07-03-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - జ్ఞాన విభాగము వేరు, యోగ విభాగము వేరు. యోగము ద్వారా ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. యోగము కొరకు ఏకాంతము అవసరము.''

ప్రశ్న :-

స్థిరమైన స్మృతి ఉండేందుకు ఆధారమేది ?

సమా :-

మీ వద్ద ఉన్నదంతా మర్చిపోండి. శరీరము కూడా జ్ఞాపకముండరాదు. అంతా ఈశ్వరీయ సేవలో ఉపయోగించండి. ఇదే కష్టము. ఈ అర్పణ ద్వారా స్మృతి స్థిరముగా ఉండగలదు. పిల్లలైన మీరు ప్రేమతో బాబాను స్మృతి చేసినట్లయితే స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. బాబా కూడా శక్తిని(కరెంటు‌) ఇస్తారు. ఈ కరెంటు ద్వారానే ఆయువు పెరుగుతుంది. ఆత్మ సదా ఆరోగ్యవంతముగా (ఎవర్‌ హెల్దీ ) అవ్వగలదు.

ఓంశాంతి.

ఇప్పుడు యోగము, జ్ఞానము అను రెండు వస్తువులున్నాయి. తండ్రి వద్ద ఉన్న ఈ గొప్ప ఖజానాలను పిల్లలకు ఇస్తారు. ఎవరైతే తండ్రిని చాలా స్మృతి చేస్తారో వారికి ఎక్కువగా కరెంటు లభిస్తుంది. ఎందుకంటే స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది - ఇది నియమము. ఎందుకంటే ముఖ్యమైనది స్మృతియే. జ్ఞానము ఎక్కువగా ఉంటే స్మృతి ఎక్కువగా చేస్తారని కాదు. జ్ఞాన విభాగము వేరు. యోగ సబ్జెక్టు చాలా పెద్దది, జ్ఞాన సబ్జెక్టు దాని కంటే చిన్నది. యోగము ద్వారా ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. ఎందుకంటే చాలా ఎక్కువగా స్మృతి చేస్తారు. స్మృతి చేయకుండా సతోప్రధానంగా అవ్వడం అసంభవము. పూర్తి రోజంతా తండ్రిని పిల్లలే స్మృతి చేయకుంటే తండ్రి కూడా పిల్లలను స్మృతి చేయరు. పిల్లలు మంచి రీతిగా స్మృతి చేస్తే ఈ స్మృతి ద్వారా తండ్రి స్మృతి కూడా లభిస్తుంది. తండ్రిని ఆకర్షిస్తారు. ఇది కూడా తయారైన ఆట. దీనిని బాగా అర్థము చేసుకోవాలి. స్మృతి కొరకు చాలా ఏకాంతము కూడా కావాలి. చివరిలో వచ్చి ఉన్నత పదవి పొందేవారికి కూడా స్మృతియే ఆధారము. వారికి స్మృతి చాలా ఎక్కువగా ఉంటుంది. స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. ఎప్పుడైతే పిల్లలు చాలా స్మృతి చేస్తారో, అప్పుడు తండ్రి కూడా పిల్లలను చాలా స్మృతి చేస్తారు. వారు ఆకర్షిస్తారు. బాబా దయ చూపండి, కృప చూపండి అని అంటారు కదా. దీనికి కూడా స్మృతి అవసరము. బాగా స్మృతి చేసినట్లయితే స్వతహాగా ఆకర్షణ ఉంటుంది, శక్తి(కరెంటు) లభిస్తుంది. ''నేను బాబాను స్మృతి చేస్తున్నాను'' అని ఆత్మ ఆంతరికంగా అనుకుంటుంది. అప్పుడు ఆ స్మృతి ఒక్కసారిగా సంపన్నము చేసేస్తుంది. జ్ఞానమంటే ధనము. స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. దీని ద్వారా ఆరోగ్యవంతులుగా అవుతారు, పవిత్రులుగా అవుతారు. బాబాకు పూర్తి విశ్వాన్ని పవిత్రంగా చేసే శక్తి ఉంది. అందుకే - బాబా మీరు వచ్చి పతితులను పావనంగా చేయమని పిలుస్తారు.

