02-08-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - యోగము ద్వారా తత్వాలను పావనంగా చేసే సేవ చేయండి, ఎందుకంటే తత్వాలు పావనమైనప్పుడే దేవతలు ఈ సృష్టి పై తమ పాదము మోపుతారు ''

ప్రశ్న :-

మీ నూతన రాజధానిలో ఏ విధమైన అశాంతి ఉండజాలదు, ఎందుకు?

జవాబు :-

1. ఎందుకంటే ఆ రాజ్యము మీకు తండ్రి ద్వారా వారసత్వంగా లభించింది. 2. వరదాత అయిన తండ్రి పిల్లలైన మీకు ఇప్పుడే వరదానాన్ని అనగా వారసత్వమును ఇచ్చేశారు, అందువలన అక్కడ అశాంతి ఉండజాలదు. మీరు తండ్రికి చెందినవారిగా అవుతారు కనుక మొత్తం వారసత్వమంతా తీసేసుకుంటారు.

ఓంశాంతి.

మనము ఎవరి పిల్లలమో వారిని సత్యమైన ప్రభువు అని కూడా అంటారని పిల్లలకు తెలుసు. అందుకే ఇప్పుడు పిల్లలైన మిమ్ములను సాహేబ్‌ జాదే(ఈశ్వరీయ సంతానము) అని కూడా అంటారు. సత్య అంశము పై సత్యంగానే తినాలి, సత్యంగానే ధరించాలి,.............. అన్న ఒక్క నానుడి కూడా ఉంది. భలే ఇది మనుష్యులచే తయారు చేయబడిందే అయినా తండ్రి కూర్చొని దీని అర్థము తెలిపిస్తారు. అత్యంత ఉన్నతులు ఒక్క తండ్రియేనని, వారికి ఎంతో మహిమ ఉందని, వారినే రచయిత అని కూడా అంటారని పిల్లలకు తెలుసు. మొట్టమొదటి రచన - పిల్లలు. మీరు తండ్రి పిల్లలు కదా! ఆత్మలందరూ తండ్రి జతలోనే ఉంటారు. దానిని తండ్రి ఇల్లు, మధురమైన ఇల్లు అని అంటారు. ఇక్కడ ఇది ఇల్లేమీ కాదు, వారు మన అత్యంత మధురమైన తండ్రి అని పిల్లలకు తెలుసు. శాంతిధామము మధురమైన ఇల్లు, అలాగే సత్యయుగము కూడా స్వీట్‌ హోమ్‌(మధురమైన ఇల్లు)యే. ఎందుకంటే అక్కడ ప్రతి ఇంటిలో శాంతి ఉంటుంది. ఇక్కడ ఇంట్లో లౌకిక తల్లిదండ్రుల వద్ద కూడా అశాంతి ఉంది. అలాగే ప్రపంచములో కూడా అశాంతి ఉంది. అక్కడైతే ఇంట్లోనూ శాంతి ఉంటుంది, అలాగే మొత్తం ప్రపంచమంతటా శాంతి ఉంటుంది. సత్యయుగమును చిన్న క్రొత్త ప్రపంచము అని అంటారు. ఈ పాత ప్రపంచము ఎంత పెద్ద ప్రపంచము! సత్యయుగములో సుఖ-శాంతులు ఉంటాయి. అక్కడ ఏ గొడవలూ ఉండవు. ఎందుకంటే అనంతమైన తండ్రి ద్వారా వారికి శాంతి వారసత్వము లభించింది. గురువులు, గోసాయిలు(మఠాధిపతులు) పుత్రవాన్‌ భవ, ఆయుష్మాన్‌ భవ అని ఆశీర్వదిస్తారు. వీరు ఏ ఆశీర్వాదమునూ ఇవ్వడం లేదు. తండ్రి నుండి అయితే వారసత్వము దానంతట అదే లభిస్తుంది. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు స్మృతిని కలిగించారు. ఆ పారలౌకిక తండ్రిని భక్తి మార్గములో అన్ని ధర్మాలవారు దు:ఖ ప్రపంచమైనప్పుడు స్మృతి చేస్తారు. ఇది పతితమైన పాత ప్రపంచము, కొత్త ప్రపంచములో సుఖము ఉంటుంది. అశాంతి అన్న మాటే ఉండదు. ఇప్పుడు పిల్లలైన మీరు పవిత్రంగా, గుణవంతులుగా అవ్వాలి లేకపోతే చాలా శిక్షలను అనుభవించవలసి వస్తుంది. తండ్రితో పాటు, లెక్కాచారాలను చుక్తా చేయించే ధర్మరాజు కూడా ఉన్నారు. ట్రిబ్యునల్‌(ధర్మాసనము, న్యాయసభ) కూర్చుం&# D D°ú@0ŽAˆ D@ D@@ D7; శిక్షలైతే తప్పకుండా లభిస్తాయి. బాగా కష్టపడేవారు శిక్షలను అనుభవించరు. పాపాలకు శిక్ష లభిస్తుంది. దానిని కర్మభోగము అని అంటారు. ఇది రావణుని పరాయి రాజ్యము. ఇందులో అపారమైన దు:ఖముంది. రామరాజ్యములో అపారమైన సుఖముంటుంది. మీరు అనేకమందిని అర్థము చేయిస్తారు, అందులో కొందరు వెంటనే అర్థము చేసుకుంటారు, మరికొందరు ఆలస్యంగా అర్థము చేసుకుంటారు. ఎవరైనా తక్కువగా అర్థము చేసుకుంటే వారు భక్తిని ఆలస్యంగా చేశారని అర్థము చేసుకోండి. ఎవరైతే ప్రారంభము నుండి భక్తి చేశారో వారు జ్ఞానమును కూడా త్వరగా అర్థము చేసుకుంటారు, ఎందుంటే వారు ముందు నెంబర్‌లోకి వెళ్లవలసి ఉంటుంది.
ఆత్మలైన మనము మధురమైన ఇంటి నుండి ఇక్కడకు వచ్చామని మీకు తెలుసు. సైలెన్స్‌, మూవీ, టాకీలు ఉన్నాయి కదా! పిల్లలు ధ్యానములోకి వెళ్లినప్పుడు అక్కడ మూవీ నడుస్తుందని వినిపిస్తారు. దానికి జ్ఞానమార్గముతో ఎటువంటి సంబంధమూ లేదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి, ఇదే ముఖ్యమైన విషయము. ఇంకే విషయమూ లేదు. తండ్రి నిరాకారుడు. పిల్లలు కూడా అనగా ఆత్మలు కూడా ఈ శరీరములో నిరాకారులుగానే ఉంటారు. ఇందులో ఇంకే విషయమూ రాదు. ఆత్మ ప్రేమ ఒక్క పరమపిత పరమాత్మతోనే ఉంటుంది. శరీరాలన్నీ పతితమైనవే. కావున ఈ పతిత శరీరాల పై ప్రేమ ఏర్పడజాలదు. ఆత్మ భలే పావనంగా అవుతుంది, కానీ శరీరమైతే పతితమైనదే కదా! పతిత ప్రపంచములో శరీరము పావనంగా అవ్వనే అవ్వదు. ఆత్మ అయితే ఇక్కడే పావనంగా అవ్వాలి. అప్పుడు ఈ పాత శరీరాలు వినాశనమవుతాయి. ఆత్మ అయితే అవినాశి, అనంతమైన తండ్రిని స్మృతి చేస్తూ పావనంగా అవ్వడమే ఆత్మ పని. ఆత్మ పవిత్రమైతే శరీరము కూడా పవిత్రమైనదే కావాలి. అది క్రొత్త ప్రపంచములో లభిస్తుంది. భలే ఆత్మ పావనంగా అయిపోతుంది, పతిత ప్రపంచములో శరీరము పావనముగా అవ్వనే అవ్వదు. ఆత్మ పావనంగా అవ్వాలంటే, ఆత్మ ఒక్క పరమపిత పరమాత్మతోనే యోగము జోడించాలి. ఈ పతిత శరీరాలను ముట్టుకోను కూడా ముట్టుకోరాదు. ఈ విధంగా ఆత్మలతో తండ్రి మాట్లాడుతున్నారు. ఇవి అర్థము చేసుకోవలసిన విషయాలు కదా! సత్యయుగము నుండి కలియుగము వరకు శరీరాల జతలో వేలాడారు. భలే అక్కడ ఆత్మ మరియు శరీరము రెండూ పవిత్రంగా ఉంటాయి. ఆత్మ లేక శరీరము వికారిగా అయేందుకు అసలు వారు అక్కడ వికారాలలోకే వెళ్లరు. వల్లభాచార్యులు కూడా ఉన్నారు. వారు ఎవ్వరినీ ముట్టుకోనివ్వరు. అలాగని వారి ఆత్మ నిర్వికారిగా, పవిత్రంగా ఏమీ ఉండదని మీకు తెలుసు. అది వల్లభాచారీ సాంప్రదాయము, వారు తమను తాము చాలా ఉన్నతమైన కులానికి చెందినవారమని భావిస్తారు. శరీరమును కూడా స్పర్శించనివ్వరు. మేము వికారి, అపవిత్రులమని, శరీరమైతే భ్రష్టాచారము ద్వారానే జన్మిస్తుందని అర్థం చేసుకోరు. ఈ విషయాలను తండ్రియే వచ్చి అర్థము చేయిస్తారు. ఆత్మ పావనంగా అవుతూ ఉంటుంది. ఆ తర్వాత శరీరమును కూడా మార్చవలసి ఉంటుంది. సత్యయుగములో ఎప్పుడైతే పంచ తత్వాలు కూడా పావనంగా అయిపోతాయో అప్పుడు శరీరాలు కూడా పావనంగా అవుతాయి. దేవతలు పతిత శరీరములో, పతిత ధరణి పై పాదం మోపరు. వారి ఆత్మ మరియు శరీరమూ రెండూ పవిత్రంగా, పావనంగా ఉంటాయి. కావున వారు సత్యయుగములోనే పాదము మోపుతారు. ఇది పతిత ప్రపంచము. ఆత్మ పారలౌకిక తండ్రి అయిన పరమాత్మనే స్మృతి చేస్తుంది. ఒకరేమో