09-04-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - మీరు సతోప్రధానంగా అయ్యేందుకు తండ్రిని ప్రీతిగా స్మృతి చేయండి. పారసనాథుడైన శివబాబా మిమ్ములను పారసపురికి అధికారులుగా తయారు చేసేందుకు వచ్చారు ''
ప్రశ్న :-
పిల్లలైన మీరు ఏ ఒక్క విషయాన్ని ధారణ చేస్తే మహిమా యోగ్యులుగా అవుతారు?
జవాబు :-
చాలా చాలా నిర్మానచిత్తులుగా అవ్వండి. ఏ విషయములోనూ అహంకారము ఉండరాదు, చాలా మధురంగా తయారవ్వాలి. అహంకారము వస్తే శత్రువులు తయారవుతారు. శ్రేష్ఠంగా లేక నీచంగా, పవిత్రత ఆధారముతోనే అవుతారు. పవిత్రంగా ఉన్నప్పుడు గౌరవముంటుంది. అపవిత్ర్రంగా అయితే అందరికీ తల వంచి నమస్కరిస్తారు.
ఓంశాంతి.
ఆత్మిక తండ్రి కూర్చుని పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. నేను ఈ పిల్లలకు అర్థం చేయిస్తున్నానని తండ్రి కూడా భావిస్తారు. భక్తిమార్గములో భిన్న-భిన్న నామాలతో అనేకానేక చిత్రాలను తయారు చేస్తారని పిల్లలకు అర్థం చేయించబడింది. ఉదాహరణానికి నేపాలులో పారసనాథుని గౌరవిస్తారు. అక్కడ వారిది చాలా పెద్ద మందిరముంది. కాని అందులో ఏమీ లేదు. 4 ద్వారాలున్నాయి, 4 మూర్తులున్నాయి. నాల్గవదానిలో కృష్ణుని మూర్తిని ఉంచారు. ఇప్పుడేమైనా కొద్దిగా మార్పులు జరిగి ఉండవచ్చు. ఇప్పుడు పారసనాథుడని తప్పకుండా శివబాబానే అంటారు. మనుష్యులను వారే పారసబుద్ధి గలవారిగా చేస్తారు. కావున మొట్టమొదట వారికి అత్యంత ఉన్నతమైనవారు భగవంతుడని, వారి తర్వాతనే పూర్తి ప్రపంచమని వారికి అర్థం చేయించాలి. సూక్ష్మ వతనములో సృష్టే లేదు. తర్వాత లక్ష్మీనారాయణులు అంటే విష్ణువు వస్తారు. వాస్తవానికి విష్ణు మందిరము కూడా తప్పే. విష్ణువు చతుర్భుజుడు. నాలుగు భుజములు గల మనుష్యులెవరూ ఉండరు. తండ్రి తెలియచేస్తున్నారు - వీరు లక్ష్మీనారాయణులు. ఇద్దరినీ కలిపి విష్ణువుగా చూపించారు. లక్ష్మీనారాయణులు ఇద్దరూ వేరు వేరు. సూక్ష్మవతనములో విష్ణువుకు నాలుగు భుజాలు ఇచ్చేశారు. అంటే ఇద్దరినీ కలిపి చతుర్భుజునిగా చేసేశారు. కానీ అలాంటి మనిషి ఎవ్వరూ ఉండరు. మందిరాలలో చూపించే చతుర్భుజ విష్ణువు సూక్ష్మవతనవాసులు. చతుర్భుజములో శంఖు, చక్రము, గద, పద్మము మొదలైనవి ఇస్తారు. అలాంటిదేమీ లేదు. చక్రము కూడా పిల్లలైన మీదే. నేపాలులో విష్ణువు యొక్క చాలా పెద్ద చిత్రాన్ని క్షీరసాగరములో చూపిస్తారు. పూజా రోజులలో కొద్దిగా పాలు వేస్తారు. తండ్రి ఒక్కొక్క విషయాన్ని బాగా అర్థము చేయిస్తారు. ఈ విధంగా విష్ణువు అర్థమును ఎవ్వరూ అర్థం చేయించలేరు. తెలియనే తెలియదు. ఇక్కడ భగవంతుడే స్వయంగా అర్థం చేయిస్తున్నారు. శివబాబానే భగవంతుడని అంటారు. ఉన్నది ఒక్కరే. కానీ భక్తిమార్గములోని వారు అనేక పేర్లు పెట్టేశారు. ఇప్పుడు మీరు అనేక పేర్లు తీసుకోరు. భక్తిమార్గములో చాలా