13-08-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - వినాశి శరీరాలను ప్రేమించక అవినాశి తండ్రిని ప్రేమిస్తే ఏడ్వడం నుండి విడుదలవుతారు. ''

ప్రశ్న :-

అధార్మికమైన(అసత్యమైన) ప్రేమ అంటే ఏమిటి ? దాని పరిణామము ఎలా ఉంటుంది ?

జవాబు :-

వినాశి శరీరాల పై మోహముంచుకోవడం అధార్మికమైన పేమ్ర. వినాశి వస్తువుల పై మోహముంచుకున్న వారు విలపిస్తూ, ఏడుస్తూ ఉంటారు. దేహాభిమానము వలన ఏడుపు వస్తుంది. సత్యయుగములో అందరూ ఆత్మాభిమానులుగా ఉంటారు. అందువలన రోధించే విషయమే ఉండదు. ''వవరు ఏడుస్తారో, వారు పోగొట్టుకుంటారు(జో రోతే హై వో ఖోతే హై)''. అవినాశి తండ్రి యొక్క అవినాశి పిల్లలకిప్పుడు శిక్షణ లభిస్తుంది. దేహీ-అభిమానులుగా అయితే రోధించుట నుండి విడుదలవుతారు.

ఓంశాంతి.

ఆత్మ అవినాశి మరియు తండ్రి కూడా అవినాశి అని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. కావున ఎవరిని ప్రేమించాలి? అవినాశి ఆత్మను ప్రేమించాలి. అవినాశినే ప్రేమించాలి. వినాశి శరీరాన్ని ప్రేమించరాదు. మొత్తం ప్రపంచమంతా వినాశియే. ప్రతి వస్తువు వినాశనమయ్యేదే. ఈ శరీరము వినాశి, ఆత్మ అవినాశి. ఆత్మలోని ప్రేమ కూడా అవినాశిగా ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ మరణించదు. అందుకే ఆత్మను సత్యమని అంటారు. తండ్రి చెప్తున్నారు - మీరు అసత్యమైనవారిగా తయారయ్యారు. వాస్తవానికి అవినాశి ఆత్మకు అవినాశితోనే ప్రేమ ఉండాలి. మీకు వినాశి శరీరము పై ప్రేమ ఏర్పడింది. కావున ఏడ్వవలసి వస్తుంది. అవినాశిగా ఉన్నదాని పై ప్రేమ లేదు. వినాశిగా ఉన్నదాని పై ప్రేమ ఉన్నందున ఏడ్వవలసి వస్తుంది. మీరిప్పుడు స్వయాన్ని అవినాశి ఆత్మగా తెలుసుకున్నారు కనుక ఏడ్చే పనే లేదు. ఎందుకంటే ఆత్మాభిమానిగా ఉన్నారు. కావున తండ్రి ఇప్పుడు పిల్లలైన మిమ్ములను ఆత్మాభిమానులుగా తయారు చేస్తున్నారు. దేహాభిమానులైతే ఏడ్వవలసి వస్తుంది. వినాశి శరీరము కొరకు విలపిస్తారు(ఏడుస్తారు). ఆత్మకు మృత్యువు లేదని కూడా తెలుసు. తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించండి. అవినాశి తండ్రికి పిల్లలైన మీరు అవినాశి ఆత్మలు. మీరు ఏడ్వవలసిన పని లేదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి మరొక పాత్రను అభినయిస్తుంది. ఇది ఒక ఆట. మీరు శరీరము పై ఎందుకు మమకారము ఉంచుకుంటారు? దేహ సహితము దేహ సర్వ సంబంధాల నుండి మీ బుద్ధియోగాన్ని తెంచి వేయండి. స్వయాన్ని అవినాశి ఆత్మగా భావించండి. ఆత్మ ఎప్పుడూ మరణించదు. ఎవరు ఏడుస్తారో, వారు పోగొట్టుకుంటారు అనే గాయనము కూడా ఉంది. ఆత్మాభిమానులుగా తయారైతేనే అర్హులుగా అవుతారు. కావున తండ్రి వచ్చి దేహాభిమానుల నుండి ఆత్మాభిమానులుగా చేస్తున్నారు. మీరు ఎలా మర్చిపోయారో అర్థం చేయిస్తున్నారు. జన్మ- జన్మలుగా మీరు ఏడ్వవలసి వచ్చింది. మళ్లీ ఇప్పుడు మీకు ఆత్మాభిమానులుగా అయ్యే శిక్షణ లభిస్తుంది. తర్వాత మీరు ఎప్పుడూ ఏడ్వనే ఏడ్వరు. ఇది ఏడ్చేవారి