21-03-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - తండ్రి మనకు ప్రాణదానము ఇచ్చేవారు, వారు ఇచ్చే జ్ఞానము ద్వారా ప్రాణ దానము లభిస్తుంది, ప్రాణ దానమునిచ్చే ఇటువంటి తండ్రిని ప్రీతిగా స్మృతి చేయండి''

ప్రశ్న :-

ఏ ఆధారము పై 21 జన్మల వరకు మీ భండారాలన్నీ(ఖజానాలన్నీ) నిండుగా ఉంటాయి ?

సమా :-

సంగమ యుగములో పిల్లలైన మీకు ఏ జ్ఞానమైతే లభిస్తుందో అది ఆదాయానికి మూలము (సోర్స్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ ) ఈ చదువు ఆధారము ద్వారానే అన్ని భండారాలు నిండిపోతాయి. ఈ చదువు ద్వారా 21 జన్మలకు ఖుషీ లభిస్తుంది. ప్రాప్తి చేసుకోవాలనే ఇష్టము కలిగించు వస్తువు ఏదీ ఉండదు. బాబా ఎటువంటి జ్ఞాన దానము చేస్తారంటే, దాని వలన ఎంతో అధోగతిలో ఉన్న ఆత్మ ఎంతో ఉన్నత స్థితిని పొందుకుంటుంది.

ఓంశాంతి.

భగవానువాచ! శివబాబా మనలను చదివిస్తున్నారని సాలిగ్రామాలు అర్థము చేసుకున్నారు. సృష్టి ఆదిమధ్యాంతాలు వారికి మాత్రమే తెలుసునని పిల్లలకు తెలుసు. ఇప్పుడు పిల్లలకు ఏ విషయమూ కొత్తదిగా అనిపించదు. అన్ని విషయాలు అర్థము చేసుకున్నారు. మనుష్యులైతే అందరూ మర్చిపోయారు. ఎవరైతే చదివించారో వారికి బదులు మొదటి నెంబరులో చదువుకున్న వారి పేరు వేసేశారు. చదువుకుంటూ చదువుకుంటూ మీరు ఈ విషయాన్ని నిరూపించాలి. ఈ విషయము భారతదేశములోని శాస్త్రాలకు సంబంధించిందే గానీ ఇతర ధర్మాలకు సంబంధించిన విషయము కాదు. తప్పంతా భారతదేశములోని శాస్త్రాలదే. మీరు తప్ప ఈ విషయాలను ఇతరులెవ్వరూ నిరూపించలేరు. ఇది అనాది డ్రామా అని, మళ్లీ పునరావృతము(రిపీట్‌) అవుతుందని పిల్లలైన మీకు తెలుసు. మనుష్యమాత్రులను సంస్కరించే పురుషార్థము మీరు చేస్తారు. మనుష్యులు ఎప్పుడైతే సంస్కరింపబడ్తారో అప్పుడు ప్రపంచమంతా బాగుపడ్తుంది. సత్యయుగమంటే సంస్కరింపబడిన నూతన ప్రపంచము. కలియుగమంటే సంస్కరింపబడని పాత ప్రపంచము. ఇది కూడా పిల్లలైన మీరు బాగా తెలుసుకున్నారు. అంతేకాక ధారణ చేసి ఇతరులకు కూడా అర్థము చేయించేందుకు అర్హులుగా కూడా అవుతారు. ఇందులో చాలా పరిశుభ్రత(రిఫైన్‌నెస్‌) అవసరము. బాబా మీకు ఎంతో రిఫైన్‌(శుద్ధి) చేసి అర్థము చేయించి సరిదిద్దుతారు. తండ్రి చెప్తున్నారు - మీరెప్పుడైతే సరిదిద్దబడుతారో తర్వాత నేను సరిదిద్దే అవసరము ఉండదు. మీరు అనార్యులు(అనాగరికులు)గా ఉండేవారు. ఇప్పుడు ఆర్యులుగా అనగా దేవీదేవతలుగా అవ్వాలి. దేవీదేవతలు సత్యయుగములో మాత్రమే ఉంటారు. వారందరూ పరివర్తన చెందినవారు. ఇప్పుడు పరివర్తన కాని వారు వారిని పూజిస్తున్నారు. మనము వారిని పరివర్తన చెందినవారని ఎందుకంటున్నామో ఎవ్వరికీ తెలియదు. అందరూ మనుష్యులే. ఎవరైతే సరిదిద్దబడిన ఆర్యులుగా ఉండేవారో వారే పరివర్తన చెందనివారిగా అయ్యారు. వారు ఆర్యులు, వీరు అనార్యులు. పోతే ఇక్కడున్న ఆర్య సమాజము మొదలైన మఠాలు, మార్గాలు ఈ విషయాలన్నీ కల్పవృక్ష చిత్రము ద్వారా స్పష్టంగా అర్థము చేసుకోగలరు. ఇది మానవసృష్టి యొక్క కల్పవృక్షము, దీని ఆయువు 5 వేల సంవత్సరాలు. దీని పేరు కల్పవృక్షము. కానీ కల్పవృక్షము అనే పదము ద్వారా మనుష్యుల బుద్ధికి వృక్షమని తోచదు. మీకు వృక్షము రూపములో అర్థము చేయించబడింది. వారు కల్పము ఆయువు లక్షల సంవత్సరాలని చెప్తారు. కానీ తండ్రి 5 వేల సంవత్సరాలేనని చెప్తున్నారు. ఇతరులు కల్పము ఆయువును ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వినిపిస్తారు. పూర్తిగా అర్థము చేయించేవారు ఒక్కరూ లేరు. పరస్పరము ఎంతగానో శాస్త్ర వాద వివాదాలు చేస్తారు. కానీ మీరు జరిపేది ఆత్మిక సంభాషణ. మీరు ఏవైతే సెమినార్లు(సమావేశాలు) జరుపుతారో వాటిని రూహ్‌రిహాన్‌(ఆత్మిక సంభాషణ) అని అంటారు. అర్థము చేసుకునేందుకు ప్రశ్నోత్తరాలు కూడా జరుపుతారు. బాబా ఏదైతే మీకు వినిపిస్తున్నారో దాని నుండే మీరు టాపిక్‌ తయారు చేసి వినిపిస్తారు. ప్రపంచములోని వారు ఏమి వినిపిస్తారో అది కూడా వినండి. అది విన్న తర్వాత ప్రపంచములో ఇలాంటి వాదవివాదాలు జరుగుతాయని అందరికీ వినిపించండి.

