08-04-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - ఈ సంగమ యుగము ఉత్తమోత్తంగా తయారయ్యే యుగము. ఇందులోనే మీరు పతితుల నుండి పావనంగా అయ్యి పావన ప్రపంచాన్నితయారు చేయాలి''

ప్రశ్న :-

అంతిమ దు:ఖ భరిత భయంకర దృశ్యాలను చూచేందుకు దృఢత్వము(శక్తి) ఏ ఆధారంతో వస్తుంది?

జవాబు :-

శరీర భావమును తొలగిస్తూ(వదులుతూ) వెళ్లండి. అంతిమ దృశ్యము చాలా కఠినంగా ఉంటుంది. తండ్రి పిల్లలను శక్తిశాలిగా చేసేందుకు అశరీరులుగా అయ్యే సూచననిస్తారు. ఎలాగైతే తండ్రి ఈ శరీరము నుండి భిన్నమై మీకు నేర్పిస్తారో, అలాగే పిల్లలైన మీరు కూడా స్వయాన్ని శరీరము నుండి వేరుగా భావించండి. అశరీరులుగా అయ్యే అభ్యాసము చేయండి. ఇప్పుడు ఇంటికి వెళ్లాలని బుద్ధిలో ఉండాలి.

ఓంశాంతి.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు శరీరముతో ఉన్నారు. తండ్రి కూడా ఇప్పుడు శరీరముతో ఉన్నారు. ఈ గుఱ్ఱము లేక వాహనము పై సవారి అయ్యి ఉండి పిల్లలకు ఏం నేర్పిస్తారు? జీవించి ఉండి మరణించడం ఎలాగో తండ్రి తప్ప మరెవ్వరూ నేర్పించలేరు. తండ్రి పరిచయము పిల్లలందరికీ లభించింది. వారు జ్ఞానసాగరులు, పతితపావనులు. జ్ఞానము ద్వారానే మీరు పతితుల నుండి పావనంగా అవుతారు అంతేకాక పావన ప్రపంచాన్ని కూడా తయారు చేయాలి. డ్రామా ప్లాను అనుసారము ఈ పతిత ప్రపంచము వినాశనమవుతుంది. ఎవరైతే తండ్రిని గుర్తించి బ్రాహ్మణులుగా అవుతారో, వారు మాత్రమే మళ్లీ పావన ప్రపంచములోకి వచ్చి రాజ్యము చేస్తారు. పవిత్రంగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా కూడా తప్పకుండా అవ్వాలి. ఈ సంగమ యుగము పురుషోత్తములుగా అంటే ఉత్తమోత్తమ పురుషులుగా అయ్యే యుగము. అనేకమంది సాధువులు, సంత్‌ మహాత్ములు, మంత్రులు, ధనవంతులు, అధ్యక్షుడు మొదలైనవారిని ఉత్తములని అంటారు. కానీ వారు ఉత్తములు కారు. ఇది కలియుగీ భ్రష్ఠాచార ప్రపంచము, పాత ప్రపంచము. పతిత ప్రపంచములో పావనంగా ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు మీరు సంగమయుగ వాసులుగా అవుతారు. వారు నీటిని పతితపావని అని భావిస్తారు. కేవలం గంగా నది ఒక్కటే కాదు, ఎక్కడెక్కడ నదులున్నాయో ఎక్కడెక్కడ నీటిని చూస్తారో, నీరు పావనంగా చేస్తుందని భావిస్తారు. ఇది బుద్ధిలో కూర్చుని ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క చోటికి వెళ్తారు అంటే నీటిలో స్నానము చేసేందుకే వెళ్తారు. కానీ నీటి ద్వారా ఎవ్వరూ పావనంగా అవ్వలేరు. ఒకవేళ నీటిలో స్నానము చేయుట వలన పావనంగా అయితే ఈ సమయములో పూర్తి సృష్టి అంతా పావనంగా ఉండేది. అందరూ పావన ప్రపంచములో ఉండాల్సినవారు. ఈ పాత అలవాటు నడుస్తూ ఉంది. సాగరములో కూడా మలినమంతా వెళ్లి కలుస్తుంది. మరి అదెలా పావనంగా చేస్తుంది? పావనంగా అవ్వాల్సింది ఆత్మ. ఆత్మలను పావనంగా చేసేందుకు పరమపిత కావాలి. కావున పావనులు సత్యయుగములో, పతితులు కలియుగములో ఉంటారని మీరు అర్థం చేయించాలి. ఇప్పుడు మీరు సంగమ యుగములో ఉన్నారు. పతితుల నుండి పావనంగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. శూద్ర కులములో ఉండిన మనము ఇప్పుడు బ్రాహ్మణ వర్ణము వారిగా అయ్యామని మీకు తెలుసు. శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా తయారు చేస్తారు. మనము సత్య-సత్యమైన ముఖవంశావళి బ్రాహ్మణులము. వారు కుఖవంశావళి(గర్భజనితులు). ప్రజాపిత అంటే అందరూ ప్రజలే. ప్రజలకు పిత బ్రహ్మ. వారు గ్రేట్‌ గ్రేట్‌ గ్రాండ్‌ఫాదర్‌. తప్పకుండా అతడు ఒకప్పుడు ఇక్కడ ఉండేవాడు, తర్వాత ఎక్కడకు వెళ్ళాడు? పునర్జన్మ తీసుకుంటాడు కదా. బ్రహ్మ కూడా పునర్జన్మ తీసుకుంటాడని పిల్లలకు అర్థం చేయించబడింది. బ్రహ్మ-సరస్వతులు, తల్లి-తండ్రి. వారే తర్వాత మహారాజ-మహారాణి లక్ష్మీనారాయణులుగా అవుతారు, వారినే విష్ణువు అని అంటారు. వారే మళ్లీ 84 జన్మల తర్వాత బ్రహ్మ-సరస్వతులుగా అవుతారు. ఈ రహస్యము అర్థము చేయించబడింది. జగదంబ అంటే సంపూర్ణ జగత్తుకు తల్లి. ప్రతి ఒక్కరికి లౌకిక తల్లులు తమ-తమ ఇండ్లలో ఉన్నారు. కానీ జగదంబ గురించి ఎవ్వరికీ తెలియదు. అంధశ్రద్ధతో అలాగే చెప్తూ ఉంటారు. ఎవ్వరికీ తెలియదు. ఎవరిని పూజిస్తున్నారో వారి కర్తవ్యమే తెలియదు. రచయిత శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇది ఉల్టా(తలక్రిందుల) వృక్షము. దీని బీజరూపము పైన ఉన్నారు. మిమ్ములను పావనంగా చేసేందుకు తండ్రి పై నుండి క్రిందకు రావలసి వచ్చింది. బాబా వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. మనకు ఈ సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానమునిచ్చి మళ్లీ ఆ నూతన సృష్టికి చక్రవర్తి రాజా - రాణులుగా చేస్తారు. ఈ చక్ర రహస్యము ప్రపంచములో మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు - 5 వేల సంవత్సరాల తర్వాత మళ్లీ వచ్చి మీకు వినిపిస్తాను. ఇది తయారైన డ్రామా. డ్రామా దర్శకుడు, రచయిత, ముఖ్యపాత్రధారి మరియు డ్రామా ఆదిమధ్యాంతాలను తెలుసుకోలేదంటే వారిని బుద్ధిహీనులని అంటారు కదా. తండ్రి చెప్తున్నారు - 5 వేల సంవత్సరాల క్రితము కూడా మీకు నేను అర్థం చేయించాను. ఇప్పుడు ఇచ్చినట్లే మీకు నా పరిచయమునిచ్చాను. ఇప్పటి వలె అప్పుడు మిమ్ములను పవిత్రంగా కూడా చేశాను. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. వారే సర్వశక్తివంతులు, పతితపావనులు. చివరికాలములో ఎవరు ఎవరిని స్మరిస్తారో,.................. అని గాయనముంది. అంటే క్షణ-క్షణము అటువంటి యోనులలోకి వెళ్లి జన్మిస్తారు. ఇప్పుడు మీరు జన్మ తీసుకుంటారు కానీ పంది, కుక్క, పిల్లిగా అవ్వరు.

