26-04-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - తండ్రి స్మృతిలో సదా హర్షితంగా ఉండండి, పాత దేహ భావమును వదులుతూ వెళ్లండి, ఎందుకంటే మీరు యోగబలము ద్వారా వాయుమండలాన్ని శుద్ధంగా చేయు సేవ చేయాలి. ''

ప్రశ్న :-

స్కాలర్‌షిప్‌ తీసుకునేందుకు లేక స్వయం మీకు మీరే రాజ్యతిలకము దిద్దుకునేందుకు ఎలాంటి పురుషార్థము చేయాలి ?

జవాబు :-

స్మృతియాత్ర చేసే పురుషార్థము చేసినప్పుడు రాజ్యతిలకము లభిస్తుంది. పరస్పరము సోదరులమని భావించే అభ్యాసము చేయండి, అప్పుడు నామ-రూపాల భావన తొలగిపోతుంది. వ్యర్థ మాటలు ఎప్పుడూ వినకండి. తండ్రి ఏమి వినిపిస్తారో అదే వినండి. ఇతర విషయాలకు మీ చెవులు మూసుకోండి(వినకండి). చదువు పై పూర్తి గమనమివ్వండి. అప్పుడు స్కాలర్‌షిప్‌ లభించగలదు.

ఓంశాంతి.

మనము శ్రీమతానుసారము మన కొరకు రాజధానిని స్థాఫన చేస్తున్నామని పిల్లలకు తెలుసు. మనసా-వాచా-కర్మణా ఎవరు ఎంత సర్వీసు చేస్తారో అంత వారి కళ్యాణమే చేసుకుంటారు. ఇందులో హంగామా మొదలైన విషయాలేవీ లేవు. ఈ పాత దేహ భావమును వదులుతూ వదులుతూ మీరు అక్కడకు చేరుకుంటారు. బాబాను స్మృతి చేయడము ద్వారా చాలా ఖుషీ కూడా కలుగుతుంది. సదా స్మృతి ఉన్నట్లైతే సంతోషమే సంతోషముంటుంది. తండ్రిని మర్చిపోతే వాడిపోవడం జరుగుతుంది. పిల్లలు సదా హర్షితంగా ఉండాలి. మనము ఆత్మలము, ఆత్మలమైన మన తండ్రి ఈ నోటి ద్వారా మాట్లాడ్తున్నారు. ఆత్మలమైన మనము ఈ చెవుల ద్వారా వింటున్నాము. ఇలా అభ్యాసము చేసుకునేందుకు శ్రమ చేయాల్సి వస్తుంది. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ వాపస్‌ ఇంటికి వెళ్లాలి. ఈ స్మృతియాత్రనే చాలా శక్తినిస్తుంది. మీరు విశ్వాధికారులుగా అయ్యేంత శక్తి లభిస్తుంది. మీరు నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశమౌతాయని తండ్రి చెప్తున్నారు. ఈ మాటను పక్కా చేసుకోవాలి. అంతిమ సమయంలో ఈ వశీకరణ మంత్రమే పనికి వస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ శరీరము వినాశి అని అందరికీ సందేశమును కూడా ఇవ్వండి. నన్ను స్మృతి చేసినట్లైతే పావనంగా అవుతారు అనేది తండ్రి ఆజ్ఞ. పిల్లలైన మీరు తండ్రి స్మృతిలో కూర్చొని ఉన్నారు. దానితో పాటు జ్ఞానము కూడా ఉంది. ఎందుకంటే మీరు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంత జ్ఞానాన్ని కూడా తెలుసుకున్నారు. స్వయం ఆత్మలో మొత్తం జ్ఞానమంతా ఉంది. మీరు స్వదర్శన చక్రధారులు కదా. ఇక్కడ కూర్చుని ఉండగానే మీకు చాలా సంపాదన జరుగుతోంది. మీకు రాత్రింబవళ్ళు సంపాదనే సంపాదన. మీరు ఇక్కడకు సత్యమైన సంపాదన చేసుకునేందుకే వస్తారు. జతలో వెళ్లే సత్యమైన సంపాదన ఇంకెక్కడా జరగదు. ఇక్కడ మీకు ఇక ఏ ఇతర వ్యాపార-వ్యవహారాలు లేవు. వాయుమండలము కూడా అలాగే ఉంది. మీరు యోగబలముతో వాయుమండలమును కూడా శుద్ధము చేస్తారు. మీరు చాలా సర్వీసు చేస్తున్నారు. స్వంత సేవ చేసుకొనువారే భారతదేశ సేవ కూడా చేస్తారు. తర్వాత ఈ పాత ప్రపంచము కూడా ఉండదు. మీరు కూడా ఉండరు. ప్రపంచమే క్రొత్తదిగా అవుతుంది. పిల్లలైన మీ బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. కల్పక్రితము ఎవరైతే సేవ చేశారో వారు ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారని కూడా మీకు తెలుసు. రోజురోజుకు చాలామందిని మీ సమానంగా చేస్తూనే ఉంటారు. ఈ జ్ఞానాన్ని విని చాలా సంతోషము కలుగుతుంది, రోమాంచితమౌతుంది(రోమాలు నిక్కబొడుచుకుంటాయి). ఈ జ్ఞానము ఎప్పుడూ ఎవ్వరి ద్వారా వినలేదని అంటారు. బ్రాహ్మణులైన మీ ద్వారానే వింటారు. భక్తిమార్గములో అయితే ఎటువంటి శ్రమా లేదు. ఇందులో పూర్తి పాత ప్రపంచాన్ని మర్చిపోవాల్సి ఉంటుంది. ఈ అనంతమైన సన్యాసమును తండ్రే చేయిస్తారు. పిల్లలైన మీలో కూడా నెంబరువారుగా ఉన్నారు. సంతోషము కూడా నెంబరువారుగా ఉంటుంది, ఒకేలా ఉండదు. జ్ఞాన-యోగాలు కూడా అందరిలో ఒకే విధంగా ఉండవు. ఇతర మనుష్యులంతా దేహధారుల వద్దకు వెళ్తారు. ఇక్కడ దేహము లేని వారి వద్దకు మీరు వస్తున్నారు.

