07-08-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - చైతన్య స్థితిలో ఉండి తండ్రిని గుర్తు చేసుకోవాలి, శూన్య స్థితిలోకి వెళ్లిపోవడం లేక నిద్రలోకి జారుకోవడం - యోగం కాదు ''
ప్రశ్న :-
మీరు కనులు మూసుకొని కూర్చోవడం ఎందుకు నిషేధించబడింది ?
జవాబు :-
మీరు ఒకవేళ కళ్ళు మూసుకొని కూర్చుంటే దుకాణంలోని మొత్తం సామన్లు దొంగలు దొంగిలించి తీసుకుపోతారు. మాయ అనే దొంగ బుద్ధిలో ఏదీ ధారణ చేసుకోనివ్వదు. కళ్లు మూసుకొని కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది, ఏమీ అర్థమే కాదు. అందుకే కళ్లు తెరుచుకొని కూర్చోవాలి. పని పాటలు చేసుకుంటూ, బుద్ధితో తండ్రిని గుర్తు చేసుకోవాలి, ఇందులో హఠయోగపు మాటే లేదు.
ఓంశాంతి.
ఆత్మిక తండ్రి పిల్లలకు చెప్తున్నారు - ఇతడు కూడా పుత్రుడే కదా! దేహధారులందరూ పిల్లలే. కనుక ఆత్మిక తండ్రి, ఆత్మయే ముఖ్యమైనదని ఆత్మలకు చెప్తున్నారు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఎదురుగా కూర్చున్నప్పుడు శరీరానికి అతీతంగా మాయమైపోవడం కాదు. శరీరానికి అతీతంగా ఎక్కడికో వెళ్లిపోవడం స్మృతియాత్ర స్థితి కాదు. ఇక్కడ స్మృతిలో కూర్చోవాలి. నడుస్తూ-తిరుగుతూ, లేస్తూ-కూర్చుంటూ, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేసుకోవాలి. ఇక్కడ కూర్చొని స్పృహ తప్పిపోవాలని తండ్రి చెప్పరు. అలా చాలామంది కూర్చొని కూర్చొని ఎక్కడికో వెళ్లిపోతారు. మీరైతే స్పృహతో కూర్చొని పవిత్రంగా కూడా అవ్వాలి. పవిత్రత లేకుండా ధారణ అవ్వదు, ఎవరి కళ్యాణమూ చేయలేరు, ఎవ్వరికీ చెప్పలేరు. స్వయం పవిత్రత లేకుండా ఇతరులకు చెప్పేవారిని పండితులని అంటారు. నాకంతా తెలుసని అనుకోరాదు. లోలోపల మనసు తింటూ ఉంటుంది. మేము శూన్యంలోకి వెళ్తున్నామని భావించకండి. కనులు మూసుకుపోవడం - ఇదేమీ గుర్తు చేసుకునే స్థితి కాదు. ఇందులో చైతన్య స్థితిలో ఉండి తండ్రిని స్మృతి చేయాలి. నిద్రపోవడం అనేది స్మృతి చేయడం కాదు. పిల్లలకు అనేక పాయింట్లు అర్థం చేయించడం జరుగుతుంది. శాస్త్రాలలో - ఏడవ భూమికలోకి వెళ్లినవారికి ప్రపంచమే తెలియదని చూపించారు. మీకైతే ఈ ప్రపంచం తెలుసు కదా! ఇది ఛీ-ఛీ (పాడైపోయిన) ప్రపంచం. తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి ఎవరో తెలిస్తే సృష్టి చక్రం కూడా తెలియాలి. ఈ చక్రం ఎలా తిరుగుతుందో మనుష్యులు మరుజన్మ ఎలా తీసుకుంటారో తండ్రి తెలిపిస్తారు. సత్యయుగంలో పెద్ద వయసుగలవారు కూడా అందవిహీనులుగా ఉండరు. సన్యాసులదైతే