11-07-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - పల్టీల ఆటను (పిల్లి మొగ్గల ఆటను) గుర్తుంచుకోండి ఈ ఆటలో మొత్తం చక్రము, బ్రహ్మ మరియు బ్రాహ్మణుల రహస్యమంతా ఇమిడి ఉంది ''
ప్రశ్న :-
సంగమ యుగములో తండ్రి ద్వారా పిల్లలందరికీ ఏ వారసత్వము ప్రాప్తి అవుతుంది?
జవాబు :-
ఈశ్వరీయ బుద్ధి. ఈశ్వరునిలో ఏ గుణాలున్నాయో మనకు వాటిని వారసత్వంగా ఇస్తారు. మన బుద్ధి వజ్ర సమానంగా, పారసంగా(బంగారంగా) అవుతోంది. మనమిప్పుడు బ్రాహ్మణులుగా అయ్యి తండ్రి ద్వారా చాలా గొప్ప ఖజానాను తీసుకుంటున్నాము. సర్వగుణాలతో మన జోలెను నింపుకుంటున్నాము.
ఓంశాంతి.
ఈ రోజు సద్గురువారము. బృహస్పతివారము. రోజులలో కూడా కొన్ని ఉత్తమ రోజులుంటాయి. బృహస్పతి రోజు శ్రేష్ఠమైన రోజని చెప్తారు కదా. బృహస్పతి రోజు అనగా వృక్షపతి రోజు, పాఠశాలలో లేక కళాశాలలో చేరుతారు. ఈ మానవ సృష్టి రూపీ వృక్షానికి తండ్రి బీజరూపమని, వారు మృత్యుంజయ మూర్తి(అకాలమూర్తి) అని పిల్లలైన మీకు తెలుసు. అకాలమూర్తి అయిన తండ్రికి మీరు అకాలమూర్తి పిల్లలు. ఎంత సహజము! కేవలం స్మృతిలోనే కష్టముంది. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమౌతాయి. మీరు పతితుల నుండి పావనంగా అవుతారు. పిల్లలైన మీ పై అవినాశి అనంతమైన దశ ఉందని తండ్రి అర్థం చేయిస్తారు. మొదటిది హద్దు దశ. రెండవది బేహద్ దశ. తండ్రి వృక్షపతి. వృక్షము నుండి మొట్టమొదట బ్రాహ్మణులు వెలువడ్డారు. వృక్షపతి అయిన నేను సత్-చిత్-ఆనంద స్వరూపమునని తండ్రి చెప్తున్నారు. జ్ఞానసాగరులు, శాంతి సాగరులు............ అని మహిమ చేస్తూ ఉంటారు. సత్యయుగములో దేవీ దేవతలందరూ శాంతికి, పవిత్రతకు సాగరులని మీకు తెలుసు. భారతదేశము సుఖము, శాంతి, పవిత్రతలకు సాగరముగా ఉండేది. దీనినే విశ్వములో శాంతి అని అంటారు. మీరు బ్రాహ్మణులు. వాస్తవంగా మీరు కూడా అకాలమూర్తులే. ప్రతి ఆత్మ తన సింహాసనము పై విరాజమానమై ఉంది. ఇవన్నీ చైతన్య అకాల సింహాసనాలు. భృకుటి మధ్యలో అకాలమూర్తి ఆత్మ విరాజమానమై ఉంది. దీనిని నక్షత్రమని కూడా అంటారు. వృక్షపతి అయిన బీజరూపుని జ్ఞానసాగరుడని అంటారు. కాబట్టి వారు తప్పకుండా రావలసి వచ్చింది. మొట్టమొదట బ్రాహ్మణులు కావాలి. ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోబడిన పిల్లలు. కనుక తప్పకుండా మమ్మా కూడా కావాలి. పిల్లలైన మీకు చాలా బాగా అర్థం చేయిస్తారు. పల్టీల ఆట ఆడ్తారు కదా. దాని అర్థమును కూడా తెలియచేశారు. బీజరూపుడు శివబాబా తర్వాత బ్రహ్మ. