08-06-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - స్మృతి మరియు చదువుల ద్వారానే డబల్ కిరీటము లభిస్తుంది. అందువలన మీ లక్ష్యమును ముందుంచుకొని దైవీ గుణాలను ధారణ చేయండి.''
ప్రశ్న :-
విశ్వ రచయిత అయిన తండ్రి పిల్లలైన మీకు ఏ సేవ చేస్తారు ?
జవాబు :-
1. పిల్లలకు అనంతమైన వారసత్వమునిచ్చి సుఖీలుగా చేయడమే తండ్రి చేయు సేవ. తండ్రి వలె నిష్కామ సేవను ఇతరులెవ్వరూ చేయలేరు. 2. అనంతమైన తండ్రి ఆసనాన్ని అద్దెకు తీసుకొని మిమ్ములను విశ్వ సింహాసనాధికారులుగా చేస్తారు. తండ్రి స్వయం ఆ మయూర సింహాసనము పై కూర్చోరు కానీ పిల్లలను కూర్చోపెడ్తారు. తండ్రికైతే జడ మందిరాలు నిర్మిస్తారు. అందులో ఆయనకేం మజా(రుచి) ఉంటుంది. మజా అంతా స్వర్గ రాజ్యభాగ్యమును అనుభవించే పిల్లలదే.
ఓంశాంతి.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి చెప్తున్నారు - ''స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి.'' ఓంశాంతి అంటే ఏమో పిల్లలకు అర్థం చేయించారు. ఓంశాంతి అని తండ్రి కూడా అంటారు, పిల్లలు కూడా అంటారు. ఎందుకంటే ఆత్మ స్వధర్మము శాంతి. మనము శాంతిధామము నుండి ఇక్కడకు వస్తామని ఇప్పుడు తెలుసుకున్నారు. మొట్టమొదట సుఖధామములోకి వస్తాము తర్వాత 84 పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ దుఃఖధామములోనికి వస్తాము. ఇది గుర్తుంది కదా. పిల్లలు 84 జన్మలు తీసుకుంటారు, జీవాత్మలుగా అవుతారు. తండ్రి జీవాత్మగా అవ్వరు. నేను తాత్కాలికంగా ఇతని శరీరాన్ని ఆధారంగా తీసుకుంటాను, శరీరము లేకుంటే ఎలా చదివిస్తాను? అని అంటారు. పదే పదే పిల్లలకు 'మన్మనాభవ' అని, మీ రాజ్యమును స్మృతి చేయండి అని ఎలా చెప్తాను? దీనిని ఒక్క సెకండులో విశ్వరాజ్యము పొందడమని అంటారు. వారు అనంతమైన తండ్రి కదా అందుకే అనంతమైన సంతోషాన్ని, అనంతమైన వారసత్వాన్ని తప్పకుండా ఇస్తారు. తండ్రి చాలా సులభమైన మార్గము తెలియజేస్తారు. ఇప్పుడు ఈ దుఃఖధామమును బుద్ధి నుండి తొలగించి వేయమని చెప్తున్నారు. వారు నూతన ప్రపంచమైన స్వర్గమును స్థాపన చేస్తున్నారు. దానికి అధికారులుగా అయ్యేందుకు నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు నశిస్తాయి. మీరు మళ్లీ సతోప్రధానంగా అవుతారు. దీనిని సహజ స్మృతి అని అంటారు. పిల్లలు వారి లౌకిక తండ్రిని ఎంత సులభంగా గుర్తు చేసుకుంటారో, అలా పిల్లలైన మీరు అనంతమైన తండ్రిని సులభంగా స్మృతి చేయాలి. ఈ తండ్రి మాత్రమే దుఃఖము నుండి వెలికి తీసి సుఖధామానికి