06-06-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - నిరంతరము నా బాబా తండ్రి, టీచరు, సద్గురువు కూడా అని గుర్తుండాలి. ఈ స్మృతియే '' మన్మనాభవ '' ''

ప్రశ్న :-

మాయ ధూళి కనులలో పడినప్పుడు మొట్టమొదట జరిగే పొరపాటు ఏది?

జవాబు :-

మాయ మొట్టమొదట చదువునే వదిలేసే పొరపాటు చేయిస్తుంది. స్వయం భగవంతుడే చదివిస్తున్నారని మర్చిపోతారు. తండ్రి పిల్లలే, తండ్రి చెప్పే చదువును వదిలేస్తారు. ఇది చాలా ఆశ్చర్యము. లేకుంటే జ్ఞానము ద్వారా ఆంతరికములో సంతోషంగా నాట్యము చేస్తూ ఉండాలి. కానీ మాయ ప్రభావము తక్కువైనది కాదు. అది చదువునే విడిపించేస్తుంది. చదువును వదలడం అనగా గైరుహాజరు(ఆబ్సెంట్‌) అవ్వడం.

ఓంశాంతి.

ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఎవరు తక్కువగా అర్థము చేసుకుంటారో వారికే అర్థము చేయించవలసి ఉంటుంది. కొంతమంది చాలా తెలివిగలవారిగా అవుతారు. ఈ బాబా చాలా అద్భుతమైనవారని పిల్లలకు తెలుసు. భలే మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, కానీ వీరు మా అనంతమైన తండ్రే కాక, అనంతమైన టీచరుగా అయ్యి అనంతమైన శిక్షణలను కూడా ఇస్తున్నారని మీకు తెలుసు. సృష్టి ఆదిమధ్యాంత రహస్యాన్ని అర్థం చేయిస్తారు. విద్యార్థి బుద్ధిలో ఇదంతా ఉండాలి కదా. వారు తమ వెంట కూడా తప్పకుండా తీసుకెళ్తారు. ఇది పాత ఛీ-ఛీ ప్రపంచమని, దీని నుండి పిల్లలను తీసుకెళ్లాలని తండ్రికి తెలుసు. ఎచ్చటకు? ఇంటికి. కన్యకు వివాహమైతే అత్తగారింటివారు వచ్చి కన్యను తమ ఇంటికి తీసుకెళ్తారు. ఇప్పుడు మీరిక్కడ కూర్చుని ఉన్నారు. వీరు మన అనంతమైన తండ్రే కాక అనంతమైన శిక్షణ కూడా ఇస్తున్నారని పిల్లలు తప్పకుండా భావిస్తూ ఉండవచ్చు అని బాబా వివరిస్తున్నారు. వీరు ఎంత గొప్ప తండ్రియో, అంత గొప్ప అనంతమైన శిక్షణ కూడా ఇస్తారు. రచన ఆదిమధ్యాంతాల రహస్యము కూడా పిల్లల బుద్ధిలో ఉంది. తండ్రి ఈ ఛీ-ఛీ ప్రపంచము నుండి మనలను వాపస్‌ తీసుకెళ్తారని కూడా మీకు తెలుసు. ఇది ఆంతరికములో స్మృతి చేసినా, దానిని కూడా ''మన్మనాభవ'' అని అంటారు. నడుస్తూ-తిరుగుతూ-లేస్తూ-కూర్చుంటూ బుద్ధిలో ఇదే గుర్తుండాలి. అద్భుతమైన వస్తువులను గుర్తు చేసుకోవాలి కదా. బాగా చదువుకుంటూ, స్మృతి చేస్తూ ఉంటే మనము ఈ విశ్వమంతటికీ అధికారిగా అవుతామని మీకు తెలుసు. ఇది తప్పకుండా బుద్ధిలో మెదులుతూ ఉండాలి. మొదట తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. టీచరు తర్వాత లభిస్తారు. మన తండ్రి అనంతమైన ఆత్మిక తండ్రి అని పిల్లలకు తెలుసు. సులభంగా స్మృతి కలిగించేందుకు బాబా అనేక యుక్తులు తెలిపిస్తున్నారు - ''నన్ను ఒక్కరినే స్మృతి చేయండి.'' ఈ స్మృతి ద్వారానే అర్ధకల్పపు వికర్మలు వినాశనమవుతాయి. పావనమయ్యేందుకు మీరు జన్మ-జన్మాంతరాలు భక్తి, జపము, తపము మొదలైనవి చాలా చేశారు. మందిరాలకు వెళ్తారు, భక్తి చేస్తారు, పరంపర నుండి ఇలాగే చేస్తూ వచ్చామని భావిస్తారు. శాస్త్రాలు ఎప్పటి నుండి విన్నారు? పరంపర నుండి అని అంటారు. మనుష్యులకు ఏ మాత్రము తెలియదు. సత్యయుగమలో శాస్త్రాలు ఉండనే ఉండవు. పిల్లలైన మీరు ఆశ్చర్యపడాలి. తండ్రి తప్ప మరెవ్వరూ ఈ విషయాలు అర్థం చేయించలేరు. వీరు తండ్రే కాక, టీచరు, సద్గురువు కూడా అయ్యారు. వీరు మన బాబా. వీరికి తల్లి గాని, తండ్రి గాని ఎవ్వరూ లేరు. శివబాబా ఫలానా వారి సంతానమని ఎవ్వరూ అనలేరు. ఈ విషయాలన్నీ పదే పదే మీ బుద్ధిలో గుర్తుకు రావాలి. దీనినే 'మన్మనాభవ' అని అంటారు. టీచరై చదివిస్తారు కానీ స్వయం వీరు ఎవ్వరి నుండి చదువుకోలేదు. వీరిని ఎవ్వరూ చదివించలేదు. వారు నాలెడ్జఫుల్‌, మానవ సృష్టికి బీజరూపులు, జ్ఞానసాగరులు. చైతన్యమైనందున అన్నీ వినిపిస్తారు. వారు చెప్తున్నారు - పిల్లలారా, నేను ఎవరిలో అయితే ప్రవేశించానో అతని ద్వారా నేను మీకు ఆది నుండి ఇప్పటి వరకు అన్ని రహస్యాలు అర్థం చేయిస్తాను. చివరి సమయము గురించి తర్వాత తెలుపుతాను. అప్పుడు ఇది అంతిమ సమయమని మీరు కూడా అర్థం చేసుకుంటారు. కర్మాతీత స్థితికి కూడా నంబరువారుగా చేరుకుంటారు. మీరు అంతిమ సమయపు లక్షణాలను కూడా చూస్తారు. పాత సృష్టి వినాశనమయ్యే తీరాలి. ఇది అనేక పర్యాయాలు చూశారు, మళ్లీ చూస్తారు. కల్పక్రితము ఏ విధంగా చదువుకున్నారో ఇప్పుడు కూడా అదే విధంగా చదువుతారు. రాజ్యము తీసుకుని మళ్లీ పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ తీసుకుంటున్నారు. తండ్రి మళ్లీ చదివిస్తున్నారు. చదువు చాలా సులభము. మనము నిజంగా విశ్వానికి అధిపతులుగా ఉండేవారమని, బాబా మళ్లీ వచ్చి ఆ జ్ఞానమంతా మనకిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. లోలోపల ఈ విధంగా చింతన నడుస్తూ ఉండాలని తండ్రి సలహా ఇస్తున్నారు.

