20-07-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - కిరీటధారులు (కళంగీధారులు/నెమలిపింఛధారులు)గా అయ్యేందుకు తమ స్థితిని అచంచలంగా, స్థిరంగా తయారు చేసుకోండి, మీ పై ఎంత కళంకము మోపబడుతుందో, అంత కిరీటధారులుగా అవుతారు ''

ప్రశ్న :-

తండ్రి ఆజ్ఞ ఏమిటి? ఏ ముఖ్యమైన ఆజ్ఞ పై నడుచుకునే పిల్లలు హృదయ సింహాసనాధికారులుగా అవుతారు ?

జవాబు :-

తండ్రి ఆజ్ఞ - ''మధురమైన పిల్లలారా! మీరు ఎవ్వరితోనూ గొడవపడరాదు, శాంతిగా ఉండాలి.'' ఒకవేళ ఎవరికైనా మీ మాటలు నచ్చకపోతే మీరు మౌనంగా ఉండండి. ఒకరికొకరు విసిగించుకోకండి. మీలో ఏ భూతము లేకుండా, మీ నోటి ద్వారా ఎప్పుడూ ఎలాంటిి కఠినమైన మాటలు రాకుండా మధురంగా మాట్లాడడం జీవితములో ధారణ అవుతుందో అప్పుడు బాప్‌దాదా హృదయ సింహాసనాధికారులుగా అవ్వగలరు.

ఓంశాంతి.

