22-04-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - ఇది ఉన్నతమయ్యే సత్య - సత్యమైన సత్సంగము. మీరు ఇప్పుడు సత్యమైన తండ్రి సాంగత్యములోనికి వచ్చారు కనుక ఎప్పుడూ అసత్య సాంగత్యములోకి వెళ్ళరాదు ''

ప్రశ్న :-

పిల్లలైన మీ బుద్ధి ఏ ఆధారముతో సదా అనంతములలో ఉండగలదు?

జవాబు :-

బుద్ధిలో స్వదర్శన చక్రము తిరుగుతూ ఉండాలి, డ్రామాలో నడుస్తున్నదంతా ముందే నిర్ణయింపబడింది. ఒక్క సెకండు కూడా వ్యత్యాసము రాదు. ప్రపంచ చరిత్ర-భూగోళాలు పునరావృతమవుతాయి. ఈ విషయము బుద్ధిలో స్పష్టంగా ఉన్నట్లైతే బేహద్‌లో ఉండగలదు. బేహద్‌లో ఉండేందుకు - ఇప్పుడు వినాశమవ్వనున్నది, మేము వాపస్‌ ఇంటికి వెళ్లాలి, పావనంగా అయ్యే మేము ఇంటికి వెళ్తామని గమనముండాలి.

ఓంశాంతి.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - తెలివిలేనివారికే అర్థం చేయించబడ్తుంది. స్కూలులో టీచరు చదివిస్తారు. ఎందుకంటే పిల్లలు అజ్ఞానులుగా ఉంటారు. పిల్లలు చదువు ద్వారా అర్థం చేసుకుంటారు. అలాగే పిల్లలైన మీరు కూడా చదువు ద్వారా అర్థము చేసుకుంటారు. మనలను చదివించేవారెవరో ఎప్పుడూ మర్చిపోకండి. చదివించే టీచరు సుప్రీమ్‌ తండ్రి కనుక వారి మతమును అనుసరించి శ్రేష్ఠంగా అవ్వాలి. సూర్య వంశస్థులు అత్యంత శ్రేష్ఠులు, భలే చంద్ర వంశమువారు కూడా శ్రేష్ఠమైనవారే కానీ సూర్య వంశస్థులు శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు. మీరు ఇక్కడకు అత్యంత శ్రేష్ఠులుగా అయ్యేందుకు వచ్చారు. మేము ఇలా (లక్ష్మినారాయణులుగా) అవ్వాలని పిల్లలైన మీకు తెలుసు. ఇలాంటి పాఠశాల 5 వేల సంవత్సరాల తర్వాతనే మళ్లీ తెరవబడ్తుంది. ఇక్కడ మీరు అర్థము చేసుకొని కూర్చుని ఉన్నారు. ఇది నిజమైన సత్సంగము. సత్యమైనవారు, ఉన్నతోన్నతమైనవారు. మీకు వారి సాంగత్యము లభించింది. వారు కూర్చొని సత్యయుగపు శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన దేవతలుగా చేస్తారు అనగా పుష్పాలుగా చేస్తారు. మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతూ ఉంటారు. కొందరు వెంటనే అవుతారు, కొందరికి సమయము పడ్తుంది. ఇది సంగమ యుగమని పిల్లలకు తెలుసు. ఇది కూడా పిల్లలకు మాత్రమే తెలుసు. ఇది పురుషోత్తములుగా అయ్యే యుగమని మీకు నిశ్చయము కూడా ఉంది. ఎలాంటి పురుషోత్తములు? అత్యంత శ్రేష్ఠమైన ఆదిసనాతన దేవీదేవతా ధర్మపు మహారాజా-మహారాణులుగా ఎవరైతే ఉన్నారో అలా అయ్యేందుకే మీరిక్కడకు వచ్చారు. అనంతమైన తండ్రి వద్దకు