05-06-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మొదట ప్రతి ఒక్కరికీ నీవు ఒక ఆత్మవు, నీవు తండ్రిని స్మృతి చేయాలి, స్మృతి ద్వారానే పాపాలు నశిస్తాయి అని అనే మంత్రాన్ని కకూరి కూరి
ప్రశ్న :-
మీరిప్పుడు చేస్తున్న సత్యమైన సేవ ఏది?
జవాబు :-
పతితమైపోయిన భారతదేశాన్ని పావనంగా చేయడం - ఇదే సత్యమైన సేవ. మీరు భారతదేశానికి ఏ సేవ చేస్తున్నారని ప్రజలు అడుగుతారు. మేము శ్రీమతానుసారము చేయు ఆత్మిక సేవ ద్వారా భారతదేశము డబల్ కిరీటధారిగా అవుతుంది. భారతదేశములో ఒకప్పుడున్న శాంతి-సుఖాలను మళ్లీ మేము స్థాపిస్తున్నామని చెప్పండి.
ఓంశాంతి.
మొట్టమొదటి పాఠము - పిల్లలూ! స్వయాన్ని ఆత్మగా భావించండి లేక ''మన్మనాభవ''. ఇది సంస్కృత పదము. ఇప్పుడు పిల్లలు సేవ చేయునప్పుడు మొట్టమొదట అల్ఫ్(భగవంతుడు) గురించిన పాఠము చదివించాలి. ఎప్పుడు, ఎవరు వచ్చినా వారిని శివబాబా చిత్రము ముందుకు తీసుకెళ్లాలి. వేరే చిత్రము ముందుకు తీసుకెళ్లరాదు. మొట్టమొదట తండ్రి చిత్రము వద్దకు తీసుకెళ్లి వారికి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని బాబా చెప్తున్నారని చెప్పండి. నేను మీకు సుప్రీమ్ తండ్రిని, సుప్రీమ్ టీచరు, సుప్రీమ్ గురువును కూడా. అందరికీ ఈ పాఠము నేర్పించాలి. ఈ పాఠము నుండే ప్రారంభము చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి, ఎందుకంటే పతితమైన మీరు పావనంగా, సతోప్రధానంగా అవ్వాలి. ఈ పాఠములో అన్ని విషయాలు వచ్చేస్తాయి. అయితే అందరూ ఇలా చేయరు. బాబా చెప్తున్నారు - మొట్టమొదట శివబాబా చిత్రము వద్దకే తీసుకెళ్లాలి. వీరు అనంతమైన బాబా(తండ్రి). నన్ను ఒక్కరినే స్మృతి చేయండి(మామేకమ్ యాద్ కరో) అని బాబా అంటారు. స్వయాన్ని ఆత్మ అని భావిస్తే నావ తీరానికి చేరుకుంటుంది. స్మృతి చేస్తూ చేస్తూ పవిత్ర ప్రపంచానికి వెళ్లే తీరాలి. ఈ పాఠము కనీసము 3 నిముషాలు పదే పదే పక్కా చేయించాలి. తండ్రిని స్మృతి చేశారా? తండ్రి తండ్రియే కాక రచనకు రచయిత కూడా. వారికి రచన ఆదిమధ్యాంతాలు తెలుసు. ఎందుకంటే వారు మానవ సృష్టికి బీజరూపము. మొట్టమొదట ఈ విషయాలు నిశ్చయము చేయించాలి. తండ్రిని స్మృతి చేస్తున్నారా? ఈ జ్ఞానము ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. మేము కూడా ఆ తండ్రి నుండే జ్ఞానము తీసుకున్నాము. ఇప్పుడు ఆ జ్ఞానాన్నే మీకు ఇస్తున్నాము అని వచ్చినవారికి