భగవానువాచ, ''ఆత్మాభిమాని భవ'' - మొట్టమొదట ఇలా తప్పకుండా చెప్పాల్సి ఉంటుంది. ఇది పిల్లలను అప్రమత్తం చేయడం. తండ్రి చెప్తున్నారు - నేను పిల్లలూ! పిల్లలూ! అన్నప్పుడు ఆత్మలనే చూస్తాను. శరీరము ఏదైతే పాత చెప్పుగా ఉందో, అది సతోప్రధానంగా అవ్వజాలదు. సతోప్రధానమైన శరీరమైతే సత్యయుగములోనే లభిస్తుంది. ఇప్పుడు మీ ఆత్మ సతోప్రధానంగా అవుతూ ఉంది. శరీరమైతే పాతదే. ఇప్పుడు మీరు మీ ఆత్మను సరిదిద్దుకోవాలి. పవిత్రంగా తయారు చేసుకోవాలి. సత్యయుగములో శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఆత్మను శుద్ధంగా చేసుకునేందుకు ఒక్క తండ్రినే స్మృతి చేయాల్సి ఉంటుంది. తండ్రి కూడా ఆత్మనే చూస్తారు. కేవలం అలా చూడగానే ఆత్మ శుద్ధంగా తయారవ్వదు. తండ్రిని ఎంత స్మృతి చేస్తే అంత శుద్ధంగా అవుతూ ఉంటుంది. ఇది మీ పని, తండ్రిని స్మృతి చేస్తూ సతోప్రధానంగా అవ్వాలి. దారి తెలిపేందుకే తండ్రి వచ్చారు. ఈ శరీరమైతే చివరి వరకు పాతదిగానే ఉంటుంది. కేవలం కర్మేంద్రియాలతోనే ఆత్మకు సంబంధము ఉంటుంది. ఆత్మ సుగంధ పుష్పము వలె అయినప్పుడు మంచి కర్తవ్యాలు చేస్తుంది. అక్కడ పక్షులు, జంతువులు కూడా మంచి మంచివి బాగుంటాయి. ఇక్కడైతే పక్షులు మానవులను చూచి పారిపోతాయి. అక్కడ మీ ముందు వెనుక చాలా మంచి-మంచి పక్షులు నియమానుసారంగా తిరుగుతూ, ఎగురుతూ ఉంటాయి. అలాగని ఇంట్లోకి దూరి మురికి చేసి వెళ్తాయని కాదు. చాలా నియమబద్ధమైన ప్రపంచంగా ఉంటుంది. పోను పోను ఇవన్నీ మీకు సాక్షాత్కారమవుతూ ఉంటాయి. ఇప్పుడు సమయం చాలా ఉంది. స్వర్గం మహిమ అయితే అపారంగా ఉంది. తండ్రి మహిమ కూడా అపారమైనది. కావున తండ్రి ఆస్తికి కూడా అపారమైన మహిమ ఉంది. పిల్లలకు ఎంత నషా ఉండాలి! ఎవరైతే సర్వీసు చేస్తారో వారు స్వతహాగానే గుర్తుకు వస్తారని తండ్రి చెప్తున్నారు. ఆత్మలో మనసు, బుద్ధి ఉన్నాయి కదా. మేము ఫస్టు నంబరు సేవ చేస్తున్నామా లేక రెండవ నెంబరు సేవ చేస్తున్నామా అని వారికే అర్థమవుతుంది. ఇది అందరూ నంబరువారుగా అర్థము చేసుకుంటారు. కొందరైతే మ్యూజియంను నిర్మిస్తారు. ప్రెసిడెంటు, గవర్నరు మొదలైనవారి వద్దకు వెళ్తారు. వారు తప్పకుండా చాలా బాగా అర్థం చేయిస్తూ ఉండవచ్చు. ప్రతి ఒక్కరిలో వారి-వారి గుణాలున్నాయి. ఎవరిలోనైనా మంచి గుణములుంటే వీరెంత గుణవంతులు! అని అంటారు. సర్వీసు చేసేవారు సదా మధురంగా మట్లాడ్తారు. కఠినముగా ఎప్పటికీ మాట్లాడలేరు. ఎవరైతే కఠినంగా మాట్లాడ్తారో వారిలో భూతాలుంటాయి. దేహాభిమానము మొదటి నంబరు భూతము. ఆ తర్వాత దాని వెనుక ఇతర భూతాలు ప్రవేశిస్తాయి.
చాలామంది మనుష్యులు చాలా తప్పుడు నడవడికలో కూడా నడుస్తారు. పాపం వారి దోషమేమీ లేదు అని తండ్రి చెప్తారు. కల్పక్రితము చేసిన విధంగా మీరు శ్రమపడాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. తర్వాత నెమ్మది నెమ్మదిగా మొత్తం విశ్వమంతటి పగ్గాలు మీ చేతుల్లోకి వస్తాయి. ఇది డ్రామా చక్రము. సమయము కూడా సరిగ్గా తెలుపుతారు. ఇక చాలా కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది. వారు స్వతంత్రమును ఇస్తే రెండు ముక్కలుగా చేశారు. పరస్పరములో కొట్లాడుకుంటూ ఉండాలని అలా చేస్తారు. లేకపోతే వారి తుపాకులు మొదలైనవి ఎవరు తీసుకుంటారు. ఇది కూడా