22-05-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - జ్ఞాన బుల్ బుల్ పక్షులుగా అయ్యి (పికిలి పిట్ట) మీ సమానంగా తయారు చేసే సేవ చేయండి. ఎంతమందిని తమ సమానంగా చేశారో, స్మృతి చార్టు ఎలా ఉందో పరిశీలించుకోండి. ''
ప్రశ్న :-
భగవంతుడు తమ పిల్లలకు ఏ మనుష్యులూ చేయలేని ఏ ప్రమాణమును చేస్తున్నారు ?
జవాబు :-
భగవంతుడు ప్రమాణము చేస్తున్నారు - పిల్లలూ! నేను మిమ్ములను మన ఇంటికి తప్పకుండా తీసుకెళ్తాను. మీరు శ్రీమతముననుసరించి పావనంగా అయితే ముక్తి - జీవన్ముక్తులకు వెళ్తారు. ముక్తిలోకి అయితే ప్రతి ఒక్కరూ పోవలసిందే. కావాలనుకున్నా, వద్దనుకున్నా బలవంతంగానైనా లెక్కాచారము చుక్తా చేయించి తీసుకెళ్తాను. బాబా అంటున్నారు - ఎప్పుడైతే నేను వస్తానో అప్పుడు మీ అందరికీ వానప్రస్థ స్థితి వస్తుంది, నేను అందరినీ వాపస్ తీసుకెళ్తాను.
ఓంశాంతి.
పిల్లలిప్పుడు చదువు పై గమనమివ్వాలి. సర్వ గుణసంపన్నులు, 16 కళా సంపూర్ణులు........ అని మహిమ ఏదైతే ఉందో ఆ సర్వగుణాలను ధారణ చేయాలి. మాలో ఈ గుణాలున్నాయా? అని పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఎవరైతే అలా అవుతారో, వారి వైపుకే పిల్లలైన మీ ధ్యాస వెళ్తు౦ది. ఇది చదవడం మరియు చదివించడం పై ఆధారపడి ఉంది. నేను ఎంతమందిని చదివిస్తున్నాను? అని మిమ్ములను మీరు ప్రశ్నించుకోవాలి. సంపూర్ణ దేవతలుగా ఎవ్వరూ అవ్వలేదు. చంద్రుడు సంపన్నమైనప్పుడు ఎంత ప్రకాశము ఉంటుంది! ఇక్కడ కూడా నెంబరువారు పురుషార్థానుసారముగా ఉన్నారని గమనించబడ్తుంది. ఇది పిల్లలు కూడా అర్థము చేసుకోగలరు. టీచరు కూడా అర్థము చేసుకుంటారు. వీరు ఏమి చేస్తున్నారు, నా కొరకు ఏ సేవ చేస్తున్నారు? అని పిల్లలొక్కక్కరి వైపుకు దృష్టి వెళ్తుంది. పుష్పాలందరినీ చూస్తారు. అందరూ పుష్పాలే. ఇది తోట కదా. ప్రతి ఒక్కరికి తమ స్థితి ఏమిటో తెలుసు. ఎంత సంతోషముందో తెలుసు. ప్రతి ఒక్కరికి అతీంద్రియ సుఖమయ జీవితము ఎంతవరకు ఉందో, ఎవరిది వారికి తెలుసు. ఒకటేమో తండ్రిని చాలా చాలా స్మృతి చేయాలి. స్మృతి చేస్తేనే మళ్లీ బదులు లభిస్తుంది. తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యేందుకు పిల్లలైన మీకు చాలా సులభమైన ఉపాయము తెలుపుతున్నాను - ''స్మృతి యాత్ర.'' ప్రతి ఒక్కరూ తమ హృదయములో - మా స్మృతి చార్టు సరిగ్గా ఉందా? ఎవరినైనా నా సమానంగా చేస్తున్నానా? అని ప్రశ్నించుకోండి. ఎందుకంటే మీరు జ్ఞాన బుల్ బుల్ పిట్టలు కదా. కొంతమంది చిలుకల్లా ఉన్నారు, కొంతమంది ఇంకెలాగో ఉన్నారు. మీరు పావురాల్లా కాక చిలుకలుగా అవ్వాలి. బాబా స్మృతి మాకు ఎంతవరకు ఉంది? ఎంతవరకు అతీంద్రియ సుఖములో ఉంటున్నాము? అని స్వయాన్ని ప్రశ్నించుకోవడం చాలా సులభము. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి కదా. మనుష్యులు మనుష్యులే. స్త్రీలు గానీ, పురుషులు గానీ ఇరువురూ మనుష్యులుగానే కనిపిస్తారు. దైవీగుణాలు ధారణ చేసి మళ్లీ మీరు మళ్లీ దేవతలుగా అవుతారు. మీరు తప్ప దేవతలుగా అయ్యేవారు ఎవ్వరూ లేరు. ఇచ్చటకు దైవీకుటుంబ సభ్యులుగా అయ్యేందుకే వస్తారు. అక్కడ కూడా మీరు దైవీకుంటుంబ సభ్యులుగానే ఉంటారు. అక్కడ మీలో రాగ ద్వేషాలనే శబ్ధాలే ఉండవు. ఈ విధమైన దైవీ పరివారానికి చెందినవారిగా అయ్యేందుకు పురుషార్థము బాగా చేయాలి. నియమానుసారము చదువుకోవాలి. ఎప్పుడూ చదువు మిస్ చేయరాదు. జబ్బుతో ఉన్నా బుద్ధిలో శివబాబా స్మృతి ఉండాలి. ఇందులో మాట్లాడే విషయమేదీ లేదు. మనము శివబాబా పిల్లలమని, బాబా మనలను తీసుకెళ్లేందుకు వచ్చారని ఆత్మకు తెలుసు. ఈ అభ్యాసము చాలా బాగా చేయాలి. ఎక్కడ ఉన్నా తండ్రి స్మృతిలో ఉండాలి. తండ్రి వచ్చిందే శాంతిధామము, సుఖధామములోకి తీసుకెళ్లేందుకు. ఇది ఎంత సులభము! చాలామంది ఎక్కువగా ధారణ చేయలేరు. పోనీ స్మృతి అయినా చేయండి. ఇక్కడ పిల్లలందరూ కూర్చొని ఉన్నారు. ఇందులో కూడా నెంబర్వారుగా ఉన్నారు. అలా తప్పకుండా అవ్వాల్సిందే. శివబాబాను తప్పకుండా స్మృతి చేస్తారు. అందరూ ఇతర సాంగత్యాలను వదిలి ఒక్కరితోనే సాంగత్యము జోడించేవారుగా అవుతారు. ఇతరుల ఎవ్వరి స్మృతి ఉండదు. కానీ ఇందులో చివరి వరకు పురుషార్థము చేయవలసి ఉంటుంది. శ్రమ చేయాలి. ఆంతరికములో సదా ఒక్క శివబాబా స్మృతియే ఉండాలి. తిరిగేందుకు ఎక్కడకు వెళ్లినా లోపల తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. నోటితో మాట్లాడే అవసరమే ఉండదు. ఇది చాలా సులభమైన చదువు. చదివించి మిమ్ములను తమ సమానంగా తయారు చేస్తారు. ఇటువంటి స్థితిలోనే పిల్లలైన మీరు వెళ్లాలి. ఎలాగైతే సతోప్రధాన స్థితిలో వచ్చారో మళ్లీ అదే స్థితిలో వెళ్లాలి. ఈ విషయాన్ని అర్థం చేయించడం చాలా సులభము. ఇంటి పని పాటలు చూసుకుంటూ, నడుస్తూ, తిరుగుతూ స్వయాన్ని పుష్పంగా తయారు చేసుకోవాలి. మాలో ఏ ఆందోళన, గడబిడ లేదు కదా? అని పరిశీలించుకోవాలి. వజ్రము ఉదాహరణ కూడా స్వయాన్ని పరిశీలించుకునేందుకు చాలా బాగుంది. స్వయంగా మీరే భూతద్దము వంటివారు. నాలో అంశమాత్రము కూడా దేహాభిమానము లేదు కదా? అని పరిశీలించుకోవాలి. భలే ఈ సమయములో అందరూ పురుషార్థము చేస్తున్నారు, కానీ లక్ష్యమైతే మీ ముందు ఉంది కదా. మీరు అందరికీ సందేశమివ్వాలి. ఖర్చయినా ఈ సందేశము అందరికీ లభించునట్లు వార్తాపత్రికలలో వేయించమని బాబా అంటున్నారు. ఒక్క తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమై పవిత్రంగా అవుతారని చెప్పండి. ఇప్పుడింకా