స్మృతి చేసే పురుషార్థము ఎంత చేస్తారో అంత సతోప్రధానంగా అవుతూ ఉంటారు. సంతోషము వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది ఆత్మ-పరమాత్మల శుద్ధమైన ప్రేమ. వారు నిరాకారులు, మీలో ఎంత త్రుప్పు వదులుతూ ఉంటుందో, అంత ఆకర్షణ కలుగుతుంది. మేమెంత ఖుషీగా ఉన్నామని మీ డిగ్రీని మీరు చూసుకోగలరు. ఇందులో ఆసనాలు మొదలైనవి వేసే మాటేమీ లేదు. ఇది హఠయోగము కాదు. విశ్రాంతిగా కూర్చుని బాబాను స్మృతి చేస్తూ ఉండండి. పడుకొని కూడా స్మృతి చేయవచ్చు. ''నన్ను స్మృతి చేస్తే మీరు సతోప్రధానంగా అవుతారని, పాపము సమాప్తమౌతుంది'' అని బేహద్‌ తండ్రి చెప్తున్నారు. టీచరు, సద్గురువు కూడా అయిన ఆ అనంతమైన తండ్రిని మీరు చాలా ప్రేమగా స్మృతి చేయాలి. ఇందులోనే మాయ విఘ్నాలు వేస్తుంది. మేము తండ్రి స్మృతిలో ఉండి హర్షితంగా భోజనము చేశామా? అని చూసుకోవాలి. ప్రేయసికి ప్రియుడు లభించారు కనుక తప్పకుండా ఖుషీ ఉంటుంది కదా. స్మృతిలో ఉండుట వలన మీకు చాలా జమ అవుతూ ఉంటుంది. గమ్యము చాలా గొప్పది. మీరు ఎలాంటివారు ఎలా అవుతారు! మొదట అవివేకులుగా ఉండేవారు, ఇప్పుడు మీరు చాలా వివేకవంతులుగా అయ్యారు. మీ ముఖ్య లక్ష్యము, ఉద్ధేశ్యము ఎంత ఫస్ట్‌క్లాసుగా ఉంది. మేము బాబాను స్మృతి చేస్తూ చేస్తూ ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళి క్రొత్త శరీరాన్ని తీసుకుంటామని మీకు తెలుసు. కర్మాతీత స్థితి వచ్చినప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తారు. సమీపంగా వచ్చినప్పుడు ఇంటి స్మృతి వస్తుంది కదా. బాబా జ్ఞానము చాలా మధురమైనది. పిల్లలకు ఎంతటి నషా ఎక్కాలి! భగవంతుడు ఈ రథములో కూర్చుని మిమ్ములను చదివిస్తున్నారు. ఇప్పుడు మీది ఉన్నతమయ్యేకళ. ఉన్నతమయ్యే కళ ద్వారా సర్వుల కళ్యాణము జరుగుతుంది..... (చఢ్‌తీ కళా తేరే భానే సర్వ్‌కా భలా). మీరు కొత్త విషయాలేవీ వినడం లేదు. అనేకమార్లు విన్నామని, అవే మళ్లీ వింటున్నామని మీకు తెలుసు. వినడం వలన లోలోపలే గద్గదమవుతూ ఉంటారు. మీరు గుప్తమైన సైనికులు కానీ చాలా ప్రసిద్ధమైనవారు. మీరు పూర్తి విశ్వమును స్వర్గముగా చేస్తారు. కనుకనే దేవీలకు ఇంతటి పూజ జరుగుతుంది. చేసేవారు మరియు చేయించేవారు ఇరువురి పూజ జరుగుతుంది. దేవీదేవతా ధర్మము వారి అంటు కట్టబడ్తోందని పిల్లలకు తెలుసు. ఈ పద్ధతి ఇప్పుడే ఏర్పడింది. మీరు స్వయానికి స్వయమే తిలకమును దిద్దుకుంటారు. ఎవరైతే బాగా చదువుతారో వారు తమను తాము స్కాలర్‌షిప్‌కు యోగ్యులుగా చేసుకుంటారు. పిల్లలు స్మృతియాత్ర చేసేందుకు చాలా పురుషార్థము చేయాలి. పరస్పరములో సోదరులుగా భావించినప్పుడు నామ-రూపాల భావన తొలగిపోతుంది. ఇందులోనే శ్రమ ఉంది. చాలా గమనమివ్వవలసి ఉంటుంది. వ్యర్థ మాటలు ఎప్పుడూ వినరాదు. నేను ఏదైతే వినిపిస్తానో అది వినండని తండ్రి చెప్తారు. వ్యర్థ మాటలు వినకండి, చెవులు మూసుకోండి. అందరికీ శాంతిధామము, సుఖధామాల మార్గమును తెలుపుతూ ఉండండి. ఎంత ఎవరు అనేమందికి మార్గాన్ని తెలుపుతారో అంత వారికి లాభము కలుగుతుంది. సంపాదన జరుగుతుంది. తండ్రి అందరినీ అలంకరించి, ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారు. తండ్రి పిల్లలకు సదా సహయోగిగా అవుతారు. ఎవరైతే తండ్రికి సహయోగులుగా అయ్యారో వారిని తండ్రి కూడా ప్రేమగా చూస్తారు. ఎవరైతే చాలామందికి మార్గాన్ని చూపిస్తారో వారిని బాబా కూడా చాలా స్మృతి చేస్తారు. వారికి కూడా తండ్రిని స్మృతి చేసే ఆకర్షణ ఉంటుంది. స్మృతి ద్వారానే తుప్పు వదులుతూ ఉంటుంది. తండ్రిని స్మృతి చేయడం అనగా ఇంటిని స్మృతి చేయడం. సదా బాబా-బాబా అని అంటూ ఉండండి. ఇది బ్రాహ్మణుల ఆత్మిక యాత్ర. పరమ ఆత్మను స్మృతి చేస్తూ చేస్తూ ఇంటికి చేరుకుంటారు. ఎంతగా ఆత్మాభిమానులయ్యే పురుషార్థము చేస్తారో, అంత కర్మేంద్రియాలు వశమౌతూ ఉంటాయి. కర్మేంద్రియాలను వశము చేసుకునేందుకు స్మృతియాత్ర ఒక్కటే ఉపాయము. మీరు ఆత్మిక స్వదర్శన చక్రధారి బ్రాహ్మణ కులభూషణులు. ఇది మీ సర్వోత్తమ శ్రేష్ఠ కులము. బ్రాహ్మణ కులము దేవతా కులము కంటే ఉన్నతమైనది ఎందుకంటే మిమ్ములను తండ్రి చదివిస్తున్నారు. తండ్రి ద్వారా విశ్వ సామ్రాజ్యాన్ని వారసత్వంగా తీసుకునేందుకు మీరు బాబావారిగా అయ్యారు. బాబా అని అనడంతోనే వారసత్వ పరిమళము వస్తుంది. శివుడిని సదా బాబా-బాబా అని అంటారు. శివబాబా సద్గతిదాత. వేరెవ్వరూ సద్గతినివ్వలేరు. సత్యమైన సద్గురువు ఒక్క నిరాకారుడే. వీరు అర్ధకల్పానికి రాజ్యాన్నిచ్చి వెళ్తారు. కనుక ముఖ్యమైన విషయము స్మృతియే. అంతిమ సమయములో ఏ శరీర భావము లేక ధన-సంపదలు గుర్తు రాకూడదు. లేనట్లైతే పునర్జన్మ తీసుకోవలసి వస్తుంది. భక్తిమార్గములో కాశీకల్వట్‌(కాశీ విశ్వనాథుని మందిరములో కత్తుల బావిలో దూకుట) చేస్తారు. మీరు కూడా కాశీకల్వట్‌ చేశారు అనగా బాబా వారిగా అయ్యారు. భక్తిమార్గములో కూడా కాశీకల్వట్‌ చేస్తూ పాపాలన్నీ సమాప్తమైపోతాయని భావిస్తారు. కానీ వాపస్‌ ఎవరూ వెళ్లలేరు. పై నుండి ఎప్పుడైతే అందరూ వచ్చేస్తారో అప్పుడు మళ్లీ వినాశనమౌతుంది. అప్పుడు తండ్రి, మీరు కూడా పరంధామానికి వెళ్తారు. పాండవులు పర్వతముల పై కరిగి మరణించారని అంటారు. అది ఆత్మహత్యలాంటిదే కదా. తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తారు - పిల్లలారా! సర్వుల సద్గతిదాతను నేను ఒక్కడినే, ఏ దేహధారి మీకు సద్గతినివ్వలేడు. భక్తిమార్గములో మెట్లు దిగుతూనే వచ్చారు. చివరిలో తండ్రి వచ్చి జోరుగా పైకి ఎక్కిస్తారు. దీనినే హఠాత్తుగా బేహద్‌ సుఖమునిచ్చే లాటరీ లభించిందని అంటారు. అక్కడ (లౌకికములో) గుఱ్ఱపు పందెములు జరుగుతాయి. ఇది ఆత్మల పరుగు. కానీ మాయ కారణంగా ప్రమాదాలు సంభవిస్తాయి లేక విడాకులు ఇచ్చేస్తారు. మాయ బుద్ధియోగాన్ని తెంచేస్తుంది. కామ వికారము వలన ఓడిపోతే చేసిన సంపాదనంతా సమాప్తమైపోతుంది. కామము పెద్ద భూతము, కామమును జయిస్తే జగజ్జీతులుగా అవుతారు. లక్ష్మీనారాయణులు జగజ్జీతులుగా ఉండేవారు. తండ్రి చెప్తున్నారు - ఈ అంతిమ జన్మలో తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. అప్పుడే జయించగలరు, లేకుంటే ఓడిపోతారు. ఇది మృత్యులోకములో అంతిమ జన్మ. అమరలోకములో 21 జన్మలు, మృత్యులోకములో 63 జన్మల రహస్యమును తండ్రి ఒక్కరు మాత్రమే అర్థం చేయిస్తారు. మేము లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు యోగ్యులుగా ఉన్నామా? అని మీ మనస్సును మీరు ప్రశ్నించుకోండి. ఎంతగా ధారణ జరుగతూ ఉంటుందో అంత సంతోషము కూడా ఉంటుంది. కానీ అదృష్టములో లేకుంటే మాయ నిలువనివ్వదు.