చెప్పాలి. మొట్టమొదట ఈ మంత్రమును పక్కా చేయించాలి - స్వయాన్ని ఆత్మగా భావించి ''తండ్రిని స్మృతి చేస్తే సనాథలుగా అయిపోతారు.'' ఈ చిత్రమును చూపి మొదట ఈ విషయాన్నే అర్థం చేయించాలి. ఇది అర్థము చేసుకోనంతవరకు ముందుకు తీసుకెళ్లరాదు. ఈ విధంగా తండ్రి పరిచయమును తెలుపుతూ 2 - 4 చిత్రాలు ఉండాలి. వీటిని గురించి బాగా అర్థము చేయించినందున - '' మేము తండ్రిని స్మృతి చేయాలి, వారే సర్వశక్తివంతులు, వారిని స్మృతి చేస్తే పాపాలు నశిస్తాయని వారి బుద్ధిలోకి వచ్చేస్తుంది''. తండ్రి మహిమ అయితే చాలా స్పష్టంగా ఉంది. మొట్టమొదట దీనిని తప్పకుండా అర్థము చేయించాలి - ''స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. దేహ సంబంధాలన్నీ మర్చిపోండి.'' నేను సిక్కును, నేను ఫలానా........ ఇది వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. మొట్టమొదట ఈ ముఖ్యమైన విషయము బుద్ధిలో కూర్చోబెట్టండి. ఆ తండ్రి ఒక్కరే పవిత్రత, సుఖము, శాంతుల వారసత్వమును ఇచ్చేవారు. ఆ తండ్రియే స్వభావమును(క్యారెక్టర్ను) సరిదిద్దుతారు, చాలా ముఖ్యమైన మొట్టమొదటి పాఠమును పక్కా చేయించడము లేదని బాబా భావిస్తున్నారు. దీనిని బుద్ధిలో ఎంత బాగా నింపితే అంత స్మృతి ఉంటుంది. తండ్రి పరిచయమివ్వడంలో 5 నిముషాలు పట్టినా, అవతలికి పోరాదు. చాలా రుచితో తండ్రి మహిమను వింటారు. ఈ తండ్రి చిత్రము చాలా ముఖ్యమైనది. క్యూ అంతా ఈ చిత్రము ముందే ఉండాలి. అందరికీ తండ్రి సందేశమునివ్వండి. ఆ తర్వాత రచన యొక్క జ్ఞానమును తెలపండి, చక్రము ఎలా తిరుగుతూ ఉందో తెలపండి. మసాలా కూరి కూరి ఎలా నింపుతారో అలాగే ఈశ్వరీయ మిషన్(సంస్థ) అయిన మీరు ఒక్కొక్క విషయాన్ని కూరి కూరి బుద్ధిలో కూర్చోపెట్టండి. ఎందుకంటే తండ్రిని తెలుసుకోని కారణంగా అందరూ అనాథలైపోయారు. బాబా సుప్రీమ్ తండ్రి, సుప్రీమ్ టీచరు, సుప్రీమ్ గురువు అని పరిచయమివ్వాలి. మూడు సంబంధాలు ఒక్కరే అని తెలిపితే సర్వవ్యాపి అను విషయము వారి బుద్ధి నుండి తొలగిపోతుంది. దీనిని మొట్టమొదట బుద్ధిలో కూర్చోపెట్టండి. తండ్రిని స్మృతి చేయాలి. అప్పుడే మీరు పతితుల నుండి పావనంగా తయారవ్వగలరు. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. సతోప్రధానంగా అవ్వాలి. మీరు వారికి తండ్రి స్మృతిని ఇప్పిస్తారు. అందులో పిల్లలైన మీ కళ్యాణము కూడా ఉంది. మీరు కూడా 'మన్మనాభవ' స్థితిలో ఉంటారు.