వారి వ్యాపారమే కదా. డ్రామానుసారంగా ఇది కూడా వారి చలాకీతనమే. ఇక్కడ కూడా మ్కులు ముక్కలుగా చేసేశారు. ఈ ముక్క మాకు లభించాలని వారంటారు. ఇంకా పూర్తిగా విభజించలేదు, ఇటువైపు నీరు ఎక్కువగా వెళ్తుంది, వ్యవసాయము చాలా అవుతుంది, ఇటువైపు నీరు తక్కువగా ఉందని అంటారు. ఇలా పరస్పరము కొట్లాడుకుంటూ ఉంటారు. దీనితో గృహ యుద్ధాలు(సివిల్‌ వార్స్‌) జరుగుతాయి. ఎక్కువగా కొట్లాడుకుంటూ ఉంటారు. తండ్రికి పిల్లలైనప్పుడు మీరు కూడా తిట్లు తింటారు. మీరిప్పుడు కీరీటధారులుగా అవుతారని బాబా అర్థం చేయించారు. బాబా ఏ విధంగా తిట్లు తిన్నారో మీరు కూడా అలా తిట్లు తింటారు. మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారని పాపం వారికి తెలియదనే విషయము మీకు తెలుసు. 84 జన్మల విషయమైతే చాలా సహజమైనది. మీరే పూజ్యులుగా, మళ్లీ మీరే పూజారులుగా కూడా అవుతారు. కొందరి బుద్ధిలో ధారణ జరగదు. ఇది కూడా డ్రామాలో వారి పాత్రగా ఉంది. కనుక వారు ఏం చేయగలరు? తల ఎంతగా కొట్టుకున్నా(కష్టపడినా) పైకి ఎక్కలేరు. పురుషార్థమైతే చేయించబడ్తుంది. కాని వారి అదృష్టములో లేదు. రాజధాని స్థాపనౌతూ ఉంది. అందులో అందరూ కావాలి. ఈ విధంగా భావించి శాంతిగా ఉండాలి. ఎవ్వరితోనూ గొడవ పడరాదు. ఇలా చేయరాదని ప్రేమగా అర్థం చేయించాల్సి ఉంటుంది. అప్పుడు ఆత్మ వింటుంది. దీని ద్వారా పదవి ఇంకా తగ్గిపోతుంది. కొందరికి ఎంత మంచిగా అర్థం చేయించినా వారు అశాంతిగా అయిపోతారు. అటువంటి వారిని వదిలేయాలి. స్వయం అలాగే ఉంటే ఒకరికొకరు విసిగించుకుంటూ ఉంటారు. ఇది చివరి వరకు ఉంటుంది. మాయ కూడా రోజురోజుకు కఠినమౌతూపోతుంది. మహారథులతో మాయ కూడా మహారథియై కొట్లాడ్తుంది. మాయా తుఫానులు వస్తూ ఉంటాయి. మళ్లీ తండ్రిని స్మృతి చేయడం పూర్తిగా అచంచలంగా, స్థిరంగా ఉండడం అభ్యాసమౌతుంది. మాయ గాభరా(హైరానా) పెడ్తుంది కానీ భయపడరాదు అని తెలుసుకుంటారు. కిరీటధారులుగా అయ్యే వారి పై కళంకము మోపబడ్తుంది. ఈ విషయములో అసంతుష్ట పడరాదు. వార్తాపత్రికలవారు ఏదో ఒకటి వ్యతిరేకంగా కూడా వ్రాస్తారు. ఎందుకంటే ఇది పవిత్రత విషయము. అబలల పై అత్యాచారాలు జరుగుతాయి. అకాసురుడు, బకాసురుడు అను పేర్లు కూడా ఉన్నాయి. అలాగే స్త్రీలలో కూడా పూతన, శూర్పణఖ అను పేర్లు ఉన్నాయి.
ఇప్పుడు పిల్లలు మొట్టమొదట తండ్రి మహిమనే వినిపిస్తారు. మీరు ఆత్మలు అని బేహద్‌ తండ్రి చెప్తున్నారు. ఈ జ్ఞానమును ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు. ఈ చదువులో రచయిత మరియు రచనల జ్ఞానముంది. దీని ద్వారా మీరు స్వదర్శన చక్రధారులుగా అయ్యి చక్రవర్తి రాజులుగా అవుతారు. అలంకారాలు కూడా మీవే. కానీ బ్రాహ్మణులైన మీరు పురుషార్థులు, అందువలన ఈ అలంకారాలను విష్ణువుకు ఇచ్చేశారు. ఆత్మ అనగా ఏమిటో, పరమాత్మ అనగా ఏమిటో ఈ విషయాలను ఎవ్వరూ తెలుపలేరు. ఆత్మ ఎక్కడ నుంచి వస్తుంది? ఎలా వెళ్తుంది? ఒకసారి కళ్ళ నుండి వెళ్లిపోతుందని, ఒకసారి భృకుటి నుండి వెళ్లిపోతుందని అంటారు, ఒకసారి తల నుండి వెళ్లిపోయిందని అంటారు. ఎలా వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు. ఆత్మ శరీరము నుండి ఎలా వెళ్తుందో మీకిప్పుడు తెలుసు. తండ్రి స్మృతిలో కూర్చుని దేహమును త్యాగము చేసేస్తుంది. తండ్రి