10-04-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - ఈ అద్భుతమైన చదువును అనంతమైన తండ్రి చదివిస్తున్నారు. తండ్రిలో గాని, వారు చదివించే చదువులో గానీ ఎలాంటి సంశయము రాకూడదు. మొదట మనలను చదివించేవారు ఎవరు అను నిశ్చయము ఉండాలి ''

ప్రశ్న :-

నిరంతరము స్మృతియాత్రలో ఉండాలనే శ్రీమతము పిల్లలకు ఎందుకు లభించింది ?

జవాబు :-

మిమ్ములను దిగజార్చిన మాయా శత్రువు ఇంకా మిమ్ములను వెంబడిస్తూనే ఉంది. అది మిమ్ములను సతాయించకుండా వదలదు. కనుక ఏమరుపాటుగా, అజాగ్రత్తగా ఉండరాదు. భలే మీరు సంగమ యుగములో ఉన్నా, అర్ధకల్పము తన జతలో ఉండిన కారణంగా మాయ అంత త్వరగా వదలదు. స్మృతిని మర్చిపోతే మాయ వికర్మలు చేయిస్తుంది. అందుకే చాలా జాగరూకతతో ఉండాలి. ఆసురీ మతమును అనుసరించరాదు.

ఓంశాంతి.

ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు, తండ్రి కూడా ఉన్నారు. బాబా పిల్లలందరినీ, ''ఓ పుత్రులారా!'' అని అంటారు. పిల్లలందరూ తండ్రిని ''ఓ బాబా!'' అని అంటారు. పిల్లలు చాలామంది ఉన్నారు. ఈ జ్ఞానము ఆత్మలమైన మన కొరకే అని పిల్లలైన మీకు తెలుసు. ఒక్క తండ్రికి ఎంత అనేకమంది పిల్లలున్నారు. తండ్రి చదివించేందుకు వచ్చి ఉన్నారని పిల్లలకు తెలుసు. వారు మొట్టమొదట తండ్రి తర్వాత టీచరు తర్వాత గురువు కూడా అయ్యారు. ఇప్పుడు తండ్రి అంటే తండ్రే. పావనంగా చేసేందుకు స్మృతియాత్ర నేర్పిస్తారు. ఈ చదువు చాలా అద్భుతమైనదని కూడా పిల్లలకు తెలుసు. డ్రామా ఆదిమధ్యాంతాల రహస్యాన్ని తండ్రి తప్ప వేరెవ్వరూ తెలియజేయలేరు. అందుకే వారిని అనంతమైన తండ్రి అని అంటారు. ఈ నిశ్చయము పిల్లలకు తప్పకుండా కలుగుతుంది. ఇందులో సంశయము కలగదు. ఇంత అనంతమైన చదువు అనంతమైన తండ్రి తప్ప మరెవ్వరూ నేర్పించలేరు. బాబా రండి! మమ్ములను పావన ప్రపంచములోకి తీసుకెళ్లండి ఎందుకంటే ఇది పతిత ప్రపంచము అని కూడా పిలుస్తారు. తండ్రి పావన ప్రపంచానికి తీసుకెళ్తారు. ఆ ప్రపంచంలో తండ్రీ! రండి, పావన ప్రపంచానికి తీసుకెళ్లండి అని అడగరు. వారు ఆత్మలైన మన తండ్రి అని పిల్లలకు తెలుసు. కనుక దేహాభిమానము తొలగిపోతుంది. వారు మా తండ్రి అని ఆత్మ చెప్తుంది. తండ్రి తప్ప ఇంత గొప్ప జ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరని పిల్లలకు నిశ్చయముండాలి. మొదట ఈ విషయములో నిశ్చయబుద్ధి ఉండాలి. ఈ నిశ్చయము కూడా ఆత్మకు బుద్ధిలో కలుగుతుంది. ఆత్మకు వీరు మన తండ్రి అనే జ్ఞానము లభిస్తుంది. ఈ నిశ్చయము పిల్లలకు చాలా పక్కాగా ఉండాలి. నోటితో ఏమీ చెప్పవలసిన అవసరము లేదు. ఆత్మలమైన మనము ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటాము. ఆత్మలోనే అన్ని సంస్కారాలు ఉన్నాయి.

తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలకిప్పుడు తెలుసు. వారు ఎలా చదివిస్తారంటే, ఎలాంటి కర్మను నేర్పిస్తారంటే తిరిగి ఈ పాత ప్రపంచములో రాకుండా చేస్తారు. ఆ మనుష్యులైతే ఈ ప్రపంచంలోకి రావాలని భావిస్తారు. మీరు అలా భావించరు. మీరు ఈ అమరకథను విని అమరపురికి వెళ్తారు. అమరపురి అంటే అక్కడ సదా అమరులుగా ఉంటారు. సత్య-త్రేతా యుగాలను అమరపురి అని అంటారు. పిల్లలకు ఎంత సంతోషముండాలి. ఈ చదువును ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ చదివించలేరు. తండ్రి మనలను చదివిస్తున్నారు. మిగిలిన టీచర్లందరూ సాధారణ మనుష్యులు. పతితపావనులు, సుఖకర్త - దు:ఖహర్త అని మీరు ఎవరిని అంటారో ఆ తండ్రే మిమ్ములను ఇప్పుడు సన్ముఖములో చదివిస్తున్నారు. సన్ముఖములో రాకుండా రాజయోగ విద్యను ఎలా చదివిస్తారు? మధురమైన పిల్లలైన మిమ్ములను చదివించేందుకు నేను ఇక్కడకు వస్తానని తండ్రి చెప్తున్నారు. చదివించేందుకు ఇతనిలో ప్రవేశిస్తాను. భగవానువాచ అంటే తప్పకుండా వారికి శరీరమంతా కావాలి. కేవలము నోరు ఒక్కటే కాదు. పూర్తి శరీరము కావాలి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలారా! నేను కల్ప-కల్పము పురుషోత్తమ సంగమ యుగములో సాధారణ శరీరములో వస్తానని తండ్రి స్వయంగా చెప్తున్నారు. వీరు చాలా పేదవారు కాదు, గొప్ప ధనవంతుడూ కాదు, సాధారణంగా ఉన్నారు. మేము ఆత్మలము. వారు మన తండ్రి అని పిల్లలకు నిశ్చయముండాలి. వారు మన ఆత్మలకు తండ్రి. పూర్తి ప్రపంచములోని మనుష్యాత్మలకు తండ్రి. అందుకే వారిని బేహద్‌ తండ్రి అని అంటారు. శివజయంతిని ఆచరిస్తారు కానీ దాని గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. శివజయంతిని ఎప్పటి నుండి ఆచరిస్తున్నారు? ఎవ్వరినైనా అడగండి. వెంటనే పరంపర నుండి అని చెప్తారు. అది కూడా ఎప్పటి నుండి? ఏదైనా ఒక తేది అయితే ఉండాలి కదా. డ్రామా ఏమో అనాది. కానీ డ్రామాలో జరిగే ప్రతి కార్యానికి తిథి, తారీఖులైతే ఉండాలి కదా. ఇది ఎవ్వరికీ తెలియదు. మా శివబాబా వచ్చారనే ప్రీతితో శివజయంతిని ఆచరించరు. నెహ్రూ జయంతిని ఆ ప్రీతితో ఆచరిస్తారు. కన్నీరు కూడా వచ్చేస్తుంది. శివజయంతిని గురించి ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీరు ఇప్పుడు అనుభవీలుగా అయ్యారు. ఏమియూ తెలియని మనుష్యులు చాలా మంది ఉన్నారు. ఎన్నో మేళాలు చేస్తారు! ఆ మేళాలో వాస్తవానికి ఏమి జరుగుతుందో అచ్చటికి వెళ్లినవారికి తెలుస్తుంది. ఏ విధముగా బ్రహ్మాబాబా అమరనాథ ఉదాహరణ గురించి కూడా తెలిపించారు. అక్కడకు వెళ్లి చూస్తే నిజమేమిటో అర్థమయ్యింది. ఇతరులైతే, వేరే వారి ద్వారా విన్నదానిని చెప్తారు. మంచు లింగముంటుందని ఎవరైనా చెప్తే, దానిని సత్యమని అంటారు. కానీ ఇప్పుడు తప్పు ఏమిటో, ఒప్పు ఏమిటో అనేది పిల్లలైన మీకు అనుభవమయ్యింది. ఇప్పటివరకు మీరు విన్నదంతా, చదివినదంతా అసత్యము. అసత్య శరీరము, అసత్య మాయ,............ అని గాయనము కూడా ఉంది కదా. ఇది అసత్య ఖండము, అది సత్య ఖండము. సత్య, త్రేతా, ద్వాపర యుగాలు గడచిపోయాయి. ఇప్పుడు కలియుగము నడుస్తోంది. ఇది కూడా చాలా కొద్దిమందికే తెలుసు. మీ బుద్ధిలో ఎన్ని ఆలోచనలు ఉంటాయి. తండ్రి వద్ద పూర్తి జ్ఞానమంతా ఉంది. వారిని జ్ఞానసాగరులని అంటారు. వారిలో ఉన్న జ్ఞానాన్ని ఈ తనువు ద్వారా ఇచ్చి తమ సమానంగా తయారు చేస్తున్నారు. టీచరు కూడా విద్యార్థులను తన సమానంగా తయారు చేసినట్లు బేహద్‌ తండ్రి కూడా ప్రయత్నించి పిల్లలను తన సమానంగా తయారు చేస్తారు. లౌకిక తండ్రి తన సమానంగా తయారు చేయడు. ఇప్పుడు మీరు బేహద్‌ తండ్రి వద్దకు వచ్చారు. పిల్లలను తమ సమానంగా తయారు చేయాలని వారికి తెలుసు. ఉదాహరణానికి టీచరు తన సమానంగా తయారు చేస్తారు. కానీ విద్యార్థులు నెంబరువారుగా ఉంటారు. ఈ తండ్రి కూడా అలాగే చెప్తున్నారు - నెంబరువారుగా అవుతారు. నేను చదివించేది అవినాశి చదువు. ఎవరు ఎంత చదువుకుంటారో, అది(చదువు) వ్యర్థంగా పోదు. పోను పోను ఇలా చెప్పడం ప్రారంభిస్తారు - మేము 4 లేక 8 సంవత్సరాల క్రితము ఈ జ్ఞానము ఎవరి ద్వారానో విన్నామని, మళ్లీ ఇప్పుడు వచ్చామని చెప్తారు. కొందరు వెంటనే అతుక్కుపోతారు. దీపమైతే ఉంది కానీ కొన్ని దీపపు పురుగులు మాత్రము వెంటనే బలి అవుతాయి. కొన్ని దీపపు పురుగులు ప్రదక్షిణ చేసి వెళ్లిపోతాయి. ప్రారంభములో దీపానికి చాలా దీపపు పురుగులు ప్రేమలో పడిపోయాయి. డ్రామా ప్లాను అనుసారము భట్టీ తయారవ్వవలసి ఉండినది. కల్ప-కల్పము ఇలాగే జరుగుతూ వచ్చింది. ఏమేమి గడచిపోయిందో కల్పక్రితము కూడా అలాగే జరిగింది. చివరికి మళ్లీ అదే జరుగుతుంది. కానీ మేము ఆత్మలమని, పక్కా నిశ్చయముంచుకోండి. తండ్రి మనలను చదివిస్తున్నారు. ఈ నిశ్చయములో పక్కాగా ఉండండి, మర్చిపోకండి. తండ్రిని తండ్రిగా గుర్తించి తెలుసుకోని మనుష్యులుండరు. భలే దూరమైపోయినా మేము తండ్రికి విడాకులిచ్చామని అనుకుంటారు. వీరు అనంతమైన తండ్రి. వీరిని మనము ఎప్పుడూ వదలిపెట్టము. చివరివరకు జతలోనే ఉంటాము. ఈ తండ్రి సర్వులకు సద్గతినిచ్చేవారు. 5 వేల సంవత్సరాల తర్వాత వస్తారు. సత్యయుగములో చాలా కొద్దిమంది మనుష్యులు మాత్రమే ఉంటారని కూడా తెలుసు. మిగిలినవారంతా శాంతిధామములో ఉంటారు. ఈ జ్ఞానాన్ని కూడా తండ్రే వినిపిస్తారు. ఇతరులెవ్వరూ వినిపించలేరు. ఇది ఇతరులెవ్వరి బుద్ధిలోనూ కూర్చోదు. వారు ఆత్మలైన మీకు తండ్రి. వారు చైతన్య బీజరూపులు. ఏ జ్ఞానమునిస్తారు? సృష్టి రూపి వృక్షము యొక్క జ్ఞానమునిస్తారు. రచయిత తప్పకుండా రచన యొక్క జ్ఞానమునిస్తారు. సత్యయుగము ఎప్పుడుండేదో, తర్వాత ఎక్కడకు పోయిందో ఇంతకుముందు మీకేమైనా తెలుసా?

