19-07-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - స్మృతిలో ఉండి పాపాలను దగ్ధము చేసుకునేందుకు మీరు ఇక్కడకు వచ్చారు. అందువలన బుద్ధియోగము నిష్ఫలము అవ్వరాదు. ఈ విషయము పై పూర్తి గమనముంచాలి.''
ప్రశ్న :-
ఏ సూక్ష్మ వికారము చివరి సమయములో కష్టపెడ్తుంది ?
జవాబు :-
ఒకవేళ సూక్ష్మంగానైనా లోభమనే వికారముంటే, ఏ వస్తువునైనా లోభ కారణముగా ప్రోగు చేసి తమ వద్ద జమ చేసుకొని ఉంటే అదే చివరి సమయంలో సమస్య లేక కష్టము రూపములో గుర్తుకొస్తుంది. అందువలన బాబా చెప్తున్నారు - పిల్లలారా! మీ వద్ద ఏమీ ఉంచుకోకండి. మీరు అన్ని సంకల్పాలను కూడా ఇముడ్చుకుని తండ్రి స్మృతిలో ఉండే అలవాటు చేసుకోవాలి. దాని కొరకు ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసము చేయండి.
ఓంశాంతి.
పిల్లలకు ప్రతి రోజు ఆత్మాభిమానులుగా అవ్వండని గుర్తు చేస్తారు. ఎందుకంటే బుద్ధి అటు-ఇటు వెళ్లిపోతుంది. అజ్ఞాన కాలములో కూడా కథలు, ఉపన్యాసాలు వింటున్నప్పుడు బుద్ధి బయట తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా భ్రమిస్తుంది. అందుకే ప్రతి రోజు ఆత్మాభిమానిగా అవ్వండని బాబా చెప్తారు. వారైతే మేము ఏమి చెప్తున్నామో దాని పై గమనముంచండి, ధారణ చేయండి, వినిపిస్తున్న శాస్త్రాలలోని వచనాల పై గమనముంచండి అని చెప్తారు. ఇక్కడైతే ఆత్మలకు, విద్యార్థులైన మీరందరూ ఆత్మాభిమానులై కూర్చోండి అని తండ్రి అర్థం చేయిస్తారు. శివబాబా చదివించేందుకు వస్తారు. శివబాబా చదివించేందుకు వస్తారని భావించే కాలేజీ ఏదీ లేదు. ఇలాంటి పాఠశాల పురుషోత్తమ సంగమ యుగములోనే ఉంటుంది. విద్యార్థులు కూర్చుని ఉన్నారు, పరమపిత పరమాత్మ మనలను చదివించేందుకు వస్తారని కూడా అర్థం చేసుకున్నారు. మనలను చదివించేందుకు శివబాబా వస్తారు. మొట్టమొదట మీరు పావనంగా అవ్వాలంటే నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని అర్థం చేయిస్తారు. కానీ మాయ క్షణ-క్షణము మరిపింపచేస్తుంది, అందువలన తండ్రి హెచ్చరిస్తూ ఉంటారు. ఎవరికైనా అర్థం చేయించాలన్నా మొట్టమొదట భగవంతుడు ఎవరు? అనే విషయాన్ని అర్థము చేయించండి. పతిత పావనుడు దు:ఖహర్త - సుఖకర్త అయిన భగవంతుడు ఎక్కడ ఉన్నారు? వారిని అందరూ స్మృతి అయితే చేస్తారు. ఆపదలు వచ్చినప్పుడు హే భగవంతుడా! దయ చూపండి అని అంటారు. ఎవరినైనా రక్షించవలసివచ్చినప్పుడు కూడా హే భగవంతుడా!, ఓ గాడ్ మమ్ములను దు:ఖము నుండి విముక్తి చేయండి అని అంటారు. దు:ఖమైతే అందరికీ ఉంది. సత్యయుగాన్ని సుఖధామమని, కలియుగాన్ని దు:ఖధామమని అంటారని మీకు పక్కాగా తెలుసు. ఇది పిల్లలకు తెలుసు అయినా మళ్లీ మాయ మరపింపజేస్తుంది. ఇలా స్మృతిలో కూర్చోపెట్టు విధానము కూడా డ్రామాలో ఉంది. ఎందుకంటే చాలామంది