వద్దకు సంతోషంగా వెళ్లాలి. పాత శరీరాన్ని సంతోషంగా వదలాలి. సర్పము ఉదాహరణ ఉంది కదా. జంతువులకున్నంత తెలివి కూడా మనుష్యులకు లేదు. ఆ సన్యాసులు మొదలైన వారైతే కేవలం ఉదాహరణలు ఇస్తూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు - భ్రమరము పురుగులను ఎలా పరివర్తన చేస్తుందో అలా మీరు కూడా మనుష్య రూపీ కీటకాలను పరివర్తన చేయాల్సి వస్తుంది. కేవలం ఉదాహరణ ఇవ్వడం కాదు, ఆచరణలో చేసి చూపించాలి అని తండ్రి చెప్తున్నారు. పిల్లలైన మీరిప్పుడు వాపస్‌ ఇంటికి వెళ్లాలి. తండ్రి ద్వారా మీరు వారసత్వమును పొందుతున్నారు కావున మీకు లోపల సంతోషముండాలి. వారికి వారసత్వము గురించి తెలియనే తెలియదు. శాంతి అయితే అందరికీ లభిస్తుంది. అందరూ శాంతిధామములోకి వెళ్తారు. తండ్రి తప్ప మరెవ్వరూ అందరికి సద్గతినివ్వలేరు. మీది నివృత్తి మార్గము, మీరౖెెతే బ్రహ్మలో లీనమయ్యే పురుషార్థము చేస్తారు. తండ్రి అయితే ప్రవృత్తి మార్గమును తయారుచేస్తున్నారు. మీరు సత్యయుగములోకి వెళ్లలేరు, మీరు ఈ జ్ఞానాన్ని ఎవ్వరికీ అర్థము చేయించలేరు, ఇది చాలా నిగూఢమైన విషయము అని వారికి అర్థం చేయించాలి. ఎవరికైనా మొదట తండ్రిని గురించి, ఆస్తిని(అల్ఫ్‌, బే) గురించి చదివించాల్సి ఉంటుంది. మీకు ఇద్దరు తండ్రులున్నారు, ఒకరు హద్దు తండ్రి, మరొకరు బేహద్దు తండ్రి అని చెప్పండి. వికారాల ద్వారా హద్దు తండ్రి వద్ద జన్మ తీసుకుంటారు. ఎంత అపారమైన దు:ఖము కలుగుతుంది! సత్యయుగములో అయితే అపారమైన సుఖము ఉంటుంది. అక్కడ జన్మ వెన్న వలె ఉంటుంది. ఎలాంటి దు:ఖమూ ఉండదు. దాని పేరే స్వర్గము. అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన రాజ్యము వారసత్వంగా లభిస్తుంది. మొదట సుఖముంటుంది తర్వాత దు:ఖముంటుంది. మొదట దు:ఖము తర్వాత సుఖము అని అనడం తప్పు. మొదట క్రొత్త ప్రపంచము స్థాపన అవుతుంది. పాతది స్థాపన అవ్వదు. పాత ఇంటిని ఎప్పుడైనా, ఎవరైనా నిర్మిస్తారా. క్రొత్త ప్రపంచములో అయితే రావణుడు ఉండజాలడు. బుద్ధిలో ఈ విధమైన యుక్తులు ఉండాలని తండ్రి అర్థం చేయిస్తున్నారు. బేహద్‌ తండ్రి బేహద్‌ సుఖమును ఇస్తారు. ఎలా ఇస్తారో ఇక్కడకు వస్తే అర్థం చేయిస్తామని చెప్పే యుక్తి కూడా కావాలి. మీరు వారికి దు:ఖధామములోని దు:ఖమును కూడా సాక్షాత్కారము చేయించండి. ఎంత అపారమైన దు:ఖముంది! దీని పేరే దు:ఖధామము, దీనిని ఎవ్వరూ సుఖధామమని అనలేరు. సుఖధామములో శ్రీ కృష్ణుడు ఉంటాడు. శ్రీ కృష్ణుని మందిరాన్ని కూడా సుఖధామము అని అంటారు. కృష్ణుడు సుఖధామానికి అధికారిగా ఉండేవాడు. మందిరాలలో అతడికి ఇప్పుడు కూడా పూజలు జరుగుతున్నాయి. ఈ బాబా ఇప్పుడు లక్ష్మీనారాయణుల మందిరానికి వెళ్తే ఓహో! నేను ఇలా తయారౌతానని భావిస్తాడు కానీ ఇప్పుడు పూజించడు. నెంబర్‌వన్‌గా తయారైతే రెండవ నంబరు, మూడవ నెంబరు వారిని ఎందుకు పూజించాలి? మనమైతే సూర్యవంశీయులుగా అవుతాము. ఇది మనుష్యులకు తెలియదు. వారైతే అందరినీ భగవంతుడని అంటూ ఉంటారు. ఎంత అంధకారముంది! మీరు ఎంత బాగా అర్థము చేయిస్తారు! అందుకు సమయము పడ్తుంది. కల్పక్రితము ఎంత సమయం పట్టిందో అంతే సమయం పడ్తుంది. త్వరగా ఏమీ చేయలేరు. ఇప్పటి మీ జన్మ వజ్రములాంటిది. దేవతల జన్మను కూడా వజ్రములాంటిదని అనరు. వారు ఈశ్వరీయ పరివారములో