28-02-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - మీరు ఇప్పుడు హంసలుగా అయ్యే పురుషార్థము చేస్తున్నారు. మీరు ఈ లక్ష్మీనారాయణుల వలె హంసలుగా అనగా సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి ''
ప్రశ్న :-
ఈ జ్ఞాన మార్గములో తీవ్రంగా వెళ్లేందుకు సహజమైన విధి ఏమిటి?
జవాబు :-
ఈ జ్ఞాన మార్గములో తీవ్రముగా (తీక్షణంగా) వెళ్ళేందుకు మిగిలిన ఆలోచనలన్నీ సమాప్తము చేసి తండ్రి స్మృతిలో లగ్నమైపోండి. దీని ద్వారా వికర్మలు వినాశనమైపోతాయి మరియు చెత్త(వ్యర్థము) అంతా తొలగిపోతుంది. స్మృతి యాత్రయే ఉన్నతమైన పదవికి ఆధారము. దీని ద్వారానే మీరు గవ్వల నుండి వజ్రాలుగా అవ్వగలరు. మిమ్ములను గవ్వల నుండి వజ్రాలుగా, పతితుల నుండి పావనంగా తయారు చేసే కర్తవ్యము తండ్రిదే. ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా తండ్రి కూడా ఉండలేరు.
ఓంశాంతి.
ఈ ప్రపంచములో కొందరు హంసలుగాను, కొందరు కొంగలుగాను ఉన్నారని తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఈ లక్ష్మీనారాయణులు హంసలు. మీరు వీరి సమానంగా అవ్వాలి. దైవీ సంప్రదాయము వారిగా తయారవుతున్నామని మీరంటారు. తండ్రి చెప్తున్నారు - మీరు దైవీ సంప్రదాయులుగా అవుతున్నారు. నేను మిమ్ములను హంసలుగా తయారు చేస్తాను. ఇప్పుడింకా పూర్తి హంసలుగా అవ్వలేదు. ఇప్పుడు తయారవ్వాలి. హంస ముత్యాలను స్వీకరిస్తుంది. కొంగ చెడును (మురికిని) తింటుంది. ఇప్పుడు మనము హంసలుగా అవుతున్నాము. అందుకే దేవతలను పుష్పాలని అంటారు. ఇక వారిని(కలియుగ మనుష్యులను) ముళ్ళు అని అంటారు. హంసలుగా ఉండేవారము మళ్లీ క్రిందకు దిగుతూ కొంగలుగా అయ్యారు. అర్ధకల్పము హంసలు, అర్ధకల్పము కొంగలు. హంసలుగా అవ్వడంలో కూడా మాయ చాలా విఘ్నాలను వేస్తుంది. ఎంతో కొంత క్రిందకు పడిపోవటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా దేహాభిమానము వలన క్రింద పడిపోవటం జరుగుతుంది. ఈ సంగమ యుగములోనే పిల్లలైన మీరు పరివర్తన చెందాలి. మీరు హంసలుగా తయారైన తర్వాత ఇక హంసలే హంసలుంటారు. హంసలు అనగా దేవీదేవతలు, వారు సత్యయుగములో, కొత్త ప్రపంచములో ఉంటారు. పురాతన ప్రపంచములో ఒక్క హంస కూడా ఉండజాలదు. భలే సన్యాసులున్నారు, కాని వారు హద్దు సన్యాసులు. మీరు బేహద్ సన్యాసులు. బాబా మీకు బేహద్ సన్యాసాన్ని నేర్పించారు. ఈ దేవతల వలె సర్వ గుణ సంపన్నులుగా