రోజంతా స్మృతి చేయరు. ఒక్క నిమిషము కూడా స్మృతి చేయరు. మళ్లీ స్మృతి ఇప్పించేందుకు ఇక్కడ కూర్చోబెడ్తారు. పక్కాగా అయ్యేందుకు స్మృతి చేసే యుక్తిని తెలుపుతారు. తండ్రి స్మృతి ద్వారానే మనము సతోప్రధానంగా అవ్వాలి. సతోప్రధానంగా అయ్యేందుకు తండ్రి వాస్తవమైన ఫస్ట్క్లాస్ యుక్తి తెలిపిస్తారు. పతితపావనుడు ఒక్క తండ్రి మాత్రమే. వారే వచ్చి ఈ యుక్తిని తెలుపుతారు. ఇక్కడ పిల్లలైన మీరు తండ్రితో యోగములో ఉన్నప్పుడు శాంతిగా కూర్చుంటారు. ఒకవేళ బుద్ధి యోగము ఇక్కడ-అక్కడ భ్రమిస్తూ ఉంటే శాంతిగా కాక అశాంతిగా ఉంటారు. ఎంత సమయము బుద్ధియోగము అటు-ఇటు వెళ్తుందో అంత సమయము నిష్ఫలమయినట్లే. ఎందుకంటే అందులో పాపాలు నశించవు. పాపాలు ఎలా తొలగిపోతాయో ప్రపంచానికి తెలియదు. ఇవి చాలా లోతైన, సూక్ష్మమైన విషయాలు. నా స్మృతిలో కూర్చోండి అని తండ్రి చెప్పారు. కనుక ఎంతవరకు స్మృతి అను దారము జోడించబడి ఉంటుందో, అంత సమయము సఫలమౌతుంది. బుద్ధి ఏ మాత్రము ఇటు-అటు వెళ్లినా ఆ సమయము వృథా అవుతుంది, నిష్ఫలమవుతుంది. పిల్లలారా! నన్ను స్మృతి చేయండి అని బాబా డైరెక్షన్ ఉంది కదా. ఒకవేళ స్మృతి చేయకపోతే అది నిష్ఫలమవుతుంది. దీని ద్వారా ఏమవుతుంది? మీరు త్వరగా సతోప్రధానంగా అవ్వరు. అది అలవాటైపోతుంది. ఇలా జరుగుతూనే ఉంటుంది. ఆత్మకు ఈ జన్మలో చేసిన పాపాల గురించి తెలుసు. మాకు గుర్తులేదని కొందరు చెప్తారు. కానీ 3-4 సంవత్సరాల వయస్సు నుండి విషయాలన్నీ గుర్తుంటాయని బాబా చెప్తారు. తర్వాత జరిగినంత పాపము మొదట్లో జరగదు. రోజు రోజుకు దృష్టి చెడుగా(క్రిమినల్గా), అశుద్ధంగా అవుతూ ఉంటుంది. త్రేతాలో రెండు కళలు తగ్గిపోతాయి. చంద్రుని 2 కళలు ఎంత సమయములో తగ్గుతాయి? నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. 16 కళా సంపూర్ణమని కూడా చంద్రుడినే అంటారు, కానీ సూర్యుడిని అలా అనరు. చంద్రుడిది ఒక నెలకు సంబంధించిన విషయము. ఇది కల్ప-కల్పానికి సంబంధించిన విషయము రోజు రోజుకు క్రిందికి దిగుతూ వస్తారు. మళ్లీ స్మృతియాత్ర ద్వారా పైకి ఎక్కగలరు. ఎక్కిన తర్వాత మళ్లీ స్మృతి చేసి ఎక్కవలసిన అవసరముండదు. సత్యయుగము తర్వాత మళ్లీ ఇక క్రిందికి దిగాలి. సత్యయుగములో కూడా స్మృతి చేసినట్లైతే క్రిందకు దిగనే దిగరు. డ్రామానుసారంగా క్రిందకు దిగాల్సిందే. కావున అక్కడ స్మృతియే చేయరు. తప్పకుండా దిగాల్సిందే. మళ్లీ స్మృతి చేసే ఉపాయాన్ని తండ్రియే చెప్తారు. ఎందుకంటే పైకి వెళ్లాలి. సంగమ యుగములోనే తండ్రి వచ్చి ఇప్పుడు పైకి ఎక్కేకళ ప్రారంభమవుతుందని నేర్పిస్తారు. ఇప్పుడు మనము మళ్లీ సుఖధామములోకి వెళ్లాలి. అలా వెళ్లాలంటే నన్ను స్మృతి చేయమని తండ్రి చెప్తారు. స్మృతి ద్వారా మీ ఆత్మ సతోప్రధానమైపోతుంది.
