02-04-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - ఇప్పుడు మీ మోహము అన్ని వైపుల నుండి తొలగిపోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్లాలి, బ్రాహ్మణ కులమును అవమానపరచే ఏ వికర్మలూ చేయరాదు.''
ప్రశ్న :-
తండ్రి ఎలాంటి పిల్లలను చూచి చాలా హర్షితంగా అవుతారు? ఎలాంటి పిల్లలు తండ్రి కనులలో ఇమిడి ఉంటారు?
జవాబు :-
ఏ పిల్లలైతే అనేమందిని సుఖమునిచ్చేవారిగా చేస్తారో, సేవాధారులుగా ఉన్నారో, వారిని చూసి చూసి తండ్రి కూడా హర్షితంగా అవుతారు. ఒక్క బాబాతోనే మాట్లాడ్తాను, బాబాతోనే చెప్తాను........ అని ఏ పిల్లల బుద్ధిలో ఉంటుందో అలాంటి పిల్లలు తండ్రి కనులలో ఇమిడి ఉంటారు. నా సర్వీసు చేసే పిల్లలు నాకు అతిప్రియమైనవారు. అటువంటి పిల్లలను నేను స్మృతి చేస్తానని బాబా అంటారు.
ఓంశాంతి.
మేము తండ్రి సన్ముఖములో కూర్చుని ఉన్నామని, ఆ తండ్రే టీచరు రూపములో చదివిస్తారని, ఆ తండ్రే పతితపావనులు, సద్గతిదాత అని, తమ జతలో కూడా తీసుకెళ్తారని, అంతేకాక అతిసహజమైన మార్గమును కూడా తెలియచేస్తారని మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తెలుసు. పతితుల నుండి పావనంగా చేసేందుకు పెద్ద శ్రమనేమీ ఇవ్వరు. ఎక్కడికైనా వెళ్ళండి. నడుస్తూ, తిరుగుతూ, విదేశాలకు వెళ్తూ కేవలం స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి చెప్తున్నారు. మీరు అలాగే భావిస్తున్నారు అయినప్పటికీ స్వయాన్ని ఆత్మ అని నిశ్చయము చేసుకోండి, దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానులుగా అవ్వండి అని చెప్తారు. మనము ఆత్మలము, పాత్ర చేసేందుకు శరీరాన్ని తీసుకుంటాము. ఒక శరీరము ద్వారా పాత్ర చేసి మళ్లీ మరొక దానిని తీసుకుంటాము. కొందరి పాత్ర 100 సంవత్సరాలు, కొందరిది 80 సంవత్సరాలు ఉంటుంది, కొందరిది 2 సంవత్సరాలు, కొందరిది 6 మాసములు మాత్రమే ఉంటుంది, కొందరు జన్మ తీసుకుంటూనే అంతమైపోతారు. కొందరు జన్మించేందుకు ముందే గర్భములోనే సమాప్తమైపోతారు. ఇక్కడి పునర్జన్మలకు, సత్యయుగపు పునర్జన్మలకు రాత్రింబవళ్ళ వ్యతాసముంది. ఇక్కడ గర్భము నుండి జన్మ తీసుకుంటారు, దీనిని గర్భజైలు అంటారు. సత్యయుగములో గర్భజైలు ఉండదు, అక్కడ వికర్మలు జరగనే జరగవు. అసలు రావణ రాజ్యమే ఉండదు. తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. అనంతమైన తండ్రి కూర్చొని ఈ శరీరము ద్వారా అర్థం చేయిస్తున్నారు. ఇతని శరీరములోని ఆత్మ కూడా వింటుంది. వినిపించేవారు జ్ఞానసాగరులైన తండ్రి. వారికి తమ స్వంత శరీరము లేదు. సదా వారిని శివుడనే అంటారు. ఎలాగైతే వారు పునర్జన్మ రహితులో అలా నామ-రూపాలు తీసుకొనుట నుండి కూడా రహితులు(వారి పేరు ఎప్పుడూ మారదు). వారిని సదా శివుడని అంటారు. సదా వారు శివుడే. వారికి శారీరిక నామము ఉండదు. ఇతనిలో ప్రవేశము చేస్తారు. అప్పుడు కూడా ఇతని శరీరము పేరు వారికి వర్తించదు. ఇది మీ అనంతమైన సన్యాసము. వారు హద్దులోని సన్యాసులు. వీరి పేర్లు కూడా మారిపోతాయి. మీకు కూడా బాబా