19-03-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - ఇది కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగము, ఇందులో పాత ప్రపంచము పరివర్తనై క్రొత్తదిగా అవుతుంది. ఈ యుగాన్ని మీరు మర్చిపోవద్దు''

ప్రశ్న :-

తండ్రి తన చిన్న - పెద్ద పిల్లలందరినీ తమ సమానంగా తయారుచేసేందుకు ప్రీతిగా ఇచ్చే ఒక శిక్షణ ఏది ?

జవాబు :-

మధురమైన పిల్లలూ - ఇప్పుడిక తప్పులు చేయకండి, నరుని నుండి నారాయణునిగా తయారయ్యేందుకు మీరు ఇక్కడకు వచ్చారు కావున దైవీగుణాలను ధారణ చేయండి. ఎవ్వరికీ దు:ఖమునివ్వకండి. తప్పులు చేస్తే మీరు దు:ఖమునిస్తారు. తండ్రి పిల్లలకు ఎప్పుడూ దు:ఖమునివ్వరు. వారు మిమ్ములను ఆదేశిస్తున్నారు - పిల్లలూ! నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, యోగులుగా అవుతే వికర్మలు వినాశనమైపోతాయి. మీరు చాలా మధురంగా అవుతారు.

ఓంశాంతి.

ఏ పిల్లలైతే స్వయాన్ని ఆత్మగా భావించి పరమపిత పరమాత్మతో యోగము జోడిస్తారో, వారిని సత్యమైన యోగులని అంటారు, ఎందుకంటే తండ్రి ట్రూత్‌(సత్యము) కదా. కావున మీ బుద్ధియోగము సత్యము జతలో ఉంది. వారు వినిపించేదంతా సత్యమే. యోగులు, భోగులు అను రెండు విధాలైన జనులున్నారు. భోగులలో కూడా అనేక ప్రకారాల వారుంటారు. యోగులలో కూడా అనేక ప్రకారాల వారుంటారు. మీ యోగము ఒకే విధమైనది. వారి సన్యాసము వేరు, మీ సన్యాసము వేరు. మీరు పురుషోత్తమ సంగమ యుగములోని యోగులు. ఈ యోగము గురించి ఇతరులెవ్వరికీ మేము పవిత్రమైన యోగులమా లేక పతిత భోగులమా అని తెలియదు. ఇది కూడా పిల్లలకు తెలియదు. బాబా అందరినీ బచ్చా - బచ్చా(బిడ్డా - బిడ్డా) అని పిలుస్తారు ఎందుకంటే తాను అనంతమైన ఆత్మలకు తండ్రినని వారికి తెలుసు. మనమంతా ఆత్మలమని, పరస్పరము అందరమూ సోదరులమని మీరు అర్థము చేసుకున్నారు. వారు మన తండ్రి అని, మీరు తండ్రితో యోగము చేయడం వలన పవిత్రంగా అవుతారు. వారు భోగులు, మీరు యోగులు. తండ్రి మీకు తమ పరిచయమును ఇస్తారు. ఇది పురుషోత్తమ సంగమ యుగమని కూడా మీకు తెలుసు. ఈ విషయము మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. దీని పేరు పురుషోత్తమ సంగమ యుగము. అందువలన పురుషోత్తమ అనే పదమును ఎప్పుడూ మర్చిపోరాదు. ఇది పురుషోత్తములుగా అయ్యే యుగము. ఉన్నతమైన పవిత్రమైన మానవులను పురుషోత్తములని అంటారు. ఈ లక్ష్మీనారాయణులు ఉన్నతంగా, పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడు మీకు సమయము గురించి కూడా తెలిసిపోయింది. 5 వేల సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచము పాతదైపోతుంది. మళ్లీ దీనిని కొత్తదిగా చేసేందుకు తండ్రి వస్తారు. ఇప్పుడు మనము సంగమయుగ బ్రాహ్మణ కులానికి చెందినవారము. అత్యంత ఉన్నతమైనవారు బ్రహ్మ. కానీ బ్రహ్మను శరీరధారిగా చూపిస్తారు. శివబాబా ఏమో అశరీరి. అశరీరి మరియు శరీరధారుల మిలనము జరుగుతుందని పిల్లలు అర్థము చేసుకున్నారు. వారిని మీరు బాబా అని అంటారు. ఇది అద్భుతమైన పాత్ర కదా. వీరికి గాయనము కూడా ఉంది. వారికి మందిరాలు కూడా నిర్మిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా రథమును అలంకరిస్తారు. అనేక జన్మల అంతిమ జన్మలోని అంతిమ సమయములో ప్రవేశిస్తానని కూడా బాబా తెలిపించారు. అన్ని విషయాలను ఎంతో స్పష్టంగా అర్థము చేయిస్తారు. మొట్టమొదట ''భగవానువాచ'' అని చెప్పాల్సి వచ్చింది. అనేక జన్మల తర్వాత అంతిమ సమయములో అన్ని రహస్యాలను పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తాను. ఇతరులు అర్థము కూడా చేసుకోలేరు. పిల్లలైన మీరు కూడా అప్పుడప్పుడు మర్చిపోతారు. పురుషోత్తమ అను పదము వ్రాసినందున ఈ పురుషోత్తమ యుగమే కళ్యాణకారి యుగమని అర్థము చేసుకుంటారు. యుగము గుర్తుంటే ఇప్పుడు మేము నూతన ప్రపంచములోకి వెళ్లేందుకు పరివర్తన చెందుతున్నామని అర్థము చేసుకుంటారు. నూతన ప్రపంచములో దేవతలుంటారు. ఇప్పుడు మీకు యుగముల గురించి కూడా తెలిసింది.

