31-05-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - ఇప్పుడు మీకు అల్లా(భగవంతుడు) లభించారు. కావున పద్ధతులు సరి చేసుకోండి అనగా స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహమని భావించడమే తలక్రిందులుగా అవ్వడం.''

ప్రశ్న :-

ఏ ఒక్క మాటను అర్థము చేసుకుంటే బేహద్‌ వైరాగులుగా అవ్వగలరు?

జవాబు :-

పాత ప్రపంచమిప్పుడు దేనికీ పనికిరాకుండా పోయింది(హోప్‌లెస్‌), ఇక శ్మశానంగా అవుతుంది, ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే అనంతమైన వైరాగులుగా అవ్వగలరు. ఇప్పుడు నూతన ప్రపంచము స్థాపన అవుతూ ఉందని మీకు తెలుసు. ఈ రుద్రజ్ఞాన యజ్ఞములో మొత్తం పాత ప్రపంచమంతా స్వాహా అవ్వనున్నది. ఈ ఒక్క మాట మిమ్ములను బేహద్‌ వైరాగులుగా చేసేస్తుంది. మీ మనసు ఇప్పుడు ఈ శ్మశానము నుండి తొలగిపోయింది.

ఓంశాంతి.

నిజానికి డబల్‌ ఓంశాంతి ఎందుకంటే రెండు ఆత్మలున్నాయి. రెండు ఆత్మల స్వధర్మము కూడా శాంతియే. తండ్రి స్వధర్మము కూడా శాంతియే. పిల్లలు అక్కడ శాంతిగా ఉంటారు. దాని పేరే శాంతిధామము. తండ్రి కూడా అక్కడే ఉంటారు. తండ్రి సదా పావనంగా ఉంటారు. మిగిలిన మానవ మాత్రులందరూ పునర్జన్మలు తీసుకుంటూ అపవిత్రులుగా అవుతారు. తండ్రి పిల్లలకు చెప్తున్నారు - పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించండి. పరమపిత పరమాత్మ జ్ఞానసాగరులని, శాంతిసాగరులని ఆత్మకు తెలుసు. వారికి మహిమ కూడా ఉంది కదా. వారు అందరికీ తండ్రి, అందరి సద్గతిదాత కూడా. అందువలన తండ్రి వారసత్వము పై అందరికీ తప్పకుండా హక్కు ఉంటుంది. తండ్రి ద్వారా లభించే వారసత్వము ఏది? తండ్రి స్వర్గ రచయిత అని పిల్లలకు తెలుసు. అందువలన వారు ఇచ్చేది స్వర్గ వారసత్వమని, అది కూడా నరకములోనే ఇస్తారని పిల్లలకు తెలుసు. నరక వారసత్వము ఇచ్చింది రావణుడు. ఇప్పుడు అందరూ నరకవాసులే కదా. కావున ఈ వారసత్వము రావణుని నుండి లభించింది. నరకము, స్వర్గము రెండూ ఉన్నాయి. ఈ మాటలు వినేదెవరు? - ఆత్మ. అజ్ఞానకాలములో కూడా అన్నీ చేసేది ఆత్మయే. కానీ దేహ-అభిమానము కారణంగా శరీరమే అన్నీ చేస్తుందని భావిస్తారు. మన స్వధర్మము శాంతి. ఇది మర్చిపోతారు. మనము శాంతిధామములో ఉండేవారము. సత్య ఖండమే మళ్లీ అసత్య ఖండంగా అవుతుందని కూడా అర్థం చేయించాలి. భారతదేశము సత్య ఖండంగా ఉండేది. రావణ రాజ్యములో ఇదే అసత్య ఖండంగా కూడా అవుతుంది. ఇది చాలా సాధారణ విషయము. దీనిని మనుష్యులు ఎందుకు అర్థము చేసుకోలేకున్నారు? ఎందుకంటే ఆత్మ తమోప్రధానమైపోయింది. దీనినే రాతి బుద్ధి అని అంటారు. భారతదేశాన్ని స్వర్గంగా, పూజ్యనీయంగా ఎవరు చేశారో, వారినే పూజారులుగా తయారై నిందించారు. అయితే ఇందులో కూడా ఎవరి దోషమూ లేదు. ఈ డ్రామా ఎలా తయారై ఉందో తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పూజ్యుల నుండి పూజారులుగా ఎలా అవుతున్నారో కూడా తండ్రి చెప్తున్నారు. 5 వేల సంవత్సరాల క్రితము భారతదేశములో ఆది సనాతన దేవీ దేవతా ధర్మముండేది. ఇది నిన్నటి విషయమే. కానీ మనుష్యులు పూర్తిగా మర్చిపోయారు. ఈ శాస్త్రాలు మొదలైనవి భక్తిమార్గము కొరకు కూర్చుని తయారు చేసినవి. శాస్త్ర్రాలు భక్తిమార్గము కొరకే గానీ జ్ఞానమార్గము కొరకు కాదు. జ్ఞానమార్గానికి ఏ శాస్త్రమూ తయారు కాదు. కల్ప-కల్పము ఆ తండ్రే వచ్చి పిల్లలకు దేవతా పదవి కొరకు జ్ఞానమునిస్తారు. తండ్రి చదువును చదివిస్తారు. తర్వాత జ్ఞానము ప్రాయ: లోపమైపోతుంది. సత్యయుగములో ఏ శాస్త్రమూ ఉండదు. ఎందుకంటే అది జ్ఞానమార్గపు ప్రాలబ్ధము. 