27-06-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - విశ్వానికి అధికారులుగా చేయు తండ్రిని చాలా అభిరుచితో (ప్రేమగా) స్మృతి చేయండి, స్మృతి ద్వారానే మీరు సతోప్రధానంగా అవుతారు ''

ప్రశ్న :-

ఏ విషయం పై సంపూర్ణ గమనముంచితే బుద్ధి తలుపులు(కపాట్‌ ఖుల్‌తా) తెరుచుకుంటాయి?

జవాబు :-

చదువు పై. భగవంతుడు స్వయంగా చదివిస్తున్నారు, అందువలన ఎప్పుడూ చదువును మిస్‌ చేయరాదు. ఎంతవరకు జీవించి ఉంటారో, అంతవరకు అమృతము త్రాగాలి. చదువు పై గమనముంచాలి. గైరుహాజరు(ఆబ్సెంట్‌) అవ్వరాదు. ఎక్కడో ఒకచోట వెతుక్కొని అయినా మురళి తప్పకుండా చదవాలి. మురళిలో ప్రతిరోజూ కొత్త కొత్త పాయింట్లు వెలువడ్తూ ఉంటాయి. వాటి ద్వారా మీ బుద్ధి తలుపులు తెరుచుకుంటాయి.

ఓంశాంతి.

సాలిగ్రాములకు శివభాగవానువాచ. ఇది కల్పమంతటిలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఇది కూడా మీకు మాత్రమే తెలుసు. ఇతరులెవ్వరికీ తెలియదు. మనుష్యులకు ఈ రచయిత, రచనల ఆదిమధ్యాంతాలను గురించి ఏ మాత్రము తెలియదు. స్థాపనా కార్యములో విఘ్నాలు తప్పకుండా వస్తాయని పిల్లలైన మీకు తెలుసు. దీనిని 'జ్ఞాన-యజ్ఞము' అని అంటారు. పాత ప్రపంచములో మీరు ఏమి చూస్తున్నారో అదంతా స్వాహా అవ్వనున్నదని తండ్రి చెప్తున్నారు. అందువలన దాని పై మమకారము ఉంచుకోరాదు. తండ్రి వచ్చి నూతన ప్రపంచము కొరకు చదివిస్తున్నారు. ఇది పురుషోత్తమ సంగమ యుగము, ఇది వికారి మరియు నిర్వికారీ పప్రంచాల సంగమ సమయము. ఇది పరివర్తన అయ్యే సమయము. నూతన ప్రపంచాన్ని నిర్వికారి ప్రపంచమని అంటారు. అప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మము మాత్రమే ఉండేది. ఇది పిల్లలకు తెలుసు. పాయింట్లు బాగా అర్థము చేసుకోవాలి. తండ్రి రాత్రింబవళ్లు చెప్తూనే ఉంటారు - పిల్లలారా! మీకు అత్యంత రహస్యయుక్తమైన విషయాలు వినిపిస్తాను. తండ్రి ఎంతవరకు ఉంటారో అంతవరకు చదువు కొనసాగుతూనే ఉంటుంది. తర్వాత చదువు కూడా సమాప్తమైపోతుంది. ఈ విషయాలు మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు, అది బాప్‌దాదాకు మాత్రమే తెలుసు. ఎంతోమంది క్రిందపడ్తారు, ఎంతో కష్టము కలుగుతుంది. అందరూ సదా పవిత్రంగా ఉండగలరని కాదు, పవిత్రంగా ఉండకపోతే శిక్షలు అనుభవించవలసి వస్తుంది. మాలలోని పూసలు మాత్రమే గౌరవనీయంగా పాస్‌ అవుతారు. తర్వాత ప్రజలు కూడా తయారవుతారు. ఇవన్నీ చాలా అర్థము చేసుకునే విషయాలు. మీరు ఎవరికైనా అర్థం చేయిస్తే వారు అర్థము చేసుకోలేరు. కొంత సమయము పడ్తుంది అయినా తండ్రి అర్థం చేయించినంతగా మీరు అర్థం చేయించలేరు. ఫలానావారు వికారాలకు వశమయ్యారు, ఇలా జరిగింది,................ అని రిపోర్టు అందుతుంది. ఆ రిపోర్టులు నాకు మాత్రమే తెలుసు. పేరు నేను చెప్పను. ఒకవేళ పేర్లు చెప్తే వారితో మాట్లాడేందుకు కూడా ఎవ్వరూ ఇష్టపడరు. అందరూ అసహ్య దృష్టితో చూస్తారు, హృదయము నుండి క్రిందకు దిగిపోతారు. చేసిన సంపాదన అంతా సమాప్తమైపోతుంది. దీనిని గురించి దెబ్బ తిన్న వారికి తెలుస్తుంది, తండ్రికి తెలుస్తుంది. ఇవన్నీ చాలా గుప్తమైన విషయాలు.