మధురమైన పిల్లలూ! - సంగమ యుగమును ఎప్పుడూ మర్చిపోవద్దని తండి అర్థం చేయిస్తారు. ఇది మర్చిపోతే మొత్తం జ్ఞానమంతా మర్చిపోతారు. ఇప్పుడు మనము పరివర్తన అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు పాత ప్రపంచము కూడా పరివర్తన చెంది కొత్తదిగా అవుతుంది. తండ్రి వచ్చి ప్రపంచాన్ని, పిల్లలను కూడా పరివర్తన చేస్తారు. పిల్లలూ! - పిల్లలూ! అని అందరినీ పిలుస్తారు. మొత్తం ప్రపంచములోని ఆత్మలందరూ వారికి పిల్లలే. ఈ డ్రామాలో అందరికీ పాత్ర ఉంది. చక్రమును కూడా నిరూపించాలి. ప్రతి ఒక్కరు తమ తమ ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఈ దేవీదేవతా ధర్మాన్ని ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ స్థాపన చేయలేరు. ఈ ధర్మాన్ని బ్రహ్మ స్థాపన చేయరు. నూతన ప్రపంచములో దేవీ దేవతా ధర్మముంటుంది. పాత ప్రపంచములో ఎక్కడ చూసినా మనుష్యులే మనుష్యులున్నారు. నూతన ప్రపంచములో దేవీదేవతలుంటారు. దేవతలు పవిత్రులు. అచ్చట రావణ రాజ్యమే ఉండదు. పిల్లలైన మీకు తండ్రి రావణుని పై విజయము ప్రాప్తి చేయిస్తారు. రావణుని పై విజయము ప్రాప్తి అయిన వెంటనే రామ రాజ్యము ప్రారంభమవుతుంది. నూతన ప్రపంచమును రామరాజ్యమని, పాత ప్రపంచమును రావణ రాజ్యమని అంటారు. రామరాజ్యము ఎలా స్థాపన అవుతుందో, పిల్లలైన మీకు తప్ప ఎవ్వరికీ తెలియదు. రచయిత అయిన తండ్రి కూర్చుని పిల్లలైన మీకు రచన యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. రచయిత అయిన తండ్రి బీజరూపులు. బీజమును వృక్షపతి అని అంటారు. అది జడ బీజము. అయితే తండ్రి అటువంటి జడ బీజమని అనుకోవద్దు. బీజము నుండే మొత్తం వృక్షమంతా వస్తుందని మీకు తెలుసు. ఈ మొత్తం విశ్వమంతా ఒక పెద్ద వృక్షము. అది జడము. ఇది చైతన్యము. మనుష్యసృష్టికి బీజరూపులు సత్‌-చిత్‌-ఆనంద స్వరూపులైన తండ్రి. వారి నుండి ఎంతో పెద్ద వృక్షము వెలువడ్తుంది. కానీ దాని నమూనా(మాడల్‌) చిన్నదిగా చేస్తారు. మనుష్య సృష్టి వృక్షము అన్నిటికంటే పెద్దది. అత్యంత ఉన్నతమైనవారు జ్ఞాన సాగరులు. ఆ వృక్షాల జ్ఞానము చాలా మందికి ఉంటుంది కానీ ఈ వృక్ష జ్ఞానము ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. ఇప్పుడు హద్దులోని మీ బుద్ధిని తండ్రి పరివర్తన చేసి మీకు అనంతమైన(బేహద్‌) బుద్ధిని ఇచ్చారు. ఈ అనంతమైన వృక్షమును గురించి మీకు ఇప్పుడు తెలుసు. ఈ వృక్షానికి చాలా విస్తృతమైన పోలార్‌(పరిధి) లభించింది. తండ్రి పిల్లలైన మనందరినీ బేహద్‌లోకి తీసుకెళ్తారు. ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది. మొత్తం సృష్టి అంతా హింసాత్మకంగా ఉంది. ఒకరినొకరు హింసించుకుంటున్నారు. పిల్లలైన మీకిప్పుడు జ్ఞానము లభించింది. సత్యయుగములోని దేవతా ధర్మము ఒక్కటే అహింసాత్మకమైనది. సత్యయుగములో అందరూ పవిత్రంగా సుఖ-శాంతులతో ఉంటారు. 21 జన్మలకు అన్ని మనోకామనలు పూర్తి అవుతాయి. సత్యయుగములో ఏ కోరికా ఉండదు. ధన-ధాన్యాలు మొదలైనవన్నీ అపారంగా లభిస్తాయి. ఈ బొంబాయి పట్టణము మొదట ఉండేది కాదు. దేవతలు ఉప్పునీటి సముద్ర తీరములో ఉండరు. మధురమైన నదీ జలాలున్న చోట దేవతలుండేవారు. మనుష్యులు కొద్దిమందే ఉండేవారు. ఒక్కొక్కరికి చాలా భూమి ఉండేది. సత్యయుగములో నిర్వికారి ప్రపంచముంటుంది. మీరు యోగబలముతో విశ్వరాజ్య పదవిని తీసుకుంటారు. దానినే రామరాజ్యమని అంటారు. మొట్టమొదట నూతన