17-04-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - మీరు ఉదయానికి అమీరులు(ధనవంతులు)గా అవుతారు. సాయంకాలానికి ఫకీరులు(నిరుపేదలు)గా మారిపోతారు. ఫకీరుల నుండి అమీరులుగా, పతితుల నుండి పావనంగా అయ్యేందుకు రెండు మాటలను గుర్తుంచుకోండి - మన్మనాభవ మరియు మధ్యాజీభవ''
ప్రశ్న :-
కర్మ బంధనము నుండి ముక్తులుగా అయ్యేందుకు యుక్తి ఏది ?
జవాబు :-
1. స్మృతి యాత్ర మరియు జ్ఞాన స్మరణ 2. ఒక్కరితోనే సర్వ సంబంధాలుండాలి. ఇతరులెవ్వరి వైపు కూడా బుద్ధి వెళ్ళరాదు. 3. సర్వశక్తివంతులైన తండ్రి బ్యాటరీతో సదా యోగము జోడింపబడి ఉండాలి. మీ పై మీరే పూర్తి గమనముంచాలి. దైవీ గుణాలనే రెక్కలను కట్టుకొని ఉంటే కర్మబంధనాల నుండి ముక్తులవుతూ పోతారు.
ఓంశాంతి.
తండ్రి కూర్చుని అర్థం చేయించారు - ఈ కథ భారతవాసులది. ఏ కథ? ఉదయము అమీరులు, సాయంకాలము ఫకీరులు(నిరుపేదలు) దీనిని గురించి ఒక కథ కూడా ఉంది. ఉదయము ధనవంతులుగా ఉండేవారు,...........(సుబహ్ కో అమీర్ థా,................) ఈ విషయాలు ధనవంతులుగా ఉన్నప్పుడు మీరు వినరు. ఫకీరులు, అమీరులు అను మాటలను పిల్లలైన మీరు సంగమ యుగములోనే వింటారు. ఈ విషయాలు మనసులో ధారణ చేయాలి. తప్పకుండా భక్తి ఫకీరులుగా చేస్తుంది, జ్ఞానము అమీరులుగా చేస్తుంది. ఇందులో వర్ణింపబడిన రాత్రింబవళ్ళు కూడా అనంతమైనవి. ఫకీరులు - అమీరులు, ఇది కూడా అనంతమైన విషయము. అలా తయారు చేయువారు కూడా అనంతమైన తండ్రే. సర్వ పతితాత్మలు పావనంగా అయ్యేందుకు ఇది ఒక్కటే బ్యాటరీ. ఇటువంటి సామెతలను గుర్తు పెట్టుకున్నా సంతోషంగా ఉంటారు. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ! మీరు ఉదయము అమీరులుగా అవుతారు. సాయంకాలానికి ఫకీరులుగా మారిపోతారు - ఎలా మారిపోతారో తండ్రే తెలిపిస్తున్నారు. అంతేకాక పతితుల నుండి పావనంగా, ఫకీరుల నుండి అమీరులుగా అయ్యే యుక్తి కూడా తండ్రే అర్థం చేయిస్తారు. మన్మనాభవ, మధ్యాజీభవ - ఈ రెండే యుక్తులు. ఇది పురుషోత్తమ సంగమయుగమని కూడా పిల్లలకు తెలుసు. ఇక్కడ కూర్చుని ఉన్న వారందరూ నంబరువారుగా స్వర్గములో అమీరులుగా తప్పకుండా అవుతారని గ్యారంటీ ఉంది. స్కూలులో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. నంబరువారుగా క్లాసు బదిలీ అవుతుంది. పరీక్ష పూర్తి అవుతూనే తర్వాతి తరగతిలో నంబరువారుగా వెళ్ళి కూర్చుంటారు. అది హద్దులోని విషయము, ఇది అనంతంలోని విషయము. నంబరువారుగా రుద్రమాలలోకి వెళ్ళిపోతారు. మాల లేక వృక్షము. బీజము వృక్షముదే కదా. పరమాత్మ మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజము. ఈ వృక్షము ఎలా వృద్ధి చెందుతుందో, ఎలా పాతదవుతుందో పిల్లలకు తెలుసు. ఇంతకుముందు మీకు తెలిసేది కాదు, తండ్రి వచ్చి అర్థం చేయించారు. ఇప్పుడిది పురుషోత్తమ సంగమయుగము. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థము చేయాలి. దైవీగుణాలనే రెక్కలను కూడా ధరించాలి. మీ పై మీరు పూర్తిగా గమనముంచాలి. స్మృతియాత్ర ద్వారానే మీరు పావనంగా అవుతారు. ఇక ఏ ఇతర ఉపాయము లేదు. తండ్రి, ఎవరైతే సర్వశక్తివంతుడైన బ్యాటరీగా ఉన్నారో వారితో యోగాన్ని పూర్తిగా జోడించాలి. వారి బ్యాటరీ ఎప్పుడూ తగ్గిపోదు. వారు సతో, రజో, తమోల(ప్రభావము)లోకి రారు ఎందుకంటే వారు సదా కర్మాతీత స్థితిలో ఉంటారు. పిల్లలైన మీరు కర్మబంధములో చిక్కుకుంటారు. అవి ఎంతో కఠినమైన బంధనాలు, ఈ కర్మబంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు ఒకే ఒక ఉపాయముంది. అది - స్మృతియాత్ర. ఇది తప్ప ఇక ఏ ఇతర ఉపాయమూ లేదు. ఈ జ్ఞానము కూడా ఎముకలను మెత్తగా చేస్తుంది. నిజానికి భక్తి కూడా మెత్తగా చేస్తుంది. పాపం ఇతను మంచి భక్తుడు, ఇతనిలో మోసము మొదలైనవేవీ లేవు అని అంటారు. కానీ భక్తులలో కూడా మోసము ఉంటుంది. బాబా అనుభవస్థులు. ఆత్మ ఈ శరీరము ద్వారా వృత్తి వ్యాపారాలు చేస్తుంది కనుకనే ఆత్మకు ఈ జన్మలోనిదంతా గుర్తుకొస్తుంది. 4-5 సంవత్సరాల వయసు నుండి మీ జీవితకథ అంతా గుర్తుండాలి. కొంతమంది కేవలం10-20 సంవత్సరాల క్రితపు విషయము కూడా మర్చిపోతారు మరి జన్మ-జన్మాంతరాల నామ-రూపాలైతే గుర్తుండవు. ఈ జన్మదైతే కొంత తెలుపగలరు, ఫోటోలు మొదలైనవి ఉంచుకుంటారు. వేరే జన్మవి ఉంచుకోలేరు. ప్రతి ఆత్మ భిన్న-భిన్న నామ, రూప, దేశ, కాలాలలో పాత్రను అభినయిస్తుంది. నామ రూపాలన్నీ మారిపోతూ ఉంటాయి. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటెలా తీసుకుంటుందో కూడా మీ బుద్ధిలో ఉంది. తప్పకుండా 84 జన్మలు, 84 పేర్లు, 84 తండ్రులు అయ్యి ఉంటారు. చివరిలో మళ్లీ చాలా తమోప్రధాన సంబంధమైపోతుంది. ఈ సమయములో ఎన్ని సంబంధాలున్నాయో, అన్ని సంబంధాలు కల్పములో ఎప్పుడూ ఉండవు. కలియుగ సంబంధాలను బంధనమనే భావించాలి. ఎంతోమంది పిల్లలుంటారు, మళ్లీ వివాహము చేసుకుంటారు, పిల్లలకు జన్మనిస్తారు. ఈ సమయములో అందరికంటే ఎక్కువ బంధనము కలిగించేవారు - చిన్నాన్న, మామ మొదలైనవారు....... ఎంత ఎక్కువ సంబంధాలుంటాయో అంత ఎక్కువ బంధనాలుంటాయి. వార్తాపత్రికలలో 5 మంది ఒకేసారి జన్మించారని వ్రాశారు. 