13-05-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - దేహీ-అభిమానులైన తండ్రి మీకు దేహీ-అభిమాని భవ! అనే పాఠమును చదివిస్తున్నారు. దేహాభిమానాన్ని త్యజించుటే మీ పురుషార్థము ''

ప్రశ్న :-

దేహాభిమానులుగా అయినందున మొట్టమొదట ఉత్పన్నమయ్యే వ్యాధి ఏది ?

జవాబు :-

నామ-రూపాల జబ్బు. ఈ వ్యాధియే వికారిగా చేస్తుంది. అందుకే తండ్రి చెప్తున్నారు - ఆత్మాభిమానులుగా ఉండే అభ్యాసము చేయండి. ఈ శరీరము పై మీకు ఎలాంటి ఆకర్షణ(తగుల్పాటు) ఉండరాదు. దేహము పై ఉన్న మోహము వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేస్తే పవిత్రమైపోతారు. తండ్రి మీకు జీవన బంధనము నుండి జీవన్ముక్తులుగా అయ్యే యుక్తిని తెలిపిస్తున్నారు. ఇదే వారు నేర్పించు చదువు.

ఓంశాంతి.

ఆత్మిక తండ్రి ఆత్మాభిమానులుగా లేక దేహీ-అభిమానులుగా అయ్యి కూర్చోండి అని చెప్తున్నారు. ఎవరిని స్మృతి చేయాలి? తండ్రిని. తండిన్రి తప్ప మరెవ్వరినీ స్మృతి చేయరాదు. తండ్రి నుండి అనంతమైన వారసత్వము లభిస్తూ ఉన్నప్పుడు వారినే స్మృతి చేయాలి. అనంతమైన తండ్రి వచ్చి దేహీ-అభిమాని భవ, ఆత్మాభిమాని భవ అని అర్థము చేయిస్తున్నారు. దేహాభిమానాన్ని వదులుతూ వెళ్ళండి. అర్ధకల్పము మీరు దేహాభిమానులుగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ అర్ధకల్పము దేహీ- అభిమానులుగా ఉండాలి. సత్య-త్రేతా యుగాలలో మీరు ఆత్మాభిమానులుగా ఉండేవారు. అక్కడ మేము ఆత్మలమని, ఇప్పుడు ఈ శరీరము ముసలిదైపోయిందని, దానినిప్పుడు వదులుతామని మీకు తెలుస్తూ ఉంటుంది. ఇది(వస్త్రాన్ని) మార్చుకోవడం వంటిది(సర్పము వలె). మీరు కూడా పాత శరీరాన్ని వదిలి మరో శరీరములో ప్రవేశిస్తారు. అందుకే మీరిప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వాలి. అలా తయారు చేసేదెవరు? - తండ్రి. ఎందుకంటే వారు సదా ఆత్మాభిమానిగా ఉంటారు. వారెప్పుడూ దేహాభిమానిగా అవ్వరు. భలే ఒక్కసారి ఇక్కడకు వస్తారు అయినా దేహాభిమానిగా అవ్వరు. ఎందుకంటే ఈ శరీరము వారిది కాదు, పరాయిది. అప్పుగా తీసుకున్నది. ఈ శరీరము పై వారికెలాంటి ఆకర్షణ(మోహము) ఉండదు. అద్దెకు తీసుకున్నవారికి మోహము ఉండదు. ఈ శరీరము వదిలే తీరాలని వారికి తెలుసు. నేనే వచ్చి పిల్లలైన మిమ్ములను పావనంగా చేస్తానని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు సతోప్రధానంగా ఉండేవారు. మీరే మళ్లీ తమోప్రధానంగా అయ్యారు. ఇప్పుడు మళ్లీ పావనంగా అయ్యేందుకు మీకు నాతో యోగము చేయడం నేర్పిస్తాను. యోగము అను పదానికి బదులు స్మృతి అనే పదము వాడడం మంచిది. మీకు స్మృతి చేయడం నేర్పిస్తాను. పిల్లలు తండ్రిని స్మృతి చేస్తారు. ఇప్పుడు మీరు కూడా ఆ తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మయే స్మృతి చేస్తుంది. రావణరాజ్యము ప్రారంభమైనప్పుడు పిల్లలైన మీరు దేహాభిమానులుగా అయిపోతారు. తండ్రి వచ్చి మళ్లీ ఆత్మాభిమానులుగా చేస్తారు. దేహాభిమానులుగా అయినందున నామ-రూపాలలో చిక్కుకుపోతారు. వికారులుగా అవుతారు. లేకుంటే ముందు మీరందరూ నిర్వికారులుగా ఉండేవారు. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ వికారులుగా అయిపోతారు. జ్ఞానమని దేనినంటారో, భక్తి అని దేనినంటారో తండ్రియే మనకు అర్థం చేయించారు. భక్తి ద్వాపర యుగము నుండి ప్రారంభమవుతుంది. అప్పుడు పంచ వికారాల రూపీ రావణుని స్థాపన జరుగుతుంది. భారతదేశములోనే రామ రాజ్యము, రావణ రాజ్యము అని అంటారు. అయితే రామరాజ్యము ఎంత సమయముంటుందో, రావణ రాజ్యము ఎంత సమయము నడుస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడందరూ తమోప్రధానమై, రాతిబుద్ధి గలవారుగా ఉన్నారు. జన్మించడమే భ్రష్ఠాచారము ద్వారా జరుగుతుంది. అందుకే దీనిని వికారి ప్రపంచమని అంటారు. నూతన ప్రపంచానికి, పాత ప్రపంచానికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. నూతన ప్రపంచములో ఒక్క భారతదేశము మాత్రమే ఉండేది. భారతదేశము వంటి పవిత్ర ఖండముగా ఇంకే ఖండము అవ్వజాలదు. అంతేకాక భారతదేశము వంటి అపవిత్ర ఖండంగా కూడా ఇంకే ఖండమూ అవ్వదు. పవిత్రంగా ఉండేదే మళ్లీ అపవిత్రంగా అవుతుంది. మళ్లీ అదే పవిత్రంగా అవుతుంది. దేవీదేవతలు పవిత్రంగా ఉండేవారని, పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ అపవిత్రంగా అయ్యారని మీకు తెలుసు. అందరికంటే ఎక్కువ జన్మలు తీసుకున్నవారు వీరే. తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేను అనేక జన్మల అంతిమ జన్మలోని అంతిమ సమయములో వస్తాను. ఈ మొదటి నెంబరువారే 84 జన్మలు పూర్తి చేసుకుని వానప్రస్థములోనికి వస్తాడు. అప్పుడు నేను ప్రవేశిస్తాను. త్రిమూర్తులైన బ్రహ్మ-విష్ణు-శంకరులు కూడా ఉన్నారు. అయితే తమోప్రధానమైనందున ఎవ్వరికీ తెలియదు. ఎవరి జీవితచరిత్ర కూడా ఏ మనిషికీ తెలియదు. పూజలు చేస్తారు కానీ మూఢ నమ్మకముతో చేస్తారు. భక్తిని బ్రాహ్మణుల రాత్రి అని అంటారు. సత్య-త్రేతా యుగాలను బ్రాహ్మణుల పగలు అని అంటారు. ఇప్పుడు బ్రహ్మ ప్రజాపిత. కనుక తప్పకుండా వారి పిల్లలు కూడా ఉంటారు కదా. బ్రాహ్మణుల కులముంటుంది కానీ బ్రాహ్మణుల వంశము ఉండదు. బాహ్మ్రణులు ఉన్నతమైన వారు(శిఖరము). శిఖ అని కూడా అంటారు. పిలక కూడా కనిపిస్తుంది. అత్యంత ఉన్నతమైన చదువును చదివించేవారు పరమపిత పరమాత్మ శివుడు. వారికి ఒకే పేరు ఉంది. కానీ భక్తిమార్గములో అనేక పేర్లు పెట్టేశారు. భక్తిమార్గములో చాలా ఆడంబరముంటుంది. లెక్కలేనన్ని చిత్రాలు, మందిరాలు, యజ్ఞము, తపము, దానము, పుణ్యము మొదలైనవన్నీ చేస్తారు. భక్తి ద్వారా మళ్లీ భగవంతుడు లభిస్తాడని అంటారు. ఎవరికి లభిస్తాడు? ఎవరైతే మొట్టమొదట వస్తారో, వారే మొట్టమొదట భక్తి ప్రారంభిస్తారు. బ్రాహ్మణుల నుండి దేవతలుగా ఎవరైతే అవుతారో వారే యథా రాజా-రాణి, తథా ప్రజా,................. సర్వ గుణసంపన్నులు, 16 కళా సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులు, అహింసా పరమో దేవీదేవతా ధర్మానికి చెందినవారు. భారతదేశములో ఒకే ఒక ఆది సనాతన దేవీదేవతా ధర్మముండేది. అప్పుడు అపారమైన ధనరాసులుండేవి. తండ్రి స్మృతినిప్పిస్తున్నారు - మొట్టమొదట దేవీదేవతా ధర్మానికి చెందిన మీరే 84 జన్మలు తీసుకుంటారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. ఉండేది కేవలం 84 జన్మలే. కానీ వారు 84 లక్షల జన్మలని అంటారు. కల్పము ఆయువు కూడా లక్షల సంవత్సరాలని అంటారు. కానీ ఇది 5 వేల సంవత్సరాల డ్రామా అని తండ్రి చెప్తున్నారు. అందువలన దీనిని జ్ఞానమని అంటారు. జ్ఞానసాగరులు ఒక్క శివబాబాయేనని మహిమ చేయబడ్తుంది. వారేమో హద్దులోని తండ్రులు. వీరు బేహద్‌(అనంతమైన) తండ్రి. హద్దు తండ్రులున్నా బేహద్‌ తండ్రిని స్మృతి చేస్తారు. దు:ఖము కలిగినప్పుడు ఆ తండ్రిని స్మృతి చేస్తారు. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ప్రపంచము పాతదిగా, తమోప్రధానంగా అవుతుంది. అప్పుడు మళ్లీ తండ్రి వస్తారు. సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది. ఎవరి ద్వారా? అనంతమైన తండ్రి ద్వారా. కావున ఇప్పుడు అందరూ తప్పకుండా జీవన బంధములో ఉన్నారు. పతితులుగా ఉన్నారు. మళ్లీ పావనంగా అవ్వాలి. ఇది ఒక్క సెకండు విషయమే. జ్ఞానము కూడా ఒక్క సెకండుదే ఎందుకంటే చదువేమో మీరు చాలా చదువుతారు. అక్కడ మనుష్యులు మనుష్యులను చదివిస్తారు. చదివేదేమో ఆత్మయే. కానీ దేహాభిమాన కారణంగా స్వయాన్ని ఆత్మ అనేది మరచి మేము ఫలానా మినిష్టర్లమని, ఫలానా వారమని అంటారు. వాస్తవానికది ఆత్మ. ఆత్మ, స్త్రీ(మిసెస్‌) లేక పురుషుని(మిస్టర్‌) పాత్ర శరీరము ద్వారా అభినయిస్తున్నానని మర్చిపోతుంది. వాస్తవానికి ఆత్మయే శరీరము ద్వారా పాత్ర అభినయిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర చేస్తూ ఒక్కొక్క విధంగా అవుతారు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు ఈ పాత ప్రపంచము నూతన ప్రపంచంగా మారిపోతుంది. ప్రపంచ చరిత్ర-భూగోళము తప్పకుండా పునరావృతమౌతుంది. నూతన ప్రపంచము సతోప్రధానమైనది. ఇల్లు కూడా మొదట్లో కొత్తదిగా ఉంటుంది. అప్పుడు దానిని సతోప్రధానమని అంటారు. తర్వాత పోను పోను శిథిలావస్థకు చేరుకొని తమోప్రధానమౌతుంది. ఈ అనంతమైన నాటకము లేక సృష్టిచక్ర జ్ఞానమును అర్థము చేసుకోవాలి. ఎందుకంటే ఇది చదువు, అంతేకాని భక్తి కాదు. భక్తిని చదువు అని అనరు. ఎందుకంటే భక్తిలో లక్ష్యము, ఉద్ధేశ్యము ఏదీ ఉండదు. జన్మ-జన్మాంతరాలు వేదశాస్త్రాలు మొదలైనవి చదువుతూ ఉంటారు. ఇక్కడ ప్రపంచాన్ని మార్చాలి. సత్య-త్రేతా యుగాలలో భక్తి ఉండదు. భక్తి మొదలయ్యేదే ద్వాపరము నుండి. ఈ తండ్రి ఆత్మిక పిల్లలకు కూర్చుని ఇదంతా అర్థము చేయిస్తున్నారు. దీనిని ఆత్మిక జ్ఞానము అని అంటారు. ఆత్మిక జ్ఞానమును నేర్పించేదెవరు? పరమాత్మ లేక పరమపిత. వారు మాత్రమే నేర్పిస్తారు. వారు అందరివారు కదా. లౌకిక తండ్రిని ఎప్పుడూ పరమపిత అని అనరు. పారలౌకిక తండ్రిని పరమపిత అని అంటారు. వారు పరంధామములో ఉండేవారు. తండ్రిని స్మృతి చేయునప్పుడు ''ఓ గాడ్‌! ఓ ఈశ్వరా!'' అని అంటారు. వాస్తవానికి అతని పేరు ఒక్కటే. అయితే భక్తిలో అనేక పేర్లను వారికిచ్చేశారు. భక్తి చాలా వ్యాపించి ఉంది. అవన్నీ మానవ మతాలు. ఇప్పుడు మానవులకు ఈశ్వరీయ మతము అవసరము. ఈశ్వరీయ మతాన్నే శ్రీమతము అని అంటారు. శ్రీ శ్రీ 108 మాల తయారౌతుంది కదా! ఇది ప్రవృత్తి మార్గములోని వారి మాల. తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ మెట్లు దిగుతూ దివాలా తీస్తారు. బుద్ధి కూడా దివాలా తీస్తుంది. కనుక మనుష్యులు దివాలా తీస్తారు. నూటికి నూరు శాతము సంపన్నంగా ఉండువారే ఇప్పుడు దివాలా తీసి ఉన్నారు. బుద్ధికి తాళము వేయబడింది. అయితే ఆ తాళము వేసిందెవరు? గాడ్రెజ్‌ తాళము వేయబడ్తుంది. భారతదేశము ఎంత నెంబరువన్‌గా ఉండేదో అంత బాగా ఏ ఇతర ఖండమూ లేదు. భారతదేశానికి చాలా మహిమ ఉంది. భారతదేశము సర్వ ధర్మాల వారికి చాలా పెద్ద పుణ్య తీర్థస్థానము. అయితే డ్రామానుసారము గీతను ఖండితము చేసేశారు. భారతదేశమే గాక ప్రపంచమంతా తప్పు చేసింది. భారతదేశములోనే గీతను ఖండించారు. ఈ గీతా జ్ఞానము ద్వారా తండ్రి నూతన ప్రపంచాన్ని తయారుచేస్తారు. సర్వులకు సద్గతినిస్తారు.