వృక్షము చాలా చిన్నదిగా ఉంటుంది. మొదట కాండములో ఒకే ఒక ధర్మముండేది. తర్వాత పునాది అనగా కాండము నుండి 3 కొమ్మలు వెలువడ్తాయి. మొదటిది పునాది వంటి దేవీదేవతా ధర్మము కాండము నుండి చిన్న-చిన్న కొమ్మలు-రెమ్మలు వెలువడ్తాయి. ఇప్పుడు ఈ వృక్షానికి కాండమే లేదు. ఇటువంటి వృక్షము మరొకటి ఉండనే ఉండదు. దీని ఉదాహరణ కూడా మర్రి వృక్షముతో ఖచ్ఛితంగా సరిపోతుంది. మొత్తం మర్రి వృక్షమంతా నిలబడే ఉంటుంది కానీ దాని కాండము ఉండనే ఉండదు. అలాగని వృక్షము ఎండిపోనూ ఎండిపోదు. వృక్షమంతా హరాభరాగా(ఆకుపచ్చగా) నిలబడే ఉంది. కానీ దేవీదేవతా ధర్మపు పునాది లేనే లేదు. కాండమంటే ఈ ధర్మమే కదా. రామ రాజ్యము లేక దేవీదేవతా ధర్మము కూడా కాండములోనే వచ్చేస్తుంది. నేను 3 ధర్మాలను స్థాపన చేస్తున్నానని తండ్రి చెప్తున్నారు. ఈ విషయాలన్నీ సంగమయుగ బ్రాహ్మణులైన మీరు మాత్రమే అర్థము చేసుకుంటారు. బ్రాహ్మణులైన మీది చిన్న కులము. చిన్న చిన్న మఠాలు-మార్గాలు అనేకము వెలువడ్తాయి కదా. అరవిందాశ్రమము చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. ఎందుకంటే అందులో వికారాలను నిషేధించరు. దాని విషయము తెలుపనే తెలుపరు. ఇచ్చట ''కామము మహాశత్రువని, దాని పై విజయము పొందాలని'' తండ్రి చెప్తున్నారు. ఈ విధంగా మరెవ్వరూ చెప్పరు. అలా చెప్తే వారి వద్ద కూడా గలాటాలు జరుగుతాయి. ఇక్కడ ఉన్నవారంతా పతిత మానవులే కనుక పావనమయ్యే విషయము ఎవ్వరూ వినరు. వికారాలు లేకుండా పిల్లలు ఎలా జన్మిస్తారని అంటారు. పాపం వారి దోషము కూడా లేదు. గీతను పఠించువారు కూడా భగవానువాచ - 'కామము మహాశత్రువు' అని అంటారు. దానిని జయిస్తే, జగత్‌జీతులుగా అవుతారు. కానీ అర్థము చేసుకోరు. వారు ఈ వాక్యమును వినిపించునప్పుడు వారికి అర్థము చేయించాలి. దీనిని గురించి బాబా చెప్తున్నారు - హనుమంతుడు వాకిలి వద్ద, చెప్పుల వద్ద కూర్చున్నట్లు మీరు కూడా వెళ్లి దూరంగా కూర్చుని వినండి. ఈ వాక్యము వారు వినిపించునప్పుడు, దీని రహస్యము ఏమిటని వారిని అడగండి. జగత్‌జీతులుగా ఈ దేవతలుండేవారు. దేవతలుగా తయారయ్యేందుకైతే ఈ వికారాలను వదలవలసి వస్తుంది. ఈ విషయము కూడా మీరు వారికి చెప్పవచ్చు. ఇప్పుడు రామరాజ్య స్థాపన అవుతూ ఉందని మీకు మాత్రమే తెలుసు. మీరే మహావీరులు. ఇందులో భయపడే విషయమేదీ లేదు. చాలా ప్రేమగా వారిని ఇలా అడగండి - స్వామిగారూ! మీరు ఈ వికారాల పై విజయము పొందుకుంటే విశ్వానికి యజమానులుగా అవుతారని చెప్పారు కదా. అయితే పవిత్రంగా ఎలా అవుతామో తెలుపలేదే అని అడగండి, ఇప్పుడు పిల్లలైన మీరు పవిత్రంగా ఉండే మహావీరులు. మహావీరులే విజయమాలలో కూర్చబడ్తారు. మానవ చెవులు అసత్యపు విషయాలు, తప్పు మాటలు వినేందుకు అలవాటు పడ్డాయి. ఇప్పుడు మీరు అసత్య మాటలు వినేందుకు ఏ మాత్రము ఇష్టపడరు. సత్యమైన మాటలు మీ చెవులకు ఇంపుగా ఉంటాయి. చెడు వినకు, చెడు చూడకు,.....మనుష్యులను తప్పకుండా జాగృతము చేయాలి. భగవంతుడు చెప్తున్నారు - పవిత్రులుగా అవ్వండి. సత్యయుగములో అందరూ పవిత్ర దేవతలుగా ఉండేవారు, ఇప్పుడు అందరూ అపవిత్రంగా ఉన్నారు. ఈ విధంగా అందరికీ అర్థం చేయించాలి. కామము మహాశత్రువని మా సత్సంగములో అర్థం చేయిస్తారని అందరికీ చెప్పండి. ఇప్పుడు పవిత్రంగా అవ్వాలనుకుంటే ఒక యుక్తి ద్వారా అవ్వండి - స్వయాన్ని ఆత్మగా భావించి భాయి - భాయి(సోదర) దృష్టిని పక్కా చేసుకోండి.

