23-05-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - ఈ దు:ఖధామానికి జీవించి ఉండే విడాకులివ్వండి ఎందుకంటే మీరు సుఖధామానికి వెళ్లాలి. ''
ప్రశ్న :-
తండ్రి పిల్లలకిచ్చే ఒక చిన్న శ్రమ ఏది ?
జవాబు :-
బాబా అంటున్నారు - పిల్లలూ! కామము మహాశత్రువు. దీని పై విజయము ప్రాప్తి చేసుకోండి. ఇదే నేను మీకు ఇచ్చే చిన్న శ్రమ. మీరు సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి. పతితుల నుండి పావనము అనగా పరుసవేదిగా(ఇనుమును బంగారుగా చేసే ఒక రసశిలగా) అవ్వాలి. పారసంగా అయ్యేవారు రాయిగా అవ్వలేరు. పిల్లలైన మీరిప్పుడు సుగంధ పుష్పాలు(గుల్గుల్)గా అవుతే తండ్రి మిమ్ములను కనుల పై కూర్చొబెట్టుకుని వెంట తీసుకెళ్తారు.
ఓంశాంతి.
ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. బ్రాహ్మణులైన మనమే మళ్లీ దేవతలుగా అవుతామని పిల్లలు అర్థము చేసుకున్నారు. ఇది పూర్తిగా నిశ్చయముంది కదా. టీచరు ఎవరినైతే చదివిస్తారో వారిని తప్పకుండా తన సమానంగా తయారు చేస్తారు. ఇది నిశ్చయమైన మాట. కల్ప-కల్పము తండ్రి వచ్చి నరకవాసులమైన మనలను స్వర్గవాసులుగా తయారు చేస్తానని అర్థము చేయిస్తారు. ప్రపంచమంతటినీ తయారు చేయువారు ఎవరో ఒకరుంటారు కదా. తండ్రి స్వర్గవాసులుగా తయారు చేస్తారు. రావణుడు నరకవాసులుగా తయారు చేస్తాడు. ఇప్పుడుండేది రావణ రాజ్యము. సత్యయుగములో ఉండేది రామరాజ్యము. రామరాజ్య స్థాపన చేయువారుంటే, రావణ రాజ్య స్థాపన చేయువారు కూడా తప్పకుండా ఉంటారు. రాముడని భగవంతుడిని అంటారు. భగవంతుడు నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. జ్ఞానమేమో చాలా సులభము, పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఎంత రాతిబుద్ధిగా ఉన్నారంటే పారసబుద్ధిగా అవ్వడం అసంభవమని భావిస్తారు. నరక వాసుల నుండి స్వర్గ వాసులుగా అవ్వడంలో చాలా శ్రమ ఉంది. ఎందుకంటే మాయ ప్రభావము చాలా ఉంది. 50 అంతస్తులు, 100 అంతస్తుల భవనాలు ఎంతో పెద్దవి నిర్మిస్తున్నారు. స్వర్గములో ఇన్ని అంతస్తులు ఉండవు. ఈ కాలములో ఇక్కడ కట్టుకుంటున్నారు. ఇక్కడ భవనాలు కట్టుకున్న విధంగా సత్యయుగములో ఉండవని మీకు తెలుసు. ప్రపంచమంతా కలిసి చిన్న వృక్షంగా ఉంటుందంటే అక్కడ అంతస్తులు కట్టుకునే అవసరమే ఉండదు అని బాబా స్వయంగా అర్థము చేయిస్తున్నారు. అక్కడ లెక్కలేనంత భూమి ఉంటుంది. ఇక్కడ అంత భూమి లేదు అందుకే భూమి విలువ ఎంతో పెరిగి పోయింది. అక్కడ భూమికి ఖరీదే