మనుష్యులకు ఏమీ తెలియదు. వ్యర్థంగా బిగ్గరగా అరుస్తూ సమయాన్ని వ్యర్థము చేస్తూ ఉంటారు. తండ్రి గురించి తెలియనందున నవ విధములైన భక్తి చేస్తారు. కాశీకి వెళ్ళి కాశీ కల్వట్‌ తింటారు అనగా కత్తుల బావిలో దూకుతారు. కానీ వారికి ఏమీ లభించదు. మళ్లీ మరుసటి జన్మలో వికర్మలు తయారవ్వడం ప్రారంభమవుతుంది. మాయ వెంటనే చిక్కుకునేలా చేస్తుంది. ప్రాప్తి ఏమీ ఉండదు. తండ్రి పతితపావనులని ఇప్పుడు మీకు తెలుసు. వారి పై అర్పణ అవ్వాలి. శివశంకరులు ఒకరేనని వారు భావిస్తారు. ఇది కూడా అజ్ఞానమే. ఇక్కడ బాబా మన్మనాభవ అని పదే పదే చెప్తారు. నన్ను స్మృతి చేస్తే మీరు పవిత్రంగా అవుతారు. మీరు మృత్యువు పై విజయము పొందుతారు. ఇందులో మీరు ఎంత ప్రయత్నము చేస్తారో మాయ కూడా అంత విఘ్నాలు కలిగిస్తుంది. ఎందుకంటే వీరు తండ్రిని స్మృతి చేస్తే నన్ను వదిలేస్తారని మాయ భావిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు నా వారిగా అవుతారో అప్పుడు అన్నీ వదలవలసి వస్తుంది. బంధు-మిత్రులు, ధనము మొదలైనవేవీ జ్ఞాపకము రారాదు. కట్టెను కూడా వదిలేయండి అని ఒక కథ కూడా ఉంది. వారు అన్నింటినీ వదిలింపజేస్తారు కానీ శరీరాన్ని కూడా గుర్తు చేసుకోరాదని ఎప్పుడూ చెప్పరు. తండ్రి చెప్తున్నారు - ఈ శరీరమైతే పాతది దీనిని కూడా మర్చిపోండి. భక్తిమార్గములోని విషయాలు కూడా వదిలేయండి. ఒక్కసారిగా అన్నీ మర్చిపోండి లేక ఉన్నదంతా సేవలో ఉపయోగించండి. అప్పుడే స్మృతి నిలుస్తుంది. ఉన్నత పదవి పొందాలంటే చాలా శ్రమ చేయాలి. శరీరము కూడా గుర్తు రాకూడదు. అశరీరులుగా వచ్చారు, అశరీరులుగా అయ్యి వెళ్ళాలి.

తండ్రి తన పిల్లలను చదివిస్తారు. వారికి ఏ విధమైన కోరికా లేదు. వీరు వచ్చి సేవ చేస్తారు. జ్ఞానము ఉండేది తండ్రిలోనే కదా. ఇది తండ్రి మరియు పిల్లలు కలిసి ఆడే ఆట(డ్రామా). పిల్లలు కూడా స్మృతి చేస్తారు. తండ్రి కూర్చుని సర్చిలైట్‌ ఇస్తారు. ఎవరైనా చాలా ఆకర్షించినప్పుడు తండ్రి కూర్చొని లైటును(కరెంటు) ఇస్తారు. చాలా ఆకర్షణ చేయకుంటే ఈ బాబా కూర్చుని తండ్రిని స్మృతి చేస్తారు. ఏ సమయములోనైనా ఎవరికైనా శక్తిని(కరెంటును) ఇవ్వవలసి వచ్చినప్పుడు ఇతని నిద్ర తొలగిపోతుంది. ఫలానా వారికి శక్తినివ్వాలి అనే తపన ఉంటుంది. చదువు ద్వారా ఆయువు వృద్ధి అవ్వదు. శక్తి(కరెంటు) ద్వారా ఆయువు పెరుగుతుంది. సదా ఆరోగ్యవంతంగా అవుతారు. ప్రపంచములో కొందరి ఆయువు125 - 150 సంవత్సరాలు కూడా ఉంటుంది. కనుక వారు తప్పకుండా ఆరోగ్యవంతులై ఉంటారు. భక్తి కూడా చాలా చేస్తూ ఉంటారు. భక్తిలో కూడా కొంత లాభముంది, నష్టము లేదు. ఎవరు భక్తి కూడా చేయరో వారికి మంచి, మర్యాదలు ఉండవు. భక్తిలో భగవంతుని పై విశ్వాసముంటుంది. వారు వ్యాపారములో అసత్యము, పాపము చేయరు. వారికి కోపము కూడా రాదు. భక్తులకు కూడా మహిమ ఉంది. ఈ భక్తి ఎప్పటి నుండి ప్రారంభమయిందో మనుష్యులకు తెలియదు. జ్ఞానము గురించి అయితే అసలే తెలియదు. భక్తి కూడా శక్తివంతమవుతూ పోతుంది. అయితే జ్ఞాన ప్రభావము ఎక్కువైనప్పుడు భక్తి పూర్తిగా వదిలిపోతుంది. ఇది తయారైన సుఖ-దు:ఖముల, భక్తి-జ్ఞానముల ఆట.