ఇతర ఏ ధర్మమువారు అవ్వనే అవ్వరు. ఆదిసనాతన దేవీదేవతా ధర్మమును స్థాపన చేసేందుకు తండ్రి కూడా వచ్చారు. మీరే కొత్త ప్రపంచములో మొట్టమొదట సుఖములోకి వస్తారు. ఇంకెవ్వరూ కొత్త ప్రపంచములోకి రారు. ఇప్పుడు ఆ దేవతల ధర్మమే ప్రాయ: లోపమైపోయింది. ఈ విషయాలను కూడా మీరు ఇప్పుడే వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. ఇంకెవ్వరూ అర్థము చేసుకోలేరు. అవన్నీ మనుష్య మతాలు. వికారాల నుండే అందరూ జన్మించారు కదా. సత్యయుగములో వికారాల మాటే లేదు. దేవతలు పవిత్రంగా ఉండేవారు. అక్కడ యోగబలము ద్వారానే అన్నీ జరుగుతాయి. అక్కడ పిల్లలు ఎలా జన్మిస్తారో, ఇక్కడ పతిత మనుష్యులకు ఏం తెలుసు? దాని పేరే నిర్వికారి ప్రపంచము. వికారాల మాటే ఉండదు. జంతువులు మొదలైనవి ఎలా జన్మిస్తాయి? అని ప్రశ్నిస్తారు. వారితో చెప్పండి - '' అక్కడ వికారాల మాటే ఉండదు. ఉన్నదే యోగబలము. అది వంద శాతము నిర్వికారి ప్రపంచము. మేము శుభమునే పలుకుతాము. మీరు ఎందుకు అశుభమును చెప్తారు? దీని పేరే వేశ్యాలయము మరియు దాని పేరే శివాలయము. ఆ శివాలయ స్థాపన శివబాబా చేస్తున్నారు. శివబాబా సర్వోన్నతమైన టవర్(స్థూపము, స్తంభము) కదా. శివాలయాన్ని కూడా ఈ విధంగా పొడవుగా నిర్మిస్తారు. శివబాబా మిమ్ములను సుఖమునిచ్చే టవర్లుగా చేస్తారు. సుఖ టవర్లోకి తీసుకెళ్తారు. అందువల్లనే బాబా పై చాలా ప్రీతి ఉంటుంది. భక్తిమార్గములో కూడా శివబాబా జతలో ప్రీతి ఉంటుంది. శివబాబా మందిరానికి చాలా ప్రీతిగా వెళ్తారు. కాని కొద్దిగా కూడా అర్థము చేసుకోరు. ఇప్పుడు పిల్లలైన మీరు సర్వ గుణ సంపన్నులుగా అవుతున్నారు. ఇప్పుడింకా సంపూర్ణంగా తయారవ్వలేదు. మీ రాజధాని పూర్తి స్థాపన జరిగినప్పుడే మీకు పరీక్ష ఉంటుంది. మిగిలినవారంతా సమాప్తమైపోతారు. తర్వాత నంబరువారుగా క్రిందికి కొద్ది కొద్దిగా వస్తూ ఉంటారు. మీ రాజ్యము మొదటే ప్రారంభమవుతుంది. మిగిలిన ధర్మాలవారికి మొదట రాజ్యము ప్రారంభము కాదు. మీది కింగ్డమ్(రాజ్యము). ఈ విషయాలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. పిల్లలు బెనారస్లో సేవ చేసేందుకు వెళ్లారు. వారికి అర్థం చేయించాలనే నషా ఉంది. కాని అక్కడి వారు ఇంతగా అర్థము చేసుకోలేరు. కోటిలో కొందరు............ అనే గాయనము కూడా ఉంది. అతికష్టము మీద ఎవరో ఒకరు హంసలుగా తయారవుతారు. హంసగా అవ్వలేదంటే తర్వాత చాలా శిక్షలను అనుభవిస్తారు. కొందరు 95 శాతము శిక్షలు పొంది, 5 శాతము మాత్రమే పరివర్తన అవుతారు. అతిఉన్నతమైన మరియు అతినీచమైన నంబర్లు అయితే ఉంటాయి కదా. ఇప్పుడు ఎవ్వరూ తమను హంసలని చెప్పుకోలేరు. పురుషార్థము చేస్తున్నారు. జ్ఞానము పూర్తి అయినప్పుడు యుద్ధము కూడా ప్రారంభమవుతుంది. జ్ఞానము పూర్తిగా తీసుకోవాలి కదా. ఆ యుద్ధమే అంతిమ యుద్ధమవుతుంది. ఇప్పుడు ఎవ్వరూ వంద శాతము స్థితికి చేరుకోలేరు. ఇప్పుడు ఇంటి - ఇంటికి సందేశాన్ని చేర్చాలి. చాలా గొప్ప తిరుగుబాటు ప్రారంభమవుతుంది. ఎవరెవరికి గొప్ప గొప్ప ఆశ్రమాలు తయారై ఉన్నాయో, అవన్నీ కదలడం ప్రారంభమవుతుంది. భక్తి సింహాసనము కదలడం ప్రారంభమవుతుంది. ఇప్పుడిది భక్తుల రాజ్యము కదా. దాని పై మీరు విజయము పొందుతారు. ఇప్పుడు ప్రజల పై ప్రజల రాజ్యముంది. తర్వాత మారిపోతుంది. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యమవుతుంది. మీరు సాక్షాత్కారాలు పొందుతూ ఉంటారు. ప్రారంభములో రాజధాని ఏ విధంగా నడుస్తుందో మీకు చాలా సాక్షాత్కారాలు చేయించారు. కాని సాక్షాత్కారాలు పొందినవారు ఈ రోజు లేనే లేరు. ఇది కూడా నాటకము. డ్రామాలో ఎవరికి ఏ పాత్ర ఉంటుందో అది నడుస్తూనే ఉంటుంది. ఇందులో మనము ఎవ్వరినీ మహిమ చేయము. తండ్రి కూడా చెప్తున్నారు - మీరు నన్ను మహిమ చేసేదేముంది? నా కర్తవ్యమే పతితులను పావనంగా చేయడం. విద్యార్థులను చదివించడమే టీచరు కర్తవ్యము. తన కర్తవ్యాన్ని తాను చేసేవారిని మహిమ చేసే అవసరమేముంది? బాబా చెప్తున్నారు - నేను కూడా డ్రామాకు వశమై ఉన్నాను. ఇందులో శక్తి ఏముంది? ఇది నా కర్తవ్యము. కల్ప-కల్పము సంగమ యుగములో వచ్చి పతితులను పావనంగా చేసే మార్గమును తెలియజేస్తాను. నేను పావనంగా చేయకుండా ఉండలేను. నా పాత్ర ఆక్యురేట్. ఒక్క సెకండు కూడా ఆలస్యంగా లేక ముందుగా నా పాత్ర రాజాలదు. పూర్తి ఖచ్ఛితమైన సమయములో పాత్ర చేస్తాను. సెకెండు సెకెండు ఏది గడచిపోతూ ఉంటుందో, డ్రామా నా ద్వారా చేయిస్తుంది. నేను పరవశుడను. ఇందులో మహిమ చేసే మాటే లేదు. నేను కల్ప-కల్పము వస్తాను. పతితులను పావనంగా తయారు చేసే బాబా, రండి అనే మీరు నన్ను పిలుస్తారు. ఎంత పతితులుగా అయిపోయారు! ఒక్కొక్క అవగుణాన్ని వదిలేందుకు ఎంతో శ్రమ చేయవలసి వస్తుంది. చాలా సమయము పాటు పవిత్రంగా ఉండి కూడా మళ్లీ నడుస్తూ - నడుస్తూ మాయ చెంపదెబ్బ తగులుట ద్వారా ముఖము నల్లగా చేసుకుంటారు.
