06-07-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - మాయా రావణుని సాంగత్య వశమై మీరు దారి తప్పిపోయారు, పవిత్రమైన మొక్కలు అపవిత్రమైపోయాయి, ఇప్పుడు మళ్లీ పవిత్రంగా అవ్వండి''

ప్రశ్న :-

ప్రతి పుత్రునికి తమ పై తమకే ఏ ఆశ్చర్యము కలుగుతుంది? పిల్లలను చూసి తండ్రికి ఏ ఆశ్చర్యము కలుగుతుంది ?

జవాబు :-

మేము ఎలా ఉండేవారము, ఎవరి పిల్లలుగా ఉండేవారము, ఎలాంటి తండ్రి వారసత్వము మాకు లభించింది, ఆ తండ్రినే మేము మరచిపోయాము! అని పిల్లలకు ఆశ్చర్యమనిపిస్తుంది. రావణుడు వచ్చాడు. అతడు రాగానే రచయిత మరియు రచన అంతటినీ మర్చిపోయేంత పొగమంచు వచ్చేసింది. ఏ పిల్లలనైతే నేను ఇంత ఉన్నతంగా తయారు చేశానో, రాజ్య భాగ్యమును ఇచ్చానో ఆ పిల్లలే నన్ను నిందించసాగారు. రావణుని సాంగత్యములోకి వచ్చి అంతా పోగొట్టుకున్నారని తండ్రి పిల్లలను చూసి ఆశ్చర్యపడ్తారు.

ఓంశాంతి.

