27-05-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - తండ్రి నుండి కరెంటు( శక్తి ) తీసుకోవాలంటే సేవలో లగ్నమై ఉండండి, ఏ పిల్లలైతే తమ సర్వస్వమును త్యాగము చేసి తండ్రి సేవలో ఉంటారో, వారే ప్రియమనిపిస్తారు, హృదయము పై అధిరోహిస్తారు.''

ప్రశ్న :-

పిల్లలకు స్థిరమైన సంతోషము ఎందుకుండదు? ముఖ్య కారణమేది ?

జవాబు :-

స్మృతి చేయునప్పుడు బుద్ధి భ్రమిస్తుంది. బుద్ధి స్థిరముగా లేని కారణంగా సంతోషము ఉండజాలదు. మాయా తుఫాన్లు దీపాలను కలత చెందిస్తాయి. ఎంతవరకు కర్మలు ఆకర్మలుగా అవ్వవో అంతవరకు సంతోషము స్థిరంగా ఉండజాలదు. అందువలన పిల్లలు ఇదే శ్రమ చేయాలి.

ఓంశాంతి.

ఓంశాంతి అన్నప్పుడు చాలా ఉల్లాసంగా మేము ఆత్మలము, శాంతిస్వరూపులము అని అంటారు. అర్థము ఎంతో సులభమైనది. తండ్రి కూడా ఓంశాంతి అని అంటారు. దాదా కూడా ఓంశాంతి అని అంటారు. వారేమో నేను పరమాత్మను అని, ఇతనేమో నేను ఆత్మను అని అంటారు. మీరంతా నక్షత్రాలు. నక్షత్రాలన్నిటికి తండ్రి కూడా కావాలి కదా. సూర్యుడు, చంద్రుడు భాగ్యశాలి నక్షత్రాలనే గాయనము కూడా ఉంది. పిల్లలైన మీరు అత్యంత గొప్ప భాగ్యశాలి నక్షత్రాలు. అందులో కూడా నెంబరువారుగా ఉన్నారు. రాత్రి పూట చంద్రుడు ఉదయించినప్పుడు, కొన్ని నక్షత్రాలు డిమ్‌గా (తక్కువ కాంతితో), కొన్ని చాలా ప్రకాశవంతంగా ఉంటాయి. కొన్ని చంద్రునికి చాలా దగ్గరగా ఉంటాయి. నక్షత్రాలు కదా. మీరు కూడా జ్ఞాననక్షత్రాలు. భృకుటి మధ్య అద్భుతమైన నక్షత్రము ప్రకాశిస్తుంది(భృకుటి కే బీచ్‌ మే చమక్‌తా హై అజబ్‌ సితారా). ఈ నక్షత్రాలు(ఆత్మలు) చాలా అద్భుతమైనవని తండ్రి అంటారు. ఒకటేమో చాలా చిన్న బిందువు. దానిని గురించి ఎవ్వరికీ తెలియదు. ఆత్మయే శరీరముతో పాత్ర చేస్తుంది. ఇది చాలా అద్భుతము. పిల్లలైన మీలో కూడా నెంబరువారుగా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు. బాగా ప్రకాశించే నక్షత్రాలను తండ్రి కూర్చుని స్మృతి చేస్తారు. బాగా సేవ చేయువారికి కరెంటు(శక్తి) లభిస్తూ ఉంటుంది. మీ బ్యాటరీ నిండతూ ఉంటుంది. తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయ్యేందుకు నెంబరువారు పురుషార్థానుసారము సర్చ్‌లైట్‌ (ఎంతో దూరము వరకు ప్రకాశాన్ని వెదజల్లు శక్తి గల లైట్‌) లభిస్తుంది. నా కొరకు సర్వస్వమూ ఎవరైతే త్యాగము చేసి సేవలో లగ్నమై ఉంటారో వారు నాకు చాలా ప్రియమిపిస్తారు. వారు నా హృదయాన్ని కూడా అధిరోహిస్తారు. తండ్రి, హృదయాన్ని తీసుకునేవాడు (దిల్‌ లేనేవాలా) కదా. దిల్‌వాలా మందిరము కూడా ఉంది కదా. ఇప్పుడిది దిల్‌వాలా లేక హృదయము తీసుకునేవారి మందిరము. ఎవరి హృదయాన్ని తీసుకుంటారు? మీరు ఆ మందిరాన్ని చూశారు కదా. అందులో ప్రజాపిత బ్రహ్మ కూర్చుని ఉన్నారు కదా. తప్పకుండా అతనిలో శివబాబా ప్రవేశించి ఉన్నారు. అంతేకాక ఉపరి భాగములో స్వర్గ స్థాపన కూడా ఉందని, క్రింద భాగములో పిల్లలు తపస్సులో కూర్చుని ఉన్నారని కూడా ఆ మందిరంలో మీరు చూశారు. ఈ మందిరము ఒక చిన్న మాడల్‌ రూపములో తయారుచేశారు. కనుక ఎవరు బాగా సేవ చేస్తారో, ఎవరైతే చాలా సహాయకులుగా ఉన్నారో వారి స్మృతి చిహ్నాలున్నాయి. కావున మహారథులు, అశ్వారోహులు, పదాతిసైన్యము ఉన్నారు కదా. ఈ మందిరము స్మృతి చిహ్నంగా చాలా ఖచ్ఛితంగా తయారు చేయబడి ఉంది. ఈ మందిరము మా స్మృతి చిహ్నమేనని మీరంటారు. ఇప్పుడు మీకు ప్రకాశము లభించింది. మీకు తప్ప మరెవ్వరికీ జ్ఞాన మూడవ నేత్రము లేదు. భక్తిమార్గములో అయితే మనుష్యులు విన్నదానినంతా సత్యము సత్యము అంటూ ఉంటారు. వాస్తవానికి అదంతా అసత్యము. కానీ దానిని సత్యమని భావిస్తారు. ఇప్పుడు తండ్రి ఎవరైతే సత్యంగా ఉన్నారో వారు కూర్చుని మీకు సత్యమునే వినిపిస్తారు. దాని ద్వారా మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు. తండ్రి ఏ శ్రమా మీతో చేయించరు. ఈ వృక్ష రహస్యమంతా మీ బుద్ధిలో బాగా నాటుకునిపోయింది. మీకు చాలా సులభంగా అర్థము చేయిస్తారు. కానీ సమయము ఎందుకు పడుతుంది? జ్ఞానము లేక వారసత్వము తీసుకునేందుకు పెద్ద సమయము పట్టదు. కానీ పవిత్రంగా అగుటలో సమయము పడ్తుంది. ముఖ్యమైనది స్మృతి యాత్ర. స్మృతియాత్రలో ఇక్కడ గమనము చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంటికి వెళ్తే ఇంత గమనము ఉండదు. ఇక్కడ అందరూ నెంబరువారుగా ఉన్నారు. కొంతమంది ఇక్కడే కూర్చుని ఉంటారు. బుద్ధిలో మేమంతా పిల్లలము, వారు మా తండ్రి అనే నషా ఉంటుంది. అనంతమైన తండ్రి మరియు పిల్లలైన మేము కూర్చుని ఉన్నాము. తండ్రి ఈ శరీరములో వచ్చి ఉన్నారని దివ్యదృష్టిని ఇస్తున్నారని, సేవ చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. అందువలన వారిని ఒక్కరినే స్మృతి చేయాలి. ఇక ఏ వైపు బుద్ధి వెళ్లరాదు. సందేశి, ఎవరి బుద్ధి ఎలా తిరుగుతూ ఉందో, ఎవరు ఏమి చేస్తున్నారో, ఎవరికి నిద్ర వస్తూ ఉందో అంతా తెలుపగలదు.