ప్రపంచము. అది నవ్వేవారి ప్రపంచము. ఇది దు:ఖ ప్రపంచము. అది సుఖ ప్రపంచము. తండ్రి చాలా బాగా శిక్షణనిస్తారు. అవినాశి తండ్రి శిక్షణ అవినాశి పిల్లలకు లభిస్తుంది. ప్రపంచములోని వారు దేహాభిమానులు కనుక దేహమును చూసి శిక్షణ ఇస్తారు. అందువలన దేహమును గుర్తు చేసుకుంటూ ఏడుస్తారు. శరీరము సమాప్తమైపోయిందని కూడా చూస్తారు. అయినా దానినే స్మృతి చేస్తుంటారు. దాని వలన లాభమేముంది? మట్టిని ఎక్కడైనా స్మృతి చేస్తారా? అవినాశి ఆత్మ వెళ్లి మరో శరీరాన్ని తీసుకుంటుంది.
మంచి కర్మలు చేసేవారికి మంచి శరీరమే లభిస్తుందని పిల్లలకు తెలుసు. కొందరికైతే బాగాలేని రోగి శరీరము లభిస్తుంది. అది కూడా కర్మల అనుసారంగానే ఉంటుంది. మంచి పనులు చేస్తే పైకి వెళ్లిపోతారని కాదు. పైకి ఎవ్వరూ వెళ్లలేరు. మంచి కర్మలు చేస్తే మంచివారని పిలువబడ్తారు. మంచి జన్మ లభించినా క్రిందకు దిగుతూ రావలసిందే. మనము పైకి ఎలా ఎక్కుతామో మీకు తెలుసు. మంచి కర్మలు చేయడం వలన భలే కొందరు మహాత్ములుగా అవుతారు. అయినా కళలు తగ్గిపోతూనే ఉంటాయి. అయినా ఈశ్వరుని స్మృతి చేస్తూ, మరచి పనులు చేస్తే వారికి అల్పకాలిక క్షణ భంగుర సుఖమునిస్తానని తండ్రి చెప్తారు. మళ్లీ మెట్లు క్రిందకు దిగాల్సిందేే. భలే మంచి పేరే ఉండవచ్చు. ఇక్కడైతే మంచి-చెడు కర్మల గురించి కూడా మానవులకు తెలియదు. రిద్ధి-సిద్ధి (క్షుద్రశక్తుల వారికి) చేయువారికి ఎంత గౌరవమునిస్తారు! వారి వెనుకబడుతూ మనుష్యులు ఎంత హైరానా(గాభరా) పడ్తారు. అంతా అజ్ఞానమయము. ఎవరైనా పరోక్షంగా(అప్రత్యక్షముగా) దాన-పుణ్యాలు చేసినా, ధర్మశాలలు, ఆసుపత్రులు ఏర్పాటు చేస్తే వారికి మరసటి జన్మలో తప్పకుండా దాని ప్రతిఫలము లభిస్తుంది. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు, మరొకవైపు నిందిస్తూ కూడా ఉంటారు. అయినా నోటితో భగవంతుని పేరు చెప్తూ ఉంటారు. అమాయకులైనందున కొద్దిగా కూడా తెలియదు. భగవంతుని స్మృతి చేసి రుద్రునికి పూజ చేస్తారు. రుద్రుని భగవంతుడని భావిస్తారు. రుద్రయజ్ఞము కూడా చేస్తారు. శివునికి లేక రుద్రునికి పూజ చేస్తారు. తండ్రి చెప్తున్నారు - నాకు పూజ చేస్తారు కానీ తెలివిహీనులైనందువలన ఏమేమో తయారు చేస్తారు. ఏమేమో చేస్తారు. ఎంతమంది మనుష్యులున్నారో అంత మంది గురువులున్నారు. వృక్షములో కొత్త కొత్త ఆకులు, కొమ్మ-రెమ్మలు వెలువడ్తూ ఉంటే అది ఎంతో శోభాయమానంగా ఉంటుంది. వారు సతోగుణీలుగా ఉన్నందున వారికి మహిమ ఉంటుంది. ఈ ప్రపంచములోని వారు వినాశి వస్తువులను ప్రేమిస్తారని తండ్రి చెప్తున్నారు. కొందరికి చాలా ప్రేమ ఉంటే మోహములో పడి పిచ్చివారైపోతారు. పెద్ద - పెద్ద శేఠ్లు మోహానికి వశమై పిచ్చివారవుతారు. మాతలకు జ్ఞానము లేనందువలన వినాశి శరీరము వెనుకబడి విధవగా తయారై ఎంతగా ఏడుస్తారు! గుర్తు చేసుకుంటూనే ఉంటారు. మీరిప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి, ఇతరులను కూడా ఆత్మగా చూస్తే ఏ మాత్రము దు:ఖము కలుగదు. చదువు