03-08-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీది అనాదిగా వస్తున్న సోదర సంబంధము(భాయి-భాయి). మీరు సాకారంలో సోదరీ - సోదరులు. కనుక మీకు ఎప్పడూ క్రిమినల్ దృష్టి
ప్రశ్న :-
విజయీ అష్ట రత్నాలుగా ఎవరు అవుతారు? వారి విలువ ఏమి?
జవాబు :-
ఎవరి మనసులో క్రిమినల్ ఆలోచనలు ఉండవో, పూర్తిగా మంచి(సివిల్) దృష్టి ఉంటుందో, వారే అష్టరత్నాలుగా అవుతారు, అనగా కర్మాతీత స్థితిని పొందుతారు. వారి విలువ ఎంత అధికంగా ఉంటుందంటే ఎవరి పై అయినా గ్రహచార ప్రభావం పడితే, వారికి అష్టరత్నాల ఉంగరం ధరింపజేస్తారు. అది ధరిస్తే గ్రహచారం తొలగిపోతుందని భావిస్తారు. అష్టరత్నాలుగా అయ్యే మీ బుద్ధి దూరదేశి బుద్ధి అయినందున నిరంతరం భాయి భాయి స్మృతిలోనే ఉంటారు.
ఓంశాంతి.
వారి పేరు ఏమిటో ఆత్మిక పిల్లలకు తెలుసు. బ్రాహ్మణులు బ్రహ్మాకుమారులు, కుమారీలు అనేకమంది ఉన్నారు. దీని వలన మీరు దత్తత తీసుకోబడిన పిల్లలని నిరూపించబడ్తుంది. ఒకే తండ్రి పిల్లలు కనుక తప్పకుండా దత్తత తీసుకోబడినవారే. బ్రహ్మకుమారులు-కుమారీలు అయిన మీరే దత్తత తీసుకోబడిన పిల్లలు. చాలామంది ఉన్నారు. ఒకటేమో ప్రజాపిత బ్రహ్మ పిల్లలు, మరొకటి పరమపిత పరమాత్మ శివుని పిల్లలు. కనుక వారికి పరస్పరం సంబంధం ఉంది, ఎందుకంటే వారి పిల్లలు ఆత్మిక పిల్లలు, వీరి పిల్లలు దైహిక పిల్లలు. వారి పిల్లలైతే భాయి-భాయి అవుతారు. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు సాకార సోదరీ-సోదరులుగా అవుతారు. సోదరీ-సోదరులకు క్రిమినల్ సంబంధం ఎప్పుడూ ఉండదు. మీ గురించి వీరు అందరినీ సోదరీ - సోదరులుగా చేస్తారని అంటారు. తద్వారా శుద్ధమైన సంబంధం ఉంటుంది. క్రిమినల్ దృష్టి ఉండదు. కేవలం ఈ జన్మలో ఈ దృష్టి ఉన్నందున ఉంటే, తర్వాత భవిష్యత్తులో ఎప్పుడూ క్రిమినల్ దృష్టి ఉండదు. అక్కడ(సత్యయుగంలో) కూడా సోదరీ-సోదరులుగా భావిస్తారని కాదు, అక్కడైతే మహారాజు-మహారాణి ఎలా ఉంటారో, అలాగే ఉంటారు. ఇప్పుడు మనం పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నామని, అందరమూ సోదరీ- సోదరులమని పిల్లలైన మీకు తెలుసు. ప్రజాపిత బ్రహ్మ పేరైతే ఉంది కదా! ప్రజాపిత బ్రహ్మగా ఎప్పుడు అయ్యారో ఈ ప్రపంచానికి తెలియదు. మనము పురుషోత్తమ సంగమయుగ బి.కె.లమని ఇక్కడ కూర్చున్న మీకు తెలుసు. ఇప్పుడు దీనిని ధర్మం అని అనరు. ఇప్పుడు ఈ కులము స్థాపన జరుగుతూ ఉంది. మీరు బ్రాహ్మణ కులానికి చెందినవారు. మేము బ్రహ్మకుమారీ-కుమారులము, ఒకే ప్రజాపిత బ్రహ్మ సంతామని మీరు చెప్పుకోగలరు. ఇది కొత్త విషయం కదా! మేము బి.