దెబ్బలు తింటారు. మీరు కూడా తిన్నారు. ఇప్పుడు మీరు మందిరాలు మొదలైనవి చూసినప్పుడు - అత్యంత ఉన్నతమైనవారు భగవంతుడు, పరమ ఆత్మ, నిరాకార పరమపిత పరమాత్మ అని అర్థం చేయిస్తారు. ఆత్మ శరీరము ద్వారా చెప్తుంది - ''ఓ పరమపిత'' అని అంటుంది. తర్వాత వారిని జ్ఞానసాగరులు, సుఖసాగరులు అని మహిమ చేస్తారు. భక్తిమార్గములో ఒక్కరికే అనేక చిత్రాలున్నాయి. జ్ఞానమార్గములో అయితే జ్ఞానసాగరులు ఒక్కరే. వారే పతితపావనులు, సర్వుల సద్గతిదాత. మీ బుద్ధిలో పూర్తి చక్రమంతా ఉంది. శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన పరమాత్మ అని వారి కొరకే మహిమ ఉంది. స్మరణ చేసి చేసి సుఖమును పొందండి. అంటే ఒక్క తండ్రినే స్మృతి చేస్తూ ఉండండి. అంటే స్మరిస్తూ ఉంటే శారీరిక కలహ-క్లేశాలన్నీ తొలగిపోతాయి. తర్వాత జీవన్ముక్తి పదవిని పొందుకోండి. ఇది జీవన్ముక్తి కదా. తండ్రి ద్వారా ఈ సుఖ వారసత్వము లభిస్తుంది. ఇతడు(బ్రహ్మ) ఒక్కడే పొందుకోడు. రాజధాని తప్పకుండా ఉంటుంది కదా. అంటే తండ్రి రాజధానిని స్థాపన చేస్తున్నారు. సత్యయుగములో రాజు, రాణి, ప్రజలు అందరూ ఉంటారు. మీరు జ్ఞానమును ప్రాప్తి చేసుకుంటున్నారు. కనుక మీరే వెళ్లి గొప్ప కులములో జన్మ తీసుకుంటారు. చాలా సుఖము లభిస్తుంది. రాజధాని స్థాపనైనప్పుడు ఛీ-ఛీ ఆత్మలన్నీ శిక్షలు అనుభవించి వాపస్ వెళ్లిపోతాయి. తమ-తమ విభాగాలలోకి వెళ్లి కూర్చుంటాయి. ఇప్పుడున్న ఆత్మలన్నీ వస్తాయి. తర్వాత వృద్ధి చెందుతూ ఉంటుంది. పై నుండి ఎలా వస్తారో బుద్ధిలో ఉండాలి. రెండు ఆకులకు బదులుగా 10 ఆకులు ఒక్కసారిగా వస్తాయని కాదు. అలా జరగదు. నియమానుసారంగా ఆకులు వెలువడ్తాయి. ఇది చాలా పెద్ద వృక్షము. ఒక్క రోజులో లక్షల మంది వృద్ధి అయినారని (జన్మించారని) చూపిస్తారు. మొదట శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు భగవంతుడు. పతితపావనులు, దు:ఖహర్త - సుఖకర్త కూడా వారే అని అర్థం చేయించాలి. వారు వచ్చి దు:ఖములో ఉన్న పాత్రధారులంతా సుఖమునిస్తారు. దు:ఖమిచ్చువాడు రావణుడు. తండ్రి వచ్చి ఉన్నారని, వారిని తెలుసుకోవాలని మనుష్యులకు తెలియదు. స్నానము చేస్తూ చేస్తూ నీటిలో జారిపడినట్లు చాలా మంది పిల్లలు వింటూ - వింటూ జారిపోతారు. బాబాకు అనుభవముంది కదా. ఇది విషయసాగరము. బాబా మిమ్ములను క్షీరసాగరము వైపుకు తీసుకెళ్తారు. కానీ మాయ రూపి మొసలి మంచి మంచి మహారథులను కూడా మింగేస్తుంది. జీవించి ఉండి కూడా తండ్రి ఒడి నుండి మరణించి రావణుని ఒడిలోనికి వెళ్లిపోతారు. అంటే చనిపోతారు. శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన తండ్రి మళ్లీ రచనను రచిస్తారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. సూక్ష్మవతనము గురించి చరిత్ర-భూగోళాలు లేవు. భలే మీరు సూక్ష్మవతనములోకి