17-02-2019 అవ్యక్త బాప్‌దాదా ఓంశాంతి రివైజ్‌: 22-04-1984 మధువనము


''విచిత్రుడైన తండ్రి ద్వారా విచిత్రమైన చదువు మరియు విచిత్రమైన ప్రాప్తి''

ఈ రోజు ఆత్మిక తండ్రి తమ ఆత్మిక పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఆత్మిక తండ్రి, ప్రతి ఒక్కరిలో ఎంతగా ఆత్మిక శక్తి నిండి ఉందో, ప్రతి ఆత్మ ఎంత సంతోష స్వరూపంగా అయ్యిందో ప్రతి ఒక్కరిని గమనిస్తున్నారు. ఆత్మిక తండ్రి పిల్లలందరికి అవినాశి సంతోష ఖజానాను జన్మ సిద్ధ అధికారంగా ఇచ్చారు. దానిని ప్రతి ఒక్కరు తమ వారసత్వముగా, అధికారముగా ఎంత వరకు జీవితములో పొందారు అని చూస్తున్నారు. ఖజానాలకు బాలకుల నుండి యజమానులుగా అయ్యారా? తండ్రి దాత. వారు పిల్లలందరికీ పూర్తి అధికారమును ఇస్తారు. కాని పిల్లలు ప్రతి ఒక్కరు తమ తమ ధారణా శక్తి అనుసారం అధికారులుగా అవుతారు. తండ్రికి ఆత్మ రూపీ పిల్లలందరూ ప్రతి ఒక్కరు సదా సర్వ ఖజనాలతో సంపన్నంగా అనేక జన్మల కొరకు సంపూర్ణ వారసత్వానికి అధికారులుగా అవ్వాలి అన్న శుభ సంకల్పమే పిల్లలందరి పట్ల ఉంది. ఇటువంటి ప్రాప్తిని పొందే ఉల్లాస-ఉత్సాహాలతో ఉండే పిల్లలను చూసి బాప్‌దాదా కూడా హర్షితమవుతారు. పిల్లలు ప్రతి ఒక్కరు చిన్నవారు, పెద్దవారు, పిల్లలు, యువకులు లేదా వృద్ధులు, మధురాతి మధురమైన మాతలు చదువుకున్నవారైనా లేక చదువుకోనివారైనా, శరీరము ద్వారా నిర్బలంగా ఉన్నా 'ఆత్మలు ఎంతటి శక్తివంతులు!' ఒక్క పరమాత్ముని లగ్నము ఎంతగా ఉంది! మేము పరమాత్మ అయిన తండ్రిని తెలుసుకున్నాము కనుక సర్వమూ తెలుసుకున్నామనే అనుభవముంది. బాప్‌దాదా కూడా ఇటువంటి అనుభవీ ఆత్మలకు, '' ఓ లగ్నములో మగ్నమై ఉన్న పిల్లలూ, సదా స్మృతిలో జీవిస్తూ ఉండండి, సదా సుఖ-శాంతుల ప్రాప్తిలో పాలింపబడ్తూ ఉండండి'' అనే వరదానమును ఇస్తారు. అవినాశి సంతోషాల ఊయలలో ఊగుతూ ఉండండి మరియు విశ్వములోని సర్వ ఆత్మల రూపీ మీ ఆత్మిక సోదరులకు సుఖ-శాంతుల సహజ సాధనాన్ని వినిపిస్తూ వారిని కూడా ఆత్మిక తండ్రి ఇచ్చే ఆత్మిక వారసత్వానికి అధికారులుగా తయారు చేయండి. ఆత్మలమైన మనమంతా ఒక తండ్రికి చెందినవారము, ఒకే పరివారానికి చెందినవారము, ఒకే సృష్టి రంగ స్థలము పై పాత్రను అభినయించేవారము, ఒకే ఇంటివారము అన్న ఒక పాఠమునే అందరిచేత చదివించండి. ఆత్మలైన మనందరి స్వధర్మము శాంతి మరియు పవిత్రత. కేవలం ఈ ఒక్క పాఠము ద్వారా స్వ పరివర్తనను మరియు విశ్వాన్ని పరివర్తన చేస్తున్నారు. విశ్వపరివర్తన నిశ్చితంగా జరుగుతుంది. ఇది సహజమైన విషయం కదా! కష్టమైనదేమీ కాదు కదా! చదువుకోనివారు కూడా