11-01-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - సదా సంతోషంగా ఉండండి, ఇతరులకు కూడా సంతోషమును ఇప్పించండి. ఇదే మీరు ఇతరుల పై చూపించే కృప. ఎవరికైనా దారి చూపడం అన్నిటికంటే గొప్ప పుణ్య కార్యము''
ప్రశ్న :-
సదా ప్రసన్నచిత్తులుగా(ఖుష్ మిజాజ్) ఎవరు ఉండగలరు? ప్రసన్నచిత్తులుగా అయ్యే సాధనమేది?
జవాబు :-
ఎవరైతే జ్ఞానములో చాలా వివేకవంతులుగా ఉంటారో, ఎవరైతే డ్రామాను ఒక కథ వలె తెలుసుకొని స్మరణ చేస్తూ ఉంటారో, వారే సదా ప్రసన్నచిత్తులుగా ఉంటారు. ప్రసన్నచిత్తులుగా అయ్యేందుకు సదా తండ్రి శ్రీమతమును అనుసరిస్తూ ఉండండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. అంతేకాక తండ్రి ఏది అర్థము చేయిస్తున్నారో దానిని బాగా మథనము చేయండి. విచార సాగర మథనము చేస్తూ చేస్తూ ప్రసన్నచిత్తులుగా అవుతారు.
ఓంశాంతి.
ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. మనందరి తండ్రి ఒక్కరేనని, వారే శిక్షణ కూడా ఇస్తున్నారని ఆత్మలకు తెలుసు. శిక్షణ ఇవ్వడం టీచరు కర్తవ్యము. గమ్యము (లక్ష్యము) ఏదో తెలపడం గురువు కర్తవ్యము. లక్ష్యమును కూడా పిల్లలు తెలుసుకున్నారు. ముక్తి, జీవన్ముక్తుల కొరకు స్మృతియాత్ర అత్యంత అవసరము. రెండూ సహజమైనవే. 84 జన్మల చక్రము కూడా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన 84 జన్మల చక్రము పూర్తి అయ్యిందని, వాపస్ వెళ్లాలని గుర్తుండాలి. అయితే పాపాత్మలు ముక్తి, జీవన్ముక్తులలోకి వాపస్ పోలేరు. ఈ విధంగా విచార సాగర మథనము చేయాలి. ఎవరు చేస్తారో వారు పొందుతారు(జో కరేంగే సో పాయేంగే). వారే సంతోషంగా ఉంటారు. ఇతరులను కూడా సంతోషపెడ్తారు. ఇతరులకు మార్గాన్ని తెలిపి వారి పై కూడా కృప చూపించాలి. ఇది పురుషోత్తమ సంగమ యుగమని పిల్లలైన మీకు తెలుసు. ఈ విషయము కూడా కొంతమందికి గుర్తు ఉంటుంది. కొంతమందికి గుర్తుండదు, మర్చిపోతారు. ఇది కూడా గుర్తుంటే ఖుషీ పాదరస మీటరు పైకి ఎక్కి ఉంటుంది. అనగా అపారమైన సంతోషము కలుగుతుంది. తండ్రి, టీచరు, గురువు రూపములో స్మృతి ఉండినా అపారమైన ఖుషీ కలుగుతుంది. అయితే నడుస్తూ నడుస్తూ ఏదైనా ఆటంకము కలుగుతుంది. ఎలాగైతే పర్వతాల పైకి ఎక్కుతూ దిగుతూ వెళ్లాలో అలా పిల్లల స్థితి కూడా హెచ్చు-తగ్గులు అవుతూ ఉంటుంది. కొంతమంది చాలా పైకి ఎక్కిపోతారు. ఒకవేళ క్రిందపడితే పూర్వము కంటే ఇంకా క్రిందకు పడిపోతారు. వారి సంపాదించినదంతా ఖర్చు అయిపోతుంది. దాన-పుణ్యాలు ఎంతగానో చేస్తారు. భలే ఎంత దాన-పుణ్యాలు