హఠయోగము. కనులు మూసుకుని గుహలో కూరొని, కూర్చొని అందహీనులైపోతారు. మీకైతే తండ్రి చెప్తున్నారు - గృహస్థ వ్యవహారములో ఉంటూ స్పృహలో ఉండాలి. శూన్యంలోకి వెళ్లిపోవడం అనేది స్థితి ఏమీ కాదు. వ్యాపారం మొదలైనవి కూడా చేయాలి. గృహస్థ వ్యవహారాన్ని కూడా సంభాళించాలి. శూన్యంలోకి వెళ c @ 3098;ేసుకుంటూ బుద్ధితో తండ్రిని స్మృతి చేయాలి. కనులు తెరచి ఉంచుకునే పనులు చేస్తారు కదా! వ్యాపారం మొదలైనవన్నీ చేస్తూ బుద్ధియోగం తండ్రి జతలో ఉండాలి. ఇందులో పొరపాట్లు చేయరాదు, అజాగ్రత్తగా ఉండరాదు. దుకాణంలో కూర్చున్నప్పుడు కనులు మూసుకుపోతే(కునికి పాట్లుపడితే), ఎవరైనా సామాన్లు తీసుకు పోయినా తెలియదు. ఇదేమైనా మంచి స్థితా! మనం దేహం నుండి అతీతమైపోవడం ఇవన్నీ హఠయోగుల మాటలు. విషయాలు. రిద్ధి-సిద్ధి(క్షుద్ర పూజలు) చేసేవారు చేస్తారు. తండ్రి అయితే చక్కగా కూర్చొని అర్థం చేయిస్తారు. ఇందులో కనులు మూసుకోరాదు.
తండ్రి అంటున్నారు - కూర్చొని బంధు-మిత్రులను గుర్తు చేసుకోవడం మర్చిపోండి. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. స్మృతియాత్రతో తప్ప పాపాలు వినాశనమవ్వజాలవు. భోగ్ తీసుకెళ్తారు, సూక్ష్మవతనంలో మాయమైపోతారు. ఇందులో ఏం జరుగుతుంది? ఎంత సమయం అక్కడ ఉన్నా వికర్మలు వినాశనమవ్వవు. శివబాబాను స్మృతి చేయలేరు. బాబా వాణిని కూడా వినలేరు కనుక నష్టపోతారు. కానీ ఇది డ్రామాలో రచింపబడి ఉంది. అందుకే వెళ్లిపోతారు. మళ్లీ వచ్చి మురళీ వింటారు. అందుకే బాబా అంటారు - వెళ్లండి, వెంటనే వచ్చేయండి, కూర్చోకండి. అక్కడ ఆటపాటలు చేయడం బాబా మాన్పించేశారు. భక్తిమార్గంలో ఏడ్వటం, బాదుకోవడం చాలా జరుగుతాయి. ఎందుకంటే అంధకార మార్గం కదా! మీరాబాయి ధ్యానంలో వైకుంఠానికి వెళ్లిపోయేది. అది యోగమూ కాదు, చదువూ కాదు. మీరాబాయి సద్గతినేమైనా పొందిందా? స్వర్గానికి వెళ్లే అర్హత(యోగ్యత) పొందిందా? జన్మ-జన్మాంతరాల పాపాలు నశించాయా? ఏ మాత్రం లేదు. జన్మ-జన్మాంతరాల పాపాలు తండ్రి స్మృతితోనే నశిస్తాయి. సాక్షాత్కారాలు మొదలైన వాటి వలన ఎటువంటి లాభమూ ఉండదు. ఇది కేవలం భక్తి, స్మృతి కాదు - జ్ఞానమూ కాదు. భక్తిమార్గంలో ఈ జ్ఞానము నేర్పించేవారు ఎవ్వరూ ఉండనే ఉండరు కనుక సద్గతిని కూడా పొందలేరు. భలే ఎన్ని సాక్షాత్కారాలు జరిగినా సద్గతిని పొందలేరు. ప్రారంభంలో అయితే పిల్లలు సాక్షాత్కారాల్లోకి వారంతటవారే వెళ్లేవారు. మమ్మా-బాబా వెళ్లేవారు కాదు. బాబాకైతే మొదట్లో కేవలం స్థాపన, వినాశనం