళ్లం ఇక్కడ పాత్ర చేసేందుకు వచ్చాము. 84 జన్మల పాత్రను అభినయిస్తాము. అందరికీ 84 జన్మలుండవు. మెల్ల-మెల్లగా పై నుండి దిగుతూ వస్తారు. మనము ఆల్రౌండర్లము. అన్ని పనులు చేసేవారిని ఆల్రౌండర్లు అని అంటారు. మీరు కూడా ఆల్రౌండర్లు. మీ పాత్ర ఆది నుండి అంత్యం వరకు ఉంది. ఇప్పుడు ఈ చక్రము పూర్తి అవుతుంది, అయినా పై నుండి వస్తూ ఉంటారు. చాలా మంది పిల్లలు అక్కడ ఉండిపోయారు, వారు పై నుండి వస్తూ ఉంటారు. వృద్ధి చెందుతూ ఉంటారు.
పిల్లలైన మీకు తండ్రి ' హం సో ' అర్థం కూడా అర్థం చేయించారు. ఆ జనులు ఆత్మ అయిన నేనే పరమాత్మను అని అంటారు. వారికైతే డ్రామా ఆది, మధ్య, అంత్యము, డ్యూరేషన్(కాల వ్యవధి) మొదలైన వాటి గురించి ఏమీ తెలియదు. మీకు తండ్రి అర్థం చేయించారు, ఈ శరీరంలో ఉన్న మీరు ఇప్పుడు బ్రాహ్మణులు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా శివబాబా మిమ్ములను ఎడాప్ట్(దత్తత) చేసుకున్నారు, చదివిస్తారు, ఇదైతే గుర్తుండాలి కదా! తండ్రి మమ్ములను చదివిస్తున్నారు. వారు ఉన్నతోన్నతమైన భగవంతుడు. ఆత్మలన్నీ ఈ డ్రామా అనే సూత్రంతో కూర్చబడి ఉన్నారు. ఇప్పుడు మీకు తెలుసు - మేము ప్రారంభంలో దేవతలము, తర్వాత మేమే క్షత్రియ ధర్మములోకి వచ్చాము అనగా సూర్యవంశము నుండి చంద్రవంశములోకి వచ్చాము, ఎన్నెన్ని జన్మలు తీసుకున్నాము అనేది కూడా తెలియాలి. మొదట ఈF F F F @ F 3108;్రము లేదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు, ఇది వర్ణాల పల్టీలాట. ఇప్పుడు మళ్లీ శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రాహ్మణుల నుండి మళ్లీ దేవతలుగా అవుతారు. విరాట రూపాన్ని చూపిస్తారు కదా! మీ బుద్ధిలో - ఎలా మేము క్రిందికి దిగాము, మళ్లీ ఎలా బ్రాహ్మణ కులంలోకి వస్తాము ఆ తర్వాత ఎలా డీటీ డైనాస్టీ(దైవీ వంశము)లోకి వస్తాము ఈ మొత్తం జ్ఞానం కూడా ఉంది. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు శిఖరం. శిఖరం అన్నిటికంటే ఎత్తుగా (ఉన్నతంగా) ఉంటుంది. మీ కులం వలె ఉన్నత కులం అని ఇంకా ఎవరు అనిపించుకుంటారు! తండ్రి అయిన భగవంతుడు వచ్చి మిమ్ములను చదివిస్తున్నారు. మీరు ఎంత భాగ్యశాలురు! మీ భాగ్యాన్ని కూడా కొద్దిగా మహిమ చేయండి. బయట అయితే మనుష్యులు మనుష్యులను చదివిస్తారు. వీరు నిరాకార తండ్రి. ఈ తండ్రి కల్ప-కల్పము ఒక్కసారే వచ్చి జ్ఞానమునిస్తారు. చదువైతే ప్రతి ఒక్కరు చదువుతారు కదా! బ్యారిష్టర్ జ్ఞానము చదివి బ్యారిష్టర్గా అవుతారు. ఆ మనుష్యులు మనుష్యులను చదివిస్తారు. ఇప్పుడిది భగవానువాచ. మనుష్యులను భగవంతుడని ఎప్పుడూ అనరు. భగవంతుడు నిరాకారులు. ఇక్కడికి వచ్చి పిల్లలైన