18-07-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - శాంతిధామము పావన ఆత్మల ఇల్లు. కనుక ఆ ఇంటికి వెళ్లాలంటే సంపూర్ణ పావనంగా అవ్వండి ''

ప్రశ్న :-

తండ్రి పిల్లలందరికీ ఏ గ్యారంటీ ఇస్తున్నారు?

జవాబు :-

మధురమైన పిల్లలారా! మీరు నన్ను స్మృతి చేస్తే మీరు శిక్షలు అనుభవించకుండా నా ఇంటికి వస్తారని నేను గ్యారంటీ ఇస్తున్నాను. మీరు ఒక్క తండ్రితోనే మనసును జోడించండి. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకండి. ఈ ప్రపంచములో ఉంటూ పవిత్రంగా అయ్యి చూపించండి. అప్పుడు బాబా మీకు విశ్వరాజ్యమును తప్పకుండా ఇస్తారు.

ఓంశాంతి.

ఆత్మిక పిల్లలను ఆత్మిక తండ్రి అడుగుతున్నారు - '' పిల్లలైన మిమ్ములను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చానని మీకు తెలుసా? ఇప్పుడు ఇంటికి రావాలని మీకు అనిపిస్తోందా? అది సర్వాత్మల ఇల్లు. ఇక్కడ జీవాత్మలందరికీ ఒకే ఇల్లు ఉండదు. మీరు తండ్రి వచ్చారని తెలుసుకున్నారు. మిమ్ములను ఇంటికి అనగా శాంతిధామానికి తీసుకెళ్లమని మీరు తండ్రిని ఆహ్వానించారు. హే ఆత్మలారా! పతితులైన మీరు ఎలా వెళ్లగలరో మీ మనస్సును మీరు ప్రశ్నించుకోండి అని తండ్రి చెప్తున్నారు. పావనంగా అయితే తప్పకుండా అవ్వాలి. ఇప్పుడు ఇంటికి వెళ్లాలని తప్ప మరేమీ చెప్పరు. భక్తిమార్గములో మీరు ఇంత సమయము పురుషార్థము ఎందుకు చేశారు? ముక్తి కొరకు. అందువలన ఇంటికి వెళ్లాలనే ఆలోచన ఉందా? అని తండ్రి అడుగుతున్నారు. బాబా దీని కొరకే ఇంత భక్తి చేశామని పిల్లలు అంటారు. జీవాత్మలందరినీ తీసుకెళ్లాలని మీకు తెలుసు. కానీ పవిత్రంగా అయ్యి ఇంటికి వెళ్లాలి తర్వాత మళ్లీ పవిత్ర ఆత్మలే మొట్టమొదట వస్తారు. అపవిత్ర ఆత్మలైతే ఇంట్లో ఉండలేరు. ఇప్పుడున్న కోట్ల కొలది ఆత్మలందరూ తప్పకుండా ఇంటికి వెళ్లాలి. ఆ ఇంటిని శాంతిధామము లేక వానప్రస్థము అని అంటారు. ఆత్మలైన మనమంతా పావనమై, పావన శాంతిధామానికి వెళ్లాలి. అంతే. ఎంత సహజమైన విషయము. అది ఆత్మలు నివసించే పావనమైన శాంతిధామము. అది (సత్యయుగము) జీవాత్మల పావన సుఖధామము. ఇది జీవాత్మల పతిత దు:ఖధామము. ఇందులో తికమక పడే విషయమే లేదు. శాంతిధామములో పవిత్ర ఆత్మలందరూ నివసిస్తారు. అది ఆత్మల పవిత్ర ప్రపంచము - నిర్వికారి, నిరాకారి ప్రపంచము. ఇది జీవాత్మలందరి పాత ప్రపంచము. అందరూ పతితులుగా ఉన్నారు. ఇప్పుడు ఆత్మలందరినీ పావనంగా తయారు చేసి, పావన ప్రపంచమైన శాంతిధామానికి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. మళ్లీ ఎవరైతే రాజయోగము నేర్చుకుంటారో వారే పావన సుఖధామములోకి వస్తారు. ఇది చాలా సులభము. ఇందులో ఏ విషయము గురించి ఆలోచించరాదు. ఆత్మలైన మనలను పావన శాంతిధామానికి తీసుకెళ్లేందుకు ఆత్మల తండ్రి వచ్చారని బుద్ధి ద్వారా అర్థము చేసుకోవాలి. అక్కడికి వెళ్ళే మార్గమును ఏదైతే మనము మరచిపోయాయో దానిని ఇప్పుడు తండ్రి తెలిపించారు. కల్ప-కల్పము నేను ఇలాగే వచ్చి - '' హే పిల్లలారా! శివబాబా అయిన నన్ను స్మృతి