ఇప్పుడు మీరు ఎదురుగా కూర్చుని ఉన్నారు. బాబా మాట్లాడుతున్నారు - వీరు మా ఆత్మలందరి తండ్రి అని, మమ్ములను చదివిస్తున్నారని మీరు పక్కాగా నిశ్చయము చేసుకున్నారు. వీరు శారీరిక టీచరు కాదు. ఈ శరీరము(బ్రహ్మ)లో, చదివించే ఆ నిరాకార శివబాబా విరాజమానమై ఉన్నారు. వారు నిరాకారులైనా జ్ఞానసాగరులు. పరమాత్మకు ఏ ఆకారము లేదని మనుష్యులు అనేస్తారు. జ్ఞానసాగరులు, సుఖసాగరులు అని మహిమ కూడా చేస్తారు. కానీ అర్థము చేసుకోరు. డ్రామానుసారంగా చాలా దూరంగా వెళ్లిపోయారు. తండ్రి మనలను చాలా సమీపానికి తీసుకొస్తారు. ఇది 5 వేల సంవత్సరాల క్రిందటి విషయము. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత మనలను చదివించేందుకు వస్తారని మీకు తెలుసు. ఈ జ్ఞానము ఇతరులెవ్వరి ద్వారా లభించదు. ఈ జ్ఞానముండేదే నూతన ప్రపంచము కొరకు. తమోప్రధానులైన కారణంగా ఏ మనుష్యులు ఈ జ్ఞానమును ఇవ్వలేరు. వారు ఎవ్వరినీ సతోప్రధానంగా చేయలేరు. వారు తమోప్రధానంగా అవుతూనే ఉంటారు.