21 జన్మలకు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వము లభిస్తుంది. తర్వాత మళ్లీ రావణుని వారసత్వము అర్ధకల్పము కొరకు లభిస్తుంది. దానిని సన్యాసులు కాకిరెట్టకు సమానమైన సుఖమని అంటారు. ఇచ్చట దు:ఖమే దు:ఖముంది. దీని పేరే దు:ఖధామము. కలియుగానికి ముందు ద్వాపర యుగముంటుంది. దానిని సెమీ దు:ఖధామమంటారు. ఇది ఫైనల్‌ దు:ఖధామము. ఆత్మనే 84 జన్మలు తీసుకుంటుంది. క్రిందకు దిగజారుతుంది. తండ్రి మెట్లు పైకి ఎక్కిస్తారు ఎందుకంటే చక్రము తప్పకుండా తిరగాల్సిందే. నూతన ప్రపంచముండేది. అది దేవీ దేవతల రాజ్యము. అక్కడ దు:ఖానికి నామ-రూపాలే ఉండవు. అందుకే పులి-మేక కలిసి నీరు తాగినట్లు చూపిస్తారు. అక్కడ హింస అనే మాటే ఉండదు. అహింసను పరమ దేవీ దేవతా ధర్మమని అంటారు. ఇచ్చట ఉండేదే హింస. మొట్టమొదటి హింస కామ ఖడ్గమును ఉపయోగించడం. సత్యయుగములో వికారులు ఎవ్వరూ ఉండరు. వారి మహిమను గానము చేస్తారు. లక్ష్మినారాయణులను - ''మీరు సంపూర్ణ నిర్వికారులు''........... అని మహిమ చేస్తారు. ఇది కలియుగము. ఇనుప యుగపు ప్రపంచము. దీనిని స్వర్ణిమ యుగము అని అనరు. డ్రామాయే ఇలా తయారు చేయబడి ఉంది. సత్యయుగమును శివాలయమని అంటారు. అక్కడ అందరూ పావనంగా ఉంటారు. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. శివాలయమును తయారు చేసేవారు బాబా. వారి చిత్రము కూడా ఉంది. భక్తిమార్గములో వారిని అనేక పేర్లతో పిలిచారు. వాస్తవానికి వారి పేరు ఒక్కటే. తండ్రికి తన శరీరమే లేదు. నా పరిచయము ఇచ్చేందుకు, రచన ఆదిమధ్యాంతాల జ్ఞానమిచ్చేందుకు నేనే రావలసి వస్తుందని వారే స్వయంగా చెప్తున్నారు. నేను వచ్చి మీకు సేవ చేస్తాను, మీరే నన్ను ''ఓ పతితపావనా! రండి'' అని పిలుస్తారు. సత్యయుగములో పిలువరు. ఇప్పుడు అందరూ పిలుస్తారు. ఎందుకంటే వినాశనము చాలా సమీపములో ఉంది. ఇది అదే మహాభారత యుద్ధమని భారతీయులకు తెలుసు. మళ్లీ ఆది సనాతన దేవీదేవతా ధర్మ స్థాపన జరుగుతుంది. నేను రాజాధి రాజులుగా తయారు చేసేందుకు వచ్చానని తండ్రి కూడా చెప్తున్నారు. ఈ రోజుల్లో మహారాజులు, చక్రవర్తులు మొదలైనవారు లేనే లేరు. ఇప్పుడు ప్రజల పై ప్రజా రాజ్యముంది. భారతీయులమైన మనము సుసంపన్నముగా ఉండేవారమని పిల్లలకు తెలుసు. వజ్రవైఢూర్యాల భవనాలుండేవి. నూతన ప్రపంచముండేది. ఆ కొత్తదే మళ్లీ పాతదిగా అయ్యింది. ప్రతి వస్తువు పాతదిగా అవ్వనే అవుతుంది. కొత్త ఇల్లు తయారైతే పోను పోను దాని ఆయువు తగ్గిపోతూ ఉంటుంది. ఇది కొత్తది, ఇది సగం పాతది, ఇది మధ్యమము అని అంటారు. ప్రతి వస్తువు సతో, రజో, తమోగా అవుతుంది. భగవానువాచ కదా. భగవంతుడు అనగా భగవంతుడు. భగవంతుడని ఎవరిని అంటారో కూడా తెలియదు. రాజులు-రాణులు లేనే లేరు. ఇక్కడ ప్రెసిడెంటు, ప్రైమ్‌మినిస్టరు, వారికి అనేక మంత్రులు................ ఉంటారు. సత్యయుగములో యథా రాజా-రాణి.............. దానికి, దీనికి తేడా తండ్రే తెలిపించారు. సత్యయుగములోని అధిపతులకు మినిష్టర్లు, సలహాదార్లు ఉండరు. వారి అవసరమే ఉండదు. ఈ సమయంలోనే శివబాబా నుండి శక్తిని పొంది ఆ పదవిని పొందుతారు. ఇప్పుడు తండ్రి నుండి ఎంతో ఉన్నతమైన సలహా లభిస్తుంది. దాని ద్వారా ఉన్నత పదవిని పొందుతారు. ఆ తర్వాత ఎవ్వరి సలహాను తీసుకోరు. అక్కడ మంత్రి ఉండడు. వామమార్గములోకి వెళ్లినప్పుడే మంత్రి ఉంటాడు. వారి బుద్ధి(తెలివి) పాడైపోతుంది.

