26-03-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - తండ్రి నుండి సకాశ్‌ ( సర్వ శక్తులు, సర్వ దివ్యగుణాల కిరణాలు) తీసుకునేందుకు సుగంధభరిత పుష్పాలుగా అవ్వండి. ఉదయము - ఉదయమే లేచి స్మృతిలో కూర్చొని ప్రీతిగా బాబాతో మధురాతి మధురంగా మాట్లాడండి.''

ప్రశ్న :-

తండ్రిని పిల్లలందరూ నంబరువారుగా స్మృతి చేస్తారు, కానీ తండ్రి ఎటువంటి పిల్లలను స్మృతి చేస్తారు ?

జవాబు :-

ఏ పిల్లలైతే చాలా మధురంగా ఉంటారో, సర్వీసు తప్ప ఇతరమేదీ ఏ పిల్లలకైతే రుచించదో అటువంటి పిల్లలను బాబా స్మృతి చేస్తారు. అంతేకాక ఎవరైతే తండ్రిని అత్యంత ప్రీతిగా స్మృతి చేస్తారో, సంతోషముతో ప్రేమబాష్పాలు ప్రపహింపజేస్తారో వారిని తండ్రి కూడా స్మృతి చేస్తారు. తండ్రి దృష్టి పుష్పాల వైపుకు వెళ్తుంది. ఫలానా ఆత్మ చాలా బాగుంది అని అంటారు. సేవ ఎక్కడ కనిపిస్తుందో అక్కడకు పరుగెత్తి వెళ్లే ఆత్మ అనేమంది కళ్యాణము చేస్తుంది. అటువంటి పిల్లలను తండ్రి స్మృతి చేస్తారు.

ఓంశాంతి.