మీరు సందేశకులు కనుక తండ్రి పరిచయమునివ్వాలి. బాబా మనకు తండ్రి, టీచరు, సద్గురువు కూడా అయ్యారనే విషయం ఒక్క మనిషికి కూడా తెలియదు. తండ్రి పరిచయము వినడం ద్వారా వారు చాలా సంతోషిస్తారు. భగవానువాచ - నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ పాపాలు నశిస్తాయి. ఇది కూడా మీకు తెలుసు. గీతతో పాటు మహాభారత యుద్ధము కూడా చూపించారు. ఇప్పుడు ఆ యుద్ధము మాటే లేదు. తండ్రిని స్మృతి చేయడంలోనే మీకు యుద్ధముంది. చదువు విషయము వేరు. యుద్ధము బాగా స్మృతిలో ఉంటుంది ఎందుకంటే అందరూ దేహాభిమానములో ఉన్నారు. ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా, తండ్రిని స్మృతి చేయువారిగా అవుతారు. మొట్టమొదట వారు తండ్రి, టీచరు, గురువు అని పక్కా చేయించండి. అప్పుడు మనము వారు మీ మాటలు వినాలా, వారి మాటలు వినాలా అని అడుగుతారు. అందుకు మీరు పిల్లలూ, ఇప్పుడు మీరు శ్రేష్ఠంగా తయారయ్యేందుకు పూర్తిగా శ్రీమతమును అనుసరించమని తండ్రి తెలుపుతున్నారని చెప్పండి. మేము ఇదే సేవ చేస్తున్నాము. ఈశ్వరీయ మతమును అనుసరిస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. '' నన్ను ఒక్కరినే స్మృతి చేయండి '' అని తండ్రి శ్రీమతము. సృష్టి చక్ర జ్ఞానము ఏదైతే అర్థం చేయిస్తామో అది కూడా వారి మతమే. మీరు కూడా పవిత్రంగా అయ్యి నన్ను స్మృతి చేస్తే మిమ్ములను నా వెంట తీసుకెళ్తానని తండ్రి చెప్తున్నారు. బాబా అనంతమైన మార్గదర్శకుడు కూడా. ''ఓ పతితపావనా, మమ్ములను పావనంగా చేసి ఈ పతిత ప్రపంచము నుండి తీసుకెళ్లండి'' అని వారిని పిలుస్తారు. ప్రపంచములో ఉన్నవారు శారీరిక పండాలు(మార్గదర్శకులు). వీరు(శివబాబా) ఆత్మిక పండా. శివబాబా మమ్ములను చదివిస్తున్నారు. తండ్రి మీకు కూడా - ''నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ నన్ను స్మృతి చేస్తూ ఉండండి'' అని చెప్తున్నారు. ఇందులో అలసిపోయే అవసరమే లేదు. అప్పుడప్పుడు పిల్లలు ఉదయము ఉదయమే వచ్చి కూర్చుంటారు అప్పుడు వారు అలసిపోయి ఉండవచ్చని తండ్రి గమనిస్తారు. ఇది సహజ మార్గము. హఠంగా కూర్చోరాదు. భలే లేచి అటూ-ఇటూ తిరగండి, చాలా ఇష్టముతో తండ్రిని స్మృతి చేయాలి. ఆంతరికములో 'బాబా - బాబా' అని చాలా పొంగు, ఉత్సాహము రావాలి. ఎవరు సదా ప్రతి శ్వాసలో తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారో వారికి ఉత్సాహము వస్తుంది. ఇతర విషయాలేమైనా గుర్తుకు వస్తే వాటిని తొలగించాలి. తండ్రి పై చాలా ప్రేమ ఉండాలి. ఆ అతీంద్రియ సుఖము అనుభవము అవుతూ ఉండాలి. మీరు తండ్రి స్మృతిలో లగ్నమైనప్పుడు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. అప్పుడు మీ సంతోషానికి అవధులు ఉండవు. ఈ విషయాలన్నీ ఇక్కడ వర్ణించడం జరుగుతుంది. అందుకే అతీంద్రియ సుఖము గురించి గోప-గోపికలను అడగండి అనే గాయనముంది. వారిని భగవంతుడైన తండ్రే చదివిస్తున్నారు.