ఇప్పుడు అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు. వారు చెప్తున్నారు - నేను మీ ఆత్మలందరి తండ్రిని. వీరంతా కామచితి పై కూర్చుని నల్లగా అయిపోయారు. వీరిని మళ్లీ జ్ఞానచితి పై కూర్చోబెట్టాలి. మీరు ఇప్పుడు జ్ఞానచితి పై కూర్చున్నారు. జ్ఞానచితి పై కూర్చున్న తర్వాత మళ్లీ వికారాలలోకి వెళ్ళరాదు. మేము పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తారు. బాబా ఆ లౌకిక రాఖీని కట్టించరు. భక్తిమార్గపు అలవాటు కొనసాగుతూ ఉంది. వాస్తవానికిది ఈ సమయములోని విషయము. పవిత్రంగా అవ్వకుండా పావన ప్రపంచానికి అధికారులుగా ఎలా అవుతాము? అలా కాజాలరని మీరు అర్థం చేసుకున్నారు. అయినా పక్కా చేయించేందుకు పిల్లలతో ప్రతిజ్ఞ చేయిస్తారు. కొందరు రక్తముతో వ్రాసి ఇస్తారు. కొందరు ఇంకెలాగో వ్రాస్తారు. ''బాబా మీరు వచ్చారు. మేము మీ నుండి వారసత్వము తప్పకుండా తీసుకుంటాము అని వ్రాసి ఇస్తారు. నిరాకారులు సాకారములో వస్తారు కదా. ఎలాగైతే తండ్రి పరంధామము నుండి అవతరిస్తారో అలాగే ఆత్మలైన మీరు కూడా అవతరిస్తారు. పై నుండి క్రిందకు పాత్రను అభినయించేందుకు వస్తారు. ఇది సుఖ-దు:ఖముల ఆట అని మీకు తెలుసు. అర్ధకల్పము సుఖము, అర్ధకల్పము దు:ఖము. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు 3/4 భాగము కంటే ఎక్కువ సుఖమును అనుభవిస్తారు. అర్ధకల్పము తర్వాత కూడా మీరు ధనవంతులుగా ఉండేవారు. ఎంత పెద్ద పెద్ద మందిరాలను నిర్మిస్తారు. పూర్తి తమోప్రధాన భక్తి అయినప్పుడు చివరిలో దు:ఖము కలుగుతుంది. మొట్టమొదట మీరు అవ్యభిచారి భక్తులుగా ఉండేవారని, ఒక్కరిని మాత్రమే భక్తి చేసేవారని తండ్రి అర్థం చేయించారు. ఏ తండ్రి మిమ్ములను సుఖధామానికి తీసుకెళ్తారో, దేవతలుగా తయారు చేస్తారో వారిని మాత్రమే మీరు పూజించేవారు. తర్వాత మళ్లీ వ్యభిచారి భక్తి ప్రారంభమవుతుంది. మొదట ఒక్కరి పూజే నడిచేది తర్వాత దేవతలను పూజించేవారు. ఇప్పుడైతే పంచ భూతాలతో తయారైన శరీరాలను పూజిస్తారు. చైతన్యాన్ని పూజిస్తారు, జడమును కూడా పూజిస్తారు. పంచ తత్వాలతో తయారు చేయబడిన శరీరమును దేవతల కంటే శ్రేష్ఠంగా భావిస్తారు. దేవతా మూర్తులను కేవలం బ్రాహ్మణులు మాత్రమే స్పర్శిస్తారు. మీకు అనేకమంది గురువులున్నారు. ఇది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. నేను కూడా ఇవన్నీ చేశానని ఈ దాదా(బ్రహ్మ) చెప్తున్నారు. భిన్న-భిన్న హఠయోగాలు మొదలైనవి, చెవులు-ముక్కు వంచడం(పట్టుకోవడం) మొదలైనవన్నీ చేశాను. చివరికి అంతా వదలవలసి వచ్చింది. ఆ వ్యాపారము చేయాలా లేక ఈ వ్యాపారము చేయాలా? అలసట మొదలైనవి కలుగుతూ ఉండేవి, కలత చెందేవాడిని. ప్రాణాయామము మొదలైనవి నేర్చుకోవడంలో చాలా శ్రమ అనిపించేది. అర్ధకల్పము భక్తిమార్గములో ఉండేవారము. కానీ ఇప్పుడే తెలిసింది. తండ్రి పూర్తి ఖచ్ఛితంగా తెలియచేస్తున్నారు. వారు భక్తి పరంపరగా కొనసాగుతూ వస్తోందని అంటారు. ఇప్పుడు సత్యయుగములో భక్తి ఎక్కడ నుండి వచ్చింది? మనుష్యులు ఏమీ అర్థము చేసుకోరు. మూఢమతులు కదా. సత్యయుగములో అయితే ఇలా అనరు. నేను ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వస్తానని తండ్రి చెప్తున్నారు. తన జన్మల గురించి తెలియనివారి శరీరమును తీసుకుంటాను. ఇతడే నంబర్‌వన్‌ సుందరంగా ఉండేవాడు. అతడే ఇప్పుడు శ్యామంగా అయిపోయాడు. ఆత్మ భిన్న-భిన్న శరీరాలను ధారణ చేస్తుంది. కనుక తండ్రి చెప్తున్నారు - ఎవరిలో నేను ప్రవేశించానో, ఆ శరీరములో నేనిప్పుడు కూర్చుని ఉన్నాను. ఏమి నేర్పించేందుకు? జీవించి ఉండి మరణించడం. ఈ ప్రపంచము నుండి మరణించవలసిందే కదా. ఇప్పుడు మీరు పవిత్రంగా అయ్యి మరణించాలి. పావనంగా చేయడమే నా పాత్ర. ఓ పతితపావనా! అని