తండ్రి కూర్చొని ఆత్మలందరికీ అర్థము చేయిస్తున్నారు - శరీరము కూడా గుర్తుకు వస్తుంది. ఆత్మ కూడా గుర్తుకు వస్తుంది. శరీరము లేకుండా ఆత్మను స్మృతి చేయలేము. ఈ ఆత్మ మంచిది. ఈ ఆత్మ బాహ్యముఖంగా ఉంది, ఈ ఆత్మ ఈ ప్రపంచములో విహరించాలని కోరుకుంటూ ఉంది అని అర్థము చేసుకుంటారు. ఇది ఆ ప్రపంచాన్ని మర్చిపోయిందని కూడా తెలుసుకోవచ్చు. మొట్టమొదట వారి నామ-రూపాలు గుర్తుకు వస్తాయి. ఫలానావారి ఆత్మ స్మృతి చేయబడ్తుంది. ఫలానా ఆత్మ సేవ బాగా చేస్తుంది, వీరి బుద్ధియోగము బాబా జతలో ఉంది, వీరిలో ఈ గుణము ఉంది అని బాబా అంటారు. మొదట శరీరాన్ని స్మృతి చేస్తే, తర్వాత ఆత్మ గుర్తుకు వస్తుంది. మొదట శరీరము గుర్తుకొస్తుంది. ఎందుకంటే శరీరము పెద్దది కదా. ఆ తర్వాత సూక్ష్మంగా, చాలా చిన్నదిగా ఉన్న ఆత్మ గుర్తుకు వస్తుంది. ఈ పెద్ద శరీరానికి ఏ మహిమా లేదు. ఆత్మయే మహిమ చేయబడ్తుంది. వీరి ఆత్మ చాలా బాగా సేవ చేస్తుంది. ఫలానావారి ఆత్మ వీరి కంటే బాగుంది అని అంటూ ఉంటారు. మొదట శరీరమే గుర్తుకు వస్తుంది. తండ్రి అయితే అనేక ఆత్మలను స్మృతి చేయవలసి వస్తుంది. శరీరము పేరు గుర్తుండదు. కేవలం రూపము మాత్రమే ముందుకు వస్తుంది. ఫలానివారి ఆత్మ అన్నందున మొదట శరరీరమే గుర్తుకు వస్తుంది. ఈ దాదా(అన్న) శరీరములో శివబాబా వచ్చారని భావిస్తున్నారు కదా. ఇతని శరీరములో బాబా ఉన్నారని మీకు తెలుసు. శరీరము తప్పకుండా గుర్తుకు వస్తుంది. మేము స్మృతి ఎలా చేయాలి? అని అడుగుతారు? శివబాబాను బ్రహ్మ శరీరములో స్మృతి చేయాలా? లేక పరంధామములో స్మృతి చేయాలా? అని అడుగుతారు. చాలామంది ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. బాబా చెప్తున్నారు - స్మృతి చేయవలసింది ఆత్మనే అయినా శరీరము కూడా తప్పకుండా గుర్తుకొస్తుంది. మొదట శరీరము తర్వాత ఆత్మ గుర్తుకు వస్తుంది. బాబా ఇతని శరీరములో కూర్చుని ఉన్నారు. కావున శరీరము తప్పకుండా గుర్తుకు వస్తుంది. ఫలానా శరీరము గల ఆత్మలో ఈ గుణాలున్నాయి. బాబా కూడా - నన్ను ఎవరు స్మృతి చేస్తున్నారో, ఎవరిలో చాలా గుణాలున్నాయో, ఏ ఏ పుష్పాలలో సుగంధముందో గమనిస్తూ ఉంటారు. పుష్పాలంటే అందరికీ ప్రియమే(ఇష్టమే). పుష్ప గుచ్ఛాలను తయారు చేస్తారు. అందులో రాజా-రాణి, ప్రజలు భిన్న భిన్న పుష్పాలు - ఆకులు మొదలైనవన్నీ ఉంటాయి. తండ్రి దృష్టి పుష్పాల వైపుకు వెళ్తుంది. ఫలానావారి ఆత్మ చాలా బాగుంది, చాలా సేవ చేస్తుంది అని అంటారు. ఆత్మాభిమానిగా ఉంటూ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. ఎక్కడ సేవ ఉంటుందో, అక్కడకు పరుగెత్తి వెళ్తారు. అలా సేవ చేసినా అమృతవేళ లేచి స్మృతిలో కూర్చుంటారు. ఎవరిని స్మృతి చేస్తూ ఉంటారు? శివబాబా పరంధామములో గుర్తుకు వస్తారా? లేక మధువనంలో గుర్తుకు వస్తారా? తండ్రి గుర్తుకు వస్తూ ఉంటారు కదా. ఇతనిలో శివబాబా ఉన్నారు ఎందుకంటే తండ్రి ఇప్పుడు క్రిందకు వచ్చేశారు. మురళీ నడిపేందుకు క్రిందకు వచ్చారు. వీరికి తమ ఇంటిలో ఏ పని ఉండదు. అక్కడకు వెళ్ళి ఏం చేస్తారు? ఈ శరీరములోనే ప్రవేశిస్తారు కావున మొదట తప్పకుండా శరీరమే గుర్తుకు వస్తుంది. తర్వాత ఆత్మ గుర్తుకు వస్తుంది. ఫలానా శరీరములో ఏ ఆత్మ ఉందో అది అనన్యమైనది. చాలా మంచిది, ఈ ఆత్మకు సేవ లేకుంటే ఏమీ తోచదు. చాలా మధురమైనది. బాబా ఈ శరీరములో కూర్చుని ఉంటారు. అందరినీ చూస్తూ ఉంటారు. ఫలానా పుత్రిక చాలా మంచిది. చాలా స్మృతి చేస్తుంది. బంధనములో ఉన్న పిల్లలకు వికారాల కారణంగా ఎన్నో దెబ్బలు తినవలసి ఉంటుంది. వారు ఎంతో ప్రేమగా స్మృతి చేస్తూ ఉంటారు. ఎప్పుడు స్మృతి చాలా ఎక్కువగా చేస్తారో అప్పుడు సంతోషంతో వారి కనుల వెంట ప్రేమ బాష్పాలు కూడా వచ్చేస్తాయి. అప్పుడప్పుడు ఆ బాష్పాలు క్రింద రాలుతూ కూడా ఉంటాయి. బాబాకు వేరే ఏం పని ఉంది. అందరినీ స్మృతి చేస్తారు. చాలా మంది పిల్లలు గుర్తుకు వస్తారు. ఫలానా ఆత్మలో శక్తి లేదు, తండ్రిని స్మృతి