చేసినా పుణ్యము చేస్తూ చేస్తూ పాపాలు చేస్తూ ఉంటే చేసిన పుణ్యమంతా సమాప్తమైపోతుంది. అన్నిటికంటే గొప్ప పుణ్యము - ''తండ్రిని స్మృతి చేయడం. స్మృతి ద్వారానే పుణ్యాత్మలుగా అవుతారు.'' ఒకవేళ సాంగత్య దోషముతో పొరపాట్ల మీద పొరపాట్లు చేస్తూ ఉంటే ముందు కంటే ఎక్కువగా క్రిందికి పడిపోతారు. ఆ జమా ఖాతా ఉండదు. నష్టములోకి వెళ్లిపోతుంది. పాపకర్మలు చేసినందున నష్టమైపోతుంది. పాప ఖాతా చాలా పెరిగిపోతుంది. ఖాతాను సంభాళించుకోవాలి(కాపాడుకోవాలి) కదా. తండ్రి కూడా చెప్తున్నారు - మీది పుణ్య ఖాతాగా ఉండేది పాపము చేసినందున పాపము వంద రెట్లు అయ్యి నష్ట ఖాతాగా అయిపోయింది. పాపాలలో కూడా కొన్ని చాలా పెద్ద పాపాలు, కొన్ని తేలికైనవి ఉంటాయి. కామము చాలా కఠినమైన పాపము. క్రోధము రెండవ నంబరు. లోభము దాని కంటే తక్కువది. అన్నిటికంటే ఎక్కువ కామ వశము అయినందున జమ అయినదంతా నష్టమైపోతుంది. లాభానికి బదులు నష్టమైపోతుంది. సద్గురు నిందకులకు స్వర్గంలో స్థానము లభించదు. తండ్రి వారిగా అయ్యి మళ్లీ తండ్రిని వదిలేస్తారు. ఇందుకు కారణమేమి? చాలా వరకు తరచుగా కామవికారపు దెబ్బ తగులుతుంది. ఇది చాలా పెద్ద శత్రువు. దాని బూతు బొమ్మనే తయారు చేసి తగులబెడ్తారు. క్రోధ, లోభముల దిష్టిబొమ్మను తయారు చేయరు. కామము పైననే పూర్తిగా విజయము పొందుకుంటే జగత్జీతులుగా అవుతారు. రావణరాజ్యములో పతితులైన మమ్ములను మీరు వచ్చి పావనంగా చేయమని తండ్రిని పిలుస్తారు. ఓ పతితపావనా రా! అని అందరూ గానము చేస్తారు. పతితులను పావనంగా చేసే సీతలందరి ఓ రాముడా! రండి అని పాట కూడా పాడ్తారు. అయితే వారికి అర్థము తెలియదు. తండ్రి తప్పకుండా నూతన ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు వస్తారని కూడా తెలుసు. అయితే సమయాన్ని చాలా పొడిగించినందున గాఢాంధకారము అలుముకొని పోయింది. జ్ఞానము, అజ్ఞానము అంటారు కదా. అజ్ఞానమనగా భక్తి. ఎవరిని పూజిస్తారో వారిని గురించి, వారెవరో కూడా తెలియదు. కనుక వారి వద్దకు ఎలా చేరుకోవాలి? అందువలన దాన-పుణ్యాలన్నీ నిష్ఫలమైపోతాయి. ఒకవేళ లభించినా వాటి వలన అల్పకాలిక కాకిరెట్ట సమానమైన సుఖము లభిస్తుంది. మిగిలిందంతా దు:ఖమే దు:ఖము. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ దు:ఖాలన్నీ దూరమైపోతాయి. ఇప్పుడు పాతదంతా సమాప్తమై కొత్తది జమ అయ్యేందుకు ఎంత స్మృతి చేస్తున్నారో గమనించండి. కొంతమంది కొద్దిగా కూడా జమ చేసుకోరు. మొత్తము ఆధారమంతా స్మృతి పైనే ఉంది. స్మృతి చేయకుంటే పాపాలు ఎలా నశిస్తాయి లేక కట్ అవుతాయి. జన్మ-జన్మాంతరాల పాపాలైతే చాలా ఉన్నాయి. ఈ జన్మలోని జీవిత కథను వినిపించినందున జన్మ-జన్మాంతరాల పాపాలు నశించవు. కేవలం ఈ జన్మలోని పాప భారము తేలికైపోతుంది. చాలా కష్టపడాలి. ఇన్ని జన్మల లెక్కాచారము యోగము ద్వారా మాత్రమే సమాప్తమౌతుంది. మేము ఎంత యోగము చేస్తున్నామని విచారము చేయాలి. మా జన్మ సత్యయుగము ఆదిలో జరుగగలదా? ఎవరైతే చాలా పురుషార్థము చేస్తారో వారు మాత్రమే సత్యయుగము ఆదిలో జన్మ తీసుకుంటారు. వారు దాగి ఉండలేరు. అందరూ సత్యయుగములోకి రారు. చివరిలో వెళ్ళి చాలా చిన్న పదవి పొందుతారు. ఒకవేళ మొదట్లో వచ్చినా నౌకరీ చేస్తారు. ఇది అర్థము చేసుకునే సాధారణ విషయము. కావున తండ్రిని చాలా స్మృతి చేయాలి. మనము నూతన ప్రపంచములో విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు వచ్చామని మీకు తెలుసు. ఎవరు స్మృతి చేస్తారో వారికి తప్పకుండా ఖుషీ ఉంటుంది. ఒకవేళ రాజుగా అవ్వాలనుకుంటే ప్రజలను తయారు చేసుకోవలసి వస్తుంది. లేకుంటే రాజులుగా తయారవుతారని ఎలా అర్థము చేసుకుంటారు? ఎవరైతే సేవాకేంద్రాలు తెరుస్తారో, సేవ చేస్తారో వారికి కూడా సంపాదన జరుగుతుంది. వారికి కూడా చాలా లాభము, ఫలితము లభిస్తుంది. కొంతమంది 3-4 సెంటర్లు కూడా తెరుస్తారు కదా. ఏమేమి చేస్తారో దాని భాగము తప్పకుండా వస్తుంది కదా. అందరూ కలిసి మాయ కలిగించే దు:ఖమనే పై కప్పును ఎత్తి వేసేందుకు పూనుకుంటే అందులో అందరూ భుజమునిస్తారు (సహయోగము చేస్తారు). కావున అందరికీ ఫలితము లభిస్తుంది. ఎవరైతే చాలామందికి మార్గమును తెలుపుతారో ఎంత శ్రమ చేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. వారు చాలా సంతోషంగా ఉంటారు. ఎంతమందికి దారి చూపించారో వారి హృదయాలకు తెలుసు. ఎంతమందిని ఉద్ధరించారో కూడా వారికి తెలుసు. ఈ మంచి పనులన్నీ చేసే సమయము ఇదే. తినేందుకు అన్నము, త్రాగేందుకు నీరు అందరికీ తప్పకుండా లభిస్తాయి. కొంతమంది ఏ పనీ చేయరు. మమ్మా ఎంతో ఎక్కువ సేవ చేసింది. సేవ ద్వారా ఆమెకు చాలా కళ్యాణము జరిగింది. ఇందులో కూడా సేవ చాలా చేయాలి. యోగము కూడా సేవే కదా. చాలా లోతైన ఆదేశాలు లభిస్తూ ఉంటాయి. ఇప్పుడు పోను సోను ఏవేవో కొత్త పాయింట్లు వెలువడ్తాయి. రోజురోజుకు ఉన్నతి అవుతూ పోతుంది. కొత్త కొత్త పాయింట్లు వెలువడుతాయి. ఎవరు సేవలో తత్పరులై ఉంటారో వారు వెంటనే ఆ నూతన పాయింట్లను క్యాచ్ చేస్తారు. ఎవరు సేవ చేయరో, వారి బుద్ధిలో కొంచెము కూడా కూర్చోదు.
