30-03-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - ఇప్పుడు వాపస్ వెళ్లాలి కనుక పాత దేహము, పాత ప్రపంచము నుండి అతీతంగా అవ్వండి, మీ బ్యాటరీని చార్జ్ చేసుకునేందుకు
ప్రశ్న :-
యోగములో తండ్రి నుండి పూర్తి కరెంటు(శక్తి, సకాశ్) ఏ పిల్లలకు లభిస్తుంది ?
జవాబు :-
ఎవరి బుద్ధి అయితే వెలుపల తిరగకుండా ఉంటుందో, ఎవరైతే స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతిలో ఉంటారో, వారికి తండ్రి నుండి కరెంటు లభిస్తుంది. బాబా తన పిల్లలకు సకాశ్ ఇస్తారు. తండ్రి ఇచ్చే కరెంటును గ్రహించుటే పిల్లల కర్తవ్యము. ఎందుకంటే ఆ కరెంటు ద్వారానే ఆత్మ రూపి బ్యాటరీ చార్జ్ అవుతుంది, శక్తి వస్తుంది, వికర్మలు వినాశనమవుతాయి. దీనినే యోగాగ్ని అంటారు. దీనిని బాగా అభ్యాసము చేయాలి.
ఓంశాంతి.
భగవానువాచ - ఇప్పుడు పిల్లలకు ఇల్లు కూడా గుర్తుకు వస్తుంది. తండ్రి అయితే ఇల్లు మరియు రాజధానుల గురించి మాత్రమే వినిపిస్తారు. పిల్లలు కూడా ఈ విషయాలను అనగా ఆత్మల ఇల్లు ఏదో అర్థము చేసుకుంటారు. ఆత్మ అంటే ఏమిటి? బాబానే స్వయంగా వచ్చి మనలను చదివిస్తున్నారని పిల్లలు బాగా అర్థము చేసుకున్నారు. బాబా ఎక్కడ నుండి వచ్చారు? పరంధామము నుండి. అంతేకాని పావన ప్రపంచాన్ని తయారు చేసేందుకు వారు పావన ప్రపంచము నుండి రారు. తండ్రి చెప్తున్నారు - నేను సత్యయుగ పావన ప్రపంచము నుండి రాను, ఇంటి నుండే వస్తాను. పిల్లలైన మీరు పాత్ర చేసేందుకు ఏ ఇంటి నుండి వచ్చారో, నేను కూడా ఆ ఇంటి నుండే వచ్చాను. డ్రామా ప్లాను అనుసారము ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత నేను కూడా ఆ ఇంటి నుండే వస్తాను. నేను ఇంట్లోనే ఉంటాను, పరంధామములో ఉంటాను. తండ్రి ఏదో పట్టణము నుండి వచ్చినంత సులభంగా అర్థం చేయిస్తారు. పాత్రను అభినయించేందుకు మీరు ఎలా వచ్చారో, నేను కూడా పాత్రను అభినయించేందుకు అలాగే డ్రామా ప్లాను అనుసారము వచ్చాను. నేను జ్ఞాన సాగరుడను. డ్రామా ప్లాను అనుసారము నాకు అన్ని విషయాలు తెలుసు.