వెళ్ళి సాక్షాత్కారము చేసుకుంటారు. అక్కడ చతుర్భుజుని చూస్తారు. చిత్రాలలో ఉంది కదా. అది బుద్ధిలో కూర్చుని ఉంటే తప్పకుండా సాక్షాత్కారమౌతుంది. కానీ అటువంటి వస్తువేదీ లేదు. ఇవి భక్తిమార్గములోని చిత్రాలు. ఇప్పటివరకు భక్తిమార్గము నడుస్తూ ఉంది. భక్తిమార్గము పూర్తి అయిన తర్వాత ఈ చిత్రాలే ఉండవు. స్వర్గములో ఈ విషయాలన్నీ మర్చిపోతారు. ఈ లక్ష్మీనారాయణులు చతుర్భుజుని రెండు రూపాలని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. లక్ష్మీనారాయణుల పూజ అంటే చతుర్భుజుని పూజ. లక్ష్మీనారాయణుల మందిరమన్నా, చతుర్భుజుని మందిరమన్నా విషయము ఒక్కటే. ఈ ఇరువురి జ్ఞానము ఇంకెవ్వరిలోనూ లేదు. లక్ష్మీనారాయణుల రాజ్యమంటారే కానీ విష్ణు రాజ్యమని అనరు. వీరు పాలన కూడా చేస్తారు. మొత్తం విశ్వానికంతా అధికారులైనందున విశ్వపాలన చేస్తారు.
శివభగవానువాచ - నేను మీకు రాజయోగము నేర్పిస్తున్నాను. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే ఈ యోగాగ్ని ద్వారా వికర్మలు వినాశమవుతాయి. విపులంగా అర్థం చేయించవలసి వస్తుంది. గీత కూడా ఇదే అని చెప్పండి. కేవలము గీతలో కృష్ణుని పేరు వేసేశారు. ఇది కూడా తప్పే. అందరి గ్లాని చేశారు కనుక భారతదేశము తమోప్రధానమైపోయింది. ఇప్పుడు కలియుగ ప్రపంచము అంతమయ్యే సమయము. దీనిని తమోప్రధాన ఇనుప యుగమని అంటారు. సతోప్రధానంగా ఉన్నవారే 84 జన్మలు తీసుకున్నారు. జనన-మరణాలలో తప్పకుండా రావాల్సిందే. పూర్తి 84 జన్మలు తీసుకున్న తర్వాత బాబా మళ్లీ మొదటి నెంబరులో రావలసి వస్తుంది. ఒక్కరి విషయము కాదు. పూర్తి రాజధాని అంతా వీరిదే ఉండేది కదా. మళ్లీ తప్పకుండా అవుతుంది. తండ్రి అందరికి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే యోగాగ్ని ద్వారా పాపాలన్నీ తొలగిపోతాయి. కామచితి పై కూర్చుని అందరూ నల్లగా(అపవిత్రంగా) అయిపోయారు. ఇప్పుడు నల్లగా ఉన్నవారు సుందరంగా (పవిత్రంగా) ఎలా అవ్వాలి? అది తండ్రే నేర్పిస్తారు. కృష్ణుని ఆత్మ తప్పకుండా భిన్న భిన్న నామ-రూపాలను తీసుకుని వస్తూ ఉంటుంది. లక్ష్మీనారాయణులే 84 జన్మల తర్వాత మళ్లీ అలా అవ్వాలి. కావున వారి అనేక జన్మల అంతములో తండ్రి వచ్చి ప్రవేశిస్తారు. మళ్లీ వారే సతోప్రధాన విశ్వానికి యజమానులుగా అవుతారు. మీరు పారసనాథుని కూడా పూజిస్తారు, శివుని కూడా పూజిస్తారు. తప్పకుండా శివుడే వారిని ఇటువంటి పారసనాథునిగా తయారు చేసి ఉంటారు. టీచరు కావాలి కదా. వారు జ్ఞానసాగరులు. ఇప్పుడు సతోప్రధాన పారసనాథులుగా అవ్వాలంటే తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేయండి. వారే అందరి దు:ఖమును హరించువారు. తండ్రి సుఖమునిచ్చేవారు. ఇది ముళ్ల అడవి. తండ్రి పుష్పాల ఉద్యానవనాన్ని తయారు చేసేందుకు వచ్చారు. తండ్రి తన