ఎంత మంచి-మంచి పేర్లు పెట్టారు. డ్రామానుసారంగా ఎవరికి పేర్లు పెట్టారో వారు మాయమైపోయారు. నా వారయ్యారు కనుక తప్పకుండా స్థిరంగా ఉంటారు, వదిలి వెళ్లిపోరు అని బాబా అనుకున్నారు కానీ వెళ్లిపోయారు. మరి పేర్లు పెట్టడము వలన లాభమేముంది? కొందరు సన్యాసులు కూడా మళ్లీ ఇంటికి వస్తారు. అప్పుడు వారికి మళ్లీ పాత పేరే నడుస్తుంది. ఇంటికి వాపస్ అంటూ వస్తారు కదా. సన్యాసము తీసుకున్నట్లయితే వారి బంధు-మిత్రులు మొదలైనవారి జ్ఞాపకము రారని కాదు. కొందరికి బంధు-మిత్రులు మొదలైనవారందరూ జ్ఞాపకము వస్తూ ఉంటారు, మోహములో చిక్కుకొనిపోతారు. మోహము తగుల్కునే ఉంటుంది. కొందరికి తక్షణము సంబంధము తెగిపోతుంది. తప్పకుండా తెంచే తీరాలి. ఇప్పుడు వాపస్ వెళ్ళాలి అని తండ్రి అర్థం చేయించారు. తండ్రి స్వయంగా కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఉదయము కూడా బాబా తెలిపించారు. చూసి చూసి మనసులో సుఖము కలుగుతుంది,................. ఎందుకు? ఎందుకంటే కనులలో పిల్లలు ఇమిడి ఉన్నారు. ఆత్మలు కంటిపాపలు(బిందువులు). తండ్రి కూడా పిల్లలను చూసి చూసి సంతోషిస్తారు కదా. కొందరు చాలా మంచి పిల్లలుగా ఉంటారు. సేవాకేంద్రాన్ని సంభాళన చేస్తారు. మరి కొందరు బ్రాహ్మణులుగా అయ్యి మళ్లీ వికారాలలోకి వెళ్ళిపోతారు. కనుక వారు అవజ్ఞాకారులు(ఆజ్ఞను ధిక్కరించేవారు). కనుక ఈ తండ్రి కూడా సర్వీసెబుల్(సేవాధారి) పిల్లలను చూసి హర్షితంగా అవుతారు. వీడు కులకళంకితుడిగా అయినాడని, బ్రాహ్మణ కులపు పేరును పాడు చేస్తున్నాడని అనంతమైన తండ్రి అంటాడు. ఎవరి నామ-రూపాలలో చిక్కుకోకండి. అటువంటివారిని కూడా సెమీ కులకళంకితులని అంటారని బాబా చెప్తూ ఉంటారు. సెమీ నుండి మళ్లీ ఫైనల్(పూర్తి) కూడా అయిపోతారు. బాబా మేము పడిపోయాము, ముఖము నల్లగా చేసుకున్నాము, మాయ మోసము చేసింది, మాయా తుఫాన్లు చాలా వస్తాయని స్వయంగా వారే వ్రాస్తారు. కామఖడ్గమును ఉపయోగించడమంటేే ఒకరికొకరు దు:ఖము కలిగించుకోవడం అని తండ్రి చెప్తున్నారు. కనుక ప్రతిజ్ఞ చేయిస్తారు. రక్తాన్ని తీసి ఆ రక్తముతో పెద్ద ఉత్తరాన్ని వ్రాసినవారు కూడా ఈ రోజు లేరు. ఓహో మాయా! నీవు చాలా శక్తిశాలివి. రక్తముతో వ్రాసిన పిల్లలను కూడా నీవు తినేశావు అని తండ్రి అంటారు. ఎలా బాబా సమర్థమైనవారో అలా మాయ కూడా సమర్థమైనదే. అర్ధకల్పము తండ్రి సామర్థ్యపు వారసత్వము లభిస్తుంది. తర్వాత అర్ధకల్పము తిరిగి మాయ ఆ సమర్థతను కోల్పోయేలా చేస్తుంది. ఇది భారతదేశపు విషయం. దేవీదేవతా ధర్మము వారే సంపన్నుల నుండి భికారులౌతారు. ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణుల మందిరాలకు వెళ్తారు. మేము ఈ వంశములోనే ఉండేవారము. కానీ ఇప్పుడు చదువుతున్నాము అని మీరు ఆశ్చర్యపడ్తారు. ఇతని ఆత్మ కూడా తండ్రి ద్వారా చదువుతోంది. మొదట మీరు ఎక్కడకు వెళ్లినా తల వంచి నమస్కరిస్తూ ఉండేవారు. ఇప్పుడు జ్ఞానముంది. ప్రతి ఒక్కరి పూర్తి 84 జన్మల జీవితచరిత్ర మీకు తెలుసు. ప్రతి ఒక్కరు తమ పాత్రను అభినయిస్తారు.