కల్ప-కల్పము నేను మీకు ఇవే విషయాలు వినిపిస్తాను. మీరు ఎప్పుడు కామచితి పై కూర్చుని నల్లగా మాడి భస్మమైపోతారో అప్పుడు వినిపిస్తాను. అగ్నిలో కామాగ్నిలో మానవులు నల్లగా అయిపోతారు కదా. మీరు కూడా నల్ల(అపవిత్రము)గా అయిపోయారు. సతోప్రధానంలో ఉన్న మొత్తం శక్తి అంతా అంతరించిపోయింది. ఒక్కసారిగా మోటరుకారు నిలిచిపోయేటంతగా ఆత్మ బ్యాటరీ డిస్చార్జ్ అవ్వరాదు. ఇప్పుడు అందరి బ్యాటరీలు బలహీనమయ్యే(డిస్చార్జ్ అయ్యే) సమయము వచ్చేసింది. డ్రామానుసారము ఇటువంటప్పుడే వస్తానని తండ్రి చెప్తున్నారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారి బ్యాటరి చార్జ్(శక్తివంతము) అవుతుంది. ఇప్పుడు మీ బ్యాటరీ తప్పకుండా చార్జ్ అవ్వనున్నది. అలాగని కేవలం ఉదయము మాత్రమే ఇక్కడకు వచ్చి కూర్చుంటే, బ్యాటరీ చార్జ్ అవ్వజాలదు. లేస్తూ-కూర్చుంటూ-నడుస్తూ కూడా స్మృతిలో ఉంటే బ్యాటరీ చార్జ్ అవ్వగలదు. మీరు మొదట పవిత్రమైన సతోప్రధాన ఆత్మలుగా ఉండేవారు. బంగారు(ఆత్మ) కూడా సత్యమైనదే, నగ(శరీరము) కూడా సత్యమైనదిగా ఉండేది. ఇప్పుడు రెండూ తమోప్రధనమైపోయాయి. ఇప్పుడు మళ్లీ ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. కనుక శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఇది చాలా సులభంగా, పవిత్రంగా అయ్యేందుకు భట్టీ, దీనిని యోగభట్టీ అని కూడా అంటారు. బంగారును కూడా భట్టీలో వేస్తారు. అది బంగారును శుద్ధపరిచే భట్టీ. ఇది తండ్రిని స్మృతి చేసే భట్టీ. పవిత్రముగా అయితే తప్పకుండా అవ్వాలి. స్మృతి చేయకుంటే అంత పవిత్రంగా అవ్వరు. మళ్లీ లెక్కాచారము చుక్తా చేసుకునే తీరాలి. ఎందుకంటే ఇది కయామత్(వినాశన) సమయము. అందరూ ఇంటికి వెళ్లాలి. బుద్ధిలో ఇంటి స్మృతి బాగా ఉంది. ఇది ఇతరులెవ్వరి బుద్ధిలోనూ ఉండదు. వారు బ్రహ్మ తత్వమునే ఈశ్వరుడని అంటారు. దానిని ఇల్లని భావించరు. ఈ అనంతమైన డ్రామాలో మీరు పాత్రధారులు. డ్రామాను గురించి మీరు బాగా తెలుసుకున్నారు. ఇప్పుడు 84 జన్మల చక్రము పూర్తి అవుతుందని, ఇంటికి వెళ్లాలని తండ్రి అర్థం చేయించారు. ఆత్మ ఇప్పుడు పతితంగా ఉంది. అందుకే ఇంటికి వెళ్లేందుకు బాబా! మీరు వచ్చి పావనంగా చేయండని, తండ్రిని పిలుస్తుంది. పవిత్రంగా అవ్వకుంటే మనము ఇంటికి వెళ్లలేము. తండ్రియే స్వయంగా కూర్చుని ఈ విషయాలన్నీ పిల్లలకు అర్థం చేయిస్తారు, పిల్లలు ఇది కూడా అర్థం చేసుకున్నారు. అందుకే వారిని పిత-పిత అని అంటారు. టీచర్ అని కూడా అంటారు. మనుష్యులైతే కృష్ణుని టీచరుగా భావిస్తారు. కృష్ణుడు స్వయము తానే సత్యయుగములో చదువుకుంటాడని పిల్లలైన మీకు తెలుసు. కృష్ణుడు ఎప్పుడూ, ఎవ్వరికీ టీచరుగా అవ్వలేదు. అలాగని చదివిన తర్వాత టీచరుగా అయ్యారని కూడా కాదు. కృష్ణుని బాల్యము నుండి పెద్దవాడైనంత వరకు జరిగిన కథ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మనుష్యులైతే కృష్ణుని భగవంతుడని భావించి ఎక్కడ చూచినా కృష్ణుడే కృష్ణుడు అని అంటారు. అలాగే రాముని భక్తులు ఎక్కడ చూచినా, రాముడే రాముడని అంటారు. దారమంతా చిక్కుపడిపోయింది. ప్రాచీన భారతదేశపు యోగము, జ్ఞానము చాలా ప్రసిద్ధి చెందిందని ఇప్పుడు మీకు తెలుసు. మనుష్యులకేమీ తెలియదు. జ్ఞానసాగరులు ఒక్క తండ్రి మాత్రమే. వారు పిల్లలైన మీకు జ్ఞానమునిస్తారు కనుక మిమ్ములను కూడా మాస్టర్ జ్ఞానసాగరులని అంటారు. అయితే నంబరువారు పురుషార్థానుసారము జ్ఞాన సాగరులని అంటారు. సాగరమని పిలవాలా? లేక నది అని పిలవాలా? మీరు జ్ఞాన గంగలు. ఇందులో కూడా మనుష్యులు తికమకపడ్తారు. మాస్టర్ జ్ఞానసాగరులని అనడం చాలా సరియైనది.