మొట్టమొదట గీతా భగవానుడెవరో అర్థము చేయించాలి. తండ్రి అయిన భగవంతుని మర్చిపోయినందున పూర్తిగా నష్ట ఖాతాలోకి వచ్చేశారు. పిల్లలైన మీకైతే తండ్రి పై ప్రేమ ఉంది. మీరు తండ్రిని స్మృతి చేస్తారు. ప్రాణదానము చేసేవారు తండ్రి ఒక్కరు మాత్రమే. ఎంతో దిగజారిపోయిన వారిని ఎంతో ఉన్నతంగా తయారు చేయు జ్ఞాన దానమును ఇస్తారు. అందువలన తండ్రి పై ప్రేమ కలిగి ఉండాలి. బాబా మనకు ఎన్నో ఇటువంటి నూతన విషయాలు వినిపిస్తారు. మనము శ్రీ కృష్ణుని ఎంత స్మృతి చేసినా వారు మనకు ఏమీ ఇవ్వరు. శ్రీ నారాయణుని స్మృతి చేస్తారు. అతడిని స్మృతి చేసినందున ఏదైనా మేలు జరుగుతుందా? మనమేమో నిరుపేదలము నిరుపేదలుగానే ఉండిపోయాము. దేవతలు ఎంత సంపన్నంగా(సాల్వెంట్‌గా) ఉండేవారు? ఇప్పుడు అన్నీ కృత్రిమ వస్తువులుగా అయిపోయాయి. వేటికైతే విలువ లేదో అవి ఈనాడు ఎంతో విలువైనవిగా అయ్యాయి. అచ్చట(స్వర్గములో) ధాన్యము మొదలైన వాటికి ఖరీదే ఉండదు. అందరికీ వారి వారి ఆస్తులు మొదలైనవి ఉంటాయి. అప్రాప్తి అయిన వస్తువేదీ ఉండదు. ఫలాని వస్తువు ప్రాప్తి కావాలనే కోరిక అసలే ఉండదు. బాబా చెప్తున్నారు - నేను మీ భండారాలన్నీ పూర్తిగా నింపేస్తాను. నేను మీకు ఎటువంటి జ్ఞానమిస్తానంటే దాని ద్వారా మీ అన్ని భండారాలు నిండిపోతాయి. జ్ఞానము ఆదాయానికి మూలము అని మీ బుద్ధిలో ఉంది. జ్ఞానమే సర్వస్వము. ఈ చదువు ద్వారా మీరు ఎంతో ఉన్నతంగా అవుతారు. చదువు భండారము కదా. అచ్చట టీచర్లు చదివిస్తారు కానీ దాని ద్వారా అల్పకాల సుఖము లభిస్తుంది. ఈ చదువు ద్వారా మీకు 21 జన్మలకు సుఖము లభిస్తుంది. పిల్లలైన మీకు చాలా సంతోషముండాలి. ఇది అర్థము చేసుకునేందుకు సమయము పడ్తుంది. త్వరగా ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. కోట్లలో ఏ ఒక్కరో వెలువడ్తారు. అర్ధకల్పము మనుష్యులందరూ ఒకరినొకరు క్రింద పడేసుకుంటూనే వచ్చారు. ఉన్నతంగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. అనంతమైన చదువును చదివించేవారి పేరుకు బదులుగా చదువుకునేవారి పేరు వేసేశారు. ప్రపంచానికి ఈ విషయాలు తెలియవు. భగవానువాచ అని, వారు చదివించి వెళ్లిపోయారని అంటారు. తర్వాత వారి శాస్త్రమేదీ ఉండదు. సత్యయుగములో ఒక్క శాస్త్రము కూడా ఉండదు. ఇవన్నీ భక్తిమార్గములోని శాస్త్రాలు. ఇది ఎంతో పెద్ద వృక్షము. భక్తిమార్గములోని ఈ అనేక కొమ్మలు-రెమ్మలు లేకుంటే వృక్షమనే పేరు కూడా ఉండేది కాదు. ఇవన్నియు ధారణ చేయవలసిన విషయాలు. మీరు ధారణ చేస్తారు. చదివించేవారేమో చదివించి అదృశ్యమైపోతారు. చదివేవారు విశ్వానికి అధికారులుగా అయిపోతారు. ఈ విషయాలు ఎంత క్రొత్తవి! ఒక్క మాట కూడా ఎవరి బుద్ధిలోనూ నిలువదు. విద్యార్థులైన మీరు కూడా నెంబరువారుగా ఉన్నారు. కొంతమంది పాస్ అవుతారు. కొంతమంది ఫెయిల్‌ అవుతారు. ఇది అనంతమైన చాలా పెద్ద పరీక్ష. ఇప్పుడు మనము చాలా మంచిరీతిగా చదువుకుంటే కల్ప-కల్పాంతరాలు చక్కగా చదువుకుంటామని మీకు తెలుసు. బాగా చదువుకొనువారు మాత్రమే ఉన్నత పదవిని పొందుతారు. అందరూ నెంబరువారుగా వెళ్లిపోతారు. మొత్తం తరగతిలోని వారందరూ బదలీ అవుతారు. నంబరువారుగా వెళ్లి తర్వాతి తరగతిలో కూర్చుంటారు. ఈ జ్ఞానము కూడా ఆత్మలో ఉంది. మంచి సంస్కారాలు గానీ, చెడు సంస్కారాలు గానీ ఆత్మలోనే ఉంటాయి. శరీరమైతే మట్టితో చేయబడింది. ఆత్మ నిర్లేపమయ్యేందుకు వీలు లేదు. నూటికి నూరు శాతము సతోప్రధానము, నూటికి నూరు శాతము తమోప్రధానంగా ఎవరు అవుతారో కూడా మీకు తెలుసు. మొదట పేదవారిని ఉద్ధరించాలి. మొదట వారే వస్తారు. గురువుల వద్దకు కూడా మంచి మంచి అనన్యమైన శిష్యులు వారి బుద్ధి వికసించినప్పుడు మాత్రమే వస్తారు. మనకు చెందిన ఆకులే వెలువడుటను మీరు చూస్తారు. ఇక్కడికి చెందినవారుగా ఎవరుంటారో వారు వెలువడి వచ్చేస్తారు. తండ్రి వచ్చి నూతన వృక్షమును ప్రారంభము చేస్తారు. వేరు వేరు ధర్మాలలోకి ఎవరు వెళ్ళిపోయారు, వారందరూ తిరిగి వస్తారు. మళ్లీ తమ భారతదేశములోకే వస్తారు. భారతవాసులుగానే ఉండేవారు కదా. మన కొమ్మకు చెందిన వారందరూ వచ్చేస్తారు. పోను పోను అన్ని విషయాలు మీరు అర్థము చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు(విదేశాలలో) బయట నుండి అందరూ నెట్టబడతారు. విదేశస్థులు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ పంపి వేస్తూ ఉంటారు. మా దేశానికి వచ్చి వీరు చాలా ధనవంతులైపోయారని, ఇక్కడి వారు పేదవారైపోయారని భావిస్తారు.