యొక్క సాక్షాత్కారాలు జరిగాయి. తర్వాత అయితే ఏమీ జరగలేదు. మేము ఎవ్వరినీ పంపడం లేదు. అయితే కూర్చోబెట్టి, బాబా వీరి తాడు పైకి లాగండి అని చెప్తాము. అది కూడా డ్రామాలో ఉంటే లాగుతారు, లేకుంటే లేదు. సాక్షాత్కారాలు చాలానే అవుతూ ఉంటాయి. తొలుత(మొదట) ఎలాగైతే చాలా సాక్షాత్కారాలు జరిగాయో, అలా చివర్లో కూడా చాలా సాక్షాత్కారాలవుతాయి. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటంలా..... ఉంటుంది. ఇంతమంది మనుష్యులందరూ శరీరం వదిలేస్తారు. శరీర సహితంగా ఎవ్వరూ శాంతిధామానికి, సత్యయుగానికి వెళ్లలేరు. అనేకమంది మనుష్యులున్నారు, అందరికీ వినాశనం ప్రాప్తిస్తుంది. ఇకపోతే ఒకే ఆదిసనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన బ్రహ్మ ద్వారా జరుగుతోంది. పిల్లలైన మీరు గ్రామ-గ్రామానికీ వెళ్లి ఎంత సేవ చేస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అనే చెప్తున్నారు. రాజయోగం నేర్పించడం సన్యాసులకు తెలియదు. తండ్రి తప్ప రాజయోగం ఎవరు నేర్పిస్తారు? పిల్లలైన మీకు తండ్రి ఇప్పుడు రాజయోగం నేర్పిస్తున్నారు. మళ్లీ రాజ్యం లభిస్తుంది. మీరు అపారమైన సుఖాలలో ఉంటారు. అక్కడ స్మృతి చేయాల్సిన అవసరమే లేదు. లేశమంతైనా దు:ఖం ఉండదు. ఆయువు ఎక్కువగా, శరీరం కూ c @ ది. ఇక్కడ ఎంత దు:ఖం ఉంది? అలాగని తండ్రి దు:ఖం కలిగించే ఆటనే రచించారని కాదు. ఇది సుఖ - దు:ఖాల, గెలుపు- ఓటముల, ఆది-అనాదుల ఆట. ఈ విషయాలేవీ సన్యాసులకు తెలియనే తెలియవు. మరి ఎలా అర్థం చేయించగలరు? వారు భక్తిమార్గపు శాస్త్రాలు మొదలైనవి చదివేవారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అని చెప్పబడ్తుంది. ఆ సన్యాసులేమో ఆత్మగా భావించి బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు. బ్రహ్మతత్వాన్ని పరమాత్మ అని భావిస్తారు. వారు బ్రహ్మజ్ఞానులు వాస్తవానికి బ్రహ్మతత్వము నివాస స్థానము ఎచ్చటైతే ఆత్మలైన మీరు నివాసముంటారో, అందులో మేము లీనమవుతామని వారు అంటారు. వారి జ్ఞానమే మొత్తం ఉల్టాగా ఉంది. ఇక్కడ అనంతమైన తండ్రి పిల్లలైన మిమ్ములను చదివిస్తున్నారు భగవంతుడు 40 వేల సంవత్సరాల తర్వాత వస్తారని వారంటారు. దీనినే అజ్ఞానాంధకారము అని అంటారు. తండ్రి అంటారు - క్రొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనము చేసేవాడిని నేనే. నేను స్థాపన చేస్తున్నాను. వినాశనం కూడా ఎదురుగా నిల్చొనే ఉంది. ఇప్పుడు త్వరపడండి. పావనంగా అవుతేనే పావన ప్రపంచానికి వెళ్తారు. ఇది