20-02-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - మీ ఓటమి - గెలుపుల చరిత్రను గుర్తు తెచ్చుకోండి. ఇది సుఖ-దు:ఖాల ఆట, ఇందులో 3/4 భాగము సుఖముంది, 1/4 దు:ఖముంది. సమానంగా లేవు''
ప్రశ్న :-
ఈ బేహద్ నాటకము చాలా అద్భుతమైనది - ఎలా ?
జవాబు :-
ఈ అనంతమైన నాటకము ఎంత అద్భుతమంటే - ఇందులో ప్రతి సెకండు సృష్టిలో ఏది జరుగుతూ ఉందో అది మళ్లీ ఉన్నదున్నట్లు పునరావృతమవుతుంది. ఈ నాటకము పేను వలె నడుస్తూనే ఉంటుంది. టిక్ - టిక్ అని కదులుతూనే ఉంటుంది. ఒక టిక్ మరొక టిక్తో కలవదు. అందుకే ఇది చాలా అద్భుతమైన నాటకము. మనుష్యుల మంచి చెడు పాత్ర అంతా నిశ్చితమై ఉంది. ఈ విషయాన్ని కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు.
ఓంశాంతి.
ఓంశాంతి అర్థమును పిల్లలకు అర్థం చేయించబడినది - ఎందుకంటే ఇప్పుడు ఆత్మ - అభిమానులుగా అయినారు. నేను ఆత్మనని, ఆత్మ తన పరిచయమును ఇస్తుంది. ఆత్మ స్వధర్మము శాంతి. ఇప్పుడు ఆత్మలందరూ ఇంటికి వెళ్లే కార్యక్రమముంది. ఈ విధంగా ఇంటికి వెళ్లే కార్యక్రమాన్ని ఎవరు తయారు చేస్తారు? తప్పకుండా తండ్రియే తెలిపిస్తారు. ఓ ఆత్మలారా! ఇప్పుడు పురాతన ప్రపంచము సమాప్తమవ్వనున్నది. పాత్రధారులందరూ వచ్చేశారు. ఇక కొద్దిమంది ఆత్మలు మాత్రమే పైన మిగిలి ఉన్నాయి. ఇప్పుడు అందరూ వాపస్ వెళ్లాలి. మళ్లీ పాత్ర పునరావృతము చేయాలి. పిల్లలైన మీరు వాస్తవానికి ఆది సనాతన దేవీదేవతా ధర్మానికి చెందినవారు. మొట్టమొదట సత్యయుగములోకి వచ్చారు. తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు పరాయి రాజ్యములోకి వచ్చి పడ్డారు. ఇది కేవలం ఆత్మలైన మీకు మాత్రమే తెలుసు. ఇంకెవ్వరికీ తెలియదు. మీరు ఒకే తండ్రి పిల్లలు. అత్యంత మధురమైన పిల్లలకు తండ్రి చెప్తున్నారు - పిల్లలూ! మీరు ఇప్పుడు పరాయి రావణ రాజ్యములో వచ్చి పడ్డారు. మీ రాజ్య భాగ్యమును పోగొట్టుకొని కూర్చున్నారు. సత్యయుగములో దేవీదేవతా ధర్మము ఉండేది. అది గడిచి 5 వేల సంవత్సరాలు అయ్యింది. అర్ధకల్పము మీరు రాజ్యము చేశారు. ఎందుకంటే మెట్లు తప్పకుండా క్రిందికి దిగవలసిందే. సత్యయుగము నుండి త్రేతాలోకి తర్వాత ద్వాపర, కలియుగాలలోకి రావలసిందే. దీనిని మర్చిపోకండి. మీ ఓటమి-గెలుపుల చరిత్ర ఏదైతే ఉందో దానిని గుర్తు చేసుకోండి. మేము సత్యయుగములో సతోప్రధానంగా, సుఖధామవాసులుగా ఉండేవారమని పిల్లలు తెలుసుకున్నారు. తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ దు:ఖధామములోకి శిథిలావస్థలోనికి వచ్చి చేరుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆత్మలైన మీకు తండ్రి నుండి శ్రీమతము లభిస్తుంది. ఎందుకంటే ఆత్మ - పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు,.............. పిల్లలైన మీరు చాలాకాలం వేరుగా ఉన్నారు. మొట్టమొదట మీరు నా నుండి దూరమై సుఖపు పాత్రను అభినయిస్తూ వచ్చారు. తర్వాత మీ రాజ్య భాగ్యము దోచుకోబడింది. దు:ఖ పాత్రలోకి వచ్చేశారు. ఇప్పుడు పిల్లలైన మీరు మళ్లీ సుఖ-శాంతుల రాజ్యభాగ్యమును తీసుకోవాలి. విశ్వములో శాంతి ఏర్పడాలని ఆత్మలు అంటారు. ఈ సమయము తమోప్రధానంగా ఉన్నందున విశ్వములో అశాంతి ఉంది. ఇది కూడా శాంతి మరియు అశాంతి, దు:ఖము మరియు సుఖముల ఆట. 5 వేల సంవత్సరాల క్రితము విశ్వములో శాంతి ఉండేదని మీకు తెలుసు. మూలవతనము అయ్యిందే శాంతిధామము. ఎక్కడ ఆత్మలుంటాయో అక్కడ అశాంతి ప్రశ్నే లేదు. సత్యయుగములో విశ్వములో శాంతి ఉండేది. మళ్లీ క్రిందపడుతూ క్రిందపడుతూ అశాంతి అయిపోయింది. ఇప్పుడు విశ్వమంతటిలో అందరూ శాంతి కావాలని కోరుకుంటారు. బ్రహ్మ మహాతత్వాన్ని విశ్వమని అనరు. దానిని బ్రహ్మాండము అని అంటారు. అక్కడ ఆత్మలైన మీరు నివసిస్తారు. ఆత్మ స్వధర్మము శాంతి. శరీరము నుండి ఆత్మ వేరైనట్లయితే ఆత్మ శాంతమైపోతుంది. తర్వాత మరో శరీరాన్ని తీసుకున్నప్పుడు కదలిక కలుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? బాబా! మా శాంతిధామము, సుఖధామములోకి తీసుకెళ్లండి అని అంటారు. శాంతిధామము లేక ముక్తిధామములో సుఖ-దు:ఖాల పాత్ర ఉండదు. సత్యయుగము సుఖధామము, కలియుగము దు:ఖధామము ఏ విధంగా క్రిందకు దిగుతారో అది మెట్ల చిత్రములో చూపించారు. మీరు మెట్లు దిగుతారు. మళ్లీ ఒకేసారి ఎక్కుతారు. పావనంగా అయ్యి ఎక్కుతారు, పతితులుగా అయ్యి క్రిందకు దిగుతారు. పావనంగా అవ్వకుండా ఎక్కలేరు. అందువల్లనే బాబా! వచ్చి మమ్ములను పావనంగా చేయండి అని పిలుస్తారు.
మీరు మొదట పావన శాంతిధామములోకి వెళ్లి తర్వాత సుఖధామములోకి వస్తారు. మొదట సుఖము, తర్వాత దు:ఖము ఉంటుంది. సుఖపు మార్జిను ఎక్కువగా ఉంటుంది. సమానంగా ఉంటే అందులో లాభమేముంది? అది వ్యర్థమైపోతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ డ్రామా ఏదైతే తయారుచేయబడి ఉందో అందులో 3/4 వంతు సుఖము, మిగిలిన 1/4 వంతు ఎంతో కొంత దు:ఖము ఉంటుంది. అందువల్లనే దీనిని సుఖ-దు:ఖాల ఆట అని అంటారు. తండ్రినైన నన్ను ఆత్మలైన మీరు తప్ప ఇంకెవ్వరూ తెలుసుకోలేరని తండ్రికి తెలుసు. నేనే మీకు నా పరిచయాన్ని ఇచ్చాను అంతేకాక సృష్టి ఆది-మధ్య-అంత్యముల పరిచయాన్ని కూడా ఇచ్చాను. మిమ్ములను నాస్తికుల నుండి ఆస్తికులుగా చేశాను. మూడు లోకాలను గురించి కూడా మీరు తెలుసుకున్నారు. భారతవాసులకు కల్పము ఆయువును గురించి కూడా తెలియదు. బాబా మనలను మళ్లీ చదివిస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి గుప్త వేషములో