మిమ్ములను చదివిస్తారు. చదువు సూక్ష్మవతనంలో గానీ, మూలవతనంలో గానీ చదవరు. చదువు ఇక్కడే ఉంటుంది. ఇందులో తికమకపడే విషయమేదీ లేదు. పాఠశాలలో విద్యార్థులు మేము తికమకపడ్డాము, మాకు నిశ్చయం కలగడం లేదు అని ఎప్పుడైనా అంటారా? చదువు చదువుకొని తన స్టేటస్(¬దా) తీసుకుంటారు. ఈ లక్ష్మీనారాయణులు సత్యయుగం ఆదిలో విశ్వానికి అధిపతులుగా ఎలా అయ్యారు? తప్పకుండా తండ్రి ద్వారానే అయ్యారు. తండ్రి సత్యమే చెప్తారు. భగవంతుడు ఏదీ రాంగ్గా ఎంతమాత్రం చెప్పరు. చాలా పెద్ద పరీక్ష. ఈ సమయంలో ప్రజల పై ప్రజారాజ్యం ఉంది. రాజు-రాణి లేనే లేరు. సత్యయుగంలో ఉండేవారు, ఇప్పుడు కలియుగ అంత్యంలోనూ లేరు. దీనిని పంచాయితీ రాజ్యమని అంటారు. కౌరవులు - పాండవులు అని గీతలో వ్రాశారు. ఆత్మిక పండాలు(మార్గదర్శకులు) మీరే కదా! అందరికీ ఆత్మిక ఇంటికి మార్గం తెలుపుతారు. అది ఆత్మలైన మీ ఆత్మిక ఇల్లు. ఆత్మ జన్మ తీసుకొని పాత్రను అభినయిస్తుంది. ఈ విషయాలు మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియవు. ఋషులు-మునులు మొదలైనవారెవ్వరికి రచయితా తెలియదు, రచన ఆది-మధ్య-అంత్యాలు తెలియవు. లక్షల సంవత్సరాలని అనేస్తారు. కానీ దానికి కూడా ఎటువంటి పూర్తి లెక్కాచారము లేదు. సగం-సగం కూడా ఉండడానికి వీల్లేదు, పూర్తి సగం సుఖధామం, తర్వాత పూర్తి సగం దు:ఖధామం. ఇది పతిత వికారీ ప్రపంచము, అది నిర్వికారి ప్రపంచము.
తండ్రి ఎంత ఉన్నతాతి ఉన్నతమైనవారు, అయితే ఎంత సాధారణంగా ఉన్నారు! ఎవరైనా పెద్ద మనిషి, ఆఫీసర్లు మొదలైన వారిని కలిస్తే ఎంత రిగార్డ్(మర్యాద) ఇస్తారు! పతిత ప్రపంచంలో పతిత మనుష్యులే పతితులకు సాక్షాత్కారం అవుతారు. పావనమైనవారు గుప్తంగానే ఉన్నారు, బయటి నుండి ఏమీ కనిపించరు. తండ్రిని నాలెడ్జ్ఫుల్, బ్లిస్ఫుల్ అని అంటారు. అన్ని విషయాలు తండ్రిలో ఫుల్గా ఉన్నాయి, అందువలన వారిని జ్ఞానసాగరులు అని అంటారు. ప్రతి ఒక్క మనిషి ¬దాకు మహిమ వేరు వేరుగా ఉంటుంది. మంత్రిని మంత్రి, ప్రధానమంత్రిని ప్రధానమంత్రి అని అంటారు. మరి వీరు ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు. అందరికంటే గొప్ప పొజిషన్ నిరాకార తండ్రిది, మనమంతా తండ్రికి పిల్లలము. అక్కడ మనమందరం తండ్రితో పాటు పరంధామంలో ఉంటాము. అదF F F F @ F 3120;ికి తమ-తమ పాత్ర ఉంది. కొందరు ఒక్క జన్మ అయినా తమ పాత్రను అభినయించి వాపస్ వెళ్లిపోతారు. ఇది మనుష్య సృష్టి యొక్క వెరైటీ వృక్షము. ఒకరు మరొకరితో కలవరు. ఆత్మలైతే ఒకేలా ఉంటాయి. పోతే శరీరాల పోలిక ఒకదానితో మరొకటి కలవదు. నాటకంలో కూడా ఒకే పోలికతో ఇద్దరి ముఖాలను తయారు చేస్తారు, అందులో నా పతి ఇతడా లేక ఇతడా? తెలియడం