21-01-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - తండ్రి సమానము ఆత్మిక టీచర్లుగా అవ్వండి, తండ్రి ద్వారా ఏదైతే చదువుకున్నారో దానిని ఇతరులతో కూడా చదివించండి, ధారణ ఉంటే ఎవరికైనా అర్థము చేయించి చూపించండి.''
ప్రశ్న :-
ఏ విషయంలో బాబాకు స్థిరమైన నిశ్చయముంది? పిల్లలు కూడా అందులో దృఢమైన నిశ్చయము గలవారిగా అవ్వాలి ?
జవాబు :-
బాబాకు డ్రామా పై స్థిరమైన(చలించని) నిశ్చయముంది. జరిగిపోయినదంతా డ్రామా అని బాబా అంటారు. కల్పక్రితము చేసిందే మళ్లీ చేస్తారు. డ్రామా మిమ్ములను మార్పులు చేయనివ్వదు. కాని ఇప్పటివరకు పిల్లల స్థితి ఇలా అవ్వలేదు. అందుకే ఇలా జరిగితే ఇలా చేసి ఉండేవారము, ముందే తెలిసి ఉంటే ఇలా చేసేవారము కాదు........ అని వారి నోటి నుండి వెలువడ్తుంది. గతించిన దానిని గూర్చి ఆలోచించకండి. ఇక ముందు అటువంటి పొరపాటు ఏదీ జరగకుండా ఉండేందుకు పురుషార్థము చేయండి అని బాబా అంటారు.
ఓంశాంతి.
ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. నేను ఎప్పుడు వస్తానో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే నేను గుప్తముగా ఉన్నానని బాబా స్వయంగా చెప్తున్నారు. గర్భములోకి ఆత్మ ప్రవేశించినప్పుడు కూడా. అది ప్రవేశించడం ఎవ్వరికీ తెలియదు. తిథి, తారీఖులు ఎవరూ చెప్పలేరు. గర్భము నుండి వెలుపలకు వచ్చినప్పుడు ఆ తిథి-తారీఖులు తెలిసిపోతాయి. కావున బాబా ప్రవేశించే తిథి-తారీఖులు కూడా తెలియవు. వారెప్పుడు ప్రవేశించారో, రథములోనికి ఎప్పుడు వచ్చారో ఏమీ తెలియదు. నేను(బ్రహ్మాబాబా) ఎవరినైనా చూసినప్పుడు, నన్ను చూసినవారు నషాలోకి వెళ్లిపోయేవారు. నాలో ఏదో ప్రవేశించింది, నాకు ఏదో శక్తి వచ్చిందని భావించేవాడను. కాని ఆ శక్తి ఎక్కడ నుండి వచ్చింది? నేను విశేషంగా జప-తపాలు ఏవీ చేయలేదే అని అనుకునేవాడిని. దీనినే గుప్తము అని అంటారు. తిథి, తారీఖులు ఏమీ తెలియవు. సూక్ష్మవతన స్థాపన కూడా ఎప్పుడు జరుగుతుందో, అది కూడా చెప్పలేము. ముఖ్యమైన విషయము - ''మన్మనాభవ.'' హే ఆత్మలారా! మీరు మీ తండ్రినైన నన్ను వచ్చి పతితులను పావనంగా చేయమని, పావన ప్రపంచాన్ని తయారు చేయమని పిలిచారు. తండ్రి అర్థము చేయిస్తున్నారు - డ్రామా ప్లాను అనుసారము ఎప్పుడైతే నేను రావలసి ఉంటుందో అప్పుడు మార్పు తప్పకుండా జరుగుతుంది. సత్యయుగము నుండి ఏదైతే జరిగిపోయిందో అదంతా మళ్లీ పునరావృతమౌతుంది. సత్య, త్రేతా యుగాలు మళ్లీ తప్పకుండా పునరావృతమౌతాయి. క్షణ-క్షణము గడుస్తూ ఉంటుంది. సంవత్సరాలు(శకాలు) కూడా గడచిపోతూ ఉంటాయి. సత్యయుగము గడచిపోయింది అని అంటారు. దానిని చూడలేదు కదా! తండ్రి అర్థం చేయించారు - ''మీరు దానిని దాటి వచ్చారు, మొట్టమొదట మీరే నా నుండి విడిపోయారు.'' కావున దీని పై చింతన చేయాలి - ఇప్పుడు 84 జన్మలు