ఎవ్వరూ పవిత్రంగా లేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పవిత్ర ఆత్మలు నూతన ప్రపంచములోనే ఉంటారు. ఈ పాత ప్రపంచము అపవిత్రంగా ఉంది. ఇందులో ఒక్కరు కూడా పవిత్రంగా ఉండజాలరు. ఆత్మ ఎప్పుడైతే పవిత్రంగా అయిపోతుందో అప్పుడు పాత శరీరాన్ని వదిలేస్తుంది. వదిలే తీరాలి. స్మృతి చేస్తూ చేస్తూ మీ ఆత్మ పూర్తిగా పవిత్రమైపోతుంది. శాంతిధామము నుండి మనం పూర్తి పవిత్ర ఆత్మలుగా వచ్చాము, మళ్లీ గర్భమహలులో కూర్చున్నాము, తర్వాత మళ్లీ ఇంత పాత్ర చేశాము. ఇప్పుడు చక్రము పూర్తి చేశాము. మళ్లీ ఆత్మలైన మీరు మీ ఇంటికి వెళ్తారు. అక్కడ నుండి మళ్లీ సుఖధామములోకి వస్తారు. అక్కడ గర్భమహలుంటుంది. ఉన్నత పదవి పొందేందుకు మళ్లీ పురుషార్థము చేయాలి. ఇది చదువు. ఇప్పుడు వేశ్యాలయమైన నరకము వినాశనమై, శివాలయ స్థాపన జరుగుతూ ఉంది. ఇప్పుడు అందరూ వాపస్ తిరిగి వెళ్లాలి.
మనము ఈ శరీరాలను వదిలి మళ్లీ కొత్త ప్రపంచములో రాకుమారీలు-రాకుమారులుగా అవుతామని మీకు కూడా తెలుసు. కొంతమంది మేము ప్రజలలోకి వెళ్తామని భావిస్తారు. ఇందులో లైన్ పూర్తి క్లియర్గా ఉండాలి. ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. మరెవ్వరూ గుర్తు రాకూడదు. వీరినే పవిత్రమైన భికారులు అని అంటారు. శరీరము కూడా గుర్తు రాకూడదు. ఇది పాత ఛీ-ఛీ మురికి శరీరము కదా. ఇక్కడ బ్రతికి ఉండే మరణించాలని బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు మనము వాపస్ ఇంటికి వెళ్లాలి. మన ఇంటిని మర్చిపోయాము. ఇప్పుడు మళ్లీ తండ్రి స్మృతినిప్పించారు. ఇప్పుడీ నాటకము పూర్తి అవుతుంది. మీరందరూ వానప్రస్థులని తండ్రి అర్థం చేయిస్తారు. ఈ సమయములో మొత్తం విశ్వములో ఉన్న మానవులంతా వానప్రస్థ స్థితిలో ఉన్నారు. నేను వచ్చాను, సర్వాత్మలను శబ్ధము నుండి అతీతంగా తీసుకెళ్తాను. ఇప్పుడు చిన్న-పెద్ద అందరిదీ వానప్రస్థ స్థితి అని తండ్రి చెప్తున్నారు. వానప్రస్థ స్థితి అని దేనిని అంటారో కూడా ఇంతకుముందు మీకు తెలియదు. తెలియకుండానే వెళ్లి గురువులను ఆశ్రయించేవారు. మీరు లౌకిక గురువుల ద్వారా అర్ధకల్పము పురుషార్థము చేస్తూ వచ్చారు. కానీ జ్ఞానము కొద్ది పాటి కూడా లేదు. ఇప్పుడు చిన్న-పెద్ద అందరిదీ వానప్రస్థ స్థితియే అని స్వయంగా తండ్రే చెప్తున్నారు. ముక్తి అయితే అందరికీ లభిస్తుంది. చిన్న-పెద్ద అందరూ సమాప్తమైపోతారు. తండ్రి అందరినీ వాపస్ తీసుకెళ్లేందుకు వచ్చారు. ఇందులో పిల్లలకు చాలా సంతోషముండాలి. ఇక్కడ దు:ఖము అనుభవమవుతుంది. అందుకే స్వంత ఇల్లు అయిన స్వీట్ హోమ్ను స్మృతి చేస్తారు. ఇంటికి పోవాలని కోరుకుంటారు కానీ ఆ జ్ఞానమైతే లేదు. ఆత్మలైన మాకిప్పుడు