చివరి సమయములో అందరూ తమ తమ ధర్మాలలోనికి వెళ్ళవలసి ఉంటుంది. అందరూ తమ-తమ ఇంటి వైపుకు పరుగు తీస్తారు. విదేశములో ఎవరైనా మరణిస్తే వారిని భారతదేశానికి తీసుకొస్తారు ఎందుకంటే భారతదేశము ఫస్ట్‌క్లాస్‌ పవిత్రమైన భూమి. భారతదేశములోనే నూతన ప్రపంచముండేది. ఈ సమయములో దీనిని నిర్వికారి ప్రపంచమని అనలేరు. ఇది వికారీ ప్రపంచము. అందుకే ''ఓ పతితపావనా! మీరు వచ్చి మమ్ములను పావనము చేయండి'' అని పిలుస్తారు. భలే ప్రపంచమేమో ఒక్కటే. అదే ప్రపంచమే కానీ ఈ సమయములో ఒక్కరు కూడా పవిత్రమైనవారు లేరు. పవిత్రాత్మలు మూలవతనములో ఉంటారు. అది బ్రహ్మ మహాతత్వము, అందరూ పావనంగా అయ్యి అచ్చటికి వెళ్తారు. తర్వాత మళ్లీ పాత్ర చేసేందుకు నంబరువారుగా ఇచ్చటికి వస్తారు. ఇది ఆదిసనాతన దేవీ దేవతా ధర్మానికి పునాది, తర్వాత మూడు కొమ్మలు వెలువడ్తాయి. ఇది దేవతా ధర్మము. ఇది కొమ్మ కాదు. ఈ ధర్మము పునాది(కాండము). దీని నుండి మూడు కొమ్మలు వెలువడ్తాయి. ముఖ్యమైనవి నాలుగు ధర్మాలు. అన్నిటికంటే మంచి ధర్మము ఈ బ్రాహ్మణ దర్మము. దీనికి చాలా మహిమ ఉంది. మీరు ఇక్కడ వజ్ర సమానంగా అవుతారు. ఇక్కడ మిమ్ములను తండ్రి స్వయంగా చదివిస్తారు. కావున మీరు ఎంత గొప్పవారు, దేవతల కంటే బ్రాహ్మణులైన మీరు గొప్ప జ్ఞాన సంపన్నులు ఆశ్చర్యము కదా. మనము ఏ జ్ఞానమైతే తీసుకుంటామో అది మన జతలోనే వస్తుంది. అక్కడకు వెళ్లిన తర్వాత జ్ఞానమంతా మర్చిపోతాము. ఇంతకుముందు మనము ఏమి చదివేవారమో, ఇప్పుడు ఏమి చదువుతున్నామో మీకు తెలుసు. ఐ.సి.ఎస్‌ వారు ముందు ఏమి చదువుతారో తర్వాత ఏమి చదువుతారో తేడా ఉంటుంది కదా. పోను పోను మీరు చాలా కొత్త పాయింట్లు వింటారు. ఇప్పుడే తెలుపము, పాత్రయే అలా ఉంది. జ్ఞానము తీసుకునే పాత్ర ఎప్పుడు పూర్తి అవ్వాలో అప్పుడు మనము కూడా బాబా ఇచ్చే జ్ఞానమును ధారణ చేస్తామని మీ బుద్ధిలో ఉంటుంది. మళ్లీ మన పాత్ర స్వర్గములో ప్రారంభమవుతుంది. వారి(బాబా) పాత్ర పూర్తి అయిపోతుంది. బుద్ధిలో జ్ఞానము మంచిరీతిగా ధారణ అవ్వాలి. జ్ఞాన స్మరణ చేస్తూ ఉండండి. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. స్మృతి లేకుంటే చిన్న పదవిని పొందుతారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఉంటే శరీర భావము తొలగిపోతుంది. సన్యాసులు కూడా ఈ స్థితిని అభ్యాసము చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేస్తారు. కానీ వారి మార్గము వేరు. కనుక వారు మళ్లీ జన్మ తీసుకోవలసి వస్తుంది. వారి శిష్యులు గురువుగారు బ్రహ్మములో లీనమైపోయారని మళ్లీ వాపసు