5 మంది కూడా ఆరోగ్యంగా ఉన్నారని చదివాము. ఎన్ని సంబంధాలైపోతాయో ఆలోచించండి, లెక్క కట్టండి. ఈ సమయములో మీ సంబంధము అన్నిటికంటే చాలా చిన్నది. కేవలం ఒక్క తండ్రితోనే సర్వ సంబంధాలున్నాయి. ఒక్క తండ్రితో తప్ప ఇతరులెవ్వరితోనూ మీ బుద్ధియోగము లేదు. మళ్లీ సత్యయుగములో ఇంతకంటే ఎక్కువ సంబంధాలుంటాయి. ఇప్పుడు మీది వజ్ర సమానమైన జన్మ, అత్యంత శ్రేష్ఠమైన(హైయెస్ట్) తండ్రి పిల్లలను దత్తత చేసుకుంటారు. జీవించి ఉండే ఒడిలోకి వెళ్లడం, వారసత్వము పొందడం ఇప్పుడు మాత్రమే జరుగుతుంది. వారసత్వమునిచ్చే తండ్రి ఒడిలోకి మీరు వచ్చారు. బ్రాహ్మణులైన మీ కంటే శ్రేష్ఠమైనవారు ఎవ్వరూ లేరు. అందరి యోగము ఒక్కరి జతలోనే ఉంది, పరస్పరములో కూడా మీకు ఎలాంటి సంబంధము లేదు. సోదరీ-సోదరుల సంబంధము కూడా క్రింద పడేస్తుంది. సంబంధము ఒక్కరితో మాత్రమే ఉండాలి, ఇది క్రొత్త విషయము. పవిత్రంగా అయ్యి వాపస్ వెళ్ళాలి. ఈ విధంగా విచార సాగర మథనము చేయడం ద్వారా మీరు చాలా వెలుగులోకి వచ్చేస్తారు. సత్యయుగములోని ప్రకాశానికి, కలియుగములోని ప్రకాశానికి రాత్రికి - పగులుకు ఉన్నంత తేడా ఉంది. భక్తిమార్గమున్న సమయమంటే అది రావణరాజ్యము. చివరి సమయములో విజ్ఞాన గర్వము కూడా చాలా ఉంటుంది, దానిని(కలియుగమును) సత్యయుగముతో పోలుస్తారు. ఒక బిడ్డ, సమాచారమును ఇలా వ్రాసింది - మీరు స్వర్గములో ఉన్నారా? లేక నరకములో ఉన్నారా? అని ప్రశ్నించినప్పుడు 4-5 మంది మేము స్వర్గములోనే ఉన్నామని చెప్పారు. బుద్ధిలో రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసము అయిపోతుంది. కొంతమంది మేము నరకములో ఉన్నామని భావిస్తారు. అటువంటివారిని మీరు స్వర్గవాసులుగా అవ్వాలని కోరుకుంటున్నారా? స్వర్గమును ఎవరు స్థాపన చేస్తారు? అని అడగాలి - ఇవి చాలా మధురమైన విషయాలు. మీరు నోట్ చేసుకుంటారు కానీ ఇదంతా నోట్సులోనే ఉండిపోతుంది, సమయానికి గుర్తు రాదు. ఈ సమయములో పతితుల నుండి పావనంగా చేయువారు పరమపిత పరమాత్మ అయిన శివుడు. వారు చెప్తున్నారు - నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే, మీ పాపాలు తొలగిపోతాయి. స్మృతిలో ఏదో కొంత సంపాదన ఉంటుంది కదా. స్మృతి చేసే ఆచారము ఇప్పుడే వెలువడింది. స్మృతి ద్వారానే మీరు ఎంతో ఉన్నతంగా, స్వచ్ఛంగా అవుతారు. ఎవరు ఎంత శ్రమ చేస్తారో, అంత శ్రేష్ఠమైన పదవిని పొందుతారు. బాబాను కూడా అడగవచ్చు, ప్రపంచములో అయితే సంబంధాలు, ఆస్తుల