09-08-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - మీరు చైతన్య లైట్‌ హౌస్‌లు, మీరు అందరికీ తండ్రి పరిచయమునివ్వాలి, ఇంటికి దారి తెలపాలి ''

ప్రశ్న :-

పోను పోను ఏ డైరక్షన్‌(ఆదేశము, సూచన) ఏ విధంగా అనేక ఆత్మలకు లభించనున్నది ?

జవాబు :-

మీరు బ్రహ్మకుమార-కుమారీల వద్దకు వెళ్తే, వైకుంఠములోని రాకుమారులుగా అయ్యే జ్ఞానమునిస్తారని మున్ముందు చాలా మందికి డైరెక్షన్‌ లభిస్తుంది. ఈ సూచన వారికి బ్రహ్మాబాబా సాక్షాత్కారము ద్వారా లభిస్తుంది. తరచుగా బ్రహ్మ మరియు శ్రీ కృష్ణుని సాక్షాత్కారాలే జరుగుతాయి. ఆదిలో ఎలాగైతే సాక్షాత్కారాల పాత్ర జరిగిందో, అలాగే అంత్యములో కూడా జరుగుతుంది.

ఓంశాంతి.

ఆత్మిక తండ్రి పిల్లలను అడుగుతున్నారు, అందరినీ అడగరు. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎవరి స్మృతిలో ఉన్నారని నళిని బచ్చీని అడుగుతున్నారు. తండ్రి స్మృతిలో ఉన్నారు. కేవలం తండ్రి స్మృతిలోనే ఉన్నారా లేక ఇతరమేదైనా గుర్తు వస్తోందా? తండ్రి స్మృతి ద్వారా అయితే వికర్మలు వినాశనమవుతాయి, ఇంకా దేనిని స్మృతి చేస్తున్నారు? ఇది బుద్ధితో చేయవలసిన పని కదా. ఆత్మలమైన మనమంతా ఇంటికి వెళ్లాలంటే ఇంటిని కూడా స్మృతి చేయాలి. అచ్ఛా. ఇంకా ఏం చేయాలి? ఇంటికి వెళ్లి అక్కడే కూర్చుండిపోవాలా! విష్ణువుకు స్వదర్శన చక్రమును చూపిస్తారు కదా. దాని అర్థమును కూడా తండ్రి ఇప్పుడు అర్థం చేయించారు. స్వయానికి అనగా ఆత్మకు 84 జన్మల చక్ర దర్శనము జరిగింది. కావున ఆ చక్రమును కూడా త్రిప్పవలసి ఉంటుంది. మనము 84 జన్మల చక్రములో తిరిగి ఇంటికి వెళ్తామని మీకు తెలుసు. అక్కడ నుండి పాత్ర చేసేందుకు మళ్లీ సత్యయుగములోకి వస్తాము. మళ్లీ 84 జన్మల చక్రములో తిరుగుతాము. విష్ణువుకు ఏ చక్రమూ ఉండదు. వారు సత్యయుగములోని దేవత. విష్ణుపురి అనండి లేక లక్ష్మీనారాయణ పురి అనండి లేక స్వర్గమని అనండి. స్వర్గములో లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. ఒకవేళ రాధా-కృష్ణుల రాజ్యమని చెప్తే అది తప్పు అవుతుంది. రాధా-కృష్ణులకు రాజ్యమే ఉండదు ఎందుకంటే ఇద్దరు వేరు వేరు రాజ్యాలకు చెందిన రాకుమార-రాకుమారీలు. స్వయంవరం తర్వాత రాజ్యాధికారులుగా అవుతారు. కావున విష్ణువుకు ఏ చక్రమునైతే ఇచ్చారో అది మీ చక్రమే. అందువలన ఇక్కడ కూర్చున్నప్పుడు కేవలం శాంతిగా కూర్చుండిపోరాదు. వారసత్వమును కూడా స్మృతి చేయాలి. ఈ చక్రము అందుకే. తండ్రి చెప్తున్నారు - మీరు చైతన్య లైట్‌ హౌస్‌లు కూడా అయ్యారు. మాట్లాడుతూ, తిరుగుతూ ఉన్న లైట్‌ హౌస్‌లు. ఒక కంటిలో శాంతిధామము, మరొక కంటిలో సుఖధామము ఉండాలి. రెండింటిని స్మృతి చేయాల్సి పడ్తుంది. స్మృతి ద్వారా పాపాలను తొలగించుకోవాలి. ఇంటిని స్మృతి చేయడం వలన ఇంటికి వెళ్తారు. మళ్లీ చక్రమును కూడా స్మృతి చేయాలి. ఈ చక్రముల&XXXX@X8;ు మీకు మాత్రమే ఉంది. 