భగవానువాచ - ''నన్ను స్మృతి చేయండి''. తండ్రి మహిమనే తెలపాలి. సద్గతి వారసత్వంగా ఒక్క తండ్రి ద్వారా మాత్రమే లభిస్తుంది. అందరికీ సద్గతి తప్పకుండా లభిస్తుంది. మొదట అందరూ శాంతిధామానికి వెళ్తారు. తండ్రి మనకు సద్గతినిస్తున్నారని బుద్ధిలో ఉండాలి. శాంతిధామము, సుఖధామము అని దేనినంటారో అర్థం చేయించబడింది. శాంతిధామములో అన్ని ఆత్మలూ ఉంటాయి. అది మధురమైన ఇల్లు. నిశ్శబ్ధమైన ఇల్లు, నిశ్శబ్ధ శిఖరము(స్వీట్హోమ్, సైలెన్స్ హోమ్, టవర్ ఆఫ్ సైలెన్స్). దానిని ఈ కనులతో ఎవ్వరూ చూడలేరు. సైన్స్(విజ్ఞాన శాస్త్రము) వారికి ఇక్కడ కనిపించే వస్తువులను గురించి మాత్రమే బుద్ధి పని చేస్తుంది. ఆత్మలను ఈ కనులతో ఎవ్వరూ చూడలేరు. కానీ అర్థము చేసుకోగలరు. ఆత్మనే చూడలేకుంటే ఆత్మల తండ్రిని ఎలా చూడగలరు? ఇది అర్థము చేసుకునే విషయము కదా. ఈ కనులతో చూచేది కాదు. భగవానువాచ - నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు భస్మమైపోతాయి. ఇలా ఎవరన్నారు? పూర్తిగా అర్థము చేసుకోనందున కృష్ణుడని అంటారు. కృష్ణుని చాలా స్మృతి చేస్తారు. రోజురోజుకు వ్యభిచారులుగా అవుతూ ఉంటారు. భక్తిలో కూడా మొదట ఒక్క శివుని మాత్రమే భక్తి చేస్తారు, అది అవ్యభిచారి భక్తి. తర్వాత లక్ష్మీనారాయణుల భక్తి...... అత్యంత ఉన్నతమైనవారు భగవంతుడే. విష్ణువుగా తయారయ్యే వారసత్వమును ఇచ్చేది వారే. మీరు శివవంశీయులుగా అయ్యి విష్ణుపురికి అధికారులుగా అవుతారు. మొదటి పాఠము బాగా చదివిన తర్వాతనే మాల తయారవుతుంది. తండ్రిని స్మృతి చేయడం పిన్నమ్మ ఇల్లేమీ కాదు(సులభము కాదు). మనస్సు-బుద్ధి రెండింటిని అన్ని వైపుల నుండి తొలగించి ఒక్క వైపే జోడించాలి. ఈ కనులతో చూచేదానినంతా బుద్ధి నుండి తొలగించాలి.
తండ్రి చెప్తున్నారు - ''నన్ను ఒక్కరినే స్మృతి చేయండి.'' ఇందులో తికమకపడరాదు. తండ్రి ఈ రథములో కూర్చుని ఉన్నారు. వారిని నిరాకారులు అని మహిమ చేస్తారు. ఇతని ద్వారా మీకు క్షణ - క్షణము మన్మనాభవగా ఉండమని స్మృతినిప్పిస్తారు. అందువలన మీరు అందరి పై ఉపకారము చూపినట్లు అవుతుంది. భోజనము తయారు చేయువారికి కూడా శివబాబాను స్మృతి చేస్తూ భోజనం తయారుచేయండి. అప్పుడు తినేవారి బుద్ధి శుద్ధమైపోతుంది అని చెప్తారు. ఒకరికొకరు స్మృతిని ఇప్పించుకోవాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయములో స్మృతి చేస్తారు. కొంతమంది అర్ధగంట కూర్చుంటారు, కొంతమంది 10 నిముషాలు కూర్చుంటారు. 