భారతదేశము అన్నిటికంటే ఉన్నతమైనది, చాలా ధనవంతమైన ఖండముగా ఉండేది. ఇప్పుడు మళ్లీ అదే విధంగా తయారవుతూ ఉంది. ఇది తలక్రిందులుగా ఉన్న వృక్షము. దీని బీజము ఉపరి భాగములో ఉంది. ఆ బీజమును వృక్షపతి అని అంటారు. బృహస్పతి దశ కూర్చుంటుంది కదా. తండ్రి అర్థం చేయిస్తారు - వృక్షపతి అయిన నేను వచ్చినప్పుడు భారతదేశానికి బృహస్పతి దశ కూర్చుంటుంది. ఉన్నతంగా తయారైపోతుంది. మళ్లీ రావణుడు వచ్చినప్పుడు రాహుదశ కూర్చుంటుంది. భారతదేశపు స్థితి అధ్వాన్నమైపోతుంది. అచ్చట మీ ఆయువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పవిత్రంగా ఉంటారు. అర్ధకల్పము మీరు 21 జన్మలు తీసుకుంటారు. మిగిలిన అర్ధకల్పము భోగులుగా తయారైనందున ఆయువు కూడా తగ్గిపోతుంది. అప్పటి నుండి మీరు 63 జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు సతోప్రధానంగా అవ్వాలి కనుక నన్ను ఒక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు సర్వ ధర్మాల వారు తమోప్రధానంగా ఉన్నారు. ఈ జ్ఞానాన్ని మీరు అందరికీ ఇవ్వవచ్చు. సర్వాత్మల తండ్రి ఒక్కరే. అందరూ సోదరులే. ఎందుకంటే ఆత్మలైన మనమంతా ఒక్క తండ్రి పిల్లలము. భలే హిందూ-ముసల్మానులు సోదరులని అంటారు. కానీ అర్థము తెలియదు. ఆత్మ ఇది రైటని చెప్తుంది. సోదరులందరి తండ్రి ఒక్కరే. పెద్ద బాబాయే వారసత్వమునివ్వాలి. వారు వచ్చేది భారతదేశములోనే. శివజయంతిని జరుపుకుంటారు. అయితే వారు ఎప్పుడు వచ్చారో ఎవ్వరికీ తెలియదు. 5 వికారాలతో మీరు యుద్ధము చేయాలి. కామము మీకు నెంబరువన్‌ శత్రువు. రావణుని తగులబెడ్తారు. అయితే అతడెవరు? ఎందుకు అతనిని కాలుస్తారో వీటిని గురించి ఏ మాత్రము తెలియదు. ద్వాపర యుగము నుండి మీరు క్రిందకు దిగుతూ ఇప్పుడు పతితమైపోయారు. ఒకవైపు శివబాబాను స్మృతి చేస్తూ పూజిస్తారు. మరోవైపు వారిని సర్వవ్యాపి అని అంటారు. ఎవరైతే మిమ్ములను విశ్వాధికారులుగా తయారుచేశారో వారినే మీరు మాయా చక్రములోకి వచ్చి నిందిస్తారు. తండ్రి అంటున్నారు - మధురమైన పిల్లలూ! మీరు నన్ను లెక్కలేనన్ని జన్మలలోకి తీసుకెళ్లారు. కణకణములో ఉన్నానని అనేశారు. ఇది కూడా డ్రామాలో ఇలా తయారయ్యే ఉంది. అనంతమైన తండ్రిని గ్లాని చేస్తూ ఎంతో పాపాత్మలుగా తయారైపోయారు. రావణ రాజ్యము కదా.