ముఖ్యమైనది - ''వికారాల విషయం.'' దేహాభిమానము వలన వికారాలు జన్మిస్తాయి. అందులో కామము నంబరువన్‌. తండ్రి చెప్తున్నారు - ఈ కామము మహాశత్రువు. దీని పై విజయము పొందాలి. తండ్రి అనేకసార్లు అర్థం చేయించారు - స్వయాన్ని ఆత్మగా భావించండి. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. కర్మలను ఇక్కడే అనుభవించాలి. సత్యయుగములో కాదు. అది సుఖధామము. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్ములను సుఖధామము, శాంతిధామవాసులుగా చేస్తారు. తండ్రి నేరుగా ఆత్మలతోనే మాట్లాడ్తారు. ఓ ఆత్మా, నిశ్చయబుద్ధి గలవారై కూర్చోమని, దేహాభిమానము వదలమని అందరికీ చెప్తున్నారు. ఈ దేహము వినాశి. మీరు అవినాశి ఆత్మలు. ఈ జ్ఞానము ఇతరులెవ్వరిలోనూ లేదు. జ్ఞానము తెలియనందున భక్తినే జ్ఞానమని భావించారు. ఇప్పుడు పిల్లలైన మీకు భక్తి వేరని, జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుందని తెలుసు. భక్తి వలన కలిగే సుఖము అల్పకాలము కొరకే ఎందుకంటే పాపాత్మలుగా అయిపోతారు. వికారాలలోకి వెళ్లిపోతారు. అర్ధకల్పం కొరకు అనంతమైన వారసత్వము లభించింది, అది పూర్తిగా సమాప్తమైపోయింది. ఇప్పుడు మళ్లీ తండ్రి వారసత్వము ఇచ్చేందుకు వచ్చారు. అందులో పవిత్రత, సుఖము, శాంతి అన్నీ లభిస్తాయి. పిల్లలూ! ఈ పాత ప్రపంచము తప్పకుండా శ్మశానంగా అవ్వాల్సిందేనని మీకు తెలుసు. ఇప్పుడు ఈ శ్మశానము నుండి మనసును తొలగించి స్వర్గము, నూతన ప్రపంచముతో మీ మమత్వమును జోడించండి. లౌకిక తండ్రి ఎలాగైతే కొత్త ఇల్లు కట్టిస్తే పిల్లల బుద్ధియోగము పాత ఇంటి నుండి తొలగి కొత్త ఇంటితో జోడింపబడ్తుంది కదా. ఆఫీసులో కూర్చుని ఉన్నా బుద్ధి కొత్త ఇంటి పైననే ఉంటుంది. అన్నీ హద్దులోని విషయాలు. అనంతమైన తండ్రి నూతన ప్రపంచము అనగా స్వర్గాన్ని రచిస్తున్నారు. ఇప్పుడు పాత ప్రపంచము నుండి సంబంధాలను తెంచి ఒక్క తండ్రి అయిన నాతోనే జోడించమని వారు చెప్తున్నారు. మీ కొరకు నూతన ప్రపంచము అనగా స్వర్గాన్ని స్థాపన చేసేందుకు వచ్చాను. ఇప్పుడు ఈ పాత ప్రపంచమంతా ఈ రుద్ర జ్ఞాన యజ్ఞములో స్వాహా అవ్వనున్నది. ఈ మొత్తం వృక్షమంతా తమోప్రధానమై శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు మళ్లీ కొత్తది తయారవుతుంది. అందువలన తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇవన్నీ నూతన ప్రపంచ విషయాలు. ఎలాగైతే మనుష్యులు జబ్బు చేసినప్పుడు ఆశ వదులుకొని వీరు బతకడం కష్టమని అనుకున్నట్లు ఇప్పుడు ఈ ప్రపంచము కూడా హోప్‌లెస్‌గా అయిపోయింది. శ్మశానంగా అవుతుంది. అటువంటప్పుడు దీనిని ఎందుకు స్మృతి చేయాలి. ఇది అనంతమైన సన్యాసము. హఠయోగము చేసే సన్యాసులు కేవలం ఇల్లు-వాకిళ్లు వదిలి వెళ్లిపోతారు. మీరు పాత ప్రపంచమునే సన్యసిస్తారు. పాత ప్రపంచము నుండి నూతన ప్రపంచంగా అవుతుంది.