లేదు అని తికమక పడ్తారు. ఇదైతే అనంతమైన ఆట. ఇందులో ఒకరి పోలిక మరొకరితో కలవదు. ప్రతి ఒక్కరి ఫీచర్స్(రూపురేఖలు) వేరు వేరుగా ఉంటాయి. భలే, ఒకే వయసు వారైనా కానీ రూపురేఖలు ఒకేలా ఉండవు. ప్రతి జన్మలో ఫీచర్స్ మారిపోతూ ఉంటాయి. ఎంత పెద్ద అనంతమైన నాటకము! మరి దానిని తెలుసుకోవాలి కదా! మొత్తం సృష్టి ఆది-మధ్య-అంత్యముల జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. ప్రతి ఒక్కరికి డ్రామాలో ఏ పాత్ర ఉందో అదే అభినయిస్తారు. డ్రామాలో ఎవ్వరూ రీప్లేస్(బదులుగా ఉంచడం) అవ్వలేరు. అనంతమైన డ్రామా కదా! జన్మలు తీసుకుంటూ ఉంటారు. అందరి ఫీచర్స్ వేరు వేరుగా ఉంటాయి. ఎన్ని రకాల రూపురేఖలున్నాయి! ఈ జ్ఞానమంతా బుద్ధితో అర్థం చేసుకునేది. ఎటువంటి పుస్తమకు మొదలైనవి లేనే లేవు. గీతా భగవంతుడు చేతిలోకి గీతా పుస్తకాన్ని తీసుకొని వస్తారా? వారైతే జ్ఞానసాగరులు, పుస్తకాన్ని తీసుకు రారు. పుస్తకాలు భక్తిమార్గంలో తయారవుతాయి. అయితే ఇదంతా డ్రామాలో నిర్ణయమై ఉంది. ఒక సెకండ్ మరొక సెకండ్తో కలవదు. పిల్లలైన మీకు అంతా అర్థం చేయించారు. చక్రం పూర్తయి మళ్లీ నూతనంగా ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీరు చదువుతున్నారు. తండ్రిని కూడా మీరు తెలుసుకున్నారు. రచనను కూడా తెలుసుకున్నారు. మూలవతనం నుండి ఇక్కడికి పాత్ర అభినయించేందుకు వస్తారు. స్టేజ్ (వేదిక) ఎంత పెద్దగా ఉంది! దీనికి ఎటువంటి కొలత ఉండజాలదు. ఎవ్వరూ చేరుకోలేరు. సాగరము, ఆకాశముల అంత్యము ఎవ్వరూ తెలుసుకోలేరు కనుక అంతులేనిదని మహిమ చేయబడ్తుంది. ఇంతకుముందు ప్రయత్నం చేసేవారు కాదు, ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు, సైన్సు కూడా ఇప్పుడే ఉంది, మళ్లీ ఎప్పుడు మొదలవుతుంది? వారి పాత్ర ఉన్నప్పుడు. అయితే ఇటువంటి ఈ విషయాలన్నీ శాస్త్రాలలో లేవు. వినిపించేవారి పేరుకు బదులు వినేవారి పేరు వేసేశారు. ఇది నల్లని(పతిత) ఆత్మ, అది తెల్లని(పావన) ఆత్మ. నల్లని ఆత్మ వీరి ద్వారా విని తెల్లగా(పవిత్రంగా) అయ్యింది. నాలెడ్జ్ ద్వారా ఎంత ఉన్నత పదవి లభిస్తుంది!
ఇది గీతా పాఠశాల. ఎవరు చదివిస్తున్నారు? భగవంతుడు రాజయోగం నేర్పిస్తారు. అమరపురి కొరకు చదివిస్తారు కనుక దీనిని అమరకథ అని కూడా అంటారు. తప్పకుండా సంగమ యుగంలోనే వినిపించి ఉంటారు. ఎవరైతే కల్పం క్రితము చదివారో వారే వచ్చి మళ్లీ చదువుతారు, నంబర్వార్గా పదవి పొందుతారు. మీరు ఇక్కడకు ఎన్నిసార్లు వచ్చారు? లెక్కలేనన్నిసార్లు. ఈ నాటకము ఎప్పుడు మొదలయ్యింది అని ఎవరైనా అడిగితే, అనాదిగా నడుస్తూ వస్తోందని మీరు చెప్తారు. లెక్కించే మాట ఉండజాలదు, అడిగే ఆలోచన కూడా రాదు.