ఏ నక్షత్రాలైతే మంచి సేవాధారులుగా ఉన్నారో నేను వారినే చూస్తూ ఉంటాను. తండ్రికి ప్రేమ ఉంది కదా. ఆ పిల్లలు స్థాపనలో సహాయము చేస్తారు. కల్పక్రితము వలె ఈ రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఇంతకుముందు అనేక పర్యాయాలు కూడా స్థాపించబడింది. ఈ డ్రామా ఒక చక్రము వలె తిరుగుతూనే ఉంటుంది. ఇందులో చింతించే విషయమేదీ లేదు. ఎందుకంటే తండ్రి జతలో ఉన్నారు కదా. కావున సాంగత్య రంగు అంటుకుంటుంది. చింత తగ్గిపోతూ వస్తుంది. ఇది తయారైన డ్రామా. తండ్రి పిల్లల కొరకు స్వర్గ రాజధానిని తీసుకొచ్చారు. మధురాతి మధురమైన పిల్లలారా! పతితుల నుండి పావనంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయమని మాత్రమే చెప్తున్నారు. ఇప్పుడు మధురమైన ఇంటికి వెళ్ళాలి. దాని కొరకెే మీరు భక్తి మార్గములో తలలు బాదుకుంటారు. కానీ ఒక్కరు కూడా పోలేరు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. స్వదర్శన చక్రము తిప్పుతూ ఉండండి. తండ్రి మరియు వారసత్వము(అల్ఫ్‌ ఔర్‌ బే), తండ్రిని స్మృతి చేయండి, 84 జన్మల చక్రమును తిప్పండి. ఆత్మకు 84 జన్మల చక్ర జ్ఞానము లభించింది. రచయిత రచనల ఆదిమధ్యాంతము మరి ఎవ్వరికీ తెలియదు. మీకు తెలుసు కానీ నెంబరువారు పురుషార్థము అనుసారముగా తెలుసు. ఉదయమే నిదురలేచి మేము 84 జన్మల చక్రమును పూర్తి చేశాము, ఇప్పుడు వాపస్‌ ఇంటికి వెళ్ళాలి అని బుద్ధిలో స్మృతి చేయండి. అందువలన ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. తద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. ఇది సులభము కదా. కానీ మాయ మిమ్ములను మరపింపచేస్తుంది. మాయా తుఫాన్లు వస్తాయి కదా. అవి దీపాలను కలవరపెడ్తాయి. మాయ చాలా శక్తివంతమైనది. దానికి పిల్లలను మరిపింపచేసే శక్తి ఉంది. సంతోషము స్థిరంగా ఉండదు. మీరు తండ్రిని స్మృతి చేసేందుకు కూర్చుంటారు. అలా కూర్చునే ఉంటూ బుద్ధి వేరే వైపులకు వెళ్ళిపోతుంది. ఇవన్నీ గుప్తమైన విషయాలు. ఎంత ప్రయత్నించినా స్మృతి చేయలేరు. కొంతమంది బుద్ధి అన్ని వైపులా తిరిగి తిరిగి స్థిరమైపోతుంది. కొంతమంది బుద్ధి వెంటనే స్థిరమైపోతుంది. కొంతమందితో ఎంత తలలు బాదుకున్నా వారి బుద్ధిలో నిలువనే నిలువదు. దీనినే మాయ చేసే యుద్ధమని అంటారు. కర్మలు అకర్మలుగా చేసుకునేందుకు చాలా శ్రమ చేయవలసి వస్తుంది. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. కావున కర్మలు వికర్మలుగా కూడా అవ్వవు. వికర్మలు(ఉల్టా కర్మలు) చేయించేందుకు అక్కడ మాయ ఉండనే ఉండదు. ఇది రాముడు మరియు రావణుని ఆట. అర్ధకల్పము రామ రాజ్యము, అర్ధకల్పము రావణ రాజ్యము, పగలు మరియు రాత్రి. సంగమ యుగములో కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఉంటారు. ఇప్పుడు రాత్రి పూర్తి అయ్యి పగలు ప్రారంభము కానున్నదని బ్రాహ్మణులైన మీకు తెలుసు. శూద్రులు కొంచెము కూడా అర్థము చేసుకోలేరు.

