07-04-2019 అవ్యక్త బాప్దాదా ఓంశాంతి రివైజ్: 29-04-1984 మధువనము
''జ్ఞాన సూర్యుని ఆత్మిక నక్షత్రాల భిన్న - భిన్న విశేషతలు''
ఈ రోజు జ్ఞానసూర్యుడు, జ్ఞానచంద్రుడు(శివబాబా, బ్రహ్మబాబా లేక బాప్దాదా) తమ వెరైటీ నక్షత్రాలను చూస్తున్నారు. కొంతమంది స్నేహీ నక్షత్రాలుగా ఉన్నారు, కొంతమంది విశేష సహయోగీ నక్షత్రాలుగా ఉన్నారు. కొంతమంది సహజయోగి నక్షత్రాలుగా ఉన్నారు, కొంతమంది శ్రేష్ఠమైన జ్ఞానీ నక్షత్రాలుగా ఉన్నారు, కొంతమంది విశేష సేవ చేయాలనే ఉత్సాహం కలిగిన నక్షత్రాలుగా ఉన్నారు. కొంతమంది శ్రమ చేసి ఫలం తినే నక్షత్రాలుగా ఉన్నారు, కొంతమంది సహజంగా సఫలత పొందే నక్షత్రాలుగా ఉన్నారు. ఇలా అందరూ భిన్న భిన్న విశేషతలు గల నక్షత్రాలుగా ఉన్నారు. జ్ఞానసూర్యుని ద్వారా అన్ని నక్షత్రాలకు ఆత్మిక ప్రకాశం లభించిన కారణంగా అందరూ మెరిసే నక్షత్రాలుగా అయితే అయ్యారు. కానీ ఒక్కొక్క రకం నక్షత్రాల విశేషతల మెరుపు వేరు వేరుగా ఉంది. ఎలాగైతే స్థూల నక్షత్రాలు రకరకాల గ్రహాల రూపంలో భిన్న భిన్న ఫలాలను అల్పకాలం కొరకు ప్రాప్తి చేయిస్తాయో, అలా జ్ఞానసూర్యుని ఆత్మిక నక్షత్రాలకు కూడా సర్వ ఆత్మలతో అవినాశి ప్రాప్తుల సంబంధం ఉంది. ఎలాగైతే స్వయం మీరు ఏ విశేషతతో సంపన్న నక్షత్రంగా ఉన్నారో, అలా ఇతరులకు కూడా దాని ప్రమాణంగానే ఫలాన్ని ప్రాప్తి చేయించేందుకు నిమిత్తంగా అవుతారు. స్వయం మీరు జ్ఞానచంద్రుడు లేక జ్ఞానసూర్యునికి ఎంత సమీపంగా ఉంటారో, ఇతరులకు కూడా అంత సమీప సంబంధంలోకి తీసుకొస్తారు. అనగా జ్ఞానసూర్యుని ద్వారా లభించిన విశేషతల ఆధారంతో, ఇతరులను డైరెక్టు విశేషతల శక్తి ఆధారంతో ఎంత సమీపంగా తెస్తారంటే వారికి జ్ఞానసూర్యుడు, జ్ఞానచంద్రునితో డైరెక్టు సంబంధము ఏర్పడ్తుంది. మీరు అలాంటి శక్తిశాలి నక్షత్రాలుగా ఉన్నారు కదా! ఒకవేళ స్వయం మీరే శక్తిశాలిగా, సమీపంగా లేనట్లయితే డైరెక్ట్ సంబంధం(కనెక్షన్) జోడించలేరు. దూరంగా ఉన్న కారణంగా ఆ నక్షత్రాల విశేషత అనుసారంగా వారి ద్వారా ఎంత శక్తిని, సంబంధ సంపర్కాన్ని ప్రాప్తి చేసుకోగలరో అంతే యథాశక్తిగా ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు. డైరెక్ట్గా శక్తిని తీసుకునే శక్తి ఉండదు. అందువలన జ్ఞానసూర్యుడు ఎలా ఉన్నతోన్నతమైనవారో, విశేష నక్షత్రాలు ఉన్నతంగా ఉన్నారో అలాంటి ఉన్నత స్థితిని అనుభవం చేసుకోలేరు. యథా శక్తి, యథా ప్రాప్తి చేసుకుంటారు. ఎలాంటి శక్తిశాలి స్థితి ఉండాలో అలాంటి అనుభవం చేయరు.