మీరంటారు - ఫలానావారు కలిశారు, వారికి చాలా బాగా అర్థం చేయించాను, వారు సేవలో సహాయము చేయగలరు అని మీరంటారు. అయితే వారు సన్ముఖములో వచ్చినప్పుడు కదా సేవలో సహాయము చేసేది. గవర్నర్‌కు మీరు మంచి రీతిగా అర్థం చేయించినా, అతడు ఇతరులకు అర్థం చేయించలేడు. కొందరికి అర్థం చేయిస్తే వారు అంగీకరించనే అంగీకరించరు. ఎవరైతే అర్థము చేసుకోవాల్సి ఉంటుందో వారే అర్థము చేసుకుంటారు, ఇతరులకు అర్థము చేయించలేరు. ఇది ముళ్ల అడవి, దీనిని మనము మంగళకరంగా మార్చుతామని పిల్లలైన మీకు తెలుసు. మంగళం భగవాన్‌ విష్ణు అని అంటారు కదా. ఈ శ్లోకాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. విష్ణువు రాజ్యపాలన చేసినప్పుడు మంగళకరంగా ఉంటుంది. విష్ణువు అవతరణను కూడా చూపిస్తారు. ఈ బాబా అన్నీ చూశారు. అనుభవీ కదా. అన్ని ధర్మాల గురించి ఇతనికి బాగా తెలుసు. తండ్రి ఏ శరీరములో వస్తారో, అతనికి పర్సనాలిటీ(వ్యక్తిత్వము) కూడా ఉండాలి కదా. అందుకే అనేక జన్మల అంతిమములో ఎప్పుడైతే ఇక్కడ గొప్ప అనుభవజ్ఞునిగా అవుతాడో అప్పుడు నేను ఇతని శరీరములో ప్రవేశిస్తానని అందరికీ తెలుపుతాను. అది కూడా సాధారణ తనువులో వస్తాను. పర్సనాలిటీలో వస్తాను అంటే అర్థం రాజులు, ధనవంతులని కాదు. ఇతనికైతే చాలా అనుభవముంది. అనేక జన్మల అంతిమములో ఇతడి రథములోకి వస్తాను.

ఇక్కడ రాజధాని స్థాపన అవుతూ ఉందని మీరు ఇతరులకు అర్థం చేయించవలసి ఉంటుంది. మాల తయారవుతుంది. ఈ రాజధాని ఎలా స్థాపనవుతుంది? కొంతమంది రాజులుగా, కొంతమంది రాణులుగా, కొంతమంది మరోలా తయారవుతారు కానీ ఈ విషయాలన్నీ ఒకే రోజులో ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. అనంతమైన తండ్రి మాత్రమే అనంతమైన వారసత్వమునిస్తారు. భగవంతుడే వచ్చి అర్థం చేయిస్తున్నా కష్టము మీద కొంతమంది మాత్రమే పవిత్రంగా అవుతారు. ఇదంతా అర్థము చేసుకునేందుకు సమయము కావాలి. చాలా శిక్షలను అనుభవిస్తారు. శిక్షలను అనుభవిస్తే ప్రజలుగా అవుతారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ! మీరు చాలా-చాలా మధురంగా కూడా తయారవ్వాలి. ఎవ్వరికీ దుఃఖము కలుగజేయరాదు. తండ్రి వచ్చేదే అందరికీ సుఖమునిచ్చే మార్గాన్ని చూపేందుకు, దుఃఖము నుండి విడుదల చేసేందుకు. కావున స్వయం ఇతరులకు దుఃఖమునెలా ఇస్తారు? ఈ విషయాలన్నీ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. వెలుపలివారు చాలా కష్టము మీద అర్థము చేసుకుంటారు.