శారీరిక తండ్రి, ఇంకొకరు అశరీరి తండ్రి, అశరీరి తండ్రినే స్మృతి చేస్తారు, ఎం&# D D°ú@0ŽAˆ D@ D@@ D;ా ఇటువంటి సుఖ వారసత్వము తప్పకుండా లభించింది. కావున స్మృతి చేయకుండా ఉండలేరు. ఈ సమయములో తమోప్రధానంగా అయినా, ఆ తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తారు. కానీ వారి ద్వారా, ఈశ్వరుడు సర్వవ్యాపి అని తప్పుడు శిక్షణ లభిస్తుంది. మళ్లీ మనిషి మనిషిగానే జన్మిస్తాడు అన్న విషయములో కూడా తికమక పడ్తారు. ఈ పొరపాట్లన్నీ తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. తండ్రి కేవలం ఒక్క 'మన్మనాభవ' అన్న మంత్రమునే ఇస్తారు. దాని అర్థము కూడా కావాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇదే చింత ఉన్నట్లైతే మీరు పావనంగా అవ్వగలరు. దేవతలు పవిత్రులు ఇప్పుడు తండ్రి వచ్చి మళ్లీ ఇలా పవిత్రంగా చేస్తారు. మీ ముందు లక్ష్యాన్ని, ఉద్ధేశ్యాన్ని ఉంచుతారు. విగ్రహాలను తయారుచేసేవారు ఎవరైతే ఉంటారో వారు మనిషి ముఖాన్ని చూడగానే వెంటనే వారి విగ్రహాన్ని తయారు చేసేస్తారు. వారు చైతన్యంగా ముందు కూర్చున్నట్లే జీవన కళ ఉట్టిపడుతున్నట్లు తయారుచేస్తారు. కానీ అవి జడమైన మూర్తులు మాత్రమే. ఇక్కడ తండ్రి మీకు చైతన్య లక్ష్మీనారాయణులుగా అవ్వాలని చెప్తారు. ఎలా తయారవుతారు? మనుష్యుల నుండి దేవతలుగా మీరు ఈ చదువు, పవిత్రతల ద్వారా అవుతారు. ఇది మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే స్కూలు. వారు ఎన్నో విగ్రహాలు మొదలైనవి తయారు చేస్తారు, దానిని ఒక కళ అని అంటారు. ఖచ్ఛితంగా అవే రూపురేఖలతో తయారుచేస్తారు కానీ ఇక్కడ అవే రూపురేఖలతో తయారయ్యే విషయమే లేదు, ఇది కేవలం జడ చిత్రము మాత్రమే, అక్కడైతే మీరు ప్రకృతి సిద్ధంగా, చైతన్యంగా అవుతారు కదా! పంచ తత్వాల చైతన్య శరీరము ఉంటుంది. ఇది మనుష్యుల చేత తయారు చేయబడిన జడ చిత్రము. ఖచ్ఛితంగా అయితే తయారవ్వజాలదు. ఎందుకంటే దేవతలను ఫోటో తీయలేరు. ధ్యానములో భలే సాక్షాత్కారము చేసుకుంటారు కాని దానిని ఫోటో తీయలేరు. మేము ఇటువంటి సాక్షాత్కారాన్ని పొందాము అని అంటారు. కానీ దాని చిత్రమునైతే స్వయం వారు గానీ, వేరెవ్వరు గానీ తయారుచేయలేరు. ఎప్పుడైతే తండ్రి నుండి జ్ఞానాన్ని తీసుకొని పూర్తి చేస్తారో అప్పుడే స్వయం అలా తయారవుతారు. మీరు ఖచ్ఛితంగా కల్పక్రితము వలె తయారవుతారు. ఇది ఎంత అద్భుతమైన ప్రకృతి సిద్ధమైన డ్రామా! తండ్రి కూర్చుని ఈ ప్రకృతి సిద్ధమైన విషయాలను అర్థము చేయిస్తారు. మనుష్యులకైతే ఈ విషయాలు ఆలోచనలో కూడా ఉండవు. వారి ముందుకు వెళ్లి తల వంచి నమస్కరిస్తూ ఉంటారు, వీరు ఒకప్పుడు రాజ్యము చేసి వెళ్లారని భావిస్తారు, కానీ ఎప్పుడో తెలియదు. మళ్లీ వారు ఎప్పుడు వస్తారు? వచ్చి ఏమి చేస్తారు? అన్న విషయాలేవీ తెలియదు, సూర్య వంశీయలు, చంద్ర వంశీయులు ఎవరైతే ఒకప్పుడు ఇక్కడ నుండి వెళ్లారో వారు ఖచ్ఛితంగా, తప్పకుండా మళ్లీ అలాగే ఈ జ్ఞానం ద్వారా అవుతారని మీకు తెలుసు, ఇది అద్భుతం కదా! కావున ఈ విధంగా పురుషార్థము చేయడం ద్వారా మీరు దేవతలుగా