ఇలాంటి ఆత్మల నోటి నుండి లేక మనసు నుండి ఇలా అవ్వాల్సింది కానీ అవ్వలేదు, ఇలా తయారవ్వాల్సింది కానీ తయారవ్వలేదు, ఇలా చెయ్యాలి కానీ చెయ్యలేము అనే మాటలు వెలువడ్తాయి. ఇటువంటి వారిని యథాశక్తి గల ఆత్మలు అని అంటారు. సర్వశక్తివాన్ ఆత్మలుగా లేరు. ఇలాంటి ఆత్మలు స్వయం లేక ఇతరుల విఘ్నాలను వినాశనం చేసే విఘ్నవినాశకులుగా అవ్వలేరు. కొంచెం ముందుకు వెళ్తారు, విఘ్నాలు వస్తాయి, ఒక విఘ్నం తొలగిస్తారు, ధైర్యంలోకి వస్తారు, సంతోషంలోకి వస్తారు. మళ్లీ ఇంకొక విఘ్నం వస్తుంది. జీవితం అనగా పురుషార్థం యొక్క లైను సదా క్లియర్గా (స్పష్టంగా) ఉండదు. ఆగిపోవడం, ముందుకు వెళ్ళడం, ఈ విధి ద్వారా ముందుకు వెళ్తూ ఉంటారు, ఇతరులను కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అందువలన ఆగుతూ ముందుకు వెళ్తున్న కారణంగా తీవ్రగతి అనుభవం అవ్వదు. అప్పుడప్పుడు నడిచేకళ, అప్పుడప్పుడు ఎక్కే కళ, అప్పుడప్పుడు ఎగిరే కళ ఉంటుంది. ఏకరసంగా శక్తిశాలిగా అనుభవం అవ్వదు. అప్పుడప్పుడు సమస్యా స్వరూపం, అప్పుడప్పుడు సమాధాన స్వరూపంగా ఉంటారు. ఎందుకంటే యథాశక్తిగా ఉన్నారు. జ్ఞానసూర్యుని నుండి సర్వ శక్తులను గ్రహించే శక్తి లేదు. మధ్యలో ఎవరో ఒకరి ఆధారం తప్పకుండా కావాలి. వీరిని యథాశక్తి ఆత్మలని అంటారు.
ఉదాహరణానికి ఇక్కడ ఉన్నత పర్వతం పైకి ఎక్కుతారు. ఏ వాహనంలో వచ్చినా బస్సులో కావచ్చు, కారులో కావచ్చు ఇంజన్ శక్తిశాలిగా ఉన్నట్లయితే తీవ్రగతితో ఏ గాలి, నీరు ఆధారం లేకుండానే నేరుగా చేరుకుంటారు. ఇంజన్ బలహీనంగా ఉన్నట్లయితే ఆగి, నీరు లేక గాలిని ఆధారంగా తీసుకోవాల్సి వస్తుంది. ఆగకుండా కాదు, ఆగిపోవాల్సి ఉంటుంది. ఇలాంటి యథాశక్తి గల ఆత్మలు ఎవరో ఒక ఆత్మ సమాధానాన్ని, సాల్వేషన్ను, సాధనాన్ని ఆధారం తీసుకోకుండా తీవ్రగతితో ఎగిరేకళలో గమ్యానికి చేరుకోలేరు. అప్పుడప్పుడు ఈ రోజు సంతోషం తక్కువ అయ్యింది, ఈ రోజు యోగం అంత శక్తిశాలిగా లేదు, ఈ రోజు ఈ ధారణ చేయడంలో అర్థం అయినా బలహీనంగా ఉన్నాను, ఈ రోజు సేవ చేసేందుకు ఉత్సాహం రావడం లేదు, అప్పుడప్పుడు నీళ్ళు కావాలి, అప్పుడప్పుడు గాలి కావాలి, అప్పుడప్పుడు ఎవరో ఒకరి ప్రోత్సాహం కావాలి అని అంటూ ఉంటారు. వీరిని శక్తిశాలి అని అంటారా? వాస్తవానికి నేను అధికారిని, తీసుకోవడంలో నెంబర్ వన్ అధికారిని, ఇతరుల కంటే తక్కువేమీ కాదు అని అంటారు. అయితే చెయ్యడంలో ఏమంటారు? మేము చిన్నగా ఉన్నాము, ఇప్పుడే కొత్తగా వచ్చాము, పాతవారము కాదు, సంపూర్ణంగా అవ్వలేదు కదా! ఇప్పుడింకా సమయం ఉంది, దోషము పెద్దలది, మాది కాదు, ఇంకా నేర్చుకుంటున్నాము, నేర్చుకుంటాము, బాప్దాదా అయితే అందరికి అవకాశం ఇవ్వాలి అని సదా చెప్తూ ఉంటారు కదా! మాకు కూడా ఈ అవకాశం లభించాలి, మా మాట కూడా వినాలి అని అంటారు. తీసుకోవడంలో మేము, చెయ్యడంలో పెద్దవారు చేస్తారు. అధికారం తీసుకోవడంలో అయితే ఇప్పుడు, చెయ్యడంలో అయితే ఎప్పుడో చేస్తాము. తీసుకోవడంలో పెద్దవారుగా అవుతారు, చెయ్యడంలో చిన్నవారుగా అవుతారు. ఇటువంటి వారిని యథాశక్తి కలిగిన ఆత్మలని అంటారు.