మనుష్యులు చాలా పెద్దగా శబ్ధాలు చేస్తూ భక్తి మొదలైనవాటి పాటలు పాడ్తారు. మీరు శబ్ధ ప్రపంచానికి దూరంగా వెళ్ళాలి. మీరు తండ్రి స్మృతిలో మునిగి తన్మయత్వములో ఉంటారు. ఆత్మకు జ్ఞాన మూడవ నేత్రము లభించింది. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలని ఆత్మ భావిస్తుంది. భక్తిమార్గములో శివబాబా శివబాబా అంటూ వచ్చారు. శివుని మందిరములో శివుడిని బాబా(తండ్రి) అని తప్పకుండా అంటారు కానీ జ్ఞానము ఏ మాత్రము లేదు. ఇప్పుడు మీకు జ్ఞానము లభించింది. వారు శివబాబా. ఇది వారి చిత్రము. వారేమో లింగమనే భావిస్తారు. ఇప్పుడు మీకైతే జ్ఞానము లభించింది. వారు (భక్తులు) శివలింగానికి అభిషేకము చేస్తారు. తండ్రి ఏమో నిరాకారులు. నిరాకారము పై నీరు పోస్తారు. వారు నీటినేమి చేసుకుంటారు. సాకారములో అయితే కనీసం స్వీకరించేవారు. నిరాకారము పై పాలు మొదలైన వాటితో అభిషేకము చేస్తారు. వారేం చేసుకుంటారు! మీరు నా పై పోసే పాలు మీరే తాగుతారు. నాకు సమర్పించే నైవేద్యము(భోగ్‌) మొదలైనవి కూడా మీరే తింటారు. ఇక్కడైతే నేను మీ సన్ముఖములో ఉన్నాను కదా. ఇంతకుముందు అప్రత్యక్షంగా చేసేవారు. ఇప్పుడైతే నేరుగా నేను మీ ముందే ఉన్నాను. క్రిందకు వచ్చి పాత్ర చేస్తున్నాను. సర్చ్‌లైట్‌ ఇస్తున్నాను. మధువనములో బాబా వద్దకు తప్పకుండా రావాలని పిల్లలు భావిస్తారు. అక్కడ మా బ్యాటరీలు బాగా చార్జ్‌ అవుతాయి. ఇంట్లో అయితే వృత్తి వ్యాపారాలు మొదలైన చిక్కుపనులలో అశాంతియే అశాంతి ఉంది. ఈ సమయంలో ప్రపంచమంతటా అశాంతి వ్యాపించి ఉంది. ఇప్పుడు మనము యోగబలము ద్వారా శాంతిస్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. పోతే రాజ్యపదవి చదువు ద్వారా లభిస్తుంది. కల్పక్రితము కూడా ఇది మీరు విన్నారు. ఇప్పుడు కూడా వింటున్నారు. ఇప్పుడేమి జరుగుతుందో అదే మళ్లీ జరుగుతుంది. ఎంతోమంది పిల్లలు ఆశ్చర్యపడేటట్లు పారిపోయారని తండ్రి చెప్తున్నారు. ప్రియుడైన నన్ను ఎంతో బాగా స్మృతి చేసేవారు. ఇప్పుడు నేను వచ్చాను. అయినా నన్ను వదిలి వెళ్ళిపోతారు. మాయ గట్టిగా చెంపదెబ్బ వేస్తుంది. బాబా అనుభవము గలవారు కదా! బాబాకు తన చరిత్ర అంతా జ్ఞాపకముంది. తల పై టోపీ పెట్టుకుని చెప్పులు లేకుండా పరుగెత్తేవాడు........ ముస్లిములు కూడా చాలా ప్రేమించేవారు. చాలా గౌరవించేవారు. మాస్టర్‌గారి అబ్బాయి వచ్చాడంటే గురువుగారి అబ్బాయి వచ్చినట్లు భావించేవారు. సజ్జ రొట్టెలు తినిపించేవారు. ఇక్కడ కూడా బాబా 15 రోజులు సజ్జ రొట్టె, మజ్జిగ తీసుకునే ప్రోగ్రాం ఇచ్చారు. ఇంకేమీ తయారయ్యేది కాదు. జబ్బు చేసినవారికి కూడా ఇదే తయారయ్యేది(తినిపించేవారు). ఎవ్వరికీ ఏమీ జరగలేదు. జబ్బుగా ఉండేవారు కూడా కోలుకుని ఆరోగ్యవంతులుగా అయ్యారు. ఆసక్తి తొలగిపోయిందా లేదా అని గమనించేవారు. ఇదే ఉండాలి, ఇది ఉండరాదు అనే భావము తొలగిపోయింది. కోరికను దాస్యత్వము అని అంటారు. యాచించుట కంటే మరణించుట మేలని ఇక్కడ తండ్రి చెప్తున్నారు. పిల్లలకు ఏం ఇవ్వాలో తండ్రికే తెలుసు. ఏం ఇవ్వాల్సి ఉంటుందో అది వారే స్వయంగా ఇస్తారు. ఇదంతా తయారైన డ్రామా.