84 జన్మల చక్రములో తిరిగారు. ఇప్పుడు మృత్యు లోకములో ఇది అంతిమ జన్మ. కొత్త ప్రపంచమును అమరలోకమని అంటారు. అమరులు అనగా మీరు సదా జీవించే ఉంటారు. మీరెప్పటికీ మరణించరు. ఇక్కడైతే కూర్చుని ఉంటారు, అకస్మాత్తుగా మరణిస్తారు. జబ్బులపాలై మరణిస్తామేమో అనే భయము అక్కడ ఉండదు, ఎందుకంటే అది అమరలోకము. మీరు వృద్ధులుగా అయినప్పుడు మనము వెళ్లి గర్భ మహలులో ప్రవేశిస్తామనే జ్ఞానము ఉంటుంది. ఇప్పుడైతే గర్బ జైలులోకి వెళ్తారు. అక్కడైతే గర్భ మహలు ఉంటుంది. అక్కడ శిక్షలు పడే విధంగా పాపము చేయరు. ఇక్కడైతే పాపాలు చేస్తారు. ఆ కారణంగా శిక్షలు అనుభవించి వెలుపలకు వచ్చి మళ్లీ పాపము చేయడం ప్రారంభిస్తారు. ఇది పాపాత్మల ప్రపంచము. ఇక్కడైతే దు:ఖమే ఉంటుంది. అక్కడ దు:ఖమను పేరే ఉండదు. కావున ఒక కంటిలో శాంతిధామమును, మరొక కంటిలో సుఖధామమును ఉంచుకోండి. భలే మీరు జన్మ-జన్మల నుండి జప తపములెన్నో చేస్తూ వచ్చారు కానీ అది జ్ఞానము కాదు కదా. అది భక్తి. భక్తిలో మీరు ఇలా సతోప్రధానంగా అయ్యేందుకు యుక్తి కూడా లభించదు. ఆ యుక్తి ఎవ్వరికీ తెలియదు. కృష్ణ భగవానువాచ దేహ సహితముగా,................ అనే గీతలోని వాక్యాలను చదివి చెప్పింది విన్నారు అంతే. మీరు ఇలా తయారవ్వండి అని ఎవ్వరూ చెప్పరు. భగవంతుడు పతితులను పావనంగా చేసేందుకు వచ్చినప్పుడు, ఇలా చెప్పి వెళ్తారని కేవలము చదువుతారు. గీతలో కేవలం పరమపిత పరమాత్మునికి బదులు కృష్ణుని పేరు వేసేశారు. ఇప్పుడు ృష్ణుడు రథికుడు కదా, వారికి రథము అవసరమా? స్వయంగా అతడే దేహధారి. కృష్ణునికి పేరు ఎవరు పెట్టారు? జన్మించినప్పుడు నామకరణంలో ప్రతి ఒక్కరికీ పేర్లు పెడ్తూ ఉంటారు. తండ్రినైతే కేవలం శివుడనే అంటారు. ఆత్మలైన మీరు జనన-మరణాలలోకి వస్తారు. కనుక శరీరము పేరు మారుతుంది. శివబాబా అయితే జనన-మరణములలోకి రారు. వారు సదా శివునిగానే ఉంటారు. బిందువు పెట్టినప్పుడు శివ అని అంటారు. బిందువైన ఆత్మ చాలా సూక్ష్మమైనది. ఒకవేళ ఆత్మ సాక్షాత్కారమైనా ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. దేవీలను చూసి సంతోషిస్తారు, అంతే తప్ప ప్రాప్తి ఏమీ ఉండదు, అర్థమేమీ లేదు. కేవలం నవ విధాల భక్తి చేస్తారు, దర్శనమైతే అందులోనే సంతోషిస్తారు. ఇక ముక్తి-జీవన్ముక్తి అనే మాటే లేదు. అదంతా భక్తిమార్గము. ఇక్కడిది జ్ఞాన మార్గము. ఇక్కడ తరచుగా బ్రహ్మ, తర్వాత శ్రీ కృష్ణుని సాక్షాత్కారము అవుతుంది. ఈ బ్రహ్మ దగ్గరకు వెళ్తే మీరు కృష్ణపురికి లేక వైకుంఠానికి వెళ్తారని అంటారు. లక్ష్మీనారాయణుల