బాప్దాదా ఈ రమణీయమైన ఆటను చూసి చూసి మందహాసము చేస్తూ ఉంటారు. తండ్రి అయితే నేర్పరితనం(చతుర్ సుజాన్) గలవారు. కానీ మాస్టర్ నేర్పరులు కూడా తక్కువేమీ కాదు. అందువలన యథాశక్తి ఆత్మ నుండి ఇప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులుగా అవ్వండి. చేసేవారిగా అవ్వండి. స్వత:గానే శక్తిశాలి కర్మకు ఫలంగా శుభ భావన, శ్రేష్ఠ కామనల ఫలం స్వత:గానే ప్రాప్తిస్తుంది. సర్వ ప్రాప్తులు స్వయమే మీ వెనుక నీడలాగా తప్పకుండా వస్తాయి. కేవలం జ్ఞాన సూర్యుని ద్వారా ప్రాప్తించిన శక్తుల ప్రకాశంలో నడిచినట్లయితే సర్వ ప్రాప్తులనే నీడ దానంతకదే మీ వెనుక వెనుక వస్తుంది. అర్థమయిందా! ఈ రోజు యథాశక్తి మరియు శక్తిశాలి నక్షత్రాల ప్రకాశ తుంపర్లను చూస్తున్నారు. మంచిది.
అందరూ తీవ్రవేగంతో పరుగులు తీస్తూ తండ్రి ఇంటికి చేరుకున్నారు. కనుక తండ్రి పిల్లలతో భలే వచ్చేశారని అంటారు. స్థానం ఎలా ఉన్నా ఇది మీ ఇల్లే. ఇల్లు అయితే ఒక్క రోజులో పెద్దదిగా అవ్వదు కానీ సంఖ్య అయితే పెరిగింది కదా! కావున ఇమిడిపోవాల్సి వస్తుంది. స్థానాన్ని మరియు సమయాన్ని సంఖ్య అనుసారంగా నడిపించవలసి ఉంటుంది. అందరూ ఇమిడిపోయారు కదా! క్యూ అయితే అన్ని విషయాలలో తప్పకుండా ఉంటుంది. అయినా ఇప్పుడు కూడా అన్ని విషయాలలో చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే పాండవ భవనం ఏ స్థానంలో అయితే ఉందో దానిలోనే ఇమిడిపోయారు. బయట వరకు క్యూ వెళ్ళలేదు కదా! ఇంకా వృద్ధి అవుతుంది. క్యూ కూడా పెట్టవలసి ఉంటుంది. సదా ప్రతి విషయంలో సంతోషంగా, ఆనందంగా ఉండండి. తండ్రి ఇంటిలో తప్ప హృదయానికి విశ్రాంతి ఎక్కడ లభిస్తుంది? అందువలన సదా ప్రతి పరిస్థితిలో సంతుష్టంగా ఉండండి. సంగమయుగ వరదాని భూమిలో మూడు అడుగుల నేల సత్యయుగంలోని మహళ్ల కంటే శ్రేష్ఠమైనది. కూర్చునేందుకు స్థానం ఇంత అయినా లభించింది, ఇది కూడా చాలా శ్రేష్ఠమైనది. ఈ రోజులు కూడా తర్వాత గుర్తుకొస్తాయి. ఇప్పుడైతే దృష్టి మరియు టోలీ లభిస్తున్నాయి. తర్వాత దృష్టి మరియు టోలీ ఇప్పించేవారిగా లేక ఇచ్చేవారిగా అవ్వవలసి ఉంటుంది. వృద్ధి చెందుతూ ఉంది. ఇది కూడా సంతోషించాల్సిన విషయం కదా! ఏది లభించినా, ఎలా లభించినా అన్నిటిలో తృప్తిగా ఉండాలి, వృద్ధి అంటే కళ్యాణం. మంచిది.