లేరు. ఇది మీ ఈశ్వరీయ పరివారము, వారిది దైవీ పరివారము. ఇవి ఎంత క్రొత్త - క్రొత్త విషయాలు! భగవద్గీతలో పిండిలో ఉప్పు ఉన్నంత నిజముంది. కృష్ణుని పేరు వేసి ఎంత పెద్ద తప్పు చేసేశారు! మీరు దేవతలను దేవతలని చెప్త్తూ మళ్లీ కృష్ణుడిని భగవంతుడని ఎందుకు అంటారు అని అడగండి. విష్ణువు ఎవరు? ఇది కూడా మీరు అర్థము చేసుకున్నారు. మనుష్యులు జ్ఞానము లేకుండానే అలా పూజ చేస్తూ ఉంటారు. దేవీ దేవతలే ప్రాచీనమైనవారు. వారు స్వర్గములో ఉండి వెళ్లిపోయారు. సతో, రజో, తమోలోకి అందరూ రావాలి. ఈ సమయములో అందరూ తమోప్రధానంగా ఉన్నారు. పిల్లలకు చాలా విషయాలు అర్థం చేయిస్తారు. బ్యాడ్జి పై కూడా మీరు బాగా అర్థం చేయించగలరు. తండ్రి మరియు చదివించే టీచరును స్మృతి చేయవలసి ఉంటుంది. కానీ మాయతో కూడా ఎంతో పెనుగులాట ఉంటుంది. చాలా మంచి మంచి పాయింట్లు వస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు వినకపోతే ఇతరులకు ఎలా వినిపించగలరు? తరచుగా మహారథులు ఇటు-అటు బయటికి వెళ్లినప్పుడు మురళిని మిస్‌(వదిలేస్తారు) చేస్తారు. తర్వాత చదవరు. వారి కడుపు నిండి ఉంటుంది. తండ్రి ఎంతో నిగూఢమైన విషయాలను గురించి మీకు వినిపిస్తారు. మీరు వాటిని విని ధారణ చేయాలి. ధారణ చేయకపోతే కచ్ఛాగానే ఉంటారు. చాలామంది పిల్లలు కూడా విచార సాగర మథనము చేసి మంచి మంచి పాయింట్లు వినిపిస్తూ ఉంటారు. స్థితి ఎలా ఉంటుందో అటువంటి పాయింట్లు తయారు చేయగలరని తండ్రి చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. ఎప్పుడూ ఇతడు వినిపించని విషయాలను సేవాధారి పిల్లలు వెలికి తీస్తారు. వారు సర్వీసులోనే నిమగ్నమై ఉంటారు. మ్యాగ్‌జైన్లలో కూడా మంచి పాయింట్లు వేస్తారు.
కావున పిల్లలైన మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు. తండ్రి ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు - విశ్వము పగ్గాలన్నీ మీ చేతిలో ఉంటాయని పాటలో కూడా ఉంది కదా. దానిని మీ నుండి ఎవ్వరూ దోచుకోలేరు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు కదా. వారిని తప్పకుండా తండ్రియే చదివించి ఉంటారు. వారు రాజ్యపదవిని ఎలా పొందారో కూడా మీరు అర్థం చేయించగలరు. మందిరములోని పూజారికి తెలియదు. మీకైతే చాలా సంతోషముండాలి. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదని కూడా మీరు అర్థం చేయించవచ్చు. ఈ సమయంలో అందరిలో పంచ వికారాలు అనే భూతాలు సర్వవ్యాపిగా ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో ఈ వికారాలున్నాయి. మాయకు చెందిన పంచ భూతాలూ ఉన్నాయి. మాయ సర్వవ్యాపిగా ఉందని మీరు తెలియచేయగలరు. మీరు మళ్లీ ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్తున్నారు. ఇది తప్పు కదా. ఈశ్వరుడు సర్వవ్యాపి ఎలా అవుతారు? వారు బేహద్‌ వారసత్వమును ఇస్తారు. ముళ్ళను పూలుగా తయారు చేస్తారని తెలియచేయుటకు కూడా పిల్లలు అభ్యాసము చేస్తూ ఉండాలి. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. ఎవరైనా అశాంతిని వ్యాపింపజేసినా లేక విసిగించినా మీరు శాంతిగా ఉండాలి. ఒకవేళ జ్ఞానము లభించినా ఎవరైనా తమను తాము చక్కదిద్దుకోకపోతే వారి అదృష్టము అంతే అని అంటారు. ఎందుకంటే రాజధాని స్థాపన అవుతూ ఉంది.

