17-08-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - స్మృతితో పాటు చదువు పై కూడా పూర్తి గమనమివ్వాలి. స్మృతి ద్వారా పావనంగా అవుతారు, చదువు ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతారు '
ప్రశ్న :-
స్కాలర్షిప్(ూషష్ట్రశీశ్రీaతీరష్ట్రఱజూ) తీసుకునేందుకు ఏ పురుషార్థము చాలా అవసరము?
జవాబు :-
స్కాలర్షిప్ తీసుకోవాలంటే వస్తువులన్నింటి పై మమకారము తీసేయండి. ధనము, పిల్లలు, ఇల్లు, వాకిలి మొదలైనవేవీ గుర్తుకు రాకూడదు. శివబాబా ఒక్కరే గుర్తుండాలి. పూర్తి స్వాహా అయినప్పుడే ఉన్నత పదవి ప్రాప్తిస్తుంది. మేము ఎంత పెద్ద పరీక్షలో పాస్ అవుతాము అని బుద్ధిలో నషా ఉండాలి. మాదెంత గొప్ప చదువు చదివించేవారు స్వయం దు:ఖహర్త - సుఖకర్త అయిన తండ్రి. ఆ అత్యంత ప్రియమైన తండ్రే మమ్ములను చదివిస్తున్నారని బుద్ధిలో ఉండాలి.
ఓంశాంతి.
ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయించి చదివిస్తున్నారంటే పిల్లలకు ఎంత నషా ఉండాలి. చదివేది ఆత్మయే కదా. ఆత్మ సంస్కారాలను తీసుకెళ్తుంది, శరీరమైతే బూడిదైపోతుంది. కావున తండ్రి కూర్చుని పిల్లలను చదివిస్తారు. మేము చదువుకుంటున్నామని, యోగము నేర్చుకుంటున్నామని ఆత్మలు భావిస్తారు. తండ్రి చెప్తున్నారు - స్మృతిలో ఉంటే మీ పాపాలు సమాప్తమైపోతాయి. పతితపావనులు ఒక్క తండ్రి మాత్రమే. బ్రహ్మ, విష్ణు, శంకరులను పతితపావనులని అనరు. లక్ష్మీనారాయణులను పతితపావనులని అంటారా? అనరు. పతితపావనులు ఒక్కరే. పూర్తి ప్రపంచాన్ని పావనంగా చేసేవారు ఒక్కరే. వారు మీ తండ్రి. అతిప్రియమైనవారు అనంతమైన తండ్రి అని పిల్లలకు తెలుసు. ఆ తండ్రినే భక్తిమార్గములో తండ్రీ రండి! వచ్చి మా దు:ఖాలను హరించండి. సుఖమునివ్వండి అని స్మృతి చేస్తూ వచ్చారు. సృష్టి ఏమో అదే. ఈ చక్రములోకి అయితే అందరూ రానే రావాలి. 84 జన్మల చక్రమును కూడా తండ్రి అర్థం చేయించారు. ఆత్మయే సంస్కారాలను తీసుకెళ్తుంది. ఈ మృత్యు లోకము నుండి అమరలోకానికి అంటే నరకము నుండి స్వర్గములోకి వెళ్లేందుకు మనము చదువుతున్నామని ఆత్మకు తెలుసు. పిల్లలైన మమ్ములను మళ్లీ విశ్వాధికారులుగా చేసేందుకు తండ్రి వచ్చారని పిల్లలకు తెలుసు. మీరు ఎంత పెద్ద పరీక్షను పాస్ చేస్తున్నారు. అత్యంత గొప్ప తండ్రి చదివిస్తున్నారు. ఈ సమయంలో బాబా కూర్చుని చదివించునప్పుడు నషా పెరుగుతుంది. బాబా చాలా బాగా జోరుగా నషాను పెంచుతారు. అమరలోకానికి అర్హులుగా చేసేందుకే తండ్రి వస్తారు. ఇక్కడ ఎవ్వరూ అర్హులుగా లేనే లేరు. అర్హులైన