అవుతారని ఇప్పుడు తండ్రి అర్థము చేయిస్తారు. సత్య, త్రేతా యుగాలలో ఏ పాత్ర అయితే నడిచిందో అదే నడుస్తుంది. ఇది ఎంత అద్భుతమైన జ్ఞానము! ఎప్పుడైతే హృదయం స్వచ్ఛంగా ఉంటుందో అప్పుడే ఇది బుద్ధిలో నిలువగలదు. అందరి బుద్ధిలో ఈ విషయాలు నిలువజాలవు, కష్టపడవలసి ఉంటుంది. కష్టపడకుండా ఎటువంటి ఫలమూ లభించజాలదు. తండ్రి అయితే పురుషార్థము చేయిస్తూ ఉంటారు. భలే డ్రామానుసారంగానే జరుగుతున్నా పురుషార్థమైతే చేయవలసి ఉంటుంది. డ్రామాలో ఉంటే మా  D D°ú@0ŽAˆ D@ D@@ D#3118;ు నడుస్తుందని అలా కూర్చుండిపోలేరు కదా! అటువంటి ఆటవిక ఆలోచనలు గలవారు కూడా చాలామంది ఉంటారు. మా భాగ్యములో ఉంటే పురుషార్థము తప్పకుండా నడుస్తుందిలే అని అంటారు. అరే! పురుషార్థాన్ని మీరు చేయాలి, పురుషార్థము మరియు ప్రాలబ్ధము ఉంటుంది. పురుషార్థము గొప్పదా లేక ప్రాలబ్ధము గొప్పదా? అని మనుష్యులు అడుగుతారు. ప్రాలబ్ధమే గొప్పది కానీ, పురుషార్థమునే గొప్పదిగా ఉంచడం జరుగుతుంది, ఎందుకంటే దాని ద్వారానే ప్రాలబ్ధము తయారవుతుంది. మనుష్యమాత్రులందరికీ అన్నీ పురుషార్థము ద్వారానే లభిస్తాయి. దీనిని తప్పుగా, తలక్రిందులుగా తీసుకునే రాతిబుద్ధి గలవారు కూడా ఉంటారు. వారి భాగ్యములో లేదని అర్థము చేసుకోవడం జరుగుతుంది, వారు పడిపోతారు. ఇక్కడ పిల్లలచే ఎంతగా పురుషార్థము చేయిస్తారు! రాత్రింబవళ్లు అర్థము చేయిస్తూ ఉంటారు. మీ నడవడికలను తప్పకుండా తీర్చిదిద్దుకోవాలి.
నెంబర్‌వన్‌ నడవడిక పావనంగా అవ్వడం. దేవతలైతే పావనంగానే ఉంటారు. మళ్లీ ఎప్పుడు పడిపోతారో, నడవడిక పాడైనప్పుడు పూర్తిగా పతితులుగా అయిపోతారు. మన నడవడిక ఏ-వన్‌గా ఉండేదని, తర్వాత పూర్తిగా పడిపోయామని ఇప్పుడు మీకు తెలుసు. మొత్తం ఆధారమంతా పవిత్రత పైననే ఉంది. ఇందులోనే ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. మనుష్యుల కళ్లు ఎంతగానో మోసగిస్తాయి, ఎందుకంటే ఇది రావణ రాజ్యము. అక్కడైతే కళ్ళు మోసగించనే మోసగించవు. జ్ఞాన మూడవ నేత్రము లభిస్తుంది. అందుకే రిలిజియన్‌ ఈజ్‌ మైట్‌ (ధర్మమే శక్తి) అని అంటారు. సర్వశక్తివంతుడైన తండ్రియే వచ్చి ఈ దేవీ దేవతా ధర్మమును స్థాపన చేస్తారు. చేసేదంతా ఆత్మయే కానీ మనుష్య రూపంలో చేస్తుంది. ఆ తండ్రి జ్ఞానసాగరుడు. వీరి మహిమ దేవతల కంటే పూర్తి భిన్నమైనది. కావున ఇటువంటి తండ్రిని ఎందుకు స్మృతి చేయరు? వారినే జ్ఞానసాగరలు, బీజరూపుడు అని కూడా అంటారు. వారిని సత్‌ చిత్‌ ఆనంద స్వరూపుడు అని ఎందుకు అంటారు? వృక్షానికి బీజము ఉంటుంది, దానికి కూడా వృక్షమును గూర్చి తెలుసు కదా! కానీ అది జడ బీజము. అందులోని ఆత్మ జడము వలె ఉంటుంది. మనిషిలో ఆత్మ చైతన్యంగా ఉంటుంది. చైతన్య ఆత్మను జ్ఞానసాగరము అని కూడా అంటారు. వృక్షము చిన్న మొక్క నుండి పెద్దగా అవుతుంది కావున అందులో తప్పకుండా ఆత్మ ఉంది కానీ అది మాట్లాడలేదు. పరమాత్మ మహిమ ఎంత అపారమైనది. జ్ఞానసాగరులు.............. ఇది ఆత్మ మహిమ కాదు, పరమ-ఆత్మ అనగా పరమాత్మ మహిమ. మళ్లీ వారిని ఈశ్వరుడు అని కూడా అంటారు. వారి నిజమైన పేరు పరమపిత