సుఖ-దు:ఖములను భగవంతుడే ఇస్తారని మనుష్యులంటారు. మళ్లీ వారిని సర్వవ్యాపి అని అంటారు. కానీ సుఖ-దు:ఖముల విషయము వేరు. డ్రామా గురించి తెలియనందున ఏమీ అర్థము చేసుకోరు. ఆత్మలన్నీ ఒక శరీరమును వదిలి మరో శరీరమును తీసుకుంటాయని మీకు మాత్రమే తెలుసు. సత్యయుగములో మీరు దేహీ-అభిమానులుగా ఉంటారని అనరు. ఇటువంటి దేహీ-అభిమానులుగా అవ్వండని ఇప్పుడు తండ్రి వచ్చి నేర్పిస్తున్నారు.

స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి, పవిత్రంగా అవ్వాలి. అక్కడ ఉండేదే పవిత్రమైన సుఖధామము. సుఖములో ఎవ్వరూ స్మృతి చెయ్యరు. దు:ఖములోనే భగవంతుని స్మృతి చేస్తారు. డ్రామా ఎంత అద్భుతమైనదో చూడండి. దీని గురించి నంబరువారిగా మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఏ పాయింట్లు వ్రాసుకుంటారో అవి కూడా ఉపన్యసించే సమయములో రివైజ్‌ చేయడానికే. డాక్టర్లు, వకీళ్ళు కూడా పాయింట్లు నోట్‌ చేసుకుంటారు. ఇప్పుడు మీకు తండ్రి మతము లభిస్తుంది. కనుక మళ్లీ ఉపన్యసించునప్పుడు రివైజ్‌ కూడా చేయాలి. ఇప్పుడు తండ్రి ఇతనిలో(బ్రహ్మలో) ప్రవేశమై ఉన్నారు. బాబా మీకు తెలియజేస్తున్నప్పుడు ఇతడు(బ్రహ్మ) కూడా వింటాడు. శివబాబా పాయింట్లను వినిపించకపోతే మీకు అర్థము చేయించేందుకు నాకేం తెలుసు. తండ్రి చెప్తారు - ఇది అనేక జన్మల అంతిమ జన్మ. బ్రహ్మ మరియు విష్ణువుల చిత్రము కూడా ఉంది. మీరు రాజధానిలోకి నెంబరువారుగా వెళ్తారు. ఎంత స్మృతి చేస్తారో, ఎంత ధారణ చేస్తారో అంత పదవి పొందుతారు. అతి నిగూఢమైన విషయాలను వినిపిస్తున్నానని తండ్రి చెప్తున్నారు. మీరు కొత్త కొత్త పాయింట్లు వ్రాసుకోండి. పాతవి ఉపయోగపడవు. ఈ పాయింట్లు తెలిపి ఉంటే వారి బుద్ధిలో చాలా బాగా నిలిచిపోయి ఉండేదని ఉపన్యసించిన తర్వాత గుర్తుకు వస్తుంది. మీరంతా జ్ఞాన వక్తలు(స్పీకర్లు). కానీ నెంబరువారుగా ఉన్నారు. మహారథులు అందరికంటే మంచివారు. బాబా విషయము వేరు. ఇక్కడ బాప్‌దాదా ఇరువురూ సంయుక్తంగా ఉన్నారు. మమ్మా అందరికన్నా బాగా అర్థము చేయిస్తారు. పిల్లలు సంపూర్ణ మమ్మాను సాక్షాత్కారము కూడా చేసుకునేవారు. ఎక్కడ అవసరముండేదో అక్కడ బాబా కూడా ప్రవేశమై తన పనిని చేసుకునేవారు. ఇవన్నీ అర్థము చేసుకోవలసిన విషయాలు. చదువు విరామ సమయములో జరుగుతుంది. పగలంతా వ్యవహారాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. విచార సాగర మథనము చేసేందుకు సమయము(ఫుర్సత్తు) అవసరము, శాంతి అవసరము. ఎవరికైనా శక్తి ఇవ్వవలసినప్పుడు, ఎవరైనా బాగా సర్వీసు చేసే పుత్రుడు అయితే వారికి సహాయము చెయ్యాలి. వారి ఆత్మను స్మృతి చేయవలసి ఉంటుంది. శరీరాన్ని స్మృతి చేసిన తర్వాత వారి ఆత్మను స్మృతి చేయాలి. ఈ యుక్తిని ఉపయోగించాలి. సేవాధారి పిల్లలకు ఏదైనా కష్టము వచ్చినప్పుడు వారికి