పిల్లలారా సదా హర్షితంగా ఉండండి. ఇక్కడి హర్షిత సంస్కారమునే మళ్లీ జతలో తీసుకెళ్తారని తండ్రి చెప్తున్నారు. మనము ఏమవుతామో మీకు తెలుసు. అనంతమైన తండ్రి మనకు ఈ వారసత్వమును ఇస్తున్నారు. ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. ఈ లక్ష్మీనారాయణులు ఎక్కడకు వెళ్ళారో తెలిసిన మనుష్యమాత్రులు ఎవ్వరూ లేరు. ఎక్కడ నుండి వచ్చారో అక్కడకు వెళ్లిపోయారని అనుకుంటారు. భక్తిమార్గములో కూడా మీరు వేదశాస్త్రాలను చదివేవారు. ఇప్పుడు నేను మీకు జ్ఞానాన్ని వినిపిస్తాను. ఇప్పుడు బుద్ధి ద్వారా భక్తి రైటా లేక నేను రైటా? అని మీరే నిర్ణయించుకోండి అని తండ్రి చెప్తున్నారు. తండ్రి అయిన రాముడు సత్యమైనవారు, రావణుడు అసత్యమైనవాడు. ప్రతి విషయములో అసత్యమే చెప్తారు. ఇలా జ్ఞాన విషయాల గురించే చెప్పడం జరుగుతుంది. మొదట మనమందరము అసత్యమే చెప్పేవారమని మీకు తెలుసు. దానపుణ్యాలు మొదలైనవి చేస్తూ కూడా మెట్లు క్రిందకు దిగుతూనే వచ్చారని మీరు అర్థము చేసుకున్నారు. మీరు ఆత్మలకే ఇస్తారు. పాపాత్మలు పాపాత్మలకే దానము చేస్తే పుణ్యాత్మలుగా ఎలా అవుతారు? అక్కడ ఆత్మలు పరస్పరము ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవు. ఇక్కడైతే లక్షల రూపాయలు అప్పుగా తీసుకుంటూ ఉంటారు. ఈ రావణ రాజ్యములో అడుగడుగునా మనుష్యులకు దు:ఖముంది. ఇప్పుడు మీరు సంగమ యుగములో ఉన్నారు. మీ అడుగడుగులో పదమాలు(కోటానుకోట్లు) ఉన్నాయి. దేవతలు పదమపతులుగా ఎలా అయ్యారో ఎవ్వరికీ తెలియదు. స్వర్గమైతే తప్పకుండా ఉండేది, అందుకు గుర్తులున్నాయి. అయితే క్రిందటి జన్మలో ఏ కర్మలు చేయడం వలన ఈ రాజ్యభాగ్యము లభించిందో వారికి తెలియదు. అది నూతన సృష్టి. కనుక వ్యర్థ ఆలోచనలు రానే రావు. దానిని సుఖధామమని అంటారు. ఇది 5 వేల సంవత్సరాల విషయము. మీరు సుఖము కొరకు, పావనంగా అయ్యేందుకు చదువుతారు. అనేక యుక్తులు వెలువడ్తాయి. తండ్రి ఎంతో మంచి రీతిగా అర్థం చేయిస్తారు. శాంతిధామము ఆత్మల నివాస స్థానము. దానిని స్వీట్ హోమ్ అని అంటారు. ఉదాహరణానికి విదేశాల నుండి వచ్చునప్పుడు ఇప్పుడు మేము మా స్వీట్ హోమ్కు వెళ్తున్నామని భావిస్తారు. మీ స్వీట్ హోమ్ శాంతిధామము. తండ్రి కూడా శాంతిసాగరులు కదా. వీరి పాత్ర చివరిలో ఉంటుంది. కనుక ఎంత సమయము శాంతిలో ఉంటారు! బాబా పాత్ర చాలా చిన్నది. ఈ డ్రామాలో మీది నాయకీ - నాయకుల(హీరో- హీరోయిన్ల) పాత్ర. మీరు విశ్వాధికారులుగా