తీసుకెళ్తారు. అక్కడ దుఃఖానికి నామ-రూపాలే ఉండవు. తండ్రి చాలా సులభమైన విషయము చెప్తున్నారు - '' మీ శాంతిధామమును స్మృతి చేయండి.'' ఎందుకంటే తండ్రి ఇల్లే మీ ఇల్లు. అలాగే నూతన ప్రపంచాన్ని స్మృతి చేయండి, ఎందుకంటే అది మీ రాజధాని. తండ్రి తన పిల్లలైన మీకు ఎంతో నిష్కామ సేవ చేస్తారు, పిల్లలైన మిమ్ములను సుఖీలుగా చేసి వారు వానప్రస్థములోకి అనగా పరంధామములో కూర్చుండిపోతారు. మీరు కూడా పరంధామ నివాసులే. దానిని నిర్వాణధామము, వానప్రస్థమని కూడా అంటారు. పిల్లలకు సేవ చేసేందుకు అనగా వారసత్వము ఇచ్చేందుకు తండ్రి వస్తారు. స్వయం ఇతను(బ్రహ్మ) కూడా తండ్రి నుండి వారసత్వము తీసుకుంటారు. శివబాబా అత్యంత ఉన్నతమైన భగవంతుడు. శివుని మందిరాలు కూడా ఉన్నాయి. వారికి తండ్రి గానీ, టీచరు గానీ ఎవ్వరూ లేరు. మొత్తం సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము వారి వద్ద ఉంది. అయితే వారికి ఈ జ్ఞానము ఎక్కడి నుండి వచ్చింది? వారు ఏవైనా వేదశాస్త్రాలు మొదలైనవి చదివారా? లేదు. తండ్రి జ్ఞానసాగరులు, సుఖ-శాంతి సాగరులు. తండ్రి మహిమకు, దైవీ గుణాలు గల మానవుల మహిమకు తేడా ఉంది. మీరు దైవీ గుణాలు ధారణ చేసి ఈ దేవతలుగా అవుతారు. మొదట మీలో అసురీ గుణాలు ఉండేవి. అసురుల నుండి దేవతలుగా చేయడం ఒక్క తండ్రి కర్తవ్యము మాత్రమే. మీ లక్ష్యము కూడా మీ ఎదుటనే ఉంది. వారు అలా తయారుయ్యే శ్రేష్ఠ కర్మలు తప్పకుండా చేసి ఉంటారు. కర్మ, అకర్మ, వికర్మల గతిని అంతేకాక ఏ విషయమునైనా ఒక్క సెకండులో అర్థం చేయిస్తారు.
తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ! పాత్ర తప్పకుండా అభినయించే తీరాలి. ఈ పాత్ర మీకు అనాది నుండి అవినాశిగా లభించింది. మీరు ఎన్నో పర్యాయాలు సుఖ-దుఃఖాల ఆటలోకి వచ్చారు. ఎన్నోసార్లు మీరు విశ్వానికి అధికారులుగా అయ్యారు. తండ్రి ఎంతో ఉన్నతంగా, శ్రేష్ఠంగా చేస్తారు! పరమాత్మను సుప్రీమ్ సోల్ అని అంటారు. వారు కూడా మీ వలె ఇంత చిన్నగా (చేతితో చూపించి) ఉంటారు. ఆ తండ్రి జ్ఞానసాగరులు. అందువలన ఆత్మలను కూడా తన సమానంగా చేస్తారు. మీరు ప్రేమ సాగరులుగా, సుఖసాగరులుగా అవుతారు. దేవతల మధ్య పరస్పరము అత్యంత ప్రేమ ఉంటుంది. ఎప్పుడూ జగడాలు జరగవు. ఇప్పుడు తండ్రి వచ్చి మిమ్ములను తన సమానంగా చేస్తారు. ఇతరులెవ్వరూ ఇలా తయారు చేయలేరు. నాటకమంతా స్థూల వతనములోనే జరుగుతుంది. మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మము తర్వాత ఇస్లామ్, బౌద్ధ ధర్మము మొదలైన ధర్మముల వారు