పాత తమోప్రధాన ప్రపంచం. లక్ష్మీనారాయణుల రాజ్యము లేనే లేదు. వీరి రాజ్యం క్రొత్త ప్రపంచంలో ఉండేది, ఇప్పుడు లేదు. వీరు పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు. శాస్త్రాలలో అయితే ఏమేమో వ్రాసేశారు! అర్జునుని గుర్రపు బండిలో కృష్ణుడు కూర్చున్నట్లుగా చూపించారు. అర్జునునిలో కృష్ణుడు కూర్చున్నారని కాదు. కృష్ణుడు దేహధారి కదా! యుద్ధము మొదలైనవాటి మాటే లేదు. వారు పాండవ మరియు కౌరవ సైన్యాన్ని వేరు వేరు చేసేశారు. ఇక్కడైతే ఆ మాటే లేదు. భక్తిమార్గంలో చాలా శాస్త్రాలున్నాయి. సత్యయుగంలో ఇవేమీ ఉండవు. అక్కడ జ్ఞానం వలన లభించిన ప్రాలబ్ధపు రాజధాని ఉంటుంది. అక్కడ సుఖమే సుఖముంటుంది. తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు కనుక నూతన ప్రపంచంలో తప్పకుండా సుఖమే ఉంటుంది కదా! తండ్రి ఎప్పుడైనా పాత ఇంటిని నిర్మిస్తారా? తండ్రి క్రొత్త ఇంటినే నిర్మిస్తారు. ఆ ప్రపంచాన్ని సతోప్రధాన ప్రపంచం అని అంటారు. ఇప్పుడైతే అందరూ తమోప్రధానంగా, అపవిత్రంగా ఉన్నారు, పరాయి రావణ రాజ్యంలో కూర్చొని ఉన్నారు.
రాముడని శివబాబాను అంటారు. రామ, రామ అంటూ రామ నామాన్ని దానం చేస్తారు. ఇప్పుడు రాముడెక్కడ, శివబాబా ఎక్కడ. శివబాబా పిల్లలైన మీకు ''నన్నొక్కరినే నన్నే స్మృతి చేయండి'' అని చెప్తున్నారు. ఎక్కడ నుండి వచ్చారో మళ్లీ అక్కడికే వెళ్లాలి. ఎంతవరకు తండ్రిని స్మృతి చేసి పవిత్రంగా అవ్వరో అంతవరకు వాపసు కూడా వెళ్లలేరు. మీలో కూడా తండ్రిని స్మృతి చేయువారు చాలా కొద్దిమందే. నోటితో చెప్పే విషయమే లేదు. భక్తిలో రామ-రామ అని అంటూ ఉంటారు. ఎవరైనా పలకకుంటే వారిని నాస్తికులని అంటారు. ఎంతో బిగ్గరగా పాడ్తారు. వృక్షం పెద్దదవుతున్న కొలది, భక్తి సామాగ్రి పెరిగిపోతూ ఉంటుంది. బీజం ఎంత చిన్నదిగా ఉంటుంది! మీకైతే ఏ సామాగ్రి లేదు. ఏ ధ్వనీ లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు. నోటితో అనడం కూడా వద్దు. లౌకిక తండ్రిని కూడా పిల్లలు బుద్ధితో గుర్తు చేసుకుంటారు. కూర్చొని బాబా, బాబా అనరు. ఇప్పుడు మీకు ఆత్మల తండ్రి ఎవరో తెలుసు. ఆత్మలందరూ పరస్పరం సోదరులు. ఆత్మలకు ఏ పేరూ లేదు. శరీరం పేేరు మారుతూ ఉంటుంది. ఆత్మ ఆత్మయే, వారు కూడా పరమ ఆత్ c @ ;రికి తమ శరీరం లేదు. తండ్రి చెప్తున్నారు - నాకు కూడా శరీరం ఉంటే పునర్జన్మలలోకి రావాల్సి ఉంటుంది. అప్పుడు మీకు సద్గతిని ఎవరిస్తారు? భక్తిమార్గంలో నన్ను స్మృతి చేస్తారు. అనేక