ఇది తమోప్రధాన ప్రపంచము. మాయ శత్రువు చాలా ఎదిరిస్తుంది. సన్యాసులు కూడా వికారాల నుండే జన్మిస్తారు. ఎవరి జ్యోతి జ్యోతిలో లీనమైపోలేదు. ఎవ్వరూ వాపస్ తిరిగి వెళ్లలేరు. ఆత్మ అవినాశి కనుక ఆత్మ పాత్ర కూడా అవినాశియే. మరి జ్యోతి జ్యోతిలో ఎలా ఇమిడిపోగలదు. ఎంతమంది మనుష్యులున్నారో అన్ని మతాలు ఉన్నాయి. అవన్నీ మనుష్య మతాలు. ఈశ్వరీయ మతము ఒక్కటే. దేవతల మతమైతే ఇక్కడ ఉండదు. దేవతలు సత్యయుగములో ఉంటారు. కనుక ఇవన్నీ బాగా అర్థము చేసుకోవలసిన విషయాలు. మనుష్యులు ఏ మాత్రము అర్థము చేసుకోరు. అందుకే మా పై దయ చూపండి అని ఈశ్వరుడిని పిలుస్తారు. తండ్రి చెప్తున్నారు - నేను మిమ్ములను ఇలా పూజకు యోగ్యులుగా తయారు చేస్తాను. మీరు పూజకు యోగ్యులుగా అవుతారు. ఇప్పుడింకా పూజకు యోగ్యులుగా అవ్వలేదు, అవుతున్నారు. మేము ఇలా అవుతామని మీకు తెలుసు. భక్తిమార్గములో మనకే ఈ మహిమ జరుగుతుంది. మందిరాలు మనవే తయారవుతాయి. ఛండికా దేవి మేళా కూడా జరుగుతుందని మీకు తెలుసు. తండ్రి శ్రీమతానుసారము నడవనివారే ఛండికా దేవీలు. అయినా విశ్వాన్ని పవిత్రంగా చేయడంలో, కొంతలో కొంతైనా సహయోగము చేస్తుంది కదా. సేనాని కదా. శిక్షలు మొదలైనవి పొందినా మళ్లీ విశ్వధికారులుగా అయితే అవుతారు కదా. ఇక్కడ ఎవరైనా ఆటవికులు ఉన్నట్లైతే, వారు కూడా మేము భారతదేశానికి యజమానులము అని అంటారు కదా. ఒకవైపు భారతదేశము అన్నింటికంటే ఉన్నతమైన దేశమని చెప్తూ ఉంటారు. మరొక వైపు భారతదేశానికి ఏ గతి పట్టిందో చూడండి,.............. అని పాడుతూ ఉంటారు. రక్త నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఒక రికార్డులో మహిమ, మరొక రికార్డులో నింద జరుగుతుంది. కొంచెం కూడా అర్థం చేసుకోరు. మీకు తండ్రి కూర్చుని యదార్థ రీతిలో అర్థము చేయిస్తారు. వీరికి భగవంతుడు చదివిస్తారని మనుష్యులకు తెలియదు. ఓహో! వీరు భగవంతుడినే టీచరుగా చేసుకొని ఉన్నారని అంటారు. అరే! భగవానువాచ ఉంది కదా - నేను మిమ్ములను రాజాధి రాజులుగా తయారు చేస్తాను. కేవలం భగవద్గీతలో మనుష్యుల పేరును వేసి గీతను ఖండించేశారు. కృష్ణ భగవానువాచ - అంటే అది మనుష్యుల మతము అయినట్లే కదా. కృష్ణుడు ఇక్కడికి ఎలా వస్తాడు? అతడేమో సత్యయుగ రాకుమారుడు. అతనికి ఈ పతిత ప్రపంచములోకి రావలసిన అవసరమేముంది?