పరాయి దేశములో వచ్చారు. బాబా కూడా గుప్తమే. మనుష్యులకు తమ దేహమును గురించి తెలుసే కాని ఆత్మను గురించి తెలియదు. ఆత్మ అవినాశి. దేహము వినాశి. ఆత్మను ఆత్మల తండ్రిని మీరు ఎప్పుడూ మర్చిపోరాదు. మనము అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. పవిత్రంగా అయినప్పుడే ఆస్తి లభిస్తుంది. ఈ రావణ రాజ్యములో మీరు పతితమైపోయారు కనుకనే తండ్రిని పిలుస్తారు. ఇద్దరు తండ్రులున్నారు. పరమపిత పరమాత్మ ఆత్మలందరికీ ఒకే తండ్రి. సోదరులందరూ తండ్రులు కారు. భారతదేశములో ఎప్పుడెప్పుడు ధర్మగ్లాని జరుగుతుందో అప్పుడు సర్వ ధర్మాల పారలౌకిక తండ్రిని మర్చిపోతారు. అప్పుడే తండ్రి వస్తారు. ఇది కూడా ఆట. ఏమైతే జరుగుతుందో, ఆట పునరావృతమవుతూ ఉంటుంది. ఆత్మలైన మీరు ఎన్నోసార్లు పాత్రను అభినయించేందుకు వస్తారు మళ్లీ పోతారు. ఈ నాటకము అనాదిగా పేనులాగా నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడూ సమాప్తమవ్వదు. టిక్-టిక్ అని కదులుతూనే ఉంటుంది. కాని ఒక టిక్ మరొక టిక్తో కలవదు. ఇది ఎలాంటి అద్భుతమైన నాటకము! సెకండు సెకండు ఏది సృష్టిలో జరుగుతూ ఉందో, అది మళ్లీ పునరావృతమవుతుంది. ప్రతి ధర్మములో ముఖ్య పాత్రధారి ఎవరుంటారో, వారు ఆ ధర్మమును గురించి చెప్తారు. వారంతా తమ-తమ ధర్మ స్థాపన చేస్తారే కాని రాజధానిని స్థాపన చేయరు. ఒక్క పరమపిత పరమాత్మయే ధర్మమును మరియు రాజ్యమును కూడా స్థాపన చేస్తారు. అనగా రాజ్య వంశమును స్థాపన చేస్తారు. మిగిలిన ధర్మ స్థాపన చేస్తారు. వారి వెనుక అందరూ రావలసిందే. అందరినీ ఎవరు తీసుకెళ్తారు? తండ్రి. కొందరేమో చాలా తక్కువ పాత్రను అభినయిస్తారు తర్వాత వారి పాత్ర సమాప్తమైపోతుంది. అదెలా ఉంటుందంటే క్రిమికీటకాలు(వర్షాకాలంలో లైటు వద్దకు వచ్చే రెక్కల పురుగులు) వెలువడ్తాయి మళ్లీ మరణిస్తాయి కదా. వాటి గురించి నాటకములో లేనట్లుగానే ఉంటుంది. గమనము ఎటువైపు వెళ్తుంది? ఒకటేమో క్రియేటర్ వైపు వెళ్తుంది, వారిని ఓ గాడ్ఫాదర్! ఓ పరమపిత పరమాత్మా! అని అందరూ పిలుస్తారు. వారు ఆత్మలందరి తండ్రి. మొదట ఆదిసనాతన దేవీదేవతా ధర్మము ఉండేది. ఇది ఎంత పెద్ద అనంతమైన వృక్షము! ఎన్ని మతమతాంతరాలు. ఎన్నో వెరైటీ వస్తువులు వెలువడ్డాయి. లెక్కించడం చాలా కష్టము. పునాది లేనే లేదు. మిగిలినవన్నీ నిలిచి ఉన్నాయి. తండ్రి చెప్తున్నారు - అత్యంత మధురమైన పిల్లలూ! ఎప్పుడైతే అనేక ధర్మాలుండి, ఒక్క ధర్మము ఉండదో అప్పుడే నేను వస్తాను. పునాది ప్రాయ: లోపమైపోయింది. కేవలం చిత్రాలు మాత్రం నిలిచి ఉన్నాయి. ఆదిసనాతనంగా ఉండేది ఒకే ధర్మము. మిగిలినవన్నీ తర్వాత వస్తాయి. స్వర్గములో రాకుండా త్రేతాలో వచ్చేవారు కూడా చాలామంది ఉంటారు.