ఈ పాఠము ద్వారా జ్ఞాన స్వరూపులుగా(నాలెడ్జ్‌ఫుల్‌గా) అయ్యారు. ఎందుకంటే రచయిత అయిన బీజమును తెలుసుకొని రచయిత ద్వారా రచనను స్వత:గానే తెలుసుకున్నారు. అందరూ జ్ఞాన స్వరూపులే కదా! మొత్తం రచయిత మరియు రచనల చదువును కేవలం మూడు పదాలలో చదువుకున్నారు. ఆత్మ పరమాత్మ మరియు సృష్టి చక్రము. ఈ మూడు పదాల ద్వారా ఎలా అయ్యారు? మీకు ఏ సర్టిఫికెట్‌ లభించింది? బి.ఏ, ఎం.ఏల సర్టిఫికెట్స్‌ లభించలేదు కాని త్రికాలదర్శి, జ్ఞాన స్వరూపులు అన్న టైటిళ్లు(బిరుదులు) లభించాయి కదా! అలాగే సంపాదనకు ఆధారమేది? ఏం లభించింది? సత్యమైన శిక్షకుని ద్వారా జన్మ-జన్మలకు అవినాశి సర్వ ప్రాప్తుల గ్యారెంటీ లభించింది. ఆ టీచర్లు, మీరు సదా సంపాదిస్తూ ఉంటారు లేక ధనవంతులుగా ఉంటారు అని గ్యారెంటీ ఇవ్వరు. వారు కేవలం చదివించి యోగ్యులుగా చేస్తారు. పిల్లలైన మీకు లేక ఈశ్వరీయ విద్యార్థులకు శిక్షకుడైన తండ్రి ద్వారా వర్తమానం ఆధారంతో 21 జన్మలకు సత్య-త్రేతా యుగాలలో సదా సుఖము, శాంతి, సంపద, ప్రేమ, సుఖదాయీ పరివారము లభించవలసిందే. లభిస్తుంది అని అనడం కాదు లభించి తీరాల్సిందే. ఈ గ్యారెంటీ ఉంది. ఎందుకంటే వీరు అవినాశి తండ్రి, అవినాశి శిక్షకులు. కావున అవినాశి ద్వారా ప్రాప్తి కూడా అవినాశిగా లభిస్తుంది. ''మాకు సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుని ద్వారా సర్వ ప్రాప్తుల అధికారము లభించింది'' అనే పాటను సంతోషంగా పాడ్తారు కదా! దీనినే విచిత్రుడైన తండ్రి, విచిత్రులైన విద్యార్థులు మరియు విచిత్రమైన చదువు, విచిత్రమైన ప్రాప్తి అని అంటారు. ఎవరు ఎంత చదివి ఉన్నా, ఈ విచిత్రుడైన తండ్రిని, శిక్షకుని చదువు లేక వారసత్వమును తెలుసుకోలేరు. ఆ చిత్రమును తీయలేరు. ఎలా తెలుస్తుంది? ఇంత ఉన్నతోన్నతుడైన గొప్ప తండ్రి, శిక్షకుడు అయితే ఎక్కడ చదివిస్తారు, ఎవరిని చదివిస్తారు! ఎంత సాధారణంగా ఉన్నారు! మానవుల నుండి దేవతలుగా తయారు చేసే, సదాకొరకు చరిత్రవంతులుగా తయారుచేసే చదువు, ఇక చదివేవారు ఎవరో చూడండి, ఎవరినైతే ఎవ్వరూ చదివించలేరో వారిని తండ్రి చదివిస్తారు. ఎవరినైతే ప్రపంచం చదివించగలదో వారినే తండ్రి కూడా చదివించినట్లైతే అదేమంత గొప్ప విషయం! నిరాశావాదులైన ఆత్మలను ఆశావాదులుగా చేస్తారు. అసంభవాన్ని సంభవం చేయిస్తారు. కావుననే మీ గతి-మతి మీకే తెలుసు అన్న గాయనం ఉంది. బాప్‌దాదా నిరాశావాదుల నుండి ఆశావాదులుగా తయారయ్యే పిల్లలను చూసి సంతోషిస్తారు. భలే వచ్చారు, తండ్రి ఇంటికి అలంకారమైన పిల్లలూ! తప్పకుండా రండి అని అంటారు. మంచిది.