తండ్రిని తండ్రిగానే కాక కొడుకుగా కూడా భావించేవారు చేతులెత్తమని తండ్రి అడిగారు కదా. అప్పుడు అందరూ చేతులెత్తారు. చేతులేమో వెంటనే ఎత్తేస్తారు. లక్ష్మీనారాయణులుగా ఎవరు అవుతారని బాబా అడిగితే చేతులెలా ఎత్తుతారో, దీనికి కూడా అలాగే చేతులెత్తేస్తారు. ఈ పారలౌకిక పుత్రున్ని కూడా తప్పకుండా కలుపుకుంటారు. ఇతను తల్లితండ్రులకు చాలా సేవ చేస్తారు. 21 జన్మలకు వారసత్వమునిస్తారు. తండ్రి వానప్రస్థములోకి వెళ్ళినప్పుడు తండ్రిని సంభాళించడం పిల్లల కర్తవ్యము. వారు సన్యాసుల వలె అవుతారు. ఇతని లౌకిక తండ్రి ఉండేవారు. వానప్రస్థ అవస్థ వచ్చినప్పుడు నేను కాశీకి వెళ్ళి సత్సంగము చేస్తాను, మమ్ములను అక్కడకు తీసుకెళ్ళమని అన్నారు(హిస్టరి వినిపించండి). మీరు ప్రజాపిత బ్రహ్మకుమారి-కుమారులైన బ్రాహ్మణులు. ప్రజాపిత బ్రహ్మ, తాతముత్తాతలకు తాత (గ్రేట్‌ గ్రేట్‌ గ్రాండ్‌ ఫాదర్‌). మనుష్య సృష్టి వృక్షానికి మొట్టమొదటి ఆకు. ఇతనిని జ్ఞానసాగరులని అనరు. బ్రహ్మ-విష్ణు-శంకరులు కూడా జ్ఞానసాగరులు కారు. శివబాబా అనంతమైన తండ్రి. వారి ద్వారా వారసత్వము లభించాలి కదా. వారు నిరాకార పరమపిత పరమాత్మ. వారు ఎప్పుడు ఎలా వచ్చారో తెలియదు కానీ వారి జయంతిని ఆచరిస్తారు. ఇది ఎవ్వరికీ తెలియదు. వీరు గర్భములో ప్రవేశించరు. నేను ఇతనిలో ప్రవేశిస్తాను. అనేక జన్మల అంతిమ జన్మలో అది కూడా వానప్రస్థ అవస్థలో ప్రవేశిస్తానని అర్థం చేయిస్తారు. మనుష్యులు సన్యసించినప్పుడు అది వారి వానప్రస్థ అవస్థ అని అంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, మీరు పూర్తిగా 84 జన్మలు తీసుకున్నారు. ఇది అనేక జన్మల అంతిమ జన్మ. లెక్క అయితే మీకు తెలుసు కదా. నేనేమో ఇతనిలో ప్రవేశిస్తాను. నేను వచ్చి ఎక్కడ కూర్చుంటాను? ఇతని ఆత్మ ఎక్కడ కూర్చుని ఉందో దాని ప్రక్కలోనే వచ్చి కూర్చుంటాను. ఎలాగైతే గురువులు తమ శిష్యులను తమ ప్రక్కనే ఆసనము పై కూర్చోబెట్టుకున్నట్లు నా స్థానము, ఇతని స్థానము ఇక్కడే ఉంది. ఓ ఆత్మలారా! నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే పాపాలు వినాశనమౌతాయని నేను చెప్తున్నాను, మనుష్యుల నుండి దేవతలుగా తయారవ్వాలి కదా. ఇది రాజయోగము. నూతన ప్రపంచము కొరకు రాజయోగము తప్పకుండా కావాలి. నేను ఆదిసనాతన దేవిదేవతా ధర్మానికి పునాది వేసేందుకు వచ్చానని తండ్రి చెప్తున్నారు. గురువులు అనేకమంది ఉన్నారు. సద్గురువు మాత్రము ఒకే ఒకరున్నారు. వారే సత్యమైనవారు. మిగిలినవారంతా అసత్యమైనవారు.