ఈ భారతదేశమే మొదట చాలా సంపన్న ఖండముగా ఉండేదని ఇప్పుడు ఆ సంపన్నత ఖాళీ అయిపోయిన కారణంగా హిందూస్థాన్‌ అని పేరుంచారని పిల్లలైన మీకు తెలుసు. మొట్టమొదట భారతదేశములో ధన-ధాన్యములు, సంపద, పవిత్రత, సుఖ-శాంతులు మొదలైన వాటిితో సంపన్నంగా ఉండేది. ఇప్పుడు దు:ఖముతో సంపన్నంగా ఉంది. అందుకే ఓ దు:ఖహర్త - సుఖకర్త....... అని మీరు పిలుస్తూ ఉంటారు. మీరు ఎంతో సంతోషంగా తండ్రి ద్వారా చదువుకుంటున్నారు. బేహద్‌ తండ్రి నుండి బేహద్‌ సుఖ వారసత్వము తీసుకోకుండా పద్దనేవారు ఎవరుంటారు! మొట్టమొదట అల్ఫ్‌(పరమాత్మ)ను అర్థము చేసుకోవాలి. అల్ఫ్‌ను తెలుసుకోకుంటే ఏ రహస్యమూ బుద్ధిలోకి రానే రాదు కావున అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వమునిచ్చేవారనే నిశ్చయము బుద్ధిలో కూర్చుంటే అప్పుడు ముందుకు వెళ్తారు. తండ్రిని ప్రశ్నించే అవసరము పిల్లలకు ఉండదు. తండ్రి పతితపావనులు, వారినే మీరు స్మృతి చేస్తారు. వారి ద్వారానే మీరు పావనంగా అవుతారు. నన్ను మీరు అందుకే పిలిచారు. ఒక్క సెకండులోనే జీవన్ముక్తి లభిస్తుంది. అయినా స్మృతియాత్రకు సమయము పడ్తుంది. ముఖ్యమైనది స్మృతియాత్ర. అందులోనే విఘ్నాలు ఏర్పడ్తాయి. అర్ధకల్పము మీరు దేహాభిమానములో ఉన్నారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మలో దేహీ-అభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది. ఈ బ్రహ్మకేమో చాలా సులభము. మీరు బాప్‌దాదా అని పిలుస్తారు. తండ్రి నా తల పై సవారీ అయ్యి ఉన్నారని ఇతనికి కూడా తెలుసు. వారిని ఎంతో మహిమ చేస్తాను, చాలా ప్రేమిస్తాను - బాబా! మీరు ఎంతో మధురమైనవారు, నాకు కల్ప-కల్పము ఎంతో నేర్పిస్తారు. తర్వాత అర్ధకల్పము మిమ్ములను స్మృతి కూడా చేయను, ఇప్పుడైతే చాలా స్మృతి చేస్తాను. నిన్నటివరకు నాలో ఏ మాత్రము జ్ఞానము లేదు. నిన్నటివరకు ఎవరిని పూజిస్తూ ఉన్నానో, నేనే వారిగా తయారవుతానని ముందు నాకు తెలియదు. ఇప్పుడు ఆశ్చర్యము కలుగుతూ ఉంది. యోగిగా అయినందున మళ్లీ ఈ దేవీదేవతలుగా అవుతాము. నాకు కూడా అందరూ పిల్లలే. ఈ బాబా చాలా ప్రీతితో పిల్లలను సంభాళన చేస్తారు. వీరిని పాలన చేస్తారు. ఇతను కూడా నా సమానమై నరుని నుండి నారాయణునిగా అవుతాడు. మీరు అందుకే ఇక్కడకు వచ్చారు. పిల్లలూ! తండ్రిని స్మృతి చేయండి, దైవీ గుణాలు ధారణ చేయండి, ఆహార పానీయాలను సంభాళన చేసుకోండి అని ఎంతగానో అర్థం చేయిస్తాను. అలా చేయకుంటే బహూశా ఇంకా సమయముందని అనుకుంటున్నారని నేను భావిస్తాను, ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది. చిన్నవారికి, పెద్దవారికి అందరికీ నేను చాలా ప్రేమతో అర్థం చేయిస్తాను - పిల్లలూ! తప్పులు చేయకండి, ఎవ్వరికీ దు:ఖమివ్వకండి, తప్పులు చేస్తే దు:ఖమిచ్చినట్లవుతుంది. తండ్రి ఎప్పుడూ దు:ఖమివ్వరు. వారు ఆదేశమునిస్తున్నారు - నన్నొక్కరినే స్మృతి చేస్తే వికర్మలు వినాశమౌతాయి. చాలా మధురంగా అవుతారు. ఇంత(లక్ష్మినారాయణ) మధురంగా అవ్వాలి. దైవీగుణాలు ధారణ చేయాలి, పవిత్రంగా అవ్వండి. ఇచ్చటకు అపవిత్రులు వచ్చేందుకు అనుమతి(హక్కు) లేదు. అప్పుడప్పుడు రానిస్తారు. అది కూడా ఇప్పటివరకే. చాలా వృద్ధి చెందినప్పుడు దీనిని పవిత్రతా శిఖరమని, శాంతి స్థూపమని అంటారు. అత్యంత ఉన్నతమైనది కదా. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతిలో ఉండడమే అత్యంత గొప్ప శక్తి. అక్కడ చాలా సైలెన్స్‌(శాంతి) ఉంటుంది. అర్ధకల్పము ఎలాంటి కొట్లాటలు మొదలైనవేవీ ఉండవు. ఇక్కడ ఎన్నో జగడాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. శాంతి ఉండజాలదు. శాంతిధామము అంటే మూలవతనము. మళ్లీ శరీరాన్ని ధరించి విశ్వములో పాత్రను చేసేందుకు వచ్చినప్పుడు అక్కడ కూడా శాంతి ఉంటుంది. ఆత్మ స్వధర్మము శాంతి, అశాంతిగా చేయించేది రావణుడు, మీరు శాంతి కొరకు శిక్షణ పొందుతూ ఉంటారు. ఎవరికైనా కోపము వస్తే, అందరినీ అశాంతిగా చేసేస్తారు. ఈ యోగబలముతో మీ నుండి మొత్తం మురికి అంతా తొలగిపోతుంది. చదువు ద్వారా మురికి తొలగిపోదు. స్మృతి ద్వారా మురికి అంతా భస్మమైపోతుంది. తుప్పు వదిలిపోతుంది. తండ్రి చెప్తున్నారు - నిన్నటి వరకు మీకు శిక్షణ ఇచ్చాను, అప్పుడే మర్చిపోయారా? 5 వేల సంవత్సరాల మాట. వారు లక్షల సంవత్సరాలని అనేస్తారు.