ఎలా తీసుకున్నామో, మళ్లీ వాటిని అదే విధంగా తీసుకోవలసి ఉంటుంది. దీనిని గురించి ఆలోచించాలి. అనగా సుఖ-దు:ఖాల పాత్రను మళ్లీ అభినయించవలసి ఉంటుంది. సత్యయుగములో సుఖముంటుంది. ఇల్లు పాతదైనప్పుడు పై కప్పు ఎక్కడో ఒక చోటు నుండి కురుస్తూ ఉంటుంది, మరో చోట ఇంకేదో అవుతుంది. అప్పుడు దీనిని మరమ్మత్తు చేయాలి అన్న చింత పట్టుకుంటుంది. ఎప్పుడైతే అది చాలా పాతబడిపోతుందో, అప్పుడు ఇక ఆ ఇల్లు నివాస యోగ్యము కాదని భావించడం జరుగుతుంది. అలా కొత్త ప్రపంచము నివాసయోగ్యము కాదని అనరు. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచములోకి వెళ్ళేందుకు అర్హులుగా అవుతారు. ప్రతి వస్తువు మొదట క్రొత్తగా, ఆ తర్వాత మళ్లీ పాతదిగా అవుతుంది.
ఇప్పుడు పిల్లలైన మీకు ఇదంతా గుర్తుకు వస్తుంది. ఇంకెవ్వరూ ఈ విషయాలను అర్థము చేసుకోలేరు. గీత, రామాయణము మొదలైన వాటిని వినిపిస్తూ ఉంటారు. అందులోనే బిజీగా (తలమునకలుగా) ఉంటారు. మీరు, నేను కూడా ఈ విషయాలలోనే బిజీగా ఉండేవారము. ఇప్పుడు తండ్రి ఎంత వివేకవంతులుగా తయారు చేశారు! బాబా చెప్తున్నారు - '' పిల్లలూ! ఇప్పుడు ఈ పురాతన ప్రపంచము అంత్యము కానున్నది. ఇప్పుడు కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి''. అలాగని అందరూ వెళ్ళరు. అందరూ ముక్తిధామములో కూర్చుండిపోవడం, ప్రళయము జరగడం అది కూడా నియమము కాదు. ఇది పురాతన ప్రపంచము, క్రొత్త ప్రపంచముల చాలా కళ్యాణకారి సంగమ యుగమని మీకు తెలుసు. ఇప్పుడు పరివర్తన జరగనున్నది. మళ్లీ శాంతిధామములోకి వెళ్తాము. అక్కడ ఎలాంటి సుఖానుభూతి ఉండదు. యజ్ఞములో ఏ విఘ్నాలైతే వచ్చాయో అవి వస్తూనే ఉంటాయని, కల్పము తర్వాత కూడా వస్తూనే ఉంటాయని గాయనము ఉంది. ఇప్పుడు మీరు పక్కా అయిపోయారు. ఈ స్థాపన మరియు వినాశనాలు చేసే కార్యము చిన్నదేమీ కాదు. విఘ్నాలు ఏ విషయములో వస్తాయి? కామము మహాశత్రువు అని తండ్రి అంటారు. ఈ విషయము పైననే అత్యాచారాలు జరుగుతాయి. ద్రౌపది విషయము కూడా ఉంది కదా! గొడవంతా బ్రహ్మచర్య విషయములోనే ఉంది. సతోప్రధానం నుండి తప్పకుండా తమోప్రధానంగా అవ్వాలి, మెట్లు దిగాలి. ప్రపంచము తప్పకుండా పాత పడాల్సిందే. ఈ విషయాలన్నీ మీరు మాత్రమే అర్థము చేసుకుంటారు మరియు స్మరిస్తారు కూడా! అంతేకాక బాగా చదువుకుంటూ చదివించాలి కూడా. టీచరుగా అవ్వాలి. జ్ఞానము బుద్ధిలో ఉంటేనే చదువుకొని టీచర్గా అవుతారు. మళ్లీ టీచర్ నుండి ఎవరైతే నేర్చుకొని చురుకైనవారుగా అవుతారో వారిని గవర్నమెంట్ పాస్ చేస్తుంది. మీరు కూడా టీచర్లే. తండ్రి మిమ్ములను టీచర్లుగా తయారు చేశారు. ఒక్క టీచరు ఏమి చేయగలరు? మీరందరూ ఆత్మిక టీచర్లే. కావున బుద్ధిలో జ్ఞానము ఉండాలి. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసే ఈ జ్ఞానము పూర్తిగా ఖచ్చితమైనది.