ఈ మధువన ప్రభావము రోజురోజుకు పెరుగుతూ ఉంటుంది. ముఖ్య బ్యాటరీ ఇక్కడ (మధువనము) ఉంది. సర్వీసెబుల్‌(సేవాధారి) పిల్లలు చాలా ప్రియంగా అనిపిస్తారు. ఎవరైతే మంచి సర్వీసెబుల్‌ పిల్లలుంటారో, వారిని బాబా వెతికి వెతికి సర్చ్‌లైట్‌ ఇస్తారు. వారు కూడా బాబాను తప్పకుండా స్మృతి చేస్తారు. సర్వీసెబుల్‌ పిల్లలను బాప్‌దాదా ఇద్దరూ స్మృతి చేస్తారు, సర్చ్‌లైట్‌ ఇస్తారు. మిఠరా ఘుర్‌తఘురాయ్‌,........ (మధురంగా తయారైతే అందరూ మీతో మధురంగానే వ్యవహరిస్తారు,.....) స్మృతి చేస్తే స్మృతికి జవాబు లభిస్తుంది. ఒకవైపు మొత్తం ప్రపంచమంతా ఉంది, మరొకవైపు సత్యమైన బ్రాహ్మణులైన మీరున్నారు. మీరు శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన తండ్రికి పిల్లలు. ఆ తండ్రి సర్వుల సద్గతిదాత. మీ ఈ దివ్యజన్మ వజ్ర సమానమైనది. మనలను గవ్వ నుండి వజ్ర సమానంగా వారే తయారు చేస్తారు. అర్ధకల్పానికి ఎంత సుఖమిస్తారంటే మళ్లీ వారిని స్మృతి చేసే అవసరమే ఉండదు. బాబా చెప్తున్నారు - పిల్లలారా! అంతులేని ధనాన్ని మీకిస్తాను. మీరంతా పోగొట్టుకుని కూర్చున్నారు. నా మందిరాలను నిర్మించడంలో ఎన్నో వజ్ర వైఢూర్యాలను ఉపయోగిస్తారు, పొదుగుతారు. ఇప్పుడు వజ్రానికెంత విలువ ఉందో చూడండి. పూర్వము వజ్రాలకు కూడా కొసురు లభించేది. ఇప్పుడు కూరగాయలకు కూడా కొసురు లభించదు. రాజ్యము ఎలా తీసుకున్నామో మళ్లీ ఎలా పోగొట్టుకున్నామో, తిరిగి ఎలా తీసుకుంటున్నామో పిల్లలైన మీకు తెలుసు. ఈ జ్ఞానము చాలా అద్భుతమైనది. కొంతమంది బుద్ధిలో కష్టంగా నిలుస్తుంది. రాజ్యపదవి తీసుకోవాలంటే శ్రీమతమును పూర్తిగా అనుసరించాలి. మన్మతము పనికి రాదు. జీవించి ఉండి వానప్రస్థములోకి వెళ్ళాలంటే సర్వస్వము వీరికి ఇవ్వవలసి ఉంటుంది. తండ్రిని మన వారసునిగా చేసుకోవాలి. భక్తిమార్గములో కూడా వారసులుగా చేసుకుంటారు. అల్పకాలానికి దానము చేస్తారు. కానీ ఇక్కడ జన్మ-జన్మల కొరకు వీరిని వారసులుగా చేసుకోవాలి. ఫాలో ఫాదర్‌ అని గాయనము కూడా ఉంది. ఎవరు అనుసరిస్తారో వారు శ్రేష్ఠమైన పదవిని పొందుతారు. అనంతమైన తండ్రికి చెందినవారిగా అయితేనే బేహద్‌ వారసత్వము పొందుతారు. శివబాబా అయితే దాత, ఈ భండారము వారిదే. ఈశ్వరార్థము దానము చేస్తే, మరుసటి జన్మకు అల్పకాల సుఖము లభిస్తుంది. అది పరోక్ష దానము. ఇది ప్రత్యక్ష దానము. శివబాబా 21 జన్మల కొరకు ఇస్తారు. మేము శివబాబాకు ఇస్తున్నామని కొందరి బుద్ధికి అనిపిస్తుంది. ఇది తండ్రిని అగౌరవపరచడం వంటిది. తీసుకునేందుకు ఇస్తున్నారు. ఇది బాబా భండారము. కాలకంటకాలు దూరమైపోతాయి. పిల్లలు అమరలోకము కొరకు చదువుతారు. ఇది ముళ్ళ అడవి. బాబా పూలతోటలోకి తీసుకెళ్తారు. కావున పిల్లలకు చాలా సంతోషము ఉండాలి. దైవీగుణాలను కూడా ధారణ చేయాలి. బాబా ఎంతో ప్రీతితో పిల్లలను సుగంధపుష్పాలుగా తయారుచేస్తారు. బాబా చాలా ప్రీతితో అర్థం చేయిస్తారు. తమ కళ్యాణము చేసుకోవాలంటే దైవీగుణాలను కూడా ధారణ చేయండి మరియు ఇతరుల అవగుణాలను చూడకండి. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము -

1. అనంతమైన తండ్రి నుండి సర్చ్‌లైట్‌ తీసుకునేందుకు వారికి సహయోగులుగా అవ్వాలి. ముఖ్యమైన బ్యాటరీతో కనెక్షన్‌ జోడించి ఉంచుకోవాలి. ఏ విషయములోనూ సమయాన్ని వ్యర్థ పరచరాదు.

2. సత్యమైన సంపాదన చేసుకునేందుకు లేక భారతదేశానికి సత్యమైన సేవ చేసేందుకు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. ఎందుకంటే స్మృతి ద్వారా వాయుమండలము శుద్ధమౌతుంది.ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. అపారమైన సంతోషము అనుభవమౌతుంది. కర్మేంద్రియాలు వశమౌతాయి.

వరదా నము :-

'' ధారణా స్వరూపము ద్వారా సేవ చేసి సంతోషమనే ప్రత్యక్ష ఫలమును ప్రాప్తి చేసుకునే సత్యమైన సేవాధారీ భవ ''

సేవలో ఉమంగ-ఉత్సాహాలు కలిగి ఉండడం మంచిదే కానీ పరిస్థితులనుసారము మీకు సేవ చేసేందుకు అవకాశము లభించకుంటే మీ స్థితి దిగజారరాదు. ఆందోళన చెందరాదు. జ్ఞానం వినిపించేందుకు అవకాశము లభించకపోయినా మీరు మీ ధారణా స్వరూప ప్రభావాన్ని వేసినట్లయితే సేవ సబ్జెక్టులో మార్కులు జమ అవుతాయి. ధారణా స్వరూప పిల్లలే సత్యమైన సేవాధారులు. వారికి అందరి ఆశీర్వాదాలు మరియు సేవకు బదులు ప్రత్యక్షఫలముగా సంతోషము అనుభవమవుతుంది.

స్లోగన్‌ :-

'' సత్యమైన హృదయంతో దాత, విధాత, వరదాతను రాజీ చేసుకుంటే ఆత్మిక ఆనందంలో (మజాలో) ఉంటారు. ''