రాలేరని భావిస్తారు. వాపసు ఎవ్వరూ వెళ్ళరని తండ్రి అర్థము చేయిస్తున్నారు. చివరి సమయములో పాత్రధారులందరూ నాటక రంగము పైకి వచ్చినప్పుడు వాపస్‌ ఇంటికి వెళ్తారు. అది హద్దులోని వినాశీ నాటకము. ఇది అనంతమైన అవినాశి నాటకము. ఈ డ్రామా పేను వలె నడుస్తూ ఉంటుందని మంచి రీతిగా అర్థము చేయించగలరు. అక్కడ చిన్న చిన్న డ్రామాలు తయారుచేస్తారు. అసత్యమైన సినిమాలు తయారు చేస్తారు. వాటిలో కొన్ని మంచి విషయాలు కూడా ఉంటాయి. ఉదాహరణానికి విష్ణు అవతరణను చూపిస్తారు. ఎవరో పై నుండి క్రిందకు దిగి వస్తారని కాదు. లక్ష్మీనారాయణులు పాత్ర చేసేందుకు వస్తారు. పోతే పై నుండి ఎవ్వరూ క్రిందకు రారు. ఇప్పుడు పిల్లలైన మిమ్ములను తండ్రి చదివిస్తున్నారు. ఇప్పుడు మాత్రమే ఈ విషయాలన్నీ మీరు అర్థము చేసుకోగలరు. ఇంతకుముందు మీరు కూడా తుచ్ఛ బుద్ధి గలవారుగా ఉండేవారు. తండ్రి ఎప్పుడైతే అర్థము చేయించారో అప్పుడు మీ బుద్ధి వికసించింది. ఇంతవరకు మీరు ఏమేమి వింటూ వచ్చారో ఇవన్నీ దేనికీ పనికి వచ్చేవి కావు. వాటి ద్వారా ఇంకా క్రిందికి పడిపోయారు. అందుకే మీరు అందరి నుండి అభిప్రాయము వ్రాయించుకుంటారు. అలా వ్రాసి ఇచ్చినప్పుడే బుద్ధిలో కొంత కూర్చున్నదని భావించాలి. బయట నుంచి ఎవరైతే వస్తారో వారితో ఫారమ్‌ నింపించుకుంటే మన కులమువారు అవునో కాదో తెలిసిపోతుంది. ముఖ్యమైన విషయము తండ్రిని తెలుసుకోవడం, కల్ప-కల్పము తండ్రి మనలను చదివిస్తారని అర్థము చేసుకోవాలి. ఎప్పటి నుండి పవిత్రంగా ఉన్నారు? అని ప్రశ్నించాలి. త్వరగా బాగుపడరు. పదే పదే మాయ గట్టిగా పట్టుకుంటుంది. కచ్ఛాగా ఉంటే మింగేస్తుంది. చాలామంది మహారథులను కూడా మాయ మింగేసింది. శాస్త్రాలలోని ఉదాహరణలు కూడా ఇప్పటివే. మందిరములో కూడా మహారథులు, అశ్వారూఢులు, కాల్బలమువారు మొదలైన వారిని చూపిస్తారు. మీరిప్పుడు మీ స్మృతి చిహ్నాన్ని చూస్తారు. ఎప్పుడైతే మీరు తయారైపోతారో అప్పుడు భక్తి ఎగిరిపోతుంది. మీరు ఎవ్వరికీ తల వంచి నమస్కరించజాలరు. ఈ విగ్రహాలు ఎవరివి? అని మీరు అడుగుతారు. వీరి జీవితచరిత్ర తెలపండి అని మీరు అడుగుతారు. బాబా పిల్లలైన మిమ్ములను జ్ఞాన సంపన్నులుగా చేసినందునే మీరు ఈ ప్రశ్నను అడుగుతారు. కావున మీకు నశా ఉండాలి. గౌరవ పూర్వకంగా 8 మంది మాత్రమే ఉత్తీర్ణులౌతారు. ఇది చాలా పెద్ద పరీక్ష. నా ఆత్మ పవితంగా అయ్యిందా ? అని స్వయాన్ని పశ్న్రించుకోవాలి. యోగము జోడించినప్పుడే బ్యాటరీ చార్జ్‌ అవుతుంది. తండిత్రో యోగముంటే సతోపధ్రానంగా అవుతారు. తమోప్రధాన ఆత్మ వాపస్‌ వెళ్ళలేదు.