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు రచింపబడ్డారు. ఈ సమయములో మేము బ్రాహ్మణులము తర్వాత మేమే దేవతలుగా అవుతామని..... మీరు అంటారు. మొదట మనము శూద్ర బుద్ధి గలవారిగా ఉండేవారము. ఇప్పుడు మళ్లీ తండ్రి పురుషోత్తమ బుద్ధిగా తయారు చేస్తారు. వజ్ర తుల్యమైన పారసబుద్ధిగా తయారు చేస్తారు. ఈ పల్టీల ఆట రహస్యమును కూడా అర్థం చేయిస్తారు. శివబాబా కూడా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ మరియు దత్తు పిల్లలు. ఎదురుగా కూర్చుని ఉన్నారు. మీరు ఇప్పుడెంతో విశాల బుద్ధి గలవారిగా అయ్యారు. బ్రాహ్మణుల నుండి మళ్లీ దేవతలుగా అవుతారు. మీరిప్పుడు ఈశ్వరీయ బుద్ధి గలవారిగా అవుతారు. ఏ గుణాలైతే ఈశ్వరునిలో ఉన్నాయో అవి మీకు వారసత్వంగా లభిస్తాయి. అర్థం చేయించునప్పుడు ఈ విషయాన్ని మర్చిపోకండి. తండ్రి నెంబర్వన్ జ్ఞానసాగరులు. వారిని జ్ఞానేశ్వరులని అంటారు. జ్ఞానము వినిపించే ఈశ్వరుడు. జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది. జ్ఞాన-యోగాల ద్వారా పతితులను పావనంగా చేస్తారు. భారతదేశపు ప్రాచీన రాజయోగము ప్రసిద్ధి చెందింది. వందుకంటే ఇనుప యుగము నుండి బంగారు యుగముగా అయ్యింది. యోగము రెండు రకాలని అర్థం చేయించారు - అది హఠయోగము, ఇది రాజయోగము. అది హద్దు, ఇది బేహద్దు. వారు హద్దు సన్యాసులు, మీరు బేహద్ సన్యాసులు. వారు ఇల్లు-వాకిలి వదిలేస్తారు. మీరు మొత్తం ప్రపంచమంతటిని సన్యసిస్తారు. మీరిప్పుడు ప్రజాపిత బ్రహ్మ సంతానము. ఇది చిన్నదైన కొత్త వృక్షము. పాతదాని నుండి కొత్తదిగా తయారౌతూ ఉందని మీకు తెలుసు. అంటు కట్టబడ్తూ ఉంది. తప్పకుండా మనము పల్టీల ఆట ఆడ్తాము. మనమే బ్రాహ్మణులము, మనమే దేవతలుగా అవుతున్నాము. ''నుండి'' అను పదము తప్పకుండా ఉంచాలి. కేవలం ''మనము'' అను పదము కాదు. మనమే శూద్రులుగా ఉండేవారము. మళ్లీ మనమే బ్రాహ్మణులుగా అయ్యాము.................. ఈ పల్టీల ఆటను ఎప్పుడూ మర్చిపోరాదు. ఇది చాలా సహజము. 84 జన్మలు మనమెలా తీసుకుంటామో మెట్లు ఎలా దిగుతూ మళ్లీ బ్రాహ్మణులుగా అయ్యి ఎలా ఎక్కుతామో చిన్న-చిన్న పిల్లలు కూడా అర్థం చేయించగలరు. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము.
ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యి చాలా గొప్ప ఖజానా తీసుకుంటున్నాము, జోలెను నింపుకుంటున్నాము. శంకరుని జ్ఞానసాగరుడని అనరు. అతడు జోలెను నింపడు. చిత్రకారులు ఆ చిత్రాన్ని అలా తయారు చేశారు. శంకరుని మాటే లేదు. ఈ విష్ణువు మరియు బ్రహ్మ ఇక్కడకు చెందినవారు. లక్ష్మీనారాయణులను దంపతుల రూపములో పైన చూపించారు. బ్రహ్మకు ఇది అంతిమ జన్మ. మొట్టమొదట ఇతడు విష్ణువుగా ఉండేవాడు. 84 జన్మల తర్వాత ఇతడు బ్రహ్మగా అయ్యాడు. ఇతనికి నేను బ్రహ్మ అని పేరు పెట్టాను. అందరి పేర్లు మార్చేశాను. ఎందుకంటే సన్యసించారు కదా. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయినందున పేర్లు మార్చేశాను. తండ్రి చాలా రమణీకమైన పేర్లు పెట్టారు. మీరిప్పుడు వృక్షపతి ఈ రథములో కూర్చున్నారని తెలుసుకున్నారు, చూస్తున్నారు. ఇది వారి అకాల(మృత్యువు లేని) సింహాసనము. వీరికి కూడా సింహాసనము ఇదే. ఈ సింహాసనాన్ని వారు లోనుగా తీసుకుంటారు. వారికి తమ సింహాసనముండదు. తండ్రి చెప్తున్నారు - ''నేను ఈ రథములో విరాజమానమౌతాను, నా పరిచయమిస్తాను.'' నేను మీ తండ్రిని. కేవలం నేను జనన-మరణాలలోకి రాను, మీరు వస్తారు. ఒకవేళ నేను కూడా వస్తే మిమ్ములను తమోప్రధానము నుండి సతోప్రధానంగా ఎవరు చేస్తారు? తయారు చేయువారు అయితే కావాలి కదా. అందువల్లనే నా పాత్ర ఈ విధంగా ఉంది. ''హే పతిత పావనా! రండి'' అని మీరు నన్ను పిలుస్తారు కూడా. నిరాకార శివబాబాను ఆత్మలు పిలుస్తారు. ఎందుకంటే ఆత్మలకిప్పుడు దు:ఖముంది. ముఖ్యంగా భారతవాసులైన ఆత్మలు - ''మీరు వచ్చి పతితులను పావనంగా చేయండి'' అని పిలుస్తారు. సత్యయుగములో మీరు చాలా పవిత్రంగా, సుఖంగా ఉండేవారు. ఎప్పుడూ పిలిచేవారు కాదు. ఇప్పుడు స్వయంగా తండ్ర్రే చెప్తున్నారు - మిమ్ములను సుఖీలుగా చేసి నేను మళ్లీ వానప్రస్థములో కూర్చుంటాను. అక్కడ మీకు నా అవసరమే ఉండదు. భక్తిమార్గములో నా పాత్ర ఉంది. తర్వాత అర్ధకల్పము వరకు నా పాత్ర లేదు. ఇది చాలా సులభము. ఇందులో ఎవ్వరూ ప్రశ్నించలేరు. దు:ఖములో అందరూ స్మరిస్తారు.......... అని గాయనము కూడా ఉంది. సత్య-త్రేతా యుగాలలో భక్తిమార్గమే ఉండదు. జ్ఞానమార్గమని కూడా అనరు. జ్ఞానము సంగమ యుగములోనే లభిస్తుంది. దీని ద్వారా మీరు 21 జన్మల ప్రాలబ్ధము పొందుతారు. నెంబరువారీగా ఉత్తీర్ణులౌతారు. ఫెయిల్ కూడా అవుతారు. ఈ యుద్ధము జరుగుతూ ఉంది. ఏ రథములో అయితే తండ్రి విరాజమై ఉన్నారో వారు విజయము పొందుతారని మీకు తెలుసు. అనన్య పిల్లలు కూడా విజయము పొందుతారు. ఉదాహరణానికి కుమార్కా(ప్రకాశమణి దాది) ఫలానా వారు కూడా తప్పకుండా విజయము పొందుతారు. చాలా మందిని తమ సమానంగా తయారు చేస్తారు. కనుక ఇది పల్టీల ఆట అని పిల్లలు బుద్ధిలో ఉంచుకోవాలి. చిన్నపిల్లలు కూడా ఇది అర్థము చేసుకోగలరు. కనుక పిల్లలకు కూడా నేర్పించమని బాబా చెప్తారు. తండ్రి ద్వారా వారసత్వమును తీసుకునేందుకు హక్కు వారికి కూడా ఉంది. పెద్ద విషయమేమీ కాదు. కొద్దిగానైనా ఈ జ్ఞానము తెలుసుకుంటే జ్ఞానము వినాశనమవ్వదు. స్వర్గములోకైతే తప్పకుండా వచ్చేస్తారు. క్రీస్తు స్థాపించిన క్రైస్తవ ధర్మము ఎంత పెద్దదిగా ఉంది. ఈ దేవీ దేవతా ధర్మము అన్నిటికంటే మొదటి ధర్మము. చాలా పెద్ద ధర్మము. ఇది రెండు యుగాలు కొనసాగుతుంది కనుక వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండాలి కానీ హిందూ ధర్మమని పిలిపించుకుంటున్నారు. 33 కోట్ల దేవతలని కూడా చెప్తారు. మరి హిందువులని ఎందుకు అంటారు? మాయ బుద్ధిని పూర్తిగా హతమార్చింది. కనుక ఈ పరిస్థితిలోకి వచ్చేశారు. మాయను జయించడం కఠినమేమీ కాదని తండ్రి చెప్తున్నారు. ప్రతి కల్పము మీరు విజయము పొందుతారు. మీరు సైనికులు కదా. ఈ వికారాలనే రావణుని పై విజయము కలిగించేందుకే తండ్రి వచ్చారు.