అనంతమైన సత్యయుగ సుఖాన్ని తీసుకునేందుకు వచ్చామని మీకు తెలుసు. హద్దులోని విషయాలన్నీ సమాప్తమైపోతాయి. హద్దులోని తండ్రి, హద్దులోని సోదరులు, పినతండ్రులు, పెద్దనాన్నలు, మామయ్యలు, హద్దులోని విలువలేని ఆస్తి మొదలైన వాటిలో చాలా మోహముంటుంది. ఇవన్నీ సమాప్తము కానున్నవి. ఈ సంపదలన్నీ హద్దులోనివని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు అనంతములోకి వెళ్లాలి. అనంతమైన ఆస్తిని ప్రాప్తి చేసుకునేందుకు మీరిక్కడకు వచ్చారు. మిగిలినవన్నీ హద్దులోని వస్తువులు, శరీరము కూడా హద్దులోనిదే. అనారోగ్యము పాలవుతుంది, వినాశనమైపోతుంది. అకాలమృత్యువు కూడా సంభవిస్తుంది. ప్రస్తుత సమయములో ఏమేమి తయారు చేస్తున్నారో చూడండి! విజ్ఞానము కూడా అద్భుతాలను చేసింది. మాయా వైభవము ఎంతగా ఉంది! వైజ్ఞానికులు చాలా ధైర్యము చేస్తున్నారు. ఎవరి వద్ద చాలా భవనాలు మొదలైనవి ఉన్నాయో వారు మాకిదే సత్యయుగమని భావిస్తారు. సత్యయుగములో ఒకే ధర్మముంటుందని, నూతన ప్రపంచముంటుందని వారికి తెలియదు. పూర్తి తెలివిహీనులుగా ఉన్నారని తండ్రి చెప్తున్నారు. మీరు ఎంతో వివేకవంతులుగా అవుతారు. పైకి ఎక్కుతారు, మళ్లీ మెట్లు క్రిందికి దిగుతారు. సత్యయుగములో మీరు బుద్ధివంతులుగా ఉండేవారు. తర్వాత మళ్లీ 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ బుద్ధిహీనులుగా అవుతారు. మళ్లీ తండ్రి వచ్చి బుద్ధివంతులుగా చేస్తారు. వారిని బంగారు బుద్ధి గలవారని అంటారు. మేము బంగారు బుద్ధి కలిగిన మంచి వివేకవంతులుగా ఉండేవారమని మీకు తెలుసు. పాట కూడా ఉంది కదా. బాబా, మీరు ఎంత ఆస్తినిస్తారంటే - మొత్తం భూమ్యాకాశాలకు మేము అధికారులుగా అవుతాము. దానిని ఎవ్వరూ మా నుండి దోచుకోలేరు(లాక్కోలేరు). ఎవరి ప్రమేయమూ ఉండదు. తండ్రి ఎంతగానో ఇస్తారు. దీని కంటే ఎక్కువగా ఎవ్వరూ జోలెను నింపలేరు. అర్ధకల్పము ఎవరిని స్మృతి చేశామో ఆ తండ్రే లభించారు. దు:ఖములో అందరూ స్మరిస్తారు కదా. సుఖము లభించినప్పుడు స్మరణ చేసే అవసరముండదు. దు:ఖములో అందరూ అయ్యో రామా!.......... అలా అనేక ప్రకారములైన పదాలతో స్మృతి చేస్తారు. సత్యయుగములో ఇటువంటి పదాలేవీ ఉండవు. పిల్లలైన మీరు ఇక్కడకు తండ్రి సన్ముఖములో చదువుకునేందుకు వచ్చారు. తండ్రి నుండి ప్రత్యక్షంగా వారు మహావాక్యాలు వింటారు. పరోక్ష జ్ఞానమును తండ్రి ఇవ్వరు. జ్ఞానము నేరుగానే లభిస్తుంది. తండ్రి రావలసి పడ్తుంది. మధురాతి మధురమైన పిల్లల వద్దకు వచ్చానని తండ్రి