ఉండదు. మునిసిపాలిటీ పన్నులు మొదలైనవి కూడా ఉండవు. ఎవరికి ఎంత భూమి కావాలో అంత తీసుకోవచ్చు. తండ్రి నేర్పించే ఈ జ్ఞానము ద్వారా అక్కడ మీకు సర్వ సుఖాలు లభిస్తాయి. మనుష్యులు 100 అంతస్తుల భవనాలు మొదలైనవి నిర్మించేందుకు కూడా ధనము మొదలైనవి ఖర్చు అవుతాయి కదా! అక్కడ ధనము మొదలైనవి ఖర్చు కావు. అపారమైన ధనముంటుంది. డబ్బు అవసరమే లేదు. లెక్కలేనంత ధనముంటే ఆ డబ్బంతా ఏమి చేసుకుంటారు? బంగారు, వజ్రాలు, ముత్యాలు మొదలైన వాటితో భవనాలు మొదలైనవి కట్టుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఎంతో జ్ఞానము లభించింది. ఇది వివేకము, అవివేకముల మాట. సతోబుద్ధి మరియు తమోబుద్ధి. సతోప్రధానంగా ఉన్నవారు స్వర్గానికి అధికారులు, తమోబుద్ధిగా ఉన్నవారు నరకానికి అధికారులుగా అవుతారు. ఇది స్వర్గము కాదు, ఇది రౌరవ నరకము. చాలా దు:ఖములో ఉన్నారు. అందుకే ఓ భగవంతుడా! అని పిలుస్తారు మళ్లీ మర్చిపోతారు. ఐకమత్యము కావాలని ఎంతగానో తలలు బాదుకుంటారు. సమావేశాలు మొదలైనవి జరుపుతూ ఉంటారు. కానీ వీరంతా కలిసి ఏకము కారని పిల్లలైన మీరు అర్థము చేసుకున్నారు. ఈ వృక్షమంతా శిథిలావస్థలో ఉంది. మళ్లీ క్రొత్తదిగా అవుతుంది. కలియుగము నుండి సత్యయుగంగా ఎలా అవుతుందో మీకు తెలుసు. ఈ జ్ఞానాన్ని మీకిప్పుడు ఆ తండ్రే అర్థము చేయిస్తున్నారు. సత్యయుగవాసులే మరలా కలియుగవాసులుగా అవుతారు. మళ్లీ మీరు సంగమవాసులుగా అయ్యి సత్యయుగ వాసులుగా అవుతారు. ఇంతమంది సత్యయుగములోకి వెళ్తారా? అని అంటారు. పోలేరు. ఎవరైతే సత్యమైన సత్యనారాయణ కథను వింటారో వారే స్వర్గములోకి వెళ్తారు. మిగిలినవారంతా శాంతిధామములోకి వెళ్తారు. దు:ఖధామము ఉండనే ఉండదు. కావున ఈ దు:ఖధామానికి బ్రతికి ఉన్నప్పుడే విడాకులివ్వాలి. మీరు విడాకులు ఎలా ఇవ్వగలరో కూడా తండ్రి యుక్తులు తెలిపిస్తారు. ఈ మొత్తము సృష్టి పై దేవీదేవతల రాజ్యముండేది. ఇప్పుడు మళ్లీ దానిని స్థాపించేందుకు తండ్రి వచ్చారు. మనమంతా ఆ తండ్రి నుండి విశ్వ రాజ్యము తీసుకుంటున్నాము. డ్రామా ప్లాను అనుసారము తప్పకుండా పరివర్తన అవుతుంది. ఇది పాత ప్రపంచము దీనిని సత్యయుగమని ఎలా అంటారు? అసలు సత్యయుగమంటే ఏమిటో మానవులకు తెలియనే తెలియదు. చాలా భక్తి చేసినవారే ఈ జ్ఞానము పొందేందుకు అర్హులని బాబా అర్థం చేయించారు. వారికే అర్థం చేయించాలి. ఈ కులానికి చెందినవారు కాకుంటే వారికి అర్థమే కాదు. అందువలన సమయమెందుకు వృథా చేయాలి. మన సభ్యులే