తండ్రి పిల్లలను చదివిస్తారు - ఆడ, మగ తేడా లేదు. వారసత్వము కూడా ఆత్మలైన మీరంతా తీసుకుంటారు. కావున దేహీ-అభిమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. పరమాత్మ అయిన నేను ఎలాగైతే జ్ఞానసాగరుడనో, అలా మీరు కూడా జ్ఞానసాగరులు. నన్ను పరమపిత పరమాత్మ అని అంటారు. నాది అందరికంటే ఉన్నతమైన కర్తవ్యము. రాజా - రాణుల కర్తవ్యము కూడా అందరికంటే ఉన్నతంగా ఉంటుంది కదా. అలాగే మీ కర్తవ్యము కూడా ఉన్నతంగా ఉంచబడింది. ఆత్మలమైన మనము ఇక్కడ చదువుతున్నామని, పరమాత్మ చదివిస్తున్నారని మీకు తెలుసు. అందువలన దేహీ- అభిమానులుగా అవ్వండి. తద్వారా అందరూ సోదరులైపోతారు. తండ్రి ఎంతో శ్రమ చేస్తున్నారు. ఇప్పుడు ఆత్మలైన మీరు జ్ఞానము తీసుకుంటున్నారు. తర్వాత అక్కడకు వెళ్తే ప్రాలబ్ధము నడుస్తుంది. అక్కడ అందరిలో సోదర ప్రేమ ఉంటుంది. సోదర ప్రేమ చాలా బాగుండాలి. కొంతమందికి గౌరవమిచ్చి, కొంతమందికి గౌరవము ఇవ్వక............ అలా ఉండదు. హిందూ-ముస్లిమ్ భాయి-భాయి అని వారంటారు, కానీ ఒకరినొకరు గౌరవించుకోరు. సోదర-సోదరీలుగా కాదు, భాయి-భాయిగా అనడం బాగుంటుంది అంతా సోదరత్వము, ఆత్మ పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వచ్చింది. అక్కడ కూడా భాయి - భాయిగానే ఉంటుంది. ఇంట్లో (పరంధామములో) అందరూ తప్పకుండా భాయి - భాయిగానే ఉంటారు. సోదరీ సోదరులనే వస్త్ర్రాన్ని ఇక్కడే వదలవలసి వస్తుంది. ఆత్మ భాయి భాయి (సోదర-సోదర) అనే జ్ఞానాన్ని ఆ తండ్రి ఒక్కరు మాత్రమే ఇస్తారు. ఆత్మ భృకుటి మధ్యలో ఉంటుంది. మీరు కూడా మీ దృష్టిని ఇక్కడే నిలపాలి. ఆత్మలమైన మనము శరీరమనే సింహాసనము పై కూర్చుని ఉన్నాము. దీనిని ఆత్మ యొక్క సింహాసనము లేక అకాల సింహాసనము(తక్త్) అని అంటారు. ఆత్మలను ఎప్పుడూ మృత్యువు కబళించదు. భ్రూ మధ్య స్థానమే అందరి సింహాసనము. దీని పై మృత్యువు లేని ఆత్మ కూర్చుని ఉంది. ఇవన్నీ ఎంతో అర్థము చేసుకునే విషయాలు. పిల్లలలో కూడా ఆత్మ వెళ్లి భృకుటి మధ్యలో కూర్చుంటుంది. ఆ చిన్న సింహాసనము తర్వాత పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. ఇక్కడ గర్భములో ఆత్మలు