సహాయము చేయాలి. తండ్రిని స్మృతి చేయాలి, తర్వాత స్వయాన్ని కూడా ఆత్మగా భావించి వారి ఆత్మను కూడా కొద్దిగా స్మృతి చేయాలి. ఇలా సెర్చ్‌ లైట్‌(జ్ఞానము, శక్తి) ఇవ్వవలసి ఉటుంది. ఒకే స్థానములో కూర్చుని స్మృతి చేయాలని కాదు. నడుస్తూ తిరుగుతూ భోజనము చేస్తూ కూడా తండ్రిని స్మృతి చేయండి. ఇతరులకు కరెంటు ఇవ్వాలంటే రాత్రులు కూడా మేల్కొని ఇవ్వండి. ఉదయమే లేచి తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత ఆకర్షణ కలుగుతుందని పిల్లలకు అర్థము చేయించబడింది. బాబా కూడా సర్చ్‌ లైట్‌ ఇస్తారు. పిల్లలకు సర్చ్‌లైట్‌ ఇవ్వడము బాబా కర్తవ్యము. చాలా సర్చ్‌లైట్‌ ఇవ్వవలసి వచ్చినప్పుడు కూడా తండ్రిని ఎక్కువగా స్మృతి చేస్తారు. అప్పుడు తండ్రి కూడా సర్చ్‌లైట్‌ ఇస్తారు. ఆత్మను స్మృతి చేసి సర్చ్‌లైట్‌ ఇవ్వవలసి ఉంటుంది. ఈ బాబా కూడా సర్చ్‌లైట్‌ ఇస్తారు. దీనిని కృప అని అనండి, ఆశీర్వాదమనండి, ఇంకేమైనా అనండి, సేవాధారి పిల్లలకు జబ్బు చేస్తే జాలి కలుగుతుంది. రాత్రి మేల్కొని అయినా వారి ఆత్మను స్మృతి చేస్తారు. ఎందుకంటే వారికి శక్తి అవసరము. స్మృతి చేసినట్లయితే వారికి రిటర్న్‌గా స్మృతి లభిస్తుంది. పిల్లల పై తండ్రికి చాలా ప్రేమ ఉంది. మళ్లీ వారికి కూడా తండ్రి స్మృతి చేరుతుంది. పోతే జ్ఞానమైతే సహజమైనది. అందులో మాయ విఘ్నాలు రావు. ముఖ్యమైనది స్మృతి. ఇందులోనే విఘ్నాలు వస్తాయి. స్మృతి ద్వారానే బుద్ధి బంగారు పాత్రలా తయారవుతుంది. ఇందులోనే ధారణ జరుగుతుంది. పులి పాలు బంగారు పాత్రలో మాత్రమే నిలువ ఉంటాయని చెప్తారు. ఈ తండ్రి ఇచ్చే జ్ఞాన ధనము కొరకు కూడా బంగారు పాత్ర అవసరము. స్మృతి యాత్రలో ఉన్నప్పుడే బుద్ధి అలా స్వచ్ఛంగా అవుతుంది. స్మృతి చేయకుంటే ధారణ జరగదు. బాబా అంతర్యామి, వారు ఏమి చెప్తారో అది జరుగుతుందని అనుకోకండి. భక్తిమార్గములో ఇలా అనుకుంటారు. సంతానము కలిగినట్లయితే గురువు కృప చూపారని అంటారు. ఒకవేళ కలగనట్లయితే ఈశ్వరేచ్ఛ అని అంటారు. రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసముంది. డ్రామా రహస్యాన్ని గురించి తండ్రి తన పిల్లలకు చాలా బాగా అర్థం చేయించారు. మీకు కూడా మొదట తెలియదు. ఇది మీ మరజీవా జన్మ. ఇప్పుడు దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. ఈ లక్ష్మీ నారాయణులకు రాజ్యము ఎలా లభించింది? దానిని ఎలా కోల్పోయారు? అనే విషయము పైన మీరు అర్థము చేయించవచ్చు. పూర్తి చరిత్ర మరియు భూగోళము మేము మీకు అర్థము చేయిస్తాము. నేను లక్ష్మీ నారాయణుల పూజ చేసేవాడిని, గీతా అధ్యయనము చేసేవాడినని ఈ బ్రహ్మ కూడా చెప్తున్నారు. బాబా ప్రవేశమైనప్పుడు అంతా వదిలేశాను. సాక్షత్కారము జరిగింది. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనము అవుతాయని తండ్రి చెప్పారు. ఇందులో గీత మొదలైనవి చదవవలసిన అవసరము లేదు. తండ్రి వీరిలో కూర్చుని అవన్నీ విడిపించారు. ఇప్పుడు శివుని దర్శనార్థము మందిరానికి ఎప్పుడూ వెళ్ళలేదు. భక్తి మాటలు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. రచయిత-రచనల ఆదిమధ్యాంత జ్ఞానము బుద్ధిలోకి వచ్చేసింది. తండ్రిని తెలుసుకోవడము వల్ల మీరు సర్వమూ తెలుసుకుంటారు. మనుష్యులు ఆశ్చర్యపడి వినేందుకు పరుగులు పెట్టి వచ్చే విధంగా మీరు అద్భుతమైన విషయాలు(టాపిక్స్‌) వ్రాయండి. ''ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి అధికారులుగా ఉన్నప్పుడు వేరే ధర్మము ఉండేది కాదు, భారతదేశము మాత్రమే ఉండేది.'' మరి సత్యయుగము లక్షల సంవత్సరాలని ఎలా చెప్పగలరు? అని మందిరాలకు వెళ్ళి మీరు ఎవరినైనా ప్రశ్నించండి. క్రీస్తుకు మూడు వేల సంవత్సరాల క్రితము స్వర్గముండేదని చెప్తారు. మరి లక్షల సంవత్సరాలు ఎలా అయ్యాయి? లక్షల సంవత్సరాలు అయినట్లయితే మానవులు దోమల వలె లెక్కించలేనంత మంది అయ్యేవారు. విషయాన్ని కొద్దిగా తెలియజేసినా ఆశ్చర్యపడ్తారు. అయితే ఎవరు ఈ కులానికి చెందినవారై ఉంటారో, వారి బుద్ధిలో మాత్రమే ఈ జ్ఞానము కూర్చుంటుంది. లేకుంటే బ్రహ్మాకుమారీల జ్ఞానము అద్భుతమైనదని మాత్రము చెప్తారు. దీనికి అర్థము చేసుకునే బుద్ధి అవసరము. ముఖ్యమైనది స్మృతి. లౌకికములో స్త్రీ పురుషులు ఒకరినొకరు స్మృతి చేసుకుంటారు. ఇక్కడ ఆత్మ పరమాత్మను స్మృతి చేస్తుంది. ఈ సమయములో అందరూ రోగులుగానే ఉన్నారు. ఇప్పుడు నిరోగులుగా అవ్వాలి. ఈ టాపిక్‌ కూడా ఉంచండి. మీరు క్షణ-క్షణము అనారోగ్యము పాలవుతున్నారు, మేము మీకు ఎలాంటి సంజీవిని మూలిక ఇస్తామంటే, దానిని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఎప్పుడూ జబ్బు పడరు. ఇది చాలా చౌకగా లభించే ఔషధము. 21 తరాలు సత్య-త్రేతా యుగముల వరకు అనారోగ్యము కలుగదు. దానినే స్వర్గమని అంటారు. ఇలాంటి పాయింట్లు నోట్‌ చేసుకొని వ్రాయండి. సర్జన్‌లకు సర్జన్‌ అయిన అవినాశి సర్జన్‌ మీకు ఎలాంటి ఔషధమునిస్తారంటే దాని ద్వారా మీరు భవిష్యత్తులో 21 జన్మల వరకు ఎప్పుడూ జబ్బు పడరు. ఇది సంగమ యుగము. ఇలాంటి మాటలు విని మనుష్యులు సంతోషిస్తారు. నేను అవినాశీ సర్జన్‌ను అని భగవంతుడు కూడా చెప్తున్నాడు. హే పతిత పావనా! ఓ అవినాశి సర్జన్‌! రండి అని స్మృతి కూడా చేస్తారు. ఇప్పుడు నేను వచ్చాను. మీరు అందరికీ అర్థం చేయిస్తూ ఉండండి. అంతిమములో అందరూ తప్పకుండా అర్థం చేసుకుంటారు. బాబా యుక్తులు తెలియజేస్తూ ఉంటారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. తండ్రి నుండి సర్చ్‌లైట్‌ తీసుకునేందుకు ఉదయమే లేచి బాబా స్మృతిలో కూర్చోవాలి. రాత్రి మేల్కొని కూడా ఒకరికొకరు కరెంట్‌(శక్తి) ఇచ్చుకుంటూ సహయోగులుగా అవ్వాలి.