సాక్షాత్కారము కూడా జరగవచ్చు. సాక్షాత్కారమైనంత మాత్రాన సద్గతి లభిస్తుందని కాదు. ఇక్కడికి వెళ్లండి అని కేవలము సూచన లభిస్తుంది. మున్ముందు చాలా మందికి సాక్షాత్కారమవుతుంది, డైరెక్షన్‌ లభిస్తుంది. మీ త్రిమూర్తుల చిత్రము కూడా వార్తాపత్రికలలో వస్తుంది, బ్రహ్మకుమారీల పేరు కూడా పడ్తుంది. కావున వీరి దగ్గరకు వెళ్తే మీకు వైకుంఠములో రాకుమారునిగా తయారయ్యే జ్ఞానము లభిస్తుందని బ్రహ్మ సాక్షాత్కారమవుతుంది. అర్జునునికి విష్ణువు మరియు వినాశనము సాక్షాత్కారము జరిగినట్లు చివరిలో బ్రహ్మ సాక్షాత్కరిస్తాడు.
కమలపుష్ప సమానంగా ఎలా అవ్వాలో తండ్రి చెప్తారు కానీ మీరు స్థిరముగా ఉండరు. అందువలన ఈ అలంకారాన్ని విష్ణువుకు ఇచ్చేశారు. లేకుంటే దేవతలకు శంఖు మొదలైనవి పట్టుకునే అవసరమేముంది? నోటి ద్వారా వ&XXXX@X;్వని అని అంటారు. కమలపుష్ప రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయిస్తారు. బ్రాహ్మణులైన మీరు ఈ సమయంలో కమలపుష్ప సమానంగా అవ్వాలి. 5 వికారాల రూపి రావణుని మాయను జయించేది గద. నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయని తండ్రి ఉపాయము తెలుపుతారు. శ్రీమతమును అనుసరించి పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేయండి. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ పతితపావనులు కారు. ఈ అందరినీ ఈ శరీరము నుండి విడిపించి పావన ప్రపంచములోకి తీసుకెళ్లేందుకే నన్ను పిలిచారని తండ్రి చెప్తున్నారు. కనుక స్వయం తండ్రియే వచ్చి ఆత్మలందరినీ పతితము నుండి పావనంగా చేస్తారు. ఎందుకంటే అపవిత్ర ఆత్మలు ఇంటికి లేక స్వర్గములోకి వెళ్లలేవు. తండ్రి చెప్తున్నారు - పవిత్రంగా అవ్వాలంటే నన్ను స్మృతి చేయండి. స్మృతి ద్వారానే మీ పాపాలు నశిస్తూ ఉంటాయి. నేను ఈ గ్యారంటీ ఇస్తాను. ఓ పతితపావనా! రండి, మమ్ములను పావనంగా చేసి కొత్త ప్రపంచములోకి తీసుకెళ్లండి అని నన్ను పిలుస్తారు. కనుక ఎలా వెళ్తారు? విషయాన్ని ఎంత సూటిగా చెప్తున్నారు! తండ్రి సహజ జ్ఞానాన్ని, సహజ మాటలలో చెప్తున్నారు. పని పాటలు చేసుకుంటూ నన్ను స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. భలే నౌకరి మొదలైనవి చేయండి, వంట చేయండి, స్మృతిలో ఉండి చేస్తే భోజనం కూడా శుద్ధంగా అవుతుంది. అందుకే బ్రహ్మభోజనమంటే దేవతలకు కూడా ఇష్టము అని మహిమ చేయబడింది. ఈ పిల్లలు కూడా భోగ్‌ తీసుకెళ్తారు. అక్కడ సభ జరుగుతుంది. బ్రాహ్మణులు మరియు దేవతల మేళా జరుగుతుంది. భోజనం స్వీకరించేందుకు వస్తారు. బ్రాహ్మణులు భోజనం స్వీకరించేటప్పుడు కూడా మంత్రాలు చదువుతారు. బ్రహ్మభోజనానికి చాలా మహిమ ఉంది. సన్యాసులైతే బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు. వారి