09-02-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - మీరు తనువు-మనస్సు-ధనముల ద్వారా సత్యమైన ఆత్మిక సేవ చేయాలి. ఆత్మిక సేవ ద్వారానే భారతదేశము స్వర్ణిమ యుగము(గోల్డెన్ ఏజ్)గా తయారవుతుంది''
ప్రశ్న :-
నిశ్చింతులుగా ఉండేందుకు సదా ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలి? మీరు నిశ్చింతులుగా ఎప్పుడు ఉండగలరు ?
జవాబు :-
నిశ్చింతులుగా ఉండేందుకు - ఈ నాటకము పూర్తి ఖచ్ఛితంగా(ఆక్యురేట్గా) తయారై ఉంది, డ్రామానుసారము నడిచేదంతా పూర్తి ఖచ్చితంగా ఉంది అని సదా గుర్తుండాలి. కాని పిల్లలైన మీరు ఇప్పుడు నిశ్చింతులుగా ఉండలేరు. మీకు కర్మాతీత అవస్థ వచ్చినప్పుడే మీరు నిశ్చింతులుగా ఉండగలరు. దీని కొరకు యోగము చాలా బాగుండాలి. యోగులు మరియు జ్ఞానులుగా అయిన పిల్లలు దాగి ఉండలేరు.
ఓంశాంతి.
పతితపావనులైన శివభగవానువాచ! - దేహధారి మనుష్యులను భగవంతుడని ఎప్పుడూ అనరని తండ్రి అర్థం చేయించారు. పతితపావనుడు భగవంతుడేనని కూడా మనుష్యులకు తెలుసు. శ్రీ కృష్ణుని పతితపావనుడని అనరు. పాపం ప్రపంచములోని వారు చాలా భ్రమపడి ఉన్నారు. భారతదేశములోని వారు పూర్తిగా ఎప్పుడైతే తికమక చెందుతారో అప్పుడు శివబాబా రావలసి పడ్తుంది. తండ్రి తప్ప దానిని సరిదిద్దే వారెవ్వరూ లేరు. వారే పతితపావనుడైన శివబాబా. వారు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. అది కూడా నంబరువారు పురుషార్థానుసారమే. భలే ఇక్కడ కూర్చుని ఉన్నారు. రోజూ వింటారు అయినా కూడా మేము శివబాబా దగ్గర కూర్చుని ఉన్నామని వారు వీరిలో విరాజమానమై మమ్ములను చదివించి పావనంగా తయారుచేస్తున్నారని, యుక్తిని తెలియజేస్తున్నారని గుర్తుండదు.
మీరు స్వదర్శన చక్రధారులుగా అయ్యి రచయిత మరియు రచనల జ్ఞానాన్ని పొంది కామమును జయించి జగత్జీతులుగా అవుతారు. కనుక ఆ తండ్రి పతితపావనుడు కూడా. నూతన రచన చేయు రచయిత కూడా వారే. ఇప్పుడు అనంతమైన రాజ్యాన్ని పొందేందుకు మీరు పురుషార్థము చేయండి. మేము శివబాబా నుండి రాజ్యభాగ్యమును తీసుకుంటున్నామని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఇది కూడా యదార్థ రీతిలో అర్థము చేసుకోరు. కొందరికి కొద్దిగా తెలుసు, కొందరికి ఏ మాత్రము తెలియదు. నేను పతితపావనుడని శివబాబా చెప్తున్నారు. ఎవరైనా వచ్చి నన్ను అడిగితే నేను నా పరిచయమును ఇవ్వగలుగుతాను. మీకు కూడా తండ్రియే తమ పరిచయమును ఇచ్చారు కదా. నేను సాధారణ తనువులో ప్రవేశిస్తానని శివబాబా చెప్తున్నారు. ఇది సాధారణ తనువు. వృక్షము చివరి భాగములో(పై భాగమున బ్రహ్మాబాబా) నిల్చొని ఉన్నారు. పతిత ప్రపంచములో