సదా స్వయాన్ని శ్రేష్ఠ ప్రాప్తికి అధికారులుగా అనుభవం చేసుకునే శ్రేష్ఠ ఆత్మలకు, ఒక్క జన్మలో అనేక జన్మల ప్రాప్తిని ప్రాప్తి చేయించే జ్ఞాన స్వరూపులైన పిల్లలకు, సదా ఒక్క పాఠమును చదివి మరియు చదివించే శ్రేష్ఠులైన పిల్లలకు, సదా వరదాత అయిన తండ్రి వరదానాలతో పాలింపబడే భాగ్యవంతులైన పిల్లలకు బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

'' వర్తమాన బ్రాహ్మణ జన్మ వజ్రతుల్యమైనది '' (రివైజ్‌: 24-04-1984)

ఈ రోజు బాప్‌దాదా తమ సర్వ శ్రేష్ఠమైన పిల్లలను చూస్తున్నారు. విశ్వములోని తమోగుణీ అపవిత్ర ఆత్మలతో పోలిస్తే మీరు ఎంత శ్రేష్ఠమైన ఆత్మలు! ప్రపంచములోని ఆత్మలందరూ పిలిచేవారిగా, భ్రమించేవారిగా అప్రాప్తి ఆత్మలుగా ఉన్నారు. వినాశీ ప్రాప్తులు ఎన్ని ఉన్నా ఏదో ఒక అప్రాప్తి తప్పకుండా ఉంది. బ్రాహ్మణ పిల్లలైన మీకు, సర్వ ప్రాప్తుల దాతకు పిల్లలైన మీకు అప్రాప్తి వస్తువేదీ లేదు. మీరు సదా ప్రాప్తి స్వరూపులు. అల్పకాలిక సుఖ సాధనాలు, అల్పకాలిక వైభవాలు, అల్పకాలిక రాజ్య అధికారము లేకున్నా, చేతిలో చిల్లిగవ్వ లేకున్నా మహారాజులుగా ఉన్నారు. నిశ్చింత చక్రవర్తులు, మాయాజీత్‌లు, ప్రకృతిజీత్‌ స్వరాజ్య అధికారులు. ఈశ్వరీయ పాలనలో సదా పాలింపబడేవారు, సంతోషపు ఊయలలో, అతీంద్రియ సుఖమనే ఊయలలో ఊగేవారు. వినాశీ సంపదకు బదులు అవినాశి సంపద గలవారు. ఉన్నారు. రత్నజఢితమైన కిరీటము లేదు కాని తండ్రి అయిన పరమాత్ముని శిరోకిరీటంగా ఉన్నారు. రత్న జఢితమైన అలంకరణ లేదు కాని జ్ఞాన రత్నాలు, గుణాల రూపీ రత్నాలతో సదా అలంకరింపబడి ఉన్నారు. ఎంత పెద్ద వినాశీ సర్వ శ్రేష్ఠమైన వజ్రమైనా, ఎంతో విలువైన వజ్రమైనా ఒక్క జ్ఞాన రత్నము, గుణ రూపీ రత్నము