సంపాదనకు మూలమని(జుసబషa్‌ఱశీఅ Iర ుష్ట్రవ ూశీబతీషవ ూట Iఅషశీఎవ) అంటారు. చదువులో లక్ష్యము కూడా ఉంటుంది. కానీ అది ఒక్క జన్మ కొరకే. ప్రభుత్వము నుండి జీతము కూడా లభిస్తుంది. చదువుకొని ఉద్యోగము చేస్తారు. అప్పుడు ధనము మొదలైనవి లభిస్తాయి. ఇక్కడైతే అన్నీ కొత్త విషయాలే. మీరు అవినాశి జ్ఞాన రత్నాల ద్వారా జోలెను ఏ విధంగా నింపుకుంటున్నారు (ఎంతగా నింపుకుంటున్నారు!) బాబా మనకు అవినాశి జ్ఞాన రత్నాల ఖజానాను ఇస్తున్నారని ఆత్మకు తెలుసు. భగవంతుడు చదివిస్తున్నారు కావున తప్పకుండా భగవాన్‌ - భగవతిగానే తయారు చేస్తారు. కానీ వాస్తవానికి ఈ లక్ష్మీనారాయణులను భగవాన్‌ - భగవతి అని భావించడం తప్పు. పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు - ఓహో! మనము దేహాభిమానిగా అయితే మన బుద్ధి ఎంత నీచమైపోతుంది! జంతువుల బుద్ధి వలె తయారవుతుంది. జంతువులకు కూడా చాలా బాగా సేవ చేస్తారు. మానవులకైతే ఏ సేవా చేయరు. పరుగు పందెములో పాల్గొనే గుఱ్రాలను ఎంత బాగా సంభాళిస్తారు. ఇక్కడ మనుష్యుల పరిస్థితి ఎలా ఉందో చూడండి. కుక్కలను ఎంత ప్రేమగా చూసుకుంటారు. నిమురుతూ ఉంటారు. పక్కనే పడుకోబెట్టుకుంటారు కూడా. ప్రపంచ పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. సత్యయుగములో ఇలాంటి పనులు జరగవు.
కావున తండ్రి చెప్తున్నారు - పిల్లలూ! మిమ్ములను మాయా రావణుడు అసత్యంగా తయారు చేశాడు. ఇది అధార్మికమైన రాజ్యము కదా. మానవులు అసత్యంగా ఉంటే మొత్తం ప్రపంచము కూడా అసత్యంగా అయిపోతుంది. సత్యమైన మరియు అసత్యమైన ప్రపంచానికి తేడా ఎంత ఉందో చూడండి! కలియుగములోని పరిస్థితి ఎలా ఉందో చూడండి! నేను స్వర్గాన్ని స్థాపిస్తున్నాను కావున మాయ కూడా తన స్వర్గమును చూపిస్తుంది, ఆకర్షిస్తుంది. కృత్రిమమైన ధనము ఎంత ఉంది! వారు ఇక్కడే స్వర్గములో ఉన్నామని భావిస్తారు. స్వర్గములో ఇంత ఎత్తుగా ఉండే 100 అంతస్తుల భవనాలు మొదలైనవి ఉండవు. ఇంటిని ఎంత బాగా ఎన్ని విధాలుగా అలంకరిస్తారు! అక్కడైతే రెండంతస్థుల ఇల్లు కూడా ఉండదు. చాలా కొద్ది మంది మానవులే ఉంటారు. ఇంత భూమిని మీరు ఏం చేస్తారు? ఇక్కడ భూముల గురించి ఎన్ని విధాలుగా కొట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ భూమి అంతా మీదిగానే ఉంటుంది. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. వారు లౌకిక తండ్రి, వీరు పారలౌకిక తండ్రి. పారలౌకిక తండ్రి పిల్లలకు ఏం ఇవ్వలేరు! (స్వర్గమును కూడా ఇస్తారు) అర్ధకల్పము మీరు భక్తి చేస్తారు. తండ్రి చాలా స్పష్టంగా చెప్తున్నారు - వీటి ద్వారా ముక్తి లభించదు అనగా నన్ను కలవలేరు. మీరు ముక్తిధామములో నాతో కలుసుకుంటారు. నేను కూడా ముక్తిధామములో ఉంటాను. మీరు కూడా ముక్తిధామములో ఉంటారు. మళ్లీ అక్కడ నుండి మీరు స్వర్గములోకి వెళ్తారు. అక్కడ స్వర్గములో నేను ఉండను. ఇది కూడా డ్రామాయే. ఇదే విధంగా మళ్లీ పునరావృతమవుతూ ఉంటుంది. తర్వాత ఈ జ్ఞానమును మర్చిపోతారు. ప్రాయ: లోపమైపోతుంది. సంగమ యుగము రానంతవరకు గీతా జ్ఞానము ఎలా ఉంటుంది? ఇక ఉన్న శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తిమార్గములోనివి.
