11-03-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - మేము పరమాత్ముడైన తండ్రి విశ్వవిద్యాలయములో చదివే విద్యార్థులము, భవిష్య నూతన ప్రపంచ వారసత్వాన్ని పొందేందుకు చదువుకుంటున్నామనే గుప్తమైన ఖుషీ మీకు ఉండాలి.''
ప్రశ్న :
ఏ స్మృతిలో సదా ఉన్నట్లయితే దైవీ గుణాలు ధారణ అవుతూ ఉంటాయి ?
జవాబు :-
ఆత్మలమైన మేము శివబాబా సంతానము, బాబా మమ్ములను ముళ్ల నుండి పుష్పాలుగా చేసేందుకు వచ్చారనే స్మృతి సదా ఉంటే దైవీ గుణాల ధారణ జరుగుతుంది. చదువు మరియు యోగము పై పూర్తి గమనము ఉండాలి. వికారాల పై తిరస్కార భావన ఉంటే దైవీ గుణాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా వికారాలు దాడి చేస్తే నేను ముల్లుగా ఉన్నాను, ఇప్పుడు పుష్పంగా తయారవ్వాలని గుర్తు చేసుకోండి.
ఓంశాంతి.
మేము ఆత్మిక విశ్వవిద్యాలయములో కూర్చొని ఉన్నామని పిల్లల బుద్ధిలో ఉంది. ఈ నషా ఉండాలి. పాఠశాలలో కూర్చున్నట్లుగా ఇక్కడ సాధారణ రీతిలో బుద్ధిహీనులుగా కూర్చోరాదు. చాలామంది పిల్లలు బుద్ధిహీనుల వలె కూర్చుంటారు. ఇది శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన పరమపిత పరమాత్ముని విశ్వవిద్యాలయము. మేము వారి విద్యార్థులమని జ్ఞాపకముండాలి. కనుక మీలో ఎంత నషా ఉండాలి! ఇది గుప్తమైన ఖుషీ, గుప్త జ్ఞానము, ప్రతి విషయము గుప్తమే. ఇక్కడ కూర్చొని ఉన్నా చాలామందికి వెలుపలి చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. భవిష్యత్తులో కొత్త ప్రపంచ వారసత్వాన్ని పొందేందుకు ఇక్కడ మీరు చదువుకుంటున్నారు. కనుక మీకు ఎంత సంతోషము ఉండాలి. దైవీగుణాలు కూడా ఉండాలి. ఇక్కడ అందరూ బ్రాహ్మణులే వస్తారు. మీరు అక్కడి మురికి నుండి రక్షింపబడి ఇక్కడికి వస్తారు. కనుక మీరు ఎంత సంతోషంగా ఉండాలి. ఈ సమయములో ప్రపంచమంతా మురికిలో ఉంది. కలియుగ మురికి ఎక్కడ, సత్యయుగములోని పుష్పాల తోట ఎక్కడ. కలియుగములో ఒకరినొకరు ముళ్లతో గుచ్చుకుంటూ ఉంటారు. మీరిప్పుడు పుష్పాలుగా అవ్వాలి. కనుక ఎంత సంతోషము ఉండాలి. ఇప్పుడు మనము పుష్పాలుగా అవుతాము. ఇది పూతోట. తండ్రిని తోట యజమాని అని అంటారు. వారు వచ్చి ముళ్లను పుష్పాలుగా చేస్తారు. మేము ఎలాంటి పుష్పాలుగా అవుతున్నామని పిల్లలకు తెలిసి ఉండాలి. ఇక్కడ పూతోట కూడా ఉంది. మురళి విని తోటలోకి వెళ్లి పుష్పాలతో మిమ్ములను పోల్చుకోండి. మేము ఎలాంటి పుష్పాలము! మేము ముళ్లుగా లేము కదా? కోపము వచ్చినప్పుడు నేను ముల్లును, నాలో భూతము ఉందని అర్థము చేసుకోండి. కోపము పై ఇంతటి తిరస్కార భావన రావాలి. కోపము అందరి మధ్యలో వస్తుంది. కామము అందరి మధ్యలో రాదు. ఇది గుప్తంగా చేస్తారు. క్రోధము బయటకు వచ్చేస్తుంది. కోపము చేసుకున్నట్లయితే దాని ప్రభావము కూడా కొద్ది రోజులు కొనసాగుతుంది. క్రోధపు నషా కూడా ఉంటుంది. లోభపు నషా కూడా ఉంటుంది. మీ పైన మీకే తిరస్కార భావన కలగాలి. మనలను బాబా పుష్పాలుగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు. కామము, క్రోధము చాలా మురికి వికారాలు. మనుష్యుల శోభను పూర్తిగా నాశనము చేస్తాయి. ఇక్కడ శోభ చూపించినప్పుడే అక్కడ కూడా శోభను పొందుతారు. దైవీగుణాల ధారణ చేయండని బాబా ప్రతిరోజూ పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. స్వర్గానికి వెళ్లాలి కదా. ఈ లక్ష్మీనారాయణులు ఎంతటి గుణవంతులు! వారి వద్దకు వెళ్లి ''మేము నీచులము, పాపులము, కాముకులము, మీరు సర్వగుణ సంపన్నులు'' అని మహిమ చేస్తారు. స్వర్గము పుష్పాల తోట, నరకము ముళ్ల అడవి అని మీకు తెలుసు. శివబాబా స్వర్గ స్థాపన చేస్తారు. రావణుడు నరకాన్ని తయారుచేస్తారు. మేము ఆత్మలము, బాబా సంతానము, మాలో మురికి ఎక్కడి నుండి వచ్చింది? అని ఆలోచించాలి. ఒకవేళ మురికిగా ఉంటే బాబా పేరును పాడు చేస్తారు. కోపము చేసుకున్నట్లయితే తండ్రిని నిందింపజేసినట్లవుతుంది. కోధ్ర భూతము వస్తూనే తండిన్రి మర్చిపోతారు. తండి స్మృతి ఉంటే ఏ భూతమూ రాదు. ఒకవేళ ఎవరి మనస్సుకైనా దు:ఖము కలిగిస్తే దాని ప్రభావము కూడా పడ్తుంది. ఒక్కసారి కోపము చేసుకుంటే వీరు క్రోధి అని 6 మాసముల వరకు అందరి బుద్ధిలో ఉంటుంది. వారి హృదయము నుండి కూడా దిగిపోతారు. ఈ దాదా కూడా విశ్వానికి అధికారిగా అవుతాడు. ఇతనిలో కూడా తప్పకుండా విశేషతలుంటాయి. కానీ ఎవరి భాగ్యములోనైనా లేనట్లయితే పురుషార్థము చేయరు. ఎంత సహజమైన పురుషార్థము. కేవలం బాబాను స్మృతి చేసినట్లయితే ఆత్మ స్వచ్ఛంగా అవుతుంది. వేరే ఉపాయము లేదు. ఈ సమయములో రాజఋషులు ఎవ్వరూ లేరు. రాజయోగము నేర్పించేవారు ఒక్క తండ్రి మాత్రమే. మనుష్యులు మనుష్యులను పరివర్తన చేయలేరు. బాబా వచ్చి అందరినీ పరివర్తన చేస్తారు. ఎవరైతే పూర్తిగా చాలా బాగా పరివర్తన అవుతారో వారు సత్యయుగములో మొట్టమొదట వస్తారు. కావున ఏవైనా చెడు అలవాట్లు ఉంటే వదిలేయాలి. చదువు పై, యోగము పై పూర్తి గమనముంచాలి. అందరూ ఒకే విధంగా ఉన్నతంగా అవ్వలేరని కూడా తెలుసు. కానీ బాబా ఏమో పురుషార్థము చేయిస్తారు. సాధ్యమైనంత ఎక్కువగా పురుషార్థము చేసి శ్రేష్ఠ పదవిని పొందండి. లేకుంటే కల్ప-కల్పాంతరము పొందలేరు. తండ్రిని స్మృతి చేస్తే మురికి తొలగిపోతుందని బాబా పదే పదే అర్థం చేయిస్తారు. ఆ సన్యాసులు హఠయోగమును నేర్పిస్తారు. హఠయోగము ద్వారా మంచి ఆరోగ్యము కలుగుతుందని వారు ఎప్పుడూ అనారోగ్యము పాలు అవ్వరని అనుకోకండి. వారు కూడా అనారోగ్యము పాలవుతారు. భారతదేశములో లక్ష్మీనారాయణుల