ముందు దాని విలువ ఏ పాటిది? ఈ రత్నాల ముందు అవి రాళ్ల వంటివే ఎందుకంటే అవి నశ్వరమైనవి. తొమ్మిది లక్షల హారము ముందు కూడా మీరు స్వయం తండ్రి కంఠహారంగా అయ్యారు. ప్రభువు కంఠహారము ముందు తొమ్మిది లక్షలు అనండి లేక తొమ్మిది పదమాలు అనండి లేక లేక్కలేనన్ని పదమాల(కోటానుకోట్ల) విలువైన హారమనండి, అవన్నీ ఎందుకూ కొరగానివే. 36 రకాల భోజనము కూడా ఈ బ్రహ్మాభోజనము ముందు విలువలేనిదే, ఎందుకంటే నేరుగా బాప్‌దాదాకు నివేదించి ఈ భోజనాన్ని ప్రసాదంగా చేస్తారు. ప్రసాదము విలువ ఈ రోజు అంతిమ జన్మలో కూడా భక్త ఆత్మలకు ఎంతగా ఉంటుంది! మీరు సాధారణ భోజనము తినడం లేదు, ప్రభు ప్రసాదాన్ని తింటున్నారు. ఒక్కొక్క మెతుకు పదమాల కంటే శ్రేష్ఠమైనది. మీరు ఇటువంటి సర్వ శ్రేష్ఠ ఆత్మలు. మీకు ఇటువంటి శ్రేష్ఠమైన ఆత్మిక నషా ఉందా? నడుస్తూ నడుస్తూ మీ శ్రేష్ఠతను మర్చిపోవడం లేదు కదా! స్వయాన్ని సాధారణ ఆత్మలుగా భావించడం లేదు కదా! కేవలం వినేవారిగా లేక వినిపించేవారిగా మాత్రమే లేరు కదా! స్వమానంలో ఉండువారిగా అయ్యారా? వినేవారు, వినిపించేవారు అనేకానేకమంది ఉన్నారు. స్వమానంలో ఉండేవారు కోట్లాది మందిలో ఏ ఒక్కరో ఉన్నారు. మీరు ఎవరు? అనేకమందిలో ఉన్నారా లేక కోట్లాది మందిలో ఒక్కరిగా ఉన్నారా? ప్రాప్తులు లభించే సమయంలో నిర్ల్ష్యంగా అయ్యే వారిని బాప్‌దాదా ఎటువంటి తెలివిగల పిల్లలని అనాలి? లభించిన భాగ్యాన్ని, పొందిన భాగ్యాన్ని అనుభవం చేయకపోతే అనగా ఇప్పుడు మహాన్‌ భాగ్యశాలురుగా అవ్వకుంటే ఇంకెప్పుడు అవుతారు? ఈ శ్రేష్ఠ ప్రాప్తులను పొందే సంగమ యుగములో ప్రతి అడుగులో 'ఇప్పుడు లేకపోతే మరెప్పుడూ లేదు' అన్న నినాదాన్ని గుర్తుంచుకోండి. అర్థమయ్యిందా! మంచిది.