కె.లము అని చెప్పుకోగలరు. వాస్తవానికి మనమందరం సోదరులము, ఒకే తండ్రి పిల్లలము. వారిని దత్తు పిల్లలని అనరు. మనము ఆత్మలము, వారి అనాది సంతానము. వారు పరమపిత పరమాత్మ సుప్రీమ్ సోల్. మరెవ్వరినీ సుప్రీమ్ అనే మాట అనరు. సంప€³¶ €³¶ þ° ð± è³¶ ³¶ @ ³¶ 28;ుప్రీమ్ అని అంటారు. అలాగని అందరిలో పవిత్రత ఉంది అని అనము. ప్యూరిటీని ఈ సంగమంలోనే నేర్చుకుంటారు. మీరైతే సంగమయుగ నివాసులు. ఉదాహరణానికి కలియుగ నివాసులు, సత్యయుగ నివాసులు అని అంటారు కదా! అలాగే మీరు సంగమయుగ నివాసులు, సత్యయుగము, కలియుగము అయితే చాలామందికి తెలుసు. దూరదేశ బుద్ధిగలవారుగా ఉంటే అర్థం చేసుకోగలరు. కలియుగము, సత్యయుగానికి మధ్యలో ఉన్న దానిని సంగమ యుగమని అంటారు. శాస్త్రాలలో అయితే యుగే యుగే అనేశారు. తండ్రి అంటారు - ''నేను యుగ - యుగంలో రాను.'' మేము పురుషోత్తమ సంగమయుగీ బ్రహ్మకుమారి-కుమారులము అని మీ బుద్ధిలో ఉండాలి. మనము సత్యయుగములోనూ లేము, కలియుగములోనూ లేము. సంగమయుగం తర్వాత సత్యయుగము తప్పకుండా రావాలి(వస్తుంది).
మీరు ఇప్పుడు సత్యయుగములోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు. పవిత్రత లేకుండా అక్కడకు ఎవ్వరూ వెళ్లలేరు. ఈ సమయంలో మీరు పవిత్రంగా అయ్యేందుకు పురుషార్థులు. అందరూ పవిత్రంగా లేరు. చాలామంది పతితంగా కూడా అవుతారు. నడుస్తూ - నడుస్తూ క్రింద పడిపోతారు. మళ్లీ వెదుక్కుంటూ వచ్చి అమృతం త్రాగుతారు. వాస్తవానికి అమృతం వదిలి విషం త్రాగేవారిని కొంతకాలం రానీయరు. కానీ అమృతం పంచేటప్పుడు అసురులు దాక్కొని వచ్చి కూర్చునేవారని కూడా గాయనం ఉంది. ఇంద్రసభలో ఇటువంటి అపవిత్రులు వచ్చి కూర్చుంటే వారికి శాపం తగులుతుందని ఒక కథ కూడా చెప్తూ ఉంటారు. ఒక గంధర్వ కన్య ఒక వికారిని తీసుకొస్తే, వారికి ఎటువంటి గతి పట్టింది? వికారీలైతే తప్పకుండా క్రింద పడిపోతారు. ఇది అర్థం చేసుకోవలసిన విషయం. వికారులు ఎదగలేరు. వారు వెళ్లి రాయిగా అయిపోయారని అంటారు. మనుష్యులు రాయిగానో, చెట్టుగానో అయిపోతారని కాదు. రాతి బుద్ధిగలవారిగా అయిపోయారని, ఇక్కడికి పారస బుద్ధిగలవారిగా అయ్యేందుకు వస్తారు, కాని దాగి ఉండి విషం తాగితే, రాతి బుద్ధిగానే ఉండిపోతారని ఋజువవుతుంది. ఇది సన్ముఖంలో అర్థం చేయించబడ్తుంది. శాస్త్రాలలో అయితే కూర్చొని ఊరకే వ్రాసేశారు. ఇంద్రసభ అని పేరు పెట్టారు. ఎక్కడ పుష్యరాగము,..... రకరకాల దేవకన్యలను చూపుతారు. రత్నాలలో కూడా నెంబరువారీగా ఉంటాయి కదా! కొన్ని చాలా మంచి రత్నాలు, కొన్ని