భారతవాసులైన మీరు మాత్రమే పిలుస్తారు. ఇంకెవ్వరూ అలా పిలువరు. ''ఓ ముక్తిదాతా, దు:ఖ ప్రపంచము నుండి రక్షించేందుకు రండి'' అని అందరూ ముక్తిధామానికి వెళ్లేందుకే శ్రమ చేస్తారు. పిల్లలైన మీరు సుఖధామము కొరకు పురుషార్థము చేస్తారు. అది ప్రవృత్తిమార్గము వారి కొరకు. మనము ప్రవృత్తి మార్గము వారిగా, పవిత్రంగా ఉండేవారమని, తర్వాత అపవిత్రంగా అయ్యామని మీకు తెలుసు. ప్రవృత్తి మార్గము వారి పని నివృత్తి మార్గము వారు చేయలేరు. యజ్ఞ, జప, తపము, దానము మొదలైనవన్నీ ప్రవృత్తి మార్గమువారు చేస్తారు. ఇప్పుడు మేము వీటన్నింటినీ తెలుసుకున్నామని అనుభవము చేస్తున్నారు. శివబాబా మనలను ఇంటిలో కూర్చోబెట్టి చదివిస్తున్నారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖమునిచ్చేవారు. మీరు చాలాకాలము తర్వాత వారిని కలుస్తున్నందున ప్రేమ బాష్పాలు వస్తాయి. బాబా అనగానే రోమాంచితమైపోతుంది. ఓహో! పిల్లలైన మాకు సేవ చేసేందుకు తండ్రి వచ్చారు. బాబా ఈ చదువు ద్వారా మనలను పుష్పాలుగా తయారుచేసి తీసుకెళ్తారు. ఈ చెడు అసహ్య ప్రపంచము నుండి మనలను వారి జతలో వాపస్‌ తీసుకెళ్తారు. మీరు వస్తే మేము మీ పై బలి అయిపోతామని భక్తిమార్గములో అనేవారు. మేము మీ వారిగానే అవుతాము, మాకు ఇతరులెవ్వరూ లేరు. నెంబరువారుగా ఉండనే ఉన్నారు. అందరికీ తమదే అయిన పాత్ర ఉంది. కొందరు స్వర్గ వారసత్వమును ఇచ్చే తండ్రిని చాలా ప్రేమిస్తారు. సత్యయుగములో విలపించే(ఏడ్చే) మాటే ఉండదు. ఇక్కడైతే ఎంతగా ఏడుస్తారు! స్వర్గములోకి వెళ్లిన తర్వాత ఎందుకు విలపించాలి. ఇంకా సంతోషంగా ఉండాలి కదా. అక్కడ ఇంకా సంతోషపు వాయిద్యాలను మ్రోగిస్తారు. తమోప్రధానమైన శరీరాన్ని సంతోషంగా వదిలేస్తారు. ఈ పద్ధతి కూడా ఇక్కడి నుండే ప్రారంభమౌతుంది. మేము మా ఇంటికి వెళ్లాలని మీరు అంటారు. అక్కడైతే పునర్జన్మ తీసుకోవాలని భావిస్తారు. కావున తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. భ్రమరి ఉదాహరణ కూడా మీదే. బ్రాహ్మణీలైన మీరు, పెంట పురుగులను తీసుకొచ్చి భూ-భూ చేస్తారు. ఈ శరీరాన్ని కూడా వదిలేయాలని, జీవించి ఉండి మరణించాలని తండ్రి మీకు చెప్తున్నారు. తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు మనము వాపస్‌ ఇంటికెళ్లాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. దేహాన్ని మర్చిపోండి. తండ్రి చాలా మధురమైనవారు. వారు చెప్తున్నారు - పిల్లలైన మిమ్ములను విశ్వాధికారులుగా చేసేందుకు వచ్చాను. ఇప్పుడు శాంతిధామము మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి. అల్ఫ్‌ మరియు బే. ఇది దు:ఖధామము. శాంతిధామము ఆత్మల ఇల్లు. మనము పాత్రాభినయము చేశాము. ఇప్పుడు మనము ఇంటికి వెళ్లాలి. అక్కడ ఈ అసహ్యమైన (ఛీ-ఛీ) శరీరము ఉండదు. ఇప్పుడు ఈ శరీరము పూర్తి శిథిలావస్థకు చేరుకున్నది. ఇప్పుడు తండ్రి మనకు సన్ముఖములో కూర్చుని సైగలతో నేర్పిస్తారు. నేను కూడా ఆత్మనే. మీరు కూడా ఆత్మలే. నేను శరీరము నుండి వేరై మీకు కూడా అదే నేర్పిస్తాను. మీరు కూడా మిమ్ములను శరీరము నుండి భిన్నంగా భావించండి. ఇప్పుడు ఇంటికెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఉండలేము. ఇప్పుడు వినాశనము అవ్వనున్నదని కూడా తెలుసు. భారతదేశములో రక్త నదులు ప్రవహిస్తాయి. తర్వాత భారతదేశములోనే పాల నదులు ప్రవహిస్తాయి. ఇక్కడ అన్ని ధర్మాల వారు కలిసే ఉన్నారు. అందరూ పరస్పరములో పోట్లాడుకుని మరణిస్తారు. ఇది అంతిమ సమయపు మృత్యువు. పాకిస్తాన్‌లో ఏమేమి జరిగేవి. చాలా భయంకరమైన దృశ్యములు. ఎవరైనా చూస్తే మూర్ఛితులైపోతారు. ఇప్పుడు బాబా మిమ్ములను శక్తిశాలిగా తయారు చేస్తున్నారు. శరీర భావమును కూడా తొలగిస్తున్నారు.