ఏం ఆలోచిస్తున్నారు? నంబరువారు పురుషార్థానుసారం ప్రతి జీవాత్మ ఇప్పుడు తన పై తానే ఆశ్చర్యపడ్తోంది - ''మేము ఎలా ఉండేవారము, ఎవరి పిల్లలుగా ఉండేవారము, తప్పకుండా తండ్రి ద్వారా వారసత్వము లభించింది, మరెలా మేము మర్చిపోయాము? మేము సతోప్రధాన ప్రపంచములో విశ్వమంతటికీ అధికారులుగా, చాలా సుఖంగా ఉండేవారము, మళ్లీ మెట్లు దిగుతూ వచ్చాము. రావణుని ప్రవేశము అవ్వగానే రచయిత మరియు రచనలను మరచిపోయేటంత మార్పు (పొగమంచు) మాలో వచ్చింది. పొగమంచులో మానవులు మార్గము మొదలైనవన్నీ మర్చిపోతారు కదా. అలాగే మన ఇల్లు ఎక్కడుంది, ఎక్కడ ఉండేవారము అను విషయాలన్నీ మర్చిపోయామని పిల్లలు తమ పై తాము ఆశ్చర్యపడుతున్నారు. అలాగే నేటి నుండి 5 వేల సంవత్సరాల క్రితము ఏ పిల్లలకైతే రాజ్య భాగ్యము ఇచ్చి వెళ్లానో, చాలా మజాగా, ఆనందంగా ఉండేవారో ఆ భూమి పై ఇప్పుడు ఏమైపోయింది? రావణ రాజ్యములోకి ఎలా వచ్చేశారు? అని తండ్రి చూస్తున్నారు, ఆశ్చర్యపడ్తున్నారు. పరాయి రాజ్యములో తప్పకుండా దు:ఖమే లభిస్తుంది. మీరు ఎంతగా అన్వేషించారు(వెతికారు)! మూఢ నమ్మకముతో తండ్రిని వెతుకుతూ వచ్చారు కానీ ఎక్కడ లభించారు? వారిని రాయి-రప్పలలో వేస్తే ఎలా లభిస్తారు? అర్ధకల్పము మీరు వెతుకుతూ వెతుకుతూ అలసిపోయారు. మీ అజ్ఞానము వల్లనే రావణ రాజ్యములో మీరెంతో దు:ఖమును అనుభవించారు. భక్తిమార్గములో భారతదేశము ఎంతో నిరుపేదగా అయిపోయింది. తండ్రి పిల్లల వైపు చూసి, భక్తిమార్గములో ఎంత వెతికారు! అని తండ్రికి ఆలోచన కలుగుతుంది. అర్ధకల్పము ఎందుకు భక్తి చేశారు? ఎందుకంటే భగవంతుని కలుసుకునేందుకు. భక్తి తర్వాతనే భగవంతుడు ఫలమునిస్తారు. వారు ఏమిస్తారో, అది ఎవ్వరికీ తెలియదు. పూర్తిగా బుద్ధిహీనులైపోయారు! మనమెలా ఉండేవారము? రాజ్య భాగ్యమును ఎలా చేసేవారము? మళ్లీ మెట్లను దిగుతూ దిగుతూ రావణుని సంకెళ్లలో ఎలా బంధితులై పోయామో ఈ విషయాలన్నీ బుద్ధిలోకి రావాలి. అపారమైన దు:ఖముండేది. మొట్టమొదట మీరు అపారమైన సుఖములో ఉండేవారు. మన రాజ్యములో ఎంత సుఖము ఉండేది, పరాయి రాజ్యములో ఎంత దు:ఖమును అనుభవించామని మనసులోకి రావాలి. ఉదాహరణానికి ఆంగ్లేయుల రాజ్యములో ఎంత దు:ఖమును అనుభవించామని వారు భావిస్తారు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు - మేము ఎవరి పిల్లలము? ఎవరిగా ఉంటిమి? అని ఆలోచన రావాలి. తండ్రి మాకు మొత్తం విశ్వ రాజ్యమునంతా ఇచ్చారు. తర్వాత రావణ రాజ్యములో ఎలా చిక్కుకున్నాము, ఎంత దు:ఖము చూశాము, ఎన్ని చెడు కర్మలు చేశామని లోలోపల ఆలోచిస్తూ ఉండాలి. సృష్టి రోజు రోజుకూ క్రిందకు దిగజారుతూనే పోయింది. మానవుల సంస్కారాలు రోజురోజుకు చెడుగా, అశుద్ధంగా(క్రిమినల్‌గా) అవుతూ వచ్చాయి. కనుక పిల్లల స్మృతిలోకి రావాలి. తండ్రి చూస్తున్నారు - వీరు పవిత్రమైన మొక్కలుగా ఉండేవారు, ఎవరికి రాజ్య భాగ్యమిచ్చానో వారు నా కర్తవ్యాన్నే మర్చిపోయారు! మళ్లీ ఇప్పుడు మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వాలనుకుంటారు. కనుక తండ్రినైన నన్ను స్మృతి చేస్తే పాపాలన్నీ సమాప్తమైపోతాయి. కానీ స్మృతి కూడా చేయలేరు. క్షణ క్షణము మర్చిపోతున్నాము బాబా అని అంటారు. అరే! మీరు స్మృతి చేయకపోతే పాపాలెలా సమాప్తమౌతాయి? ఒకటేమో మీరు వికారాలలో పడి పతితులైపోయారు, రెండవది - తండ్రిని నిందించసాగారు. మాయ సాంగత్యములో మీరు ఎంత దిగజారిపోయారంటే ఎవరైతే మిమ్ములను ఆకాశములోకి ఎక్కించారో వారిని రాయి-రప్పలలో పడేశారు. మాయ సాంగత్య వశమై మీరు ఇటువంటి పని చేశారు! ఇది బుద్ధిలోకి రావాలి కదా! పూర్తి రాతి బుద్ధిగా తయారవ్వరాదు. నేను ప్రతి రోజు నేను మీకు ఫస్ట్‌క్లాస్‌ పాయింట్లు వినిపిస్తానని బాబా చెప్తారు.