కర్మభోగము అనుభవించవలసి ఉంటుంది. అప్పుడు ఇక ఎప్పుడూ పాపాత్మగా అవ్వనని పశ్చాత్తాపపడ్తుంది. అర్ధకల్పము పాపాత్మగా అవుతుంది. ఇప్పుడు తండ్రి ద్వారా పవిత్ర ఆత్మగా అవుతుంది. మీరు తనువు-మనసు-ధనము అన్నీ తండ్రికి ఇచ్చేస్తారు. ఇంత దానము చేస్తారని ఎవ్వరికీ తెలియదు. దానము ఇచ్చేవారు, తీసుకునేవారు కూడా భారతదేశములోనే వస్తారు. ఇవన్నీ అర్థము చేసుకునే సూక్ష్మ విషయాలు. భారతదేశము ఎంత అవినాశి ఖండంగా అయ్యింది! మిగిలిన అన్ని ఖండాలు సమాప్తమవుతాయి. ఇది తయారైన డ్రామా అని మీ బుద్ధిలో ఉంది. దీనిని జ్ఞానము అని అనడం బాగుంటుంది. ప్రపంచానికి ఈ విషయాలు తెలియవు, జ్ఞానము సంపాదనకు మూలము. దీని ద్వారా చాలా సంపాదన జరుగుతుంది. తండ్రిని స్మృతి చేయండి. ఇతను(బ్రహ్మ) కూడా జ్ఞానమునిస్తారు. సృష్టి చక్ర జ్ఞానమును కూడా ఇస్తారు. ఇందులో శ్రమ ఉంటుంది. ఆత్మలైన మనమిప్పుడు ఇంటికి వాపస్ వెళ్లాలి. కనుక ఈ పాత ప్రపంచము, పాత శరీరము నుండి అతీతంగా(ఉపరాంగా) ఉండాలి. దేహ సహితము మీరు చూస్తున్నదంతా సమాప్తమవుతుంది. ఇప్పుడు మనము బదిలీ అవ్వాలి. ఇది తండ్రి మాత్రమే తెలుపగలరు. ఇది చాలా పెద్ద పరీక్ష. దీని కొరకు తండ్రి ఒక్కరు మాత్రమే చదివిస్తారు. ఇందులో పుస్తకాలు మొదలైనవి అవసరము లేదు. తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి 84 జన్మల చక్రమును గురించిన జ్ఞానమునిస్తారు. ఈ డ్రామా డ్యూరేషన్(పరిమితి) ఎవ్వరికీ తెలియదు. గాఢాంధకారములో ఉన్నారు. మీరు ఇప్పుడే మేలుకున్నారు. మనుష్యులు మేలుకోరు. మీరు ఎంతో శ్రమ చేస్తారు. భగవంతుడు వచ్చి మిమ్ములను చదివిస్తున్నారంటే వారు నమ్మరు. తప్పకుండా ఎవరిలోనో వస్తారు కదా. ఈ విధంగా మీరు చేస్తే, మనుష్యులు అర్థము చేసుకుంటారని ఇప్పుడు తండ్రి ఆత్మలైన మీకు సలహా ఇస్తున్నారు. మీకైతే చాలా సులభము. నంబరువారుగా ఉండనే ఉంటారు. పాఠశాలలో కూడా నంబరువారుగా ఉంటారు. చదువులో కూడా నంబరువారుగా ఉంటారు. ఈ చదువు ద్వారా గొప్ప రాజధాని స్థాపనౌతూ ఉంది. మనము రాజులు అయ్యేటంత పురుషార్థము చేయాలి. ఈ సమయములో మీరు ఏ పురుషార్థము చేస్తారో, అది కల్ప-కల్పాంతరాలు