దేవతల ముందుకు వెళ్లి మనము తల వంచి నమస్కరించేవారిమని మీకు కూడా తెలుసు. ఇప్పుడు బాబా మళ్లీ మనలను పూర్తి విశ్వానికంతా అధికారులుగా చేస్తారు. మరి ఈ నషా స్థిరంగా ఉండాలి కదా. ఇక్కడ ఉంటే నషా పెరిగి బయటకు వెళ్లగానే తగ్గిపోవడం - ఇలా అవ్వరాదు. ''బాబా, మేము మిమ్ములను మర్చిపోతాము'' అని పిల్లలు అంటారు. మీరు పతిత ప్రపంచములో పతిత శరీరములో వచ్చి మమ్ములను చదివిస్తారు, విశ్వానికి యజమానులుగా చేస్తారు. పిల్లలైన మీరు విశ్వ చక్రవర్తి పదవి అనే చాలా పెద్ద లాటరీ తీసుకుంటారు. కానీ మీరు గుప్తంగా ఉన్నారు. కావున ఇటువంటి శ్రేష్ఠమైన చదువు పై చాలా మంచి గమనమివ్వాలి. కేవలం స్మృతియాత్రతో పని జరగదు, చదువు కూడా అవసరము. 84 జన్మల చక్రములో ఎలా తిరుగుతామో, ఇది కూడా బుద్ధిలో తిరుగుతూ ఉండాలి.
బాబా చాలా జోరుగా నషా పెంచుతారని మీకు తెలుసు. మీ అంత గొప్పవారిగా ఎవ్వరూ అవ్వలేరు, మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. విశ్వాధికారులుగా మీరు తప్ప ఇంకెవరైనా అయ్యారా? క్రైస్తవులు ప్రపంచానికంతా అధికారులుగా అవ్వాలని ఎంతగానో ప్రయత్నించారు కానీ అవ్వలేకపోయారు. ఎందుకంటే నియమానుసారంగా మీరు తప్ప విశ్వానికి యజమానులుగా ఎవ్వరూ అవ్వలేరు. తయారుచేసే తండ్రి కూడా ఉండాలి. అలా చేయించే శక్తి బాబాకు తప్ప ఇతరులెవ్వరికీ లేదు. పిల్లలైన మీకు చాలా మంచి బుద్ధి ఉండాలి. జ్ఞానామృతపు డోస్ ఎక్కిస్తూ ఉంటారు. మేము బాబాను చాలా స్మృతి చేస్తామని నిలిచిపోరాదు, స్మృతితో పావనంగా అవుతారు కానీ శ్రేష్ఠ పదవిని కూడా పొందాలి. శిక్షలు అనుభవించి అయినా అందరూ పావనంగా అవ్వాల్సిందే. కానీ తండ్రి విశ్వాధికారులుగా చేసేందుకు వచ్చారు. అందరూ శాంతిధామానికి వెళ్లి అక్కడ కేవలం కూర్చుండిపోవాలా? అక్కడ కూర్చుండిపోయేవారు దేనికీ పనికిరారు. స్వర్గములో వచ్చి రాజ్యము చేసేవారే వివేకవంతులు. మీరు స్వర్గ చక్రవర్తి పదవిని తీసుకునేందుకే ఇక్కడకు వచ్చారు. మీకు చక్రవర్తి పదని ఉండేది కానీ మాయ లాక్కునేసింది. ఇప్పుడు మళ్లీ మాయా రావణుని పై విజయమును పొందాలి, విశ్వాధికారులుగా మీరే అవ్వాలి. మీరు రావణ రాజ్యములో వికారులైపోయినందున మీకిప్పుడు రావణుని పై జయమును కలిగిస్తున్నారు. అందుకే మనుష్యులను కోతితో పోలుస్తారు. కోతులు చాలా వికారిగా ఉంటాయి. దేవతలైతే సంపూర్ణ నిర్వికారులు. ఈ దేవతలే 84 జన్మల తర్వాత పతితులుగా అయ్యారు. తండ్రి చెప్తున్నారు - మీ చేతిలో ఉన్న ధనము, పిల్లలు, తమ శరీరము మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి మమకారాన్ని తొలగించాలి. ధనవంతులైతే ధనము కొరకు మరణిస్తారు. పిడికిట్లో ఉన్న ధనము వారిని వదలదు. రావణుని జైలులో పడి ఉంటారు. కోటిలో ఎవరో ఒక్కరే వెలువడి అన్ని వస్తువుల పై మమత్వాన్ని తొలగించుకొని వానరము నుండి దేవతలుగా అవుతారు. షాహుకారు మనుష్యులంతా గొప్ప గొప్ప లక్షాధికారులుగా ఉన్నారు, పిడికిట్లో ధనము పట్టుకొని ఉన్నారు, దానిలోనే వారి ప్రాణముంది. వారికి రోజంతా మహళ్లు, అంతస్థులు, పిల్లలు మొదలైనవారే గుర్తు వస్తుంటారు. వారి స్మృతిలోనే మరణిస్తారు. తండ్రి చెప్తున్నారు - చివరిలో మరి ఇతర ఏ వస్తువు గుర్తుకు రాకూడదు. కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చేస్చే జన్మ-జన్మల పాపము నాశనమైపోతుంది. షాహుకార్ల ధనమంతా మట్టిలో కలిసిపోతుంది. ఎందుకంటే పాప సంపాదన కదా. అది ఉపయోగపడదు. తండ్రి చెప్తున్నారు - నేను పేదల పెన్నిధిని. పేదవారిని ధనవంతులుగా, ధనవంతులను పేదవారిగా చేస్తాను. ఈ ప్రపంచము పరివర్తన అవుతుంది కదా. నా వద్ద ఇంత ధన సంపదలున్నాయి, ఏరోప్లేన్ ఉంది, వాహనాలున్నాయి, మహళ్లున్నాయి,........... అని ధనపు నషా ఎంత ఉంటుంది! అప్పుడు తండ్రి స్మృతిలో ఉండాలని ఎంత ప్రయత్నించినా, తల కొట్టుకున్నా స్మృతి నిలువదు. అందుకు చట్టము ఒప్పుకోదు, కోటిలో ఎవరో ఒక్కరే వెలువడ్తారు. ఇక ధనమునే గుర్తు చేసుకుంటూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు - దేహ సహితంగా ఏమేమి చూస్తున్నారో, వాటన్నిటిని మర్చిపోండి. ఇందులోనే చిక్కుకొని ఉంటే ఉన్నత పదవి పొందలేరు. బాబా పురుషార్థమైతే చేయిస్తారు కదా. మీరు నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు వచ్చారు. అందుకు పూర్తి యోగముండాలి. శివబాబా తప్ప ఇతర ఏ వస్తువు, ధనము, పిల్లలు మొదలైనవి ఏవీ స్మృతికి రానప్పుడే శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన స్కాలర్షిప్ తీసుకోగలరు. శ్రేష్ఠమైన బహుమతి పొందగలరు. వారు విశ్వ శాంతి కొరకు సలహానిస్తే వారికి నయా పైసాకు విలువైన పతకాలు(మెడల్స్) లభిస్తాయి. అందులోనే సంతోషిస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు ఏ బహుమతి లభిస్తుంది? మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. కేవలం 5-6 గంటలు స్మృతిలో ఉండినంత మాత్రాన ఈ లక్ష్మీనారాయణులుగా అవుతారని కాదు. చాలా శ్రమ పడాలి. ఒక్క శివబాబా స్మృతి మాత్రమే ఉండాలి అంతేకాక చివర్లో ఇతరమేదీ స్మృతి రాకూడదు. మీరు చాలా చాలా గొప్ప దేవతలుగా అవుతున్నారు.
