08-05-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీరు తండ్రి నుండి భక్తికి ఫలితము తీసుకునేందుకు వచ్చారు. ఎవరు ఎక్కువగా భక్తి చేసి ఉంటారో, వారే జ్ఞానములో ముందుకు వెళ్తారు.''
ప్రశ్న :-
కలియుగ రాజ్యములో అవసరమైన ఏ ఇరువురు సత్యయుగ రాజ్యములో అవసరముండరు?
జవాబు :-
కలియుగ రాజ్యములో 1. మంత్రి 2. గురువుల అవసరముంటుంది. సత్యయుగములో వీరిరువురూ ఉండరు. అచ్చట ఎవరి సలహాను తీసుకునే అవసరము లేదు. ఎందుకంటే సత్యయుగ రాజ్యము సంగమ యుగములో తండ్రి శ్రీమతము ద్వారా స్థాపన అవుతుంది. మీకు లభించే శ్రీమతము 21 తరాల వరకు కొనసాగుతుంది. అంతేకాక అందరూ సద్గతిలో ఉంటారు కనుక గురువుల అవసరము కూడా ఉండదు.
ఓంశాంతి.
ఓంశాంతి అనగా అర్థమేమి? స్వధర్మములో కూర్చోండి లేక స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చుంటే శాంతిలో కూర్చుంటారు. దీనినే స్వధర్మములో కూర్చోవడమని అంటారు. భగవానువాచ - స్వధర్మములో కూర్చోండి. మీ తండ్రి కూర్చుని మిమ్ములను చదివిస్తున్నారు. అనంతమైన తండ్రి అనంతమైన చదువును చదివిస్తారు. ఎందుకంటే తండ్రి అపారమైన సుఖమునిచ్చేవారు. చదువు ద్వారా సుఖము లభిస్తుంది కదా. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. మిమ్ములను వజ్ర సమానంగా చేసేందుకు అనంతమైన తండ్రి వచ్చారు. వజ్ర సమానంగా దేవీదేవతలే ఉంటారు. అలా ఎప్పుడు తయారౌతారు? ఇంత ఉన్నతమైన పురుషోత్తములుగా ఎలా తయారయ్యారు? ఇది ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ తెలిపించలేరు. ప్రజాపిత బ్రహ్మ పిల్లలైన మీరు బ్రాహ్మణులు. మళ్లీ మీరే దేవతలుగా అవ్వాలి. బ్రాహ్మణులకు శిఖ(పిలక) ఉంటుంది. మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. మీరు ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి. శరీర సంబంధ(కుఖ) వంశావళి కాదు. కలియుగములోని వారంతా శరీర సంబధము(కుఖ వంశావళి) వారు. సాధువుల, సన్యాసులు, ఋషులు, మునులు మొదలైన వారంతా ద్వాపర యుగము నుండి కుఖవంశావళి వారిగా అయ్యారు. ఇపుడు కేవలం బ్రహ్మకుమార-కుమారీలైన మీరు మాత్రమే ముఖవంశావళిగా అయ్యారు. ఈ బ్రాహ్మణ కులము సర్వోత్తమమైన కులము. దేవతల కంటే ఉత్తమమైనది. ఎందుకంటే మిమ్ములను చదివించేందుకు మానవుల నుండి దేవతలుగా తయారు చేసే తండ్రి వచ్చారు. వారు కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఎందుకంటే భక్తిమార్గములోని వారు ఇక్కడకు రానే రారు. ఇక్కడకు వచ్చేవారు జ్ఞానమార్గానికి చెందినవారు. అనంతమైన తండ్రి నుండి భక్తికి ఫలితము తీసుకునేందుకు మీరు ఇక్కడకు వస్తారు. ఇప్పుడు భక్తికి ఫలితము ఎవరు తీసుకుంటారు? ఎవరైతే అందరికంటే ఎక్కువ భక్తి చేసి ఉంటారో, వారే రాతిబుద్ధి నుండి పారసబుద్ధిగా అవుతారు. వారే వచ్చి జ్ఞానము తీసుకుంటారు. ఎందుకంటే భక్తికి ఫలితము స్వయం భగవంతుడే వచ్చి ఇవ్వవలసి ఉంటుంది. ఇవి చాలా బాగా అర్థము చేసుకునే విషయాలు. ఇప్పుడు మీరు కలియుగము నుండి సత్యయుగములోని వారిగా