ఇప్పుడు అందరూ భక్తులేనని కూడా మీకు తెలుసు. సర్వులకు సద్గతినిచ్చేది ఎవరు? సత్య ఖండమును స్థాపన చేసే సర్వుల తండ్రి. రావణుడిని బాబా అని అనరు. ప్రతి ఒక్కరిలో 5 వికారాలున్నాయి. వికారము ద్వారానే జన్మిస్తారు. అందుకే భ్రష్ఠాచారులని అంటారు. దేవతలను సంపూర్ణ నిర్వికారులని అంటారు. ఇప్పుడున్నవారు సంపూర్ణ వికారులు. పూజ్యులుగా ఉన్న దేవతలే మళ్లీ పూజారులుగా అవుతారు. వారేమో ఆత్మయే పరమాత్మ అని అంటారు. తండ్రి చెప్తున్నారు - ఇది పెద్ద తప్పు. మొట్టమొదట స్వయాన్ని ఆత్మ అని నిశ్చయము చేసుకోండి. ఆత్మలమైన మనమిప్పుడు బ్రాహ్మణ కులానికి చెందినవారము. తర్వాత దేవతా కులములోకి వెళ్తాము. ఈ బ్రాహ్మణ కులము సర్వోన్నతమైనది. బ్రాహ్మణుల వంశము లేదు. బ్రాహ్మణులకు పిలక ఉంది. మీరు బ్రాహ్మణులు కదా. అందరికంటే పైనున్నవారు శివబాబా. భారతదేశములో విరాట రూపమును తయారు చేస్తారు. కానీ అందులో పిలక అయిన బ్రాహ్మణులు కానీ బ్రాహ్మణుల తండ్రి గానీ లేరు. అర్థమే తెలియదు. త్రిమూర్తి అంటే ఏమిటో కూడా అర్థము చేసుకోరు. లేకుంటే భారతదేశపు జాతీయ చిహ్నము (కోట్‌ ఆఫ్‌ ఆర్మ్‌ / జశీa్‌ శీట ూతీఎర) త్రిమూర్తి శివుడై ఉండాలి. ఇప్పుడిది ముళ్ళ అడవిగా ఉంది. అందుకే అడవి జంతువులను జాతీయ చిహ్నంగా చేశారు. అందులో మళ్లీ సత్యమేవ జయతే అని వ్రాసుకున్నారు. సత్యయుగములో పులి - మేక కలిసి నీరు త్రాగినట్లు చూపిస్తారు. సత్యమేవ జయతే అనగా విజయమని అర్థము. అందరూ పాలు పంచదార వలె ఉంటారు. ఉప్పునీరు వలె ఉండరు. రావణ రాజ్యములో ఉప్పు-నీరు, రామ రాజ్యములో పాలు-పంచదారగా అవుతారు. దీనిని ముళ్ల అడవి అని అంటారు. మొట్టమొదట ఒకరికొకరు మొదటి నంబరు ముల్లైన వికారముతో గుచ్చుతారు. తండ్రి కామము మహాశత్రువని చెప్తున్నారు. ఇది ఆదిమధ్యాంతాలు దు:ఖమిచ్చేది. దీని పేరే రావణ రాజ్యము. ఈ 5 వికారాల పై విజయము పొంది జగజ్జీతులుగా అవ్వండి. ఈ అంతిమ జన్మలో నిర్వికారులుగా అవ్వండి. మీరు తమోప్రధానంగా పతితులుగా అయ్యారు. మళ్లీ సతోప్రధానంగా, పావనంగా అవ్వండి. గంగానది పతితపావని కాదు. శరీరానికున్న మైలను ఇంటిలో ఉన్న నీటితో కూడా తొలగించుకోవచ్చు. కానీ ఆత్మ సులభంగా శుభ్రము కాదు. భక్తిమార్గములో లెక్కలేనంతమంది గురువులున్నారు. సద్గతినిచ్చే సద్గురువు ఒకే ఒక్కరు. వారు సుప్రీమ్‌ తండ్రి. సుప్రీమ్‌ టీచర్‌, సుప్రీమ్‌ సద్గురువు కూడా అయ్యారు. వారే మీకు సృష్టి చక్రపు ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. సతోప్రధానంగా అయ్యేందుకు ఒక్క తండ్రిని తప్ప మరెవ్వరినీ స్మృతి చేయరాదు. దేహీ - అభిమానులుగా అయ్యే అభ్యాసము చేయండి.