రాజ్యమున్నప్పుడు అందరి ఆయువు ఎక్కువగా ఉండేది. ఆరోగ్యము, ఐశ్వర్యము ఉండేవి. ఇప్పుడు అందరూ పూర్తి అల్పాయుష్కులుగా ఉన్నారు. భారతదేశాన్ని ఇలా ఎవరు తయారుచేశారో ఎవ్వరికీ తెలియదు. పూర్తి గాఢాంధకారములో ఉన్నారు. మీరు ఎంత అర్థం చేయించినా వారికి అర్థం అవ్వడం చాలా కష్టము. పేదవారు సాధారణమైనవారే అయినా అర్థము చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇక్కడ ఎవరైనా లక్షాధికారులున్నారా? ఇప్పుడు లక్ష కూడా పెద్ద మాటేమీ కాదు. ఇప్పుడు లక్షాధికారులు చాలామంది ఉన్నారు. వారిని కూడా బాబా సాధారణమైనవారని చెప్తారు. నేడు కోటీశ్వరులదే మాట. వివాహాలకు కూడా ఎంత ఖర్చు చేస్తారు. ఇతరులకు బాణము తగిలే విధంగా మీరు చాలా యుక్తిగా అర్థం చేయించాలి. ఎవరైనా ఎం.పి మొదలైన గొప్ప-గొప్ప వ్యక్తులు వచ్చినప్పుడు చాలా సంతోషిస్తారు. కానీ ఒక్కరిలో కూడా ఈ సందేశాన్ని ఇచ్చే శక్తి లేదు. మీరేమో అర్థం చేయిస్తారు కానీ యధార్థంగా పూర్తిగా అర్థం చేసుకొని వెళ్లరు. ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడు. ఉన్నతాతి ఉన్నతమైనది ఈ వారసత్వము. లక్ష్మీనారాయణులకు ఈ స్వర్గ వారసత్వమును ఎవరు ఇచ్చారు? వీరు ఎక్కడి నివాసులు? ఇది చాలామందికి తెలియదు. అర్థం చేసుకునేందుకు మ్యూజియంకు చాలామంది వస్తారు. సేవకు మంచి అవకాశముంది. కానీ యోగము లేనే లేదు. తండ్రిని స్మృతి చేస్తే ఫ్రఫుల్లత కూడా వస్తుంది. మనము ఎవరి సంతానము. చాలామంది పిల్లలు నియమానుసారంగా చదవరు. బాబాతో యోగమే చేయరు. ఇంకా ఎవ్వరూ సంపూర్ణమవ్వలేదు. నంబరువారుగా ఉన్నారు. పిల్లలు ఏకాంతములో కూర్చొని తండ్రిని స్మృతి చేయాలి. ఇలా మనము తండ్రి ద్వారా స్వర్గ వారసత్వాన్ని పొందుతాము. ఈ ప్రపంచములో మనమే అందరికంటే పతితులుగా అయ్యాము. మళ్లీ మనమే పావనంగా అవ్వాలి. ఇది బాగా జ్ఞాపకముంచుకోవాలి. ఇలా ఇలా చేయండని తండ్రి అనేక విధాలుగా సలహా ఇస్తారు. విక్టోరియా రాణి మంత్రి పేదవాడిగా ఉండి, వీధి లైట్ల క్రింద చదువుకొని ఉన్నత పదవిని పొందాడు. ఆసక్తి ఉండేది. ఇది కూడా పేదవారి కొరకే. తండ్రి పేదలపెన్నిధి. ధనవంతులు భగవంతుని ఏం స్మృతి చేయగలరు! మాకు స్వర్గము ఇక్కడే ఉందని అంటారు. అరే! బాబా ఇంకా స్వర్గ స్థాపన చేయలేదు. ఇప్పుడు చేస్తున్నారు. తండ్రిని స్మృతి చేయండి. తప్పకుండా పావనంగా అవ్వాలి. భారతదేశ ప్రాచీన యోగము పరమపిత పరమాత్మ తప్ప వేరెవ్వరూ నేర్పించలేరని ఇతరులకు అర్థం చేయించేందుకు పిల్లలు యుక్తులు రచించాలి. హఠయోగము నివృత్తి మార్గములోని వారి కొరకు. ఎప్పుడైనా ఎవరి కళ్యాణమైనా జరగవలసి ఉంటే మళ్లీ ఇలాగే వ్రాస్తారని తండ్రి చెప్తారు. ఇంకా సమయముంది కనుక ఎవరి బుద్ధికి తోచడం లేదు.