చేయరు, ఎవ్వరికీ సుఖమునివ్వదు, ఈ ఆత్మ స్వకళ్యాణమునే చేసుకోదు. తండ్రి ఈ విషయాలన్నీ చెక్‌(పరిశీలిస్తూ) చేస్తూ ఉంటారు. స్మృతి చేయడం అనగా సకాశ్‌ ఇవ్వడం. ఆత్మ సంబంధము పరమాత్మతో ఉంటుంది కదా. పిల్లలు చాలా యోగము చేసే రోజు వస్తుంది. ఇతడు కూడా ఎవరిని స్మృతి చేస్తే వారు వెంటనే సాక్షాత్కారమవుతారు. ఆత్మ ఏమో చాలా సూక్ష్మమైన బిందువు. సాక్షాత్కారమైనా ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. మళ్లీ శరీరమే గుర్తుకొస్తుంది. ఆత్మ చాలా చిన్నది. కానీ స్మృతి చేస్తే, వారి ఆత్మ పావనమౌతూ ఉంటుంది. తోటలో అనేక రకాల(వెరైటీ) పుష్పాలుంటాయి. ఇవి చాలా సుగంధము గల పుష్పాలు. వీటికంత సుగంధము లేదు అని బాబా అందరినీ చూస్తూ ఉంటారు. సువాసన లేకుంటే పదవి కూడా తగ్గిపోతుంది. బాబాకు ఎవరు సహాయకారులుగా అవుతారో వారే ఉన్నత పదవిని పొందుతారు. వారిలో కూడా తండ్రిని స్మృతి చేస్తున్న వారికే పదవి లభిస్తుంది. బ్రాహ్మణుల నుండి బదిలీ చెంది దేవతలుగా అవుతారు. అనగా ఇది దైవీ పుష్పాలా? లేక ఆసురీ పుష్పాలా? ఈ వర్ణన కూడా సంగమ యుగములోనే చేయగలరు. అన్నీ పుష్పాలే కానీ అనేక రకాలున్నాయి. బాబా కూడా స్మృతి చేస్తూ ఉంటారు. టీచరు తమ విద్యార్థులను స్మృతి చేస్తారు కదా. వీరు బాగా చదవలేదని మనసులో భావిస్తారు కదా. వీరు తండ్రి కూడా అయ్యారు, టీచరు కూడా అయ్యారు. తండ్రిగా అయితే ఉండనే ఉన్నారు. టీచరు కర్తవ్యము ఎక్కువగా ఉంటుంది. టీచరు ప్రతి రోజూ చదివించాలి. ఈ చదువు శక్తి ద్వారా పదవిని పొందుతారు. ఉదయమే సోదరులైన మీరందరూ తండ్రి స్మృతిలో కూర్చుంటారు. ఇది యోగ సబ్జెక్టు(విషయము). తర్వాత మురళీ నడుస్తుంది. అది చదువు సబ్జెక్టు. ముఖ్యమైనవి యోగము మరియు చదువు. వాటిని జ్ఞానము, విజ్ఞానము అని కూడా అంటారు. ఇది తండ్రి వచ్చి నేర్పించే జ్ఞాన-విజ్ఞాన భవనము. జ్ఞానము ద్వారా మొత్తం సృష్టిని గురించిన జ్ఞానము లభిస్తుంది. విజ్ఞానమనగా మీరు చేసే యోగము. దీని ద్వారా మీరు పవిత్రంగా అవుతారు. మీకు వీటి అర్థమంతా తెలుసు. తండ్రి పిల్లలను గమనిస్తూ ఉంటారు. దేహీ-అభిమానిగా అయితేనే మీలోని భూతాలు తొలగిపోతాయి. అలాగని అందరి భూతాలు వెంటనే తొలగిపోతాయని కాదు. లెక్కాచారము చుక్త అయినప్పుడు మీ నడవడికల అనుసారమే పదవిని పొందుతారు. తరగతి బదిలీ అవుతారు. ఈ ప్రపంచములోనివారు బదిలీ చెంది క్రిందికి పోతూ ఉన్నారు. కానీ మీరు పరివర్తన చెంది ఉన్నతమవుతూ ఉన్నారు. ఎంత తేడా ఉంది! వారు కలియుగములోని మెటికలు(సీఢీ) క్రిందికి దిగుతూ ఉంటారు. మీరు పురుషోత్తమ సంగమ యుగములోని వారు. మీరు సీఢీ పైకెక్కుతూ వస్తారు. ప్రపంచమేమో ఇదే ప్రపంచము. ఇదంతా కేవలం బుద్ధి చేయు పని. మేము సంగమ యుగానికి చెందినవారమని మీరంటారు. పురుషోత్తములుగా తయారు చేసేందుకు తండ్రి రావలసి వస్తుంది. ఇప్పుడు మీకు ఇది పురుషోత్తమ సంగమ యుగము. మిగిలిన వారందరూ గాఢాంధకారములో ఉన్నారు. భక్తి చాలా బాగుందని వారు భావిస్తారు. ఎందుకంటే వారికి జ్ఞానము గురించి తెలియనే తెలియదు. మీకు ఇప్పుడు జ్ఞానము లభించింది. అందుకే జ్ఞానపు ఒక చిన్న వెలుగుతో అర్ధకల్పము మనము ఉన్నతమౌతామని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. తర్వాత అక్కడ జ్ఞాన విషయాలే ఉండవు. ఈ విషయాలన్నీ మహారథి పిల్లలు మాత్రమే విని ధారణ చేసి ఇతరులకు వినిపిస్తూ ఉంటారు. మిగిలినవారు ఇక్కడ నుండి బయటకు పోతూనే జ్ఞానమంతా సమాప్తమవుతుంది. కర్మ, అకర్మ, వికర్మల రహస్యాన్ని కూడా భగవంతుడే అర్థం చేయిస్తారు. ఇది కల్పము యొక్క సంగమ యుగము. ఈ సమయములో పాత ప్రపంచము సమాప్తమై నూతన ప్రపంచము స్థాపన జరుగుతుంది. వినాశనము మీ ముందే(అతిసమీపముగా) నిలబడి ఉంది. మీరు సంగమ యుగములో ఉన్నారు. కానీ ఇతర మనుష్యులకు కలియుగము నడుస్తోంది. ఎంతో గాఢాంధకారముగా ఉంది. క్రిందకు దిగజారుతూనే ఉంటారు. క్రింద పడవేసేందుకు ఎవరో ఒకరు నిమిత్తంగా కూడా ఉంటారు. అతడే రావణుడు.