మేము స్వర్గములోకి అనగా నూతన ప్రపంచములో రావాలని ఇప్పుడు మీరు పురుషార్థము చేస్తారు. తండ్రి చెప్తున్నారు - మీరు నన్ను స్మృతి చేసి పావనంగా అయ్యి దైవీ గుణాలను ధారణ చేసినప్పుడే స్వర్గములోకి రాగలరు. మిగిలిన వృక్షపు కొమ్మ-రెమ్మలైతే అనేకమున్నాయి. ఆదిసనాతన దేవీ దేవతలమైన మనమంతా స్వర్గములో ఉండేవారమని పిల్లలకు వృక్షమును గురించి కూడా తెలిసింది. ఇప్పుడు ఆ స్వర్గము లేదు, నరకముంది. అందుకే తండ్రి ప్రశ్నావళిని తయారు చేయించారు. అదేమంటే మీరు మీ హృదయ పూర్వకంగా ప్రశ్నించుకోండి - మేము సత్యయుగీ స్వర్గవాసులమా లేక కలియుగ నరకవాసులమా? సత్యయుగము నుండి క్రిందకు కలియుగములోకి దిగుతారు, మళ్లీ పైకి ఎలా వెళ్తారు? అందుకు తండ్రి శిక్షణనిస్తారు. మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా ఎలా అవుతారు? స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేసినట్లయితే యోగాగ్ని ద్వారా మీ పాపాలు సమాప్తమైపోతాయి. కల్పక్రితము కూడా మీకు జ్ఞానమును నేర్పించి దేవతలుగా చేశాను. ఇప్పుడు మీరు తమోప్రధానంగా అయ్యారు. మళ్లీ తప్పకుండా ఎవరో ఒకరు సతోప్రధానంగా చేసేవారు కూడా ఉంటారు. మనుష్యులెవ్వరూ పతితపావనులుగా అవ్వలేరు. ఓ పతితపావనా, ఓ భగవంతుడా! అని ఎప్పుడైతే అంటారో అప్పుడు బుద్ధి పైకి వెళ్లిపోతుంది. వారు నిరాకారులు మిగిలినవారంతా పాత్రధారులు. అందరూ పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. నేను పునర్జన్మ రహితుడను. ఇది తయారైన నాటకము. దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. మీకు కూడా ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు మిమ్ములను స్వదర్శన చక్రధారులని అంటారు. మీరు మీ స్వ అనగా ఆత్మ ధర్మములో నిలవండి. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయము చేసుకోండి. ఈ సృష్టిచక్రము ఎలా తిరుగుతుందో తండ్రి అర్థం చేయిస్తున్నారు. అందుకే మీ పేరు స్వదర్శన చక్రధారి, ఇంకెవ్వరికీ ఈ జ్ఞానము లేదు. అందువల్ల మీకు చాలా ఖుషీ ఉండాలి. తండ్రి మనకు టీచరు కూడా అయినారు. చాలా మధురమైన తండ్రి కూడా అయినారు. బాబా వంటి మధురమైనవారు ఇంకొకరు లేరు. మీరు పారలౌకిక తండ్రికి పిల్లలు. పరలోకములో ఉండే ఆత్మలు. తండ్రి కూడా పరంధామములో ఉంటారు. లౌకిక తండ్రి పిల్లలకు జన్మనిచ్చి పాలన చేసి అతని సర్వస్వాన్ని ఇచ్చి వెళ్తారు ఎందుకంటే పిల్లలు తండ్రికి వారసులు. ఇది నియమము. మీరు ఏ బేహద్ తండ్రికి పిల్లలుగా అవుతారో ఆ తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు అందరూ వాపస్ వాణి నుండి అతీతంగా ఇంటికి వెళ్లాలి. అక్కడ సైలెన్స్ ఉంటుంది తర్వాత మూవీ, తర్వాత టాకీ. పుత్రికలు(బచ్చియా) సూక్ష్మవతనములోకి వెళ్తారు. వారికి సాక్షాత్కారమవుతుంది, ఆత్మ శరీరము నుండి వెలుపలికి వెళ్లదు. డ్రామాలో ఏది నిశ్చితమై ఉందో, అది సెకండు సెకండు పునరావృతమవుతుంది. ఒక్క సెకండు మరొక సెకండుతో కలవదు. మనుష్యుల మంచి-చెడు పాత్ర ఏదైతే నడుస్తుందో అదంతా నిశ్చితమై ఉంది. సత్యయుగములో మంచి పాత్రను, కలియుగములో చెడు పాత్రను అభినయిస్తుంది. కలియుగములో మనుష్యులు దు:ఖీలుగా అవుతారు. రామరాజ్యములో ఛీ-ఛీ విషయాలు ఉండవు. రామరాజ్యము మరియు రావణ రాజ్యము కలిసి ఉండవు. డ్రామాను తెలుసుకోని కారణంగా సుఖ-దు:ఖాలను పరమాత్మయే ఇస్తారని అంటారు. శివబాబాను గురించి ఎలాగైతే ఎవ్వరికీ తెలియదో, అలాగే రావణుని గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. శివజయంతి ప్రతి సంవత్సరము జరుపుకుంటారు. అలాగే రావణుని మరంతి(మరణము)ని కూడా ప్రతి సంవత్సరము జరుపుకుంటారు. ఇప్పుడు అనంతమైన తండ్రి తన పరిచయాన్ని ఇచ్చి - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు. తండ్రి అయితే చాలా మధురమైనవారు బాబా కూర్చుని తన మహిమనేమీ చేసుకోరు. ఎవరికి సుఖము లభిస్తుందో, వారు మహిమ చేస్తారు.