మీరు ప్రపంచానికి భిన్నమైనవారు. వైకుంఠము ఈ ప్రపంచానికి పూర్తిగా భిన్నమైనది, ఒకప్పుడు వైకుంఠము ఉండేది. ఇప్పుడు లేదు. కల్పము ఆయువును పెద్దదిగా చేసినందున మర్చిపోయారు. ఇప్పుడు పిల్లలైన మీకైతే వైకుంఠము చాలా సమీపంగా కనిపిస్తుంది. ఇక కొంత సమయము మాత్రమే మిగిలి ఉంది. స్మృతియాత్రలోనే లోపముంది. అందుకే ఇప్పుడు ఇంకా సమయముందని భావిస్తారు. స్మృతియాత్ర ఎంతగా ఉండాలో అంత లేదు. మీరు డ్రామా ప్లాను అనుసారము సందేశమును అందరికీ చేరుస్తారు. ఎవరికైనా సందేశము ఇవ్వలేదంటే సేవ చేయడం లేదని అర్థము. ''తండ్రి నన్ను మాత్రమే స్మృతి చేయమని చెప్తున్నారు'' అను సందేశమును మొత్తం ప్రపంచమంతటికీ చేర్చాలి. గీతను చదివేవారికి ఈ మహావాక్యాలున్న శాస్త్రము ఒక్క గీతా శాస్త్రమే అని తెలుసు. కానీ అందులో కృష్ణ భగవానువాచ అని వ్రాసినందున ఎవరిని స్మృతి చేయాలి? భలే శివుని భక్తి చేస్తారు కానీ శ్రీమతము పై నడిచేందుకు యాధార్థమైన జ్ఞానము లేదు. ఈ సమయములో మీకు ఈశ్వరీయ మతము లభిస్తుంది. ఇంతవరకు మానవ మతము ఉండేది. ఈ రెండింటికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఈశ్వరుడు సర్వవ్యాపి అని మనుష్య మతము చెప్తుంది. కానీ అలా కాదని ఈశ్వరీయ మతము చెప్తుంది. నేను స్వర్గ స్థాపన చేసేందుకు వచ్చానని తండ్రి అంటారు. కనుక ఇది తప్పకుండా నరకమే. ఇక్కడ పంచ వికారాలు అందరిలో ప్రవేశమై ఉన్నాయి. ఇది వికారీ ప్రపంచము. అందుకే నిర్వికారంగా చేసేందుకు నేను వస్తాను. ఎవరైతే ఈశ్వరుని పిల్లలుగా అయ్యారో వారిలో వికారాలు ఉండజాలవు. రావణుని చిత్రమును పది తలలతో చూపిస్తారు. రావణుని సృష్టి నిర్వికారమైనదని ఎవ్వరూ అనలేరు. ఇప్పుడిది రావణ రాజ్యమని, అందరిలో పంచ వికారాలున్నాయని మీకు తెలుసు. సత్యయుగములో రామ రాజ్యము ఉంటుంది. అక్కడ ఏ వికారమూ ఉండదు. ఈ సమయములో మనుష్యులు ఎంత దు:ఖితులుగా ఉన్నారు! శరీరానికి ఎన్ని దు:ఖాలు కలుగుతాయి? ఇది దు:ఖధామము. సుఖధామములో అయితే శారీరిక దు:ఖాలు కూడా ఉండవు. ఇక్కడైతే ఎన్నో ఆసుపత్రులు పూర్తిగా రోగులతో నిండి ఉన్నాయి. దీనిని స్వర్గమని అనడం కూడా పెద్ద పొరపాటే. కనుక ఇవి అర్థము చేసుకొని ఇతరులకు కూడా అర్థము చేయించాలి. ఆ చదువు ఇతరులకు అర్థము చేయించేందుకు కాదు. పరీక్షలు పాసై ఉద్యోగాలకు వెళ్తారు. ఇక్కడైతే మీరు అందరికీ సందేశమును ఇవ్వాలి. కేవలం ఒక్క తండ్రియే అందరికీ ఇవ్వరు. ఎవరైతే చాలా చురుకుగా ఉంటారో వారిని టీచర్ అని అంటారు. తక్కువ చురుకుగా ఉంటే వారిని విద్యార్థులని అంటారు. మీరు అందరికీ సందేశమును ఇవ్వాలి. భగవంతుని గూర్చి మీకు తెలుసా? అని అడగాలి. వారు అందరికీ తండ్రి. కనుక తండ్రి పరిచయమివ్వడమే ముఖ్యమైన విషయము. ఎందుకంటే వారిని గూర్చి