ధర్మమే వేరు. వారు హద్దు సన్యాసులు. మేము ఇళ్లు-వాకిళ్లు, ఆస్తులు మొదలైనవన్నీ వదిలేశామని అంటారు. ఇప్పుడు మళ్లీ లోపలికి దూసుకొస్తున్నారు. మీది బేహద్‌ సన్యాసము. మీరు ఈ పాత ప్రపంచాన్నే మర్చిపోతారు. మీరు మళ్లీ కొత్త ప్రపంచములోకి వెళ్లాలి. గృహస్థములో ఉంటున్నా బుద్ధిలో ఇప్పుడు మేము ఇంటికెళ్లాలని, శాంతిధామము ద్వారా సుఖధామానికి వెళ్లాలని ఉంటుంది. శాంతిధామాన్ని కూడా స్మృతి చేయాల్సి ఉంటుంది. మీరు తండ్రిని, శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేస్తారు. ఇది మన అనేక జన్మల అంతిమ జన్మ. 84 జన్మలు పూర్తి అయ్యాయి. సూర్యవంశీయుల నుండి చంద్రవంశీయులుగా తర్వాత వైశ్య, శూద్ర వంశీయులుగా అవుతారు. వారైతే ఆత్మయే పరమాత్మ అని అంటారు. ఆత్మకు(నిర్లేపి) లేప-చేపాలేవీ అంటవని అంటారు. ఎందుకంటే ఆత్మయే పరమాత్మ అని అనుకుంటారు. ఇది వారు చేప్పే ఉల్టా అర్థమని తండ్రి చెప్తున్నారు. తండ్రి కూర్చొని హం సో కు అర్థం తెలుపుతారు. మేము ఆత్మలము, పరమపిత పరమాత్మ సంతానము. మొట్టమొదట మనము స్వర్గవాసులైన దేవతలుగా ఉండేవారము, తర్వాత మళ్లీ చంద్ర వంశీయులైన క్షత్రియులుగా అయ్యాము. 2500 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. తర్వాత వైశ్య, శూద్ర వంశీయులుగా, వికారులుగా అయ్యాము. ఇప్పుడు మనము పిలక బ్రాహ్మణులుగా, శ్రేష్ఠులుగా అవుతాము. 84 పల్టీలాట ఆడేందుకు అన్నట్లు కూర్చుని ఉన్నాము. ఈ పల్టీలాట గురించిన జ్ఞానము కూడా ఉంది. పూర్వము తీర్థ స్థానాలకు వెళ్లునప్పుడు పల్టీలు వేస్తూ, గుర్తు లేసుకుంటూ వెళ్లేవారు. ఇప్పుడు మీ సత్యమైన తీర్థ స్థానాలు - శాంతిధామము మరియు సుఖధXXXX@X#3114;ండాలు. తండ్రిని స్మృతి చేస్తే శాంతిధామానికి వెళ్తారని అందరికీ సలహానిస్తారు. సాధువులు, సత్పురుషులు మొదలైన వారందరు శాంతిధామానికి వెళ్లేందుకే శ్రమ చేస్తారు. కానీ ఎవ్వరూ వెళ్లలేరు. మొత్తం అందరూ కలిసి ఒకే లాట్‌గా వెళ్తారు. సత్యయుగములో చాలా కొద్దిమందే ఉంటారని తండ్రి అర్థం చేయించారు. తర్వాత మళ్లీ వృద్ధి చెందుతూ ఉంటారు. కనుక మీరే స్వదర్శన చక్రధారులు. దేవతలు స్వదర్శన చక్రధారులు కాదు. అయితే ఈ సమయంలో మీకు, మాయకు యుద్ధము నడుస్తూ ఉంది. ఆ యుద్ధములో కూడా ఎవరినైతే శక్తిశాలిగా భావిస్తారో వారి వద్దకు వెళ్లి శరణు తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఎవరి శరణు తీసుకుంటారు? స్త్రీ, పురుషులిరువురు మేము మీ శరణు జొచ్చాము అని అంటారు. నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరని అంటారు. ఆత్మలందరి తండ్రి ఒక్కరే కదా. మీరంతా ఆ తండ్రి పిల్లలే. సాధువులు, సత్పురుషులైతే ఒక్కరు కాదు. అనేకమంది భగవంతులుంటారు. ఎవరైతే ఇంట్లో అలిగి వస్తారో వారు భగవంతులు. గొప్ప గొప్ప షావుకార్లు, కోటీశ్వరులు వెళ్లి వారికి శిష్యులుగా అవుతారు. అశుద్ధ ఆహార పానీయాల పార్టీ ఏర్పాటు చేస్తారు. తమోప్రధానమైన మనుష్యులు కదా. హిందువులకు తమ ధర్మము గురించే తెలియదు.