ఇప్పుడు పిల్లలైన మీరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంత మీలోకి లైటు(కరెంటు) వస్తూ ఉంటుంది. మనుష్యులకు సాక్షాత్కారము జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే స్మృతి ద్వారానే ఆత్మ పవిత్రంగా తప్పకుండా అవుతుంది. స్మృతి ద్వారా ఇంకెవరికైనా సాక్షాత్కారము కూడా జరుగుతుంది. సహాయకులైన తండ్రి కూర్చొని ఉన్నారు. తండ్రి ఎల్లప్పుడూ పిల్లలకు సహాయకులే. చదువులో నంబరువారుగా ఉన్నారు. తమలో ఎంత ధారణ ఉందో ప్రతి ఒక్కరు తమ బుద్ధి ద్వారా అర్థము చేసుకోగలరు. ధారణ ఉన్నట్లైతే ఎవరికైనా అర్థము చేయించి చూపించండి! ఇది ధనము. ధనమును ఇవ్వకపోతే వీరి వద్ద ధనము ఉంది అని ఎవ్వరూ అంగీకరించరు కూడా. ధనమును దానము చేస్తే మహాదానులు అని అంటారు. మహారథులన్నా, మహావీరులన్నా అర్థము ఒక్కటే. అందరూ ఒకే విధంగా ఉండజాలరు. మీ వద్దకు ఎంతోమంది వస్తారు! కూర్చొని ఒక్కొక్కరితో తల కొట్టుకోవలసి ఉంటుందా? వారు వార్తాపత్రికల ద్వారా ఎన్నో విషయాలను వింటారు. అప్పుడు ఎంతో ఆశ్చర్యపడ్తారు. మళ్లీ ఎప్పుడైతే మీ వద్దకు వచ్చి విన్నప్పుడు, మేము పరమతము పై ఏమేమో చేశాము. కాని ఇక్కడ చాలా బాగుంది అని అంటారు. ఒక్కొక్కరిని సరిదిద్దడములో శ్రమ కలుగుతుంది. ఇక్కడ కూడా ఎంత కష్టపడవలసి వచ్చింది! అయినా కొందరు మహారథులు, కొందరు అశ్వారూఢులు, కొందరు పదాతిదళము వారిగా ఉన్నారు. ఇది డ్రామాలోని పాత్ర. చివరికి విజయము మీకే లభించనున్నదని మీకు తెలుసు. ఎవరైతే కల్పక్రితము తయారయ్యారో మళ్లీ వారే తయారౌతారు. పిల్లలు పురుషార్థమైతే చేయవలసిందే. అర్థము చేయించేందుకు ప్రయత్నించండి అని తండ్రి సలహా ఇస్తారు. మొదట శివబాబా మందిరములోకి వెళ్లి సేవ చేయండి. వీరు ఎవరు? వీరిని నీటితో ఎందుకు అభిషేకము చేస్తున్నారు? అని మీరు అడగవచ్చు. మీకు బాగా తెలుసు. నిప్పు తీసుకునేందుకు వెళ్లి యజమానిగా అయ్యి కూర్చుంది అని అంటారు కదా! ఈ దృష్టాంతము కూడా మీదే. మీరు మేల్కొలిపేందుకు వెళ్లారు. మీకు ఆహ్వానమునిచ్చి పిలిస్తే అటువంటి ఆహ్వానము వచ్చినందుకు ఎంతో సంతోషించాలి. కాశీ మొదలైన స్థానాలలో గొప్ప-గొప్ప బిరుదులు ఇస్తారు. భక్తిలో లెక్కలేనన్ని మందిరాలున్నాయి! ఇది కూడా ఒక వ్యాపారమే. ఎవరైనా మంచి స్త్రీని చూస్తే, ఆమెకు గీతను కంఠస్థము చేయించి