కర్ణాటక వారు విశేషంగా అపురూపమైన పిల్లలుగా అయ్యారు. మహారాష్ట్ర కూడా సదా సంఖ్యలో మహాన్గా ఉంది. ఢిల్లీవారు కూడా రేస్ చేశారు. భలే వృద్ధిని పొందుతూ ఉండండి. యు.పి. కూడా ఎవరితోనూ తక్కువ కాదు. ప్రతి స్థానానికి వారి వారి విశేషత ఉంది. అది తర్వాత వినిపిస్తాను.
బాప్దాదా కూడా సాకార శరీరాన్ని ఆధారం తీసుకున్న కారణంగా సమయ పరిమితిని ఉంచవలసి పడ్తుంది. అయినా అద్దెకు తీసుకున్న శరీరం కదా! నాది అయితే కాదు. శరీరం బాధ్యత కూడా బాప్దాదాదే అవుతుంది. అందువలన బేహద్ యజమాని కూడా హద్దులో బంధింపబడ్తారు. అవ్యక్త వతనంలో బేహద్ ఉంటుంది. ఇక్కడైతే సంయమము, సమయం మరియు శారీరిక శక్తి అన్నీ చూడవలసి ఉంటుంది. బేహద్లోకి రండి మిలనం జరుపుకోండి. అక్కడ ఎవ్వరూ ఇప్పుడు రండి, ఇప్పుడు వెళ్ళండి లేక నెంబరువారుగా రండి అని చెప్పరు. పూర్తి విశాలమైన ఆహ్వానం ఉంది లేక పూర్తి అధికారం ఉంది. రెండు గంటలకైనా రండి, నాలుగు గంటలకైనా రండి. మంచిది.
సదా సర్వశక్తిశాలి శేష్ఠ్రమైన ఆత్మలకు, సదా జ్ఞాన సూర్యుని సమీపంగా, సమానంగా ఉన్నత స్థితిలో స్థితులై ఉండే విశేష ఆత్మలకు, సదా పత్రి కర్మ చెయ్యడంలో '' మొదట నేను '' అని ఉత్సాహ - ఉల్లాసాలు ఉంచుకునే ధైర్యవంతులైన పిల్లలకు, సదా అందరిని శక్తిశాలి ఆత్మలుగా చేసే సమీప పిల్లలందరికి జ్ఞానసూర్యుడు, జ్ఞానచందున్రి పియ్ర స్మృతులు మరియు నమస్తే.
దాదీలతో :- బాప్దాదాకు పిల్లలైన మీరంటే గర్వం ఉంది. ఏ విషయంలో గర్వం? ఎల్లప్పుడూ తండ్రి తన సమాన పిల్లలను చూసి గర్విస్తారు. పిల్లలు తండ్రి కంటే విశేష కార్యము చేసి చూపించినప్పుడు తండ్రికి ఎంత గర్వం ఉంటుంది! రాత్రి-పగలు తండ్రి స్మృతి మరియు సేవ - ఈ రెండిటి ధ్యాస ఉంది. కానీ మహావీర పిల్లల విశేషత ఏమంటే మొదట స్మృతి తర్వాత సేవ. గుఱ్ఱపు సవారి మరియు కాల్బలం వారు మొదట సేవ తర్వాత స్మృతిని ఉంచుతారు. అందువలన భేదం వచ్చేస్తుంది. మొదట స్మృతి తర్వాత సేవ చేస్తే సఫలత ఉంటుంది. మొదట సేవను ఉంచి సేవలో మంచి జరిగినా చెడు జరిగినా దాని రూపంలోకి వస్తారు. మొదట స్మృతిని ఉంచుకున్నట్లయితే సహజంగానే అతీతంగా అవ్వగలరు. కావున తండ్రికి కూడా ఇలాంటి సమాన పిల్లలంటే గర్వంగా ఉంది. మొత్తం విశ్వంలో ఇలాంటి పిల్లలు ఎవరికి ఉంటారు? ఒక్కొక్క పుత్రుని విశేషతను వర్ణిస్తూ ఉంటే భాగవతం తయారవుతుంది. ప్రారంభం నుండి ఒక్కొక్క మహారథి విశేషతను వర్ణన చేస్తే భాగవతం తయారవుతుంది. మధునంలో జ్ఞానసూర్యుడు మరియు నక్షత్రాలు సంఘటన రూపంలో మెరుస్తూ ఉంటే మధువనం యొక్క ఆకాశ శోభ ఎంత శ్రేష్ఠంగా అవుతుంది! జ్ఞానసూర్యునితో పాటు నక్షత్రాలు కూడా తప్పకుండా కావాలి.