సంబంధీకులు మొదలైనవారు ఎవరైతే ఉన్నారో వారి నుండి మమకారాన్ని తెంచి వేయాలి. ఇంట్లో ఉంటున్నా నిమిత్తమాత్రంగా ఉండాలి. ఈ ప్రపంచమంతా సమాప్తమవ్వనున్నదని మీ బుద్ధిలో ఉంది. అయితే ఈ ఆలోచన కూడా ఎవ్వరికీ ఉండదు. అనన్యమైన పిల్లలు అర్థము చేసుకుంటారు. వారు కూడా ఇప్పుడు నేర్చుకునే పురుషార్థము చేస్తూ ఉంటారు. చాలామంది ఫెయిల్‌ కూడా అవుతారు. మాయ అనే విసురురాయి(చక్రము) చాలా వేగంగా తిరుగుతుంది. అది కూడా చాలా శక్తివంతమైనది కానీ ఈ విషయాలు ఇతరులెవ్వరికీ అర్థము చేయించలేరు. అర్థము చేసుకునేందుకు మీ వద్దకు వస్తారు, ఇక్కడ ఏం జరుగుతోంది, ఇన్ని రిపోర్టులు(ఫిర్యాదులు) మొదలైనవి ఎందుకు వస్తున్నాయి? అని తెలుసుకోవాలని అనుకుంటారు. తెలుసుకున్నవారు మారిపోతూ ఉంటారు. మళ్లీ కూర్చుని ఒక్కొక్కరికి అర్థం చేయించవలసి వస్తుంది. అర్థము చేసుకున్న తర్వాత ఇది చాలా మంచి సంస్థ అని అంటారు. రాజధాని స్థాపనయ్యే విషయాలు చాలా గుహ్యమైనవి, రహస్యమైనవి. అనంతమైన తండ్రి పిల్లలకు లభించారు అందువలన పిల్లలు ఎంత హర్షితంగా ఉండాలి. మనము విశ్వానికి అధికారులుగా, దేవతలుగా అవుతాము. మనలో దైవీ గుణాలు కూడా తప్పకుండా ఉండాలి. లక్ష్యము ఉద్ధేశ్యము మీ ముందే నిలబడి ఉంది కదా. వీరు(లక్ష్మీనారాయణులు) నూతన ప్రపంచానికి అధిపతులు. ఈ విషయాలన్నీ మీరు మాత్రమే అర్థము చేసుకుంటారు. మనము చదువుకుంటున్నాము. అనంతమైన తండ్రి ఎవరైతే జ్ఞానసాగరులో వారు మనలను అమరపురికి లేక స్వర్గములోకి తీసుకెళ్లేందుకు చదివిస్తున్నారు. మనకు ఈ జ్ఞానము లభిస్తుంది. ఎవరైతే కల్ప-కల్పము రాజ్యము తీసుకున్నారో వారే వస్తారు. కల్పక్రితము వలె మనము మన రాజధానిని స్థాపన చేస్తున్నాము. నంబరువారుగా ఈ మాల తయారవుతూ ఉంది. ఉదాహరణానికి పాఠశాలలో కూడా బాగా చదువుకున్నవారికి స్కాలర్‌షిప్‌ లభిస్తుంది కదా. అవి హద్దులోని విషయాలు. మీకు అనంతమైన విషయాలు లభిస్తాయి. తండ్రికి సహాయకారులైన వారే ఉన్నత పదవిని పొందుతారు. వాస్తవానికి మీకు మీరే సహాయము చేసుకోవాలి. పవిత్రంగా అవ్వాలి. సతోప్రధానంగా ఉండేవారు మళ్లీ తప్పకుండా అలాగే తయారవ్వాలి. తండ్రిని స్మృతి చేయాలి. లేస్తూ - కూర్చుంటూ - నడుస్తూ తండ్రిని స్మృతి చేయవచ్చు. విశ్వానికి అధికారులుగా తయారుచేసే తండ్రిని చాలా అభిరుచితో, ప్రేమతో స్మృతి చేయాలి. కానీ మాయ వదలదు. ''బాబా, మాకు మాయ కల్పించే వికల్పాలు చాలా వస్తున్నాయి'' అని అనేక విధాలైన రిపోర్టులు వ్రాస్తారు. తండ్రి చెప్తున్నారు - ఇది యుద్ధ మైదానము కదా. 5 వికారాల పై విజయము పొందాలి. తండ్రిని స్మృతి చేసినందున మనము సతోప్రధానంగా అవుతామని మీరు కూడా అర్థం చేసుకున్నారు. తండ్రి వచ్చి భక్తిమార్గములోని వారెవ్వరికీ తెలియదని అర్థం చేయిస్తారు. ఇది చదువు కదా. మీరు పావనంగా ఎలా అవుతారు! మీరే పావనంగా ఉండేవారు, మళ్లీ మీరే పావనంగా అవ్వాలి అని తండ్రి చెప్తున్నారు. దేవతలు పావనంగా ఉన్నారు కదా. మనము విద్యార్థులమని, చదువుకుంటున్నామని పిల్లలకు తెలుసు. భవిష్యత్తులో మళ్లీ సూర్యవంశ రాజ్యములోకి వస్తాము. దాని కొరకు పురుషార్థము కూడా మంచిరీతిగా చేయాలి. పూర్తి ఆధారమంతా మార్కుల పైనే ఉంటుంది. యుద్ధ మైదానములో ఫెయిల్‌ అవుతే చంద్రవంశములోకి వెళ్లిపోతారు. వారు యుద్ధము పేరు విని బాణము, విల్లంబులు మొదలైనవి (రామునికి) చూపించారు. బాణము, విల్లంబులు చూపేందుకు అక్కడ బాహుబల యుద్ధము ఏమైనా ఉందా!? అక్కడ అటువంటి విషయాలే ఉండవు. పూర్వము బాణాలతో యుద్ధము చేసేవారు. ఇప్పటికీ వాటి గుర్తులు ఉన్నాయి. కొంతమంది బాణాలు వేయడంలో చాలా నేర్పరితనము కలిగి ఉంటారు. ఇప్పుడు ఈ జ్ఞానములో యుద్ధము మొదలైన మాటలేవీ లేవు.