2. మీ సర్వస్వాన్ని ఈశ్వరీయ సేవలో సఫలము చేసి ఈ పాత శరీరాన్ని కూడా మరచి తండ్రి స్మృతిలో ఉండాలి. పూర్తిగా అర్పణ అవ్వాలి. ఆత్మ అభిమానిగా ఉండేందుకు శ్రమ చేయాలి.

వరదానము :-

'' '' నీది - నాది '' అనే ఆందోళనను సమాప్తం చేసి దయా భావనను ఉత్పన్నము చేసే మర్సీఫుల్‌ భవ ''

సమయ ప్రతి సమయము అనేకమంది ఆత్మలు దు:ఖపు అలలలోకి వస్తున్నారు. ప్రకృతిలో ఏ కొంచెం ఆందోళన జరిగినా, ఆపదలు సంభవించినా అనేకమంది ఆత్మలు విలవిలలాడ్తారు, కరుణను, దయను వేడుకుంటారు. కనుక ఇటువంటి ఆత్మల ఆక్రందనలు విని దయా భావనను ఉత్పన్నము చేయండి. పూజ్య స్వరూపాన్ని, దయా స్వరూపాన్ని ధారణ చేయండి. స్వయాన్ని సంపన్నం చేసుకోండి. అప్పుడు ఈ దు:ఖ ప్రపంచము సంపన్నమౌతుంది. ఇప్పుడు పరివర్త అవ్వాలనే శుభ భావనల అలను తీవ్ర వేగముతో వ్యాపింపజేస్తే నీది - నాది అనే ఆందోళన సమాప్తమైపోతుంది.

స్లోగన్‌ :-

''వ్యర్థ సంకల్పాలనే సుత్తితో సమస్యలనే బండరాతిని పగులగొట్టేందుకు బదులు హైజంప్‌ చేసి సమస్యలనే పర్వతాన్ని దాటుకునే వారిగా అవ్వండి.''