వికారుల నుండి నిర్వికారులుగా అవుతారు అనగా పురుషోత్తములుగా అవుతారు. ఇటువంటి లక్ష్మినారాయణుల వలె తయారయ్యేందుకు మీరు ఇక్కడకు వచ్చారు. వీరు భగవాన్, భగవతి. కనుక వీరిని తప్పకుండా భగవంతుడే చదివిస్తారు. భగవానువాచ - కానీ భగవంతుడని ఎవరిని అంటారు? భగవంతుడు ఒక్కరే. వందల, వేల సంఖ్యలో భగవంతులు ఉండరు. రాయి, రప్పలలో, మట్టిలో ఉండరు. తండ్రి ఎవరో తెలియని కారణంగా భారతదేశము ఎంతో నిరుపేదగా అయ్యింది. భారతదేశములో వీరి(లక్ష్మి నారాయణుల) రాజ్యముండేదని ఇప్పుడు పిల్లలకు తెలుసు. వీరి పిల్లలు మొదలైన వారంతా రాజధానికి అధికారులుగా ఉండేవారు. రాజధానికి అధికారులుగా అయ్యేందుకు మీరిచ్చటకు వచ్చారు. అది ఇప్పుడు లేదు కదా. భారతదేశములో వీరి రాజ్యముండేది. దేవీదేవతల రాజధాని ఉన్నప్పుడు సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఉండేవారు. అప్పుడు ఏ ఇతర ధర్మము ఉండేది కాదు. ఇప్పుడు అనేక ఇతర ధర్మాలున్నాయి కానీ ఈ ధర్మము లేనే లేదు. ఈ ధర్మమే పునాది. దీనిని కాండమని కూడా అంటారు. ఇప్పుడు మానవ సృష్టి రూపీ వృక్షానికి కాండము ఏదైతే ఉందో అది పూర్తిగా కాలిపోయింది. మిగిలినవన్నీ అలాగే నిలిచి ఉన్నాయి. ఇప్పుడు మిగిలిన వాని ఆయువు కూడా పూర్తి అవుతుంది. ఇది మానవ సృష్టి రూపీ వెరైటి వృక్షము. భిన్న భిన్న నామ, రూప, దేశ, కాలాలు అనేకమున్నాయి కదా. ఇది చాలా విశాలమైన వృక్షము. కల్ప-కల్పము ఈ వృక్షము శిథిలావస్థకు చేరుకొని తమోప్రధానమైపోతుంది. అప్పుడు మళ్లీ నేనే వస్తానని తండ్రి అర్థం చేయిస్తున్నారు. బాబా, పతితులమైన మమ్ములను మీరు వచ్చి పావనంగా తయారు చేయమని పిలుస్తారు. ''ఓ పతితపావనా!'' అన్నప్పుడు నిరాకార తండ్రి ఒక్కరే గుర్తు వస్తారు. సాకారములో ఉన్నవారు ఎప్పుడూ గుర్తుకు రారు. పతితపావనుడు, సద్గతిదాత ఒకే ఒక్కరు. సత్యయుగము ఉన్నప్పుడు మీరు సద్గతిలో ఉండేవారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగములో కూర్చుని ఉన్నారు. మిగిలిన వారంతా కలియుగములో ఉన్నారు. మీరు పురుషోత్తమ సంగమ యుగములో కూర్చుని ఉన్నారు. ఉత్తమోత్తమ పురుషుడు లేక అత్యంత ఉన్నతులని ఒక్క భగవంతునికి మాత్రమే గాయనముంది. మీ పేరు ఉన్నతమే, మీ ధామము ఉన్నతమే.......... (ఊంచా తేరా నామ్, ఊంచా తేరా ధామ్..........) అని పాడ్తారు. వారు అత్యంత ఉన్నత స్థానమైన పరంధామములో ఉంటారు. ఇది అర్థము చేసుకోవడం చాలా సులభము. సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాల తర్వాత ఇది సంగమ యుగము. దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. డ్రామాలో ఈ భక్తిమార్గము కూడా తయారయ్యే ఉంది. అంతేకాని బాబా ఈ భక్తిమార్గమును అసలు ఎందుకు తయారుచేశారు? అని అడగరాదు. ఇది అనాదిగా ఉండనే ఉంది. నేనిప్పుడు కూర్చుని మీకు మొత్తం ఈ డ్రామా రహస్యాన్నంతా అర్థం చేయిస్తాను. నేనే తయారు చేశాను అంటే ఎప్పుడు తయారు చేశారు బాబా ? అని అడుగుతారు. ఇది అనాది డ్రామా అని తండ్రి చెప్తున్నారు. ఎప్పుడు మొదలయ్యింది అనే ప్రశ్నే రాదు. ఒకవేళ ఫలానా సమయములో ప్రారంభమయ్యిందని తెలిపితే ఎప్పుడు సమాప్తమౌతుందని అడుగుతారు. అలా కానే కాదు. ఈ చక్రము ఇలా తిరుగుతూనే ఉంటుంది. మీరు బ్రహ్మ-విష్ణు-శంరుల చిత్రాన్ని కూడా తయారుచేశారు. వీరు దేవతలు. త్రిమూర్తులను చూపిస్తారు, అందులో అత్యంత ఉన్నతమైన శివుని చూపించరు. వారిని వేరుగా చూపిస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన. ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది. మీరు మీ రాజధానిని స్థాపన చేసుకుంటూ ఉన్నారు. రాజధానిలో అన్ని రకాల పదవులు ఉంటాయి. అధ్యక్షుడు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి......... వీరంతా సలహా ఇచ్చేవారు. సత్యయుగములో సలహాలిచ్చేవారు అవసరమే లేదు. ఇప్పుడు మీకు లభించే సలహా లేక శ్రీమతము అవినాశిగా అయిపోతుంది. ఇప్పుడు సలహాలిచ్చువారు ఎంతమంది ఉన్నారో చూడండి. అనేకమంది ఉన్నారు. డబ్బు ఖర్చు చేసి మినిష్టర్లు మొదలైనవారిగా అవుతారు. వీరంతా సలహాలిచ్చువారు. వీరు లంచము తీసుకుంటున్నారు, చాలా తినేస్తున్నారని స్వయంగా ప్రభుత్వము కూడా అంటుంది. ఇది అయ్యిందే కలియుగము. అక్కడ ఇటువంటివేవీ ఉండవు. మంత్రి మొదలైనవారి అవసరముండదు. ఈ మతము 21 జన్మలు కొనసాగుతుంది. మీకు సద్గతి అవుతుంది. అక్కడ గురువుల అవసరము కూడా ఉండదు. సత్యయుగములో గురువులూ ఉండరు, మంత్రులూ ఉండరు. ఇప్పుడు మీకు 21 తరాలకు, 21 వృద్ధాప్యాలకు అవినాశి శ్రీమతము లభిస్తుంది. వృద్ధాప్యములో శరీరాన్ని వదిలి మళ్లీ బాలునిగా అవుతారు. సర్పము ఎలాగైతే ఒక తొడుగును వదిలి మరొకటి తీసుకుంటుందో అలా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. జంతువుల ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. మనుష్యులలో ఏ కొంచెము తెలివి కూడా లేదు. ఎందుకంటే రాతిబుద్ధి గలవారిగా ఉన్నారు.
మీరు బ్రాహ్మణ-బ్రాహ్మణీలని తండ్రి తన మధురాతి మధురమైన పిల్లలకు తెలుపుతున్నారు. సిక్కుల గ్రంథమును కూడా చదువుతారు, వింటారు. మలిన వస్త్ర్రాలను శుభ్రపరచేందుకు............... అని భగవంతుని పిలుస్తారు. మీరు వచ్చి ఈ మలిన వస్త్రాలను అనగా ఆత్మలైన మమ్ములను శుభ్రపరచండి అని అంటారు. ఆత్మలమైన మా అందరి తండ్రీ, మీరు వచ్చి మా వస్త్రాలను శుభ్రపరచండి. శరీరాలను శుభ్రపరచేందుకు కాదు. ఆత్మలనే శుభ్రపరుస్తారు. ఎందుకంటే ఆత్మనే పతితమైపోయింది. పతితాత్మలను వచ్చి పావనంగా చేయమని అంటారు. అందువలన తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలారా, నేను ఇక్కడకు రావలసి పడ్తుంది. నేను ఒక్కరినే జ్ఞానసాగరుడను, పవిత్రసాగరుడను. మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వము తీసుకుంటారు. పరిమిత(హద్దు) తండ్రి నుండి పరిమిత ఆస్తి మాత్రమే లభిస్తుంది. హద్దు వారసత్వములో చాలా దు:ఖముంది. అందుకే అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. ఇక్కడ అపారమైన దు:ఖముంది. తండ్రి చెప్తున్నారు - మీకు అత్యంత