శాంతి కావాలని అంటారు. ఎంత సమయం కొరకు కావాలి? అని తండ్రి అడుగుతారు. ఇక్కడేమో ప్రతి ఒక్కరూ తమ-తమ పాత్రను అభినయించాల్సిందే. ఇక్కడ ఎవ్వరూ శాంతిగా ఉండలేరు. ఈ గురువులు మొదలైనవారు అర్ధకల్పము మీతో చాలా శ్రమ చేయించారు. శ్రమ చేస్తూ దిక్కు తోచక తిరుగుతూ ఇంకా అశాంతిగా అయ్యారు. ఇప్పుడు శాంతిధామానికి అధికారి, స్వయంగా వచ్చి అందరినీ వాపస్ తీసుకెళ్తారు. చదివిస్తూ కూడా ఉంటారు. ముక్తి కొరకు నిర్వాణధామానికి వెళ్లేందుకే భక్తి చేస్తారు. సుఖధామానికి వెళ్లాలని ఎవరి బుద్ధిలోకి రాదు. అందరూ వానప్రస్థములోకి వెళ్లేందుకు పురుషార్థము చేస్తారు. మీరైతే సుఖధామములోకి వెళ్లేందుకు పురుషార్థము చేస్తారు. మొదట శబ్ధాతీత అవస్థ తప్పకుండా కావాలని మీకు తెలుసు. భగవంతుడు కూడా ప్రమాణము చేస్తున్నారు - '' నేను పిల్లలైన మిమ్ములను మన ఇంటికి తప్పకుండా తీసుకెళ్తాను.'' దీని కొరకు మీరు అర్ధకల్పము భక్తి చేశారు. ఇప్పుడు శ్రీమతమును అనుసరిస్తే ముక్తి-జీవన్ముక్తికి వెళ్తారు. శాంతిధామానికైతే అందరూ తప్పకుండా వెళ్లాల్సిందే. ఇష్టమున్నా లేకున్నా డ్రామానుసారంగా అందరూ తప్పక వెళ్లాల్సిందే. ఇష్టమున్నా లేకున్నా నేను అందరినీ వాపస్ తీసుకెళ్లేందుకు వచ్చాను. బలవంతంగానైనా లెక్కాచారము చుక్తా చేయించి తీసుకెళ్తాను. మీరు సత్యయుగములోకి వెళ్తారు, మిగిలినవారు శబ్ధానికి దూరంగా శాంతిధామములో ఉంటారు. ఎవ్వరినీ వదిలిపెట్టను. రాకపోతే శిక్ష విధించి కొడ్తూ కొడ్తూ కూడా తీసుకెళ్తాను. డ్రామాలో పాత్రయే అలా ఉంది కనుక బాగా సంపాదించుకుని వెళ్తే మంచి పదవి కూడా లభిస్తుంది. చివర్లో వచ్చేవారు సుఖమేం పొందుతారు? తప్పకుండా వెళ్ళాల్సిందేనని తండ్రి అందరికీ చెప్తున్నారు. శరీరాలను తగులబెట్టి ఆత్మలందరినీ నాతో తీసుకెళ్తాను. నా జతలో రావల్సింది ఆత్మలే. నా మతమును అనుసరించి సర్వ గుణ సంపన్నులుగా, 16 కళా సంపూర్ణులుగా అయితే పదవి కూడా మంచిది లభిస్తుంది. మీరు వచ్చి మా అందరికీ మృత్యువు ఇవ్వమ్మని మీరు పిలిచారు కదా. ఇప్పుడు మృత్యువు రానే వచ్చేసింది. ఎవ్వరూ తప్పించుకోలేరు. పనికిరాని(ఛీ-ఛీ) శరీరము ఉండనే ఉండదు, వాపస్ తీసుకెళ్లాలనే పిలిచారు. అందుకే తండ్రి అంటున్నారు - పిల్లలూ, ఈ ఛీ-ఛీ ప్రపంచము నుండి మిమ్ములను వాపస్ తీసుకెళ్తాను. మీ జ్ఞాపకచిహ్నం కూడా ఉంది. దిల్వాడా మందిరముంది కదా. అది హృదయము తీసుకునేవారి మందిరము, ఆది దేవుడు కూడా కూర్చొని ఉన్నారు. శివబాబా కూడా ఉన్నారు. బాప్దాదాలు ఇరువురూ ఉన్నారు. ఇతని(బ్రహ్మ) శరీరములో బాబా విరాజమానమై ఉన్నారు. మీరు అక్కడకు వెళ్తే ఆదిదేవుని చూస్తారు. ఇక్కడ కూర్చున్నవారు బాప్దాదా అని ఆత్మలైన మీకు తెలుసు.