నంబరువారుగా ఈ నాటక రంగము పైకి లేక నాటకశాలలోకి వస్తారు. మీరు 84 జన్మలు పూర్తిగా తీసుకుంటారు. ఆత్మలు, పరమాత్మ చాలా కాలము వేరుగా ఉండినారు,............... అనే గాయనము కూడా ఉంది. తండ్రి అంటున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, మొట్టమొదట ఈ విశ్వములో పాత్ర చేసేందుకు మీరే వచ్చారు. నేనైతే కొంత సమయానికి మాత్రమే ఇతనిలో ప్రవేశిస్తాను. ఇది పాత పాదరక్ష(శరీరము). ఒక స్త్రీ మరణిస్తే పాత చెప్పు పోయింది, ఇప్పుడు మళ్లీ కొత్తది తీసుకుంటామని పురుషుడు అంటాడు. ఇది కూడా పాత శరీరము కదా. 84 జన్మల చక్రము తిరిగి వచ్చారు. తతత్వమ్, నేను వచ్చి ఇదే రథమును ఆధారంగా తీసుకుంటాను. పావన ప్రపంచములోకి నేను ఎప్పుడూ రానే రాను. మీరు పతితులుగా అయినందున, వచ్చి పావనముగా చేయండి అని మీరు నన్ను పిలుస్తారు. చివరికి మీ స్మృతి ఫలీభూతమవుతుంది కదా. పాత ప్రపంచము సమాప్తమయ్యే సమయములో నేను వస్తాను. బ్రహ్మ ద్వారా స్థాపన. బ్రహ్మ ద్వారా అనగా బ్రాహ్మణుల ద్వారా అని అర్థము. మొదట శ్రేష్ఠమైన(పిలక) బ్రాహ్మణులు, తర్వాత క్షత్రియులు,......ఈ విధంగా పల్టీల ఆట ఆడ్తారు. ఇప్పుడు దేహాభిమానాన్ని వదిలి దేహీ-అభిమానులుగా అవ్వాలి. మీరు 84 జన్మలు తీసుకుంటారు. నేను ఒక్కసారి మాత్రమే ఈ శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను. అద్దెకు తీసుకుంటాను. నేను ఈ ఇంటికి యజమానిని కాను. దీనిని మళ్లీ వదిలేస్తాను. అద్దెనైతే ఇవ్వాల్సి వస్తుంది కదా. నేను ఇంటికి బాడుగ ఇస్తానని తండ్రి కూడా చెప్తున్నారు. అనంతమైన తండ్రి కనుక ఏదైనా బాడుగ ఇస్తారు కదా. మీకు అర్థం చేయించేందుకు ఈ సింహాసనము తీసుకుంటారు. మీరు కూడా విశ్వ సింహాసనాధికారులుగా అగునట్లు అర్థం చేయిస్తారు. నేను అలా అవ్వనని స్వయంగా చెప్తున్నారు. సింహాసనాధీశులనగా మయూర సింహాసనము పై కూర్చోపెడ్తారు. శివబాబా స్మృతిలోనే సోమనాథ మందిరాన్ని నిర్మించారు. ఈ మందిరము వలన నాకేం మజా(రుచి) ఉంటుంది. అక్కడ జడమైన విగ్రహాన్ని ఉంచుతారు. పిల్లలైన మీకు స్వర్గములో మజా ఉంటుంది. నేనైతే స్వర్గములోకి రానే రాను. మళ్లీ భక్తిమార్గము మొదలైనప్పుడు ఈ మందిరాలు మొదలైనవి నిర్మించడంలో ఎంత ఖర్చు చేశారు. అయినా దొంగలు దోచుకొని ఎత్తుకుపోయారు. రావణ రాజ్యములో మీ ధనము, సంపద మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. ఇప్పుడు ఆ మయూర సింహాసనము ఉందా? తండ్రి అంటున్నారు - మీరు నిర్మించిన నా మందిరాన్ని మహమ్మద్గజనీ వచ్చి దోచుకునిపోయాడు.