ఇది మీ ఈశ్వరీయ మిషన్(ప్రచార సంస్థ). మీరు మనుష్యుల నుండి దేవతలుగా చేసే సేవ చేయాలి. ప్రపంచములో అయితే అనేక రకాలైన మతాలు వెలువడుతూ ఉంటాయి. వాటికి ఎంతటి ఆడంబరము ఉంటుంది. ఎంత అంధ విశ్వాసముంది. రాత్రికి, పగలుకున్నంత వ్యత్యాసముంది. బ్రాహ్మణులైన మీలో కూడా రాత్రికి, పగలుకు ఉన్నంత వ్యత్యాసముంది. కొందరికి ఏమీ తెలియదు. జ్ఞానము చాలా సులభము. స్వయాన్ని ఆత్మగా భావించి, తండ్రిని స్మృతి చేస్తే పాపము సమాప్తమౌతుంది. దైవీ గుణాలు ధారణ చేసినట్లయితే ఇలా(లక్ష్మినారాయణుల వలె) తయారవుతారు. దండోరా వేయిస్తూ ఉండండి. దేహాభిమానము లేనట్లయితే డోలు మెడలో వేసుకొని తండ్రి వచ్చారని అందరికీ తెలుపుతూ ఉండండి. ''నన్ను స్మృతి చేస్తే మీరు పతితుల నుండి పావనులుగా అవుతారు '' అని వారు చెప్తున్నారు. ఈ సందేశాన్ని ఇంటింటికి ఇవ్వాలి. అందరి పై త్రుప్పు పట్టి ఉంది. ఇది తమోధ్రాన ప్రపంచము. అందరికీ బాబా సందేశాన్ని తప్పకుండా అందించాలి. అంతిమంలో మిమ్ములను శభాష్-శభాష్ అని అందరూ మెచ్చుకుంటారు. వీరు ఎంత అద్భుతము చేశారని అందరూ అంటారు. చాలా మేల్కొలిపారు కానీ మేము మేలుకోలేదు, ఎవరు మేల్కొన్నారో వారు పొందారు, ఎవరు నిద్రపోయారో వారు కోల్పోయారు అని అంటారు. తండ్రి సామ్రాజ్యమిచ్చేందుకు వచ్చారు అయినా పోగొట్టుకుంటారు. సర్వీసు కొరకు యుక్తులు రచించాలి. తండ్రి వచ్చి చెప్తున్నారు - నన్నొక్కరినే స్మృతి చేస్తే వికర్మలు వినాశమౌతాయి, పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతారు. స్మృతి చేయకుంటే పాపాలు నశించవు. ఎలాంటి మురికి ఉండరాదు. అప్పుడే ఉన్నత పదవి పొందగలరు. లేకుంటే పదవి కూడా తగ్గిపోతుంది. శిక్షలు కూడా అనుభవిస్తారు. సర్వీసు చేసేందుకు మంచి అవకాశముంది. చిత్రాలు వెంట తీసుకెళ్తే సర్వీసు చేయగలరు. పాడవ్వని విధంగా చిత్రాలను మంచిగా తయారు చేయాలి. ఈ చిత్రాలు చాలా బాగున్నాయి. మిగిలిన మాడల్స్ అయితే ఆటబొమ్మలు. గొప్ప-గొప్ప వ్యక్తులవి పెద్ద పెద్ద చిత్రాలుంటాయి. వేల సంవత్సరాలు కూడా ఉంటాయి. మీకు ఈ 6 చిత్రాలు చాలు. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో మేము మీకు అర్థం చేయిస్తామని చెప్పండి. ఈ చక్రాన్ని స్మృతి చేయడం వలన మీరు చక్రవర్తి రాజులుగా అవుతారని చెప్పండి. బ్యాడ్జి కూడా చాలా బాగుంది. కానీ పిల్లలకు దీని విలువ తెలియదు. దీని పై కూడా మీరు అర్థం చేయిస్తూ ఉన్నా మీకు చాలా సంపాదన జరుగుతుంది. ఈ బ్యాడ్జ్ ఎలాంటిది అంటే అది హృదయం పై వ్రేలాడుతూ ఉండాలి. బాబా ఈ బ్రహ్మ ద్వారా ఈ ఆస్తిని(లక్ష్మినారాయణ) ఇస్తున్నారని చెప్పండి. రైలులో కూడా తిరుగతూ అందరికీ బ్యాడ్జ్ పై అర్థం చేయిస్తూ ఉండండి. చిన్న పిల్లలు కూడా సేవ చేయవచ్చు. మిమ్ములను ఎవ్వరూ వారించలేరు. ఈ బ్యాడ్జి ఎలాంటిది అంటే వజ్ర వైఢూర్యాలు, ఫల పుష్పాలు, భవనాలు అన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి. కానీ పిల్లల బుద్ధికి తోచదు. చిత్రాలు తప్పకుండా జతలో ఉండాలని బాబా అనేక సార్లు తెలియజేశారు. మిమ్ములను కొందరు ఉల్టా-సుల్టాగా కూడా మాట్లాడ్తారు. కృష్ణుని గురించి కూడా ఎత్తుకొనిపోయాడు, తీసుకెళ్లాడు, అది చేశాడు అని నిందించారు కదా. కానీ వారిని కూడా పట్టపు రాణులుగా చేశాడు కదా. విశ్వానికి యజమానిగా అయ్యి అలాంటి పనులు చేయడు. ఈ జ్ఞానములో చాలా నషా ఉండాలి. త్వరగా వినాశనము అవ్వాలని మనము కోరుకుంటాము. మళ్లీ ఇప్పుడు బాబా మా జతలో ఉన్నారని కూడా చెప్తారు. బాబాను వదిలినట్లయితే వారు మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాతనే లభిస్తారు. అలాంటి బాబాను మనమెలా వదలాలి? బాబా వద్ద మనము చదువుకుంటూనే ఉండాలి. ఇది ఉన్నతాతి ఉన్నతమైన బ్రాహ్మణ జన్మ. మనకు రాజ్యమును ఇస్తున్న ఇలాంటి తండ్రిని మళ్లీ మనము కలుసుకోలేము. కానీ గంగానది తీరములో ఉండేవారు అంత గౌరవమునివ్వరు. వెలుపలివారు ఎంతో మహిమనిస్తారు. ఇక్కడ కూడా వెలుపలివారు అర్పణ అవుతారు. ఒకవేళ యోగబలము లేకుంటే మీరు ఎవరికి తెలియజేసినా దాని ప్రభావముండదు. ఏమీ అర్థము చేసుకోలేరు. చాలామంది వస్తారు. ఇలా ఇలా అర్థం చేయించారు, చాలా బాగుందని చెప్తారు. విన్నప్పటికీ విననట్లే ఏమీ అర్థము చేసుకోలేదని బాబాకు తెలుసు. కొంచెం కూడా అర్థం చేసుకోలేరు. తండ్రినే తెలుసుకోదని తండ్రికి తెలుసు. ఒకవేళ ఏమైనా అర్థము చేసుకొని ఉంటే అలాంటి తండ్రితో సంబంధాన్ని ఉంచుకుంటారు. జాబు వాస్త్రారు. అలాంటి తండ్రికి జాబు ఎలా వ్రాయాలో తెలియచేయండని మిమ్ములను తక్షణము అడుగుతారు. శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ్ర అని మీరు చెప్తారు. వెంటనే వ్రాయడం ప్రారంభిస్తారు. ఇతను రథము కదా. కానీ వీరిలో ఎవరు ప్రవేశించారో వారి విలువే ఎక్కువ.