వాస్తవానికి ఈ సభలో పతితులెవ్వరూ కూర్చోలేరు. పతితులు వాయుమండలాన్ని పాడు చేస్తారు. ఒకవేళ ఎవరైనా గుప్తంగా వచ్చి కూర్చుంటే వారికి దెబ్బ కూడా తగులుతుంది. ఒక్కసారిగా క్రింద పడిపోతారు. ఈశ్వరీయ సభలో ఎవరైనా దైత్యులు(రాక్షసులు) వచ్చి కూర్చుంటే వెంటనే తెలిసిపోతుంది. వారిది రాతిబుద్ధియే. మిగిలినవారు కూడా రాతిబుద్ధి గలవారిగా మారిపోతారు. వారికి నూరు రెట్లు శిక్ష పడ్తుంది. స్వయానికి నష్టము కలుగజేసుకుంటారు. వీరు కనుక్కోగలరా? చూస్తాము అని వారు భావిస్తారు. ఎవరు చేస్తారో వారు పొందుతారు, తెలుసుకోవలసిన అవసరము లేనే లేదు. తండ్రితో సదా సత్యంగా ఉండాలి. సత్యంగా ఉంటే నాట్యము చేస్తూ ఉంటారని అంటారు. సత్యంగా ఉంటే మీ రాజధానిలో కూడా నాట్యము చేస్తారు. తండ్రియే సత్యము. కావున పిల్లలు కూడా సత్యంగా తయారవ్వాలి. శివబాబా ఎక్కడున్నారు? - అని బాబా అడుగుతారు. ఇతనిలో ఉన్నారని అంటారు. పరంధామాన్ని వదిలి దూరదేశములో ఉండేవారు పరాయి దేశములోకి వచ్చారు. వారిప్పుడు చాలా సేవ చేయవలసి వస్తుంది. తండ్రి అంటున్నారు - నేను ఇక్కడ రాత్రింబవళ్ళు సేవ చేయవలసి వస్తుంది. సందేశకులకు, భక్తులకు సాక్షాత్కారము చేయించవలసి వస్తుంది. వారేమో ఇక్కడే ఉన్నారు. అక్కడ పరంధామములో ఏ సర్వీసు లేదు. సర్వీసు లేకుంటే బాబాకు సుఖము లేదు. పూర్తి ప్రపంచమంతటికి సేవ చేయాలి. బాబా రండి అని అందరూ పిలుస్తారు. నేను ఈ రథములో వస్తానని చెప్తున్నారు. వారు దానిని గుర్రపు రథంగా చేసేశారు. గుర్రపుబండిలో కృష్ణుడు ఎలా కూర్చుంటారో ఆలోచించండి. అటువంటి గుర్రపుబండి పై కూర్చొనుటకు ఎవ్వరికీ ఉత్సాహము(ఆసక్తి) కూడా ఉండదు.