మీరిప్పుడు జ్ఞానము వింటున్నారు. నేను బీజరూపుడను, జ్ఞానసాగరుడను. మీతో ఏమీ చేయించను. పాదాలు కూడా పట్టుకోనివ్వను. ఎవరి పాదాలు పట్టుకుంటారు? శివబాబాకైతే పాదాలే లేవు. బ్రహ్మపాదము పట్టవలసి ఉంటుంది. నేనైతే మీకు సేవాధారిని. వారిని నిరాకారుడని, నిరహంకారుడని అంటారు. అది కూడా పాత్ర చేసేందుకు వచ్చినప్పుడే నిరహంకారి అని అంటారు. తండ్రి మీకు అంతులేని జ్ఞానమును ఇస్తారు. ఇది అవినాశి జ్ఞానరత్నాల దానము. కావలసినంత తీసుకోవచ్చు. అవినాశి జ్ఞానరత్నాలు తీసుకుని ఇతరులకు దానము చేస్తూ ఉండండి. ఒక్కొక్క రత్నము లక్షల విలువ ఉందని ఈ రత్నాల గురించే చెప్తారు. అడుగడుగునా పదమమంత ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. సర్వీసు పైన చాలా గమనముంచాలి. స్మృతి యాత్రయే మీ అడుగు. దాని ద్వారా మీరు అమరులుగా అవుతారు. అక్కడ మృత్యువు మొదలైనవాటి చింత ఉండదు. ఒక శరీరము వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు. మోహజీత్‌ రాజు కథను విని ఉంటారు. ఇది తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు తండ్రి మిమ్ములను ఆ విధంగా తయారు చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పటి విషయాలే.
రక్షాబంధన పండుగను కూడా ఆచరిస్తారు. ఇది ఎప్పటి స్మారకము(గుర్తు)? పవిత్రంగా అవ్వమని భగవంతుడు ఎప్పుడు చెప్పారు? క్రొత్త ప్రపంచము ఎప్పుడు ఉండేది, పాత ప్రపంచము ఎప్పుడు ఉండేది మానవులకేం తెలుసు? ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. ఇది కలియుగమని మాత్రమే అంటారు. ఒకప్పుడు సత్యయుగముండేది, ఇప్పుడు లేదు. పునర్జన్మలను కూడా అంగీకరిస్తారు. 84 లక్షల జన్మలని అన్నప్పుడు తప్పకుండా పునర్జన్మలు ఉన్నట్లే కదా. నిరాకారులైన తండ్రినే అందరూ స్మృతి చేస్తారు. వారు సర్వాత్మల తండ్రి. వారే వచ్చి అర్థం చేయిస్తున్నారు. దేహధారి తండ్రులైతే చాలా మంది ఉన్నారు. జంతువులు కూడా తమ పిల్లలకు తండ్రిగా ఉంటాయి. జంతువుల గురించి తెలియజేయునప్పుడు జంతువుల తండ్రి అని అనరు. సత్యయుగములో మురికి కొద్దిగా కూడా ఉండదు. మానవులు ఎలా ఉంటారో వారి వస్తువులు(ఫర్నీచరు) కూడా అలాగే ఉంటాయి. అక్కడ పక్షులు కూడా చాలా ఫస్ట్‌క్లాస్‌గా అందంగా ఉంటాయి. అన్ని వస్తువులు చాలా బాగుంటాయి. అక్కడ ఫలములు కూడా చాలా మధురంగా, పెద్దవిగా ఉంటాయి. మరి అవన్నీ ఎక్కడకు పోతాయి? మధురతకు బదులు చేదుతనము వచ్చేస్తుంది. మానవులు మూడవ శ్రేణివారుగా అవుతారు కనుక వస్తువులు కూడా మూడవ శ్రేణివిగా తయారవుతాయి. సత్యయుగము ప్రథమ శ్రేణికి(ఫస్ట్‌క్లాస్‌కు) చెందినది కావున వస్తువులు కూడా ప్రథమ శ్రేణివిగా లభిస్తాయి. కలియుగములో అన్నీ తృతీయ శ్రేణివిగా ఉన్నాయి. వస్తువులన్నీ సతో, రజో, తమోగా...... మారుతూ ఉంటాయి. ఇక్కడైతే మజా