నిల్చొని ఉన్నారు తర్వాత చూస్తే క్రింద తపస్సు కూడా చేస్తున్నారు. వీరికి కూడా తపస్సు శివబాబాయే నేర్పిస్తున్నారు. శివబాబా రాజయోగమును నేర్పిస్తారు. క్రింద ఆదిదేవుడు, పైన ఆదినాథుడు. బ్రాహ్మణులైన మేము శివబాబా పిల్లలమని పిల్లలైన మీరు అర్థం చేయించగలరు. మీరు కూడా శివబాబా పిల్లలే కాని మీరు ఇంకా తెలుసుకోలేదు. భగవంతుడు ఒక్కరే. మిగిలిన వారందరూ సోదరులు. తండ్రి చెప్తున్నారు - నేను నా పిల్లలనే చదివిస్తాను. ఎవరైతే నన్ను గుర్తిస్తారో వారినే చదివించి దేవతలుగా చేస్తాను. భారతదేశమే స్వర్గముగా ఉండేది. ఇప్పుడు నరకంగా అయ్యింది. కామమును జయించిన వారే జగత్జీతులుగా అవుతారు. నేను స్వర్ణిమ ప్రపంచమును స్థాపన చేస్తున్నాను. ఈ భారతదేశము అనేకసార్లు స్వర్ణిమ యుగములో ఉండేది. మళ్లీ ఇనుప యుగములోకి వచ్చేసింది. ఇది ఎవ్వరికీ తెలియదు. రచయిత మరియు రచనల ఆది-మధ్య-అంత్యాలను గురించి ఎవ్వరికీ తెలియదు. నేను జ్ఞాన సాగరుడను, ఇది మీ లక్ష్యము - ఉద్ధేశ్యము. నేను వీరి సాధారణ తనువులో ప్రవేశించి జ్ఞానమునిస్తాను. ఇప్పుడు మీరు కూడా పవిత్రంగా అవ్వండి. ఈ వికారాలను జయిస్తే మీరు విశ్వాన్ని జయిస్తారు. ఈ పిల్లలందరూ పురుషార్థము చేస్తున్నారు. తనువు-మనస్సు-ధనముల ద్వారా ఆత్మిక సేవ చేస్తారు. శారీరిక సేవ కాదు. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానము(స్పిరుచువల్ నాలెడ్జ్) అని అంటారు. ఇది భక్తి కాదు. ద్వాపర-కలియుగాలు భక్తి యుగాలు. దానిని బ్రహ్మా రాత్రి అని అంటారు. సత్య-త్రేతా యుగాలను బ్రహ్మకు పగలు అని అంటారు. గీతా పఠనము చేయువారెవరైనా వచ్చినట్లైతే వారికి కూడా భగవద్గీతలో పొరపాటు ఉందని అర్థం చేయించాలి. గీతను వినిపించిందెవరు? రాజయోగమును నేర్పించిందెవరు? కామము పైన విజయము పొందుట ద్వారా మీరు జగత్జీతులుగా అవుతారని చెప్పిందెవరు? ఈ లక్ష్మీనారాయణులు కూడా జగత్జీతులుగా అయ్యారు కదా! వీరి 84 జన్మల రహస్యమును కూర్చొని అర్థం చేయించాలి. ఎవరైనా సరే జ్ఞానము తీసుకునేందుకైతేే ఇక్కడకు రావలసి ఉంటుంది కదా! నేనైతే పిల్లలను చదివిస్తాను. కాని మీలో కూడా కొందరు అంతగా అర్థము చేసుకోరు. అందుకే కోటికొక్కరు........ అనే మహిమ ఉంది. నేను ఎవరు? ఏ విధంగా ఉన్నాను? అనేదానిని గురించి కొందరికి 5 శాతము కూడా తెలియదు. మీరు తండ్రిని తెలుసుకొని పూర్ణ రీతిలో స్మృతి చేయాలి. నన్నొక్కరినే ఎందుకు స్మృతి చేయరు? బాబా! మీ స్మృతిని మర్చిపోతామని అంటారు. అరే! మీరు బాబాను స్మృతి చేయలేరా? వాస్తవానికి ఇది శ్రమతో కూడిన పని అని తండ్రికి తెలుసు. అయినా పురుషార్థము చేయించేందుకు ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటారు. అరే! ఏ తండ్రి అయితే మిమ్ములను క్షీరసాగరములోకి తీసుకెళ్తారో, విశ్వానికి యజమానులుగా చేస్తారో వారిని మర్చిపోతారా? మాయ తప్పకుండా మరిపింపజేస్తుంది కూడా. సమయము పడ్తుంది. మాయ మరిపింపజేస్తూనే ఉంటుందని చల్లగా కూర్చొవడం కాదు. పురుషార్థము తప్పకుండా చేయాలి. కామము పై విజయము పొందాలి. నన్నొక్కరినే స్మృతి చేసినట్లైతే వికర్మలు వినాశనమౌతాయి. పిల్లలైన మిమ్ములను ఎలా ఓ పిల్లలూ! అని సంబోధిస్తున్నానో అలాగే ఎవరైనా పెద్ద జడ్జి వచ్చినా వారిని కూడా ఓ బిడ్డా! అనే సంబోధిస్తాను కదా! ఎందుకంటే నేను సర్వోన్నతమైన భగవంతుడిని. సర్వోన్నతమైన చదువును రాకుమారి - రాకుమారుల పదవులను పొందేందుకు నేనే చదివిస్తాను. తండ్రి చెప్తున్నారు - నేను ఇతడిని చదివిస్తున్నాను. ఇతడే మళ్లీ శ్రీ కృష్ణునిగా అవుతాడు. బ్రహ్మ-సరస్వతులే మళ్లీ లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఈ ప్రవృత్తి మార్గము నడుస్తూ వస్తోంది. నివృత్తిమార్గము వారు రాజయోగమును నేర్పించలేరు. రాజా-రాణి ఇరువురూ కావాలి. మేము రాజయోగమును నేర్పిస్తామని విదేశాలకు వెళ్లి చెప్తారు. కాని వారు సుఖమును కాకిరెట్టకు సమానము (తృణ ప్రాయమైనది) అని చెప్తారు. మరి వారు రాజయోగమును ఎలా నేర్పించగలరు? పిల్లలకు ఉత్సాహము ఉప్పొంగాలి. కాని పిల్లలు ఇప్పటికీ(రాజయోగమును నేర్పించుటలో) చాలా చిన్నవారుగానే ఉన్నారు. ఇంకా పరిపక్వ అవస్థ రాలేదు. యువతలో ధైర్యము ఉండాలి.
ఇది రావణ సంప్రదాయమని తండ్రి తెలియజేస్తున్నారు. పతితపావనా రండి! అని మీరు పిలుస్తారు. కనుక ఇది పతిత ప్రపంచమా లేక పావన ప్రపంచమా? మేము నరకవాసులమని మీరు అర్థము చేసుకున్నారు. ఇదేమైనా దైవీ సాంప్రదాయమా? రామ రాజ్యమా? మీరు రావణ రాజ్యము వారు కాదా? ఇప్పుడు రావణ రాజ్యములో అందరిదీ ఆసురీ బుద్ధిగా ఉంది. ఇప్పుడు ఆసురీ బుద్ధిని దైవీ బుద్ధ్ది గలవారిగా చేయువారెవరు? ఈ విధంగా 4-5 ప్రశ్నలు అడిగితే మనుష్యులు ఆలోచనలో పడ్తారు. తండ్రి పరిచయాన్ని ఇవ్వడమే పిల్లలైన మీ కర్తవ్యము. వృక్షమైతే నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. తర్వాత చాలా వృద్ధి చెందుతుంది. మాయ కూడా తల తిరిగేలా చేసి ఒక్కసారిగా క్రిందపడేస్తుంది. బాక్సింగ్లో కూడా చాలామంది మరణిస్తారు. ఇందులో కూడా చాలామంది మరణిస్తారు అనగా జ్ఞాన మార్గమును వదిలి వెళ్లిపోతారు. వికారాలలోకి వెళ్లినట్లైతే ఇక చనిపోయినట్లే. మళ్లీ నూతనంగా పురుషార్థము చేయవలసి ఉంటుంది. వికారాలు ఒక్కసారిగా మరణించేలా చేస్తాయి. తుప్పు