తండ్రిని గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీలో కూడా చాలా తక్కువమందికి మాత్రమే యదార్థ రీతిగా తెలుసు. పిల్లలైన మీ నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి. రాళ్లు వెలువడరాదు. మేము ఆ విధంగా అయ్యామా? అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. భలే తాము బురద నుండి త్వరగా బయటపడాలని కోరుకున్నా త్వరగా వెలువడలేరు. సమయము పడ్తుంది. మీరు చాలా శ్రమ చేయవలసి ఉంటుంది. అర్థం చేయించేవారిలో కూడా నంబరువారీగా ఉన్నారు. అంతిమములో యుక్తియుక్తంగా అర్థం చేయించడం జరుగుతుంది, అప్పుడు మీ బాణాలు తగులుతాయి. ఇప్పుడు మా చదువు సాగుతూ ఉందని మీకు తెలుసు. చదివించేవారు ఒక్కరే. అందరూ వారి నుండే చదువుకుంటారు. ముందుకు వెళ్లే కొలదీ ఎటువంటి యుద్ధాలను చూస్తారంటే ఇక ఆ విషయమే అడగవద్దు(చాలా భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి). యుద్ధములో అయితే చాలామంది మరణిస్తారు. అప్పుడు ఇంతమంది ఆత్మలు ఎక్కడకు వెళ్తారు! వెళ్లి అందరూ ఒకేసారి జన్మ తీసుకుంటారా? వృక్షము పెద్దదిగా అవుతుంది. చాలా కొమ్మలు-రెమ్మలు, ఆకులు వెలువడ్తాయి. రోజూ ఎంతోమంది జన్మిస్తారు, ఎంతోమంది మరణిస్తూ కూడా ఉంటారు. కాని ఎవ్వరూ తిరిగి వాపస్ వెళ్లలేరు. మనుష్యుల వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఈ అనవసరమైన చిల్లర(రోజూ జరిగే) విషయాలలోకి వెళ్లేందుకు బదులు తండ్రిని స్మృతి చేస్తే, దాని నుండి మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు చెత్త తొలగిపోతుంది. ఇక రెండవ విషయము. మీరు దీనిని గురించి విచారము చేయకండి. మొదట ఇలా తయారయ్యేందుకు పురుషార్థము చేయండి. ముఖ్యమైన విషయము స్మృతి యాత్ర మరియు అందరికి సందేశమును ఇవ్వడము. సందేశకుడు ఒక్కరే. ధర్మ స్థాపకులను కూడా సందేశకులు(పైగంబర్) మరియు ఉపదేశకులు(ప్రిసెప్టర్) అని అనలేరు. సద్గతిదాత ఒక్క సద్గురువు మాత్రమే. భక్తిమార్గములో మనుష్యులు ఎంతోకొంత మంచిగా పరివర్తన అవుతారు. ఏదో ఒక దానము కూడా చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు కూడా ఏదో ఒకటి దానము ఇచ్చి వస్తారు. ఈ అంతిమ జన్మలో కూడా తండ్రి మిమ్ములను వజ్ర సమానంగా తయారు చేస్తారని పిల్లలైన మీకు తెలుసు. దీనినే అమూల్యమైన జీవితము అని అంటారు. కాని అంతటి పురుషార్థము చేయవలసి ఉంటుంది. మా దోషము ఏమీ లేదని మీరంటారు. అరే! నేను మిమ్ములను సుందరమైన పుష్పాలుగా చేసేందుకు వచ్చాను. మరి మీరెందుకు తయారవ్వరు? మిమ్ములను పావనంగా చేయుటే నా కర్తవ్యము. మరి మీరు ఎందుకు పురుషార్థము చేయరు? పురుషార్థము చేయించే తండ్రి అయితే లభించారు. ఈ లక్ష్మీ నారాయణులను ఈ విధంగా ఎవరు తయారు చేశారో ప్రపంచానికి తెలియదు. తండ్రి సంగమ యుగములోనే వస్తారు. ఇప్పుడు మీ విషయాలను ఎవరూ అర్థము చేసుకోరు. మున్ముందు మీ వద్దకు చాలామంది వచ్చినప్పుడు ఆ సన్యాసుల గ్రాహకులు(శిష్యులు) తగ్గిపోతారు. ఈ వేద-శాస్త్రాల సారాన్ని నేను మీకు వినిపిస్తానని తండ్రి చెప్తున్నారు. భక్తిమార్గములో