ఎవ్వరికీ తెలియదు. మొత్తం విశ్వమంతటినీ పావనంగా చేయువారు ఉన్నతోన్నతులైన ఒక్క తండ్రి మాత్రమే. ఒకప్పుడు విశ్వమంతా పావనంగా ఉండేది. అందులో కేవలం ఒక్క భారతదేశము మాత్రమే ఉండేది. ఇక ఏ ఇతర ధర్మమువారు మేము నూతన ప్రపంచములోకి వస్తామని అనలేరు. మా కంటే ముందు ఎవరో ఉండి వెళ్లారని వారు భావిస్తారు. ఏసుక్రీస్తు కూడా తప్పకుండా ఎవరిలోనో వస్తారు. అతనికి ముందు కూడా తప్పకుండా ఎవరో ఉన్నారు. నేను ఈ బ్రహ్మ తనువులో ప్రవేశిస్తానని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇది కూడా ఎవ్వరూ అంగీకరించరు. అరే! బ్రాహ్మణులైతే తప్పకుండా కావాలి. బ్రాహ్మణులు ఎక్కడ నుండి వస్తారు? తప్పకుండా బ్రహ్మ ద్వారానే వస్తారు కదా. అచ్ఛా! బ్రహ్మకు తండ్రి ఎవరో ఎప్పుడైనా విన్నారా? వారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. అతనికి సాకార తండ్రి ఎవ్వరూ లేరు. బ్రహ్మ సాకార తండ్రి ఎవరు? ఇది ఎవ్వరూ తెలుపలేరు. బ్రహ్మ ప్రసిద్ధమైనవారు. అంతేకాక అతను ప్రజాపిత కూడా అయినారు. ఎలాగైతే నిరాకార శివబాబా తన తండ్రి ఎవరో చెప్పమంటారో అలా సాకార ప్రజాపిత బ్రహ్మ తండ్రి ఎవరో చెప్పండి. శివబాబా ఎవరితోనో దత్తత తీసుకోబడలేదు. ఇతను దత్తత తీసుకోబడ్డాడు. ఇతనిని శివబాబా దత్తత తీసుకున్నారని అంటారు. శివబాబా విష్ణువును దత్తత తీసుకున్నారని ఎప్పుడూ అనరు. బ్రహ్మయే విష్ణువుగా అవుతాడని మీకు తెలుసు. అతడు దత్తత అవ్వలేదు. శంకరుని పాత్ర ఏమీ లేదని కూడా చెప్పడం జరిగింది. బ్రహ్మ నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మగా అవుతారు. ఇది 84 జన్మల చక్రము. మరి శంకరుడు ఎక్కడ నుండి వచ్చాడు? అతడి రచన ఎక్కడ ఉంది? తండ్రికైతే రచన ఉంది. వారు సర్వాత్మల తండ్రి. మనుష్యులందరూ బ్రహ్మ రచన. కానీ శంకరుని రచన ఎక్కడుంది? శంకరుని ద్వారా ఏ మానవ ప్రపంచము రచింపబడదు. తండ్రి వద్ద ఈ విషయాలన్నీ అర్థము చేయిస్తారు. అయినా పిల్లలు ఘడియ - ఘడియ మర్చిపోతారు. ప్రతి ఒక్కరి బుద్ధి నంబరువారుగా ఉంది కదా. బుద్ధి ఎంత బాగా ఉంటుందో టీచరు చెప్పిన చదువును అంత బాగా ధారణ చేయగలరు. ఇది అనంతమైన చదువు. చదువు అనుసారమే నంబరువారుగా పదవి పొందుతారు. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే చదువు ఒక్కటే కానీ వంశము తయారవుతుంది కదా. మేము ఏ పదవిని పొందుతాము అనేది కూడా బుద్ధ్ధిలోకి రావాలి. రాజుగా అవ్వడం శ్రమతో కూడిన పని. రాజుల వద్ద దాస-దాసీలు కూడా కావాలి. దాస-దాసీలుగా ఎవరు అవుతారో, అది కూడా మీరు అర్థము చేసుకోగలరు. నెంబరువారీ పురుషార్థానుసారము ప్రతి ఒక్కరికి దాసీలు లభిస్తారు. జన్మ-జన్మాంతరాలు దాస-దాసీలు అయ్యే విధంగా చదవరాదు. ఉన్నతంగా అయ్యేందుకు పురుషార్థము చేయాలి.