మొదటిది రుద్రమాల, రెండవది వైజయంతిమాల. దీనినే విష్ణుమాల అని కూడా అంటారు. ఇదంతా మీకు తెలుసు. వైజయంతి మాల కొరకే మీరు పురుషార్థము చేస్తున్నారు. తండ్రిని స్మృతి చేస్తే మాలలోని పూసలుగా అవుతారు. ఆ మాలనే మీరు భక్తిమార్గములో స్మరిస్తారు, అయితే ఆ మాల ఎవరిదో తెలియదు. ఉపరి భాగములో ఉండే పుష్పము ఎవరో ఆ తర్వాత ఉండే మేరు పూస ఎవరిదో, పూసలు ఎవరో ఏమీ తెలియదు. ఎవరి మాలను త్రిప్పుతున్నారో దానిని గురించి ఏ మాత్రము తెలియదు. ఊరకే రామ-రామ అంటూ మాల త్రిప్పుతూ ఉంటారు. రామ-రామ అన్నందున అందరూ రాములే రాములు అని భావిస్తారు. సర్వవ్యాపి అనే అంధకారపు మాట దీని ద్వారానే వెలువడింది. మాల అర్థమే తెలియదు. కొంతమంది నూరు సార్లు తిప్పమని........ అంటారు. నేను ఇన్ని మాలలు తిప్పండి అని అంటారు. తండ్రి అనుభవము గలవారు కదా. 12 మంది గురువులుండేవారు. 12 మంది అనుభవాలను తీసుకున్నారు. తమ గురువులున్నా ఇతరుల వద్దకు వెళ్ళేవారు కూడా ఉంటారు. ఏదో ఒక అనుభవము లభించాలని వెళ్తారు. మాలలు మొదలైనవి తిప్పుతూ ఉంటారు. ఇది పూర్తిగా మూఢ విశ్వాసము, మాల తిప్పడం పూర్తి చేసి పుష్పాన్ని కళ్ళకద్దుకుని నమస్కరిస్తారు. శివబాబా పుష్పము కదా. మాలలోని పూసలనగా అనన్యమైన పిల్లలైన మీరే. తర్వాత మిమ్ములను స్మరిస్తారు. వారికి దీనిని గురించి ఏ మాత్రము తెలియదు. వారిలో కొంతమంది రామ రామ అని అంటారు. కొంతమంది కృష్ణ అంటూ కృష్ణున్ని స్మృతి చేస్తారు. కానీ అర్థము కొంచెము కూడా తెలియదు. 'శ్రీ కృష్ణ శరణం' అని అంటారు. అతడేమో సత్యయుగ రాకుమారుడు. అతడి శరణు ఎలా దొరుకుతుంది? తండ్రి శరణునే తీసుకుంటారు. మీరే పూజ్యులుగా మళ్లీ పూజారులుగా అవుతారు. 84 జన్మలు తీసుకుని పతితులుగా అయ్యారు. కావున శివబాబాను - '' ఓ పుష్పమా! మమ్ములను కూడా మీ సమానంగా తయారు చేయండి'' అని ప్రార్థస్తారు. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. ఏ విధమైన కోరికలు ఉండరాదు. ఆసక్తిని సమాప్తము చేసేయాలి. బాబా ఏది తినిపిస్తారో, అదే తింటాము....... యాచించడం కంటే మరణించడం మేలు అని మీకు ఆదేశముంది.