యుగల్స్ గ్రూపుతో బాప్దాదా కలయిక :- 1. మీరు ఒకే మతం అనే పట్టాల పై నడిచేవారు. కనుక తీవ్రవేగం కలిగినవారిగా ఉంటారు కదా! ఇరువురి మతము ఒక్కటే. ఈ ఒక్క మతమే చక్రము. ఒకే మతం అనే చక్రాల ఆధారంతో నడిచేవారు సదా తీవ్రవేగంతో నడుస్తారు. రెండు చక్రాలు శ్రేష్ఠంగా ఉండాలి. ఒకటి బలహీనంగా, ఒకటి వేగంగా అయితే లేవు కదా? రెండు చక్రాలు ఏకరసంగా ఉన్నాయి కదా! తీవ్ర పురుషార్థంలో పాండవులు నెంబర్వన్గా ఉన్నారా లేక శక్తులు నంబరువన్గా ఉన్నారా? ఒకరు ఇంకొకరిని ముందుకు తీసుకెళ్ళడం అనగా స్వయం ముందుకు వెళ్ళడం. ముందుకు తీసుకెళ్లి స్వయం వెనుక ఉండరాదు. ముందుకు తీసుకెళ్ళడమంటే స్వయం ముందుకు వెళ్ళడం. అందరూ లక్కీ ఆత్మలు కదా? ఢిల్లీ, బొంబాయి నివాసులందరూ విశేషించి అదృష్టవంతులు. ఎందుకంటే మార్గంలో నడుస్తున్నారు. చాలా ఖజానా లభిస్తుంది. విశేష ఆత్మల సాంగత్యం, సహయోగం, శిక్షణ అన్నీ ప్రాప్తిస్తాయి. ఇవన్నీ ఆహ్వానం లేకుండానే లభిస్తూ ఉంటాయి. ఇది కూడా వరదానము. ఇతరులు ఎంత కష్టపడ్తారు. మొత్తం బ్రాహ్మణ జీవితంలో లేక సేవ జీవితంలో ఇలాంటి శ్రేష్ఠ ఆత్మలు రెండు-మూడు సార్లు మాత్రమే కష్టంగా వస్తారు. కానీ మీరు పిలిచినా, పిలవకపోయినా మీ వద్దకు సులభంగా వస్తారు. కావున సాంగత్య రంగు ఏదైతే ప్రసిద్ధంగా ఉందో ఆ విశేష ఆత్మల సాంగత్యము కూడా ఉత్సాహాన్ని ఇప్పిస్తుంది. మీరు ఎంత సహజంగా భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునే భాగ్యశాలి ఆత్మలు! సదా 'ఓ¬ నా శ్రేష్ఠ భాగ్యము' అని పాట పాడుతూ ఉండండి. ఏదైతే ప్రాప్తి అవుతూ ఉందో అందుకు బదులు ' సదా ఎగిరేకళ 'లో ఉండండి. ఆగిపోయేవారు, నడిచేవారు కాదు. సదా ఎగిరేవారు.