సర్వీసు చేస్తూ చేస్తూ చాలామంది పిల్లల గొంతులు అలసిపోతాయి. కానీ యోగము లేనట్లయితే బాణము తగలదు. దీనిని కూడా డ్రామా అని అంటారు. తండ్రిని తెలుసుకున్నట్లయితే ఆ బాబాతో మిలనము చేయకుండా ఉండలేరు. మేము బాబా వద్దకు వెళ్తున్నామని రైలులో కూడా యోగయుక్తులై రావాలి. ఎలా విదేశాల నుండి వచ్చునప్పుడు పత్ని, పిల్లలు అందరూ జ్ఞాపకము వస్తారు కదా. ఇక్కడ మనము ఎవరి వద్దకు వెళ్తున్నాము! కనుక మార్గములో కూడా ఎంత సంతోషంగా ఉండాలి. సర్వీసు చేస్తూ చేస్తూ రావాలి. బాబా సాగరులు. పిల్లలు అనుసరిస్తున్నారా అని చూస్తారు. మీలో జ్ఞాన అలలు లేచినప్పుడు చూసి సంతోషిస్తారు. ఇతను చాలా మంచి సుపుత్రుడు అని భావిస్తారు. ఉదయపు స్మృతి యాత్రలో చాలా లాభముంది. కేవలం ఉదయమే స్మృతి చేయాలని కూడా కాదు. కూర్చుంటూ, లేస్తూ, తింటూ, త్రాగుతూ స్మృతి చేస్తూ సర్వీసు చేశారు అంటే మీరు యాత్రలో ఉన్నట్లే. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఎవరి మనసుకూ దు:ఖమును ఇవ్వరాదు. ఆంతరికములో ఏవైనా భూతాలున్నట్లయితే వాటిని చెక్ చేసుకొని తొలగించుకోవాలి. పుష్పాలుగా అయ్యి సర్వులకు సుఖాన్నివ్వాలి.
2. మనము జ్ఞానసాగరుని సంతానము కనుక ఆంతరికముగా జ్ఞాన అలలు సదా లేస్తూ ఉండాలి. సర్వీసు చేసేందుకు యుక్తులు రచించాలి. రైలులో కూడా సర్వీసు చేయాలి. దానితో పాటు పావనులుగా అయ్యేందుకు స్మృతి యాత్రలో కూడా ఉండాలి.
వరదానము :-
''యోగబలము ద్వారా మాయ శక్తి పై విజయం ప్రాప్తి చేసుకునే సదా విజయీ భవ''
జ్ఞాన-యోగాల బలము అన్నిటికంటే శ్రేష్ఠమైన బలము. ఎలాగైతే సైన్సు బలము అంధకారము పై విజయం ప్రాప్తి చేసుకొని ప్రకాశవంతంగా చేస్తుందో, అలా యోగబలము సదా కొరకు మాయ పై విజయం ప్రాప్తి చేయించి విజయులుగా చేస్తుంది. యోగబలము ఎంత శ్రేష్ఠమైన బలమంటే దాని ముందు మాయ శక్తి ఏమీ చేయలేదు. యోగబలము కలిగిన ఆత్మలు స్వప్నములో కూడా మాయతో ఓడిపోజాలరు. స్వప్నములో కూడా వారి వద్దకు ఏ బలహీనత రాజాలదు. ఇటువంటి విజయ తిలకము మీ మస్తకము పై దిద్దబడి ఉంది.
స్లోగన్ :-
''నంబరువన్లోకి రావాలంటే వ్యర్థాన్ని సమర్థములోకి పరివర్తన చేయండి.''