మామూలు రత్నాలు ఉంటాయి. కొన్నిటి విలువ తక్కువ, కొన్నిటి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. నవ రత్నాల ఉంగరాలు కూడా చాలా తయారు చేస్తారు. అడ్వర్టైజ్(ప్రచారం) చేస్తారు. పేరు అయితే రత్నాలే. ఇక్కడ కూర్చుని ఉన్నారు కదా! కానీ వీరిలో వజ్రము, వైఢూర్యము, మాణిక్యము, పుష్యరాగము కూడా కూర్చొని ఉన్నారు. రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. వాటి విలువలో కూడా చాలా వ్యత్యాసము ఉంటుంది. అలాగే పూలతో పోల్చబడ్తారు. వాటిలో కూడా రకరకాల పుష్పాలు ఉన్నాయి. ఎవరెవరు పుష్పాలో పిల్లలకు తెలుసు. బ్రాహ్మణీలు మార్గదర్శకులుగా అయ్యి వస్తారు, వారు మంచి పుష్పాలుగా ఉంటారు. కొంతమంది స్టూడెంట్లు(విద్యార్థులు) కూడా అర్థం చేయించడంలో చాలా చురుకైనవారు ఉంటారు. పుష్పాన్ని బాబా బ్రాహ్మణికి ఇవ్వకుండా, అటువంటి స్టూడెంట్లకు ఇస్తారు. నేర్పించేవారికన్నా వారిలో చాలా మంచి గుణాలు ఉంటాయి, ఏ వికారాలు ఉండవు. కొంతమందిలో అవగుణాలు ఉంటాయి - క్రోధ భూతము, లోభ భూతము,........ ఉంటాయి. వీరు ఫేెవరేట్(మనసుకు వచ్చిన) మార్గదర్శకులని, వీరు రెండవ నెంబర్ వారని బాబాకు తెలుసు. కొంతమంది పండాలు జిజ్ఞాసువులంత ఫేవరేట̴్€³¶ €³¶ þ° ð± è³¶ ³¶ @ ³¶ ీసుకొస్తారో వారు ఫేవరేట్గా అవుతారు. నేర్పించేవారు మాయ ప్రభావంతో వికారాలలోకి వెళ్లిపోవడం కూడా జరుగుతుంది. చాలా మందిని ఊబి నుండి బయటకు తీస్తారు కానీ తామే కూరుకుపోయి మరణిస్తారు. మాయ చాలా శక్తివంతమైనది. క్రిమినల్ ఐ(వికారి దృష్టి) మోసగిస్తుందని పిల్లలకు కూడా తెలుసు. క్రిమినల్ ఐ(వికారి దృష్టి) ఉన్నంతకాలం, సోదరీ-సోదరులుగా ఉండాలని లభించిన డైరెక్షన్ ప్రకారం నడుచుకోలేరు. సివిల్ ఐ(పవిత్ర దృష్టి) గలవారు, క్రిమినల్ ఐ(వికారీ దృష్టి) గలవారిగా మారిపోతారు. క్రిమినల్ ఐ(వికారీ దృష్టి) పరివర్తనై పక్కా సివిల్ ఐ(పవిత్ర దృష్టి) గలవారిగా తయారైతే దానినే కర్మాతీత స్థితి అని అంటారు. స్వయాన్ని ఇంతగా పరిశీలించుకోవాలి. కలిసి ఉన్నా వికార దృష్టి ఉండరాదు. ఇక్కడ మీరు సోదరీ-సోదరులుగా అవుతారు. మీ మధ్య జ్ఞాన ఖడ్గం ఉంది. మనము పవిత్రంగా ఉండేందుకు పక్కా ప్రతిజ్ఞ చేయాలి. కానీ బాబా ఆకర్షణ కలుగుతోంది ఇంకా ఆ స్థితి పక్కాగా అవ్వలేదని వ్రాస్తారు. ఇది కూడా ఉండరాదని పురుషార్థం చేస్తారు. పూర్తి సివిల్ ఐ(పవిత్ర దృష్టి)గా తయారైతేనే విజయం పొందగలరు. స్థితి ఎలా ఉండాలంటే, ఎటువంటి వికార సంకల్పము కూడా రాకూడదు, దీనినే కర్మాతీత స్థితి అని అంటారు. ఇదే గమ్యం.