పెద్ద శత్రువు, పంచ వికారాల రావణుడు. ఈ రావణుడు ఆదిమధ్యాంతాలు దు:ఖమిస్తాడు. ఓ మధురమైన పిల్లలారా, ఒకవేళ ఈ జన్మలో బ్రాహ్మణులుగా అయ్యి కామమును జయిస్తే జగత్తును జయించినవారిగా అవుతారు. మీరు దేవతలుగా అయ్యేందుకు పవిత్రతను ధారణ చేస్తారు. మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మమును స్థాపన చేసేందుకు వచ్చారు. ఇది పురుషోత్తమ సంగమ యుగము. ఇందులో పురుషార్థము చేసి పావనంగా అవ్వాలి. కల్పక్రితము ఎవరు పావనంగా అయ్యారో వారే సూర్యవంశ, చంద్రవంశ కుటుంబములోకి తప్పకుండా వస్తారు. సమయము పడ్తుంది కదా. తండ్రి చాలా సులభమైన యుక్తులు తెలుపుతారు. ఇప్పుడు ఆ తండ్రికి పిల్లలుగా ఏమో అయ్యారు. ఇప్పుడు ఇక్కడకు మీరు ఎవరి వద్దకు వచ్చారు. వారు నిరాకారులు. వారు ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నారు. ఇది అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమ జన్మ అని స్వయం వారే తెలుపుతున్నారు. కావున ఇది అన్నిటికంటే పురాతన శరీరము. నేను వచ్చేదే పాత రావణాసుర ప్రపంచంలో. అనేక శరీరాలు తీసుకొని తన జన్మల గురించి తనకే తెలియని వారి శరీరములో ప్రవేశిస్తాను. ఇది ఇతని అనేక జన్మల అంతమ జన్మ. ఇతని వానప్రస్థ అవస్థలో నేను ప్రవేశిస్తాను. సదా వానప్రస్థ అవస్థలోనే గురువులను ఆశ్రయిస్తారు. 60 సంవత్సరాలు వస్తే దెబ్బలు తగుల్తాయి అని అంటారు కదా. ఇంట్లో ఉంటే పిల్లల కర్రదెబ్బలు తగులుతాయి, అందుకే ఇంటి నుండి పారిపోండి అని అంటారు. తండ్రిని లాఠీకర్రతో కొట్టేందుకు కూడా వెనుకాడని పిల్లలుంటారు. ఇతడు మరణిస్తే మాకు ఇతడి ధనం లభిస్తుందని అంటారు. వానప్రస్థులకు అనేక సత్సంగాలు ఉంటాయి. ఇప్పుడు సర్వుల సద్గతిదాత ఒక్కరేనని వారు సంగమ యుగములోనే వస్తారని మీకు తెలుసు. సత్యయుగములో మీరు సద్గతిలో ఉన్నప్పుడు మిగిలినవారంతా శాంతిధామములో ఉంటారు. వీరిని సర్వుల సద్గతిదాత అని అంటారు. తండ్రి తప్ప మరెవ్వరూ సద్గతిదాతగా అవ్వలేరు. ఇతరులెవ్వరినీ ''శ్రీ'' అని కూడా అనరాదు, ''శ్రీ శ్రీ'' అని అసలే అనరాదు. శ్రీ అనగా శ్రేష్ఠులు. శ్రేష్ఠముగా ఉన్నవారు దేవతలు మాత్రమే. వారిని శ్రీ లక్ష్మి, శ్రీ నారాయణ అని అంటారు. అయితే వారిని తయారు చేసేదెవరు? శ్రీ శ్రీ శివబాబా. వారినే అలా పిలవాలి. కావున తండ్రి మనము చేసిన తప్పులన్నీ ఋజువు చేసి తెలుపుతున్నారు. మీరు అనేకమంది గురువులను ఆశ్రయించారు. మళ్లీ ఇదే విధంగా జరుగుతుంది. మీరు మళ్లీ అదే గురువులు మొదలైనవారిని ఆశ్రయిస్తారు. చక్రము మళ్లీ అదే రిపీట్ అవుతుంది. మీరు స్వర్గములో ఉన్నప్పుడు సుఖధామములో ఉంటారు. అక్కడ పవిత్రత, సుఖ, శాంతులు అన్నీ ఉంటాయి. అక్కడ జగడాలు మొదలైనవి ఉండవు. మిగిలినవారంతా శాంతిధామానికి వెళ్లిపోతారు. భలే సత్యయుగానికి లక్షల సంవత్సరాలని అంటారు. లక్షల సంవత్సరాల మాటే లేదని తండ్రి చెప్తున్నారు. చక్రమంతా 5 వేల సంవత్సరాలు మాత్రమే. మనుష్యులకు 84 జన్మలే అని కూడా చెప్తున్నారు. రోజురోజుకు మెటికలు