ఏమీ లేదు. ఆత్మ కూడా తమోప్రధానమే, శరీరము కూడా తమోప్రధానమే. పిల్లలైన మీకిప్పుడు జ్ఞానముంది. అదెక్కడ! ఇదెక్కడ! రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. తండ్రి మిమ్ములను ఎంతో ఉన్నతంగా చేస్తారు. ఎంత స్మృతి చేస్తారో, అంత ఆరోగ్యము, ఐశ్వర్యము రెండూ లభిస్తాయి. ఇంకేం కావాలి! ఈ రెండు వస్తువులలో ఒక్కటి లేకున్నా సంతోషము ఉండదు. ఆరోగ్యము ఉండి ఐశ్వర్యము లేకపోతే ఉపయోగమేమి? ధనముంటే ఎక్కడైనా తిరిగి రండి అని గాయనము కూడా ఉంది. భారతదేశము బంగారు పక్షి వలె ఉండేదని పిల్లలకు తెలుసు. ఇప్పుడు బంగారు ఎక్కడుంది? బంగారు, వెండి, రాగి ఏవీ లేవు. ఇప్పుడైతే కాగితాలే కాగితాలున్నాయి. కాగితాలు నీటిలో కొట్టుకొని పోతే ధనమెలా వస్తుంది? బంగారైతే చాలా బరువుగా ఉంటుంది. ఎక్కడుండేది అక్కడే ఉంటుంది. అగ్ని కూడా బంగారును కరిగించలేదు. కావున ఇక్కడ అన్ని దు:ఖపూరితమైన విషయాలే. అక్కడ ఈ విషయాలేవీ ఉండవు. ఇక్కడ ఈ సమయములో అపారమైన దు:ఖముంది. అపారమైన దు:ఖమున్నప్పుడే తండ్రి వస్తారు. తర్వాత అపారమైన సుఖముంటుంది. తండ్రి అయితే కల్ప-కల్పము వచ్చి చదివిస్తారు. ఇది కొత్త విషయమేమీ కాదు. సంతోషంగా ఉండాలి. ఖుషీనే ఖుషీ. ఇది చివరి సమయములోని మాట. అతీంద్రియ సుఖమును గోప-గోపికలను అడగండి. చివర్లో మీరు చాలా బాగా అర్థము చేసుకుంటారు.
సత్యమైన శాంతి అని దేనిని అంటారో తండ్రియే తెలుపుతారు. మీరు తండ్రి ద్వారా శాంతిని వారసత్వంగా తీసుకుంటారు. వారిని అందరూ స్మృతి చేస్తారు. తండ్రి శాంతిసాగరుడు. తన వద్దకు ఎవరు రాగలరో తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఫలానా ధర్మమువారు ఫలానా సమయములో వస్తారు, స్వర్గములోకి రాలేరు. ఇప్పుడు సాధు సత్పురుషులు చాలామంది ఉన్నారు. కావున వారికి మహిమ ఉంటుంది. పవిత్రంగా ఉన్నందున తప్పకుండా వారికి మహిమ ఉండాలి. ఇప్పుడు కొత్తవారు దిగి వచ్చారు. పాతవారికి అంత మహిమ ఉండదు. వారు సుఖము అనుభవించి తమోప్రధానమైపోయారు. అనేక మంది గురువులు రకరకాలవారు వచ్చారు. ఈ బేహద్‌ వృక్షము గురించి ఎవ్వరికీ తెలియదు. భక్తి సామాగ్రి ఎంత ఉంది! వృక్షము చాలా వ్యాపించి ఉంది. జ్ఞానమనే బీజము ఎంత చిన్నదిగా ఉంది! భక్తికి అర్ధకల్పము పడ్తుంది. ఈ జ్ఞానమైతే కేవలం ఈ ఒక్క అంతిమ జన్మ వరకే ఉంటుంది. జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకుని మీరు అర్ధకల్పము వరకు అధికారులుగా అవుతారు. భక్తి సమాప్తమవుతుంది. పగలు వచ్చేస్తుంది. మీరిప్పుడు సదా కాలము కొరకు హర్షితంగా ఉంటారు. దీనిని ఈశ్వరుడిచ్చిన అవినాశి లాటరీ అని అంటారు. దీని కొరకు పురుషార్థము చేయవలసి ఉంటుంది. ఈశ్వరీయ లాటరీకి మరియు ఆసురీ లాటరీకి ఎంత తేడా ఉంది. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. మీ స్మృతికి ప్రతి అడుగులో పదమమంత సంపాదన ఉంది. దీని ద్వారానే అమర పదవిని ప్రాప్తి చేసుకోవాలి. తండ్రి ద్వారా లభించిన అవినాశి జ్ఞానరత్నాలను దానము చేయాలి.