పిల్లలైన మీకు తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. తండ్రి ప్రేమసాగరుడు. తర్వాత సత్యయుగములో మీరు ప్రియమైనవారిగా, మధురంగా అవుతారు. అక్కడ కూడా వికారాలు ఉండేవని ఎవరైనా అన్నారనుకోండి, అక్కడ రావణరాజ్యమే ఉండదని వారికి చెప్పండి. రావణ రాజ్యము ద్వాపర యుగము నుండి ప్రారంభమవుతుంది. తండ్రి ఎంత బాగా అర్థము చేయిస్తారు! ప్రపంచ చరిత్ర-భూగోళములను గురించి ఇంకెవ్వరికీ తెలియదు. బాబా ఈ సమయములోనే మీకు కూడా అర్థము చేయిస్తారు. తర్వాత మీరు దేవతలుగా అవుతారు. దేవతల కంటే ఉన్నతమైనవారు ఇంకెవ్వరూ లేరు. అందుకే అక్కడ గురువులను ఆశ్రయించే అవసరము లేదు. ఇక్కడైతే లెక్కలేనంతమంది గురువులున్నారు. సద్గురువు ఒక్కరే. సిక్కు ధర్మస్థులు కూడా సద్గురు అకాల్ అని అంటారు. ఆ అకాలమూర్తి సద్గురువు. వారు కాలునికి కూడా మహాకాలుడు. ఆ కాలుడైతే(మృత్యువు) ఒక్కరిని తీసుకెళ్తాడు. తండ్రి చెప్తున్నారు - నేను అందరినీ తీసుకెళ్తాను. పవిత్రంగా చేసి మొదట అందరినీ శాంతిధామానికి తర్వాత సుఖధామానికి తీసుెళ్తాను. ఒకవేళ నా వారుగా అయ్యి మళ్లీ మాయకు చెందినవారిగా అయ్యారంటే - గురువుకు నింద కలుగజేసినవారికి ఎక్కడా స్థానము లభించదని అంటారు. అటువంటివారు స్వర్గములో సంపూర్ణ సుఖమును పొందలేరు. ప్రజలలోకిి వెళ్లిపోతారు. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ! నన్ను నిందింపజేయకండి. నేను మిమ్ములను స్వర్గానికి యజమానులుగా చేస్తాను కనుక మీరు దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. ఎవ్వరికీ దు:ఖమును ఇవ్వరాదు. తండ్రి చెప్తున్నారు - నేను మిమ్ములను సుఖధామానికి యజమానులుగా చేసేందుకే వచ్చాను. తండ్రి ప్రేమసాగరులు, మనుష్యులు దు:ఖము ఇవ్వడంలో సాగరులు. కామ ఖడ్గము నడిపించి ఒకరికొకరు దు:ఖమునిచ్చుకుంటారు. అక్కడైతే ఈ విషయాలే ఉండవు. అక్కడ ఉండేదే రామరాజ్యము. అక్కడ పిల్లలు యోగబలముతో జన్మిస్తారు. ఈ యోగబలము ద్వారా మీరు విశ్వమంతటిని పవిత్రంగా చేస్తారు. మీరు యోధులు కాని గుప్తమైనవారు. మీరు చాలా ప్రసిద్ధమవుతారు. తర్వాత భక్తిమార్గములో దేవీలైన మీకు ఎన్ని మందిరాలు నిర్మిస్తారు! అమృత కలశాన్ని మాతల శిరస్సు పై ఉంచారని చెప్తారు. గోమాత అని చెప్తారు కదా. ఇది జ్ఞానము. నీటి విషయమే లేదు. మీరు శివశక్తి