బాబా ఇతనిలో ప్రవేశించి మనకు తెలియజేస్తున్నారని మీకు తెలుసు. తండ్రి చెప్తున్నారు - పిల్లలారా! అజాగత్త్రగా ఉండకండి. మిమ్ములను దిగజార్చిన శతువ్రు ఇంకా మిమ్ములను వెంబడిస్తూనే ఉన్నాడు. వాడు మిమ్ములను వదలడు. భలే ఇప్పుడు మీరు సంగమ యుగములో ఉన్నారు. అయినా అర్ధకల్పము మీరు తన జతలో ఉన్న కారణంగా త్వరగా వదలడు. జాగత్త్రగా ఉండకపోతే, స్మృతి చేయకుండా ఉంటే ఇంకా వికర్మలు చేయిస్తాడు. తర్వాత ఏదో ఒక దెబ్బ తగులుతూ ఉంటుంది. ఇప్పుడు మనుష్యులు తమను తామే చెంప దెబ్బలు వేసుకోవడం మీరు చూస్తున్నారు. ఏమేమో అనేస్తారు. శివ-శంకరులు ఒక్కరేనని అనేస్తారు. వారి కర్తవ్యము ఏమిటి? వీరి కర్తవ్యమేమిటి? ఎంత వ్యత్యాసముంది! శివుడు సర్వ శ్రేష్ఠమైన భగవంతుడు. శంకరుడు దేవత. మరి వారిరువురు ఒక్కటే అని ఎలా అంటారు? ఇద్దరి పాత్రలే వేరు వేరుగా ఉన్నాయి. ఇక్కడ కూడా చాలామందికి - రాధా-కృష్ణ, లక్ష్మీ నారాయణ, శివ-శంకర,........... అనే పేర్లు ఉన్నాయి. రెండు పేర్లను తమ పై పెట్టుకునేశారు. ఇంతవరకు తండ్రి అర్థం చేయించినదంతా రిపీట్‌ అవుతుందని పిల్లలకు తెలుసు. ఇక కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. తండ్రి శాశ్వతంగా ఇక్కడే కూర్చోరు. పిల్లలు నెంబరువారుగా చదువుకొని పూర్తి కర్మాతీతులైపోతారు. డ్రామానుసారము మాల కూడా తయారైపోతుంది. ఏ మాల? ఆత్మలందరి మాల తయారవుతుంది. అప్పుడు మళ్లీ వాపస్‌ వెళ్తారు. మీ మాలయే నెంబర్‌వన్‌. శివబాబా మాల అయితే చాలా పొడవైనది. అక్కడి నుండి నెంబరువారుగా పాత్రను అభినయించేందుకు వస్తారు. మీరంతా ''బాబా బాబా'' అని అంటారు. అందరూ ఒకే మాలలోని పూసలు. అందరినీ విష్ణుమాలలోని పూసలని అనరు. ఇదంతా తండ్రి కూర్చుని చదివిస్తున్నారు. సూర్యవంశీయులుగా అవ్వనే అవ్వాలి. సూర్యవంశము, చంద్రవంశము ఏవైతే గడచిపోయాయో అవి మళ్లీ తయారవుతాయి. ఆ పదవి చదువు ద్వారానే లభిస్తుంది. తండి చెప్పే చదువు లేకుండా ఈ పదవి లభించదు. చిత్రాలేమో ఉన్నాయి కానీ ''మేము వీరి వలె అవ్వాలి'' అని ఎవ్వరూ అటువంటి కర్మ చేయరు. సత్యనారాయణ కథ కూడా వింటారు. గరుడ పురాణములో ఉన్న ఇటువంటి విషయాలను మనుష్యులకు వినిపిస్తారు. తండ్రి చెప్తున్నారు - ఇది విషయ వైతరణీ నది, రౌరవ నరకము. ఇలా ముఖ్యంగా భారతదేశానికి చెప్తారు. భారతదేశము పైననే బృహస్పతి దశ కూర్చుని ఉంది. వృక్షపతి కూడా భారతవాసులనే చదివిస్తారు. అనంతమైన తండ్రి కూర్చుని అనంతమైన విషయాలను వినిపిస్తారు. దశ కూర్చుంటుంది. రాహు దశ కూడా ఉంది. అందుకే దానమిస్తే గహ్రణము విడిచిపోతుందని అంటారు (దే దాన్‌ తో చూటే గ్రహణ్‌). ఈ కలియుగ అంతములో అందరి పై రాహుదశ ఉందని తండ్రి చెప్తున్నారు. భారతదేశము పై బృహస్పతి దశను కూర్చోబెట్టేందుకు నేను వచ్చాను. సత్యయుగములో భారతదేశము పై బృహస్పతి దశ ఉండేది. ఇప్పుడు రాహుదశ ఉంది. ఇది అనంతమైన విషయము. ఈ విషయాలు ఏ శాస్త్రాలు మొదలైన వాటిలో లేవు. ఎవరు మొదట ఏదో కొంత తెలుసుకుని ఉంటారో వారికే ఈ మ్యాగజైన్లలోని విషయాలు అర్థమవుతాయి. మ్యాగజైన్లు చదివి ఇంకా ఎక్కువగా అర్థం చేసుకునేందుకు పరుగులు తీస్తారు. మిగిలినవారు ఏమీ అర్థము చేసుకోరు. కొద్దిగా జ్ఞానము చదివి వదిలేసిన వారికి మళ్లీ కొద్దిగా జ్ఞానమనే నేతిని వేస్తే జాగృతులైపోతారు. జ్ఞానాన్ని నెయ్యి అని కూడా అంటారు. తండ్రి వచ్చి ఆరిపోతున్న దీపములో జ్ఞానమనే నెయ్యి వేస్తున్నారు. బాబా చెప్తున్నారు - పిల్లలారా! మాయా తుఫాన్లు వస్తాయి, దీపాన్ని ఆర్పివేస్తాయి. దీపము పై కొన్ని పురుగులు చనిపోతాయి. కొన్ని చుట్టి వెళ్లిపోతాయి. ఆ విషయాలే ఇప్పుడు వాస్తవిక రూపములో నడుస్తున్నాయి. నెంబరువారుగా అందరూ దీపపు పురుగుల వలె ఉన్నారు. మొట్టమొదట్లో ఒకేసారి ఇల్లు వదలి వచ్చి దీపపు పురుగులైపోయారు. ఒకేసారి లాటరీ దొరికినట్లు అయ్యింది. ఏమేమి జరిగిపోయిందో మళ్లీ మీరు అలాగే చేస్తారు. భలే వెళ్లిపోయినా స్వర్గములోకి రారని భావించకండి. దీపపు పురుగులై, ప్రేయసులైన తర్వాత మాయ ఓడించేసింది. కనుక పదవి కూడా తగ్గిపోతుంది. నెంబరువారుగా ఉండనే ఉంటారు. ఇతర సత్సంగాలలో ఎవ్వరి బుద్ధిలోనూ ఈ విషయాలు ఉండవు. తండ్రి ద్వారా నూతన ప్రపంచము కొరకు మనమంతా మన నెంబరువారు పురుషార్థమనుసారము చదువుతున్నామని మీ బుద్ధిలో ఉంది. మనము అనంతమైన తండ్రి సన్ముఖములో కూర్చుని ఉన్నాము. ఆ ఆత్మ కంటికి కనిపించదని కూడా మీకు తెలుసు. అది అవ్యక్త వస్తువు. దానిని దివ్యదృష్టి ద్వారానే చూడగలము. ఆత్మలైన మనము కూడా చిన్న బిందువులమే. కానీ దేహాభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించడము - ఇది శ్రేష్ఠమైన చదువు. ఆ చదువులో కూడా ఏ సబ్జెక్టులు కష్టంగా ఉంటాయో, అందులో ఫెయిల్‌ అయిపోతారు. ఈ సబ్జెక్టు చాలా సహజమైనది కానీ అనేమందికి కష్టమనిపిస్తుంది.

ఇప్పుడు శివబాబా సన్ముఖంలో కూర్చుని ఉన్నామని మీకు తెలుసు. మీరు కూడా నిరాకార ఆత్మలే కానీ శరీరముతో కలిసి ఉన్నారు. ఈ విషయాలన్నీ తండ్రే వినిపిస్తున్నారు, ఇతరులెవ్వరూ వినిపించలేరు. మరి ఏమి చేస్తారు? వారికి ధన్యవాదాలు తెలియచేస్తారు. బాబా చెప్తున్నారు - ఇది అనాదిగా తయారైన డ్రామా. నేను కొత్త విషయమేమీ చెప్పడం లేదు. డ్రామానుసారము మిమ్ములను చదివిస్తున్నాను. ధన్యవాదాలైతే భక్తిమార్గములో తెలియచేస్తారు. విద్యార్థులు బాగా చదివితే మా పేరు ప్రసిద్ధమౌతుందని టీచరు అంటారు. విద్యార్థులకు ధన్యవాదాలు తెలియచేస్తారు. ఎవరైతే బాగా చదువుతారో, చదివిస్తారో వారికి ధన్యవాదాలు తెలియజేయబడ్తాయి. విద్యార్థులు మళ్లీ టీచరుకు ధన్యవాదాలు తెలియచేస్తారు. తండ్రి చెప్తున్నారు - మధురమైన పిల్లలారా! సదా జీవించి ఉండండి. ఇలా ఇలా సర్వీసు చేస్తూ ఉండండి. కల్పక్రితము కూడా చేశారు. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. స్వయం జ్ఞానసాగరులు, నిరాకార తండ్రి టీచరై మనలను చదివిస్తున్నారు, శారీరిక తండ్రి కాదనే నషా మరియు నిశ్చయము సదా ఉండాలి. ఈ చదువు ద్వారానే మేము సతోప్రధానంగా అవ్వాలి.