శివబాబా ఒక్కరే జ్ఞానసాగరులని, వారి ద్వారా మనము ఈ పదవిని పొందుతామని మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - దేహ సహితం దేహ సంబంధాలన్నిటి నుండి మమకారాన్ని తెంచి వేయాలి. ఇదంతా పురాతనమైనది. నూతన ప్రపంచము బంగారు యుగపు భారతదేశంగా ఉండేది. పేరు ఎంత ప్రసిద్ధంగా ఉండేది! ప్రాచీన యోగమును ఎప్పుడు, ఎవరు నేర్పించారు? స్వయంగా వారే వచ్చి అర్థం చేయించినంతవరకు ఇది ఎవ్వరికీ తెలియదు. ఇది చాలా కొత్తది. కల్ప-కల్పము ఏం జరుగుతూ వచ్చిందో అదే మళ్లీ రిపీట్‌ అవుతుంది. ఏ మాత్రము తేడా ఉండదు. తండ్రి చెప్తున్నారు - ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉన్నందున 21 జన్మలు అపవిత్రంగా అవ్వరు. తండ్రి ఎంతో మంచిరీతిగా అర్థం చేయిస్తారు. అయినా అందరూ ఏకరసంగా చదువుకోరు. రాత్రికి - పగలుకు ఉన్నంత తేడా ఉంది. చదువుకునేందుకు వస్తారు, కొద్దిగా చదువుకొని అదృశ్యమైపోతారు. ఎవరు బాగా అర్థము చేసుకుంటారో వారు తమ అనుభవాన్ని కూడా వినిపిస్తారు. జ్ఞానములోకి ఎలా వచ్చామో, పవిత్రతా ప్రతిజ్ఞ ఎలా చేశామో మొదలైన అనుభవాలు వినిపిస్తారు. పవిత్రతా ప్రతిజ్ఞ చేసి ఒక్కసారి అపవిత్రంగా అయినా సంపాదనంతా సమాప్తమైపోతుంది. ఇది లోలోపల తింటూ ఉంటుంది. వారు తండ్రిని స్మృతి చేయమని ఎవ్వరికీ చెప్పలేరు. ముఖ్యమైనది వికారాల విషయము గురించే అడుగుతారు. పిల్లలైన మీరు ఈ చదువును క్రమము తప్పకుండా రెగ్యులర్‌గా చదవాలి. తండ్రి చెప్తున్నారు - నేను మీకు కొత్త - కొత్త విషయాలు వినిపిస్తాను. మీరు విద్యార్థులు, మిమ్ములను భగవంతుడు చదివిస్తున్నారు. మీరు భగవంతుని విద్యార్థులు. ఇటువంటి ఉన్నతోన్నతమైన చదువును ఒక్క రోజు కూడా మిస్‌ చేయరాదు. ఒక్క రోజు మురళి వినకున్నా ఆబ్సెంట్‌ పడ్తుంది. మంచి - మంచి మహారథులు కూడా మురళిని మిస్‌ చేస్తారు. మాకు అంతా తెలుసని, మురళి చదవకుంటే ఏమవుతుందని వారు భావిస్తారు. అరే! ఆబ్సెంట్‌ పడ్తుంది, ఉత్తీర్ణులు అవ్వలేరు. తండ్రి స్వయంగా చెప్తున్నారు - ప్రతి రోజూ నేను మంచి-మంచి పాయింట్లు వినిపిస్తాను. ఇతరులకు అర్థము చేయించేందుకు సమయానికి చాలా పనికి వస్తాయి. వినకపోతే కార్యములో ఎలా ఉపయోగిస్తారు? ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు అమృతము త్రాగుతూనే ఉండాలి. శిక్షణలను ధారణ చేయాలి. ఎప్పుడూ ఆబ్సెంట్‌ అవ్వరాదు. ఎక్కడో ఒక చోట వెతికి ఎవరినో ఒకరిని అడిగి అయినా మురళి తీసుకొని చదివి తీరాలి. గర్వపడరాదు. అరే! స్వయం భగవంతుడైన తండ్రి చదివిస్తున్నారు అందువలన ఒక్క రోజు కూడా మిస్‌ అవ్వరాదు. ఎటువంటి పాయింట్లు వస్తాయంటే, వాటి వలన మీ బుద్ధి తలుపులు గానీ, ఇంకెవ్వరి బుద్ధి తలుపులు గానీ తెరుచుకుంటాయి. ఆత్మ అంటే ఏమిటి? పరమాత్మ అంటే ఏమిటి? పాత్ర ఎలా నడుస్తుంది? ఇవన్నీ అర్థం చేసుకునేందుకు సమయం కావాలి. చివరిలో కేవలం ఒక్కటి మాత్రము గుర్తుంటుంది - '' స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. '' కానీ ఇప్పుడు అర్థం చేయించవలసి ఉంటుంది. చివరి సమయములో తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఇంటికి వెళ్లాలి. స్మృతి ద్వారానే మీరు పవిత్రంగా అవుతారు. ఎంత పవిత్రంగా అయ్యామని మీరే అర్థం చేసుకోవచ్చు. అపవిత్రులకు తప్పకుండా బలము తక్కువగానే లభిస్తుంది. ముఖ్యమైనవారు అష్టరత్నాలే. వారు గౌరవప్రదంగా పాస్‌ అవుతారు. వారు ఏ శిక్షలూ అనుభవించరు. ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు. ఇది ఎంతో ఉన్నతమైన చదువు. మనము దేవతలుగా అవ్వగలమని స్వప్నములో కూడా అనుకోలేదు. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే మీరు పదమాపదమ్‌ భాగ్యశాలురుగా అవుతారు. దీని ముందు ఆ వ్యాపారము మొదలైనవి ఎందుకూ పనికి రావు, ఏ వస్తవూ పనికి రాదు. అయినా తప్పకుండా చేయవలసే వస్తుంది. మేము శివబాబాకు ఇస్తున్నామనే ఆలోచన కూడా ఎప్పుడూ రాకూడదు. అరే! మీరేమో పదమాపదమ్‌పతులుగా అవుతారు, ఇస్తున్నామని ఆలోచన వస్తే శక్తి తగ్గిపోతుంది. మానవుడు ఈశ్వరార్థము దాన-పుణ్యాలు ఈశ్వరుని నుండి తీసుకునేందుకు చేస్తారు. కావున అది ఇచ్చేది కానే కాదు. భగవంతుడు దాత కదా. మరుసటి జన్మలో ఎంతగానో ఇస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడి ఉంది. భక్తిమార్గములో అల్పకాలిక సుఖముంటుంది, మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖవారసత్వము పొందుతారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. జీవించి ఉన్నంతకాలము అమృతము త్రాగుతూనే ఉండాలి. శిక్షణలను ధారణ చేయాలి. భగవంతుడు చదివిస్తున్నారు, అందువలన ఒక్క రోజు కూడా మురళి మిస్‌ చేయరాదు.