ఈ సమయంలో మీరు అభినయించే పాత్రకు జ్ఞాపక చిహ్నము నిలబడి ఉంది. మహారథులు, అశ్వారోహులు, పదాతిదళము వారు కూడా ఉన్నారు. కానీ అది జడమైనది. మీరు చైతన్యము. ఉపరి భాగములో వైకురఠము కూడా ఉంది. మీరు దిల్వాడా మందిరములో ఉన్న మీ నమూనాలు చూసి వస్తారు. కల్ప-కల్పము ఈ మందిరము ఇలాగే తయారవుతుందని మీకు తెలుసు, దానిని మీరు మళ్లీ చూస్తారు. కొంతమంది తికమక చెందుతారు. ఈ పర్వతాలు మొదలైనవన్ని ఛిన్నాభిన్నమై మళ్లీ ఎలా తయారవుతాయి? అని ఆలోచించరాదు. మరి ఇంతవరకైతే స్వర్గము కూడా లేదు, తర్వాత ఎలా వస్తుంది? పురుషార్థము ద్వారా అన్నీ తయారవుతాయి కదా. స్వర్గములోకి వెళ్లేందుకు మీరిప్పుడే తయారవుతున్నారు. కొంతమంది చిక్కుల్లో చిక్కుకొని చదువే వదిలేస్తారు. ఇందులో తికమకపడే అవసరమే లేదని తండ్రి చెప్తున్నారు. అచ్చట అన్నీ మనమే తయారు చేసుకుంటాము. ఆ ప్రపంచము సతోప్రధానంగా ఉంటుంది. అక్కడ ఫల-పుష్పాలు మొదలైనవన్నీ చూచి వస్తారు, శూబీ రసము త్రాగుతారు. సూక్ష్మవతనము, మూలవతనములో ఇవేవీ ఉండవు. ఇవన్నీ వైకుంఠములో ఉంటాయి. ప్రపంచ చరిత్ర-భూగోళము రిపీట్ అవుతాయి. ఈ నిశ్చయమైతే పక్కాగా ఉండాలి. భాగ్యములో లేకుంటే - ''ఇది ఎలా సంభవము? వజ్రాలు, రత్నాలు ఇప్పుడు లేనే లేవు కదా, అవి మళ్లీ ఎలా వస్తాయి! పూజ్యులుగా ఎలా తయారవుతారు?'' అని అడుగుతారు. తండ్రి చెప్తున్నారు - ఇది పూజ్యుల నుండి పూజారులుగా అయ్యే రచింపబడిన నాటకము. మనమే బ్రాహ్మణ, దేవత, క్షత్రియులుగా అవుతాము. ఈ సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. మీరు అర్థం చేసుకున్నారు కాబట్టే బాబా, కల్పక్రితము కూడా మిమ్ములను కలిశామని అంటారు. మా జ్ఞాపక చిహ్న మందిరమే ముందు నిల్చొని ఉందని అంటారు. దీని తర్వాతనే స్వర్గ స్థాపన జరుగుతుంది. మీ చిత్రాలలో అద్భుతముంది. ఎంతో ఆసక్తితో వచ్చి చూస్తారు. మొత్తం ప్రపంచములో ఎక్కడా ఎవ్వరూ ఇటువంటి చిత్రాలను చూడలేదు. ఇటువంటి చిత్రాలను తయారు చేసి జ్ఞానము కూడా ఎవ్వరూ ఇవ్వలేరు, ఎవ్వరూ వీటిని కాపీ చేయలేరు. ఈ చిత్రాలు ఒక ఖజానా వంటివి. వీటి ద్వారా మీరు పదమాపదమ్ భాగ్యశాలురుగా అవుతారు. మా ప్రతి అడుగులో అనేకరెట్లు భాగ్యముందని మీరు భావిస్తారు. అడుగు అంటే చదువు అనే అడుగు. ఎంత యోగములో ఉంటారో, ఎంత చదువుకుంటారో అంత పదమాల సంపాదన జరుగుతుంది. ఒకవైపు మాయ కూడా అత్యంత శక్తివంతంగా(ఫుల్ ఫోర్స్లో) వస్తుంది. మీరిప్పుడు శ్యామ-సుందరులుగా అవుతారు. సత్యయుగములో మీరు సుందరంగా, స్వర్ణిమ యుగము వారిగా ఉండేవారు. కలియుగములో శ్యామము(నలుపు)గా ఇనుప యుగము వారిగా అయ్యారు. ప్రతి వస్తువు ఇలాగే అవుతుంది. ఇక్కడ భూమి కూడా సారవిహీనమై బీడు పడిపోయింది. అక్కడ భూమి కూడా ఫస్ట్క్లాసుగా ఉంటుంది. ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుంది. అటువంటి రాజధానికి మీరు అధికారులుగా అవుతున్నారు. అనేకసార్లు అలా అయ్యారు. మళ్లీ అలాంటి రాజధానికి అధికారులుగా అయ్యేందుకు పురుషార్థము పూర్తిగా చేయాలి. పురుషార్థము చేయకుండా ప్రాలబ్ధమెలా పొందుతారు? ఇందులో ఏ కష్టమూ లేదు.