చిత్రాలున్నాయి. ఇప్పుడు మీరు నరక వాసుల నుండి స్వర్గ వాసులుగా అవుతున్నారు కదా! నరకంలోనే జన్మించారు, స్వర్గం కోసం మరణిస్తారు. ఇక్కడకు మీరు వచ్చిందే స్వర్గంలోనికి వెళ్లేందుకు ఏదైనా వంతెన నిర్మించాలంటే, మొదట పునాది రాయిని వేసే ఉత్సవం చేసి వంతెన నిర్మిస్తారు కదా! స్వర్గ స్థాపన ప్రారంభోత్సవం తండ్రి చేసేశారు. ఇప్పుడు నిర్మాణం అవుతూ ఉంది. ఇల్లు కట్టేందుకు టైమ్ పడ్తుందా ఏమిటి? గవర్నమెంటువారు అనుకుంటే ఒక్క నెలలో ఇంటిని నిలబెట్టేస్తారు. విదేశాలలో అయితే తయారైన ఇళ్ళు లభిస్తాయి. స్వర్గంలో అయితే చాలా విశాల బుద్ధి కలిగి సతోప్రధానంగా ఉంటారు. సైంటిస్టుల(విజ్ఞానుల) బుద్ధి చాలా చురుకుగా ఉంటుంది. చాలా త్వరగా తయారు చేస్తూ ఉంటారు. ఇళ్ళలో రత్నాలు కూడా పొదిగి ఉంటాయి. ఈ రోజుల్లో ఇమిటేషన్(ఆర్టిఫిషియల్)వి ఎంత త్వరగా చేస్తున్నారో చూడండి. అవి నిజమైన వాటికన్నా ఎక్కువగా మెరుస్తుంటాయి. అధునాతన యంత్రాలతో త్వరగా తయారు చేసేస్తారు. అక్కడ ఇళ్ళు కట్టేందుకు ఆలస్యమవ్వదు. శుభ్రం చేసేందుకు మొదలైన వాటికి టైమ్ పడ్తుంది. బంగారు ద్వారక సముద్రం నుంచి బహిర్గతం అవుతుందని కాదు. తండ్రి అంటున్నారు - తినండి, త్రాగండి కానీ కేవలం తండ్రిని గుర్తు చేసుకుంటే వికర్మలు వినాశనం అవుతాయి. ఇక ఏ ఉపాయమూ లేదు. జన్మ-జన్మాంతరాలుగా ఈ గంగా స్నానాలు మొదలైనవి చేస్తూ వచ్చారు. కానీ ఎవ్వరూ ముక్తి-జీవన్ముక్తినైతే పొందలేదు. ఇక్కడ తండ్రి పావనంగా అయ్యే యుక్తిని తెలియజేస్తున్నారు. తండ్రి అంటున్నారు - నేనే పతిత పావనుడను. మీరు ఓ పతితపావన తండ్రీ! రండి, వచ్చి మమ్ములను పావనంగా చేయండి అని పిలిచారు. డ్రామా పూర్తయితే యాక్టర్లు(పాత్రధారులు) అందరూ స్టేజి పై ఉండాలి, క్రియేటర్(రచయిత) కూడా ఉండాలి. అందరూ నిలబడతారు కదా! ఇది కూడా అలాగే! ఆత్మలందరూ వచ్చేస్తారు, మళ్లీ వాపస్ వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడింకా మీరు రెడీగా లేరు. కర్మాతీత అవస్థయే లేకపోతే వినాశనం ఎలా అవుతుంది? తండ్రి క్రొత్త ప్రపంచం కొరకు మిమ్ములను చదివించేందుకే వస్తారు. అక్కడ కాలుడు ఉండడు. మీరు కాలుని పై విజయం పొందుతారు. ఎవరు విజయాన్ని ప్రాప్తింపజేస్తారు? మృత్యువుకే మృత్యువు(కాలునికే కాలుడు). వారు చాలామందిని వెంట తీసుకెెళ్తారు. మీరు ఖుషీగా వెళ్తారు. ఇప్పుడు తండ్రి అందరి దు:ఖాలు దూరం చేసేందుకు వచ్చారు. అందుకే వారిని ఓ గాడ్ఫాదర్! దు:ఖము నుండి ముక్తం చేయండి, శాంతిధామము, సుఖధామానికి