కొరకు జగడాలే జగడాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏ ఇతర సంబంధమూ లేదు - ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు. తండ్రి అనంతమైన యజమాని, విషయము చాలా సహజమైనది. ఆ వైపు స్వర్గము, ఈ వైపు నరకము. నరకవాసులు మంచివారా? లేక స్వర్గవాసులు మంచివారా? తెలివి గలవారు స్వర్గవాసులు మంచివారని చెప్తారు. కొందరు నరకవాసులు, స్వర్గవాసులతో మాకు పనే లేదు అని అంటారు ఎందుకంటే వారికి తండ్రి గురించి తెలియదు. కొందరు తండ్రి ఒడి నుండి దూరమై మాయ ఒడిలోకి వెళ్ళిపోతారు. ఆశ్చర్యమనిపిస్తుంది కదా! తండ్రి కూడా అద్భుతమైనవారే. వారిచ్చే జ్ఞానము కూడా అద్భుతమైనదే. అన్నీ అద్భుతమైనవే. ఈ అద్భుతాలను అర్థము చేసుకునేవారి బుద్ధి కూడా ఈ అద్భుతములలోనే మునిగి ఉండాలి. రావణుడు గానీ, అతడి రచన గానీ అద్భుతము కాదు. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. శాస్త్రాలలో కాళింది మడుగులోకి వెళ్ళాడు, సర్పము కాటేసింది, నల్లగా అయిపోయాడు అని వ్రాసి ఉన్నారు. ఇప్పుడు మీరు వీటిని చాలా బాగా అర్థం చేయించగలరు. కృష్ణుని చిత్రమును ఎవరు తీసుకుని చదివినా రిఫ్రెష్(తాజాగా) అవుతారు. కృష్ణునిది 84 జన్మల కథ, మీ కథ కూడా కృష్ణుని కథ వలె ఉంటుంది. మీరు స్వర్గములోకి అయితే వస్తారు కదా. మళ్లీ త్రేతాలో కూడా వస్తూ ఉంటారు. వృద్ధి అవుతూ ఉంటుంది. త్రేతా యుగములో రాజులయ్యేవారు త్రేతాలోనే వస్తారని కాదు, చదివినవారి ముందు చదవనివారు బరువులు మోయవలసి ఉంటుంది. ఈ డ్రామా రహస్యము బాబా మాత్రమే తెలుసుకోగలరు. మీ బంధు-మిత్రులు మొదలైన వారందరూ ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారని మీకు తెలుసు. ఇప్పుడు మనము పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నాము, పురుషోత్తములుగా అవుతూ ఉన్నాము. వెలుపల ఉండే దానికి, ఇక్కడ 7 రోజులు వచ్చి ఉండేందుకు చాలా వ్యత్యాసముంటుంది. హంసల సాంగత్యాన్ని వదిలి కొంగల సాంగత్యములోకి వెళ్తారు. చెడిపేసేవారు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది పిల్లలు మురళీని కూడా లక్ష్యపెట్టరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - తప్పులు(పొరపాటు, గఫలత్) చేయకండి, మీరు సుగంధభరిత పుష్పాలుగా అవ్వాలి. మీ కొరకు కేవలం ఒక్క స్మృతియాత్ర చాలు. ఇక్కడ మీకు బ్రాహ్మణుల సాంగత్యము మాత్రమే ఉంటుంది. శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన వారెక్కడ, నీచులు