బాబా చూశారు - పిల్లలు స్మృతిలో ఉండరు. చాలా బలహీనంగా ఉన్న కారణంగా సేవ కూడా పెరగదు. పదే పదే వ్రాస్తుంటారు - బాబా స్మృతి మర్చిపోతున్నాము. బుద్ధి ఏకాగ్రము అవ్వడం లేదు. బాబా చెప్తున్నారు - యోగమనే పదమును వదిలేయండి. విశ్వచక్రవర్తి పదవిని ఇచ్చే తండ్రిని మీరు మర్చిపోతారు. ఇంతకు ముందు భక్తిలో బుద్ధి మరోవైపు వెళ్తే స్వయాన్ని గిల్లుకునేవారు. తండ్రి చెప్తున్నారు - మీరు ఆత్మలు అవినాశి. మీరు కేవలం పతితము మరియు పావనంగా అవుతారు. అంతేగాని ఆత్మ చిన్నది, పెద్దదిగా అవ్వదు. అచ్చా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. మీతో మీరే మాట్లాడుకోండి - ఓహో! మాకు సేవ చేసేందుకు బాబా వచ్చారు. వారు మనలను ఇంట్లో కూర్చోపెట్టి చదివిస్తున్నారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖమునిచ్చేవారు. వారితో మేమిప్పుడే కలిశాము. ఇలా ప్రీతితో 'బాబా' అనగానే సంతోషంతో ప్రేమబాష్పాలు రాలిపోవాలి, రోమాంచితమైపోవాలి.