బిందు రూపాన్ని ఎలా అర్థము చేసుకోవాలి? ఆత్మ ఎంత పెద్దది అని ఎవరినైనా అడగండి. ఆత్మ యొక్క దేశ-కాలాలు తెలపమంటే ఎప్పటికీ తెలుపలేరు. మనుష్యులు పరమాత్ముని నామ, రూప, దేశ, కాలాలను గురించి అడుగుతారు. మీరు ఆత్మను గురించిన వివరము అడిగితే తికమకపడ్తారు. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. ఆత్మ ఇంత చిన్న బిందువని, అందులో మొత్తము పాత్ర అంతా నిండి ఉందని ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ కూడా ఆత్మ-పరమాత్మలను గురించి తెలియనివారు చాలామంది ఉన్నారు. కేవలం వికారాలను మాత్రమే సన్యసించారు. ఇది కూడా అద్భుతమే. సన్యాసుల ధర్మము వేరు. ఈ జ్ఞానము మీ కొరకే. తండ్రి అర్థము చేయిస్తున్నారు - మీరు పవిత్రంగా ఉండేవారు మళ్లీ అపవిత్రంగా అయ్యారు. ఇప్పుడు మళ్లీ పవిత్రంగా తయారవ్వాలి. మీరే 84 జన్మల చక్రములో తిరుగుతారు. ప్రపంచములోని వారికి ఈ విషయాలు కూడా తెలియదు. జ్ఞానము వేరే, భక్తి వేరే. జ్ఞానము పైకి తీసుకెళ్తుంది, భక్తి క్రింద పడేస్తుంది. కావున ఈ రెండిటికి రాత్రికి, పగలుకు ఉన్నంత వ్యతాసముంది. మనుష్యులు భలే స్వయాన్ని ఎంత గొప్ప వేద శాస్త్రాల అథారిటీని అని భావించినా వారికి కొంచెము కూడా తెలియదు. మీకు కూడా ఇప్పుడే తెలిసింది. మీలో కూడా నెంబరువారుగా ఉన్నారు. మర్చిపోవడం వలన సంతోషము మాయమైపోతుంది. లేకుంటే అపారమైన ఖుషీ ఉండాలి. బాబా నుండి మీకు వారసత్వము లభిస్తూ ఉంది. బాబా సాక్షాత్కారము చేయిస్తారు. అయితే సాక్షాత్కారములో చూసి కూడా శ్రీమతమును అనుసరించకపోతే లాభమేముంది! తండ్రిని దు:ఖములో స్మరణ చేస్తారు. వారిని ముక్తిదాతా, ఓ రామా! ఓ ప్రభువా! అని అంటారు. అయితే వారు ఎవరో ఎవ్వరికీ తెలియదు. స్వయమును ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని భక్తిమార్గములో ఎవ్వరూ చెప్పరు. ఒకవేళ అలా చెప్పి ఉంటే పరంపరగా కొనసాగేది. భక్తి కొనసాగుతూ వస్తోంది కదా. భక్తి లెక్కలేనంత ఉంది. జ్ఞానము ఒక్కటే. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారని మనుష్యులు భావిస్తారు. అయితే ఎలా లభిస్తాడు? ఎప్పుడు లభిస్తాడు? అనేది ఎవ్వరికీ తెలియదు. భక్తి ఎప్పుడు మొదలౌతుంది? అందరికంటే ఎవరు ఎక్కువ భక్తి చేస్తారు? - ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. ఇంకా 40 వేల సంవత్సరాలు భక్తి చేస్తూ ఉంటారా? ఒకవైపు మనుష్యులు భక్తి చేస్తున్నారు. మరోవైపు మీరు జ్ఞానాన్ని పొందుతున్నారు. మనుష్యులతో ఎంతో తల కొట్టుకోవలసి వస్తుంది. ఇన్ని ప్రదర్శనీలు జరుపుతూ ఉన్నారు. అయినా కోట్లలో ఏ ఒక్కరో వస్తారు. మీ సమానముగా తయారు చేసి ఎంతమందిని తీసుకొని వస్తారు? సత్య-సత్యమైన బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారో - ఈ లెక్క ఇప్పుడు తేలదు. చాలామంది అసత్యమైన పిల్లలు కూడా ఉన్నారు. బ్రాహ్మణులు కథ వినిపిస్తారు. బాబా గీతా కథను వినిపిస్తారు. మీరు కూడా బాబా ఎలా వినిపించారో అలా వినిపిస్తారు(యథా బాబా తథా బచ్చే). పిల్లల కర్తవ్యము కూడా సత్య-సత్యమైన గీతను వినిపించుట. శాస్త్రాలైతే అందరికీ ఉన్నాయి. వాస్తవానికి శాస్త్రాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో, అన్నీ భక్తిమార్గానికి చెందినవి. జ్ఞాన పుస్తకము ఒక్క గీత మాత్రమే. గీతయే తల్లి-తండ్రి. తండ్రే వచ్చి సర్వులకు సద్గతినిస్తారు. అయితే మనుష్యులు ఇటువంటి తండ్రినే గ్లాని చేస్తారు. శివబాబా జయంతి వజ్ర తుల్యమైనది. అత్యంత ఉన్నతమైన భగవంతుడే సద్గతిదాత. వారికి తప్ప ఈ మహిమ ఇతరులకు ఎలా ఉంటుంది? దేవతలను మహిమ చేస్తారు కాని దేవతలుగా తయారు చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. మన నిర్మాణము కూడా జరుగుతుంది. వినాశనము కూడా జరుగుతుంది.