చేయండి'' అని చెప్తాను. సర్వుల సద్గతిదాత సద్గురువు ఒక్కరే. వారే వచ్చి పిల్లలైన మీరిప్పుడు ఏమి చేయాలో సందేశము లేక శ్రీమతమును ఇస్తారు. అర్ధకల్పము మీరు చాలా భక్తి చేశారు. దు:ఖము అనుభవించాారు. ఖర్చు చేస్తూ చేస్తూ నిరుపేదలుగా అయిపోయారు. ఆత్మ కూడా సతోప్రధానము నుండి తమోప్రధానంగా అయిపోయింది. ఈ చిన్న విషయము అర్థము చేసుకుంటే చాలు. ఇప్పుడు ఇంటికి వెళ్లాలా లేక వద్దా? అవును బాబా, తప్పకుండా వెళ్లాలి. అది మన మధురమైన నిశ్శబ్ధమైన ఇల్లు. మేమిప్పుడు తప్పకుండా పతితులుగా ఉన్నాము, కాబట్టి వెళ్లలేమని కూడా మీరు అర్థము చేసుకున్నారు. నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమవుతాయని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. కల్ప-కల్పము నేను ఇదే సందేశమును ఇస్తాను. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ దేహమైతే సమాప్తమైపోతుంది. ఇక ఆత్మలందరూ వాపస్‌ వెళ్లాలి. దానిని నిరాకారి ప్రపంచమని అంటారు. నిరాకార ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి. అది ఆత్మల ఇల్లు. నిరాకార తండ్రి కూడా అక్కడే ఉంటారు. అందరికంటే చివరిగా తండ్రి వస్తారు. ఎందుకంటే అందరినీ మళ్లీ వాపసు తీసుకెళ్లాలి. ఒక్క పతిత ఆత్మ కూడా ఉండరు. ఇందులో తికమక పడే లేక కష్టపడే విషయమేదీ లేదు. హే పతిత పావనా! వచ్చి మమ్ములను పావనంగా చేసి మీతో పాటు తీసుకెళ్ళండని కూడా పాడ్తారు. వారు అందరి తండ్రి కదా. తర్వాత మళ్లీ మనము కొత్త ప్రపంచములోకి పాత్ర చేసేందుకు వచ్చినప్పుడు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. మిగిలిన కోట్ల కొలది ఆత్మలన్నీ వెళ్లి ఎక్కడ ఉంటారు? సత్యయుగములో కొద్దిమంది జీవాత్మలు ఉండేవారని, చిన్న వృక్షముగా ఉండి, తర్వాత వృద్ధి చెందిందని కూడా మీకు తెలుసు. వృక్షములో అనేక వెరైటీ ధర్మాలున్నాయి. దానినే కల్పవృక్షమని అంటారు. ఏదైనా అర్థము కాకుంటే మీరు అడగవచ్చు. ''బాబా, కల్పము ఆయువు 5 వేల సంవత్సరాలని మేమెలా ఒప్పుకునేది? అని చాలామంది అడుగుతారు. అరే! తండ్రి సత్యమునే చెప్తారు. చక్రము లెక్కను గురించి కూడా తెలిపించారు.
కల్పము యొక్క సంగమ యుగములోనే తండ్రి వచ్చి దైవీ రాజధానిని స్థాపన చేస్తారు. అది ఇప్పుడు లేదు. సత్యయుగములో మళ్లీ ఒకే దైవీ రాజధాని ఉంటుంది. ఇప్పుడు మీకు రచయిత మరియు రచన గురించిన జ్ఞానమును వినిపిస్తారు. తండ్రి చెప్తున్నారు - నేను కల్ప-కల్పము కల్పము యొక్క సంగమ యుగములో వస్తాను. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తాను. పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. డ్రామా ప్లాన్‌ అనుసారము కొత్త నుండి పాతగా, పాత నుండి కొత్తగా అవుతుంది. కల్పములో పూర్తి 4 భాగాలు ఉన్నాయి. దీనిని స్వస్తిక్‌ అని కూడా అంటారు. కానీ వారు కొద్దిగా కూడా అర్థము చేసుకోరు. భక్తిమార్గములో అయితే బొమ్మలాటలు ఆడినట్లు ఆడుతూ ఉంటారు. అనేక చిత్రాలున్నాయి. దీపావళి పండుగకు ప్రత్యేక దుకాణాలు