చెప్తారు. ఓ బాప్‌దాదా అని నన్ను పిలుస్తారు. తండ్రి కూడా రెస్పాన్స్‌ ఇస్తారు(బదులు ఇస్తారు). ఓ పిల్లలారా, ఇప్పుడు నన్ను బాగా స్మృతి చేయండి, మర్చిపోకండి. మాయా విఘ్నాలైతే అనేకము వస్తాయి. మాయ చదువు నుండి మిమ్ములను విడిపించి మిమ్ములను దేహాభిమాన వశము చేస్తుంది. కావున హెచ్చరికగా ఉండండి. ఇది ఉన్నతయ్యే సత్య-సత్యమైన సత్సంగము. మిగిలిన సత్సంగములన్నీ క్రిందకి దిగజారుస్తాయి. సత్యమైన సాంగత్యము ఒక్కసారే జరుగుతుంది. అసత్య సాంగత్యాలు జన్మ-జన్మలుగా అనేకసార్లు జరుగుతాయి. బాబా పిల్లలకు చెప్తున్నారు - ఇది మీ అంతిమ జన్మ. ఏ అప్రాప్తి వస్తువే లేని స్థానానికి ఇప్పుడు వెళ్లాలి. అందుకే మీరు పురుషార్థము చేస్తున్నారు. బాబా చెప్తున్నదంతా మీరిప్పుడు మాత్రమే వింటారు. అక్కడ ఇది ఏ మాత్రము తెలియదు. ఇప్పుడు మీరెక్కడకు వెళ్తారు? మీ సుఖధామములోకి వెళ్తారు. సుఖధామము మీదిగానే ఉండేది. మీరు సుఖధామములో ఉండేవారు, ఇప్పుడు దు:ఖధామములో ఉన్నారు. బాబా చాలా చాలా సహజమైన మార్గాన్ని తెలియజేశారు. దానినే స్మృతి చేయండి. మన ఇల్లు శాంతిధామము. అక్కడి నుండి మనము స్వర్గములోకి వస్తాము. మీరు తప్ప ఇతరులెవ్వరూ స్వర్గములోకి రారు. కనుక మీరు మాత్రమే స్మరిస్తారు. మీరు మొదట సుఖములోకి వెళ్లి తర్వాత దు:ఖములోకి వస్తారు. కలియుగములో సుఖధామమే ఉండదు. సుఖము లభించనే లభించదు. అందుకే సన్యాసులు కూడా సుఖము కాకిరెట్టకు సమానమని అంటారు.

బాబా మనలను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. పతితులైన మనలను పావనంగా చేసి తీసుకెళ్తారు. స్మృతియాత్ర ద్వారానే పావనంగా అవుతారు. యాత్ర చేసే సమయాలలో చాలా హెచ్చు-తగ్గులు జరుగుతాయి. ఎవరైనా జబ్బు పాలైతే వాపస్‌ వచ్చేస్తారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఇది ఆత్మిక యాత్ర, అంతిమతి సో గతి అయిపోతుంది. మనము మన శాంతిధామానికి వెళ్తున్నాము. వాస్తవానికి ఇది చాలా సులభము కానీ మాయ చాలా మరపింపజేస్తుంది. మీరు మాయతో యుద్ధము చేస్తారు. ఇప్పుడు మనము శాంతిధామానికి వెళ్తామని తండ్రి చాలా సహజము చేసి అర్థం చేయిస్తారు. తండ్రిని మాత్రమే స్మృతి చేస్తారు. దైవీగుణాలను ధారణ చేస్తారు, పవిత్రంగా అవుతారు. ముఖ్యమైన 3-4 విషయాలను బుద్ధిలో ఉంచుకోవాలి. వినాశనమైతే అవ్వనే అవ్వాలి, 5 వేల సంవత్సరాల క్రితము కూడా మనము వెళ్లాము. మళ్లీ మొట్టమొదట మనమే వస్తాము. గాయనము కూడా ఉంది కదా - రాముడు పోయాడు, రావణుడు పోయాడు....... అందరూ శాంతిధామానికి వెళ్లాలి. మీరు చదివే దాని అనుసారముగానే పదవిని పొందుతారు. మీ ముఖ్య లక్ష్యము ఎదురుగా ఉంది. మాకు సాక్షాత్కారము అవ్వాలని కొందరు అంటారు. ఈ చిత్రము(లక్ష్మీనారాయణుల) సాక్షాత్కారము కాక మరేమిటి? ఇంకా ఎవరి సాక్షాత్కారము కావాలి! అనంతమైన తండ్రి సాక్షాత్కారమవ్వాలా! ఇతర ఏ సాక్షాత్కారాలు పనికి వచ్చేవి కావు. తండ్రి సాక్షాత్కారము అవ్వాలని కోరుకుంటారు. తండ్రి కంటే మధురమైన వస్తువు ఇంకేదీ లేదు. తండ్రి చెప్తున్నారు - మధురమైన పిల్లలూ, మొదట మీ సాక్షాత్కారమును చేసుకున్నారా? బాబా సాక్షాత్కారము అవ్వాలని ఆత్మ అంటుంది. మరి మీ సాక్షాత్కారము మీరు చేసుకున్నారా? మేము ఆత్మలము, మా ఇల్లు శాంతిధామము అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అక్కడ నుండి ఆత్మలైన మనము పాత్రను అభినయము చేసేందుకు వస్తాము. డ్రామా ప్లాను అనుసారము మొట్టమొదట సత్యయుగం ఆదిలో మనము వస్తాము. ఇది ఆది మరియు అంతముల పురుషోత్తమ సంగమ యుగము. ఇందులో కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఉంటారు. వారు తప్ప ఇతరులెవ్వరూ ఉండరు. కలియుగములో అయితే అనేకానేక ధర్మాలు, కులాలు మొదలైనవి ఉన్నాయి. సత్యయుగములో ఒక్కరి సామ్రాజ్యమే ఉంటుంది. ఇది సహజము కదా. ఈ సమయములో మీరు సంగమయుగీ ఈశ్వరీయ పరివారానికి చెందినవారు. మీరు సత్యయుగమువారూ కాదు, కలియుగము వారూ కాదు. కల్ప-కల్పము తండ్రి వచ్చి ఇలాంటి విద్యను చదివిస్తారని కూడా మీకు తెలుసు. ఇక్కడ మీరు కూర్చుని ఉన్నారు. కనుక ఇదే స్మృతిలోకి రావాలి. అవి శాంతిధామము మరియు సుఖధామము. ఇది దు:ఖధామము. ఈ దు:ఖధామము పై బుద్ధి ద్వారా వైరాగ్యము లేక సన్యాస భావము కలిగింది. వారెవ్వరూ బుద్ధి ద్వారా సన్యాసము చేయరు. వారు ఇల్లు-వాకిళ్ళు వదిలి సన్యసిస్తారు. ఇల్లు- వాకిళ్లు వదిలేయమని తండ్రి మీకు ఎప్పుడూ చెప్పరు. భారతదేశానికి సేవ చేయాలి మరియు స్వయం సేవ చేసుకోవాలని మాత్రము చెప్తారు. సేవ అయితే ఇంటిలో కూడా చేయవచ్చు. చదువుకునేందుకు రానే రావాలి. తర్వాత చురుకైన వారిగా అయ్యి ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేయాలి. సమయము చాలా తక్కువగా ఉంది. చాలా గడచిపోయింది, కొద్దిగానే ఉందని గాయనము కూడా ఉంది కదా. ప్రపంచములోని మనుష్యులైతే పూర్తి గాఢాంధకారములో ఉన్నారు. ఇంకా 40 వేల సంవత్సరాలు ఉందని భావిస్తున్నారు. పిల్లలారా, ఇప్పుడు కొద్ది సమయమే మిగిలి ఉందని తండ్రి అర్థం చేయించారు. మీరు