12-06-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - ఇప్పుడు పిడికెడు శెనగల వెనుక మీ సమయము నష్టపరచుకోరాదు. ఇప్పుడు తండ్రికి సహాయకారులై తండ్రి పేరును ప్రసిద్ధం చేయండి. ( విశేషంగా కుమారీలకు ) ''
ప్రశ్న :-
జ్ఞాన మార్గములో మీరు అడుగులు ముందుకు వేస్తున్నారనేందుకు గుర్తు ఏది ?
జవాబు :-
జ్ఞాన మార్గములో ముందుకు సాగే పిల్లలకు శాంతిధామము, సుఖధామాలు సదా గుర్తుంటాయి. స్మృతి చేసే సమయములో బుద్ధి ఎటువైపూ భమ్రించదు. బుద్ధిలో వ్యర్థ సంకల్పాలు రావు, బుద్ధి ఏకాగంగా ఉంటుంది, తూగుతూ కునికిపాట్లు పడరు, ఖుషీ పాదరస మీటరు పైకి ఎక్కి ఉంటుంది. ఇలా ఉంటే వారి అడుగులు జ్ఞాన మార్గములో ముందుకు సాగుతున్నాయని సిద్ధమవుతుంది.
ఓంశాంతి.
పిల్లలు ఇంత సమయము ఇక్కడ కూర్చుని ఉన్నారు. మనము శివాలయములో కుర్చున్నామని వారి హృదయములో కూడా అనుభవమవుతుంది. శివబాబా కూడా గుర్తుకు వస్తారు. స్వర్గము కూడా గుర్తుకు వచ్చేస్తుంది. తండ్రి స్మృతి ద్వారానే సుఖము లభిస్తుంది. మేము శివాలయములో కూర్చున్నామని బుద్ధిలో గుర్తుండినా, ఎంతో సంతోషము కలుగుతుంది. చివరికి అందరూ శివాలయములోకే వెళ్లాలి. శాంతిధామములో ఎవ్వరూ కూర్చుండిపోరు. వాస్తవానికి శాంతిధామాన్ని కూడా శివాలయమని అంటారు. అలాగే సుఖధామాన్ని కూడా శివాలయమని అంటారు. ఎందుకంటే తండ్రియే రెండిటిని స్థాపన చేస్తారు. పిల్లలైన మీరు కూడా ఈ రెండింటినీ స్మృతి చేయాలి. ఆ శివాలయము శాంతి కొరకు, ఈ శివాలయము సుఖము కొరకు. ఇప్పుడిది దు:ఖధామము. మీరిప్పుడు సంగమ యుగములో కూర్చుని ఉన్నారు. శాంతిధామము మరియు సుఖధామము తప్ప ఏదీ గుర్తు రాకుడదు. ఎక్కడ కూర్చుని ఉన్నా, వ్యాపారాదులలో కూర్చుని ఉన్నా బుద్ధిలో రెండు శివాలయాలు గుర్తుకు రావాలి. దుఃఖధామాన్ని మర్చిపోవాలి. ఈ వేశ్యాలయము, దుఃఖధామము ఇప్పుడు సమాప్తమవ్వనున్నాయని పిల్లలకు తెలుసు.