2. అందరితో క్షీరఖండము(పాలు-పంచదార) వలె ఉండాలి. ఈ అంతిమ జన్మలో వికారాలను జయించి విజయులై జగజ్జీతులుగా అవ్వాలి.

వరదానము :-

'' ప్రతి కర్మలో విజయం పొందుతాననే స్థిరమైన నిశ్చయం మరియు నశా ఉంచుకునే అధికారీ ఆత్మా భవ ''

'' విజయం నా జన్మ సిద్ధ అధికారము '' - ఈ స్మృతి ద్వారా సదా ఎగురుతూ ఉండండి. ఏం జరిగినా, నేను విజయీ ఆత్మను అని స్మృతిలోకి తీసుకురండి. ఈ నిశ్చయం స్థిరంగా ఉండాలి. నశాకు ఆధారము నిశ్చయము. నిశ్చయం తక్కువైతే నశా తగ్గిపోతుంది. అందువలన నిశ్చయబుద్ధి విజయంతి అని అంటారు. అప్పుడప్పుడు నిశ్చయం ఉండేవారిగా కాదు. తండ్రి అవినాశి కనుక అవినాశి ప్రాప్తికి అధికారులుగా అవ్వండి. ప్రతి కర్మలో విజయం నాదే అను నిశ్చయం మరియు నశా ఉండాలి.

స్లోగన్‌ :-

'' తండ్రి స్నేహము అనే ఛత్రఛాయ క్రింద ఉంటే ఏ విఘ్నమూ నిలబడలేదు ''