మురళీ అచ్చవుతుంది. పోను పోను లక్షలు కోట్లలో అచ్చు అవుతుంది. మా వద్ద ఉన్న ధనాన్ని యజ్ఞములో ఉపయోగించండి, ఉంచుకొని ఏం చేయాలి? అని పిల్లలంటారు. ముందు ముందు ఏమేమి జరుగుతుందో చూడండి. వినాశనానికి జరిగే ఏర్పాట్లు కూడా మీరు చూస్తూ ఉంటారు. రిహార్సల్ జరుగుతూ ఉంటుంది. మళ్లీ శాంతమైపోతుంది. పిల్లలకు బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. చాలా సహజమైనది. కేవలం తండ్రిని స్మృతి చేయండి. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఈ శరీరాన్ని కూడా మరచి పూర్తి పవిత్ర భికారులుగా అవ్వాలి. లైను స్పష్టంగా ఉంచుకోవాలి. ఈ నాటకమిప్పుడు పూర్తి అయ్యింది. మేము మా స్వీట్ హోంకు(శాంతిధామానికి) వెళ్తామని బుద్ధిలో ఉండాలి.
2. చదువులోని ప్రతి అడుగులో అనేక రెట్లు లాభముంది. అందువలన ప్రతి రోజూ చాలా బాగా చదవాలి. దేవతా కుటుంబ సభ్యులుగా అయ్యే పురుషార్థము చేయాలి. మాకు అతీంద్రియ సుఖము ఎంత మాత్రముంది? నాకు సంతోషముందా? అని మిమ్ములను మీరు ప్రశ్నించుకోవాలి.
వరదానము :-
'' మీ టైటిల్ను స్మృతిలో ఉంచుకొనుటతో పాటు సమర్థ స్థితిని తయారు చేసుకునే స్వమానధారీ భవ ''
సంగమ యుగములో స్వయం తండ్రియే తన పిల్లలకు శ్రేష్ఠమైన టైటిళ్లను (బిరుదులను) ఇస్తారు. కనుక అదే ఆత్మిక నశాలో ఉండండి. ఎటువంటి టైటిల్ గుర్తుకొస్తుందో అటువంటి సమర్థమైన స్థితి తయారవుతూ ఉండాలి. ఉదాహరణానికి స్వదర్శన చక్రధారి అనే టైటిల్ స్మృతిలోకి వస్తూనే పరదర్శనం సమాప్తమైపోవాలి. స్వదర్శనం ముందు మాయ గొంతు తెగిపోవాలి. 'నేను వీరుడను' అనే టైటిల్ స్మృతిలోకి వస్తూనే స్థితి అచల్-అడోల్గా అయిపోవాలి. కనుక టైటిల్ స్మృతితో పాటు సమర్థ స్థితిని తయారు చేసుకోండి. అప్పుడు మిమ్ములను శ్రేష్ఠ స్వమానధారులని అంటారు.
స్లోగన్ :-
'' వెతుకుచున్న (భ్రమిస్తున్న) ఆత్మల కోరికను పూర్తి చేసేందుకు పరిశీలనా శక్తిని పెంచుకోండి ''