ఈ 84 జన్మల చక్రము కూడా మీకు బుద్ధిలో గుర్తుంటుంది. చాలా సంతోషముంటుంది. మనము క్రొత్త ప్రపంచానికి అనగా సత్యయుగానికి అధికారులుగా అవుతామని మీకు తెలుసు. గీతలో కూడా భగవానువాచ అని ఉంది కదా - ఓ పిల్లలారా! దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ వదిలేయండి. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. భగవంతుడే మీకు సత్య సత్యమైన స్నేహితుడు(ఖుదాదోస్త్‌). అల్లా అవలద్దీన్‌ నాటకము, హాతమ్‌తాయి నాటకములన్నీ ఈ సమయములోనివే. జన సంఖ్యను అరికట్టాలని మానవులు ఎంతగా తల కొట్టుకుంటున్నారు. బేహద్‌ తండ్రి ఎంతగా తగ్గించేస్తారు. సత్యయుగములో విశ్వమంతా 9 లక్షల మంది మాత్రమే నివసిస్తారు. మిగిలిన ఇన్ని కోట్ల మంది మానవులు ఉండరు. అందరూ ముక్తిధామానికి, శాంతిధామానికి వెళ్లిపోతారు. ఇది అద్భుతమైన విషయము కదా. ఒక్క దేవీ దేవతా ధర్మానికి పునాది వేసి మిగిలిన అన్ని ధర్మాలను వినాశనము చేసేస్తారు. 84 జన్మల ఈ చక్రమును బుద్ధిలో బాగా కూర్చోపెట్టాలి. ఇదే స్వదర్శన చక్రము. అంతేగాని ఈ చక్రము ద్వారా ఎవరి గొంతు, మొదలైనవాటిని కోయాలని కాదు. శాస్త్రాలలో కృష్ణుని గురించి హింసకపూరితమైన విషయాలను వ్రాసేశారు. అందరినీ స్వదర్శన చక్రముతో సంహరించారని ఉంది. ఇది కూడా నిందించడమే కదా. ఎంత హింసకులుగా చేసేశారు! మీరు డబల్‌ అహింసకులుగా అవుతారు. కామ ఖడ్గాన్ని ఉపయోగించడం కూడా హింసయే. దేవతలను పవిత్రులని అంటారు. యోగబలము ద్వారా విశ్వాధిపతులుగా అవ్వగలిగినప్పుడు, యోగబలము ద్వారా పిల్లలు ఎందుకు జన్మించలేరు! ఇప్పుడు పుత్రుడు జన్మించబోతాడని సాక్షాత్కారమవుతుంది. ఇప్పుడే పాత శరీరమును వదులుతామని తర్వాత బంగారు స్పూను నోటిలో ఉంటుందని (గోల్డన్‌ స్పూన్‌ ఇన్‌ ద మౌత్‌) బాబా అర్థం చేయిస్తారు. మీరు కూడా, మేము అమరలోకములో, నోటిలో బంగారు స్పూనుతో జన్మిస్తామని భావిస్తారు. పేద ప్రజలు కూడా ఉండాలి కదా. అయితే దు:ఖమనే మాట ఉండనే ఉండదు. ప్రజల వద్ద అంత ధన-సంపదలు ఉండవు కానీ సుఖముంటుంది. ఆయువు ఎక్కువగా ఉంటుంది. రాజ-రాణి, షాహుకారు ప్రజలు అందరూ ఉండాలి కదా. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. తండ్రిని స్మృతి చేస్తూ సంతోషంగా ఉండేందుకు 84 జన్మల చక్రమును కూడా స్మృతి చేయాలి. స్వదర్శన చక్రమును తిప్పాలి. భగవంతుని మీ సత్యమైన స్నేహితునిగా తయారు చేసుకోవాలి.