తండ్రి చెప్తున్నారు - నేను మీకు వినయ విధేయతలు కలిగిన సేవకుడను. నేను పిల్లలకు సేవ చేసేందుకు వచ్చాను. ''బాబా, మేము పతితులమైపోయాము, మీరు పతిత ప్రపంచములో, పతిత శరీరములో రండి'' అని నన్ను పిలిచారు. ఆహ్వానము ఎలా ఇస్తారో చూడండి. పతితంగా చేసేవాడు రావణుడు. అతడిని తగులబెడ్తూ ఉంటారు. రావణుడు చాలా పెద్ద(కఠినమైన) శత్రువు. రావణుడు వచ్చినప్పటి నుండి మీకు ఆదిమధ్యాంతాలు దు:ఖము లభించింది. విషయ సాగరములో మునకలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - విషాన్ని వదిలి జ్ఞానామృతమును త్రాగండి. అర్ధకల్పము రావణ రాజ్యములో మీరు వికారాల కారణంగా చాలా దు:ఖితులుగా అయ్యారు. అనేక మతాలను అనుసరిస్తూ నన్ను నిందిస్తారు(తిడ్తారు). ఎంతగా తిడ్తారంటే అద్భుతంగా తిడ్తారు. మిమ్ములను పావనంగా చేసి విశ్వానికి అధికారులుగా చేసేవారిని అందరికంటే ఎక్కువ నిందిస్తారు. మానవులకైతే 84 లక్షల యోనులని అంటారు. నన్నేమో సర్వవ్యాపి అని అంటారు. ఇది కూడా డ్రామాయే. మీకు హాస్యానికి తెలుపుతున్నాను. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. నేను 84 జన్మలు భోగిస్తానని ఆత్మయే చెప్తుంది. ఆత్మయే ఒక శరీరము వదిలి మరొకటి తీసుకుంటుంది. ఇది కూడా ఇప్పుడు తండ్రియే అర్థం చేయించారు. డ్రామా ప్లాను అనుసారము మళ్లీ తండ్రే వచ్చి చెడిపోయిన వారిని(తలక్రిందులైన వారిని) సరిదిద్దుతారు. మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి చెప్తున్నారు - ఇక్కడ మీరు తలక్రిందులుగా కూర్చోకండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు మీకు తండ్రి అయిన అల్లా లభించారు. వారిప్పుడు మిమ్ములను సరి చేస్తారు. రావణుడు ఉల్టాగా(తల క్రిందులుగా) చేశాడు. మళ్లీ సుల్టాగా అవ్వడంతో మీరు లేచి చక్కగా నిల్చుంటారు. ఇది ఒక నాటకము. ఈ జ్ఞానము తండ్రియే కూర్చుని తెలిపిస్తున్నారు. భక్తి భక్తియే, జ్ఞానము జ్ఞానమే. భక్తి పూర్తి వేరుగా ఉంది. ఒక సరస్సు ఉండేది, దానిలో స్నానము చేస్తే దేవకన్యలుగా మారిపోతారని అంటారు. ఇంకా పార్వతికి అమరకథ వినిపించారని కూడా చెప్తారు. ఇప్పుడు మీరు అమరకథ వింటున్నారు కదా. కేవలం ఒక్క పార్వతికే అమరకథ వినిపించారా? ఇది అనంతమైన విషయము. అమరలోకమంటే సత్యయుగము. మృత్యులోకమంటే కలియుగము. దీనిని ముళ్ల అడవి అని అంటారు. తండ్రి అంటే ఎవరో తెలియనే తెలియదు. పరమపిత పరమాత్మా, ఓ భగవంతుడా! అని కూడా అంటారు. కాని వారెవ్వరో తెలియదు. మీకు కూడా ఇంతకు ముందు తెలిసేది కాదు. తండ్రి వచ్చి మిమ్ములను చక్కగా(సుల్టాగా) చేశారు. భగవంతుడిని అల్లా అని అంటారు. భగవంతుడు(అల్లా) చదివించి భగవంతుని పదవి ఇస్తారు కదా. కాని భగవంతుడు ఒక్కరే. వీరిని(లక్ష్మినారాయణులు) భగవాన్‌, భగవతి అని అనరు. వీరు పునర్జన్మలలో వస్తారు కదా. నేనే వీరిని చదివించి దైవీగుణాలు గలవారిగా తయారు చేశాను.