క్రిందకు దిగుతూ తమోప్రధానంగా అవుతూ పోతారు. అయితే ఇది కూడా తయారైన డ్రామా అని తండ్రి చెప్తున్నారు. డ్రామాలో పాత్రధారులై డ్రామా సృష్టికర్త, దర్శకుడు, ముఖ్య పాత్రధారులెవరో తెలియకుంటే వారినేమంటారు? ఈ బేహద్ డ్రామాను గురించి ఇతరులెవ్వరికీ తెలియదని తండ్రి చెప్తున్నారు. దీనిని గురించి తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. శరీరము ధరించి పాత్ర చేస్తారని కూడా అంటారు. అలా అన్నప్పుడు ఇది ఒక నాటకమవుతుంది కదా. నాటకములోని ముఖ్య పాత్రధారులెవరు? ఈ ప్రశ్న అడిగితే ఎవ్వరూ జవాబు చెప్పలేరు. ఈ బేహద్ డ్రామా పేను వలె చాలా నెమ్మదిగా ఎలా నడుస్తూ ఉందో పిల్లలైన మీకు తెలుసు. టిక్ టిక్ అని నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యమైనవారు, అత్యంత ఉన్నతులైన వారు బాబా. వారే వచ్చి అంతా తెలిపించి సర్వులకు సద్గతినిస్తారు. సత్యయుగములో ఇతరులెవ్వరూ ఉండరు. చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆ కొద్దిమంది ఎవరైతే ఉంటారో వారు అందరికంటే ఎక్కువగా భక్తి చేసి ఉంటారు. ప్రదర్శినిలోకి లేక మ్యూజియములోకి వచ్చినవారు కూడా చాలా భక్తి చేసినవారే. మొదటి రకము వారు శివుని భక్తి చేసినవారు. దానిని అవ్యభిచారి భక్తి అని అంటారు. ఆ తర్వాత అనేకమందిని భక్తి చేస్తారు. భక్తి చేసి వ్యభిచారి భక్తులుగా అయిపోతారు. ఇప్పుడు పూర్తిగా తమోప్రధాన భక్తిగా ఉండేది. మొదట సతోప్రధాన భక్తి ఉండేది. తర్వాత మెట్లు దిగుతూ దిగుతూ తమోప్రధానంగా అయ్యారు. ఇటువంటి పరిస్థితిలోనే తండ్రి అందరినీ సతోప్రధానంగా చేసేందుకు వస్తారు. ఈ బేహద్ డ్రామాను గురించి కూడా మీరిప్పుడే తెలుసుకున్నారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వము తీసుకునేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఇప్పుడు పవిత్రతా వారసత్వమును తీసుకోండి అనగా కామజీతులుగా అయితే జగజ్జీతులుగా అవ్వగలరు.
2. అనంతమైన తండ్రి వద్ద చదువుకుని స్వయాన్ని గవ్వ నుండి వజ్ర సమానంగా తయారు చేసుకోవాలి. బేహద్ సుఖాన్ని తీసుకోవాలి. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసే ఆ తండ్రి ఇప్పుడు మా సన్ముఖములో ఉన్నారు, ఇప్పుడిది మన సర్వోత్తమ బ్రాహ్మణ కులము అన్న నషా ఉండాలి.
వరదానము :-
'' స్థిరమైన నిశ్చయం ద్వారా సహజ విజయాన్ని అనుభవం చేసి సదా హర్షితంగా ఉండు నిశ్చింత భవ ''
నిశ్చయానికి గుర్తు సహజ విజయము. కానీ నిశ్చయం అన్ని విషయాలలో ఉండాలి. కేవలం తండ్రిలోనే కాదు, స్వయంలో, బ్రాహ్మణ పరివారంలో, అంతేకాక డ్రామాలోని ప్రతి దృశ్యములో సంపూర్ణ నిశ్చయముండాలి. చిన్న చిన్న విషయాలలో నిశ్చయం తొలగిపోరాదు. సదా '' నా విజయం నిశ్చితం'' అని భావించే నిశ్చయబుద్ధి గల పిల్లలు, ఎందుకు జరిగింది? ఏం జరిగింది? ........ మొదలైన అన్ని ప్రశ్నల నుండి దూరంగా సదా నిశ్చింతగా, సదా హర్షితంగా ఉంటారు
స్లోగన్ :-
'' సమయాన్ని నష్టము చేసుకునే బదులు వెంటనే నిశ్చయించి నిర్ణయం తీసుకోండి ''