2. డబల్‌ అహింసకులుగా అయ్యేందుకు చెడు దృష్టిని మంచి దృష్టిగా పరివర్తన చేసుకోవాలి. ఆత్మలమైన మనము పరస్పరము సోదరులము(భాయి-భాయి) అని అభ్యాసము చేయాలి.

వరదానము :-

'' టెన్షన్‌ ద్వారా వ్యాకులపడి, దు:ఖములో ఉన్న ఆత్మలకు ధైర్యమునిచ్చి ముందుకు నడిపించే మాస్టర్‌ రహమ్‌దిల్‌ భవ (దయా హృదయులు కండి).''

వర్తమాన సమయంలో చాలామంది ఆత్మలు ఆంతరిక టెన్షన్‌ ద్వారా వ్యాకులపడి దు:ఖితులుగా ఉన్నారు. నిరాశ చెందిన వారిలో ముందుకు వెళ్లే ధైర్యము లేదు. మీరు వారికి ధైర్యమునివ్వండి. ఎలాగైతే కాళ్లు లేని వారికి కొయ్య కాళ్లనిస్తే నడుస్తారో, అలా మీరు వారికి ధైర్యమనే కాళ్లనివ్వండి. ఎందుకంటే అజ్ఞాని పిల్లల ఆంతరికంలో ఏముందో బాప్‌దాదా చూస్తున్నారు. బాహ్యానికి చాలా బాగా టిప్‌టాప్‌గా కనిపిస్తారు కాని లోపల చాలా దు:ఖములో ఉన్నారు. కనుక మీరు మాస్టర్‌ దయాహృదయులుగా అవ్వండి.

స్లోగన్‌ :-

'' నిర్మాణులుగా అవ్వండి, కోమలంగా కాదు. నిర్మాణతయే మహానత. ''