మీరే పూజ్యులుగా ఉండి మళ్లీ మాయ పూజారి, పతితులుగా చేసేసిందని తండ్రి అర్థం చేయించారు. జనులు మిమ్ములను ఇలా అడుగుతారు - '' మీరు బ్రహ్మను దేవతగా భావిస్తారా లేక భగవంతునిగా భావిస్తారా? బ్రహ్మను భగవంతుడని మేము చెప్పము అని వారికి చెప్పండి. మీరు వచ్చి అర్థం చేసుకోండి. మీ వద్ద చాలా మంచి మంచి చిత్రాలున్నాయి. త్రిమూర్తి, సృష్టి చక్రము మరియు కల్పవృక్ష చిత్రాలు అన్నింటికంటే ఫస్ట్క్లాస్ చిత్రాలు. ప్రారంభంలో కూడా ఈ రెండు చిత్రాలే ముఖ్యమైనవి. ఇవే మీకు చాలా పనికి వస్తాయి. విదేశాలకు మీరు లక్ష్మీనారాయణుల చిత్రము తీసుకెళ్తే వాటి ద్వారా జ్ఞానమును ఎవ్వరూ తీసుకోలేరు. అన్నింటికంటే ముఖ్యమైన చిత్రాలు త్రిమూర్తి, సృష్టి చక్రము మరియు కల్పవృక్షము. ఇందులో ఎవరెవరు ఎప్పుడు వస్తారు? ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ఎప్పుడు సమాప్తమవుతుంది? మరియు ఏకధర్మ స్థాపన ఎవరు చేస్తారు? ఇవన్నీ చూపించారు. ఇతర ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. అందరికంటే పైన శివబాబా ఉన్నారు. తర్వాత బ్రహ్మ నుండి విష్ణు, విష్ణు నుండి బ్రహ్మగా అవుతారు. దీని వివరణ ఇవ్వబడుతుంది కదా. అందుకే చిత్రాలను తయారు చేశారు. పోతే సూక్ష్మవతనము కేవలం సాక్షాత్కారాల కొరకు ఉందని భావించాలి. తండ్రి మొదట సూక్ష్మవతనాన్ని తర్వాత స్థూలవతనాన్ని రచిస్తారు. బ్రహ్మ దేవత కాదు, కాని విష్ణువు దేవత. అర్థం చేయించేందుకు మీకు సాక్షాత్కారము చేయిస్తారు. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడ ఉన్నాడు కదా. బ్రహ్మ జతలో బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యేవారు ఉన్నారు. దేవతలైతే అలంకృతులుగా ఉంటారు. వీరిని ఫరిస్తాలని అంటారు. సూక్ష్మదేవతలై వచ్చి మళ్లీ దేవతా పదవిని పొందుతారు. గర్భ మహలులో జన్మ తీసుకుంటారు. ప్రపంచము మారుతూ ఉంటంది. పోను పోను మీరంతా చూస్తూ ఉంటారు. మంచి శక్తిశాలురుగా అవుతారు. ఇక కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది. మీరు నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు వచ్చారు. ఫెయిల్ అయితే ప్రజలుగా అవుతారు. సన్యాసులు మొదలైనవారు ఈ విషయాలను అర్థం చేయించలేరు. రాముని గౌరవాన్ని అయితే పూర్తిగా తీసేశారు. రామ రాజ, రామ ప్రజ,............. అని పాడ్తారు మరి అక్కడ ఇటువంటి అధర్మపు విషయము ఎలా ఉంటుంది! ఇవన్నీ భక్తి మార్గములోని విషయాలు. అందుకే అసత్య మాయ, అసత్య శరీరము,.................... అని గాయనముంది. మాయ అని పంచ వికారాలను అంటారు. ధనాన్ని మాయ అని అనరు. ధనాన్ని సంపద అని అంటారు. మాయ అని దేనిని అంటారో కూడా మనుష్యులకు తెలియదు. ఈ విషయాలు తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తారు.