2. ఆత్మాభిమానులుగా అయ్యి అపారమైన సంతోషాన్ని అనుభవము చేయాలి. శరీరాల పై గల మోహమును తొలగించి సదా హర్షితంగా ఉండాలి. మోహజీత్‌లుగా అవ్వాలి.

వరదానము :-

'' సేవ మరియు స్వ పురుషార్థాల బ్యాలన్స్‌ ద్వారా బ్లెస్సింగ్స్‌ (ఆశీర్వాదాలను) ప్రాప్తి చేసుకునే కర్మయోగి భవ ''

కర్మయోగమనగా కర్మ చేసే సమయంలో కూడా కర్మ మరియు యోగాల బ్యాలన్స్‌ ఉండడం. సేవ అనగా కర్మ మరియు స్వ పురుషార్థము అనగా యోగయుక్తంగా ఉండడం. ఈ రెండిటి బ్యాలన్స్‌ ఉంచుకునేందుకు ఒకే ఒక శబ్ధాన్ని(మాటను) గుర్తుంచుకోండి - ''తండ్రి చేయించేవారు(కరావన్‌హార్‌), ఆత్మ అయిన నేను చేసేదానిని(కరన్‌హార్‌). ఈ శబ్ధము చాలా సులభంగా బ్యాలన్స్‌ను తయారు చేస్తుంది, అంతేకాక అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి. కరన్‌హార్‌కు బదులు స్వయాన్ని కరావన్‌హార్‌గా(చేయించేదానిగా) భావిస్తే బ్యాలన్స్‌(సమతుల్యత) ఉండదు. మాయ ఈ అవకాశాన్ని తీసుకునేస్తుంది.

స్లోగన్‌ :-

'' దృష్టితో తృప్తిపరచే సేవ చేయాలంటే బాప్‌దాదాను మీ దృష్టిలో (కనులలో) ఇముడ్చుకోండి. ''