చేస్తూ ఉంటారు. దీనిని ఈశ్వరీయ లాటరీ అని అంటారు. కొంతమందికి చిన్న లాటరీ, కొంతమందికి పెద్ద లాటరీ తగుల్తుంది. రాజ్యము కూడా ఒక లాటరీయే. ఆత్మ ఎటువంటి కర్మ చేస్తుందో అటువంటి లాటరీ లభిస్తుంది. కొంతమంది పేదలుగా అవుతారు. కొంతమంది ధనవంతులుగా అవుతారు. ఈ సమయంలో పిల్లలైన మీకు తండ్రి ద్వారా అన్ని లాటరీలు లభిస్తాయి. ఈ సమయంలో చేయు పురుషార్థము పై చాలా ఆధారపడి ఉంది. నంబర్వన్ పురుషార్థము స్మృతి, కనుక మొదట యోగబలము ద్వారా స్వచ్ఛంగా అవ్వండి. మనము తండ్రిని ఎంతగా స్మృతి చేస్తామో అంత జ్ఞాన ధారణ జరుగుతుందని, అనేకమందికి అర్థం చేయించి తమ ప్రజలుగా చేసుకుంటారని మీకు తెలుసు. ఏ ధర్మము వారైనా పరస్పరములో కలిసినప్పుడు తండ్రి పరిచయమునివ్వండి. పోను పోను వినాశనము అతిసమీపములో ఉందని గమనిస్తారు. వినాశ సమయములో మనుష్యులకు వైరాగ్యము కలుగుతుంది. అప్పుడు కేవలం మీరందరూ ఆత్మలని మాత్రము వారికి చెప్పాలి. ఓ గాడ్ఫాదర్ అని అనేదెవరు? ఆత్మ. తండ్రి ఇప్పుడు నేను మీకు మార్గదర్శకునిగా అయ్యి మిమ్ములను ముక్తిధామానికి తీసుకెళ్తానని ఆత్మలకు చెప్తున్నారు. పోతే ఆత్మ ఎప్పుడూ వినాశనమవ్వదు. నుక మోక్షమనే ప్రశ్నే లేదు. ప్రతి ఒక్కరూ తమ-తమ పాత్రను తప్పకుండా అభినయించాలి. ఆత్మలన్నీ అవినాశి. ఎప్పుడూ వినాశనమవ్వవు. పోతే అక్కడికి వెళ్లేందుకు తండ్రిని స్మృతి చేస్తే, వికర్మలు వినాశనమవుతాయి. ఆత్మలు ఇంటికి వెళ్లిపోతాము. చివరికి గొప్ప-గొప్ప సన్యాసులు కూడా అందరూ వాపస్ ఇంటికి వెళ్లాల్సిందే అని అర్థము చేసుకుంటారు. మీ సందేశము అందరి బుద్ధులను కదిలిస్తుంది. అందుకే అహో! ప్రభూ!.... మీరు వచ్చేది, మీరిచ్చే మతము...... మీ లీలలు అపారము అనే గాయనము కూడా ఉంది. కావున వారు వారి మతమును ఎవరికైనా ఇస్తారా? లేక తమ వద్దనే ఉంచుకుంటారా? వారి మతము ద్వారా సద్గతి ఎలా జరుగుతుందో తప్పకుండా తెలుపుతారు కదా. అందుకే వారు మీ విధానాలు, మీ సలహాలు(గతి-మతి) మీకేే తెలుసు, మాకు తెలియదు అని అంటారు. ఇది కూడా తెలుసుకోవలసిన విషయమా! తండ్రి చెప్తున్నారు - ఈ శ్రీమతము ద్వారా మీకు ముక్తి(గతి) లభిస్తుంది.