తండ్రి చెప్తున్నారు - నేను పరమాత్మను, మిమ్ములను నా కంటే ఉన్నతంగా విశ్వానికి యజమానులుగా చేస్తాను. మీరు చదువుతున్నారు. ఇది ఎంత శ్రేష్ఠమైన చదువు! మనుష్యుల నుండి దేవతలుగా చేస్తున్న వారి కర్తవ్యము వర్ణనాతీతము. దేవతలు సత్యయుగములో ఉంటారు, మనుష్యులు కలియుగములో ఉంటారు. మీరిప్పుడు సంగమ యుగములో కూర్చుని మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. ఎంత సహజంగా తెలియజేస్తున్నారు. తప్పకుండా పవిత్రులుగా అవ్వాలి, అనేక ప్రజలను కూడా తయారుచేయాలి. కల్ప-కల్పము సత్యయుగములో ఉండాల్సిన ప్రజలను మీరు తయారుచేస్తారు. సత్యయుగము ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. మళ్లీ అవుతుంది. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి యజమానులుగా అవుతారు. చిత్రాలైతే ఉన్నాయి కదా. తండ్రి చెప్తున్నారు - ఈ జ్ఞానము మీకిప్పుడే ఇస్తున్నాను తర్వాత ప్రాయ: లోపమైపోతుంది. తర్వాత మళ్లీ ద్వాపరము నుండి భక్తి ప్రారంభమై రావణ రాజ్యము వస్తుంది. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో మీరు విదేశాలలో కూడా అర్థం చేయించవచ్చు. ఇతర ధర్మాల వారితో లక్ష్మీనారాయణ చిత్రానికి సంబంధము లేదు. అందుకే ఈ త్రిమూర్తి మరియు కల్పవృక్ష చిత్రాలు ముఖ్యమైనవని బాబా చెప్తున్నారు. ఇవి చాలా ఫస్ట్క్లాస్ చిత్రాలు. వృక్షము మరియు సృష్టి చక్రము చిత్రాల ద్వారా ఏ ఏ ధర్మము ఎప్పుడు వస్తుంది, ఏసుక్రీస్తు ఎప్పుడు వస్తారు అని అర్థము చేసుకుంటారు. అర్ధము(సగము) సూర్యవంశము - చంద్రవంశస్థులైన మీరుంటారు, మిగిలిన అర్ధములో(సగములో) ఆ ధర్మాలన్నీ వెలువడ్తాయి. ఇది 5 వేల సంవత్సరాల ఆట. జ్ఞానము, భక్తి, వైరాగ్యము. జ్ఞానము పగలు, భక్తి రాత్రి. తర్వాత మళ్లీ బేహద్ వైరాగ్యము కలుగుతుంది. ఈ పాత ప్రపంచము సమాప్తమవుతుందని మీకు తెలుసు. కనుక దీనిని మర్చిపోవాలి. పతితపావనులు ఎవరు? దీనిని కూడా ఋజువు చేయాలి. '' పతితపావన సీతారామా '' అని రాత్రింబవళ్లు పాడుతూ ఉంటారు. గాంధీ కూడా గీతను చదివేవారు, వారు కూడా హే పతితపావనా, సీతారామా! అని పాడేవారు. ఎందుకంటే సీతలైన మీరంతా వధువులు కదా. బాబా వరుడు. తర్వాత మళ్లీ రఘుపతి రాఘవ రాజా రామ్,......... అని పాడ్తారు. రాజా రాముడు అనగా త్రేతాయుగ రాముడు. విషయమంతా చాలా తికమక చేసేశారు. అందరూ చప్పట్లు తట్టుతూ పాడుతూ ఉంటారు, నేను(బ్రహ్మ) కూడా పాడుతూ ఉండేవాడిని. ఒక సంవత్సరము ఖాదీ వస్త్రాలు మొదలైనవి ధరించాను. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - ఇతను కూడా గాంధీ శిష్యునిగా అయ్యాడు, ఇతను కూడా అంతా అనుభవము చేశారు. ఫస్ట్లో ఉన్నవాడు చివరిలోకి వచ్చేశాడు. ఇప్పుడు మళ్లీ ప్రథమ స్థానాన్ని పొందుతాడు. ఎక్కడెక్కడ బ్రహ్మను కూర్చోబెట్టారో మీకు చెప్తారు. ఇది కూడా అర్థం చేయించాలి. అరే! వృక్షము పైన నిలిచి ఉన్నాడు, ఎంత స్పష్టంగా ఉంది - పతిత ప్రపంచము అంతిమములో నిలబడి ఉన్నాడు. శ్రీ కృష్ణుని కూడా పై భాగములో చూపించారు. రెండు పిల్లులు కొట్లాడుకుంటే వెన్న కృష్ణుడు తినేస్తాడు. మాతలకు సాక్షాత్కారము అవుతుంది. కృష్ణుని నోటిలో వెన్న ఉంది లేక చంద్రుడు ఉన్నాడని వారు అర్థము చేసుకుంటారు. వాస్తవానికి నోటిలో విశ్వ చక్రవర్తిత్వ పదవి ఉంది. రెండు పిల్లలు పరస్పరములో కొట్లాడుకుంటాయి, దేవతలైన మీకు వెన్న లభిస్తుంది. ఇది విశ్వ చక్రవర్తి పదవి అనే వెన్న. ఏ పదార్థాలను వేసి బాంబులను తయారు చేసి వేస్తే, మానవులు కేకలు పెట్టకుండా వెంటనే చనిపోతారో అలాంటి బాంబులను తయారుచేసేందుకు చాలా అభివృద్ధి చేస్తున్నారు. హిరోషిమాలో ఎప్పుడో వేసిన బాంబుకు ఇంతవరకు రోగులుగానే ఉన్నారు కదా. ఆ విధంగా ఇంకా ఇప్పుడు తయారుచేస్తున్నారు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా! అర్ధకల్పము వరకు మీరు సుఖంగా ఉంటారు. ఏ విధమైన యుద్ధాలు మొదలైనవేవీ ఉండవు. ఇవన్నీ తర్వాత ప్రారంభమయ్యాయి. ఇవేవీ ఇంతకుముందు లేవు, తర్వాత కూడా ఉండవు. చక్రము రిపీట్ అవుతుంది కదా. తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తున్నారు. దానిని పిల్లలు పూర్తిగా ధారణ చేసి ఈశ్వరీయ సేవలో లగ్నమవ్వాలి. ఇది ఛీ - ఛీ ప్రపంచము, దీనిని విషయ వైతరణీ నది అని అంటారు. అందువలన పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు - మిమ్ములను తండ్రి ఎంత శ్రేష్ఠంగా చూస్తున్నారో అంత శ్రేష్ఠంగా మీరు స్వయాన్ని భావించడం లేదు. పిల్లలైన మీకు చాలా నషా ఉండాలి. ఎందుకంటే మీరు చాలా ఉన్నతమైన కులానికి చెందినవారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తమ బుద్ధిని స్వచ్ఛంగా చేసుకునేందుకు ప్రతి రోజు జ్ఞానామృతాన్ని తీసుకునే పరిమాణమును (డోస్ను) పెంచుకోవాలి. స్మృతితో పాటు చదువు పై కూడా తప్పకుండా పూర్తి గమనమివ్వాలి. ఎందుకంటే చదువు ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది.
2. మనము అత్యంత ఉన్నతమైన కులానికి చెందినవారము. స్వయం భగవంతుడే మనలను చదివిస్తున్నాడనే నషాలో ఉండాలి. జ్ఞానాన్ని ధారణ చేసి ఈశ్వరీయ సేవలో తత్పరులై ఉండాలి.
వరదానము :-
'' సేవతో పాటు అనంతమైన వైరాగ్య వృత్తి కొరకు సాధనను ఎమర్జ్ చేసే సఫలతామూర్త్ భవ ''
సేవ ద్వారా సంతోషము, శక్తి లభిస్తాయి కానీ సేవలోనే వైరాగ్యవృత్తి కూడా సమాప్తమైపోతుంది అందువలన మీలో వైరాగ్య వృత్తిని మేల్కొల్పండి. ఎలాగైతే సేవ ప్లానును ప్రాక్టికల్గా ఎమర్జ్ చేసినప్పుడు సఫలత లభిస్తుందో అలా ఇప్పుడు బేహద్ వైరాగ్య వృత్తిని ఎమర్జ్ చేయండి. ఎన్ని సాధనాలు ప్రాప్తించినా బేహద్ వైరాగ్య వృత్తి కొరకు సాధన మర్జ్ అవ్వరాదు. సాధనాలు మరియు సాధనల బ్యాలన్స్ ఉండాలి. అప్పుడు సఫలతామూర్తులుగా అవుతారు.
స్లోగన్ :-
'' అసంభవాన్ని సంభవంగా చేసుకోవడమే పరమాత్మ ప్రేమకు గుర్తు. ''