కనుక సత్యమైన శాంతి తండ్రి స్మృతిలో ఉంది. బుద్ధి ఏ కొద్దిగానైనా ఇటు-అటు వెళ్తే సమయము వృథా అవుతుంది. సంపాదన తగ్గిపోతుంది. సతోప్రధానంగా అవ్వలేరు. చేతులతో పని చేస్తూ హృదయంతో తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి అని బాబా అర్థము చేయించారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు భలే ఇటు-అటు తిరగండి, కానీ బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి. ఎవరైనా మీ జతలో ఉంటే వారితో వ్యర్థ విషయాలు మాట్లాడరాదు. ప్రతి ఒక్కరి హృదయము దీనిని గురించి సాక్ష్యము చెప్తుంది ఇటువంటి స్థితిలో తిరగండి. క్రైస్తవ ఫాదరీలు పూర్తి శాంతిలో నడుస్తారు. పిల్లలైన మీరు రోజంతా జ్ఞాన విషయాలు మాట్లాడరు. అప్పుడు నోటిని శాంతపరచుకొని శివబాబా స్మృతిలో పరుగు పందెము చేయాలి. భోజనము చేయు సమయములో స్మృతిలో కూర్చొని తినండి, మీ చార్టును చూసుకోండి అని బాబా చెప్తున్నారు. నేనైతే మర్చిపోతూ ఉంటానని బాబా(బ్రహ్మ) తనను గూర్చి చెప్తాడు - నేను పూర్తి సమయము స్మృతిలో ఉండేందుకు ప్రయత్నిస్తాను. బాబా, మీరు నా దగ్గును ఆపు చేయండి, షుగర్ను తగ్గించండి అని నేను చేసే పురుషార్థము గురించి బాబాకు తెలియచేస్తాను. అయినా స్వయం నేనే మర్చిపోతాను. కనుక దగ్గు ఎలా తగ్గిపోతుంది? బాబాతో నేను ఏదైతే మాట్లాడ్తానో వాటిని వాస్తవంగా వినిపిస్తాను. బాబా పిల్లలకు తెలిపిస్తారు కానీ పిల్లలు తండ్రికి వినిపించరు. ఎందుకంటే సిగ్గుపడ్తారు. చెత్త ఊడ్చునప్పుడు, వంట చేయునప్పుడు కూడా శివబాబా స్మృతిలోనే చేయండి. అప్పుడు అందులోకి శక్తి వస్తుంది. ఈ యుక్తి కూడా కావాలి. ఇందులో మీకే కళ్యాణము జరుగుతుంది. మీరు స్మృతిలో కూర్చుంటే ఇతరులకు కూడా ఆకర్షణ కలుగుతుంది. పరస్పరము ఆకర్షణ కలుగుతుంది కదా. ఎంత ఎక్కువగా స్మృతిలో ఉంటారో అంత నిశ్శబ్ధము ఏర్పడ్తుంది. డ్రామానుసారము ఒకరి ప్రభావము మరొకరి పై పడ్తుంది. ఈ స్మృతియాత్ర అయితే చాలా కళ్యాణకారి ఇందులో అసత్యము చెప్పే అవసరం లేదు. మీరు సత్యమైన తండ్రి పిల్లలు కనుక సత్యంగా నడుచుకోవాలి. పిల్లలకైతే అన్నీ లభిస్తాయి. విశ్వరాజ్యము లభిస్తూ ఉంటే లోభానికి వశమై 10-20 చీరలు మొదలైనవి