ఎక్కడ? బాబా, కొంగల గుంపులో హంసనైన నేను ఒక్కరిని వెళ్ళి ఏమి చేయగలను? కొంగలు ముళ్ళతో గ్రుచ్చుతాయి, ఎంతో శ్రమ చేయవలసి వస్తుంది అని పిల్లలు వ్రాస్తారు. తండ్రి శ్రీమతము అనుసారము నడుచుకుంటే, పదవి కూడా శ్రేష్ఠమైనది లభిస్తుంది. సదా హంసలై ఉండండి, కొంగల సాంగత్యములో కొంగగా అవ్వకండి. ఎంత విచిత్రమంటే ఆశ్చర్యకరంగా వింటారు, వర్ణిస్తారు, పారిపోతారు.........(ఆశ్చర్యవత్ సునంతీ, కథంతీ, భాగంతి..........) అనే గాయనము కూడా ఉంది. జ్ఞానము కొద్దిగా విన్నా స్వర్గములోకి వచ్చేస్తారు. కానీ రాత్రికి, పగలుకు ఉన్నంత వ్యత్యాసము ఉంటుంది, చాలా కఠినమైన శిక్షలు అనుభవిస్తారు. తండ్రి చెప్తున్నారు - నా మతమును అనుసరించక పతితంగా అయితే నూరు రెట్ల శిక్ష లభిస్తుంది, పదవి కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఈ విషయాలు మర్చిపోతారు, ఒకవేళ ఇది గుర్తున్నా ఉన్నత పదవిని పొందుకునే పురుషార్థము తప్పకుండా చేస్తారు. అలా చేయకుంటే ఒక చెవితో విని, మరొక చెవితో వదిలేస్తారని అర్థమవుతుంది. తండ్రితో యోగము లేదు. ఇక్కడ ఉంటున్నా బుద్ధియోగము పిల్లా - పాపల పై ఉంటుంది. తండ్రి చెప్తున్నారు - అన్నీ మర్చిపోవాలి, దీనినే వైరాగ్యమని అంటారు. ఇందులో కూడా శాతముంది. ఎక్కడెక్కడికో ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి, పరస్పరము ప్రేమించుకుంటే, బుద్ధి వారిలోనే చిక్కుకుని ఉంటుంది.
బాబా ప్రతిరోజూ అర్థం చేయిస్తున్నారు - ఈ కనులతో ఏమేమి చూస్తున్నారో, అవన్నీ సమాప్తము కానున్నవి. మీ బుద్ధియోగము నూతన ప్రపంచములో ఉండాలి. అనంతమైన సంబంధాలతో ఉండాలి. ఈ ప్రియుడు ఆద్భుతమైనవారు. భక్తిలో - మీరు వస్తే, మిమ్ములను తప్ప మరెవ్వరినీ స్మృతి చేయను అని పాడ్తారు. ఇప్పుడు నేను వచ్చాను, కావున మీరు అన్ని వైపుల నుండి బుద్ధియోగాన్ని తొలగించాలి కదా. ఇవనీవ్న మట్టిలో కలిసిపోతాయి లేకుంటే మీ బుద్ధియోగము మట్టిలో ఉన్నట్లే. నాతో బుద్ధియోగము ఉంచితే అధికారులుగా అయిపోతారు. తండ్రి ఎంతో బుద్ధివంతులుగా చేస్తారు. భక్తి ఏమిటో, జ్ఞానము ఏమిటో మనుష్యులకు తెలియదు. ఇప్పుడు మీకు జ్ఞానము లభించింది, అందువలన భక్తి ఏమిటో కూడా అర్థము చేసుకున్నారు. భక్తిలో ఎంత దు:ఖము ఉందో మీకిప్పుడు ఫీలింగ్ కలుగుతుంది. మనుష్యులు భక్తి చేస్తూ స్వయాన్ని చాలా సుఖంగా ఉన్నామని, భగవంతుడు వచ్చి భక్తికి ఫలము ఇస్తారని భావిస్తారు. అయితే ఎవరికి ఏ ఫలము ఇస్తారో కొద్దిగా కూడా తెలియదు. ఇప్పుడు