బొంబాయిలో సమావేశము జరిగినప్పుడు అందులో హే భారతీయులారా! మీకు మేము రాజ్యభాగ్యమును ఇచ్చాము, మీరు స్వర్గములో దేవతలుగా ఉండేవారు, మళ్లీ మీరు రావణ రాజ్యములోకి ఎలా వచ్చారు, ఇది కూడా డ్రామాలో ఒక పాత్ర అని తండ్రి చెప్తున్నారని మీటింగులో చెప్పవచ్చు. మీరు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాలను తెలుసుకుంటే ఉన్నత పదవిని పొందగలరు. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమైపోతాయి. అందరూ ఇక్కడ కూర్చున్నా ఒక్కొక్కరి బుద్ధి ఒక్కొక్క చోట ఉంది. మనము ఎక్కడ ఉండేవారము, ఇప్పుడు మనము పరాయి రావణ రాజ్యములోకి వచ్చి పడ్డాము. కాబట్టి ఎంత దు:ఖితులుగా అయ్యామని బుద్ధిలోకి రావాలి. మనము శివాలయములో ఉన్నప్పుడు చాలా సుఖంగా ఉండేవారము, ఇప్పుడు వేశ్యాలయము నుండి వెలుపలికి తీసేందుకు తండ్రి వచ్చారు. అయినా బయటకు రానే రారు. మీరు శివాలయములోకి వెళ్తే అక్కడ ఈ విషము లభించదు. ఇక్కడ గల అశుద్ధ అన్న పానీయాలు అక్కడ లభించవు అని తండ్రి చెప్తున్నారు. వీరు విశ్వాధికారులుగా ఉండేవారు కదా, మరి ఇప్పుడు వారు ఎక్కడకెళ్లారు? మళ్లీ తమ రాజ్య భాగ్యమును తీసుకుంటున్నారు. ఎంత సహజంగా ఉంది! అందరూ సర్వీసు చేయువారిగా ఉండరు. నంబరువారుగా రాజధానిని 5 వేల సంవత్సరాల క్రితము స్థాపన చేసిన విధంగా చేయాలి. సతోప్రధానంగా అవ్వాలి. ఇది తమోప్రధానమైన పాత ప్రపంచమని తండ్రి చెప్తున్నారు. పాత ప్రపంచంగా తయారైనప్పుడు ఖచ్ఛితంగా తండ్రి వస్తారు కదా. తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు. భగవంతుడు ఈ రథము ద్వారా మనలను చదివిస్తున్నారు. ఇది గుర్తున్నా బుద్ధిలో జ్ఞానముంటుంది. మళ్లీ ఇతరులకు తెలిపి తమ సమానంగా కూడా తయారుచేయాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇంతకుముందు అయితే మీరు చెడు నడవడికలు గలవారిగా ఉండేవారు, అవి కష్టముగా బాగుపడ్తాయి. కళ్లలోని చెడు(వికార దృష్టి) తొలగిపోదు. ఒకటేమో కామముతో కూడిన చెడు దృష్టి కష్టంగా వదులుతుంది. దానితో పాటు మళ్లీ 5 వికారాలున్నాయి. క్రోధము కూడా ఎంత చెడ్డది. ఉన్నట్లుండి భూతము వచ్చేస్తుంది. ఇది కూడా చెడు ప్రవర్తనే. ఇంకా పవిత్రంగా అవ్వలేదు. పరివర్తన అవ్వకపోతే పరిణామమేవుతుంది! వంద రెట్లు పాపము పెరిగిపోతుంది. క్షణ-క్షణము క్రోధము చేసుకుంటూ ఉంటారు. మీరిప్పుడు రావణ రాజ్యములో లేరు కదా! మీరు ఈశ్వరుని వద్ద కూర్చుని ఉన్నారు కాబట్టి ఈ వికారాలను వదిలే ప్రతిజ్ఞ చేయండి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి, క్రోధము చేసుకోకండి. ఈ 5 వికారాలు మిమ్ములను అర్ధకల్పము దిగజార్చుతూ వచ్చాయి. అందరికంటే ఎక్కువ ఉన్నతంగా మీరే ఉండేవారు, అందరికంటే దిగజారింది కూడా మీరే. ఈ 5 భూతాలు మిమ్ములను క్రింద పడేశాయి. ఇప్పుడు శివాలయంలోకి వెళ్లాలంటే ఈ వికారాలను తొలగించాలి. ఈ వేశ్యాలయము నుండి మనస్సును తొలగిస్తూ వెళ్లండి. తండ్రిని స్మృతి చేస్తే అంతిమతి సో గతి అయిపోతుంది. మీరు ఇంటికి చేరుకుంటారు. ఈ మార్గాన్ని మరెవ్వరూ తెలుపలేరు. భగవానువాచ - నేను సర్వవ్యాపినని ఎప్పుడూ చెప్పలేదు. నేను రాజయోగమును నేర్పించాను అంతేకాక మిమ్ములను విశ్వాధిపతులుగా చేస్తానని చెప్పాను. తర్వాత అక్కడ ఈ జ్ఞానము అవసరమే ఉండదు. మానవుల నుండి దేవతలుగా అవుతారు. మీరు వారసత్వము పొందుతారు. ఇందులో హఠయోగము మొదలైన వాటి మాటే లేదు. స్వయాన్ని ఆత్మగా భావించండి. స్వయాన్ని శరీరమని ఎందుకు భావిస్తారు? శరీరమని భావిస్తే జ్ఞానము తీసుకోలేరు. ఇది కూడా డ్రామాలోని నిర్ణయమే. మనము రావణ రాజ్యములో ఉండేవారమని, ఇప్పుడు రామరాజ్యములోకి వెళ్లేందుకు పురుషార్థము చేస్తున్నామని, ఇప్పుడు మనము పురుషోత్తమ సంగమయుగ వాసులమని మీరు తెలుసుకున్నారు.