బాబా మనకు తండ్రియే కాక టీచరు కూడా అయ్యారు. టీచరును ఎప్పుడైనా మర్చిపోతారా? టీచరు ద్వారా చదువును చదువుకుంటూ ఉంటారు. మాయ కొంతమంది పిల్లలనకు అజాగ్రత్త పరచి పొరపాట్లు చేయిస్తుంది. ఒక్కసారిగా కనులలో దుమ్ము కొట్టినట్లు చేస్తుంది. చదువును కూడా వదిలేస్తారు. చదివించేవారు స్వయం భగవంతుడు. అటువంటి చదువునే వదిలేస్తారు, ముఖ్యమైనది చదువే. దానిని వదిలేసేది ఎవరు? బాబా పిల్లలే. పిల్లలకు ఆంతరికములో ఎంత ఖుషీ (సంతోషము) ఉండాలి. తండ్రి ప్రతి విషయాన్ని గురించిన జ్ఞానమునిస్తారు. కల్ప-కల్పము ఇలాగే ఇస్తారు. కనీసము ఈ విధంగానైనా నన్ను స్మృతి చేయండని తండ్రి అంటున్నారు. కల్ప-కల్పమూ అర్థము చేసుకునేది మీరే, ధారణ చేసేది మీరే. వీరికి తండ్రి ఎవ్వరూ లేరు, స్వయం వారే అనంతమైన తండ్రి. అద్భుతమైన తండ్రి కదా. నాకెవరైనా తండ్రి ఉన్నారా తెలపండి?శివబాబా ఎవరి బిడ్డ? (శివబాబా ఎవరి సంతానము?) ఈ చదువు కూడా అద్భుతమైనది. దీనిని ఈ సమయములో తప్ప మరెప్పుడూ చదవలేరు. అది కూడా బ్రాహ్మణులైన మీరే చదువుతారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పావనంగా అయిపోతామని మీకు తెలుసు. పావనంగా అవ్వకుంటే శిక్షలు అనుభవించవలసి వస్తుంది. గర్భ జైలులో చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. అక్కడ మళ్లీ ట్రిబ్యునల్‌ కూర్చుంటుంది. అన్నీ సాక్షాత్కారమవుతాయి. సాక్షాత్కారము చేయించకుండా శిక్ష వేయరు. ఈ శిక్ష నాకెందుకు లభించింది అని సంశయపడకుండా, వ్యాకులపడకుండా సాక్షాత్కారము చేయిస్తారు. వీరు ఈ పాపము చేశారని, ఈ తప్పు చేశారని తండ్రికి తెలిసి ఉంటుంది. అప్పుడు అన్ని జన్మల పాపాలకు శిక్షలు లభిస్తున్నాయని అనుభవమవుతుంది. అన్ని జన్మల గౌరవము పోయినట్లవుతుంది. అందువలన తండ్రి అంటున్నారు - మధురమైన పిల్లలారా! మంచిరీతిగా పురుషార్థము చేయాలి. 16 కళా సంపూర్ణులుగా అయ్యేందుకు స్మృతి చేసే శ్రమ చేయాలి. ఎవ్వరికీ దుఃఖము ఇవ్వడం లేదు కదా? అని పరిశీలించుకోవాలి. మనము సుఖదాత అయిన తండ్రి పిల్లలము కదా. చాలా మంచి పుష్పాలుగా తయారవ్వాలి. మీ వెంట వచ్చేది ఈ చదువు మాత్రమే. చదువు ద్వారానే మనుష్యులు, వకీళ్ళు మొదలైనవారిగా అవుతారు. తండ్రి తెలిపే ఈ జ్ఞానము చాలా భిన్నమైనది, సత్యమైనది. ఇది గుప్తంగా ఉన్న పాండవ ప్రభుత్వము. మీరు తప్ప ఇతరులెవ్వరూ అర్థము చేసుకోలేరు. ఈ చదువు చాలా అద్భుతమైనది. ఆత్మయే వింటుంది. తండ్రి పదే పదే తెలిపిస్తున్నారు - చదువును ఎప్పుడూ వదలరాదు. కానీ మాయ విడిపిస్తుంది. తండ్రి అంటున్నారు - ఇలా చేయకండి, చదువు వదిలేయకండి. తండ్రి వద్దకు రిపోర్టులు వస్తాయి కదా. రిజిస్ట్టరు ద్వారా అంతా తెలిసిపోతుంది. మీరు ఎన్ని రోజులు హాజరు కాలేదో తెలుస్తుంది. చదువును వదిలేస్తే తండ్రిని కూడా మర్చిపోతారు. వాస్తవానికి ఇది మర్చిపోయే వస్తువు కానే కాదు. వారు అద్భుతమైన తండ్రి. టీచరుగా అయ్యి అర్థము కూడా చేయిస్తారు. ఇది ఒక నాటకము వలె ఉంది. నాటకము గురించి ఎవరికైనా వినిపిస్తే వెంటనే గుర్తు ఉండిపోతుంది కదా. ఎప్పటికీ మర్చిపోరు. ఇతడు తన అనుభవాన్ని కూడా వినిపిస్తున్నారు. చిన్నతనములోనే వైరాగ్య భావాలుండేవి. ఈ ప్రపంచములో చాలా దుఃఖాలున్నాయని అనేవారు. ''ఇప్పుడు నా వద్ద పదివేలు ఉంటే చాలు, 50 రూపాయలు వడ్డీ లభిస్తుంది, దానితో స్వతంత్రంగా ఉండవచ్చు, ఇల్లు-వాకిలి నిర్వహించడం కష్టము'' అని అనుకునేవాడిని. అచ్ఛా ఒకసారి సౌభాగ్యసుందరి సినిమా చూశాను - వైరాగ్యమంతా ఎగిరిపోయింది. పెళ్ళి చేసుకోవాలని, ఇది చేయాలి, అది చేయాలని ఆలోచనలు కలిగాయి. మాయ ఒకే ఒక చెంపదెబ్బ వేసింది. దానితో కళాకాంతులన్నీ సమాప్తమైపోయాయి. కావున తండ్రి ఇప్పుడు అంటున్నారు - పిల్లలారా, ఈ ప్రపంచమే నరకము. అందులో ఉండే ఈ నాటకాలు(సినిమాలు) కూడా నరకమే. ఇది చూసినందున అందరి వృత్తులు(భావాలు) చెడిపోతాయి. వార్తాపత్రికలు చదువుతారు, అందులో మంచి మంచి స్త్రీల చిత్రాలు చూస్తే భావన అటువైపు పరిగెడ్తుంది. ఈమె చాలా అందముగా ఉంది అని బుద్ధిలోకి వస్తుంది కదా. వాస్తవానికి ఇటువంటి ఆలోచనలు కూడా నడవరాదు. బాబా అంటున్నారు - ఈ ప్రపంచమే సమాప్తమైపోనున్నది. అందువలన మీరు అన్నిటినీ మరచి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. అటువంటి చిత్రాలు మొదలైనవి ఎందుకు చూస్తారు? ఇటువంటి విషయాలు మీ భావాలను క్రిందికి(నీచానికి) తీసుకొస్తాయి. మీరు చూసేదంతా శ్మశానము పాలవుతుంది. ఈ కనులతో ఏవైతే చూస్తున్నారో వాటినేవీ స్మృతి చేయకండి. వాటి నుండి మమకారమును తొలగించి వేయండి. ఈ శరీరాలన్నీ పాతవి, పనికిరానివి, అశుద్ధమైనవి. ఆత్మ శుద్ధంగా అవుతుంది కానీ శరీరమేమో ఛీ-ఛీదే కదా. అటువైపు గమనము ఎందుకు ఇవ్వాలి? ఒక్క తండ్రిని మాత్రమే చూడాలి.

తండ్రి అంటున్నారు - మధురమైన పిల్లలారా గమ్యము చాలా ఉన్నతమైనది. విశ్వానికి అధికారులుగా అయ్యేందుకు ఇతరులెవ్వరూ ప్రయత్నము కూడా చేయలేరు. ఇతరుల బుద్ధిలోకి కూడా రాజాలదు. మాయ ప్రభావము తక్కువైనదేమీ కాదు. సైన్స్‌ వారి బుద్ధి ఎంతో తీవ్రంగా పని చేస్తుంది. మీది సైలెన్స్‌(నిశ్శబ్ధము). ముక్తి పొందుకోవాలని అందరూ కోరుకుంటారు. కానీ మీ లక్ష్యము జీవన్ముక్తిని పొందడం. ఇది కూడా తండ్రి అర్థం చేయించారు. ఏ గురువు కూడా ఇటువంటి జ్ఞానమివ్వలేరు. మీరు గృహస్థములో ఉంటూ రాజ్య పదవి పొందేందుకు పవిత్రులుగా అవ్వాలి. భక్తిమార్గములో సమయము చాలా వృథా చేశారు. ఎంత తప్పు చేశామో ఇప్పుడు మీకు అర్థమయ్యింది. తప్పులు చేస్తూ చేస్తూ తెలివిహీనులై పూర్తి రాతి బుద్ధిగలవారిగా అయిపోయారు. ఇది చాలా అద్భుతమైన జ్ఞానమని, దీని ద్వారా మనము ఎలా ఉండేవారము, ఎలా తయారవుతామో, రాతి బుద్ధి నుండి పారసబుద్ధిగా తయారవుతామని మీ లోలోపల అనిపిస్తుంది. అలా వస్తే, మన బాబా అనంతమైన బాబా అని సంతోషపు పాదరస మీటరు పైకి పెరిగిపోతుంది. వారికి తండ్రి అంటూ ఎవ్వరూ లేరు. వారు టీచరు కానీ వారికి టీచరు ఎవ్వరూ లేరు. ఎక్కడ నుండి నేర్చుకున్నారు అని అడుగుతారు. ఆశ్చర్యపడ్తారు కదా. ఎవరైనా గురువు నుండి నేర్చుకున్నారని చాలా మంది భావిస్తారు. అయితే గురువుకు ఇంకా వేరే శిష్యులు కూడా ఉంటారు కదా. కేవలం ఒకే శిష్యుడుంటాడా? గురువులకు శిష్యులు అనేకమంది ఉంటారు. ఆగాఖాన్‌కు ఎంతమంది శిష్యులున్నారో చూడండి. గురువులంటే శిష్యులకు ఆంతరికములో చాలా గౌరవముంటుంది. గురువులను వజ్రాలతో తులాభారము చేస్తారు. మీరు ఇటువంటి సద్గురువును దేనితో తూస్తారు? వీరు అనంతమైన సద్గురువు. వీరి బరువు ఎంత! ఒక్క వజ్రము అంత కూడా ఉండదు.