ఇచ్చట కూర్చొని పిల్లలైన మీరు కునికిపాట్లు పడరాదు(తూగరాదు). చాలా మందికి బుద్ధి ఎక్కడెక్కడికో ఇతర వైపులకు వెళ్లిపోతుంది. మాయ విఘ్నాలు కలుగజేస్తుంది. పిల్లలైన మీకు తండ్రి ఘడియ ఘడియ - పిల్లలూ! మన్మనాభవ అని చెప్తున్నారు. అందుకు రకరకాల యుక్తులు కూడా తెలియచేస్తారు. మీరు ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు, మేము మొదట శాంతిధామ శివాలయములోకి వెళ్తాము తర్వాత సుఖధామములోకి వస్తాము అని బుద్ధిలో గుర్తుంచుకోండి. ఈ విధంగా స్మృతి చేసినందున పాపాలు నశిస్తూ ఉంటాయి. మీరు ఎంత స్మృతి చేస్తారో, అంత ముందుకు పోతారు. ఇక్కడ ఏ ఇతర ఆలోచనలతో కూర్చోరాదు. అలా చేస్తే ఇతరులకు నష్టము కలిగిస్తారు. లాభానికి బదులు ఇంకా నష్టపోతారు.'' ఎవరు తూగుతున్నారో, ఎవరెవరు కనులు మూసుకుని కూర్చున్నారో పరిశీలించేందుకు పార్రంభములో మీ ముందు ఎవరో ఒకరిని కూర్చోపెట్టేవారు. అందువలన చాలా అపమ్రత్తంగా ఉండేవారు. తండి కూడా వీరి బుద్ధియోగము ఎక్కడైనా భమ్రిస్తూ ఉందా, తూగుతున్నారా?'' అని గమనించేవారు. ఏమీ అర్థము చేసుకోనివారు కూడా చాలా మంది వస్తారు. బ్రాహ్మణీలు తీసుకొస్తారు. శివబాబా ముందు చాలా మంచి పిల్లలు, పొరపాట్లు చేయకుండా ఉండేవారు ఉండాలి. ఎందుకంటే వచ్చినవారు సాధారణ టీచరు కాదు. స్వయంగా తండ్రి కూర్చొని నేర్పిస్తున్నారు. ఇక్కడ చాలా అప్రమత్తంగా కూర్చోవాలి. బాబా 15 నిమిషాలు శాంతిలో కూర్చోబెడ్తారు. మీరైతే గంట, రెండు గంటలు కూర్చుంటారు. అంత అందరూ మహారథులు కారు కదా. కచ్ఛా(అపరిపక్వము)గా ఉన్నవారిని హెచ్చరిస్తూ ఉండాలి. హెచ్చరిస్తూ ఉంటే మేల్కొని ఉంటారు. స్మృతి చేయనివారు, వ్యర్థ సంకల్పాలు చేసేవారు ఇతరులకు విఘ్నాలు కలిగించినట్లవుతుంది. ఎందుకంటే బుద్ధి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. మహారథులు, ఆశ్వారూఢులు, పదాతిదళము అందరూ కూర్చుని ఉన్నారు.
ఈ రోజు బాబా విచార సాగర మథనము చేసి వచ్చారు - మ్యూజియంలో లేక ప్రదర్శినిలో పిల్లలైన మీరు తయారు చేసిన శివాలయము, వేశ్యాలయము మరియు పురుషోత్తమ సంగమ యుగము ఈ మూడు ఇతరులకు తెలిపేందుకు చాలా బాగున్నాయి. వాటిని చాలా పెద్ద పెద్దవి తయారుచేయాలి. వీటి కొరకు చాలా పెద్ద మంచి హాలు ఉండాలి. అది చూసి మనుష్యుల బుద్ధిలో ఇక్కడ వెంటనే కూర్చోవాలి. వీటిని ఎలా అభివృద్ధి పరచాలి? అని పిల్లలు ఆలోచించాలి. పురుషోత్తమ సంగమ యుగాన్ని చాలా బాగా తయారు చేయాలి. దాని ద్వారా మనుష్యులకు మంచి విశదీకరణ లభిస్తుంది. 5-6 మందిని తపస్సులో కూడా కూర్చోపెడ్తారు. కానీ 10-16 మందిని తపస్సులో కూర్చోబెట్టాలి. పెద్ద పెద్ద చిత్రాలు తయారు చేసి స్పష్టంగా వ్రాయాలి. మీరు ఎంతగా అర్థం చేయించినా, వారు అర్థము చేసుకోలేరు. అర్థం చేయించేందుకు మీరు చాలా శ్రమ చేస్తారు కానీ రాతి బుద్ధి గలవారిగా ఉన్నారు కదా. అందువలన ఎంత వీలైతే అంత బాగా అర్థం చేయించాలి. ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో వారు సేవను ఎలా వృద్ధి చేయాలి? అని ఆలోచిస్తూ ఉండాలి. మ్యూజియమ్లో ఉన్నంత మజా ప్రొజెక్టర్లో, ప్రదర్శినీలో ఉండదు. ప్రొజెక్టర్ ద్వారా కొంచెము కూడా అర్థము చేసుకోలేరు. మ్యూజియమ్ అన్నిటికంటే మంచిది. చిన్న మ్యూజియమ్ అయినా సేవ బాగా చేస్తుంది. ఒక గదిలో ఈ శివాలయము, వేశ్యాలయము, పురుషోత్తము సంగమ యుగముల సీనరీ(దృశ్యము) ఉండాలి. అర్థం చేయించేందుకు చాలా కుశాగ్ర బుద్ధి కావాలి.