2. ఆత్మ రూపీ దీపములో రోజూ జ్ఞానమనే నెయ్యిని వేయాలి. మాయావీ తుఫాన్లు కదిలించలేనంతగా జ్ఞానమనే నెయ్యితో దీపమును సదా ప్రజ్వలింపజేయాలి. పూర్తి దీపపు పురుగులుగా అయ్యి దీపము పై బలి అవ్వాలి.

వరదానము :-

''మనసు, బుద్ధిని సమస్యల నుండి, చిక్కుల నుండి (ఝమేలోం సే) దూరం చేసి మిలన మహోత్సవాన్ని జరుపుకునే ఝమేలా (సమస్యా) ముక్త్‌ భవ''

చాలామంది పిల్లలు ఈ ఝమేలా(సమస్య) పూర్తి అయితే మా స్థితి లేక సేవ బాగుంటుందని అనుకుంటారు. కానీ ఝమేలా ఒక పర్వతము వంటిది. కొండ పక్కకు తొలగిపోదు. కానీ ఎక్కడ ఝమేలా ఉంటుందో, అక్కడ నుండి మీ మనసు, బుద్ధిని దూరం చేయండి లేక ఎగిరేకళ ద్వారా సమస్యల పర్వతము కంటే ఎత్తుగా పైకి వెళ్లిపోండి. అప్పుడు పర్వతము కూడా మీకు సులభంగా అనుభవమవుతుంది. ఈ చిక్కుల ప్రపంచములో చిక్కులు రానే వస్తాయి. మీరు ముక్తులుగా ఉంటే మిలన మహోత్సవము జరుపుకోగలరు.

స్లోగన్‌ :-

''ఈ అనంతమైన నాటకంలో హీరో పాత్రను అభినయించువారే హీరో పాత్రధారులు''