మీరంతా సోదరులు. తండ్రి వారసత్వానికి హక్కుదారులు. మానవులు గాఢాంధకారములో ఉన్నారు. ఆసురీ సంప్రదాయము కదా. వారు కలియుగము ఇంకా దోగాడుతూ అనగా బాల్యములోనే ఉందని అంటారు. ఇంకా కలియుగానికి చాలా సంవత్సరాలు ఉందని అంటారు. ఎంతో అజ్ఞాన అంధకారములో నిద్రపోతూ ఉన్నారు. ఇది కూడా డ్రామాయే. ప్రకాశములో దు:ఖముండదు. అంధకార రాత్రిలో దు:ఖముంటుంది. ఇదంతా మీరు మాత్రమే అర్థము చేసుకొని ఇతరులకు అర్థము చేయించగలరు. మొట్టమొదట ప్రతి మనిషికి తండ్రి పరిచయమునివ్వాలి. ప్రతి ఒక్కరికి ఇద్దరు తండ్రులుంటారు. హద్దులోని తండ్రి హద్దు సుఖమునిస్తారు. బేహద్‌ తండ్రి బేహద్‌ సుఖమునే ఇస్తారు. శివరాత్రి పండుగను జరుపుకుంటారు కావున తండ్రి తప్పకుండా స్వర్గ స్థాపన చేసేందుకు వస్తారు. ఏ స్వర్గమైతే గతించిపోయిందో దానిని మళ్లీ స్థాపన చేస్తున్నారు. ఇప్పుడుండేది తమోప్రధాన ప్రపంచము, నరకము. డ్రామా ప్లాను అనుసారము ఖచ్ఛితమైన సమయానికి నేను మళ్లీ వచ్చి నా పాత్రను అభినయిస్తాను. నేను నిరాకారుడను. నాకు నోరైతే తప్పకుండా కావాలి. నంది(ఎద్దు) ముఖము కానే కాదు. నేను ఇతని నోటిని తీసుకుంటాను. ఇతడు అనేక జన్మల అంతిమ జన్మలో వానప్రస్థ అవస్థలో ఉన్నాడు. ఇతడిలో ప్రవేశిస్తాను. ఇతనికి తన జన్మల గురించి తెలియదు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. తండ్రి ఎలాగైతే నేరుగా ఆత్మలతో మాట్లాడ్తారో అలా స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోవాలి. ఈ శ్మశానము పై మమకారాన్ని తొలగించుకోవాలి. ఎప్పుడు కూడా కర్మలను నిందించుకోవలసిన అవసరము లేకుండా, కర్మభోగము అనుభవించకుండా ఉండునట్లు మంచి సంస్కారాలు ధారణ చెయ్యాలి.