బేహద్(అనంతమైన) తండ్రి, బేహద్ టీచరు వచ్చారు. పిల్లలు బి.ఏ.(దీ.ూ), ఎం.ఏ(వీ.ూ) పాస్ అయినంత వరకు వారు అలాగే కూర్చుని ఉంటారా? అలాగే కూర్చుని ఉండరు. వారు త్వరగా వెళ్లిపోతారు. మిగిలి ఉన్న సమయము కొద్దిగా ఉన్నా పిల్లలు మేల్కోరు. మంచి-మంచి కుమారీలు 400-500 జీతము కొరకు మా సమయాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? అని అంటారు. అలా ఉంటే శివాలయములో మనము ఏ పదవి పొందుకుంటాము! అని అంటారు. కుమారీలకు ఏ బంధనము లేదు. ఎంత ఎక్కువ జీతము దొరికినా, అది పిడికెడు శెనగలకు సమానము. అన్నీ సమాప్తమైపోతాయి. ఏవీ ఉండవు. పిడికెడు శెనగలను వదిలించేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. అయినా వదలనే వదలరు. అందులో పిడికెడు శెనగలు ఉంటే, ఇందులో విశ్వరాజ్యాధికారముంది. అది పైసా విలువ గల శెనగలకు సమానము, దాని వెనుక ఇంతగా ఎందుకు పరుగెత్తి గాభరా పడుతున్నారు? కుమారీలు బంధన ముక్తులు. ఆ చదువుకు ఉండేది పైసా విలువ. దానిని వదిలి ఈ జ్ఞానము చదువుకుంటూ ఉంటే మీ బుద్ధి కూడా వికసిస్తుంది. ఇంత చిన్న - చిన్న కన్యలు కూర్చొని గొప్ప గొప్ప వారికి జ్ఞానము ఇచ్చి శివాలయ స్థాపనకు తండ్రి వచ్చారు అని చెప్పాలి. ఇక్కడ ఉన్నదంతా మట్టిలో కలిసిపోతుందని మీకు తెలుసు. ఈ శెనగలు కూడా భాగ్యములో ఉండవు. కొంతమంది వద్ద 5 శెనగలు అనగా 5 లక్షలు ఉన్నా, అది కూడా సమాప్తమైపోతుంది. ఇప్పుడు చాలా కొద్ది సమయము మాతమ్రే ఉంది. రోజురోజుకు పరిస్థితులు ఇంకా పాడౌతూ ఉంటాయి. అకస్మాత్తుగా ఆపదలు వచ్చేస్తాయి. మృత్యువు కూడా అకస్మాత్తుగా వచ్చేస్తూ ఉంటుంది. పిడికిట్లో శెనగలు ఉండగానే(నోటికి పోకుండానే) పాణ్రము గాలిలో కలిసిపోతుంది. అందువలన మానవులను ఈ కోతి సంస్కారాల నుండి విడిపించాలి. కేవలం మ్యూజియం చూసి సంతోషించడం కాదు. అద్భుతము చేసి చూపాలి. మనుష్యులను సంస్కరించాలి. తండ్రి పిల్లలైన మీకు విశ్వరాజ్య అధికారమునిస్తున్నారు. మిగిలిన వారి భాగ్యములో ఆ శెనగలు కూడా ఉండవు. అన్నీ సమాప్తమైపోతాయి. దాని కంటే తండ్రి నుండి విశ్వ చక్రవర్తి పదవిని ఎందుకు తీసుకోరాదు? ఇందులో ఏ కష్టమూ లేదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి, స్వదర్శన చక్రము తిప్పుతూ ఉండాలి. పిడికిలితో శెనగలు పారేసి దానిని వజ్ర వైడూర్యాలతో నింపుకుని వెళ్లాలి.