ఎంత వండర్ఫుల్(అద్భుతమైన) మాల తయారవుతుంది! అష్టరత్నాల మాల కూడా ఉంటుంది. పిల్లలు అనేకమంది ఉన్నారు. ఇక్కడ సూర్యవంశము, చంద్రవంశము స్థాపన అవుతాయి. వారందరి నుండి ఫుల్ పాస్ అయ్యి, స్కాలర్షిప్ తీసుకునేవారు 8 రత్నాలు వెలువడతారు. వాటి మధ్యలో వారిని రత్నాలుగా తయారు చేసే వజ్రం 'శివుని' ఉంచుతారు. అలా రత్నాలుగా తయారు చేసేవారు వారే. గ్రహచారం పట్టినా అష్టరత్నాల ఉంగరం ధరిస్తారు. ఈ సమయంలో భారతదేశము పై రాహు దశ ఉంది. ఇంతకు ముందు కూడా వృక్షపతి అనగా బృహస్పతి దశ ఉండేది. మీరు సత్యయుగములో దేవతలుగా ఉండి విశ్వము పై రాజ్యపాలన చేసేవారు. తర్వాత రాహుదశ కూర్చుంది. ఇప్పుడు మీకు మన పై బృహస్పతి దశ ఉండేదని తెలుసు. దాని పేరు వృక్షపతి దశ. క్లుప్తంగా బృహస్పతి దశ అని అంటారు. మన పై బృహస్పతి దశ ఉండేటప్పుడు మనం విశ్వానికి అధిపతులుగా ఉండేవారము. ఇప్పుడు రాహుదశ కూర్చోవడంతో గవ్వల వలె తయారయ్యాము. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. అడిగే పని కూడా లేదు. గురువులు మొదలైనవారిని - ఈ పరీక్షలో పాస్ అవుతామా? అని అడుగుతారు. ఇక్కడ కూడా మేము పాస్ అవుతామా? అని బాబాను అడుగుతారు. పాసయ్యే పురుషార్థం చేస్తూ ఉంటే ఎందుకు పాస్ అవ్వరు? అని చెప్తాను. కానీ మాయ చాలా శక్తివంతమైనది. తుఫానులోకి తెస్తుంది. ఈ సమయంలో అయితే బాగుంది, పోను పోను చాలా తుఫానులు వస్తే?,......... ఇప్పుడు మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు, మరి నేను గ్యారంటీ ఎలా ఇస్తాను? ఇంతకుముందు మాల తయారు చేసేవారము. ఎవరినైతే 2-3 నంబరులో ఉంచామో వారు ఇప్పుడు లేనే లేరు. ఒక్కసారిగా ముళ్ళుగా తయారైపోయారు. అందుకే బ్రాహ్మణుల మాల తయారవ్వజాలదని బాబా అంటారు. యుద్ధ మైదానం కదా! ఈ రోజు బ్రాహ్మణులు, రేపు శూద్రులుగా తయారైపోతారు, వికారాల్లోకి పోయారంటే శూద్రులైపోయారు. రాహు దశ కూర్చుంటుంది. బృహస్పతి దశ కొరకు పురుషార్థం చేసేవారు. వృక్షపతి చదివించేవారు. నడుస్తూ నడుస్తూ మాయ చెంపదెబ్బ తగిలింది. మళ్లీ రాహుదశ తల పై కూర్చుంది. విశ్వాస ఘాతకులుగా(ద్రోహులుగా) అవుతారు. ఇలా అన్ని చోట్లా జరుగుతుంది. ఒక రాజ్యం€³¶ €³¶ þ° ð± è³¶ ³¶ @ ³¶ 074;లోకి వెళ్లి శరణు తీసుకుంటారు. వీరు మనకేమైనా పనికొస్తారా అని వారు కూడా చూస్తారు. వారికి పనికొస్తారనుకుంటే శరణు ఇస్తారు. అలా చాలామంది ద్రోహులుగా అవుతారు. విమానంలో, విమాన సహితంగా పోయి వేరే రాజ్యంలో కూర్చుంటారు. తర్వాత వారు విమానాన్ని వాపసు ఇచ్చేస్తారు. విమానానికి శరణం ఇవ్వరు. అదైతే ఆ రాజ్యం యొక్క ప్రాపర్టీ(సొత్తు) కదా! వారి వస్తువును వారికి వాపసు ఇచ్చేస్తారు. మిగిలే మనుష్యులు మనుష్యులకు శరణునిస్తారు.
ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి వద్దకు శరణుకై వచ్చారు. మా శీలం కాపాడండి అంటారు. ద్రౌపది, వీరు నన్ను వివస్త్రను చేస్తున్నారు పతితను కాకుండా రక్షించు అని పిలిచింది కదా! సత్యయుగంలో ఎప్పుడూ వివస్త్రలుగా అవ్వరు. వారినైతే సంపూర్ణ నిర్వికారులు అని అంటారు. చిన్న పిల్లలలైతే నిర్వికారులుగానే ఉంటారు. ఇక్కడ గృహస్థ వ్యవహారములో ఉంటూ సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు. భలే స్త్రీ-పురుషులు కలిసే ఉంటారు. అయినా నిర్వికారులుగానే ఉంటారు. అందుకే మనము నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అవుతున్నామని అంటారు. అది నిర్వికారి ప్రపంచము. అక్కడ రావణుడుండడు. దానిని రామరాజ్యం అని అంటారు. రాముడని శివబాబాను అంటారు. రామనామం జపించడం అనగా తండ్రిని గుర్తు చేసుకోవడం. రామ-రామ అంటున్నప్పుడు బుద్ధిలో నిరాకారుడే ఉంటాడు. రామ-రామ అని అంటారు. సీతను వదిలేస్తారు. అలాగే కృష్ణుని పేరు జపిస్తారు, రాధను వదిలేస్తారు. ఇక్కడైతే తండ్రి ఒక్కరే ఉన్నారు. నన్నొక్కరినే స్మృతి చేయండి అని వారంటున్నారు. కృష్ణుని పతిత పావనుడని అనరు. చిన్నతనంలో రాధా-కృష్ణులు సోదరీ-సోదరులు కూడా కాదు, వేరు వేరు రాజ్యాలకు చెందినవారు. పిల్లలు అయితే శుద్ధంగానే ఉంటారు. బాబా కూడా అంటారు - పిల్లలైతే పూలు, వారిలో వికారి దృష్టి ఉండదు. పెరిగి పెద్దవారు అయినప్పుడు ఆ దృష్టి ఉంటుంది. అందుకే బాలురు మహాత్ములకు సమానమని అంటారు. కానీ పిల్లలు మహాత్ములకన్నా ఉన్నతమైనవారు. మహాత్ములకు మేము భ్రష్టత్వంతోనే జన్మించామని తెలుసు. చిన్నపిల్లలకు ఇదేమీ తెలియదు. తండ్రికి పుత్రునిగా అవుతూనే ఆ పుత్రునికి వారసత్వం ఉండనే ఉంది. మీరు విశ్వరాజధానికి యజమానులుగా అవుతారు. మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు - అది నిన్నటి విషయమే. ఇప్పుడు మళ్లీ మీరే అవుతారు. ఎంత గొప్ప ప్రాప్తి అవుతూ ఉంది. కనుక స్త్రీ-పురుషులు, సోదరీ-సోదరులుగా అయ్యి పవిత్రంగా ఉండడం పెద్ద విషయమా? కొంచెం శ్రమ కూడా అవసరమే కదా! అవును. నెంబరువారు పురుషార్థం అనుసారం ఇప్పుడు బృహస్పతి దశలోకి వెళ్తారు. స్వర్గానికైతే వెళ్తారు. చదువు ద్వారా కొందరు ఉన్నత పదవి పొందుతారు. కొందరు మధ్యస్థం, కొందరు పూలుగా అవుతారు. కొందరు ఎలాగో అవుతారు. ఇది తోట కదా! మరి పదవి కూడా అలాగే పొందుతారు. ఇలాంటి పుష్పాలుగా అవ్వాలంటే పురుషార్థం బాగా చేయాలి. అందుకే బాబా పిల్లలకు చూపించేందుకు పుష్పాలు తీసుకొస్తారు. పూతోటలో అయితే అనేక రకాల పుష్పాలు ఉంటాయి. సత్యయుగము పూలతోట, ఇది ముళ్ళ అడవి. ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఒకరినొకరు ముల్లుతో గుచ్చుకోవడం నుండి రక్షించుకునే పురుషార్థం చేస్తున్నారు. ఎవరు ఎంత పురుషార్థం చేస్తే అంత గెలుపు పొందుతారు. ముఖ్యమైన విషయం కామం పై గెలుపు పొందితేనే జగజ్జీతులుగా అవుతారు. ఇదంతా పిల్లల పై ఆధారపడి ఉంది. యువకులు చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. వృద్ధులకు తక్కువ. వానప్రస్థ స్థితిలో ఉన్నవారికి మరీ తక్కువ పిల్లలకు చాలా తక్కువ శ్రమ చేయాల్సి ఉంటుంది.