తండ్రి భక్తికి ఫలమును ఇచ్చేందుకు వచ్చారని మీకు తెలుసు. విశ్వరాజ్యమును ఫలముగా ఇచ్చే తండ్రి ఏ ఆదేశాలనిస్తారో, వాటి ప్రకారము నడుచుకోవాల్సి వస్తుంది. వారి మతమును శ్రేష్ఠాతి శ్రేష్ఠమని అంటారు. మతమేమో అందరికీ లభిస్తుంది. అయితే దాని ప్రకారము కొందరు నడుచుకుంటారు, కొందరు నడుచుకోలేరు. అనంతమైన సామ్రాజ్యము స్థాపన అవ్వనున్నది. ఇంతకుముందు ఎలా ఉండేవారమో, ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందో మీరు అర్థం చేసుకున్నారు. మాయ ఒక్కసారిగా సమాప్తము చేసేస్తుంది. ఇది శవాల ప్రపంచము వంటిది. భక్తిమార్గములో విన్నదానినంతా సత్యము - సత్యము అంటూ వచ్చారు కానీ సత్యము ఒక్క తండ్రి మాత్రమే వినిపిస్తారని మీకు తెలుసు. ఇటువంటి తండ్రిని స్మృతి చేయాలి. ఇక్కడ వెలుపలి వారు ఎవరైనా కూర్చొని ఉంటే వారికి ఏమీ అర్థము కాదు. వీరేమి వినిపిస్తున్నారో, అర్థమే కాలేదని అంటారు. మొత్తం ప్రపంచమంతా పరమాత్మ సర్వవ్యాపి అని అంటూ ఉంటే వీరు మాత్రము ఆ పరమాత్మను మా తండ్రి అని అంటారు. కాదు, కాదు అని తలలూపుతూ ఉంటారు. మీకు మాత్రము ఆంతర్యములో అవును - అవును అని వెలువడ్తూ ఉంటుంది. కనుక క్రొత్తవారికెవ్వరికీ క్లాసులో కూర్చునేందుకు అనుమతి ఇవ్వబడదు. అచ్ఛా! మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. సుగంధభరిత పుష్పాలుగా అయ్యేందుకు సాంగత్య విషయములో చాలా జాగ్రత్త వహించాలి. హంసల సాంగత్యము మాత్రమే చేయాలి, హంసలై జీవించాలి. మురళి విషయములో ఎప్పుడూ నిర్లక్ష్యము చేయరాదు.
2. కర్మ బంధనము నుండి ముక్తులుగా అయ్యేందుకు సంగమ యుగములో మీ సర్వ సంబంధాలను ఒక్క తండ్రితోనే ఉంచుకోవాలి. పరస్పరము ఏ సంబంధమూ ఉంచుకోరాదు. ఏ హద్దులోని సంబంధము పై ప్రీతినుంచి బుద్ధియోగమును అందులో చిక్కుకోనివ్వరాదు. ఒక్కరిని మాత్రమే స్మృతి చేయాలి.
వరదానము :-
''సాక్షి స్థితిలో స్థితమై పరిస్థితుల ఆటను చూచే సంతోషి ఆత్మా భవ''
పరిస్థితులు ఎంత కదిలించేవిగా ఉన్నా, సాక్షి స్థితిలో స్థితమై ఉంటే అవి నిజము కాదు, తోలుబొమ్మలాటలని అనుభవమవుతాయి. మీ స్వమానంలో(గౌరవం, శాన్లో) ఉంటూ ఆటను చూడండి. సంగమ యుగములోని శ్రేష్ఠమైన అలంకారము(శాన్) సంతుష్టమణులుగా అవ్వడం లేక సంతుష్టమణులై ఉండడం. ఈ శాన్లో ఉండే ఆత్మ పరేశాన్గా అవ్వజాలదు అనగా వ్యాకులపడదు. సంగమ యుగంలో బాప్దాదా ఇచ్చిన విశేషమైన కానుక సంతుష్టత(తృప్తి).
స్లోగన్ :-
''మనసులోని సంతోషము ముఖములో స్పష్టంగా కనబడునంత ప్రసన్నంగా అవ్వండి.''