దేహీ(ఆత్మ) అభిమాని, దేహాభిమానులయ్యే విషయాలు సంగమ యుగములోనే జరుగుతాయి. తండ్రి తప్ప ఈ విషయాలు ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. మీరు కూడా ఇప్పుడే తెలుసుకున్నారు. ఇంతకుముందు మీకు ఈ విషయాలు తెలియవు. ఏ గురువైనా మీకు నేర్పించారా? గురువులనైతే అనేకమందిని ఆశ్రయించారు. ఎవ్వరూ నేర్పించలేదు. చాలామంది గురువులను ఆశ్రయిస్తారు. ఆ గురువుల నుండి శాంతికి మార్గము లభించాలని భావిస్తారు. తండ్రి చెప్తున్నారు - శాంతిసాగరులు ఒక్క తండ్రి మాత్రమే. వారు తమ జతలో తీసుకెళ్తారు. సుఖధామము - శాంతిధామములను గురించి ఎవ్వరికీ తెలియదు. కలియుగములో ఇప్పుడుండేది శూద్ర వర్ణము. పురుషోత్తమ సంగమ యుగములో బ్రాహ్మణ వర్ణముంది. ఈ వర్ణములను గురించి కూడా మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. ఇక్కడ కూర్చుని వింటారు. వెలుపలకు వెళ్తూనే అన్నీ మర్చిపోతారు. ధారణ జరగదు. తండ్రి చెప్తున్నారు - మీరు ఎక్కడకు వెళ్లినా బ్యాడ్జి ధరించి వెళ్ళండి. ఇందులో సిగ్గుపడే విషయమేదీ లేదు. ఈ బ్యాడ్జిని బాబా చాలా కళ్యాణము కొరకు తయారు చేయించారు. దీని ద్వారా ఎవరికైనా తెలిపించండి. ఎవరైనా తెలివిగలవారైతే ఈ బ్యాడ్జి కొరకు మీరు ఖర్చు పెట్టి ఉంటారని అంటారు. ఖర్చు అయితే అవ్వనే అవుతుంది.......... అని వారికి చెప్పండి. పేదవారికి ఉచితంగా లభిస్తుంది. వారు ధారణ చేసినట్లైతే ట ఉన్నత పదవి పొందగలరు. కొంతమంది వద్ద ధనముంటుంది కానీ పిసినార్లుగా ఉన్నారు. పేదల వద్ద ధనమే లేకుంటే వారేమి చేస్తారు! కొంతమంది వద్ద ధనముంటుంది కానీ ఖర్చు పెట్టనందున పిసినార్లుగా, దురదృష్టవంతులుగా అవుతారు. ఈ బాబా ఆచరణలో చేసి చూపించారు. తన సర్వస్వమూ మాతల అధీనము చేసేశారు. మీరు కూర్చుని యజ్ఞమునంతా సంభాళన చేయండి ఎందుకంటే ఇప్పుడు నాకు జ్ఞానము లభించింది. చివరిలో ఇవన్నీ ఏవీ గుర్తు రాకూడదని చెప్పారు. అంతిమ సమయములో ఎవరైతే స్త్రీని స్మృతి చేస్తారో,......... (వారు వేశ్యలౌతారు). పెద్ద పెద్ద భవనాలు మొదలైనవి ఉంటే చివర్లో అవి తప్పకుండా గుర్తుకొస్తాయి. అయితే జ్ఞానము కొద్దిగా విన్నా ప్రజలలో తప్పకుండా వస్తారు. తండ్రి ఏమో పేదలపెన్నిధి. కొంతమంది వద్ద ధనమున్నా లోభులుగా ఉంటారు. మొదటి వారసుడు శివబాబా అని వారు భావించరు. భగవంతుడే వారసుడని భక్తిమార్గములో కూడా ఉంది. ఈశ్వరార్థము దానము చేస్తారు. దానము ఇచ్చేందుకు వారేమైనా నిరుపేదలా! ఈశ్వరుని పేరు పై పేదలకు దానము చేస్తే ఈశ్వరుడు దాని ఫలితము ఇస్తారని భావిస్తారు. దీని ఫలము మరుసటి జన్మలో ఎలాగైనా లభిస్తుంది. దానమిస్తే గ్రహణము వదిలిపోతుందని అంటారు. తండ్రికి సర్వమూ ఇచ్చేశారు. శరీరము, బంధు-మిత్రులు మొదలైనవన్నీ బాబాకు సమర్పణ చేసేశారు. ఇదంతా మీది అని అన్నారు. ఈ సమయంలో మొత్తము ప్రపంచానికి గ్రహణము పట్టి ఉంది. ఆ గ్రహణము ఒక్క సెకండులో వదలిపోతుందో, నలుపు(అపవిత్రము) నుండి తెల్లగా(పవిత్రము) ఎలా అవుతారో, ఈ విషయం ఇప్పుడు మీకు మాత్రమే తెలుసు. తర్వాత మళ్లీ ఈ విషయాలను ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. మేమంతా అర్థము చేసుకున్నాము. అయితే ఇతరులకు అర్థం చేయించలేము........ అని ఎవరంటారో వారు కూడా దేనికీ పనికి రారు. తండ్రి చెప్తున్నారు - దానమిస్తే గ్రహణము వదిలిపోతుంది. నేను మీకు అవినాశి రత్నాలనిస్తాను. వాటిని అందరికీ ఇస్తూ ఉంటే భారతదేశానికి లేక మొత్తము ప్రపంచానికి పట్టిన గ్రహణము వదిలిపోతుంది. బృహస్పతి దశ వస్తుందని చెప్తున్నారు. అన్నింటికంటే మంచి దశ బృహస్పతి దశ. ఇప్పుడు ముఖ్యంగా భారతదేశము పై మరియు మొత్తము ప్రపంచానికి రాహు గ్రహణము పట్టి ఉందని మీకు తెలుసు. ఆ గ్రహణము ఎలా వదిలిపోతుంది? వారు తండ్రి కదా. ఈ తండ్రి మీ నుండి పాతవన్నీ తీసుకొని క్రొత్తవి ఇస్తారు. దీనినే బృహస్పతి దశ అంటారు. ముక్తిధామానికి వెళ్ళేవారికి బృహస్పతి దశ వచ్చిందని అనరు. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. సదా సంతోషంగా నృత్యము చేసేందుకు సత్యమైన తండ్రితో సదా సత్యంగా ఉండాలి. ఏదీ దాచరాదు.