ఇప్పుడు మీ పైన బృహస్పతి దశ ఉంది. భారతదేశానికే బృహస్పతి దశ వస్తుంది. ఇప్పుడు అందరి పై రాహు దశ ఉంది. వృక్షపతి అయిన తండ్రి వస్తే తప్పకుండా భారతదేశము పై బృహస్పతి దశ కూర్చుంటుంది. ఇందులో అన్నీ వచ్చేస్తాయి. అక్కడ మృత్యువు అను పేరుండదని మనకు నిరోగి శరీరము లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. అది అమరలోకము కదా. ఫలానావారు మరణించారని అనరు. మరణమను పదమే ఉండదు. ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. శరీరము వదలడంలో మరియు తీసుకోవడంలో సంతోషంగా ఉంటారు. దు:ఖమను పేరే ఉండదు. ఇప్పుడు మీ పై బృహస్పతి దశ ఉంది. అందరి పై బృహస్పతి దశ ఉండదు. పాఠశాలలో కూడా కొందరు పాస్ (ఉత్తీర్ణులు) అవుతారు. కొందరు పాస్ అవ్వరు. ఇది కూడా పాఠశాలయే. రాజయోగమును నేర్చుకుంటామని మీరు చెప్తారు. నేర్పించేవారెవరు? బేహద్ తండ్రి కనుక ఎంత సంతోషము ఉండాలి! ఇందులో మరే విషయము లేదు. ముఖ్యమైనది పవిత్రతయే. హే పిల్లలారా! దేహ సహితము దేహ సంబంధాలన్నీ వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి అని వ్రాయబడి కూడా ఉంది. ఇది గీతలోని వాక్యము. ఇప్పుడు గీతా అధ్యాయము జరుగుతూ ఉంది. అందులో కూడా మనుష్యులు అర్థము - పర్థము లేని (అగడమ్-బగడమ్) మాటలు వ్రాసేశారు. పిండిలో ఏదో కాస్త ఉప్పు ఉన్నట్లు ఉంది. విషయము ఎరత సహజంగా ఉంది! చిన్న పిల్లలు కూడా అర్థము చేసుకోవచ్చు. అయినా ఎందుకు మర్చిపోతారు? బాబా మీరొస్తే మేము మీ పిల్లలుగానే అవుతాము. మీరు తప్ప మరెవ్వరూ లేరు. మేము మీ పిల్లలమై మీ నుండి పూర్తిగా వారసత్వము తీసుకుంటామని భక్తిమార్గములో మీరు అనేవారు. వారసత్వమును తీసుకునేందుకే తండ్రికి పిల్లలుగా అవుతారు. దత్తు పిల్లలుగా అవుతారు. తండ్రి ద్వారా మనకు ఏ వారసత్వము లభిస్తుందో తెలుసు. మీరు కూడా దత్తు పిల్లలే. మనము తండ్రి ద్వారా విశ్వ రాజ్యమును, అనంతమైన వారసత్వమును తీసుకుంటామని తెలుసుకున్నారు. ఇతరులెవ్వరి పైనా మమకారము ఉంచుకోము. ఎవరికైనా లౌకిక తండ్రి కూడా ఉన్నారనుకోండి, వారి వద్ద ఏముంటుంది? ఒకటో, ఒకటిన్నర లక్షో ఉంటుంది. ఇక్కడ అనంతమైన తండ్రి మీకు అనంతమైన వారసత్వమునిస్తారు.