2. విచార సాగర మథనము చేసి జ్ఞానములో కొత్త కొత్త పాయింట్లు వెలికి తీసి సర్వీసు చేయాలి. తండ్రి మురళిలో రోజూ వినిపిస్తున్న నిగూఢ విషయాలను ఎప్పటికీ మిస్‌ చేయరాదు.

వరదానము :-

'' సమయ ప్రమాణంగా ప్రతి శక్తిని ప్రాక్టికల్‌ స్వరూపంలో అనుభవం చేసే మాస్టర్‌ సర్వశక్తివాన్‌ భవ ''

మాస్టర్‌ అనగా ఏ శక్తిని ఏ సమయంలో ఆహ్వానిస్తారో ఆ శక్తి అదే సమయంలో ప్రాక్టికల్‌ స్వరూపంలో అనుభవమవ్వాలి. ఆజ్ఞాపిస్తూనే హాజరవ్వాలి. అలాగని సహనశక్తిని ఆజ్ఞాపిస్తే ఎదిరించే శక్తి రారాదు. అలా వస్తే వారిని మాస్టర్‌ అని అనరు. కనుక ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఆ సమయంలో అదే శక్తి కార్యములో ఉపయోగపడ్తోందా, అని ప్రయత్నించండి. ఒక సెకండు తేడా వచ్చినా గెలుపుకు బదులు ఓడిపోతారు.

స్లోగన్‌ :-

'' బుద్ధిలో ఎంత ఈశ్వరీయ నశా ఉందో, కర్మలో అంత నమ్రత ఉండాలి. ''