ఇలాంటి విషయాలు పిల్లలైన మీరు ఆలోచిస్తూ ఉండాలి. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. ఓ ఈశ్వరా! అని అందరూ అంటూ ఉంటారు. కానీ వారు మన తండ్రి, టీచరు, గురువు కూడా అని ఎవ్వరూ భావించరు. ఇతనేమో సాధారణ రీతిగా కూర్చొని ఉంటారు. అందరి ముఖాలను చూచేందుకు గద్దె పై కూర్చుంటారు. గౌరవము కొరకు కాదు. పిల్లలంటే ప్రేమ ఉంటుంది కదా. సహాయపడే ఈ పిల్లలు లేకుండా స్థాపన చేయలేరు. ఎక్కువ సహాయపడే పిల్లలను తప్పకుండా ఎక్కువగా ప్రేమిస్తారు. ఎక్కువగా సంపాదించే పుత్రుడు మంచివాడైతే, తప్పకుండా ఉన్నతపదవి తీసుకుంటాడు. అతడి పైకే ప్రేమ ప్రవహిస్తుంది. పిల్లలను చూస్తూ చూస్తూ బాబా హర్షితమవుతారు. ఆత్మ చాలా సంతోషిస్తుంది. కల్ప-కల్పము పిల్లలను చూసి సంతోషిస్తాను. కల్ప-కల్పము పిల్లలే సహాయకారులుగా అవుతారు. చాలా ప్రియమనిపిస్తారు. కల్ప-కల్పాంతరాలకు ప్రేమ జోడింపబడ్తుంది. ఎక్కడ కూర్చుని ఉన్నా, ఏం చేస్తున్నా బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి. వీరు అనంతమైన తండ్రి. వీరికి తండ్రి ఎవ్వరూ లేరు, వీరికిి టీచరు కూడా ఎవ్వరూ లేరు. సర్వస్వమూ వారొక్కరే. అందరూ వారినే స్మృతి చేస్తారు. సత్యయుగములో ఎవ్వరూ వారిని స్మృతి చేయరు. 21 జన్మలకు మీ నావ తీరానికి చేరుకుంటుంది. మీకు ఎంత సంతోషముండాలి. ఆ సంతోషముంటే రోజంతా తండ్రి సేవ చేస్తారు. ఇటువంటి తండ్రి పరిచయమునివ్వండి. తండ్రి నుండి ఈ(లక్ష్మీనారాయణులు) వారసత్వము లభిస్తుంది. తండ్రి మనకు రాజయోగము నేర్పిస్తారు. అందరినీ వెంట కూడా తీసుకెళ్తారు. పూర్తి చకమ్రంతా బుద్ధిలో ఉంది. ఇటువంటి చక్రమును ఎవ్వరూ తయారు చేయలేరు. దీని అర్థము ఎవ్వరికీ తెలియనే తెలియదు. బాబా మన అనంతమైన బాబాయే కాక, అనంతమైన రాజ్యము కూడా ఇచ్చి, వెంట కూడా తీసుకెళ్తారని మీరిప్పుడే తెలుసుకున్నారు. ఈ విధంగా మీరు అర్థం చేయిస్తే తర్వాత ఎవ్వరూ సర్వవ్యాపి అని అనలేరు. ఆ తండ్రి తండ్రే కాక శిక్షకుడు కూడా అయ్యారు, కావున సర్వవ్యాపి ఎలా అవుతారు?