ఇప్పుడు గుజరాత్‌ జోనువారు వచ్చారు. గుజరాత్‌ విశేషత ఏమిటి? గుజరాత్‌ వారి విశేషత ఏమంటే, వారిలో చిన్న-పెద్ద అందరూ తప్పకుండా సంతోషంగా నాట్యము చేస్తారు. తమ చిన్నతనమును, స్థూల కాయమును అన్నీ మర్చిపోతారు. రాస్‌ చేసే లగ్నములో మగ్నమైపోతారు. మొత్తం రాత్రి అంతా మగ్నమై ఉంటారు. కావున ఎలాగైతే రాస్‌ చేసే లగ్నములో మగ్నమై ఉంటారో, అలా సదా జ్ఞానము వలన లభించే సంతోషము అనే రాస్‌లో కూడా మగ్నమై ఉన్నారు కదా! ఈ అవినాశి లగ్నములో మగ్నమై ఉండేందుకు కూడా నంబర్‌వన్‌ అభ్యాసులుగా ఉన్నారు కదా! సేవ విస్తారము కూడా బాగుంది. ఈసారి ముఖ్య స్థానమైన మధువనానికి సమీప సాథీలుగా ఉన్న రెండు జోన్లవారు వచ్చారు. ఒకవైపు రాజస్థాన్‌ ఉంది, ఇంకొకవైపు గుజరాత్‌ ఉంది. ఇరువురూ సమీపంగా ఉన్నారు కదా! మొత్తం కార్యమంతా రాజస్థాన్‌ మరియు గుజరాత్‌ల సంబంధముతో ఉంది. కావున డ్రామానుసారం సహయోగులుగా అయ్యే గోల్డెన్‌ ఛాన్స్‌ ఈ రెండు స్థానాల వారికి లభించింది. ఇరువురూ ప్రతి కార్యంలో సమీపంగా మరియు సహయోగులుగా ఉన్నారు. సంగమయుగ స్వరాజ్య సింహాసనము రాజస్థాన్‌లో ఉంది కదా! ఎంతమంది రాజులను తయారు చేశారు! రాజస్థాన్‌లోని రాజులు మహిమ చేయబడ్డారు. కావున రాజులు తయారయ్యారా లేక తయారవుతున్నారా? రాజస్థాన్‌లో రాజుల ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి. కావున రాజస్థాన్‌ వారు ఇటువంటి పూర్తి సవారీని తయారుచేసి తీసుకురావాలి. అప్పుడు అందరూ పూల వర్షాన్ని కురిపిస్తారు కదా! ఎంతో వైభవంగా ఆడంబరంగా ఊరేగింపు చేస్తారు (ప్రారంభిస్తారు). కావున మరి ఎంతమంది రాజుల ఊరేగింపు వస్తుంది? కనీసం ఎక్కడైతే సేవాకేంద్రాలు ఉన్నాయో అక్కడి నుండి ఒక్కొక్క రాజు వచ్చినా ఎంతమంది రాజులవుతారు. 25 స్థానాల నుండి 25 మంది రాజులు వచ్చినట్లయితే ఆ ఊరేగింపు చాలా సుందరంగా అయిపోతుంది కదా! డ్రామానుసారంగా రాజస్థాన్‌లోనే సేవ సింహాసనము(గద్దీ) అనగా ముఖ్యకేంద్రము తయారయ్యింది కావున రాజస్థాన్‌కు కూడా విశేషమైన పాత్ర ఉంది. రాజస్థాన్‌ నుండే విశేషమైన సేవ అశ్వాలు వెలువడ్డాయి కదా! డ్రామాలో పాత్ర ఉంది. కేవలం దీనిని రిపీట్‌ చేయాలి.