2. తండ్రి ఏవైతే జ్ఞాన రత్నాలను ఇస్తున్నారో, వాటిని అందరికీ పంచాలి. జత జతలో శివబాబాను మీ వారసునిగా చేసుకొని అంతా సఫలము చేసుకోవాలి. ఇందులో లోభులుగా, దురదృష్టవంతులుగా అవ్వరాదు.

వరదానము :-

''గంభీరతా గుణము ద్వారా ఫుల్‌ మార్కులు జమ చేసుకునే గంభీరతా దేవి లేక దేవతా భవ''

వర్తమాన సమయంలో గంభీరతా గుణము చాలా చాలా అవసరము. ఎందుకంటే మాట్లాడే అలవాటు చాలా ఎక్కువయ్యింది. నోటికి ఏది వస్తే, అది మాట్లాడేస్తారు. ఏదైనా మంచి పని చేసి ఈ పని నేను చేశానని చెప్తే సగ భాగము సమాప్తమైపోతుంది. సగము మాత్రమే జమ అవుతుంది, గంభీరంగా ఉండేవారికి పూర్తిగా జమ అవుతుంది. అందువలన గంభీరతా దేవి లేక గంభీరతా దేవతగా అవ్వండి. ఫుల్‌ మార్కులు జమ చేసుకోండి. వర్ణన చేసినందున మార్కులు తగ్గిపోతాయి.

స్లోగన్‌ :-

''బిందు రూపములో స్థితమై ఉంటే, సమస్యలకు ఒక్క సెకండులో బిందువు పెట్టగలరు''