బాబా తమకు తెలిసిందంతా మనకు నేర్పిస్తారని ఇప్పుడు మీకు తెలుసు. మాకు బాబా తెలుసని మీరంటారు. వారు మీ గతి-మతులు మీకే తెలుసు అని పాడ్తారు కానీ మీరు అలా అనరు. అయితే బుద్ధిలో అన్ని విషయాలు కూర్చుకునేందుకు సమయము పడ్తుంది. ఇంతవరకు సంపూర్ణులుగా ఎవ్వరూ అవ్వలేదు. సంపూర్ణంగా అయితే ఇక్కడ నుండి వెళ్లిపోతారు. ఇప్పుడైతే వెళ్లేది లేదు. ఇప్పుడు అందరూ పురుషార్థము చేస్తున్నారు. బాబాకు మొదట చాలా జోరుగా వైరాగ్యము వచ్చేసింది. డబల్ కిరీటధారిని అవుతానని సాక్షాత్కారములో చూచారు. ఇది కూడా డ్రామానుసారము తండ్రి చూపించారు. నేను వెంటనే చాలా సంతోషించాను. ఆ ఖుషీలో అందరినీ(స్మృతిని) వదిలేశాను. వినాశనము కూడా చూచాను, చతుర్భుజుని కూడా చూశాను. ఇప్పుడు రాజ్యము లభిస్తుందని అర్థం చేసుకున్నాను. కొద్ది రోజుల్లో వినాశనమవుతుందని కూడా తెలుసుకున్నాను. ఈ నషా ఎక్కింది. ఇది సత్యమని ఇప్పుడు అర్థం చేసుకున్నాను. రాజధాని తయారవుతుంది. చాలామందికి రాజ్యము లభిస్తుంది. అచ్చటకు ఒక్కడినే వెళ్లి ఏమి చేస్తాను. ఈ జ్ఞానము ఇప్పుడే లభిస్తుంది. మొదట అపారమైన సంతోషము కలిగింది. ఖుషీ పాదరస మీటరు పైకి ఎక్కిపోయింది. పురుషార్థమైతే అందరూ చేసి తీరాలి. మీరు పురుషార్థము చేసేందుకు కూర్చుని ఉన్నారు. అమృతవేళ స్మృతిలో కూర్చుంటారు. అలా కూర్చొనుట కూడా చాలా మంచిది. బాబా వచ్చారని మీకు తెలుసు. బాబా వచ్చారా లేక దాదా వచ్చారా అనేది బెల్లమునకు, బెల్లపు సంచికి తెలుసు(గుడ్ జానే, గుడ్ కీ గోథరీ జానే, శివబాబాకు తెలుసు, బ్రాహ్మాబాబాకు తెలుసు). ఒక్కొక్క పుత్రుని గమనిస్తూ ఉంటారు. కూర్చుని ఒక్కొక్కరికి సకాశ్ ఇస్తారు. యోగాగ్ని కదా. యోగాగ్ని ద్వారా వారి వికర్మలు భస్మమైపోవాలి. కూర్చుని లైటు ఇచ్చ్చునట్లు ఒక్కొక్క ఆత్మకు సర్చిలైట్ ఇస్తారు. నేను కూర్చుని ప్రతి ఆత్మకు కరెంటు ఇస్తే శక్తి నిండిపోతూ ఉంటుందని తండ్రి చెప్తున్నారు. ఎవరి బుద్ధి అయినా ఇక్కడ లేకుండా వెలుపలికి వెళ్తే కరెంటు గ్రహించలేరు. బుద్ధి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. అలాంటివారికి ఏమి లభిస్తుంది? మీరు ప్రేమిస్తే ప్రేమను పొందుతారు(మిఠారా ఘురత్ ఘురాయ్) అని అంటారు కదా. బుద్ధి వెలుపల భ్రమిస్తూంటే బ్యాటరీ చార్జ్ అవ్వదు. తండ్రి బ్యాటరీలో శక్తిని నింపేందుకు వస్తారు. సేవ చేయడం వారి కర్తవ్యము. పిల్లలు ఆ సేవను స్వీకరిస్తారో లేదో వారి ఆత్మకే తెలుసు. ఏమాలోచిస్తూ కూర్చున్నారో, ఈ విషయాలన్నీ తండ్రి తెలిపిస్తారు. నేను(శివబాబా) కూడా పరమాత్మను నా బ్యాటరీతో యోగము చేస్తారు. నేను కూడా సకాశ్(శక్తి) ఇస్తానని తండ్రి చెప్తున్నారు. చాలా ప్రీతితో ప్రతి ఒక్కొక్కరికి సకాశ్ ఇస్తాను. తండ్రిని స్మృతి చేసేందుకు మీరు కూర్చుంటారు. ఒక్కొక్క ఆత్మకు కూర్చుని సకాశ్ ఇస్తానని తండ్రి చెప్తున్నారు. మీ ఎదురుగా కూర్చుని లైటు ఇస్తాను. నేను అన్నట్లు మీరు అనలేరు. ఎవరైతే ఈ శక్తిని పట్టుకోగలరో వారే పట్టుకుంటారు. వారి బ్యాటరీ చార్జ్ అవుతుంది. బాబా ప్రతి రోజూ యుక్తులైతే తెలుపుతూ ఉంటారు. పోతే అర్థము చేసుకోవడం, చేసుకోకపోవడం ఇది నెంబరువారుగా విద్యార్థుల పై ఆధారపడి ఉంటుంది. మీకు చాలా తాజా సరుకు లభిస్తుంది. ఎవరైనా జీర్ణించుకోగలిగితే కదా. ఇది చాలా పెద్ద లాటరీ. జన్మ-జన్మాంతరాల లాటరీ. కల్ప-కల్పాంతరాల లాటరీ. దీని పై పూర్తి గమనమివ్వాలి. బాబా నుండి మనము కరెంటు తీసుకుంటున్నాము. తండ్రి కూడా భృకుటి మధ్యలో ప్రక్కనే కూర్చుని ఉన్నారు. మీరు కూడా స్వయాన్ని ఆత్మగా భావించి బాబాను స్మృతి చేయాలి, బ్రహ్మను కాదు. మనము వారితో యోగము చేస్తున్నాము. వీరిని చూస్తున్నా మనము వారినే చూస్తాము. ఇదంతా ఆత్మ విషయమే కదా. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఆత్మను స్వచ్ఛంగా చేసుకునేందుకు అమృతవేళలో తండ్రి నుండి సర్చిలైటు తీసుకోవాలి. బుద్ధి యోగాన్ని వెలుపలి నుండి తొలగించి ఒక్క తండ్రితోనే జోడించాలి. తండ్రి ఇచ్చు కరెంటును గ్రహించాలి.
2. పరస్పరములో సత్యమైన సోదర ప్రేమ ఉండాలి. అందరికీ గౌరవమునివ్వాలి. సోదరుడైన ఆత్మ అకాల సింహాసనము పై విరాజమానమై ఉన్నాడు, కనుక భృకుటిలోనే చూస్తూ మాట్లాడాలి.
వరదానము :-
''తండ్రి సంస్కారాలను తమ ఒరిజనల్ సంస్కారాలుగా చేసుకునే శుభ భావనా శుభ కామనధారీ భవ''
ఇంతవరకు చాలామంది పిల్లలలో ఫీలింగ్, కినారా చేసే, పరచింతన చేసే లేక వినే రకరకాల సంస్కారాలున్నాయి. వాటిని ''ఏం చేయాలి, ఇది నా సంస్కారము........ ఇలా 'నాది' అని అనడమే పురుషార్థాన్ని ఢీలాగా చేస్తుంది. ఇది రావణుని వస్తువు, నాది కాదు. కానీ తండ్రి సంస్కారమేదైతే ఉందో, అదే బ్రాహ్మణుల ఒరిజనల్ సంస్కారము. అది విశ్వకళ్యాణము చేసే సంస్కారము, శుభ చింతన చేసే సంస్కారము. వారు అందరి పట్ల శుభ భావన, శుభ కామనధారులుగా ఉంటారు.
స్లోగన్ :-
''ఎవరిలో సమర్థత ఉంటుందో, వారే సర్వ శక్తుల ఖజానాలకు అధికారులు.''