పరమాత్మ. పరమ అనగా సుప్రీమ్‌, మహిమను కూడా చాలా భారీగా చేస్తారు. ఇప్పుడు రోజురోజుకు మహిమ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే మొదట బుద్ధి సతోగా ఉండేది, ఆ తర్వాత రజోగా, తమోప్రధానంగా అయిపోతుంది. ఈ విషయాలన్నీ తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. నేను ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా తయారు చేస్తాను. సత్యయుగం ఆదిలో సత్యమే ఉండేది, సత్యమైన వ్యవస్థ ఉంటుంది అన్న గాయనము కూడా ఉంది కదా! కొన్ని నానుడులు(సామెతలు) కూడా చాలా బాగా రచింపబడి ఉన్నాయి. ఎందుకంటే వారు ఇంతగా పతితులుగా లేరు. చివరిలో వచ్చేవారు అంత పతితులుగా ఉండరు. భారతవాసులే చాలా సతోప్రధానంగా ఉండేవారు, వారే మళ్లీ అనేక జన్మల అంతిమములో తమోప్రధానంగా అయ్యారు. ఇతర ధర్మస్థాపకులను గురించి ఇలా అనరు. వారు ఇంత సతోప్రధానంగానూ అవ్వరు, ఇంత తమోప్రధానముగానూ అవ్వరు. వారు చాలా సుఖమునూ చూడరు, అలాగే చాలా దు:ఖమునూ చూడరు. అందరికంటే ఎక్కువ తమోప్రధానంగా ఎవరి బుద్ధి తయారయ్యింది? ఎవరైతే మొట్టమొదట దేవతలుగా ఉండేవారో, వారే అన్ని ధర్మాల వారికంటే ఎక్కువగా దిగజారిపోయారు. భలే భారతదేశమును మహిమ చేస్తారు. ఎందుకంటే ఇది చాలా పురాతనమైనది. ఆలోచిస్తే ఈ సమయంలో భారతదేశము చాలా దిగజారి ఉంది. ఉత్థానము, పతనము రెండూ భారతదేశానివే, అనగా దేవీ దేవతలవి. ఇది బుద్ధి ద్వారా అర్థము చేసుకోవాలి. మనము సతోప్రధానముగా ఉన్నప్పుడు సుఖాన్ని కూడా చాలా చూశాము. మళ్లీ దు:ఖాన్ని కూడా చాలా చూశాము, ఎందుకంటే తమోప్రధానంగా ఉన్నాము. ముఖ్యమైనవి నాలుగు ధర్మాలే, దేవతా ధర్మము, ఇస్లాం ధర్మము, బౌద్ధ ధర్మము, క్రైస్తవ ధర్మము......... మిగిలినవన్నీ వీటి నుండే వృద్ధి పొందుతూ వచ్చాయి. ఈ భారతవాసులకు తాము ఏ ధర్మానికి చెందినవారమో కూడా తెలియదు. ధర్మమును గూర్చి తెలియని కారణంగా ధర్మాన్నే వదిలేస్తారు. వాస్తవానికి అన్నిటికంటే ముఖ్యమైన ధర్మము ఇదే. అయితే తమ ధర్మాన్ని మర్చిపోయారు. వీరికి తమ ధర్మము పై విశ్వాసము లేదు, నమ్మకము లేదు అని తెలివైనవారు భావిస్తారు. లేకుంటే భారతదేశం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అయిపోయింది! పిల్లలూ, మీరు ఎలా ఉండేవారు! అని తండ్రి కూర్చొని మొత్తం చరిత్రనంతా అర్థము చేయిస్తారు. మీరు దేవతలుగా ఉండేవారు, అర్ధకల్పం రాజ్యము చేశారు, మళ్లీ అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యంలో మీరు ధర్మ భ్రష్ఠులుగా, కర్మ భ్రష్ఠులుగా అయిపోయారు, ఇప్పుడు మళ్లీ మీరు దైవీ సాంప్రదాయానికి చెందినవారిగా అవుతున్నారు, భగవానువాచ - తండ్రి కల్ప-కల్పము పిల్లలైన మీకే అర్థము చేయించి ఈశ్వరీయ సంప్రదాయన్ని తయారు చేస్తారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. మీ హృదయము యొక్క స్వచ్ఛత ద్వారా తండ్రి అద్భుతైన జ్ఞానమును జీవితములో ధారణ చేయాలి, పురుషార్థము ద్వారా ఉన్నతమైన ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాలి. డ్రామా అని పురుషార్థం చేయకుండా కూర్చుండిపోరాదు.