ఇప్పుడు మీకు సత్యానికి - అసత్యానికి గల వ్యత్యాసము తెలిసిపోయింది. తండ్రే స్వయంగా వచ్చి సత్యమేదో, అసత్యమేదో, జ్ఞానమేదో, భక్తి ఏదో, భ్రష్ఠాచారమంటే ఏమో, శ్రేష్ఠాచారమంటే ఏమో తెలుపుచున్నారు. భ్రష్ఠాచారులంటే వికారాలతో జన్మించినవారు. అక్కడ వికారాలుండవు, దేవతలు సంపూర్ణ నిర్వికారులని స్వయంగా మీరే అంటారు. అచ్చట రావణ రాజ్యమే ఉండదు. ఇవన్నీ సులభంగా అర్థము చేసుకునే విషయాలు, అర్థము చేసుకున్న తర్వాత ఏమి చేయాలి? ఒకటేమో తండిన్రి స్మృతి చేయాలి, మరొకటి తప్పకుండా పవితంగా అవ్వాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. పవిత్రంగా అయ్యేందుకు మహావీరులుగా అవ్వాలి. స్మృతియాత్ర ద్వారా లోపల ఉన్న మురికిని తొలగించుకోవాలి, మీ స్వధర్మమైన శాంతిలో స్థితమై ఉండాలి, అశాంతిని వ్యాపింపజేయరాదు.