తెరుస్తారు. అనేక చిత్రాలున్నాయి. శివబాబా ఒక్కరేనని మనమంతా వారి పిల్లలమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మళ్లీ ఇక్కడకు వస్తే లక్ష్మీనారాయణుల రాజ్యము, తర్వాత సీతా-రాముల రాజ్యము, ఆ తర్వాత ఇతర ధర్మాలవారు వస్తారు. వారితో మీకు సంబంధమే ఉండదు. వారు వారి సమయానుసారంగా వస్తారు. తర్వాత అందరూ వాపసు వెళ్లాలి. పిల్లలైన మీరు కూడా ఇప్పుడు ఇంటికి వెళ్లాలి. ఈ ప్రపంచమంతా వినాశనమవ్వనున్నది. ఇప్పుడు ఇందులో ఉండేదేముంది? ఈ ప్రపంచము పై మనసే ఉండదు. ఒక్క ప్రియునితోనే మనసు లగ్నమవ్వాలి. నా ఒక్కరితోనే మీ మనసు లగ్నము చేస్తే మీరు పావనంగా అవుతారని వారు చెప్తున్నారు. ఇప్పుడు చాలా సమయము గడిచిపోయింది. కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది. సమయము గడిచిపోతూ ఉంటుంది. యోగము చేయకపోతే అంతిమ సమయములో వారు చాలా పశ్చాత్తాపపడ్తారు. శిక్షలు అనుభవిస్తారు. పదవి కూడా భ్రష్ఠమైపోతుంది. మన ఇంటిని వదిలి ఎంత కాలమయ్యిందో మీకిప్పుడు తెలిసింది. ఇంటికి వెళ్లాలనే కదా కష్టపడ్తూ ఉంటారు. తండ్రి కూడా ఇంటిలోనే లభిస్తారు. సత్యయుగములో అయితే లభించరు. ముక్తిధామములోకి వెళ్లేందుకు మనుష్యులు ఎంత కష్టపడ్తారు! దానిని భక్తిమార్గమని అంటారు. డ్రామానుసారము ఇప్పుడు భక్తిమార్గము సమాప్తమవుతుంది. నేనిప్పుడు మిమ్ములను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చాను. తప్పకుండా తీసుకెళ్తాను. ఎవరెంత పావనంగా అవుతారో అంత ఉన్నత పదవిని పొందుతారు. ఇందులో తికమక పడే విషయమే లేదు. తండ్రి చెప్తున్నారు -పిల్లలారా! మీరు నన్ను స్మృతి చేస్తే శిక్షలు అనుభవించకుండా మిమ్ములను ఇంటికి తీసుకెళ్తానని గ్యారెంటీ ఇస్తున్నారు. స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి. ఒకవేళ స్మృతి చేయకపోతే శిక్షలు అనుభవించవలసి వస్తుంది. పదవి కూడా భ్రష్ఠమైపోతుంది. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత నేను వచ్చి ఇదే అర్థం చేయిస్తాను. నేను మిమ్ములను వాపసు తీసుకెళ్లేందుకు అనేకసార్లు వచ్చాను. గెలుపు-ఓటముల పాత్రను పిల్లలైన మీరే అభినయిస్తారు. మళ్లీ తీసుకెళ్లేందుకు నేను వస్తాను. ఇది పతిత ప్రపంచము. అందరూ ''పతితపావనా! రండి, మేము వికారీ పతితులము, మీరు వచ్చి నిర్వికారి పావనులుగా చేయండి'' అని పాడ్తారు. ఇది వికారి ప్రపంచము. పిల్లలైన మీరిప్పుడు సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. వెనుక వచ్చేవారు శిక్షలు అనుభవించి వెళ్తారు. అందువలన వారు వచ్చేది కూడా రెండు కళలు తగ్గిన ప్రపంచములోకి వస్తారు. వారిని సంపూర్ణ పవిత్రులు అని అనరు. అందువలన ఇప్పుడు పురుషార్థము కూడా పూర్తిగా చేయాలి. తక్కువ పదవి పొందే విధంగా ఉండరాదు. భలే రావణ రాజ్యము లేకున్నా పదవి అయితే నెంబరువారుగా ఉంటుంది కదా. ఆత్మలో మలినము ఏర్పడితే వారికి శరీరము కూడా అటువంటిదే లభిస్తుంది. ఆత్మ బంగారు యుగము నుండి వెండి యుగముగా అయిపోతుంది. ఆత్మలో వెండి మలినముగా ఏర్పడ్తుంది. మళ్లీ రోజురోజుకు ఛీ - ఛీ మలినము మిశ్రమంగా ఏర్పడ్తుంది. తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తున్నారు. ఎవరికైనా అర్థము కాకుంటే వారు చేతులెత్తండి. 