అవుతారు. ఈ నషా ఎప్పుడూ ఎవ్వరిలోనూ ఉండదు. వేరెవ్వరి భాగ్యములోనూ స్వర్గ సుఖము లేనే లేదు. ఇది పిల్లలైన మీకు మాత్రమే లభిస్తుంది. ఏ పిల్లలను తండ్రి చూస్తారో వారంతా ''బాబా, మీతోనే మాట్లాడ్తాము, మీకే చెప్తాము,.........'' అని అంటారు. పిల్లలైన మిమ్ములను చూసి నేను చాలా సంతోషిస్తానని తండ్రి కూడా చెప్తున్నారు. నేను మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చాను. పిల్లలను దు:ఖధామము నుండి సుఖధామానికి తీసుకెళ్తాను ఎందుకంటే కామచితి పై ఎక్కుతూ ఎక్కుతూ కాలి భస్మమైపోయారు. ఇప్పుడు వారిని శ్మశానము నుండి వెలికి తీయాలి. ఆత్మలందరూ హాజరుగా ఉన్నారు కదా, వారిని పావనంగా చేయాలి.
పిల్లలూ! బుద్ధి ద్వారా ఒక్క సద్గురువునే స్మృతి చేయండి. ఇతరులందరినీ మర్చిపోండి అని తండ్రి చెప్తున్నారు. ఒక్కరితోనే సంబంధముంచుకోవాలి. మీరు వచ్చారంటే మీరు తప్ప మాకెవ్వరూ ఉండరు. మీ మతము పైనే నడుస్తాము, శ్రేష్ఠముగా అవుతాము అని మీరు అన్నారు కూడా. సర్వ శ్రేష్ఠులు ఒక్క భగవంతుడే అని గానము కూడా చేస్తారు. వారి మతము కూడా శ్రేష్ఠమైనదే. ఇప్పుడు మీకు ఇస్తున్న ఈ జ్ఞానము మళ్లీ ప్రాయ: లోపమైపోతుందని తండ్రి స్వయంగా చెప్తున్నారు. భక్తిమార్గములోని శాస్త్రాలు పరంపరగా వస్తున్నాయి, రావణుడు కూడా పరంపరగా వస్తాడని అంటారు. రావణుడిని ఎప్పటి నుండి కాలుస్తున్నారు, ఎందుకు తగులబెట్తున్నారని మీరు అడగండి. వారికేమీ తెలియదు. అర్థము తెలియని కారణంగా ఎంత ఆర్భాటము చేస్తారు! చాలామంది సందర్శకులను(విజటర్స్) మొదలైనవారిని పిలుస్తారు. ఉత్సవము జరిపినట్లు రావణుడిని ఆడంబరంగా తగులబెట్త్తారు. రావణుడిని ఎప్పటి నుండి తయారు చేస్తూ(చేసి కాలుస్తూ) వచ్చారని మీరు తెలుసుకోలేరా? రోజురోజుకు పెద్దదిగా చేస్తూ పరంపరగా నడుస్తున్నదని చెప్తారు. కానీ అలా ఉండటానికి వీలు లేదు. చివరికి రావణుడిని ఎప్పటివరకు తగులబెట్తూ ఉంటారు? ఇక కొద్ది సమయమే మిగిలి ఉందని తర్వాత రావణ రాజ్యమే ఉండదని మీకు తెలుసు. ఈ రావణుడే అందరికంటే పెద్ద శత్రువని, అతని పై విజయము పొందాలని తండ్రి చెప్తున్నారు. మనుష్యుల బుద్ధిలో అనేక విషయాలున్నాయి. ఈ డ్రామాలో ప్రతి సెకండు ఏమేమి నడుస్తుందో అదంతా రచింపబడి ఉందని మీకు తెలుసు. ఎన్ని గంటలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మాసములు మన పాత్ర నడుస్తుందో మీరు తిథి-తారీఖుల సహితముగా పూర్తి లెక్కను తీయగలరు. ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. బాబా మనకు ఇది తెలియజేస్తున్నారు. నేను పతితపావనుడనని తండ్రి చెప్తున్నారు. మీరు వచ్చి మమ్ములను పావనంగా చేయండి అని నన్ను పిలుస్తారు. పావన ప్రపంచమనగా శాంతిధామము, సుఖధామాలు. ఇప్పుడందరూ పతితులుగా ఉన్నారు. సదా బాబా, బాబా అని అంటూ ఉండండి. ఇది మర్చిపోరాదు. అప్పుడు సదా శివబాబా గుర్తుకు వస్తారు. వీరు మా తండ్రి, మొట్టమొదట ఈ అనంతమైన తండ్రి. బాబా అని అనడము వలననే వారసత్వపు సంతోషము కలుగుతుంది. కేవలం భగవంతుడా! లేక ఈశ్వరా! అని అనడం వలన ఎప్పుడూ ఇలాంటి వారసత్వ ఆలోచన రాదు. అనంతమైన తండ్రి బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తున్నారని అందరికీ చెప్పండి. ఈ బ్రహ్మ వారి రథము. నేను పిల్లలైన మిమ్ములను ఇలా తయారు చేస్తానని ఇతని ద్వారా చెప్తున్నారు. ఈ బ్యాడ్జ్లో మొత్తం జ్ఞానమంతా నిండి ఉంది. అంతిమములో మీకు శాంతిధామము, సుఖధామమే గుర్తు ఉంటుంది. దు:ఖధామాన్ని మర్చిపోతూ ఉంటారు. నెంబరువారుగా అందరూ తమ తమ సమయాలలో మరలా వస్తారని కూడా మీకు తెలుసు. ఇస్లాం మతస్థులు, బౌద్ధులు, క్రైస్తవులు మొదలైనవారు ఎంతో మంది ఉన్నారు. అనేక భాషలు ఉన్నాయి. మొట్టమొదట ఒకే ధర్మముండేది. తర్వాత దాని నుండి ఎన్నో వెలువడ్డాయి. ఎన్నో యుద్ధాలు మొదలైనవి జరిగాయి. అందరూ కొట్లాడుకుంటూనే ఉన్నారు ఎందుకంటే దిక్కులేనివారిగా అయిపోయారు కదా. నేను మీకు ఏ రాజ్యమును ఇస్తానో దానిని ఎప్పుడూ ఎవ్వరూ మీ నుండి లాక్కోలేరు అని తండ్రి చెప్తున్నారు. ఎవ్వరూ లాక్కోలేని స్వర్గ వారసత్వమును తండ్రి ఇస్తారు. ఇందులో అఖండంగా, స్థిరంగా, అచంచలంగా ఉంటారు. మాయా తుఫాన్లు తప్పకుండా వస్తాయి. ఎవరైతే ముందు ఉంటారో వారు అన్నీ అనుభవము చేస్తారు కదా. వ్యాధులు మొదలైనవన్నీ సదా కాలానికి సమాప్తమవ్వనున్నవి కనుక కర్మల లెక్కాచారాలు, వ్యాధులు మొదలైనవి ఎక్కువగా వచ్చినప్పుడు భయపడరాదు. ఇవన్నీ చివరి సమయములోనివి. తర్వాత ఉండవు. ఇప్పుడన్నీ ఉప్పొంగుతాయి. వృద్ధులను కూడా మాయ యవ్వనులుగా చేసేస్తుంది. మనుష్యులు వానప్రస్థము తీసుకుంటే అక్కడ స్త్రీలు ఉండరు. సన్యాసులు కూడా అడవులకు వెళ్తారు. అక్కడ కూడా స్త్రీలు ఉండరు. వారు ఎవరివైపు చూడను కూడా చూడరు. భిక్ష తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇంతకు ముందు అస్సలు స్త్రీల వైపు చూసేవారే కాదు. బుద్ధి తప్పకుండా