2. ఇప్పుడు వాపస్‌ ఇంటికెళ్లాలి కనుక అందరి నుండి మమకారము తొలగించి జీవించి ఉండి మరణించాలి. ఈ దేహాన్ని కూడా మర్చిపోవాలి. దీని నుండి వేరుగా అయ్యే అభ్యాసము చేయాలి.

వరదానము :-

''కర్మల లెక్కాచారాన్ని అర్థము చేసుకొని మీ అచల స్థితిని తయారు చేసుకునే సహజయోగీ భవ ''

నడుస్తూ నడుస్తూ ఏదైనా కర్మల లెక్కాచారము మీ ముందుకు వస్తే అందులో మీ మనసు చలించరాదు. స్థితిని హెచ్చుతగ్గులు కానివ్వకండి. లెక్కాచారము అనుభవించ వలసి వచ్చినపుడు పరిశీలించి దానిని దూరము నుండే సమాప్తం చేసేయండి. ఇప్పుడు యోధులుగా అవ్వకండి. సర్వశక్తివంతుడైన తండ్రి జతలో ఉంటే మాయ కదిలించలేదు. కేవలం నిశ్చయమనే పునాదిని ఆచరణలోకి తీసుకురండి. సమయానికి ఉపయోగిస్తే సహజయోగులుగా అవుతారు. ఇప్పుడు నిరంతర యోగులుగా అవ్వండి. యుద్ధము చేసే యోధులుగా అవ్వకండి.

స్లోగన్‌ :-

''డబల్‌లైట్‌గా అవ్వాలంటే మీ సర్వ బాధ్యతల బరువును తండ్రి అధీనము చేయండి.''