భారతదేశము వంటి సంపన్న దేశము మరేదీ లేదు. ఇటువంటి తీర్థ స్థానంగా ఏదియూ అవ్వలేదు. కానీ ఈనాడు హిందూ ధర్మమువారికి అనేక తీర్థ స్థానాలైపోయాయి. వాస్తవానికి సర్వుల సద్గతిదాత అయిన తండ్రి ఒక్కరికే తీర్థ స్థానముండాలి. ఇది కూడా డ్రామాలో తయారై ఉంది. అర్థము చేసుకోవడం చాలా సులభము. కానీ నంబరువారుగానే అర్థము చేసుకుంటారు. ఎందుకంటే రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధికారులు. వీరు ఉత్తమోత్తమ పురుషులు. వారిని దేవతలని అంటారు. దైవీ గుణాలు కలిగిన వారిని దేవతలని అంటారు. ఉన్నతమైన ఈ దేవతా ధర్మానికి చెందినవారు ప్రవృత్తి మార్గములోనివారు. ఆ సమయములో మీ ప్రవృత్తి మార్గమే ఉండేది. తండ్రి మిమ్ములను డబల్ కిరీటధారులుగా చేశారు. రావణుడు ఈ రెండు కిరీటాలు తీసేశారు. ఇప్పుడు ఏ కిరీటమూ లేదు. పవిత్రతా కిరీటమూ లేదు, వజ్రాల కిరీటమూ లేదు. రావణుడు ఈ రెండు కిరీటాలను తీసేశారు. మళ్లీ తండ్రి వచ్చి మీకు ఈ రెండు కిరీటాలను చదువు, స్మృతి ద్వారా ఇస్తారు. అందుకే ఓ గాడ్ ఫాదర్! నాకు మార్గము చూపండి, ముక్తిని కూడా ఇవ్వండి అని గానము చేస్తారు. అందుకే మీకు మార్గదర్శకులు అని పేరు పెట్టారు. పాండవులు, కౌరవులు, యాదవులు ఏమి చేసి వెళ్లారు. ''బాబా, మమ్ములను ఈ దుఃఖ రాజ్యము నుండి విడిపించి మీ వెంట తీసుకెళ్లండి'' అని అంటారు. ఈ తండ్రియే సత్యమైన ఖండమును స్థాపన చేస్తారు దానిని స్వర్గము అని అంటారు. దీనిని రావణుడు మళ్లీ అసత్య ఖండముగా చేస్తాడు. వారు కృష్ణ భగవానువాచ అని అంటారు కానీ తండ్రి శివభగవానువాచ అని అంటారు. భారతవాసులు పేరు మార్చేయడంతో ప్రపంచమంతా మార్చేశారు. కృష్ణుడైతే దేహధారి. దేహము లేనివాడు శివబాబా ఒక్కరే. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి ద్వారా శక్తి లభిస్తుంది. మీరు మొత్తం విశ్వానికంతా అధిపతులుగా అవుతారు. మొత్తం ఆకాశం, భూమి, సర్వస్వమూ మీకు లభిస్తుంది. మీ నుండి ముప్పాతిక కల్పము వరకు దీనిని తీసుకునే శక్తి ఎవ్వరికీ ఉండదు. వారి సంఖ్య కోట్లలోకి వృద్ధి చెందినప్పుడు సైన్యము తీసుకొని వచ్చి మిమ్ములను జయించారు. తండ్రి పిల్లలైన మీకు ఎంతో సుఖమునిస్తారు. దుఃఖహర్త - సుఖకర్త అని వారికి గాయనమే ఉంది. ఇప్పుడు తండ్రి కూర్చుని కర్మ, అకర్మ, వికర్మల గతిని అర్థం చేయిస్తారు. రావణ రాజ్యములో మీరు చేయు కర్మలు వికర్మలుగా అవుతాయి. సత్యయుగములో కర్మలు అకర్మలుగా అవుతాయి. ఇప్పుడు మీకు ఒక్క సద్గురువు లభించారు. వారిని పతులకు పతి అని కూడా అంటారు. ఎందుకంటే ఆ పతులందరూ వీరినే స్మృతి చేస్తారు. ఇది ఎంత అద్భుతమైన నాటకమో తండ్రి అర్థము