అనంతమైన తండ్రి ఒక్కరే జ్ఞానసాగరులు. సంపూర్ణ సృష్టి ఆదిమధ్యాంతాలు సంపూర్ణంగా తెలిసినవారు. తండ్రి పిల్లలకు తెలుపుతున్నారు - చదువును మర్చిపోకండి. ఇది చాలా గొప్ప చదువు. బాబా పరమపిత, పరమ శిక్షకుడు, పరమ గురువు కూడా అయ్యారు. ఈ గురువులందరిని కూడా వారు తీసుకెళ్తారు. ఇటువంటి అద్భుతమైన విషయాలను వినిపించాలి. ఇది అనంతమైన నాటకము అని కూడా చెప్పండి. ప్రతి ఒక్క నటునికి తన పాత్ర లభించి ఉంది. అనంతమైన తండ్రి ద్వారా మనమే అనంతమైన సార్వభౌమత్వము తీసుకుంటాము. మనమే యజమానులుగా ఉండేవారము. ఒకప్పుడు వైకుంఠము ఉండేది, ఇప్పుడు లేదు. మళ్లీ తప్పకుండా వస్తుంది. కృష్ణుడు నూతన ప్రపంచానికి అధికారిగా ఉండేవాడు. ఇప్పుడు పాత ప్రపంచమైపోయింది. మళ్లీ నూతన ప్రపంచానికి అధికారిగా అవుతాడు. చిత్రాలలో కూడా స్పష్టంగా ఉంది. ఇప్పుడు మన కాలు నరకము వైపు, ముఖము స్వర్గము వైపు ఉంది. ఇదే గుర్తుంటుంది. ఇవన్నీ మీకు తెలుసు. ఈ విధంగా స్మృతి చేస్తూ చేస్తూ అంతమతి సో గతి అయిపోతారు. ఇవి ఎంత మంచి మంచి విషయాలు! వీటిని స్మృతి చేస్తూ ఉండాలి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. ఈ కనులకు ఏదైతే కనిపిస్తుందో, దాని పై మమకారాన్ని పూర్తిగా తొలగించి వేయాలి. ఒక్క తండ్రినే చూడాలి. వృత్తిని(దృష్టి కోణాన్ని) శుద్ధంగా చేసుకునేందుకు ఈ ఛీ-ఛీ శరీరాల వైపు కొద్దిగా కూడా ధ్యాస(గమనము) వెళ్లరాదు.

2. తండ్రి వినిపించే అతీతమైన(న్యారా, భిన్నమైన), సత్యమైన జ్ఞానాన్ని బాగా చదవాలి, చదివించాలి. చదువును ఎప్పుడూ మిస్‌ చేయరాదు.

వరదానము :-

'' మీ మస్తకం పై సదా తండ్రి ఆశీర్వాదాల చేతిని అనుభవం చేసే మాస్టర్‌ విఘ్న - వినాశక భవ ''

గణేశుని విఘ్నవినాశకుడని అంటారు. ఎవరిలో సర్వ శక్తులుంటాయో, వారే విఘ్న వినాశకులుగా అవుతారు. సర్వ శక్తులను సమయానుసారము కార్యములో ఉపయోగిస్తే విఘ్నాలు నిలబడలేవు. మాయ ఎన్ని రూపాలలో వచ్చినా, మీరు నాలెడ్జ్‌ఫుల్‌గా(జ్ఞాన సంపన్నులుగా) అవ్వండి. నాలెడ్జ్‌ఫుల్‌ ఆత్మ ఎప్పుడూ మాయతో ఓడిపోదు. మస్తకము పై బాప్‌దాదా ఆశీర్వాదాల చేయి ఉంటే విజయ తిలకము దిద్దబడే ఉంటుంది. పరమాత్మ చేయి మరియు తోడు విఘ్నవినాశకులుగా చేస్తుంది.

స్లోగన్‌ :-

'' స్వయంలో గుణాలను ధారణ చేసి ఇతరులకు గుణ దానము చేసేవారే గుణమూర్తులు. ''