శాస్త్రాలలో ఏవైతే చదువుతూ ఉంటారో అవన్నీ భక్తిమార్గంలోని కథలు, ఇక్కడైతే అనేక భాషలున్నాయి, సత్యయుగంలో అనేక భాషలు మొదలైనవి ఉండవు. ఒకే ధర్మము, ఒకే భాష, ఒకే రాజ్యాన్ని మీరు స్థాపన చేస్తున్నారు. వారైతే శాంతి స్థాపన చేసేందుకు సలహా ఇచ్చేవారికి ప్రైజ్ (బహుమతి) ఇస్తూ ఉంటారు. శివబాబా మీకు మొత్తం విశ్వంలో శాంతి స్థాపన చేసేందుకు సలహా ఇస్తారు. వారికి మీరు ఏ ప్రైజ్ ఇస్తారు? ఇంకా వారే మీకు ప్రైజ్ ఇస్తారు, తీసుకోరు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. వీరి రాజ్యం ఉండేది అనేది నిన్నటి మాట. ఇప్పుడైతే ఉండేందుకు కూడా జాగా లేదు. అక్కడైతే రెండు - మూడు అంతస్తులు నిర్మించాల్సిన అవసరం కూడా ఉండదు. కలప మొదలైన వాటి అవసరం ఉండదు. అక్కడ బంగారు, వెండితో కట్టిన ఇళ్ళు ఉంటాయి. సైన్సు జోరుతో తక్షణం ఇళ్లు తయారైపోతాయి. ఇక్కడైతే సైన్సుతో సుఖమూ ఉంది, దు:ఖమూ ఉంది. దీనితో మొత్తం ప్రపంచమంతా సమాప్తమైపోతుంది. దీనినే ఫాల్ ఆఫ్ పాంపియా అని అంటారు. మాయ ఆడంబరం ఎంతగా ఉంది! షావుకార్లకు స్వర్గంలా ఉంది, అందుకే వారు మీ మాట కూడా వినరు. ఇంతకు ముందు మీకకు కూడా తెలిసేది కాదు. ఇక్కడైతే తండ్రి వచ్చి డైరెక్టుగా మిమ్ములను చదివిస్తారు. బయట అయితే పిల్లలు చదివిస్తారు. బంధు-మిత్రులకు మొదలైనవారు కూడా గుర్తొస్తూ ఉంటారు. ఇక్కడైతే తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. రోజురోజుకు స్మృతియాత్రలో మీరు పక్కా అవుతూ ఉంటారు. మీకు తర్వాత ఏదీ గుర్తు రాదు. కేవలం ఇల్లు మరియు రాజధాని గుర్తొస్తాయి. ఇంకా ఈ నౌకరీ మొదలైనవి గుర్తుకు రావు. ఎలా మరణిస్తారంటే కూర్చొని కూర్చొని హార్ట్ ఫెయిల్ అయినట్లు మరణిస్తారు. దు:ఖించే మాటే ఉండదు. ఆసుపత్రులు మొదలైనవేవీ ఉండవు. తండ్రిని తెలుసుకున్నారు, స్వర్గానికి అధిపతులుగా అయ్యారు. మీకైతే హక్కు ఉంది, అందరికీ లేదు, ఎందుకంటే అందరు స్వర్గంలోకి రారు కదా! అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఆత్మిక మార్గదర్శిగా అయ్యి అందరికి ఆత్మిక ఇంటికి దారి తెలపాలి. జ్ఞాన-యోగాల అస్త్ర-శస్త్రాలతో మొత్తం విశ్వం పై రాజ్యపాలన చేయాలి. డబల్ అహింసకులుగా అవ్వాలి.
2. 84 జన్మల ఆల్రౌండ్ పాత్రను అభినయించేవారు ఇప్పుడు ఆల్రౌండర్లుగా అవ్వాలి. అన్ని పనులు చెయ్యాలి. అనంతమైన వెరైటీ డ్రామాలో ప్రతి పాత్రధారి పార్టును చూస్తూ హర్షితంగా ఉండాలి.
వరదానము :-
'' పరిశీలనా శక్తి ద్వారా తండ్రిని గుర్తించి అధికారిగా అయ్యే విశేష ఆత్మ భవ! ''
బాప్దాదా ప్రతి పుత్రుని విశేషతను చూస్తారు, సంపూర్ణంగా తయారవ్వకపోయినా, పురుషార్థి, కానీ ఏ విశేషత లేని పుత్రుడు ఒక్కరు కూడా లేరు. అన్నిటికంటే మొదటి విశేషత, కోట్లలో ఎవరో ఒక్కరి లిస్ట్లో ఉన్నారు. తండ్రిని గుర్తించి 'నా బాబా' అని అనడం, అధికారిగా అవ్వడం ఇది కూడా బుద్ధి యొక్క విశేషత, పరిశీలించే శక్తి. ఇటువంటి శ్రేష్ఠ శక్తియే విశేష ఆత్మగా తయారు చేసింది.
స్లోగన్ :-
'' శ్రేష్ఠ భాగ్యరేఖను గీసుకునే కలము శ్రేష్ఠ కర్మ, కనుక ఎంత కావాలంటే అంత భాగ్యాన్ని తయారు చేసుకోండి. ''