84 జన్మల చక్రములో తిరిగిన వారికే అర్థం చేయిస్తాను. ఇతని 84 జన్మలలో చివరి జన్మలో నేను వచ్చి ప్రవేశిస్తానని తండ్రి చెప్తున్నారు. మళ్లీ ఇతడే మొదటి నంబరులోకి రావాలి. ఎవరు ముందు ఉండినారో వారు చివర్లో ఉన్నారు. వారే మొదటి నెంబరులో వెళ్లాలి. ఎవరైతే అనేక జన్మల అంత్యములో పతితమైపోయారో వారి శరీరములో పతితపావనుడైన నేను వస్తాను. అతడిని పావనంగా చేస్తాను. ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తాను!
తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు భస్మమైపోతాయి. గీతా జ్ఞానాన్ని మీరు చాలా విన్నారు, వినిపించారు. కానీ దాని ద్వారా కూడా మీరు సద్గతి పొందలేదు. చాలామంది సన్యాసులు శాస్త్రాలను చాలా మధురంగా మీకు వినిపించారు. ఆ మాటలు విని గొప్ప గొప్ప వ్యక్తులు వెళ్ళి గుమిగూడుతారు. అది కర్ణ రసము(చెవులకు ఇంపుగా ఉండేది) కదా. భక్తిమార్గమంటేనే కర్ణ రసము. ఇక్కడైతే ఆత్మ తండ్రిని స్మృతి చేయాలి. భక్తిమార్గమిప్పుడు పూర్తి అవుతుంది. ఎవ్వరికీ తెలియని జ్ఞానాన్ని నేను మీకిప్పుడు ఇచ్చేందుకు వచ్చాను. నేనే జ్ఞానసాగరుడను. చదువును జ్ఞానము అని అంటారు. మీకు అన్నీ చదివిస్తాను. 84 జన్మల చక్రము కూడా అర్థం చేయిస్తాను. మీలో జ్ఞానమంతా ఉంది. స్థూలవతనము నుండి సూక్ష్మవతనము దాటుకుని తర్వాత మూలవతనానికి వెళ్తారు. మొట్టమొదట లక్ష్మీనారాయణుల వంశము ఉంటుంది. అక్కడ వికారీ పిల్లలు ఉండరు. రావణ రాజ్యమే ఉండదు. అంతా యోగబలము ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు చినన్న బిడ్డగా అయ్యి గర్భమహలులోకి వెళ్లాలని మీకు సాక్షత్కారమవుతుంది, సంతోషంగా వెళ్తారు. ఇక్కడైతే మనుష్యులు ఎంతగానో ఏడుస్తూ, అరుస్తూ ఉంటారు. ఇక్కడైతే గర్భజైలులోకి వెళ్తారు కదా. అక్కడ ఏడ్వడం, బాదుకోవడం ఏమీ ఉండవు. కానీ శరీరమైతే తప్పకుండా మార్చాలి. సర్పము ఉదాహరణ ఉంది కదా. ఇందులో తికమక పడే విషయమే లేదు. ఎక్కువగా అడిగే అవసరము లేదు. పూర్తిగా పావనమయ్యే పురుషార్థములో లగ్నమవ్వాలి. తండ్రిని స్మృతి చేయడం కష్టమనిపిస్తుందా? తండ్రికి ఎదురుగా కూర్చున్నారు కదా. మీ తండ్రినైన నేను మీకు సుఖ వారసత్వాన్ని ఇస్తాను. ఈ అంతిమ జన్మలో మీరు స్మృతిలో ఉండలేరా! ఇక్కడ బాగా అర్థము కూడా చేసుకుంటారు. ఇంటికి వెళ్తూనే మీ పత్ని మొదలైన వారిని చూస్తూనే మాయ తినేస్తుంది. ఎవరి పైనా మమకారాన్ని ఉంచుకోకండి. అదంతా సమాప్తమవ్వాల్సిందే. తండ్రి ఒక్కరినే స్మృతి చేయాలి. నడుస్తూ - తిరుగుతూ తండ్రిని, మీ రాజధానిని స్మృతి చేయండి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. సత్యయుగములో ఈ మురికి వస్తువులైన మాంసము మొదలైనవి ఉండనే ఉండవు. తండ్రి చెప్తున్నారు - వికారాలను కూడా వదిలేయండి. నేను మీకు విశ్వ సామ్రాజ్యమునిస్తాను. మీకెంత లాభముంటుంది. కనుక ఎందుకు పవిత్రంగా ఉండరు? కేవలం ఒక్క జన్మ పవిత్రంగా ఉంటే ఎంత గొప్ప ఆదాయము లభిస్తుంది. భలే ఇరువురూ కలిసే ఉండండి. కానీ జ్ఞాన ఖడ్గము మధ్యలో ఉండాలి. పవిత్రంగా ఉండి చూపిస్తే అందరికంటే ఉన్నత పదవి పొందుతారు. ఎందుకంటే బాలబ్రహ్మచారులుగా ఉన్నారు. మళ్లీ జ్ఞానము కూడా ఉండాలి. ఇతరులను తమ సమానంగా తయారు చేయాలి. మేము కలిసి ఉంటూ పవిత్రంగా ఉన్నామని సన్యాసులకు చూపించాలి. అప్పుడు వీరిలో చాలా శక్తి ఉందని అర్థం చేసుకుంటారు. తండ్రి చెప్తున్నారు - ఈ ఒక్క జన్మలో పవిత్రంగా ఉంటే 21 జన్మలు మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. ఇంత గొప్ప బహుమతి లభిస్తూ ఉంటే, పవిత్రంగా ఉండి ఎందుకు చూపించరాదు? ఇక కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది. శబ్ధము కూడా అవుతూ ఉంటుంది. వార్తాపత్రికలలో కూడా వస్తుంది. ఒక్క ఆటంబాంబుతో ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో రిహార్సల్‌ చూశారు కదా. ఇంతవరకు హాస్పిటల్‌లోనే పడి ఉన్నారు. వేసిన వెంటనే ఎలాంటి కష్టమూ లేకుండా వెంటనే సమాప్తమయ్యే విధంగా ఉండే బాంబులను ఇప్పుడు తయారు చేస్తున్నారు. ఈ రిహార్సల్‌ అయిన తర్వాత ఫైనల్‌ జరుగుతుంది. వెంటనే మరణిస్తారా లేదా అని చూస్తారు. తర్వాత ఇంకా యుక్తులు రచిస్తారు. ఆసుపత్రులు మొదలైనవి ఏవీ ఉండవు. కూర్చుని ఎవరు సేవ చేస్తారు? తినిపించేందుకు బ్రాహ్మణులు మొదలైన వారెవ్వరూ ఉండరు. బాంబు వేయగానే సమాప్తమైపోతారు. భూకంపములో అంతా కప్పబడిపోతుంది (అణిగిపోతారు) ఆలస్యముండదు. ఇక్కడ మానవులు లెక్కలేనంత మంది ఉన్నారు. సత్యయుగములో చాలా కొద్దిమందే ఉంటారు. మరి ఇంతమంది ఎలా వినాశనమౌతారు! ఇంకా మున్ముందు చూడాలి. అక్కడైతే ప్రారంభములో 9 లక్షల మంది ఉంటారు.
ఫకీరులూ(పేదవారూ) మీరే, ఈశ్వరునికి ప్రియమైనవారూ మీరే. అందరినీ వదిలి ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తున్న ఫకీర్లు తండ్రికి ప్రియమనిపిస్తారు. సత్యయుగములో చాలా చిన్న వృక్షముంటుంది. విషయాలైతే చాలా అర్థం చేయిస్తారు. పాత్రను చేసే ఆత్మలందరూ అవినాశే. తమ తమ పాత్రలు చేసేందుకు వస్తారు. కల్ప-కల్పము మీరే వచ్చి విద్యార్థులై తండ్రి ద్వారా చదువుతారు. బాబా మనలను పవిత్రంగా చేసి తన వెంట తీసుకెళ్తారని మీకు తెలుసు. బాబా కూడా డ్రామానుసారము బంధింపబడి ఉన్నారు. అందరినీ తప్పకుండా వాపసు తీసుకెళ్తారు. అందువలన మీ పేరే పాండవ సైన్యము. పాండవులైన మీరు ఏం చేస్తున్నారు? కల్పక్రితము ఏ విధంగా మీరు తండ్రి ద్వారా రాజ్యభాగ్యమును తీసుకున్నారో అదే విధంగా నంబర్‌ వార్‌ పురుషార్థానుసారము తీసుకుంటున్నారు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. తండ్రికి ప్రియమైనవారిగా అవ్వాలంటే పూర్తి ఫకీరుగా అవ్వాలి. దేహమును కూడా మరచి స్వయాన్ని ఆత్మగా భావించడమే ఫకీరుగా అవ్వడము. తండ్రి ద్వారా చాలా గొప్ప బహుమతి తీసుకునేందుకు సంపూర్ణ పావనంగా అయ్యి చూపించాలి.