వెళ్తుంది అని భావించేవారు. సోదరీ-సోదరుల సంబంధములో కూడా బుద్ధి వెళ్తుంది. అందుకే సోదర దృష్టితో చూడండని తండ్రి చెప్తారు. శరీరము ప్రసక్తే వద్దు. ఇది అత్యంత ఉన్నతమైన గమ్యము. ఒక్కసారిగా శిఖరము పైకి వెళ్ళాలి. ఈ రాజధాని స్థాపన అవుతుంది. ఇందులో చాలా శ్రమ ఉంది. మేము లక్ష్మీనారాయణులుగా అవుతామని అంటారు. తప్పకుండా అవ్వండి, శ్రీమతము పై నడవండని బాబా అంటారు. మాయా తుఫాన్లు వస్తూనే ఉంటాయి. కర్మేంద్రియాల ద్వారా ఏమీ చేయరాదు. దివాలా తీయడం మొదలైనవి జరుగుతూనే ఉంటాయి. జ్ఞానములోకి రావడము వలన దివాలా తీశారని కాదు. ఇది నడుస్తూనే ఉంటుంది. మిమ్ములను పతితుల నుండి పావనంగా చేసేందుకే నేను వచ్చానని తండ్రి చెప్తున్నారు. ఒక్కొక్కసారి చాలా బాగా సర్వీసు చేస్తారు, ఇతరులకు తెలియజేస్తారు మళ్లీ దివాలా తీస్తారు.......... మాయ చాలా శక్తివంతమైనది. మంచి మంచి వారు కూడా పడిపోతారు. నా సర్వీసు చేసే పిల్లలే నాకు ప్రియముగా అనిపిస్తారని, చాలా మందిని సుఖదాయులుగా తయారు చేసే పిల్లలను నేను స్మృతి చేస్తూ ఉంటానని తండ్రి చెప్తున్నారు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఎవరి నామ-రూపాలలో కూడా చిక్కుకొని కులకళంకితులుగా అవ్వరాదు. మాయ మోసానికి వశమై ఒకరికొకరు దు:ఖమునిచ్చుకోరాదు. తండ్రి నుండి సమర్థమైన వారసత్వమును తీసుకోవాలి.
2. సదా హర్షితంగా ఉండే సంస్కారాన్ని ఇక్కడ నుండే నింపుకోవాలి. ఇప్పుడు పాపాత్మలతో ఎలాంటి ఇచ్చి పుచ్చుకోవడం ఉండరాదు. రోగాలు మొదలైనవాటికి భయపడరాదు. అన్ని లెక్కాచారాలను ఇప్పుడే సమాప్తము చేసుకోవాలి.
వరదానము :-
''పరిస్థితులను శిక్షకునిగా(టీచరుగా) భావించి వాటి ద్వారా పాఠము చదువుకునే అనుభవీమూర్త్ భవ''
ఎటువంటి పరిస్థితులు వచ్చినా భయపడేందుకు బదులు కొంచెం సమయం వాటిని టీచరుగా భావించండి. పరిస్థితి మిమ్ములను విశేషంగా రెండు శక్తులలో అనుభవీలుగా చేస్తుంది. ఒకటి - సహన శక్తి, రెండవది - ఎదుర్కునే శక్తి. ఈ రెండు పాఠాలు చదువుకుంటే అనుభవీలుగా అవుతారు. మేము ట్రస్టీలము, నాదంటూ ఏదీ లేదు అని అన్నప్పుడు పరిస్థితులకు ఎందుకు భయపడ్తారు? ట్రస్టీ అనగా అన్నిటిని తండ్రి అధీనం చేసేశారు అందువలన ఏం జరుగుతుందో అది మంచిదే జరుగుతుంది - ఈ స్మృతి ద్వారా సదా నిశ్చింతగా సమర్థ స్వరూపంలో ఉండండి.
స్లోగన్ :-
''ఎవరి స్వభావం మధురంగా ఉంటుందో, వారు ఎప్పుడూ పొరపాటున కూడా ఎవ్వరికీ దు:ఖమునివ్వరు.''