చేయిస్తారు. ఇంత చిన్న ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది. అదెప్పుడూ చెరిగిపోయేది కాదు. దీనిని అనాది అవినాశి డ్రామా అని అంటారు. భగవంతుడు ఒక్కరే. రచన, సీఢీ(మెట్లు), చక్రము అంతా ఒక్కటే. రచన గురించి గానీ, రచయిత గురించి గానీ ఎవ్వరికీ తెలియదు. ఋషులు, మునులు కూడా మాకు తెలియదని అనేస్తారు. ఇప్పుడు మీరు సంగమ యుగములో కూర్చుని ఉన్నారు. ఇప్పుడు మీకు మాయతో యుద్ధము జరుగుతుంది. అది వదిలిపెట్టదు. బాబా మాకు మాయ చెంపదెబ్బ తగిలింది అని పిల్లలు అంటారు. పిల్లలారా, సంపాదించినదంతా పోగొట్టుకున్నారా! స్వయం భగవంతుడే మిమ్ములను చదివిస్తున్నారు కనుక మంచిరీతిగా చదువుకోవాలి. ఇటువంటి చదువు మీకు మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాతనే లభిస్తుంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
మాతేశ్వరిగారి మధుర మహావాక్యాలు
'' జీవిత ఆశయము పూర్తి అయ్యే మనోహరమైన సమయము ''
జీవితములో సదా సుఖ-శాంతులు లభించాలనే ఆశ ఆత్మలైన మనందరికీ చాలాకాలంగా ఉంది. అనేక జన్మల ఈ ఆశ ఇప్పుడు పూర్తి అవుతుంది. ఇప్పుడిది మన అంతిమ జన్మ. అంతిమ జన్మలో కూడా ఇది అంతిమ సమయము. నా వయస్సు ఇంకా చిన్నదే, నేను ఇంకా చిన్నవాడినే అని అనుకోకండి. చిన్నవారైనా, పెద్దవారైనా సుఖమేమో కావాలి కదా. అయితే దు:ఖము ఎందుకు లభిస్తుంది అన్న జ్ఞానము కూడా కావాలి. పంచ వికారాలలో చిక్కుకున్నందున కర్మ బంధనాలు ఏవైతే తయారయ్యాయో వాటిని పరమ ఆత్మ స్మృతి అనే అగ్ని ద్వారా భస్మము చేయాలని ఇప్పుడు మీకు జ్ఞానము లభించింది. ఇది కర్మ బంధనాల నుండి విడుదల అయ్యేందుకు సులభమైన ఉపాయము. సర్వ శక్తివంతులైన ఈ బాబాను నడుస్తూ - తిరుగుతూ శ్వాస శ్వాసలో స్మృతి చేయండి. ఇప్పుడు ఈ ఉపాయము తెలిపే సహాయము స్వయం భగవంతుడే వచ్చి తెలుపుతున్నారు. కాని ఇందులో ప్రతి ఆత్మ పురుషార్థం చేయాలి. పరమాత్మ అయితే తండ్రి, టీచరు, గురువు రూపములో వచ్చి మనకు వారసత్వమునిస్తారు. కనుక మొదట ఆ తండ్రివారిగా అయిపోవాలి. తర్వాత టీచరు ద్వారా చదువుకోవాలి. ఆ చదువు ద్వారా భవిష్య జన్మ-జన్మాంతరాలకు సుఖ ప్రాలబ్ధము తయారవుతుంది. అనగా పురుషార్థానుసారము జీవన్ముక్తిలో అధికారము, పదవి లభిస్తాయి. గురువు రూపములో పవిత్రంగా చేసి ముక్తినిస్తారు. ఈ రహస్యాన్ని అర్థము చేసుకొని ఇటువంటి పురుషార్థము చేయాలి. పాత ఖాతాను సమాప్తము చేసుకొని నూతన జీవితాన్ని తయారుచేసుకునే సమయమిదే. ఈ సమయములో ఎంత పురుషార్థం చేసి మీ ఆత్మను అంత పవిత్రంగా చేసుకుంటారో, అంత శుద్ధమైన రికార్డును నింపుకుంటారు. అది మళ్లీ మొత్తం కల్పమంతా