ప్రజల ముందు ఉంచుతారు. ఆ తర్వాత ఏ సంపాదన అయితే జరుగుతుందో అదంతా వారికి లభిస్తుంది. నిజానికి అందులో ఏమీ లేదు. రిద్ది, సిద్ధులు(క్షుద్ర విద్యలు) చాలా నేర్చుకుంటారు. మీరు అటువంటి స్థానాల వద్దకు వెళ్లాలి. పిల్లలైన మీరు ఎప్పుడూ శాస్త్రార్థము చేయరాదు. మీరు వెళ్లి తండ్రి పరిచయమునివ్వాలి. ముక్తి - జీవన్ముక్తిదాత ఒక్కరే. వారిని మహిమ చేయాలి. వారు చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి. అంతేకాని మన్మనాభవ అనగా గంగలోకి వెళ్లి స్నానము చేయమని కాదు. మామేకమ్ యాద్ కరో అనగా నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. నేను మిమ్ములను అన్ని పాపాల నుండి విముక్తులుగా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎప్పటి నుండి రావణుడు వచ్చాడో, అప్పటి నుండి పాపాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఉన్నత పదవిని పొందేందుకు ఎంతగానో పురుషార్థము చేయాలి. హోదా కొరకు మనుష్యులు రాత్రింబవళ్ళు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఇది కూడా చదువే. ఇందులో పుస్తకాలు మొదలైన వాటిని తీసుకునే(చదివే) విషయమేదీ లేదు. 84 జన్మల చక్రమైతే బుద్ధిలోకి వచ్చేసింది. అదేమీ పెద్ద విషయము కాదు. ఒక్కొక్క జన్మ గురించిన వివరాలను చెప్పరు. 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఆత్మలైన మనము వాపస్ ఇంటికి వెళ్ళాలి. పతితమైన ఆత్మ తప్పకుండా పావనంగా అవ్వాలి. నన్నొక్కరినే స్మృతి చేయండి అన్న విషయాన్ని అందరికీ చెప్తూ ఉండండి. బాబా, యోగములో ఉండలేకపోతున్నామని పిల్లలు అంటారు. అరే! నన్ను స్మృతి చేయండి అని మీకు సన్ముఖములో చెప్తున్నాను. మళ్లీ మీరు ఈ యోగము అన్న పదమును ఎందుకు వాడుతున్నారు? యోగము అని అన్నందువల్లనే మీరు మర్చిపోతున్నారు. తండ్రిని ఎవరు స్మృతి చేయలేరు? లౌకిక మాత-పితలను ఎలా స్మృతి చేస్తున్నారు? అలాగే వీరు కూడా మాతా-పితలే కదా! ఇతడు(బ్రహ్మ) కూడా చదువుతాడు. సరస్వతి కూడా చదువుతుంది. చదివించేవారు ఒక్క తండ్రి మాత్రమే. మీరు ఎంతగా చదువుతారో అంతగా ఇతరులకు కూడా అర్థము చేయిస్తారు. పిల్లలూ! శాస్త్రాలు చదవడం, జప, తపాలు చేసినందున వాటి ద్వారా నన్ను ప్రాప్తి చేసుకోలేరు. మరి వాటి వల్ల లాభమేముంది? మెట్లనైతే దిగుతూనే వస్తారు.