పరిచయమునిస్తున్నారు. నేను ఈ సాధారణ వృద్ధ మానవుని తనువులో ప్రవేశిస్తాను. ఇతనికి తన జన్మల గురించి తెలియదు. భగవానువాచ - నేను మీకు రాజయోగమును నేర్పిస్తాను. కనుక ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. రాజా - రాణులుగా అవ్వడమే ముఖ్య లక్ష్యమైనప్పుడు తప్పకుండా ప్రజలు కూడా తయారవుతారు. మనుష్యులు యోగము-యోగము అని చాలా అంటారు. నివృత్తి మార్గము వారైతే అనేక హఠయోగాలు చేస్తారు. వారు రాజయోగమును నేర్పించలేరు. తండ్రిది ఒకే విధమైన యోగము. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయమని చెప్తారు. 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. కనుక ఇప్పుడు పావనంగా అవ్వాలి. ఒక్క తండ్రినే స్మృతి చేయండి. మిగిలిన అందరినీ వదిలేయండి. భక్తిమార్గములో మీరు వస్తే మీతోనే బుద్ధియోగాన్ని జోడిస్తామని పాడుతూ ఉండేవారు అనగా వారి నుండి తప్పకుండా ఆస్తి లభించి ఉంటుంది కదా. అర్ధకల్పము స్వర్గము, తర్వాత నరకము. రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. ఇలా ఇలా అర్థము చేయించాలి. స్వయాన్ని దేహమని భావించకండి. ఆత్మ అవినాశి. ఆత్మలోనే పాత్రంతా నిండి ఉంది. దానినే మీరు అభినయిస్తున్నారు. ఇప్పుడు శివబాబాను స్మృతి చేస్తే నావ తీరానికి చేరిపోతుంది. సన్యాసులు పవిత్రంగా అవుతారు కనుక వారికి ఎంతో గౌరవముంటుంది. వారికి అందరూ తల వంచుతారు. పవిత్రత ఆధారము పైననే శ్రేష్ఠంగా, నీచంగా అవుతారు. దేవతలు సంపూర్ణ శ్రేష్ఠులు. సన్యాసులు ఒక్క జన్మలో పవిత్రంగా అవుతారు. మరుసటి జన్మ మళ్లీ వికారాలతోనే తీసుకుంటారు. దేవతలు సత్యయుగములో ఉంటారు. ఇప్పుడు మీరు చదువుకొని చదివిస్తారు కూడా. కొందరు చదువుతారు కానీ ఇతరులకు అర్థం చేయించలేరు. ఎందుకంటే ధారణ కాదు. అదృష్టములో లేకుంటే నేనేమి చేయగలనని తండ్రి అంటారు. తండ్రి అందరికీ కూర్చుని ఆశీర్వాదాలిస్తే అందరూ స్కాలర్షిప్ తీసుకుంటారు. వారు భక్తిమార్గములో ఆశీర్వదిస్తారు. సన్యాసులు కూడా అలాగే చేస్తారు. వారి వద్దకు వెళ్ళి నన్ను ఆశీర్వదించండి, సంతానము ప్రసాదించండి అని కోరుతారు. మంచిది. నీకు మగబిడ్డ పుడతాడు, ఆడబిడ్డ పుడితే డ్రామా అని అంటారు. మగబిడ్డ పుడితే వాహ్ - వాహ్ అని వారి చరణాల పై పడ్తారు. ఒకవేళ ఆ బిడ్డ మరణిస్తే ఏడుస్తారు, అరుస్తారు. ఆ గురువును నిందించడము మొదలుపెడ్తారు. గురువులు ఇది డ్రామా అని చెప్తారు. మొదటే ఎందుకు చెప్పలేదని అడుగుతారు. ఎవరైనా మరణించినవారిని బ్రతికిస్తే దానికి కూడా డ్రామా అనే చెప్పాలి. అది కూడా డ్రామాలో రచింపబడింది. ఆత్మ ఎక్కడో దాక్కునేస్తుంది. డాక్టర్లు కూడా మరణించారని భావిస్తారు. తిరిగి బ్రతుకుతారు. చితి పైన ఉన్నవారు కూడా లేచి కూర్చుంటారు. ఒకరు ఎవరినైనా నమ్మితే వారి వెనుక ఎంతోమంది వచ్చేస్తారు.