కొంచెము కూడా అర్థము చేయించలేనివారు చాలామంది ఉన్నారు. అటువంటివారు స్థూల పనులు చేయండి. మిలటరివారిలో అందరూ పని చేయువారుగానే ఉంటారు. చదువుకున్నవారి ముందు చదువుకోనివారు బరువులు మోయవలసి వస్తుందని కూడా అంటారు. మమ్మా- బాబాలు ఏ విధముగా చేస్తున్నారో, వారిని చూసి నేర్చుకోండి. అనన్యమైన పిల్లలు ఎవరో మీరు కూడా అర్థము చేసుకోగలరు. బాబాను అడిగితే ఫలానా వారిని అనుసరించమని పేరు కూడా చెప్తారు. ఎవరైతే సేవధారులుగా లేరో, వారు ఇతరులకేం నేర్పుతారు? ఇంకా వారు సమయాన్ని ఎక్కువగా వృథా చేస్తారు. బాబా అర్థము చేయిస్తున్నారు - మీరు స్వయాన్ని ఉన్నతి చేసుకోవాలంటే ఇచ్చట(మధువనము) చేసుకోగలరు. మనము 84 జన్మలు ఎలా తీసుకున్నామో తెలుసుకునేందుకు చిత్రాలున్నాయి. ఇవన్నీ అర్థము చేసుకొని ఉంటే ఇతరులకు తెలిపించండి. ఎంత సహజము - ఇలా తయారు కావాలి. నిన్నటివరకు వీరిని పూజిస్తూ ఉండేవారము. ఈ రోజు అలా లేము. ఎందుకంటే జ్ఞానము లభించింది. ఈ విధంగా చాలామంది వచ్చి జ్ఞానము తీసుకుంటారు. మీరు ఎన్ని సేవాకేంద్రాలను స్థాపన చేస్తూ, ప్రజలను చుట్టుముడ్తారో అంత ఎక్కువమంది వచ్చి అర్థము చేసుకుంటారు. ఈ విషయాలను విన్నందువలన వారి సంతోషపు పాదరస మీటరు పైకి ఎక్కిపోతుంది. నరుని నుండి నారాయణునిగా తయారవ్వాలి. సత్యమైన సత్య నారాయణ కథ కూడా ఉన్నది. భక్తి ద్వారా క్రిందికే దిగజారుతూ వచ్చారు. జ్ఞానమంటే ఏమిటో వారికి తెలియనే తెలియదు. అనంతమైన తండ్రి వచ్చి మీకు యదార్థము తెలుపుచున్నారు. బాబా చెప్తున్నారు - మొన్న మొన్న మీకు రాజ్యమిచ్చాను. ఇప్పుడు ఆ రాజ్యము ఎక్కడకు పోయింది? ఇదంతా మీకు తెలుసు. ఇది ఒక ఆట. తండ్రి ఒక్కరు మాత్రమే ఈ నాటకపు రహస్యాన్ని పూర్తిగా అర్థం చేయించగలరు. బాబా మీరు డ్రామాలో బంధింపబడి ఉన్నారు. మీరు పతిత ప్రపంచములో పతత శరీరములో తప్పకుండా రావలసి వస్తుంది. ఈశ్వరుని చాలా మహిమ చేస్తారు. పిల్లలంటారు - మేము మిమ్ములను పిలిచినందున మాకు సేవ చేసేందుకు లేక మమ్ములను పతితుల నుండి పావనంగా చేసేందుకు రానే రావలసి వచ్చింది. కల్ప-కల్పము మమ్ములను దేవతలుగా చేసి మీరు వెళ్లిపోతారు. ఇది ఒక కథ వలె ఉంది. వివేకవంతులైన వారికి ఇది ఒక కథ. పిల్లలైన మీరు ప్రసన్నచిత్తులుగా ఉండాలి. బాబా కూడా డ్రామానుసారము సేవకులు(సర్వెంట్)గా అయ్యారు. నా మతమును అనుసరించండి అని తండ్రి చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహాభిమానాన్ని వదిలేయండి. కొత్త ప్రపంచములో మీకు కొత్త శరీరము లభిస్తుంది. తండ్రి ఏదైతే తెలుపుతున్నారో దానిని మంచిరీతిగా మథనము చేయండి. ఇలా తయారయ్యేందుకు మేము వచ్చామని బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు. లక్ష్యము మీ ముందు నిలబడి ఉంది. భగవానువాచ. వారు భగవంతుని మనుష్యులని భావిస్తారా? లేక నిరాకారులని అంటారా? ఆత్మలైన మీరందరూ నిరాకారులే. శరీరము తీసుకొని పాత్ర చేస్తారు. బాబా కూడా పాత్ర చేస్తారు. ఎవరైతే మంచిరీతిగా సేవ చేస్తారో వారికే మేము మాలలో పూసలుగా తప్పకుండా అవుతామని నిశ్చయముంటుంది. నరుని నుండి నారాయణునిగా అవ్వాలి. ఫెయిల్ అయితే ఆటోమెటిక్గా సీతా-రాములుగా అవుతారు. భగవంతుడే స్వయంగా చదివిస్తూ ఉంటే బాగా చదవాలి. అయితే మాయ చాలా వ్యతిరేకిస్తుంది. తుఫానులు సృష్టిస్తుంది అచ్ఛా! (మంచిది)
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. విచార సాగర మథనము చేసి అపారమైన సంతోషాన్ని అనుభవము చేయాలి. ఇతరులకు కూడా దారి తెలిపే కృప చూపాలి. సాంగత్య దోషములోకి వచ్చి ఏ పాప కర్మా చేయరాదు.
2. మాయ కలుగజేసే దు:ఖముల పై కప్పును(ఛప్పర్) తొలగించి వేసేందుకు అందరూ కలిసి సహయోగమివ్వాలి. సేవాకేంద్రాలు తెరచి అనేకమంది కళ్యాణానికి నిమిత్తంగా అవ్వాలి.
వరదానము :-
''బ్రాహ్మణ జీవితంలో సదా ఛీర్ఫుల్(సంతోషకరమైన), కేర్ఫుల్(జాగ్రత్త) మూడ్లో ఉండే కంబైండ్ రూపధారీ భవ''
ఎటువంటి పరిస్థితిలోనైనా ప్రసన్నతా మూడ్ పరివర్తన అవుతే దానిని సదాకాలపు ప్రసన్నత అని అనరు. బ్రాహ్మణ జీవితంలో సదా ఛీర్ఫుల్ మరియు కేర్ఫుల్ మూడ్ ఉండాలి. మూడ్ (మానసిక స్థితి) మారిపోరాదు. మూడ్ మారిందంటే నాకు ఏకాంతం కావాలి, ఈ రోజు నా మూడ్ ఇలా ఉంది అని అంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు మూడ్ మారిపోతుంది. సదా కంబైండ్ రూపంలో ఉంటే మూడ్ మారిపోదు.
స్లోగన్ :-
''ఏదైనా ఉత్సవము జరుపుకోవడమనగా స్మృతి మరియు సేవల ఉత్సాహాలలో ఉండుట.''
బ్రహ్మబాబా సమానంగా అయ్యేందుకు విశేషమైన పురుషార్థము
ఇప్పుడు తీవ్ర పురుషార్థానికి ఈ లక్ష్యముంచుకోండి - నేను డబల్ లైట్ ఫరిస్తాను.
నడుస్తూ - తిరుగుతూ ఫరిస్తా స్వరూప అనుభూతిని పెంచుకోండి. అశరీరి స్థితిని అభ్యాసము
చేయండి. సెకండులో ఏ సంకల్పాలనైనా సమాప్తము చేసేందుకు సంస్కార స్వభావాలలో డబల్లైట్గా
ఉండండి.