తొలగించుకొని ఎంత పతితుల నుండి పావనులుగా అయ్యారో, ఆ చేసుకున్న సంపాదన అంతా సమాప్తమైపోతుంది. మళ్లీ కొత్తగా శ్రమ చేయవలసి పడ్తుంది. అయితే వారిని మళ్లీ అనుమతించరాదని కాదు. ఏదైతే చదివి ఉండినారో, స్మృతి యాత్ర ద్వారా శక్తిని పొందుకున్నారో అదంతా సమాప్తమైపోయిందని వారికి అర్థం చేయించాలి. ఒక్కసారిగా క్రింద పడిపోతారు. మాటి మాటికీ క్రిందపడిపోతూ ఉన్నారంటే వారు క్లాసులోకి అనుమతింపబడరని(గెట్ అవుట్ అని) చెప్పాలి. ఒకటి-రెండు సార్లు పరీక్షింపబడ్తారు. రెండుసార్లు క్షమాపణ లభించినా, తర్వాత కేసు అవిశ్వసనీయంగా (హోప్లెస్గా) అయిపోతుంది. తర్వాత వచ్చినా పూర్తి నీచమైన(డర్టీ) క్లాసులోకే వస్తారు. పోల్చి చెప్పినప్పుడు అలా చెప్పడం జరుగుతుంది కదా! పూర్తి తక్కువ పదవిని పొందువారిని డర్టీక్లాసు (నీచ క్లాసు) అని అంటారు. దాస-దాసీలు, ఛండాలురు, ప్రజలలో కూడా నౌకర్లు, చాకర్లు అందరూ తయారవుతారు కదా. నేను వీరిని చదివిస్తున్నానని తండ్రికి తెలుసు. నేను ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత చదివిస్తాను. వారు లక్షల సంవత్సరాలని అనేస్తారు. పోను పోను 5 వేల సంవత్సరాలేనని కూడా చెప్తారు. అదే మహాభారత యుద్ధము. కాని స్మృతియాత్రలో ఉండలేరు. రోజురోజుకు టూ లేట్ అవుతూ వస్తుంది. చాలా గడిచిపోయింది, ఇక కొద్దిగానే ఉంది........ అని గాయనము కూడా ఉంది. ఇవన్నీ ఈ సమయములోని విషయాలే. పావనంగా అయ్యేందుకు ఇక కొద్ది సమయము మాత్రమే ఉంది. యుద్ధము ఎదురుగా నిలిచి ఉంది. మేము స్మృతి యాత్రలో ఉంటున్నామా? అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. ఎవరైనా కొత్తవారు వస్తే పిల్లలు వారితో తప్పకుండా ఫారమ్ను నింపించాలి. ఫారమ్ను నింపినప్పుడే వారికి అర్థం చేయించాలి. ఒకవేళ ఎవరైనా అర్థం చేసుకోకనే ఉంటే ఇక వారు ఫారమ్ ఏమి నింపుతారు? ఇలాంటివారు లెక్కలేనంత మంది వస్తారు. పతితపావనా! రండి అని తండ్రిని పిలుస్తారు. కనుక తప్పకుండా ఇది పతిత ప్రపంచమే కదా, అప్పుడే కదా వచ్చి పావనంగా చేయమని పిలుస్తారని వారికి చెప్పండి. తర్వాత కొందరు పావనముగా అవుతారు. కొందరు పావనంగా అవ్వరు. బాబా వద్దకు లేక్కలేనన్ని జాబులైతే వస్తాయి. శివబాబా కేరాఫ్ బ్రహ్మాబాబా అని అందరూ వ్రాస్తారు. నేను సాధారణ తనువులోనే ప్రవేశిస్తానని శివబాబా కూడా చెప్తారు. ఇతనికి 84 జన్మల కథను వినిపిస్తాను. ఇతర ఏ మనుష్యులకు రచయిత మరియు రచనల ఆది-మధ్య-అంత్యములను గురించి తెలియదు. ఇప్పుడు తండ్రియే మీకు తెలియజేశారు. ఈ చిత్రాలు మొదలైనవి కూడా బాబాయే దివ్య దృష్టినిచ్చి తయారు చేయించారు.