2. తండ్రి ఎలాగైతే డ్రామా పై స్థిర నిశ్చయము ఉన్న కారణంగా ఎవరినీ దోషిగా చెయ్యరో, నిందించే అపకారులకు కూడా ఉపకారము చేస్తారో, అలా తండ్రి సమానంగా అవ్వాలి. ఈ డ్రామాలో ఎవ్వరి దోషమూ లేదు. ఇది ఖచ్ఛితంగా తయారు చేయబడింది.

వరదానము :-

'' సర్వ ఆత్మలలో మీ శుభ భావనల బీజాన్ని వేసే మాస్టర్‌ దాతా భవ ''

ఫలము కొరకు వేచి ఉండక మీరు మీ శుభ భావనల బీజాన్ని ప్రతి ఆత్మలో వేస్తూ(నాటుతూ) ఉండండి. సమయానికి సర్వ ఆత్మలు మేల్కోవలసిందే. ఎవరైనా వ్యతిరేకించినా మీరు మీ దయా భావనను వదలరాదు. ఈ వ్యతిరేకత, అవమానము, తిట్లు(నిందలు) ఎరువు చేసే పని చేస్తాయి. తద్వారా మంచి ఫలాలు వెలువడ్తాయి. ఎంతగా తిట్తారో, అన్ని రెట్లు మహిమ చేస్తారు. అందువలన ప్రతి ఆత్మకు మీ వృత్తి ద్వారా, వైబ్రేషన్ల ద్వారా, వాణి ద్వారా మాస్టర్‌ దాతలుగా అయ్యి ఇస్తూ ఉండండి.

స్లోగన్‌ :-

'' సదా ప్రేమ, సుఖము, శాంతి మరియు ఆనంద సాగరంలో ఇమిడి ఉన్న పిల్లలే సత్యమైన తపస్వీలు. ''