2. పదమాల సంపాదన జమ చేసుకునేందుకు నిమిత్తమాత్రంగా ఇంట్లో ఉంటూ పని పాటలు చేసుకుంటూ ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి.

వరదానము :-

'' కర్మ మరియు సంబంధాలు రెండిటిలో స్వార్థ భావము నుండి ముక్తులుగా ఉండే బాప్‌సమాన్‌ కర్మాతీత భవ ''

అందరినీ ముక్తులుగా చేయడమే పిల్లలైన మీ సేవ. అయితే ఇతరులను ముక్తంగా చేస్తూ స్వయం బంధనాలలో బంధించుకోరాదు. ఎప్పుడైతే హద్దులోని 'నాది - నాది' నుండి ముక్తులుగా అవుతారో, అప్పుడు అవ్యక్త స్థితిని అనుభవం చేయగలరు. ఏ పిల్లలైతే లౌకిక మరియు అలౌకిక కర్మలు మరియు సంబంధాలు రెండిటిలో స్వార్థ భావము నుండి ముక్తులుగా ఉంటారో, వారే బాప్‌సమాన్‌ కర్మాతీత స్థితిని అనుభవం చేయగలరు. కనుక నేను ఎంతవరకు కర్మబంధనాల నుండి భిన్నంగా అయ్యాను? వ్యర్థ స్వభావ - సంస్కారాలకు వశమగుట నుండి ముక్తమయ్యాను? అని చెక్‌ చేసుకోండి.

స్లోగన్‌ :-

'' సరళ చిత్తము, సహజ స్వభావము గలవారే సహజయోగులు, భోళానాథునికి ప్రియులు. ''