తీసుకెళ్లండి అని మహిమ చేస్తారు. కానీ ఇప్పుడు తండ్రి స్వర్గాన్ని రచిస్తున్నారని మనుష్యులకు తెలియదు. మీరు స్వర్గానికి వెళ్తారు. అక్కడ వృక్షం చాలా చిన్నదిగా ఉంటుంది, నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఇతర ధర్మాలన్నీ ఉన్నాయి. ఒక్క ధర్మం లేదు. పేరు, రూపము, రాజ్యం మొదలైనవన్నీ మారిపోతాయి. మొదట డబుల్ కిరీటధారులు తర్వాత సింగిల్ కిరీటధారులు ఉంటారు. సోమనాథ మందిరం కట్టారు. ఎంత ధనం ఉండేది! అదే అన్నిటికంటే పెద్ద మందిరం, దానిని దోచుకొని పోయారు. తండ్రి అంటున్నారు - మీరు పదమాపదమ్ భాగ్యశాలురుగా అవుతారు. అడుగడుగునా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే పదమ్లు పోగవుతూ ఉంటాయి. తండ్రిని స్మృతి చేసినందున ఇంత సంపాదన జరుగుతుంది. మరి అటువంటి తండ్రిని స్మృతి చేయడం మీరు ఎందుకు మర్చిపోతున్నారు? ఎంతగా స్మృతి చేస్తారో, సేవ చేస్తారో అంత ఉన్నతపదవిని పొందుతారు. మంచి మంచి పిల్లలు నడుస్తూ - నడుస్తూ క్రింద పడిపోతారు. ముఖం నల్లగా చేసుకుంటే సంపాదన సమాప్తమైపోతుంది. జబర్దస్త్(గొప్ప) లాటరీని పోగొట్టుకుంటారు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. గృహస్థ వ్యవహారాలు సంభాళించుకుంటూ, బుద్ధియోగాన్ని తండ్రితో జోడించాలి. పొరపాట్లు చేయరాదు. పవిత్రతను ధారణ చేసి స్వ మరియు సర్వుల కళ్యాణం చేయాలి.
2. స్మృతి యాత్ర మరియు చదువులోనే సంపాదన ఉంది. ధ్యానము మరియు సాక్షాత్కారాలు కేవలం విహరించేందుకే. కనుక వాటి ద్వారా ఎటువంటి లాభమూ లేదు. ఎంత వీలైతే అంత మేల్కొని ఉండి, తండ్రిని స్మృతి చేసి, తమ వికర్మలు వినాశనం చేసుకోవాలి.
వరదానము :-
'' తండ్రి నుండి శక్తులు తీసుకొని ప్రతి పరిస్థితిని దాటుకునే సాక్షీద్రష్టా భవ ''
'అతి' తర్వాతనే అంతమవుతుందని పిల్లలైన మీకు తెలుసు. కనుక ఇప్పుడు అన్ని విధాల ఆందోళనలు అతిగా జరుగుతాయి. పరివారములో కూడా గొడవలు జరుగుతాయి, మనసులో కూడా అనేక చిక్కులు, సమస్యలు వస్తాయి, ధనము కూడా హెచ్చు-తగ్గులవుతుంది. కానీ ఎవరైతే తండ్రి సాథీలుగా ఉన్నారో, సత్యంగా ఉన్నారో వారి బాధ్యతంతా తండ్రిదే. ఇటువంటి అతిసమయంలో మనసు తండ్రి వైపు ఉంటే నిర్ణయ శక్తి ద్వారా అన్నీ దాటుకుంటారు. సాక్షిద్రష్టలుగా అయితే తండ్రి శక్తి ద్వారా ప్రతి పరిస్థితిని సహజంగా దాటుకుంటారు, పరిష్కరిస్తారు.
స్లోగన్ :-
'' ఇప్పుడు అన్ని ఆధారాలను (తీరాలను) వదిలి ఇంటికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోండి. ''