కర్ణాటకలో కూడా సేవ విస్తారం చాలా పెరిగిపోయింది. ఇప్పుడు కర్ణాటక వారు విస్తారము నుండి అతీతంగా అవ్వాలి. వెన్నను తయారు చేసేటప్పుడు కూడా మొదట విస్తారము ఉంటుంది. ఆ తర్వాత దాని నుండి వెన్న అయిన సారము వెలువడ్తుంది. ఇప్పుడు కర్ణాటక వారు విస్తారము నుండి వెన్నను వెలికి తీయాలి. సారస్వరూంగా అవ్వాలి, ఇతరులను తయారు చేయాలి. మంచిది.

తమ శ్రేష్ఠ స్వమానములో స్థితులై ఉండేవారికి, సర్వ ప్రాప్తుల భండారానికి, సదా సంగమయుగ శ్రేష్ఠ స్వరాజ్యము మరియు మహోన్నత భాగ్యానికి అధికారి ఆత్మలకు, సదా ఆత్మిక నషా మరియు సంతోష స్వరూప ఆత్మలకు బాప్‌దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో :- అందరూ స్వయాన్ని స్వరాజ్య అధికారి శ్రేష్ఠ ఆత్మలుగా భావిస్తున్నారా? స్వరాజ్య అధికారము లభించిందా? ఇటువంటి అధికారి ఆత్మలు శక్తిశాలురుగా ఉంటారు కదా! రాజ్యమును సత్తా అని అంటారు. సత్తా అనగా శక్తి. ఈ రోజుల్లోని గవర్నమెంట్‌ వారిని కూడా రాజ్య సత్తా గల పార్టీ అని అంటారు కదా! కనుక రాజ్య సత్తా అనగా రాజ్యపాలన చేసే శక్తి. కావున స్వరాజ్యము ఎంత పెద్ద శక్తి! ఇటువంటి శక్తి లభించిందా? అన్ని కర్మేంద్రియాలు మీ శక్తి అనుసారముగా కార్యము చేస్తున్నాయా? రాజు సదా తన రాజ్య సభను, రాజ్యదర్బారును పిలిచి రాజ్యము ఎలా నడుస్తోంది అని అడుగుతూ ఉంటారు. కావున స్వరాజ్య అధికారి రాజులైన మీ కార్య వ్యవహారము సరిగ్గా కొనసాగుతోందా? లేక ఎప్పుడైనా పైకి కిందకి అవుతోందా? ఎప్పుడూ ఏ రాజ్య కర్మచారీ మోసగించడం లేదు కదా! ఒకసారి కళ్లు మోసగించడం, ఇంకోసారి చెవులు మోసగించడం, మరోసారి చేతులు, కాళ్లు మోసగించడం ఇలా మోసపోవడం లేదు కదా! ఒకవేళ రాజ్య సత్తా సరిగ్గా ఉంటే ప్రతి సంకల్పము, ప్రతి క్షణములో కోటాను రెట్లు సంపాదన జరుగుతుంది. రాజ్య సత్తా సరిగ్గా లేకపోతే ప్రతి క్షణములో కోటాను రెట్లు పోగొట్టుకుంటారు. ప్రాప్తి కూడా ఒకటికి కోటాను రెట్లు. అలాగే పోగొట్టుకున్నా ఒకటికి కోటాను రెట్లు పోగొట్టుకుంటారు. ఎంతగా లభిస్తుందో అంతగా పోతుంది కూడా. లెక్క ఉంది. కావున రోజంతటి కార్య వ్యవహారమును చూడండి. కళ్ల రూపి మంత్రి సరిగ్గా కార్యము చేశాడా? చెవుల రూపి మంత్రి సరిగ్గా పని చేశాడా? అందరి డిపార్టుమెంటు సరిగ్గా పని చేశాయా? అని పరిశీలించుకుంటున్నారా లేక అలసిపోయి నిద్రపోతున్నారా? నిజానికి కర్మ చేసే ముందే చెక్‌ చేసిన తర్వాత కర్మ చేయాలి. మొదట ఆలోచించాలి, తర్వాత చేయాలి. మొదట చేసేసి ఆ తర్వాత ఆలోచించడం కాదు. పూర్తి రిజల్టును చూడడం వేరే విషయం. కాని జ్ఞానీ ఆత్మలు మొదట ఆలోచిస్తారు, ఆ తర్వాత చేస్తారు. కావున ఆలోచించి అర్థం చేసుకొని ప్రతి కర్మను చేస్తున్నారా? ముందు ఆలోచించేవారా లేక తర్వాత ఆలోచించేవారా? తర్వాత ఆలోచించినట్లయితే వారిని జ్ఞానులు అని అనరు. కావున మీరు సదా స్వరాజ్య అధికారి ఆత్మలు మరియు ఇదే స్వరాజ్య అధికారము ద్వారా విశ్వరాజ్య అధికారులుగా అవ్వనే అవుతారు. అవుతామా లేదా అన్న ప్రశ్నే లేదు. స్వరాజ్యము ఉన్నట్లయితే విశ్వరాజ్యము ఉండనే ఉంటుంది. కావున స్వరాజ్యములో గడబిడ ఏమీ లేదు కదా? ద్వాపర యుగము నుండి గడబిడ శాలలలో తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు వాటి నుండి బయటకు వచ్చారు. ఇప్పుడిక మళ్ళీ ఎప్పుడూ ఏ విధమైన గడబిడశాలలో కాలు మోపకండి. అవి ఎటువంటి గందరగోళ శాలలంటే ఒకసారి కాలు పెట్టారంటే అది ''బయటికి వచ్చేదారి తెలియని ఆట''గా అయిపోతుంది. ఆ తర్వాత ఇక బయట పడడం చాలా కష్టమైపోతుంది. కావున సదా ఒకే దారిలో ఉండండి. ఒకే దారిలో గందరగోళం ఉండదు. ఒకే మార్గం పై నడిచేవారు సదా సంతోషంగా సదా సంతుష్టంగా(తృప్తిగా) ఉంటారు.