భలే గృహస్థములో ఉండండి ఇంతమంది ఇక్కడ ఎలా ఉంటారు? బ్రాహ్మణులుగా అయ్యి ఇక్కడ బ్రహ్మ దగ్గర కూడా అందరూ ఉండలేరు. తమ ఇంటిలోనే ఉండాలి. మేము శూద్రులము కాదు, మేము బ్రాహ్మణులమని బుద్ధి ద్వారా భావించాలి. బ్రాహ్మణుల శిఖ ఎంత చిన్నది! గృహస్థములో ఉంటూ, శరీర నిర్వహణ కొరకు వ్యాపారాదులు చేసుకుంటూ కేవలం తండ్రిని స్మృతి చేయండి. మనమెలా ఉండేవారము, ఇప్పుడు మనము పరాయి రాజ్యములో ఉన్నాము. ఎంత దు:ఖితులుగా ఉండేవారము! ఇప్పుడు బాబా మనలను మళ్లీ తీసుకెళ్తారు. కాబట్టి గృహస్థ వ్యవహారములో ఉంటూ ఆ స్థితిని తయారుచేసుకోవాలి. ప్రారంభములో ఎంత పెద్ద పెద్ద వృక్షాలు(కుటుంబాలు) వచ్చాయి! వారిలో కొందరే ఉన్నారు, మిగతావారు వెళ్లిపోయారు. మనము మన రాజ్యములో ఉండేవారమని, ఇప్పుడు ఎక్కడో వచ్చి పడ్డామని మళ్లీ మన రాజ్యములోనికి వెళ్తామని మీ బుద్ధిలో ఉంది. బాబా ఫలానావారు చాలా బాగా క్రమంగా వస్తూ ఉండేవారు, తర్వాత రావడం లేదని మీరు బాబాకు వ్రాస్తారు. రావడం లేదంటే వికారాలలో పడిపోయినట్లే. తర్వాత జ్ఞాన ధారణ జరగజాలదు. ఉన్నతమయ్యే బదులు దిగుతూ దిగుతూ పాయి పైసా(చాలా చిన్న) పదవిని పొందుతారు. రాజ్య పదవి ఎక్కడ? నీచ పదవి ఎక్కడ? భలే అక్కడ సుఖము ఉండనే ఉంటుంది. కానీ పురుషార్థము చేసేది ఉన్నత పదవిని పొందేందుకు. గొప్ప పదవిని ఎవరు పొందగలరో అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు మనమందరము పురుషార్థము చేస్తున్నాము. భోపాల్‌ రాజైన మహేంద్ర కూడా పురుషార్థము చేస్తున్నాడు. ఆ రాజు పదవి పైసాకు సమానము. ఇక్కడ సూర్య వంశీ రాజధానికి వెళ్లేవారు ఉన్నారు. విజయమాలలోకి వెళ్లగలిగే పురుషార్థము చేయాలి. నా కళ్లు ఎక్కడా చెడుగా అవ్వడం లేదు కదా? అని తమ మనసులో పరిశీలించుకోవాలని తండ్రి పిల్లలకు తెలియజేస్తున్నారు. ఒకవేళ మంచిగా (సివిల్‌గా) మారితే అంతకంటే ఇంకేం కావాలి? వికారాలలోకి వెళ్లకపోయినా కళ్లు ఎంతో కొంత మోసము చేస్తూ ఉంటాయి. నెంబరువన్‌ కామము. చెడు(క్రిమినల్‌) దృష్టి చాలా చెడ్డది, అందువలన చెడు దృష్టి, మంచి దృష్టి అని పేరే ఉంది. అనంతమైన తండ్రికి పిల్లల గురించి ఎవరు ఏ కర్మ చేస్తున్నారు? ఎంత సర్వీసు చేస్తున్నారు? ఫలానావారికి ఇంతవరకు చెడు దృష్టి ఇంతవరకు పరివర్తన అవ్వలేదు, ఇంతవరకు,........ ఇలాంటి సమాచారము గుప్తంగా వస్తుంది. మున్ముందు ఇంకా చాలా ఖచ్ఛితంగా(ఆక్యురేట్‌గా) వ్రాస్తారు. మేమింతవరకు అసత్యమే మాట్లాడుతూ, దిగజారుతూ వచ్చాము. జ్ఞానము పూర్తిగా బుద్ధిలో ఉండేది కాదు, అందువలన మన స్థితి తయారవ్వలేదు. తండ్రి వద్ద దాచిపెడ్తూ వచ్చామని వారికి వారే తెలుసుకొని ఫీల్‌ చేస్తారు. ఈ విధంగా చాలామంది దాచిపెడ్తారు. సర్జన్‌ నుండి 5 వికారాల రోగాన్ని దాచరాదు. మా బుద్ధి పక్కకు పోతోంది. శివబాబా వైపు వెళ్లడం లేదు అని సత్యంగా చెప్పాలి. సత్యము చెప్పకపోతే అది వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలారా! ఆత్మాభిమానులుగా అవ్వండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ - ఆత్మ సోదరులు. పూజ్యులుగా ఉన్నప్పుడు మీరు ఎంతో సుఖంగా ఉండేవారు. ఇప్పుడు పూజారులుగా, దు:ఖితులుగా అయినారు. మీకేమయ్యింది! ఈ గృహస్థ ఆశ్రమము పారంపర్యముగా వస్తూ ఉంది. సీతా-రాములకు పిల్లలు లేరా! అని అందరూ అంటారు. కానీ అక్కడ వికారాలతో పిల్లలు జన్మించరు. అరే! అది సంపూర్ణ నిర్వికారీ ప్రపంచము. అక్కడ భ్రష్టాచారముతో పిల్లలు పుట్టరు. వికారాలు ఉండేవి కావు. అక్కడ ఈ రావణ రాజ్యమే ఉండదు. అది రామ రాజ్యము. అక్కడ రావణుడు ఎక్కడ నుండి వచ్చాడు! మానవుల బుద్ధి పూర్తి నష్ట ఖాతాలో ఉంది. అలా చేసింది ఎవరు? మిమ్ములను నేను సతోప్రధానంగా తయారుచేశాను, మీ నావ ఆవలి తీరానికి చేర్చాను. మళ్లీ మిమ్ములను తమోప్రధానంగా చేసిందెవరు? రావణుడు. ఇది కూడా మీరు మర్చిపోయారు. ఇది పారంపర్యము నుండి వస్తూ ఉందని అంటారు, అరే! పరంపర అంటే ఎప్పటి నుండి? ఏదైనా లెక్క చెప్పండి? కొద్దిగా కూడా అర్థము కాదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీకెంత రాజ్య భాగ్యమును ఇచ్చి వెళ్లాను? భారతవాసులైన మీరు చాలా సంతోషంగా ఉండేవారు, అంత ఖుషీగా మరెవ్వరూ లేరు. క్రైస్తవులు కూడా ఒకప్పుడు స్వర్గముండేదని అంటారు, దేవతల చిత్రాలు కూడా ఉన్నాయి, అంతకంటే పాత వస్తువులు లేనే లేవు. అతిపురాతనమైనవారు ఈ లక్ష్మీనారాయణులే ఉంటారు లేక వారి వస్తువులు ఏవైనా ఉంటాయి. అందరికంటే పురాతనమైనవారు శ్రీ కృష్ణుడు. అత్యంత నూతనమైన వారు కూడా శ్రీ కృష్ణుడే. పురాతనమని ఎందుకు అంటారు? ఎందుకంటే గతించిపోయింది కదా. మీరే సుందరంగా ఉండేవారు, మళ్లీ శ్యామంగా(నల్లగా) అయినారు. నల్లని కృష్ణుని చూసినా చాలా సంతోషిస్తారు. ఊయలలో కూడా నల్లని కృష్ణుని ఊపుతారు. సుందరంగా ఎప్పుడు ఉన్నాడో వారికేం తెలుసు? కృష్ణుడిని ఎంతగా ప్రేమిస్తారు! రాధ ఏమి చేసింది?