ఎందుకు పోగు చేస్తారు? ఒకవేళ చాలా వస్తువులను పోగు చేసుకుంటూ ఉంటే మరణించే సమయములో కూడా అవే గుర్తుకు వస్తాయి. అందుకే కర్రను కూడా వదిలేయండి, లేకపోతే అది కూడా గుర్తుకు వస్తుందని ఒక స్త్రీ చెప్పిందని ఉదాహరణ చెప్తారు. ఏదీ గుర్తుకు రాకూడదు. లేకపోతే తమకు తామే దు:ఖాన్ని, కష్టాన్ని కొని తెచ్చుకుంటారు. అసత్యము చెప్తే నూరు రెట్లు పాపము పెరిగిపోతుంది. శివబాబా భండారము సదా నిండుగా ఉంటుంది. ఎక్కువగా ఉంచుకునే అవసరము కూడా ఏముంది? ఎవరి వస్తువులైనా దొంగలింపబడినా వారి వస్తువులన్నీ ఇవ్వడం జరుగుతుంది. పిల్లలైన మీకైతే తండ్రి ద్వారా రాజ్యమే లభిస్తూ ఉంటే మరి దుస్తులు మొదలైనవి లభించవా? కేవలం వ్యర్థంగా ఖర్చు చేయరాదు. ఎందుకంటే స్వర్గ స్థాపనకు అబలలే సహాయము చేస్తారు. వారి ధనమును ఏ విధంగానూ వ్యర్థముగా ఖర్చు చేయరాదు. వారు మిమ్ములను పాలన చేస్తే, వారిని పాలన చేయడం మీ బాధ్యత. లేకపోతే నూరు రెట్లు పాపము తల పైకి ఎక్కుతుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి స్మృతిలో కూర్చున్నప్పుడు బుద్ధి ఏ మాత్రము అటు-ఇటు భ్రమించరాదు. సదా సంపాదన జమ అవుతూ ఉండాలి. వాయుమండలము నిశ్శబ్ధంగా అయ్యే విధంగా స్మృతి ఉండాలి.
2. శరీర ఆరోగ్యం కొరకు తిరిగేందుకు వెళ్ళినప్పుడు(వాకింగ్ చేయునప్పుడు) పరస్పరములో పరచింతన చేయరాదు. నోటిని శాంతిగా ఉంచుకొని తండ్రిని స్మృతి చేసే రేస్ చెయ్యండి. భోజనము కూడా తండ్రి స్మృతిలోనే తినాలి.
వరదానము :-
'' సంబంధ - సంపర్కములో సంతుష్టత అనే విశేషత ద్వారా మాలలో కూర్చబడే సంతుష్టమణి భవ ''
సంగమ యుగము సంతుష్టతా యుగము. ఎవరైతే స్వయంతో కూడా సంతుష్టంగా ఉంటారో, సంబంధ-సంపర్కములో కూడా సదా సంతుష్టంగా ఉంటూ లేక సంతుష్టపరుస్తారో, వారే మాలలో కూర్చబడ్తారు. ఎందుకంటే మాల సంబంధాలతో తయారవుతుంది. ఒకవేళ ఒక పూసకు మరొక పూసకు సంపర్కము లేకుంటే మాల తయారవ్వదు. అందువలన సంతుష్టమణులుగా అయ్యి సదా సంతుష్టంగా ఉండండి, అంతేకాక అందరినీ సంతుష్ట పరచండి. పరివారమంటేనే సంతుష్టంగా ఉండడం మరియు సంతుష్ట పర్చడం. ఏ విధమైన గొడవలూ ఉండరాదు.
స్లోగన్ :-
'' విఘ్నాల పని రావడం, మీ పని విఘ్నవినాశకులుగా అవ్వడం. ''