సేన. వారు మిమ్ములను కాపీ చేసి గురువులై కూర్చున్నారు. ఇప్పుడు మీరు సత్యమైన నావలో కూర్చుని ఉన్నారు. నా నావను తీరానికి చేర్చమని పాడ్తారు. ఇప్పుడు ఆ తీరానికి తీసుకెళ్లేందుకు నావికుడు లభించాడు. వారు వేశ్యాలయము నుండి శివాలయానికి తీసుకెళ్తారు. వారిని తోటమాలి అని కూడా అంటారు. వారు ముళ్ల అడవిని పుష్పాల తోటగా తయారుచేస్తారు. అక్కడ సుఖమే సుఖము ఉంటుంది. ఇక్కడ దు:ఖముంటుంది. బాబా ఏ ప్యాంప్లెట్లు(కరపత్రాలను) ముద్రించమని చెప్పారో అందులో - హృదయపూర్వకంగా మేము స్వర్గవాసులమా లేక నరకవాసులమా? అని ప్రశ్నించుకోమని వ్రాయండి. చాలా ప్రశ్నలు అడగవచ్చు. భ్రష్టాచారముందని అందరూ అంటారు. తప్పకుండా ఏదో ఒక సమయములో శ్రేష్ఠాచారము కూడా ఉండి ఉంటుంది కదా. అప్పుడు దేవతలుండేవారు. ఇప్పుడు లేరు. దేవీ దేవతా ధర్మము ప్రాయ: లోపమైనప్పుడు భగవంతుడు ఒకే ధర్మాన్ని స్థాపన చేసేందుకు రావలసి పడ్తుంది. అనగా మీరు మీ కొరకు శ్రీమతానుసారము స్వర్గ స్థాపన చేస్తున్నారు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి సమానము ప్రేమ సాగరులుగా అవ్వాలి. దు:ఖ సాగరులుగా అవ్వరాదు. తండ్రిని నింద చేయించు ఏ కర్మలూ చేయరాదు. చాలా మధురంగా, ప్రియంగా అవ్వాలి.
2. యోగబలముతో పవిత్రంగా అయ్యి మళ్లీ ఇతరులను కూడా పవిత్రంగా తయారుచేయాలి. ముళ్ల అడవిని పుష్పాలతోటగా చేయు సేవ చేయాలి. మా మధురమైన బాబా మాకు తండ్రే కాక టీచరు కూడా అయ్యారని, వారి వంటి మధురమైనవారు ఇంకెవ్వరూ లేరని సదా సంతోషంగా ఉండాలి.
వరదానము :-
''విశేషతల సంస్కారాలను సహజ స్వభావంగా చేసుకొని సాధారణతను సమాప్తం చేసే మరజీవా భవ ''
ఏ స్వభావమైనా అది స్వతహాగా తన పని చేస్తుంది. ఆలోచించడం, తయారుచేయాల్సిన లేక చేసే పని ఉండదు. స్వతహాగా అయిపోతుంది. ఇలా మరజీవా జన్మధారీ బ్రాహ్మణుల స్వభావమే విశేష ఆత్మ యొక్క విశేషతల స్వభావము. ఈ విశేషతా సంస్కారము సహజ స్వభావంగా (న్యాచురల్ నేచర్గా) అయిపోవాలి. ప్రతి ఒక్కరి హృదయము నుండి ఇది నా నేచర్(స్వభావము) అని వెలువడాలి. 'సాధారణత' భూతకాలములోని(పాస్ట్) నేచర్. ఇప్పటి నేచర్ కాదు. ఎందుకంటే నూతన జన్మ తీసుకున్నారు. కనుక నూతన జన్మ యొక్క నేచర్ 'విశేషత', 'సాధారణత' కాదు.
స్లోగన్ :-
''ఎవరైతే సదా రాళ్లతో కాక జ్ఞానరత్నాలతో ఆడుకుంటారో, వారే రాయల్ ఆత్మలు.''