కాకుంటే వారు ఏదీ ఒప్పుకోరు. ఆత్మ అంటే ఏమిటో, పరమాత్మ అంటే ఏమిటో నాకు తెలుసుకోవాలనే లేదు అని అంటారు. అందువలన వారి కొరకు శ్రమ ఎందుకు చేయాలి? బాబా అర్థం చేయిస్తున్నారు - భగవానువాచ అని పైన వ్రాసి ఉన్నారు. నేను కల్ప-కల్పము పురుషోత్తమ సంగమ యుగములో సాధారణ మానవ శరీరములో వస్తాను. ఇతని జన్మలు ఇతనికి తెలియవు. నేను తెలుపుతాను. పూర్తిగా 5 వేల సంవత్సరాల పాత్ర ఎవరికి ఉంటుందో నేను చెప్తాను. ఎవరైతే నెంబర్వన్లో వచ్చారో వారికే ఇలాంటి పాత్ర ఉంటుంది కదా. శ్రీ కృష్ణుని మొట్టమొదటి సత్యయుగపు రాకుమారుడని మహిమ కూడా చేస్తారు. అలాగే మళ్లీ 84 జన్మల తర్వాత ఏమవుతాడు? - ఫస్ట్ భికారి. భికారి నుండి రాకుమారుడు మళ్లీ రాకుమారుని నుండి భికారి. రాకుమారుని నుండి భికారిగా ఎలా అవుతాడో మీరు అర్థము చేసుకున్నారు. మళ్లీ తండ్రి వచ్చి గవ్వ నుండి వజ్ర సమానంగా తయారు చేస్తారు. వజ్ర సమానంగా ఉన్నవారే మళ్లీ గవ్వ సమానంగా అవుతారు. పునర్జన్మలైతే తీసుకుంటారు కదా. అందరికంటే ఎక్కువ జన్మలు తీసుకొను వారెవరో మీరు అర్థము చేసుకున్నారు. మొదట శ్రీ కృష్ణుడే వస్తాడని ఒప్పుకుంటారు. అతనికి రాజధాని ఉంటుంది. ఎక్కువ జన్మలు కూడా అతనికే ఉంటాయి. ఇది చాలా సులభమైన విషయము. కానీ మనుష్యులు ఈ విషయాల పై గమనమివ్వరు. తండ్రి అర్థం చేయిస్తే ఆశ్చర్యపడ్తారు. మొదటివారే చివరి వారవుతారని తండ్రి ఖచ్ఛితంగా తెలుపుతారు. ఫస్టులో వజ్ర సమానము, లాస్టులో గవ్వ సమానము. మళ్లీ వజ్ర సమానంగా అవ్వాలి. పావనంగా అవ్వాలి. ఇందులో కష్టమేముంది? పారలౌకిక తండ్రి ఆర్డినెన్స్(అత్యవసర సమయాలలో వెలువడు ఆజ్ఞ) జారీ చేస్తున్నారు. ''కామము మహాశత్రువు''. మీరు ఎందుకు పతితులుగా అయ్యారు? వికారాలలోకి వెళ్లినందున. అందుకే ''ఓ పతితపావనా! రండి'' అని పిలుస్తారు. ఎందుకంటే తండ్రి ఏమో సదా పారస బుద్ధిగలవారు, వారు ఎప్పుడూ రాతిబుద్ధిగా అవ్వరు. మొదటి నెంబరు జన్మ తీసుకునే వారితోనే బాబా సంబంధముంటుంది. దేవతలైతే చాలామంది ఉంటారు. కానీ మనుష్యులకు ఏమీ అర్థము చేసుకోరు.
క్రైస్తవులు క్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రితము స్వర్గము ఉండేదని అంటారు. వారు చాలా కాలము గడిచిన తర్వాత చివర్లో వచ్చారు కదా. అందువలన వారికి శక్తి ఉంది. అందరూ వారి ద్వారా నేర్చుకునేందుకే వెళ్తారు ఎందుకంటే వారి బుద్ధి తాజాగా ఉంటుంది. వృద్ధి కూడా వారిదే ఎక్కువగా జరుగుతుంది. సతో, రజో, తమో గుణాలలో