బాబా ఆత్మలైన మిమ్ములనే చదివిస్తారు. ఆత్మలు తక్షణమే అశరీరులుగా అవుతారు. ఈ శరీరము నుండి స్వయాన్ని వేరుగా భావించాలి. పిల్లలూ! ''దేహీ-అభిమానీ భవ, అశరీరి భవ'' అని బాబా అంటారు. నేను ఆత్మలనే చదివిస్తాను. ఇది ఆత్మ-పరమాత్మల మేళా. దీనిని సంగమ యుగపు మేళా అని అంటారు. అంతేకాని నీటిగంగ ఎవ్వరినీ పావనంగా చేయదు. సాధు-సత్పురుషులు, ఋషులు, మునులు మొదలైనవారందరూ గంగలో స్నానము చేసేందుకు వెళ్తారు. మరి గంగ పతితపావనిగా ఎలా అవ్వగలదు? కామము మహాశత్రువు - అనునది భగవానువాచ కదా! దీని పైన విజయము పొందడం ద్వారానే మీరు జగత్జీతులుగా అయిపోతారు. ఈ విధంగా ఆ నీటి గంగ లేదా సాగరములు చెప్పవు కదా. దీని పై (కామము) విజయము పొందేందుకు నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లైతే మీరు పావనంగా అయిపోతారని జ్ఞాన సాగరుడైన తండ్రియే తెలియజేస్తారు. ఎవ్వరికీ దు:ఖమునివ్వకండి. దైవీగుణాలను ధారణ చేయండి. కామ ఖడ్గమును నడిపించడం మొదటి నంబరు దు:ఖము. ఇదే అది-మధ్య-అంత్యములు దు:ఖమునిచ్చేది. సత్యయుగములో ఇది ఉండదు. అది పావన ప్రపంచము. అక్కడ పతితులెవ్వరూ ఉండనే ఉండరు. మీరెలా యోగ బలముతో రాజ్యమును తీసుకుంటారో, అలా అక్కడ యోగ బలముతో పిల్లలు జన్మిస్తారు. రావణ రాజ్యమే ఉండదు. మీరు రావణుని కాలుస్తారు. ఆ విధంగా ఎప్పటి నుండి తగులబెడ్త్తున్నారో కూడా తెలియదు. రామరాజ్యములో రావణ రాజ్యము ఉండడు. ఇవి ఎంతో అర్థము చేసుకోవలసిన విషయాలు. ఇవన్నీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. చాలా బాగా అర్థం చేయిస్తారు. అయినా కల్ప-కల్పము ఎంతగా చదువుకున్నారో, అంతే చదువుకుంటారు. పురుషార్థము ద్వారా మొత్తము తెలిసిపోతుంది. స్థూల సేవ కూడా ఒక సబ్జెక్టు. మనస్సు ద్వారా చేయలేకపోతే వాచా లేదా కర్మల ద్వారా అయినా సేవ చేయండి. వాచా సేవ చాలా సహజము. మొదట మనసా అనగా 'మన్మనాభవ', స్మృతియాత్రలో ఉండడము, స్వయాన్ని ఆత్మ అని భావించి తండ్రిని స్మృతి చేయాలి. బాబా నుండి శిక్షణను తీసుకోవాలి. తండ్రిని స్మృతి చేయలేని వారు చాలామంది ఉన్నారు. జ్ఞానమును స్మృతి చేసుకోలేమని చెప్పరు. నన్నొక్కరినే స్మృతి చేయలేకున్నారు. స్మృతి చేయలేకపోతే శక్తి ఎలా లభిస్తుంది? తండ్రి సర్వశక్తివంతుడు, వారిని స్మృతి చేయడం ద్వారానే శక్తి వస్తుంది. దీనినే పదును అని అంటారు. కర్మణా సేవ కూడా ఎవరైనా బాగా చేసినట్లైతే, మంచి పదవి లభిస్తుంది. కర్మణా సేవ కూడా చేయలేకపోతే ఇక ఏ పదవి లభిస్తుంది? సబ్జెక్టులు ఉంటాయి కదా. ఇవన్నీ గుప్తంగా అర్థము చేసుకోవలసిన విషయాలు. వారు యోగము - యోగము అని అంటూ ఉంటారు కాని యోగము ద్వారా మీరు విశ్వ సామ్రాజ్యాన్ని తీసుకుంటున్నారని వారు అర్థము చేసుకోరు. యోగబలము ద్వారానే అక్కడ పిల్లలు జన్మిస్తారు. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. మీకు ఎంతగా అర్థం చేయించినా అర్ధకల్పము తర్వాత మీరు మాయకు బానిసలు(శిష్యులు)గా అయిపోతారు. మాయ మిమ్ములను ఇప్పుడు కూడా వదిలిపెట్టదు. మీరు శివబాబాకు శిష్యులుగా(శివబాబా కే మురీద్) అవ్వాలి. ఏ దేహధారికి శిష్యులుగా అవ్వరాదు. పవిత్రంగా అయ్యేందుకే సోదర-సోదరీ(భాయీ-బేహన్) అని చెప్పబడ్తుంది. తర్వాత దీని కంటే ఉన్నతములోకి సోదర-సోదర(భాయీ-భాయీ) అని భావించాలి. సోదర-సోదరీ దృష్టి కూడా కాదు. డ్రామానుసారము ఏదైతే నడుస్తూ ఉందో అదంతా ఖచ్చితంగా ఉంది. నాటకము(డ్రామా) చాలా ఖచ్చితంగా ఉంది. తండ్రి అయితే నిశ్చింత చక్రవర్తి. ఇతనికి చింత తప్పకుండా ఉంటుంది. కర్మాతీత అవస్థను పొందినప్పుడే నిశ్చింతగా ఉండగలరు. అంతవరకు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. యోగము బాగుండాలి. యోగము చేయమని బాబా ఇప్పుడు ఎక్కువగా చెప్తున్నారు. క్షణ-క్షణము మర్చిపోతామని ఈ విషయములోనే చెప్తారు. తండ్రి పిల్లలను ఉద్ధేశించి ఫిర్యాదు చేస్తున్నారు - ఏ తండ్రి అయితే మీకు ఇంత ఖజానాను ఇస్తారో వారిని మీరు మర్చిపోతారు. ఎవరిలో జ్ఞానముందో, ఎవరిలో లేదో తండ్రికి తెలుసు. జ్ఞానయుక్త ఆత్మలు ఎప్పుడూ దాగి ఉండరు. వారు వెంటనే సేవకు ఋజువు(ప్రూఫ్) చూపుతారు. కావున ఇవన్నీ అర్థము చేసుకోవలసిన విషయాలు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మాయ బాక్సింగ్లో ఓడిపోరాదు. పురుషార్థములో చల్లబడి కూర్చుండిపోరాదు. ధైర్యంగా సేవ చేయాలి.
2. ఈ నాటకము ఖచ్చితం(ఆక్యురేట్)గా తయారై ఉంది. అందువల్ల ఏ విషయమును గురించి చింత చేయరాదు. కర్మాతీత అవస్థను పొందేందుకు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. ఏ దేహధారులకు బానిసగా అవ్వరాదు.
వరదానము :-
''బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా అన్ని ఆకర్షణల నుండి ముక్తులుగా ఉండే సత్యమైన రాజఋషి భవ''
రాజఋషి అనగా ఒకవైపు రాజ్యము, మరోవైపు ఋషి అనగా అనంతమైన వైరాగ్యము. ఒకవేళ ఎక్కడైనా స్వయంలో గాని, వ్యక్తులలో గాని, వస్తువులలో గాని ఆకర్షణ ఉంటే రాజఋషి కాదు. సంకల్ప మాత్రంలోనైనా కొద్దిగా ఆకర్షణ ఉన్నా వారి పాదాలు చెరొక నావలో ఉన్నట్లవుతుంది. అప్పుడు ఇక్కడా ఉండరు, అక్కడా ఉండరు. అందువలన రాజఋషులుగా అవ్వండి. అనంతమైన విరాగులుగా అవ్వండి. అనగా ''ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు'' అనే పాఠాన్ని పక్కా చేసుకోండి.
స్లోగన్ :-
''క్రోధము అగ్ని రూపము, అది స్వయాన్నీ కాలుస్తుంది, ఇతరులను కూడా కాలుస్తుంది.''