పిల్లలైన మీరు అర్ధకల్పము నుండి అసత్య కథలు వింటూ వచ్చారు. ఇప్పుడు సత్యమైన కథను తండ్రి ద్వారా వింటారు. ఇటువంటి తండ్రిని స్మృతి చేయాలి. వారి మాటలు శ్రద్ధగా వినాలి. హమ్ సో కు(మనమే వారు) అర్థము కూడా తెలియజేయాలి. వారు ఆత్మయే పరమాత్మ అని అంటారు. ఈ 84 జన్మల కథను ఎవ్వరూ చెప్పలేరు. కుక్క, పిల్లి అన్నిటిలో ఉన్నారని తండ్రిని గురించి అంటారు. తండ్రిని గ్లాని చేస్తారు కదా! ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. ఎవరి పైనా దోషముంచరు. డ్రామాయే ఈ విధంగా తయారయ్యింది. మిమ్ములను జ్ఞానము ద్వారా దేవతలుగా చేసినవారినే నిందించుతారు. మీరిలాంటి పల్టీల ఆట ఆడ్తారు. డ్రామా కూడా ఈ విధంగా తయారయ్యింది. నేను మళ్లీ వచ్చి మీకు కూడా ఉపకారము చేస్తాను. ఇది మీ దోషము కూడా కాదని నాకు తెలుసు. ఇది ఆట. కథను నేను అర్థం చేయిస్తాను. ఇది సత్య సత్యమైన కథ. దీని ద్వారా మీరు దేవతలుగా అవుతారు. భక్తిమార్గములో అనేక కథలు తయారు చేశారు. లక్ష ్యమేదీ లేదు. అవన్నీ క్రిందపడేందుకే. ఆ పాఠశాలలో కూడా శరీర నిర్వహణ కొరకు లక్ష ్యముతో కూడిన విద్యను నేర్పిస్తారు. పండితులు తమ శరీర నిర్వహణ కొరకు కూర్చుని కథలు వినిపిస్తారు. లోకులు వారి ఎదుట ధనము ఉంచి వెళ్తారు. ప్రాప్తి ఏమీ ఉండదు. మీకిప్పుడు జ్ఞానరత్నాలు లభిస్తాయి. దీని ద్వారా మీరు కొత్త ప్రపంచానికి అధికారులుగా అవుతారు. అక్కడ ప్రతి వస్తువు క్రొత్తదిగా లభిస్తుంది. క్రొత్త ప్రపంచములో అన్నీ కొత్తవిగా ఉంటాయి. వజ్ర వైఢూర్యాలన్నీ కొత్తవిగా ఉంటాయి. మిగతా విషయాలన్నీ వదిలేసి మీరు పల్టీలాటను స్మృతి చేయండి. ఫకీరులు కూడా పల్టీలు కొట్టుకుంటూ తీర్థయాత్రలకు వెళ్తారు. కొందరు నడుచుకుంటూ కూడా వెళ్తారు. ఇప్పుడైతే మోటార్లు, బస్సులు, విమానాలు కూడా వచ్చాయి. పేదవారైతే అందులో వెళ్లలేరు. చాలా శ్రద్ధ ఉన్నవారైతే కాలినడకన కూడా వెళ్తారు. రోజురోజుకు విజ్ఞానము ద్వారా చాలా సుఖము లభిస్తూ ఉంటుంది. అయితే ఇది అల్పకాలిక సుఖము, పడిపోతే ఎంతో నష్టము కలుగుతుంది! ఈ వస్తువులలో అల్పకాలిక సుఖముంది. చివరికి అందులో మృత్యువే నిండి ఉంటుంది. అది విజ్ఞానము (సైన్స్). మీది మౌనము(సైలెన్స్). తండ్రిని స్మృతి చేయడం ద్వారా రోగాలన్నీ సమాప్తమైపోతాయి. నిరోగిగా అవుతారు. సత్యయుగములో సదా ఆరోగ్యంగా ఉంటారని మీరు భావిస్తారు. ఈ 84 జన్మల చక్రము తిరుగుతూనే ఉంటుంది. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి అర్థం చేయిస్తారు. మీరు నన్ను ఎంతగానో నిందించారు. స్వయం చెంపదెబ్బలు వేసుకున్నారు. గ్లాని చేస్తూ చేస్తూ మీరు శూద్రులుగా అయిపోయారు. భగవంతుని జపిస్తే సుఖము లభిస్తుందని సిక్కులు కూడా చెప్తారు అనగా 'మన్మనాభవ' రెండే అక్షరాలు. ఎక్కువగా తల కొట్టుకునే అవసరమే లేదు. ఇది కూడా తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా 21 జన్మల వరకు సుఖము లభిస్తుందని