వస్తారు కదా? అందరూ విదేశాల నుండే అన్నీ నేర్చుకుంటారని మీకు తెలుసు. సత్యయుగములో భవనాలు మొదలైనవి తయారయ్యేందుకు పెద్ద సమయము కూడా పట్టదని మీకు తెలుసు. ఒకరి బుద్ధిలోకి వచ్చిందంటే ఇక వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఒకటి తయారు చేసి తర్వాత దాని ద్వారా అనేకము తయారు చేస్తూ ఉంటారు. బుద్ధిలోకి వచ్చేస్తుంది కదా. సైన్స్ వారి బుద్ధి మీ వద్ద ఉన్నతంగా అయిపోతుంది. క్షణంలో భవనాలు నిర్మిస్తూ ఉంటారు. ఇక్కడ భవనాలు లేక మందిరాలు నిర్మించాలంటే 12 మాసాలు పడ్తుంది. అక్కడ ఇంజనీర్లు మొదలైనవారంతా చాలా చురుకుగా ఉంటారు. అది అయ్యిందే స్వర్ణిమ యుగము(గోల్డెన్ ఏజ్). రాళ్ళు మొదలైనవి ఉండనే ఉండవు. మనము ఈ పాత శరీరాన్ని వదుల్తాము, మళ్లీ ఇంటికి వెళ్తామని ఇప్పుడు మీరు కూర్చొని ఆలోచిస్తుంటారు. అక్కడ నుండి సత్యయుగములో యోగబలముతో జన్మ తీసుకుంటాము. పిల్లలకు సంతోషము ఎందుకుండదు? చింతన ఎందుకు నడవదు? ఎవరైతే చాలా మంచి సేవాధారి పిల్లలున్నారో వారికి తప్పకుండా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ఎలాగైతే వకీలు చదువు పాస్ అవుతూనే నేను ఇది చేస్తాను, అది చేస్తానని బుద్ధిలో ఆలోచనలు నడుస్తాయి కదా. మీరు కూడా ఈ శరీరాన్ని వదిలి ఇలా అవుతామని ఆలోచిస్తారు. స్మృతి ద్వారానే మీ ఆయువు వృద్ధి చెందుతుంది. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రికి పిల్లలు. ఈ గ్రేడ్ చాలా ఉన్నతమైనది. మీరు ఈశ్వరీయ పరివారానికి చెందినవారు. వారికి ఏ ఇతర సంబంధాలు లేవు. సోదరీ-సోదరుల కంటే ఉన్నతము చేసేశారు. భాయి-భాయి(సోదరులము) అని భావించాలి. దీనిని చాలా అభ్యాసము చేయాలి. సోదరుని నివాసమెక్కడ? ఈ సింహాసనము పై అమరమైన(అకాలమైన) ఆత్మ ఉంటుంది. ఆత్మలు నివసించే ఈ సింహాసనము చెడిపోయింది. అన్నింటికంటే చెడిపోయింది మీ సింహాసనాలే. ఆత్మ ఈ సింహాసనము పై విరాజమానమై ఉంటుంది. భృకుటి మధ్యలో ఏముంది? ఇవి బుద్ధి ద్వారా అర్థం చేసుకునే విషయాలు. ఆత్మ నక్షత్రము వలె అత్యంత సూక్ష్మమైనది. నేను కూడా బిందువునేనని తండ్రి అంటున్నారు. నేను మీ కంటే పెద్దగా ఏమీ లేను. మనము శివబాబా సంతానమని మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి. అందుకే స్వయాన్ని ఆత్మ భాయి-భాయి అని భావించండి. తండ్రి మిమ్ములను సన్ముఖములో చదివిస్తున్నారు. పోను పోను ఇంకా ఆకర్షణ అవుతూ ఉంటుంది. ఈ విఘ్నాలు కూడా డ్రామానుసారము ఏర్పడ్తూ ఉంటాయి.
ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మీరు పతితులుగా అవ్వరాదు. ఇది నా ఆజ్ఞ(ఆర్డినెన్స్). ఇప్పుడు ఇంకా తమోప్రధానమైపోయారు. వికారాలు లేకుండా ఉండలేరు. ప్రభుత్వము వారు సారాయి తాగరాదు అని అన్నా తాగకుండా ఉండలేరు. మళ్లీ వారికే సారా తాపించి ఫలానా చోట బాంబు సహితంగా వెళ్లి పడమని ఆదేశమునిస్తారు. ఎంత నష్టము జరుగుతుంది. మీరిక్కడ కూర్చునే విశ్వానికి అధికారులుగా అవుతారు. వారు అక్కడ కూర్చునే పూర్తి విశ్వాన్ని నాశనము చేసేందుకు బాంబులు వేస్తారు. ఎంత సంఘర్షణ ఉంది. మీరిక్కడ కూర్చునే తండ్రిని స్మృతి చేసి విశ్వానికి అధికారులుగా అవుతారు. ఎలాగైనా సరే తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. ఇందులో హఠయోగము లేక ఆసనాలు మొదలైనవి వేసే మాటే లేదు. బాబా ఏ కష్టమునివ్వరు. ఎలాగైనా కూర్చోండి, కేవలం మేము మీ అత్యంత ప్రియ సంతానమని(మోస్ట్ బిలవడ్ బచ్చే) స్మృతి చేయండి. వెన్న నుండి వెంట్రుక తీసినంత సులభంగా మీకు చక్రవర్తి పదవి లభిస్తుంది. సెకండులో జీవన్ముక్తి అని మహిమ చేస్తారు. ఎక్కడ కూర్చున్నా, తిరిగినా తండ్రిని స్మృతి చేయండి. పవిత్రమవ్వకుండా ఎలా వెళ్తారు? పవిత్రంగా అవ్వకుంటే శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ధర్మరాజు వద్దకు వెళ్లినప్పుడు అందరి లెక్కాచారాలు చుక్త అయిపోతాయి. ఎంత పవిత్రంగా అయితే అంత ఉన్నత పదవి పొందుతారు. అపవిత్రంగా ఉంటే ఎండిపోయిన రొట్టె తినాల్సి వస్తుంది. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత పాపాలు నశిస్తాయి. ఇందులో ఖర్చు మొదలైన మాటలేవీ ఉండవు. భలే ఇంట్లో ఉంటూనే తండ్రి నుండి మంత్రము తీసుకోండి. ఇది మాయను వశపరచుకునే ''మన్మనాభవ'' మంత్రము. ఈ మంత్రము లభించిన తర్వాత భలే ఇంటికి వెళ్లండి. నోటితో ఏమీ అనకండి. అల్ఫ్(బాబా) మరియు బే(చక్రవర్తి పదవి)ని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేసినందున మనము సతోప్రధానంగా అవుతామని, పాపాలు తొలగిపోతాయని మీకు తెలుసు. బాబా తన అనుభవము కూడా వినిపిస్తారు. ''భోజనము చేసేందుకు కూర్చుంటాను, బాబా స్మృతి చేసి తింటానని అనుకుంటాను. వెంటనే మర్చిపోతాను. ఎందుకంటే ఎన్ని విషయాలో అంత తల........ (జిత్నే మత్థే మామ్లా...... ఎవరి తల పై బాధ్యత ఉందో) అన్న గాయనముంది కదా. ఎంతో గమనమివ్వాల్సి వస్తుంది. ఫలానా ఆత్మ చాలా సేవ చేస్తుంది, తనను స్మృతి చేయాలి. సేవాధారి(సర్వీసెబుల్) పిల్లలను చాలా ప్రేమిస్తారు. ఈ శరీరములో విరాజమానమై ఉన్న ఆత్మను స్మృతి చేయమని మీకు కూడా చెప్తున్నారు. ఇక్కడకు మీరు వచ్చేదే శివబాబా వద్దకు. తండ్రి అక్కడి నుండి క్రిందకు వచ్చారు. భగవంతుడు వచ్చారని మీరు అందరికీ చెప్తారు. కానీ వారు అర్థము చేసుకోలేరు. కావున యుక్తిగా తెలియజేయవలసి ఉంటుంది. హద్దు తండ్రి మరియు బేహద్ తండ్రి ఇద్దరు తండ్రులున్నారు. ఇప్పుడు బేహద్ తండ్రి రాజ్యమునిస్తున్నారు. పాత ప్రపంచ వినాశనము కూడా ఎదురుగా నిల్చొని ఉంది. ఏక ధర్మ స్థాపన మరియు అనేక ధర్మాల వినాశనం జరుగుతుంది. తండ్రి చెప్తున్నారు - నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ పాపాలు భస్మమైపోతాయి. ఇది యోగాగ్ని, దీని ద్వారా మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. ఈ పద్ధతిని తండ్రే తెలిపించారు. తండ్రి అందరినీ పుష్పాలుగా తయారు చేసి, కనుల పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్తారని పిల్లలైన మీకు తెలుసు. ఏ కనులు? జ్ఞాన నేత్రాలు. ఆత్మలను తీసుకెళ్తారు. తప్పకుండా వెళ్ళాల్సిందే. అంతకు ముందే తండ్రి నుండి వారసత్వమునెందుకు తీసుకోరాదు? సంపాదన కూడా చాలా గొప్పది. తండ్రిని మర్చిపోతే నష్టం కూడా చాలా ఉంటుంది. పక్కా వ్యాపారులుగా అవ్వండి. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే ఆత్మ పవిత్రంగా అవుతుంది. మళ్లీ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. అందువలన తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా! దేహీ-అభిమానులుగా అవ్వండి. ఈ అలవాటు పక్కాగా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి ద్వారా చదువుతూ ఉంటే నావ తీరానికి చేరుకుంటుంది. శివాలయంలోకి వెళ్లిపోతారు. చంద్రకాంతుని వేదాంతములో కూడా ఈ కథ ఉంది. బోటు(నావ) పోతూ ఉంటుంది, మధ్యలో దిగుతారు ఏదో వస్తువు పై ఇష్టపడ్తారు, స్టీమరు వెళ్లిపోతుంది. భక్తిమార్గములోని ఈ శాస్త్రాలు మళ్లీ తయారౌతాయి. మీరు చదువుతారు. మళ్లీ బాబా వచ్చినప్పుడు ఇవన్నీ వదిలేస్తారు. తండ్రి అందరినీ తీసుకెళ్లేందుకు వస్తారు. భారతదేశపు ఉన్నతి మరియు పతనము ఎలా జరుగుతుందో ఎంత స్పష్టంగా ఉంది! ఇతను నల్లగా మరియు తెల్లగా అవుతాడు. బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మగా అవుతాడు. కేవలం ఒక్కరే అవ్వరు కదా. ఇదంతా విశదీకరించాలి. కృష్ణుని గురించి కూడా వివరించడం జరిగింది - సుందరంగా ఉండేవాడు నలుపుగా అవుతాడు. స్వర్గములోకి వెళ్తాడు కనుక నరకాన్ని కాలితో తన్నేస్తాడు. ఇది ఈ చిత్రంలో స్పష్టంగా ఉంది కదా. మీ రాజ్యపు చిత్రాలను కూడా తయారు చేశారు కదా. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి ఆర్డినెన్స్ (అత్యవసర సమయాలలో వెలువడే ఆజ్ఞ)ను పాలన చేసేందుకు ఆత్మలైన మనమంతా సోదరులము(భాయి-భాయి), భృకుటి మధ్యలో నివసిస్తాము, మనము అనంతమైన తండ్రికి పిల్లలము, ఇది మన ఈశ్వరీయ పరివారము - అనే స్మృతిలో ఉండాలి. దేహీ-అభిమానులుగా అయ్యేందుకు అలవాటు పడాలి.
2. ధర్మరాజు శిక్షల నుండి విడుదల పొందేందుకు మీ లెక్కాచారాన్నంతా చుక్తా చేసుకోవాలి. మాయను వశపరచుకునేందుకు లభించిన మంత్రాన్ని స్మృతిలో ఉంచుకొని సతోప్రధానంగా అవ్వాలి.
వరదానము :-
'' సదా అలర్ట్గా (చురుకుగా) ఉంటూ అందరి ఆశలను పూర్తి చేసే మాస్టర్ ముక్తి - జీవన్ముక్తి దాతా భవ ''
ఇప్పుడు పిల్లలందరిలో అందరి ఆశలను పూర్తి చేయాలనే శుభ సంకల్పము ఉత్పన్నమవ్వాలి. అందరికి జన్మ మరణాల నుండి ముక్తమై పోవాలనే కోరిక ఉంది. కనుక ఇప్పుడు దానిని అనుభవం చేయించండి. అందుకు మీ శక్తిశాలి సతోప్రధానమైన వైబ్రేషన్ల ద్వారా ప్రకృతి మరియు మనుష్యాత్మల వృత్తులను పరివర్తన చేయండి. మాస్టర్ దాతగా అయ్యి ప్రతి ఆత్మ ఆశలను పూర్తి చేయండి. ముక్తి, జీవన్ముక్తులను దానమివ్వండి. ఈ బాధ్యత స్మృతిలో ఉంటే అది మిమ్ములను సదా అలర్ట్గా చేసేస్తుంది.
స్లోగన్ :-
'' మురళిధరుని మురళి వింటూ దేహ స్మృతిని కూడా మర్చిపోయేవారే గోప - గోపికలు. ''