బెంగుళూరు హైకోర్టు నుండి వచ్చిన జస్టిస్‌తో(జడ్జితో) అవ్యక్త బాప్‌దాదా మిలనము :- ఏ స్థానములో ఉన్నారు మరియు ఏమి అనుభవం చేస్తున్నారు? అనుభవము అన్నిటికంటే పెద్ద అథారిటి. అన్నింటి కంటే మొదటి అనుభవము ఆత్మాభిమానిగా అయ్యే అనుభవము. ఎప్పుడైతే ఆత్మాభిమానిగా అయ్యే అనుభవం అవుతుందో అప్పుడు పరమాత్మ ప్రేమ, పరమాత్మ ప్రాప్తుల అనుభవం కూడా స్వత:గానే అవుతుంది. ఎంత అనుభవమవుతుందో అంత శక్తిశాలిగా అవుతారు. జన్మ-జన్మాంతరాల దు:ఖాల నుండి విడిపించే జడ్జిమెంటును(తీర్పును) ఇచ్చేవారు కదా! లేక ఒక్క జన్మలోని దు:ఖాల నుండి విడిపించే జడ్జిగా ఉన్నారా? అది కేవలం హై కోర్టు లేక సుప్రీం కోర్టు జడ్జిగా అవ్వడం. ఇక్కడ స్పిరిచువల్‌ జడ్జిగా అవ్వడం. ఈ జడ్జిగా అవ్వడంలో చదువు లేక సమయం ఆవశ్యకత(అవసరం) లేదు. కేవలం ఆత్మ మరియు పరమాత్మ అనే రెండు పదాలనే చదవాలి, అంతే. వీటి అనుభవజ్ఞులుగా అయిపోయినట్లయితే స్పిరిచువల్‌(ఆధ్యాత్మిక) జడ్జిగా అయిపోతారు. ఎలాగైతే తండ్రి జన్మ-జన్మాంతరాల దు:ఖాల నుండి విడిపించేవారో, అందుకే వారిని సుఖదాత అని అంటారో అలా తండ్రి ఎలా ఉన్నారో పిల్లలు అలా ఉండాలి. డబల్‌ జడ్జిగా అవ్వడం ద్వారా అనేక ఆత్మల కళ్యాణానికి నిమిత్తులుగా అయిపోతారు. ఒక్క కేస్‌ కోసం వస్తారు, జన్మ-జన్మాంతరాల కేస్‌లను గెలిచి వెళ్తారు. చాలా సంతోషిస్తారు. కావున స్పిరిచువల్‌ జడ్జిగా అవ్వండని తండ్రి ఆజ్ఞ(ఆజ్ఞాపిస్తున్నారు). మంచిది. ఓంశాంతి.

వరదానము :-

''సర్వశక్తివంతుడైన తండ్రిని కంబైండ్‌ రూపములో తోడుగా ఉంచుకునే సఫలతా మూర్త్‌ భవ''

సర్వశక్తివంతుడైన తండ్రి ఏ పిల్లలకు తోడుగా కంబైండుగా ఉంటారో వారికి సర్వ శక్తుల పై అధికారముంటుంది. ఎక్కడైతే సర్వ శక్తులు ఉంటాయో, అక్కడ సఫలత ఉండకపోవడం అసంభవము. ఒకవేళ తండ్రితో సదా కంబైండ్‌గా ఉండడంలో లోటు ఉన్నట్లయితే సఫలత కూడా తక్కువగానే ఉంటుంది. సదా తోడును నిభాయించే అవినాశి సహచరుడిని(సాథీని) కంబైండ్‌గా ఉంచుకున్నట్లయితే సపలత జన్మ సిద్ధ అధికారంగా ఉంటుంది. ఎందుకంటే సఫలత మాస్టర్‌ సర్వ శక్తివంతుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది.

స్లోగన్‌ :-

''ఏ వికారాల రూపి మురికిని తగలను కూడా తగలని వారే సత్యమైన వైష్ణవులు.''