నడుస్తుంది. కనుక కల్పమంతటికీ ఆధారము - ఈ సమయములో చేసుకునే సంపాదనే. ఈ సమయములోనే మీకు ఆది-మధ్య- అంత్యముల జ్ఞానము లభిస్తుంది. మనము దేవతల వలె తయారవ్వాలి. ఇది మనము ఉన్నతమయ్యే కళ. మళ్లీ అక్కడకు వెళ్లి ప్రాలబ్ధమును అనుభవిస్తాము. అక్కడ దేవతలకు మేము క్రింద పడిపోతామనే విషయము తెలియదు. సుఖము అనుభవించిన తర్వాత క్రింద పడిపోతామని తెలిస్తే, పడిపోతామనే చింతలో సుఖము కూడా అనుభవించలేరు. కనుక మనిషి సదా ఉన్నతమయ్యేందుకు పురుషార్థము చేస్తాడనే ఈశ్వరీయ నియమము రచింపబడి ఉంది. అనగా సుఖము కొరకు సంపాదిస్తాడు కానీ డ్రామాలో సగము-సగము పాత్ర రచింపబడి ఉంది. ఈ రహస్యము మనకు తెలుసు కానీ సుఖము వంతు వచ్చినప్పుడు పురుషార్థము చేసి సుఖము తీసుకోవాలి. ఇది మంచి పురుషార్థము. నటించేటప్పుడు, చూచేవారు హియర్ హియర్(వహ్వా వహ్వా) అని మెచ్చుకునే విధంగా పాత్ర చేయడం నటుని కర్తవ్యము. అందువలన హీరో, హీరోయిన్ల పాత్ర దేవతలకు లభించింది. వారి స్మృతిచిహ్న చిత్రాలు పూజింపబడ్తున్నాయి. మహిమ చేయబడ్తున్నాయి. నిర్వికార ప్రవృత్తిలో ఉంటూ కమలపుష్ప స్థితిని తయారు చేసుకోవాలి. ఇదే దేవతల గొప్పతనము. దీనిని మర్చిపోవడం వల్లనే భారతదేశానికి ఈ దుర్దశ వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఇటువంటి జీవితము తయారుచేసే పరమాత్మ స్వయంగా వచ్చారు. వారి చేయి పట్టుకున్నందున జీవిత నావ తీరానికి చేరుకుంటుంది.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఈ దు:ఖధామము నుండి బుద్ధియోగాన్ని తొలగించి నూతన ప్రపంచ స్థాపన చేసే తండ్రిని స్మృతి చేయాలి, సతోప్రధానంగా తయారవ్వాలి.
2. తండ్రి సమానంగా ప్రేమ సాగరులు, శాంతి-సుఖ సాగరులుగా అవ్వాలి. కర్మ - అకర్మ - వికర్మల గతిని తెలుసుకొని సదా శ్రేష్ఠ కర్మలు చేయాలి.
వరదానము :-
'' ఎలాంటి వాయుమండలంలో అయినా మనసు - బుద్ధిని ఒక్క సెకండులో ఏకాగ్రము చేసే సర్వశక్తి సంపన్న భవ ''
బాప్దాదా పిల్లలందరికి సర్వ శక్తులను వారసత్వంగా ఇచ్చారు. స్మృతి శక్తి అంటే - మనసు, బుద్ధిని ఎక్కడ కావాలంటే అక్కడ లగ్నమవ్వాలి. ఎలాంటి వాయుమండలంలో అయినా మీ మనసును, బుద్ధిని ఒక్క సెకండులో ఏకాగ్రము చేసుకోండి. పరిస్థితులు ఆందోళనకరంగా ఉండినా, వాయుమండలం తమోగుణీగా ఉండినా, మాయ తన వశము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నా, ఒక్క సెకండులో ఏకాగ్రమైపోండి. ఇటువంటి కంట్రోలింగ్ పవర్ ఉంటే, అప్పుడు సర్వ శక్తి సంపన్నులని అంటారు.
స్లోగన్ :-
'' విశ్వ కళ్యాణము చేసే బాధ్యతా కిరీటము మరియు పవిత్రతా లైట్ కిరీటాన్ని ధరించేవారే డబల్ కిరీటధారులుగా అవుతారు ''