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలారా, ఈ పిడికెడు శెనగల వెనుక మీరు మీ సమయాన్ని ఎందుకు నాశనము చేసుకుంటారు? ఎవరైనా వృద్ధులుంటే, చాలా మంది పిల్లా-పాపలు ఉంటే వారిని పోషించాలి. కుమారీలకైతే చాలా సహజము. ఎవరైనా వస్తే తండ్రి మాకు విశ్వరాజ్యాధికారము ఇస్తారని అర్థం చేయించండి. కనుక చక్రవర్తి పదవి తీసుకోవాలి కదా. ఇప్పుడు మీ పిడికిలి వజ్రాలతో నిండుతోంది. మిగిలినదంతా వినాశనమైపోతుంది. తండ్రి అర్థం చేయిస్తారు - మీరు 63 జన్మలు పాపము చేశారు. అంతేకాక తండ్రిని, దేవతలను గ్లాని చేయడం ఇంకొక పాపము. వికారులుగా అయ్యారు. తిట్టను కూడా తిట్టారు. తండ్రిని ఎంతగానో గ్లాని చేశారు. తండి కూర్చొని చెప్తున్నారు - పిల్లలారా! సమయము పోగొట్టుకోరాదు. బాబా మేము స్మృతి చేయలేము అని అనరాదు. బాబా మేము స్వయాన్ని ఆత్మ అని గుర్తు చేసుకోలేకున్నాము అని చెప్పండి. స్వయాన్ని మర్చిపోతారు. దేహాభిమానములోకి రావడం అనగా స్వయాన్ని మర్చిపోవడం. స్వయాన్ని ఆత్మగా స్మృతి చేయలేకుంటే తండ్రిని ఎలా స్మృతి చేయగలరు? ఇది చాలా పెద్ద గమ్యము, చాలా సులభమైనది కూడా. కానీ మాయ చాలా అడ్డుపడుతూ ఉంటుంది(అపోజిషన్ ఉంటుంది).
మనుష్యులు గీత మొదలైనవి భలే చదువుతారు కానీ కొంచెము కూడా అర్థము చేసుకోరు. భారతదేశానికి ముఖ్యమైనది గీత. ప్రతి ధర్మానికి తమ-తమ శాస్త్రము ఒకటి ఉంటుంది. ధర్మ స్థాపన చేయువారిని సద్గురువు అని అనరు. ఇది చాలా పెద్ద తప్పు. సద్గురువు ఒక్కరు మాత్రమే. గురువులు అని పిలువబడేవారు చాలామంది ఉన్నారు. కొంతమంది కార్పెంటర్ పనిని నేర్పిస్తారు, కొంతమంది ఇంజనీరింగ్ పని నేర్పిస్తారు, అందువలన వారు కూడా గురువులే. ఏ పని నేర్పించినా వారు గురువులే. కానీ సద్గురువు మాతమ్రు ఒక్కరే. ఇప్పుడు మీకు సద్గురువు లభించారు. వారు సత్యమైన తండే కాక సత్యమైన టీచరు కూడా అయ్యారు. కావున పిల్లలైన మీరు ఎక్కువగా పొరపాట్లు చేయరాదు. ఇక్కడ నుండి బాగా రిఫ్రెష్(తాజా) అయ్యి వెళ్తారు. ఇంటికి పోతూనే ఇక్కడివన్నీ మర్చిపోతారు. గర్భ జైలులో చాలా శిక్షలు లభిస్తాయి. అక్కడ అయితే గర్భ మహలు ఉంటుంది. శిక్ష అనుభవించే వికర్మలు ఏవీ అక్కడ చేయరు. ఇక్కడ తండ్రి సన్ముఖములో చదువుతున్నామని పిల్లలైన మీరు భావిస్తారు. బయట తమ ఇంట్లో అయితే అలా అనరు. అక్కడ సోదరులు చదివిస్తున్నారని భావిస్తారు. ఇక్కడ అయితే నేరుగా తండ్రి వద్దకు వచ్చారు. తండ్రి పిల్లలకు చాలా బాగా అర్థం చేయిస్తారు. తండ్రి అర్థం చేయించడంలో, పిల్లలు అర్థం చేయించడంలో తేడా ఉంటుంది. తండ్రి కూర్చుని పిల్లలను అప్రమత్తం