ఇది కూడా డ్రామాయే. అక్కడ దు:ఖము కలిగించే వస్తువు ఏదీ ఉండదు. ఆవులు కూడా చాలా సుందరంగా ఉంటాయి. కృష్ణుని జతలో ఉండే ఆవులను ఎంతో సుందరంగా చూపిస్తారు! గొప్ప మనుష్యుల ఫర్నీచరు కూడా సుందరంగా ఉంటుంది. ఆవులు పాలు చాలా ఎక్కువగా ఇస్తాయి. అందుకే పాల నదులు ప్రవహిస్తాయి అని అంటారు. ఇక్కడ అలా ఇవ్వవు. ఇప్పుడు మీరు జ్ఞాన సంపన్నులుగా అయ్యారు. ఇప్పుడు మీరు ఈ ప్రపంచాన్ని తుచ్ఛంగా భావిస్తారు. దీనిలోని చెత్తా చెదారమంతా స్వాహా అవుతుంది. పనికిరాని చెత్త అంతా తొలగిపోయి అంతా మళ్లీ స్వచ్ఛంగా అవుతుంది. మనము మన రాజధానిలోనికి వెళ్ళిపోతాము. దాని పేరే స్వర్గము. పేరు వింటూనే సంతోషము కలుగుతుంది. అచ్ఛా! మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. ఈ అనాగరిక పాత ప్రపంచాన్ని చక్కదిద్దేందుకు స్వయాన్ని సరిదిద్దుకోవాలి. మీ బుద్ధిని తండ్రి స్మృతి ద్వారా రిఫైన్‌(శుద్ధి) చేసుకోవాలి.