మీకు శత్రువులెవరూ లేరు అయినా పాప-పుణ్యాలు ఎలా జమ అవుతాయో మీరు ఇతరులకు అర్థము చేయించాలి. రావణ రాజ్యము ప్రారంభమైన తర్వాతనే మీరు పాపాలు చేయడం మొదలు పెట్టారు. పాత ప్రపంచము ఏమిటో, క్రొత్త ప్రపంచము ఏమిటో కూడా అర్థము చేయించడం రాని పిల్లలు కూడా కొందరున్నారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - ఇక అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. వారే పతితపావనులు. అంతేకాని మీరు ఎక్కడికీ వెళ్ళవలసిన అవసరమే లేదు. భక్తిమార్గములో ఎల్లప్పుడూ కాళ్ళు ఇంటి నుండి బయటకు వెళ్తూ ఉండేవి. కృష్ణుని చిత్రము ఇంటిలో కూడా ఉంది కదా. మరి బయటకు ఎందుకు వెళ్తున్నావు? అందులో తేడా ఏముంది? అని పతి స్త్రీతో అంటాడు. పతియే పరమేశ్వరుడు అన్నది కూడా నమ్మరు. భక్తిమార్గములో మనుష్యులలో భావన పెరిగేందుకు చాలా దూర-దూరాలలో ఎత్తైన పర్వతాల పై మందిరాలను నిర్మిస్తారు. మందిరాలలో ఎన్నో ఎదురుదెబ్బలు తింటారు. ఇది ఒక ఆచారంగా అయిపోయింది. తీర్థయాత్రలు చేసేందుకు శివకాశికి వెళ్తారు కాని అందులో ప్రాప్తి ఏమీ లేదు అని మీరు తెలుపుతారు. ఇప్పుడు మీకు తండ్రి నుండి శ్రీమతము లభిస్తుంది. మీరు ఎక్కడకూ వెళ్లే అవసరం లేదు. పతులకు పతి, పరమేశ్వరుడు నిజానికి వారొక్కరే. వారిని మీ పతి, పినతండ్రులు, మామయ్యలు అందరూ స్మృతి చేస్తారు. వారే పతి పరమేశ్వరుడు లేక పిత పరమేశ్వరుడు. వారు మీకు చెప్తున్నారు - నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇప్పుడు మీ జ్యోతి వెలుగుతూ ఉంది. కావున మీ నుండి మనుష్యులకు ప్రకాశము కనిపిస్తూ ఉంటుంది. పిల్లల పేరు కూడా ప్రఖ్యాతమవ్వాలి. తండ్రి పిల్లల పేరును ప్రఖ్యాతము చేస్తారు కదా! సుదేశ్ బచ్చీ(బిడ్డ) అర్థము చేయించడంలో చాలా దిట్ట. పురుషార్థము చాలా బాగా చేసినందున పాత వారి కంటే చాలా ముందుకు వెళ్ళిపోయింది. అలాగే ఇందులో కూడా ఎక్కువ పురుషార్థము చేసి ముందుకు వెళ్ళిపోతుంది. మొత్తము ఆధారమంతా పురుషార్థము పైనే ఉంది. హార్ట్ ఫెయిల్(గుండెపోటు) అవ్వరాదు. చివరిలో వచ్చినా, క్షణములో జీవన్ముక్తి పొందవచ్చు. రోజురోజుకు ఇటువంటివారు చాలామంది వెలువడ్తూ ఉంటారు. డ్రామాలో మీ విజయ పాత్ర ఉండనే ఉంది. విఘ్నాలు కూడా వస్తాయి. ఇక ఏ ఇతర సత్సంగములో ఈ విధంగా విఘ్నాలు రావు. ఇక్కడ వికారాల విషయములోనే గొడవలు జరుగుతాయి. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు త్రాగాలి....... (అమృత్ ఛోడ్ విష్ కాహే కో ఖాయే,........) అన్న గాయనము కూడా ఉంది. జ్ఞానము ద్వారానే ఒకే దేవీ దేవతా ధర్మ స్థాపన జరుగుతుంది. సత్యయుగములో రావణ రాజ్యముండదు. ఎంత స్పష్టంగా అర్థము చేయించడం జరుగుతుంది! రామరాజ్యము ప్రక్కనే రావణ రాజ్యమును కూడా చూపించారు. మీరు సమయాన్ని కూడా చూపిస్తారు. ఇప్పుడిది సంగమము. ప్రపంచము పరివర్తన చెందుతూ ఉంది. స్థాపన, పాలన, వినాశనము చేయించేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇది చాలా సహజము. కాని ధారణ పూర్తిగా అవ్వదు. ఇతర విషయాలన్నీ గుర్తుంటాయి. కాని జ్ఞాన- యోగాలను మర్చిపోతారు. మీరు ఉన్నతోన్నతులైన భగవంతుని సంతానము. రోజురోజుకు మీరు సుసంపన్నులుగా అవుతూ ఉంటారు. ధనము లభిస్తుంది కదా. ఖర్చు కూడా వస్తూ ఉంటుంది. బాబా చెప్తున్నారు - హుండీ నిండుతూ ఉంటుంది. కల్ప పూర్వములాగానే మీరు ఖర్చు చేస్తారు. డ్రామా, ఎక్కువ-తక్కువ కానివ్వదు. డ్రామా పై బాబాకు చెరగని నిశ్చయముంది. గతించినదంతా డ్రామా. ఇలా జరిగి ఉంటే, ఇది చేసేవారము కాదు అని అనరాదు. ఇప్పుడు ఇంకా ఆ స్థితి రాలేదు. ఏదో ఒకటి నోటి నుండి వచ్చేస్తుంది. తర్వాత ఫీల్ అవుతారు(బాధపడ్తారు). గతించిన దానికి చింతించకండి. ఇటువంటి తప్పులు భవిష్యత్తులో జరగకుండుటకు పురుషార్థము చేయండి అని బాబా అంటారు. అందుకనే బాబా చూర్టును వ్రాయండి, ఇందులో ఎంతో కళ్యాణముంది అని చెప్తారు. ఒక వ్యక్తి తన జీవితకథనంతటినీ వ్రాయడం బాబా చూశారు. తన పిల్లలు నేర్చుకుంటారని భావించాడు. ఇక్కడ శ్రీమతము పై నడవడంలోనే కళ్యాణముంది. ఇక్కడ అసత్యము కూడా నడవజాలదు. నారదుని ఉదాహరణ ఉంది కదా. చార్ట్ ద్వారా ఎంతో లాభముంది. బాబా ఆజ్ఞాపిస్తూ ఉంటే పిల్లలు ఆజ్ఞానుసారము నడుచుకోవాలి. అచ్ఛా! మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. జ్ఞానాన్ని ధారణ చేసి ఇతరులకు అర్థము చేయించాలి. జ్ఞాన ధనాన్ని దానము చేసి మహాదానులుగా అవ్వాలి. ఎవరితోనూ శాస్త్రాల గురించి వాదించరాదు. బాబా సత్య పరిచయమును ఇవ్వాలి.
2. మీరు గతించిన విషయాలను గురించి చింతించరాదు. భవిష్యత్తులో ఇంకెప్పుడూ ఆ పొరపాటు జరగకుండా పురుషార్థము చేయాలి. మీ సత్యమైన చార్ట్ను వ్రాయాలి.
వరదానము :-
'' సత్యతా అథారిటీని ధారణ చేసి సర్వులను ఆకర్షించే నిర్భయ మరియు విజయీ భవ ''
పిల్లలైన మీరు శక్తిశాలి శ్రేష్ఠమైన ఆత్మలు. సత్యమైన జ్ఞానము, సత్యమైన తండ్రి, సత్యమైన ప్రాప్తి, సత్యమైన స్మృతి, సత్యమైన గుణాలు, సత్యమైన శక్తులన్నీ మాకు ప్రాప్తించాయి. గొప్ప అథారిటి లభించిందనే నశా ఉంటే ఈ సత్యతా అథారిటీ ప్రతి ఆత్మను ఆకర్షిస్తూ ఉంటుంది. అసత్య ఖండములో కూడా ఇటువంటి సత్యతా శక్తి కలిగినవారు విజయులుగా అవుతారు. సత్యతకు ప్రాప్తి సంతోషము మరియు నిర్భయత. సత్యం చెప్పేవారు నిర్భయులుగా ఉంటారు. వారికి ఎప్పుడూ భయం కలగజాలదు.
స్లోగన్ :-
''వాయుమండలాన్ని పరివర్తన చేసేందుకు సాధనం - పాజిటివ్ సంకల్పాలు మరియు శక్తిశాలి వృత్తి.''
బ్రహ్మబాబా సమానంగా
అయ్యేందుకు విశేషమైన పురుషార్థము
ఎలాగైతే బ్రహ్మబాబా ప్రతి కర్మలో, వాచాలో, సంబంధ - సంపర్కాలలో లవ్ఫుల్గా (ప్రేమమయంగా)
ఉండేవారో, స్మృతి మరియు స్థితిలో లవ్లీన్గా ఉండేవారో, అలా తండ్రిని అనుసరించండి.
ఎంత లవ్లీగా ఉంటారో, అంత లవ్లీన్గా ఉండగలరు. అంతేకాక ఇతరులను కూడా సహజంగా తమ
సమానంగా, తండ్రి సమానంగా చేయగలరు..