2. ఇంటికి వాపస్‌ వెళ్లాలి. కావున పాత ప్రపంచము పై మనసును లగ్నము చేయరాదు. ఒక్క ప్రియునితోనే మనసును లగ్నము చేయాలి. తండ్రిని, రాజధానిని స్మృతి చేయాలి.

వరదానము :-

'' మీ శక్తిశాలి స్థితిలో స్థితులై మనసు ద్వారా సేవ చేసే నంబరువన్‌ సేవాధారీ భవ ''

ఒకవేళ ఎవరికైనా మనసా సేవ చేసేందుకు అవకాశము లభించకున్నా, మనసా సేవ చేసేందుకు సదా ఉండనే ఉంటుంది. శక్తిశాలి మరియు అన్నిటికంటే గొప్ప సేవ 'మనసా సేవ.' వాచా సేవ సులభము కానీ మనసా సేవ చేసేందుకు ముందు స్వయాన్ని శక్తిశాలిగా చేసుకోవాల్సి ఉంటుంది. వాచా సేవ అయితే స్థితి హెచ్చు-తగ్గులవుతున్నా చేస్తారు. కానీ మనసా సేవ అలా జరగజాలదు. ఎవరైతే తమ శ్రేష్ఠ స్థితి ద్వారా సేవ చేస్తారో, ఆ నంబరువన్‌ సేవాధారులే ఫుల్‌ మార్కులు తీసుకోగలరు.

స్లోగన్‌ :-

'' లౌకిక కార్యాలు చేస్తూ అలౌకికతను అనుభవం చేయడమే సరెండర్‌ అవ్వడం. ''