మీకు తెలుసు. వారు అందుకు మార్గమును కూడా తెలుపుతారు. కానీ పూర్తి మార్గము వారికి(సిక్కులకు) తెలియదు. స్మరిస్తూ, స్మరిస్తూ సుఖము పొందండి. సత్యయుగములో జబ్బులు, దు:ఖమునకు సంబంధించిన విషయాలేవీ ఉండవని మీకు తెలుసు. ఇది సాధరణమైన విషయము. దానిని సత్యయుగము, బంగారు యుగమని అంటారు. దీనిని కలియుగము, ఇనుప యుగము అని అంటారు. సృష్టి చక్రము తిరుగుతూ ఉంటుంది. జ్ఞాన వివరణ చాలా బాగుంది. ఇది పల్టీల ఆట. మీరిప్పుడు బ్రాహ్మణులు, మళ్లీ దేవతలుగా అవుతారు. ఈ విషయాలు మీరు మర్చిపోతారు. పల్టీల ఆట గుర్తుంటే ఈ జ్ఞానమంతా గుర్తుంటుంది. ఇలాంటి తండ్రిని స్మృతి చేస్తూ రాత్రి నిదురించాలి. అయినా బాబా! మర్చిపోయామని పిల్లలు అంటారు. మాయ క్షణ క్షణము మరిపిస్తూ ఉంటుంది. మాయతో మీరు యుద్ధము చేస్తారు. తర్వాత అర్ధకల్పము మీరు మాయ పై రాజ్యము చేస్తారు. విషయమైతే సహజంగా చెప్తారు. దీని పేరే సహజ జ్ఞానము, సహజ స్మృతి. కేవలం తండ్రిని స్మృతి చేయండి, కష్టమేముంది? భక్తిమార్గములో అయితే మీరు చాలా కష్టపడ్డారు. సాక్షాత్కారము కొరకు గొంతు కోసుకునేందుకు కూడా తయారవుతారు. కత్తుల బావిలో దూకుతారు. ఎవరైతే నిశ్చయబుద్ధి గలవారై అలా చేస్తారో వారి వికర్మలు వినాశనమౌతాయి. అయితే మళ్లీ కొత్తగా లెక్కాచారము ప్రారంభమౌతుంది. కాని నా వద్దకు రారు. నా స్మృతి ద్వారా వికర్మలు వినాశనమౌతాయి. జీవఘాతము ద్వారా వినాశమవ్వవు. నా వద్దకు ఎవ్వరూ రారు. ఇది ఎంత సహజమైన విషయము! ఈ పల్టీలాట అయితే వృద్ధులకు కూడా గుర్తుండాలి. పిల్లలకు కూడా గుర్తుండాలి. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. వృక్షపతి అయిన తండ్రి ద్వారా సుఖము, శాంతి-పవిత్రతల వారసత్వమును తీసుకునేందుకు తమకు తాము అకాలమూర్తి ఆత్మను అని తెలుసుకుని తండ్రిని స్మృతి చేయాలి. ఈశ్వరీయ బుద్ధిని తయారు చేసుకోవాలి.
2. తండ్రి ద్వారా సత్యమైన కథను విని ఇతరులకు వినిపించాలి. మాయజీత్లుగా అయ్యేందుకు తమ సమానంగా ఇతరులను తయారు చేయు సేవ చెయ్యాలి. కల్ప-కల్పము విజయులము. తండ్రి మాకు తోడుగా ఉన్నారని బుద్ధిలో ఉండాలి.
వరదానము :-
' నిర్లక్ష్యమనే అలకు వీడ్కోలునిచ్చి సదా ఉమంగ - ఉత్సాహాలలో ఉండు సమఝ్దార్ (తెలివి గల)ఆత్మా భవ ''
చాలామంది పిల్లలు ఇతరులను చూచి స్వయం నిర్లక్ష్యంగా, సోమర్లుగా అవుతారు. ఇది జరిగేదే..... ఇలా జరుగుతూనే ఉంటుంది.......... అని అనుకుంటారు. ఒకరు మోసపోతే(దెబ్బ తింటే), వారిని చూసి నిర్లక్ష్యము, సోమరితనంతో స్వయం కూడా మోసపోవడం తెలివైన పనా? ఇలా నిర్లక్ష్యంగా ఉండేవారికి పశ్చాత్తాపపడే ఘడియలు ఎంత కఠినంగా ఉంటాయో చూసి బాప్దాదాకు దయ కలుగుతుంది. అందువలన తెలివి గలవారై నిర్లక్ష్యమనే అలకు, ఇతరులను చూసే అలకు మనసు నుండి వీడ్కోలునివ్వండి. ఇతరులను చూడకండి, తండ్రిని చూడండి.
స్లోగన్ :-
'' వారస క్వాలిటీని తయారు చేస్తే ప్రత్యక్షతా ఢంకా మ్రోగుతుంది. ''