మీరిక్కడ సత్యమైన సాంగత్యములో కూర్చుని ఉన్నారు, వెలుపలి కుసాంగత్యములోనికి వెళ్లగానే అంతా మర్చిపోతారు. మాయ చాలా శక్తివంతమైనది. గజమును మొసలి మింగేసిన విధంగా ఇప్పుడు పారిపోతారు. కొద్దిగా అహంకారము వచ్చినా సర్వ నాశనము చేసుకుంటారు. బేహద్‌ తండ్రి అయితే అర్థం చేయిస్తూనే ఉంటారు. దీనిని గురించి భయపడరాదు. బాబా ఎందుకు ఇలా చెప్పారు? మా గౌరవము పోయిందని అనుకుంటారు. అరే! గౌరవమైతే రావణ రాజ్యములో సమాప్తమైపోయింది కదా. దేహాభిమానానికి వశమైనందున తమను తామే నష్టపరచుకుంటారు. పదవి భ్రష్టమైపోతుంది. క్రోధము, లోభాలను కూడా వికార దృష్టి అనే అంటారు. కళ్లతో వస్తువును చూసినప్పుడే కదా లోభము కలుగుతుంది.

ఏ ఏ విధమైన పూలు ఉన్నాయో తండ్రి వచ్చి తమ తోటను చూస్తారు. ఇక్కడ నుండి వెళ్లి మళ్లీ ఆ తోటలోని పూలు చూస్తారు. శివబాబాను కూడా పూలతో పూజిస్తారు. వారు నిరాకారులు, చైతన్య పుష్పము. మీరిప్పుడు పురుషార్థము చేసి ఇలాంటి పుష్పాలుగా అవుతారు. బాబా చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా! గడచిపోయిన దానినంతా డ్రామా అని భావించండి, ఆలోచించకండి. ఎంత శ్రమ చేస్తారు! అయినా ఏమీ జరగదు, ఏమీ నిలువదు. అరే! ప్రజలు కూడా కావాలి కదా. కొద్దిగా విన్నా వారు ప్రజలుగా అవుతారు. ప్రజలుగా అయితే చాలామంది కావాలి. జ్ఞానము ఎప్పటికీ వినాశనమవ్వదు. వీరు శివబాబా అని ఒక్కసారి విన్నా చాలు ప్రజలలోకి వచ్చేస్తారు. మనము ఏ రాజ్యములో ఉండేవారమో దానిని మళ్లీ ఇప్పుడు పొందుతున్నాము. అందుకొరకు పూర్తిగా పురుషార్థము చేయాలి అని లోలోపల స్మృతిలోకి తెచ్చుకోవాలి. సర్వీసు పూర్తి ఖచ్ఛితంగా, జరుగుతూ ఉంది. అచ్ఛా.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. శివాలయములోకి వెళ్లాలంటే ఈ వికారాలను తొలగించుకోవాలి, ఈ వేశ్యాలయము నుండి మనస్సును తొలగిస్తూ వెళ్లాలి. శూద్రుల సాంగత్యము నుండి దూరంగా ఉండాలి.

2. గడిచిన దానిని డ్రామా అని భావించి దానిని గురించి ఏమీ ఆలోచించరాదు. ఎప్పుడూ అహంకారములోకి రాకూడదు. శిక్షణ లభించే సమయములో అలజడిలోకి రారాదు.

వరదానము :-

'' నిశ్చయమనే పునాది ద్వారా సంపూర్ణత వరకు చేరుకునే నిశ్చయబుద్ధి నిశ్చింత భవ ''

ఈ బ్రాహ్మణ జీవితంలో సంపన్నతకు పునాది ''నిశ్చయము''. ఈ పునాది గట్టిగా ఉంటే సహజంగా తీవ్రవేగంతో సంపూర్ణత వరకు నిశ్చయంగా చేరుతారు. యధార్థ నిశ్చయబుద్ధి గలవారు సదా నిశ్చింతగా ఉంటారు. యధార్థ నిశ్చయం అంటే తమ ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం, అంగీకరించడం, అదే విధంగా నడుచుకోవడం. అంతేకాక తండ్రి ఎవరో, ఎలా ఉన్నారో, ఏ రూపంలో పాత్రను అభినయిస్తున్నారో వారిని యధార్థంగా తెలుసుకోవడం. ఇటువంటి నిశ్చయబుద్ధి గలవారు విజయులుగా ఉంటారు.

స్లోగన్‌ :-

''తమ సమయాన్ని, సుఖాలను, ప్రాప్తులు లభించాలనే కోరికను, సర్వుల కొరకు దానము చేయువారే మహాదానులు.''