5 నిముషాలు ప్రీతితో తండ్రిని తలంపు చేసినా రాజధానిలోనికి వచ్చేస్తారు. రాజు-రాణి ఎల్లప్పుడూ అందరినీ ప్రేమిస్తారు. మీరు కూడా ప్రేమసాగరులుగా అవుతారు అందువలన అందరి పై ప్రేమ ఉంటుంది. ప్రేమయే ప్రేమ. తండ్రి ప్రేమసాగరులు కనుక పిల్లలకకు కూడా ఇలాంటి ప్రేమ తప్పకుండా ఉంటుంది, అప్పుడే అక్కడ కూడా ఇటువంటి ప్రేమ ఉంటుంది. రాజా - రాణులకు కూడా చాలా ప్రేమ ఉంటుంది. పిల్లలకు కూడా చాలా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ కూడా అనంతమైనది. ఇక్కడ ప్రేమ అనే మాటే లేదు, కామముంది(మార్). అక్కడ ఈ కామ ఖడ్గము, హింస ఏవీ ఉండవు. అందుకే భారతదేశ మహిమ అపారమైనదని మహిమ చేయబడింది. భారతదేశము వంటి పవిత్ర దేశము ఏదీ లేదు. ఇది అన్నింటికంటే గొప్ప తీర్థ స్థానము. తండ్రి భారతదేశములోనే వచ్చి అందరికీ సేవ చేస్తారు, అందరినీ చదివిస్తారు. ముఖ్యమైనది చదువు. కొంతమంది ''భారతదేశానికి మీరు ఏ సేవ చేస్తున్నారు'' అని అడుగుతారు. ఇప్పుడు పతితంగా ఉన్న భారతదేశము పావనంగా అవ్వాలని మీరు కోరుకుంటున్నారు కదా. మేము శ్రీమతమును అనుసరించి భారతదేశాన్ని పావనంగా చేస్తున్నామని, తండ్రిని స్మృతి చేస్తే పతితుల నుండి పావనంగా అవుతారని అందరికీ చెప్పండి. ఈ ఆత్మిక సేవను మేము చేస్తున్నామని చెప్పండి. భారతదేశము ఏదైతే ఒకప్పుడు తలమానికంగా ఉండేదో, ఏ సుఖ-శాంతులుండేవో, వాటిని మళ్లీ శ్రీమతమును అనుసరించి కల్పక్రితము వలె డ్రామా ప్లాను అనుసారము మళ్లీ తయారు చేస్తున్నామని చెప్పండి. ఈ పదాలను పూర్తిగా గుర్తుంచుకోండి. మనుష్యులు ప్రపంచములో శాంతి కావాలని కోరుకుంటున్నారుకదా. మేము అదే చేస్తున్నాము అని చెప్పండి. భగవానువాచ - తండ్రి పిల్లలైన మాకు ''తండ్రినైన నన్ను స్మృతి చేయండి'' అని అర్థము చేయిస్తూ ఉంటారు. మీరెవ్వరూ అంతగా స్మృతి చేయడం లేదని తండ్రికి తెలుసు. ఇందులోనే శ్రమ ఉంది. స్మృతి ద్వారానే మీకు కర్మాతీత స్థితి వస్తుంది. మీరు స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. దీని అర్థము కూడా ఎవరి బుద్ధిలోనూ లేదు. శాస్త్రాలలో అయితే ఎన్నో విషయాలు వ్రాసేశారు. మీరు ఇంతవరకు చదివినదంతా మర్చిపోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించమని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. మన జతలో వచ్చేది అదే, ఇంకేదీ వెంట రాదు. ఇది తండ్రి చెప్పే చదువు. ఈ చదువు మాత్రమే వెంట వస్తుంది. దీని కోసమే మీరు ప్రయత్నము చేస్తున్నారు.
చిన్న చిన్న పిల్లలను కూడా తక్కువగా భావించండి. ఎంత చిన్నవారో అంత పేరును ప్రఖ్యాతము చేయగలరు. చిన్న చిన్న కుమారీలు కూర్చుని పెద్ద పెద్ద అనుభవము గలవారికి, వృద్ధులకు అర్థం చేయిస్తే అద్భుతము చేసి చూపిస్తారు. వారిని కూడా మీ సమానంగా తయారు చేయాలి. ఎవరైనా ప్రశ్నలు అడిగితే జవాబు ఇచ్చునట్లు చిన్న పిల్లలను తయారు చేయండి. సేవాకేంద్రాలు, మ్యూజియంలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడకు వారిని పంపండి. అటువంటి గ్రూపును తయారు చేయండి. ఇదే మంచి సమయము. ఇటువంటి సేవ చేయండి. చాలా పెద్దవారికి కకూడా చిన్న కుమారీలు కూర్చుని అర్థం చేయిస్తే అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా మీరు ఎవరి పిల్లలు అని అడుగుతారు? మేము