లెక్కలేనంత మంది గురువులున్నారు. సత్యయుగములో అందరూ పావనంగా ఉండేవారు తర్వాత పతితులుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి మళ్లీ వచ్చి మీకు బేహద్ సన్యాసాన్ని చేయిస్తున్నారు. ఎందుకంటే ఈ పురాతన ప్రపంచము ఇప్పుడు సమాప్తమవ్వనున్నది. అందువల్ల ఈ శ్మశానము నుండి బుద్ధియోగాన్ని తొలగించి తండ్రినైన నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయని తండ్రి చెప్తున్నారు. ఇది వినాశ సమయము. అందరి లెక్కాచారాలు సమాప్తము కానున్నాయి. ప్రపంచమంతటిలో ఎంతమంది ఆత్మలున్నారో, వారిలో మొత్తం పాత్ర అంతా నిండి ఉంది. ఆత్మ శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తుంది. కనుక ఆత్మ కూడా అవినాశి. పాత్ర కూడా అవినాశియే. ఇందులో ఏ మాత్రము వ్యతాసము ఉండదు. ఉన్నది ఉన్నట్లుగా పునరావృతమవుతూనే ఉంటుంది. ఇది చాలా పెద్ద బేహద్ నాటకము. నంబరువారుగా అయితే ఉంటుంది కదా. కొందరు ఆత్మిక సేవ చేయువారు, కొందరు స్థూల సేవ చేయువారు ఉంటారు. బాబా మేము మీకు డ్రైవర్గా అయ్యేమా? అక్కడ కూడా విమానానికి మాలికులుగా అయిపోతామని కొందరంటారు. ఈనాటి గొప్ప మనుష్యులు వారి కొరకు ఇక్కడే స్వర్గముందని భావిస్తారు. గొప్ప-గొప్ప భవనాలు, విమానాలు ఉంటాయి. తండ్రి చెప్తున్నారు - ఇవన్నీ కృత్రిమమైనవి. వీటిని మాయా ప్రభావము, ఆడంబరము అని అంటారు. ఏమేమో నేర్చుకుంటూ ఉంటారు. ఓడలు మొదలైనవి తయారు చేస్తారు. ఈ పెద్ద - పెద్ద ఓడలు అక్కడ ఏమీ పనికి రావు. బాంబులు తయారు చేస్తారు. ఇవి అక్కడ పనికి రావు. అక్కడ కేవలం సుఖమునిచ్చే వస్తువులు మాత్రమే పనికొస్తాయి. వినాశనము అవ్వడంలో సైన్స్ చాలా సహయోగము చేస్తుంది. ఆ విజ్ఞాన శాస్త్రమే నూతన ప్రపంచాన్ని తయారు చేయడంలో కూడా సహయోగమునిస్తుంది. ఈ నాటకము చాలా అద్భుతంగా తయారు చేయబడి ఉంది! అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఇది వినాశ సమయము. పురాతన ప్రపంచము నుండి బేహద్ సన్యాసము చేయాలి. ఈ శ్మశానము నుండి బుద్ధిని తొలగించి వేయాలి. స్మృతిలో ఉంటూ పురాతన లెక్కాచారాలన్నీ సమాప్తము చేసుకోవాలి.
2. నోటి ద్వారా సదా జ్ఞాన రత్నాలే వెలువడాలి, రాళ్ళు వెలువడరాదు. పూర్తి హంసలుగా అవ్వాలి. ముళ్ళను పుష్పాలుగా చేసే సేవ చేయాలి.
వరదానము :-
''సదా కేర్ఫుల్గా ఉండి రాయల్ రూపములోని మాయ ఛాయ నుండి సురక్షితంగా మాయాప్రూఫ్ భవ''
వర్తమాన సమయంలో మాయ సత్యమైన జ్ఞానాన్ని, అనుభూతి శక్తిని మాయం చేసి రాంగ్ను రైట్గా అనుభవం చేయిస్తుంది. ఎలాగైతే ఎవరైనా మంత్రగాడు వశీకరణ మంత్రము ద్వారా పరవశము చేస్తాడో అలా రాయల్ మాయ రియల్ను(సత్యాన్ని) అర్థము చేసుకోనివ్వదు. అందువలన బాప్దాదా అటెన్షన్ను(అప్రమత్తతను) డబల్ అండర్లైన్ చేయిస్తున్నారు. ఎంత కేర్ఫుల్గా ఉండాలంటే మాయ నీడ నుండి సురక్షితంగా మాయాప్రూఫ్గా అయిపోవాలి. ముఖ్యంగా మనసు - బుద్ధిని తండ్రి ఛత్రఛాయ అనే ఆశ్రయములోకి తీసుకు రండి.
స్లోగన్ :-
'' ఎవరైతే సహజయోగులుగా ఉంటారో వారిని చూచి ఇతరులకు కూడా సహజంగా యోగం కుదురుతుంది. ''