2. రావణరాజ్యములో అశుద్ధమైన కనులు చేసే మోసము నుండి సురక్షితులయ్యేందుకు జ్ఞాన మూడవ నేత్రము ద్వారా చూసే అభ్యాసం చేయాలి. నంబర్‌వన్‌ క్యారెక్టర్‌ అయిన పవిత్రతనే ధారణ చేయాలి.

వరదానము :-

'' పునాది గుణమైన సత్యత ద్వారా మీ నడవడిక మరియు ముఖము నుండి దివ్యతను అనుభవం చేయించే సత్యవాదీ భవ ''

ప్రపంచములో అనేకమంది ఆత్మలు స్వయాన్ని సత్యవాదులమని చెప్పుకుంటారు లేక భావిస్తారు. కాని సంపూర్ణ సత్యత పవిత్రత పై ఆధారపడి ఉంటుంది. పవిత్రత లేకుంటే సత్యత సదా ఉండజాలదు. సత్యతకు పునాది పవిత్రత. సత్యతకు ప్రాక్టికల్‌ ప్రమాణము ముఖములో, నడవడికలో దివ్యత. పవిత్రత ఆధారము పై సత్యతా స్వరూపము స్వతహాగా, సహజంగా వస్తుంది. ఎప్పుడైతే ఆత్మ మరియు శరీరము రెండూ పావనమవుతాయో అప్పుడు వారిని సంపూర్ణ సత్యవాదులని అంటారు.

స్లోగన్‌ :-

'' బేహద్‌ సేవలో బిజీగా ఉంటే అనంతమైన వైరాగ్యము స్వతహాగా వచ్చేస్తుంది. ''