చేస్తారు. పిల్లలూ! - పిల్లలూ! అంటూ అర్థం చేయిస్తారు. మీరు శివాలయము, వేశ్యాలయము గురించి తెలుసుకున్నారు. ఇవి అనంతమైన విషయాలు. ఇది స్పష్టము చేసి చూపిస్తే, మనుష్యులకు కొంత ఆనందము కలుగుతుంది. అక్కడ తమాషాగా నవ్విస్తూ అర్థం చేయిస్తారు. సీరియస్గా అర్థము చేయిస్తే చాలా బాగా అర్థము చేసుకుంటారు. మీ పై మీరు దయ చూపుకోండి. ఈ వేశ్యాలయములోనే ఉండాలనిపిస్తుందా! ఎలా ఎలా అర్థము చేయించాలని బాబా ఆలోచిస్తూ ఉంటారు కదా. పిల్లలు ఎంతో శ్రమ చేస్తారు. అయినా అది డబ్బాలో రాయి వలె అవుతుంది. సరే! సరే! అంటూ తలలూపుతూ చాలా బాగుంది అని అంటారు. ఇది మా ఊర్లో తెలపాలని అంటారు. కానీ స్వయం అర్థము చేసుకోలేరు. షావుకార్లు, ధనవంతులు అసలే అర్థము చేసుకోరు. గమనమే ఇవ్వరు. అటువంటివారు చివర్లో వస్తారు. అప్పుడు టూ లేట్(చాలా ఆలస్యము/ ుశీశీ కూa్వ) అయిపోతుంది. వారి ధనమూ ఉపయోగపడదు, అలాగే యోగము కూడా చేయలేరు. వింటారు కాబట్టి ప్రజలలోకి వస్తారు. పేదలు చాలా ఉన్నత పదవి పొందగలరు. కన్యలైన మీ వద్ద ఏముంది? కన్యలను పేదలని అంటారు. ఎందుకంటే తండ్రి వారసత్వము మగ పిల్లలకే లభిస్తుంది. కన్యలను దానముగా(కన్యాదానము) ఇస్తారు. అప్పుడు వికారాలలోకి వెళ్తుంది. వివాహము చేసుకుంటే ధనము ఇస్తామని అంటారు. పవిత్రంగా ఉంటానంటే ఒక్క పైసా కూడా ఇవ్వము అని అంటారు. మానవుల పద్ధతులు ఎలా ఉన్నాయో చూడండి. మీరు ఎవ్వరికీ భయపడకండి. బాహాటంగా అందరికీ అర్థం చేయించండి. ధైర్యము, చురుకుదనము కావాలి. మీరు పూర్తిగా సత్యమునే చెప్తారు. ఇది సంగమ యుగము. అటువైపు పిడికెడు శెనగలు, ఇటువైపు వజ్రాల పిడికిలి. ఇప్పుడు మీరు వానరము(కోతి) నుండి మందిరానికి అర్హులుగా అవుతారు. పురుషార్థము చేసి వజ్ర సమానమైన జన్మ తీసుకోవాలి కదా. మీ ముఖము కూడా ఆడపులి వలె సాహసవంతంగా ఉండాలి. కొంతమంది ముఖము ఆడ మేక వలె ఉంటుంది. కొంచెము శబ్ధము వచ్చినా భయపడ్తారు. అందువలన పిల్లలందరినీ తండ్రి హెచ్చరిస్తున్నారు - కన్యలు చిక్కుకోరాదు. బంధనాలలో చిక్కుకుంటే వికారాలకై దెబ్బలు తింటారు. జ్ఞానము మంచి రీతిగా ధారణ చేస్తే విశ్వానికి మహారాణిగా అవుతారు. తండ్రి చెప్తున్నారు - నేను మీకు విశ్వానికి చక్రవర్తి పదవిని ఇచ్చేందుకు వచ్చాను. కానీ కొంతమంది భాగ్యములో ఉండదు. తండ్రి పేదలపెన్నిధి. కన్యలు పేదవారు. తల్లిదండ్రులు వివాహము చేయించలేకుంటే ఇచ్చేస్తారు. కనుక వారికి నషా పెరగాలి - మనము బాగా చదువుకొని మంచి పదవి పొందుకోవాలని భావించాలి. మంచి