పిల్లలైన మీరు చాలా నిర్మానచిత్తులై నడవాలి. కొద్దిగా కూడా అహంకారము ఉండరాదు. కొద్దిగా అహంకారము చూపించినా శతృత్వము పెరుగుతుంది. చాలా మధురంగా ఉండి నడచుకోవాలి. నేపాలులో కూడా ప్రసిద్ధమవుతుంది. ఇప్పుడింకా పిల్లల మహిమా సమయము రాలేదు. లేకుంటే వారి (సన్యాసుల) స్థావరాలన్నీ ఎగిరిపోతాయి. పెద్ద పెద్దవారు మేలుకొని పెద్ద పెద్ద సభలలో చెప్తే వారి వెనుకల అనేకమంది వచ్చేస్తారు. ఎవరైనా ఎం.పి. కూర్చుని భారతదేశపు రాజయోగాన్ని బ్రహ్మకుమార - కుమారీలు తప్ప ఇతరులెవ్వరూ నేర్పించలేరని మహిమ చేయాలి. కానీ ఇటువంటివారు ఇంకా వెలువడలేదు. పిల్లలు చాలా తెలివైనవారిగా, చమత్కారవంతులుగా అవ్వాలి. ఎవరెవరు ఎలా ఉపన్యసిస్తారో నేర్చుకోవాలి. సర్వీసు చేసేందుకు యుక్తి బాబా నేర్పిస్తున్నారు. బాబా ఏ మురళిని నడిపించారో, కల్ప-కల్పము ఖచ్చితంగా అలాగే నడిపించి ఉంటారు. డ్రామాలో రచింపబడి ఉంది. అలా ఎందుకు? అని ప్రశ్న రాకూడదు. డ్రామానుసారము ఏమి అర్థం చేయించాలో అది అర్థము చేయించారు. అదే అర్థం చేయిస్తూ ఉంటాను. మనుష్యులు అనేక ప్రశ్నలు అడుగుతారు. మొదట 'మన్మనాభవ' గా అయిపోండి అని వారికి చెప్పండి. తండ్రిని తెలుసుకోవడము వలన మీరు అంతా తెలుసుకుంటారు. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. సర్వీసు చేసే యుక్తులు నేర్చుకొని చాలా చాలా తెలివైనవారిగా, చమత్కారులుగా తయారవ్వాలి. ధారణ చేసిన తర్వాత ఇతరుల ద్వారా ధారణ చేయించాలి. చదువు ద్వారా తమ అదృష్టాన్ని తామే తయారు చేసుకోవాలి.
2. ఏ విషయములోనూ కొద్దిగా కూడా అహంకారము చూపించరాదు. చాలా చాలా మధురంగా మరియు నిర్మానచిత్తులుగా(నిరహంకారులుగా) అవ్వాలి. మాయ రూపి మొసలి నుండి మిమ్ములను మీరు చాలా సంభాళించుకోవాలి.
వరదానము :-
''సమయానుసారం ప్రతి కార్యములో సఫలమయ్యే జ్ఞానీ యోగీ ఆత్మా భవ ''
జ్ఞానమనగా తెలివి. ఎవరైతే సమాయానుసారము వివేకముతో పనులు చేస్తూ సఫలతను ప్రాప్తి చేసుకుంటారో వారిని తెలివి గలవారని అంటారు. తెలివి గలవారి గుర్తు ఏమంటే వారెప్పుడూ మోసపోరు. యోగుల గుర్తు ఏమంటే వారి బుద్ధి క్లీన్గా(పవిత్రంగా), క్లియర్గా(స్పష్టంగా) ఉంటుంది. ఎవరి బుద్ధి అయితే క్లీన్గా, క్లియర్గా ఉంటుందో వారెప్పుడూ ఇలా ఎందుకు జరిగిందో తెలియదని అనరు. ఈ మాటలు జ్ఞానీ యోగీ ఆత్మలెప్పుడూ అనలేరు. వారు ప్రతి కర్మలో జ్ఞానయోగాలను తీసుకొస్తారు.
స్లోగన్ :-
''ఎవరైతే తమ ఆది - అనాది సంస్కార స్వభావాలను స్మృతిలో ఉంచుకుంటారో వారే అచల్-అడోల్గా (చలించక, స్థిరంగా) ఉంటారు. ''