2. తండ్రి నుండి సర్చ్‌లైట్‌ తీసుకునేందుకు ఒక్క తండ్రితో సత్యమైన ప్రేమ ఉండాలి. వారు తండ్రి, మేము వారి పిల్లలము అనే నషా బుద్ధిలో ఉండాలి. వారి సర్చ్‌లైట్‌ ద్వారా మేము తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వాలి.

వరదానము :-

'' శ్రేష్ఠ ప్రాప్తుల ప్రత్యక్ష ఫలము ద్వారా సదా సంతోషంగా ఉండే ఎవర్‌హెల్తీ భవ ''

సంగమ యుగములో ఇప్పుడిప్పుడే చేస్తారు, ఇప్పుడిప్పుడే శ్రేష్ఠమైన ప్రాప్తులను అనుభవం చేస్తారు. ఇదే ప్రత్యక్ష ఫలము. అన్నిటికంటే శ్రేష్ఠమైన ఫలము సమీపత అనుభవమవ్వడం. ఈ రోజుల్లో సాకార ప్రపంచంలో ఫలాలు తింటే ఆరోగ్యంగా ఉంటారని అంటారు. ఆరోగ్యంగా ఉండేందుకు సాధనము - ఫలాలు అని చెప్తారు. పిల్లలైన మీరు ప్రతి సెకండు ప్రత్యక్ష ఫలాన్ని తింటూనే ఉంటారు. అందువలన మీరు సదా ఆరోగ్యవంతులుగా ఉండనే ఉన్నారు. ఒకవేళ ఎవరైనా మీ హాల్‌చాల్‌(స్థితి-గతులు) ఎలా ఉన్నాయని అడిగితే ఫరిస్తాల చాల్‌(నడక), ఖుశ్‌హాల్‌గా ఉన్నాము(సంతోషంగా కళకళలాడుతున్నాము) అని చెప్పండి.

స్లోగన్‌ :-

'' అందరి ఆశీర్వాదాలనే ఖజానాలతో సంపన్నంగా అయితే పురుషార్థములో శ్రమించే పని ఉండదు. ''