విద్యార్థులైతే చదువు పై గమనముంచుతారు. గౌరవ పూర్వకంగా ఉత్తీర్ణులవుతామని అంటారు. అలా పాసైన వారికి స్కాలర్షిప్ లభిస్తుంది. ఎంత పురుషార్థము చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు, అదీ 21 జన్మల కొరకు! ఇక్కడ ఉండేది అల్పకాలిక సుఖము. ఈ రోజు ఏదో ఒక పదవి ఉంటుంది. రేపు మృత్యువు వచ్చిందంటే అంతా సమాప్తం. యోగి, భోగి ఇరువురికీ తేడా అయితే ఉంటుంది కదా. అందువలన తండ్రి అంటున్నారు - పేదల పై ఎక్కువ గమనమివ్వండి. ధనవంతులు చాలా కష్టంగా జ్ఞానము తీసుకుంటారు. మాట వరుసకు ఈ జ్ఞానము చాలా బాగుంది, ఈ సంస్థ చాలా బాగుంది అని అంటారు. బయటకు పోతూనే సమాప్తము. ఈ సంస్థ చాలా మంచిది, చాలా మందికి కళ్యాణము చేస్తుంది అని అంటారు. కానీ స్వకళ్యాణము కొంచెము కూడా చేసుకోరు. బయటకు పోతూనే సమాప్తం. మాయ కర్ర పటుకొని కూర్చుని ఉత్సాహాన్ని మాయం చేసేస్తుంది. ఒక్క చెంపదెబ్బ వేయడంతోనే బుద్ధిని నాశనం చేస్తుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - భారతదేశపు స్థితి ఏమైపోయిందో చూడండి. పిల్లలు డ్రామాను మంచిరీతిగా అర్థము చేసుకున్నారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. పిడికెడు శెనగలను వదిలి తండ్రి నుండి విశ్వ చక్రవర్తి పదవిని తీసుకునేందుకు పూర్తి పురుషార్థము చేయాలి. ఏ విషయములోనూ భయపడరాదు. నిర్భయులుగా అయ్యి బంధనాల నుండి ముక్తులుగా అవ్వాలి. మీ సమయాన్ని సత్యమైన సంపాదనలో సఫలము చేసుకోవాలి.
2. ఈ దుఃఖధామాన్ని మర్చి శివాలయము అనగా శాంతిధామము, సుఖధామాలను స్మృతి చేయాలి. మాయ కలిగించు విఘ్నాలను తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలి.
వరదానము :-
'' సంతుష్టతలో మూడు సర్టిఫికెట్లు తీసుకొని యోగీ జీవిత ప్రభావాన్ని వేసే సహజయోగీ భవ ''
యోగీ జీవితంలో విశేషమైన లక్ష్యము సంతుష్టత(తృప్తి). ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో, అందరినీ సంతుష్టపరుస్తారో వారి యోగీ జీవిత ప్రభావము ఇతరుల పై స్వతహాగా పడ్తుంది. ఎలాగైతే సైన్సు సాధనాల ప్రభావం వాయుమండలం పై పడ్తుందో, అలా సహజయోగీ జీవిత ప్రభావం కూడా ఉంటుంది. యోగి జీవితంలో మూడు సర్టిఫికెట్లు ఉన్నాయి. ఒకటి - స్వయం సంతుష్ట పడడం, రెండవది - తండ్రి సంతుష్ట పడడం, మూడవది - లౌకిక, అలౌకిక పరివారం వారు సంతుష్ట పడడం.
స్లోగన్ :-
'' స్వరాజ్య తిలకము, విశ్వ కళ్యాణ కిరీటము, స్థితి అనే సింహాసనం పై విరాజమానమై ఉండువారే రాజయోగులు ''