2. తండ్రి ఏ సత్యమైన విషయాలను వినిపిస్తున్నారో, అవే వినాలి. చెడు వినకు........ తప్పు మాటలు వినండి. అందరినీ జాగృతము చేయండి. పురుషోత్తమ యుగములో పురుషోత్తములుగా అయ్యి ఇతరులను కూడా తయారు చేయండి.

వరదానము :-

''విస్మృతి ప్రపంచం నుండి వెలుపలికి వచ్చి స్మృతి స్వరూపులుగా ఉండి హీరో పాత్రను అభినయించే విశేష ఆత్మా భవ''

ఈ సంగమ యుగము స్మృతి కలిగించే యుగము. కలియుగము విస్మృతి కలిగించే యుగము. మీరందరూ విస్మృతి ప్రపంచం నుండి బయటకు వచ్చేశారు. ఎవరైతే స్మృతిస్వరూపులుగా ఉంటారో, వారే హీరో పాత్రను అభినయించే విశేష ఆత్మలు. ఈ సమయంలో మీరు డబల్‌ హీరోలు. ఒకటి - వజ్ర సమానం విలువైనవారిగా అయ్యారు, రెండవది - మీది హీరో పాత్ర. కనుక సదా ''వాహ్‌! నా శ్రేష్ఠ భాగ్యము'' అనే పాట హృదయంలో మ్రోగుతూ ఉండాలి. ఎలాగైతే దేహ సంబంధమైన కర్తవ్యాలు గుర్తుంటాయో, అలా ఈ అవినాశి కర్తవ్యము - ''నేను శ్రేష్ఠ ఆత్మను'' అని గుర్తుండాలి. అప్పుడు వారిని విశేషమైన ఆత్మలని అంటారు.

స్లోగన్‌ :-

''ఆత్మిక వైబ్రేషన్ల ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారుచేసే సేవ చేయడం అన్నిటికంటే శ్రేష్ఠమైన సేవ''