మనకు విశ్వరాజ్య చక్రవర్తి పదవి లభిస్తుందని మీకు తెలుసు. దాని కొరకు ఒక్క జన్మ పవిత్రంగా ఉంటే ఏమైపోతుంది? వారిని బాలబ్రహ్మచారులని అంటారు. చివరివరకు పవిత్రంగా ఉంటారు. పవిత్రంగా అయినవారికి తండ్రి అంటే ఆకర్షణ ఉంటుంది. పిల్లలకు చిన్నతనంలోనే జ్ఞానం లభిస్తే రక్షించుకోగలరు. చిన్న పిల్లలు అమాయకులుగా ఉంటారు అయితే బయట స్కూళ్ళు మొదలైనవాటి సాంగత్య రంగు అంటుకుంటుంది. మంచి సాంగత్యం పైకి లేపుతుంది(తేల్చుతుంది), చెడు సాంగత్యం ముంచేస్తుంది. మేము మిమ్ములను శివాలయానికి తీసుకొని వెళ్తామని తండ్రి అంటారు. సత్యయుగం పూర్తి క్రొత్త ప్రపంచం. చాలా కొద్దిమంది మనుష్యులు మాత్రమే ఉంటారు. తర్వాత వృద్ధి చెందుతారు. అక్కడ చాలా కొద్దిమంది దేవతలు ఉంటారు. కనుక క్రొత్త ప్రపంచానికి వెళ్లేందుకు పురుషార్థం చేయాలి.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రికి ఇష్టమైనవారిగా అయ్యేందుకు గుణవంతులుగా అవ్వాలి. మంచి మంచి గుణాలు ధారణ చేసి పుష్పాలుగా అవ్వాలి. అవగుణాలను వదిలేయాలి. ఎవరికీ ముల్లు గుచ్చరాదు.
2. ఫుల్ పాస్ అయ్యేందుకు లేక స్కాలర్షిప్ తీసుకునేందుకు బాబా తప్ప ఇతరమేదీ గుర్తు రాని స్థితిని తయారు చేసుకోవాలి. పూర్తి సివిల్ ఐ(పవిత్ర దృష్టి) గలవారిగా అవ్వాలి. సదా బృహస్పతి దశ ఉండాలి.
వరదానము :-
'' స్వ స్వరూపాన్ని మరియు తండ్రి సత్య స్వరూపాన్ని తెలుసుకొని సత్యతా శక్తిని ధారణ చేసే దివ్యతా సంపన్న భవ ''
ఏ పిల్లలైతే తమ స్వ స్వరూపాన్ని, తండ్రి సత్యమైన పరిచయాన్ని యధార్థంగా తెలుసుకొని అదే స్వరూప స్మృతిలో ఉంటారో వారిలో సత్యతా శక్తి వచ్చేస్తుంది. వారి ప్రతి సంకల్పము సదా సత్యత లేక దివ్యతా సంపన్నంగా ఉంటుంది. సంకల్పము, మాట, కర్మ మరియు సంబంధ-సంపర్కాలు - అన్నిటిలో దివ్యత అనుభవమవుతుంది. సత్యతను ఋజువు చేసే అవసరముండదు. సత్యతా శక్తి ఉండేవారు సంతోషంగా నాట్యము చేస్తూ ఉంటారు.
స్లోగన్ :-
'' సకాశ్నిచ్చే సేవ చేస్తే సమస్యలు సులభంగా పారిపోతాయి. ''