2. సదా స్వయాన్ని తండ్రి ఛత్రఛాయలో ఉండేవారిగా అనుభవం చేస్తున్నారా? తండ్రి స్మృతియే ఛత్రఛాయ. ఎవరైతే తండ్రి ఛత్రఛాయ లోపల ఉంటారో వారు సదా సురక్షితంగా ఉంటారు. ఎప్పుడైనా వర్షం లేక తుఫాను వస్తూ ఉంటే ఛత్రఛాయ లోపలికి వెళ్లిపోతారు. అలా తండ్రి స్మృతియే ఛత్రఛాయ. ఈ ఛత్రఛాయలో ఉండేవారు సహజంగానే మాయాజీత్లుగా ఉంటారు. స్మృతిని మర్చిపోయారు అంటే ఛత్రఛాయ నుండి బయటికి వచ్చారు. తండ్రి స్మృతి సదా తోడుగా ఉండాలి. ఎవరైతే ఇలాంటి ఛత్రఛాయలో ఉంటారో వారికి తండ్రి సహయోగం సదా లభిస్తూ ఉంటుంది. ప్రతి శక్తి యొక్క ప్రాప్తి అనే సహయోగం లభిస్తూ ఉంటుంది. ఎప్పుడూ బలహీనమై మాయతో ఓడిపోరు. అప్పుడప్పుడు మాయ స్మృతిని మరిపింపజేయడం లేదు కదా? 63 జన్మలు మర్చిపోయారు. సంగమయుగము స్మృతిలో ఉండే యుగము. ఈ సమయంలో మర్చిపోరాదు. మర్చిపోయి దెబ్బలు తిన్నారు. దు:ఖం లభించింది. ఇప్పుడు మళ్లీ ఎలా మర్చిపోగలరు! ఇప్పుడు సదా స్మృతిలో ఉండేవారు.
వీడ్కోలు సమయంలో :- సంగమయుగము కలుసుకునే యుగము. ఎంత కలుస్తారో అంత ఇంకా కలుసుకోవాలనే ఆశ పెరుగుతుంది. ఇలా కలుసుకోవాలనే శుభమైన ఆశ ఉండాలి. అది మాయాజీత్లుగా చేస్తుంది. ఈ విధంగా కలుసుకోవాలనే శుభ సంకల్పము సదా తండ్రి స్మృతిని స్వత:గానే ఇప్పిస్తుంది. ఇది ఉండాల్సిందే. ఇది పూర్తి అయితే సంగమయుగము పూర్తి అవుతుంది. ఇతర అన్ని కోరికలు పూర్తి అయ్యాయి కానీ స్మృతిలో సదా ఇమిడిపోయి ఉండాలి అనే శుభమైన కోరిక ముందుకు తీసుకెళ్తుంది. అలా ఉన్నారు కదా! కావున సదా మిలన మేళా జరుగుతూనే ఉంటుంది. వ్యక్తం ద్వారా కావచ్చు, అవ్యక్తము ద్వారా కావచ్చు. సదా తోడుగానే ఉంటారు. కనుక కలుసుకునే అవసరం ఏముంటుంది! ప్రతి మిలనానికి దాని దాని స్వరూపం మరియు ప్రాప్తి ఉంది. అవ్యక్త మిలనము వేరు, సాకార మిలనము వేరు. కలుసుకోవడం అయితే మంచిది కదా! మంచిది. సదా శుభమైన మరియు శ్రేష్ఠమైన శుభోదయం ఉంటుంది. వారు కేవలం శుభోదయం (గుడ్మార్నింగ్) అని చెప్పుకుంటారు కానీ ఇక్కడ శుభంగా కూడా ఉంటుంది, శ్రేష్ఠంగా కూడా ఉంటుంది. ప్రతి సెకండు శుభం మరియు శ్రేష్ఠము. అందువలన సెకండ్ సెకండుకు శుభాకాంక్షలు. మంచిది. ఓంశాంతి.
వరదానము :-
''తండ్రి తోడు ద్వారా పవిత్రత అనే స్వధర్మాన్ని సహజంగా పాలన చేసే మాస్టర్ సర్వశక్తివాన్ భవ ''
ఆత్మ స్వధర్మము పవిత్రత. అపవిత్రత పరధర్మము. స్వధర్మము నిశ్చయమైనట్లయితే పరధర్మము కదిలించలేదు. తండ్రి ఎవరో, ఎలాంటివారో, వారిని యథార్ధంగా గుర్తించి తోడుగా ఉంచుకుంటే పవిత్రత అనే స్వధర్మాన్ని ధారణ చెయ్యడం చాలా సులభము. ఎందుకంటే సర్వశక్తివంతుడు తోడుగా ఉన్నారు. సర్వశక్తివంతుని పిల్లలు మాస్టర్ సర్వశక్తివంతుల ముందు అపవిత్రత రాజాలదు. సంకల్పంలో మాయ వచ్చినా తప్పకుండా ఏదో ఒక ద్వారం తెరవబడి ఉంది అనగా నిశ్చయంలో లోపం ఉంది.
స్లోగన్ :-
''త్రికాలదర్శి ఏ విషయాన్ని అయినా ఏకకాల దృష్టితో చూడరు, ప్రతి విషయంలో కళ్యాణం ఉందని భావిస్తారు''