2. పరస్పరము ఆత్మిక సంభాషణ చేసుకోవాలి కానీ వాదవివాదాలు చేసుకోరాదు. జ్ఞాన దానమునిచ్చి అందరి భండారాలను సంపన్నము చేయాలి.

వరదానము :-

'' స్నేహానికి బదులుగా స్వయం టర్న్‌ (పరివర్తన) అయ్యి తండ్రి సమానంగా అయ్యే సంపన్న మరియు సంపూర్ణ భవ ''

స్నేహానికి గుర్తు - వారు స్నేహితులలోని లోపాలను చూడలేరు. స్నేహితుల గ్లానిని తమ గ్లానిగా భావిస్తారు. తండ్రి పిల్లలలోని ఏదైనా విషయం విన్నప్పుడు ''ఇది నా విషయం అని భావిస్తారు.'' తండ్రి పిల్లలను తమ సమానం సంపన్నంగా, సంపూర్ణంగా చూడాలనుకుంటారు. ఈ స్నేహానికి బదులు స్వయాన్ని టర్న్‌ చేసుకోండి. భక్తులైతే తమ తలలు తీసి ఉంచేందుకు తయారుగా ఉన్నారు. మీరు మీ శారీరిక తలను కాదు, రావణుని తలను తీసేయండి.

స్లోగన్‌ :-

'' మీ ఆత్మిక వైబ్రేషన్ల ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసే సేవ చేయడం అన్నిటికంటే శ్రేష్ఠమైన సేవ ''