శివబాబా పిల్లలమని చెప్పండి. వారు నిరాకారులు, బ్రహ్మ శరీరములో వచ్చి మమ్ములను చదివిస్తున్నారని చెప్పండి. ఈ చదువు ద్వారానే మేము ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వాలి. సత్యయుగ ప్రారంభములో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది కదా. వారిని అలా తయారు చేసిందెవరు? వారు అలా తయారయ్యే కర్మలు తప్పకుండా చేసి ఉంటారు కదా. తండ్రి కూర్చుని కర్మ, అకర్మ, వికర్మల గతులను వినిపిస్తారు. శివబాబా మనలను చదివిస్తున్నారు. వారే మనకు తండ్రి, టీచరు, గురువు. అందువలన తండ్రి అర్థం చేయిస్తున్నారు - ముఖ్యంగా ఒక్క విషయము పైనే బాగా అర్థం చేయించాలి. మొట్టమొదట అల్ఫ్(భగవంతుడు), అల్ఫ్ను అర్థం చేసుకుంటే మళ్లీ ఇన్ని ప్రశ్నలు మొదలైనవి ఎవ్వరూ అడగరు. అల్ఫ్ను అర్థము చేసుకోకుండా ఇతర చిత్రాలను గురించి అర్థం చేయిస్తే వచ్చినవారు మీ తల పాడు చేస్తారు. మొదటి విషయము అల్ఫ్, మనము శ్రీమతమును అనుసరిస్తున్నాము. '' పోను పోను భగవంతుడిని అర్థం చేసుకున్నాము, మిగిలిన చిత్రాలు మొదలైనవి చూచే పని లేదని చెప్పేవారు కూడా వస్తారు. అల్ఫ్ను తెలుసుకున్నందున అంతా అర్థం చేసుకున్నాము.'' భిక్ష లభించడంతో, ముందుకు వెళ్లిపోతారు. మీరు ఫస్ట్క్లాసు భిక్షను ఇస్తారు. తండ్రి పరిచయమును ఇవ్వడంతోనే వారు తండ్రిని స్మృతి చేస్తారు. తండ్రిని ఎంత ఎక్కువగా స్మృతి చేస్తే అంత తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. అతీంద్రియ సుఖము అనుభవము చేసేందుకు లోలోపల బాబా-బాబా అని పొంగు(ఉత్సాహము) వస్తూ ఉండాలి. హఠముతో కాకుండా చాలా అభిరుచితో నడుస్త్తూ-తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి. బుద్ధిని అన్ని వైపుల నుండి తొలగించి ఒక్కరి పైనే నిలపండి.
2. తండ్రి ఎలాగైతే ప్రేమ సాగరులో, అలా వారి సమానము ప్రేమ సాగరులుగా అవ్వాలి. అందరికీ ఉపకారము చేయాలి. తండ్రి స్మృతిలో ఉండాలి. అందరికీ తండ్రి స్మృతిని ఇప్పించాలి.
వరదానము :-
'' నష్టోమోహాగా అయ్యి దు:ఖము, అశాంతుల నామ-రూపాలను సమాప్తం చేసే స్మృతిస్వరూప భవ ''
ఎవరైతే సదా ఒక్కరి స్మృతిలో ఉంటారో, వారి స్థితి ఏకరసంగా అవుతుంది. ఏకరస స్థితి ఉంటే ఒక్కరి ద్వారా సర్వ సంబంధాలను, సర్వ ప్రాప్తుల రసాలను అనుభవం చేయడం. ఎవరైతే తండ్రిని సర్వ సంబంధాలతో తనవారిగా చేసుకొని స్మృతిస్వరూపులుగా ఉంటారో, వారు సహజంగానే నష్టోమోహాగా(నిర్మోహులుగా) అవుతారు. ఎవరైతే నిర్మోహులుగా ఉంటారో వారికి ఎప్పుడూ ధనము సంపాదించడంలో, ధనాన్ని సంభాళన చేయడంలో, ఎవరైనా జబ్బు పడడంలో దు:ఖపుటల రాజాలదు. నిర్మోహులు అనగా వారికి దు:ఖము, అశాంతికి నామ-రూపాలే ఉండవు. సదా నిశ్చింతగా ఉంటారు.
స్లోగన్ :-
'' ఎవరైతే దయాహృదయులుగా అయ్యి అందరికీ ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారో, వారే క్షమాశీలురు. ''