బేహద్‌లో స్థిరమవ్వాలి. పూర్తి ప్రపంచములో ఏమేమి జరుగుతూ ఉందో అదంతా నిర్ణయింపబడి ఉంది. పేను వలె డ్రామా నడుస్తోంది. విశ్వ చరిత్ర-భూగోళాలు పునరావృతమవ్వాలి. ఎవరు సత్యయుగములోకి వెళ్లేవారిగా ఉంటారో వారే వచ్చి చదువుకుంటారు. అనేకసార్లు మీరు చదివారు. మీరు శ్రీమతానుసారము మీ స్వర్గ స్థాపన చేస్తారు. సర్వ శ్రేష్ఠులైన భగవంతుడు వచ్చేది భారతదేశములోనే అని కూడా మీకు తెలుసు. కల్పక్రితము కూడా వచ్చారు. కల్ప-కల్పము తండ్రి ఇలా వస్తారని మీరు చెప్తారు. నేను కల్ప-కల్పము ఇలాగే స్థాపన చేస్తాను, వినాశనము కూడా మీరు చూస్తారు అని బాబా చెప్తారు. ఇదంతా మీ బుద్ధిలో కూర్చుంటూ ఉంటుంది. స్థాపన, వినాశనము మరియు పాలనల కర్తవ్యము ఎలా జరుగుతుందో మీకు తెలుసు. ఇతరులకు కూడా అర్థం చేయించాలి. ఇంతకుముందు ప్రపంచ చరిత్ర-భూగోళాల గురించి యదార్థ రీతిలో మీరు తెలుసుకున్నారు. మనుష్యులు ఎలా తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారో తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు. మీరు మళ్లీ ఇతరులకు అర్థం చేయించాలి.

ఇప్పుడు పిల్లలైన మీరు పారసబుద్ధి గలవారిగా అవుతున్నారు. సత్యయుగములో పారసబుద్ధి గలవారే ఉంటారు. ఇది పురుషోత్తమ సంగమ యుగము. దీనిని గీతా అధ్యాయమని అంటారు. మీరిప్పుడు రాతిబుద్ధి నుండి బంగారు బుద్ధి గలవారిగా అవుతారో, దానినే గీతా అధ్యాయమని అంటారు. గీతను వినిపించేవారు స్వయం భగవంతుడే. మనుష్యులు వినిపించరు. ఆత్మలైన మీరు వింటారు, ఇతరులకు వినిపిస్తారు. దీనిని ఆత్మిక జ్ఞానమని అంటారు. దీనిని మీరు ఆత్మిక సోదరులకు వినిపిస్తారు. వృద్ధి చెందుతూ ఉంటారు. బాబా వచ్చి సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్యాన్ని స్థాపన తండ్రి శ్రీమతమునిస్తారు. ఇవి అర్థము చేసుకోవలసిన విషయాలు. మనస్సులో నోట్‌ చేసుకోవాలి. ఇది చాలా సహజము. ఇది దు:ఖధామము. ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలి. కలియుగము తర్వాత సత్యయుగము ఉంటుంది. విషయమైతే చాలా చిన్నది అంతేకాక సహజమైనది. భలే మీకు చదువు రాకపోయినా పర్వాలేదు. ఎవరికైతే చదవడం తెలుసో వారి ద్వారా వినాలి. శివబాబా సర్వాత్మల తండ్రి. ఇప్పుడు వారి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రి పై నిశ్చయముంచుకుంటే స్వర్గ వారసత్వము లభిస్తుంది. ఆంతరికంగా కూడా అజపాజపము నడుస్తూ ఉండాలి. శివబాబా ద్వారా అనంతమైన సుఖము, స్వర్గ వారసత్వము లభిస్తోంది. కనుక శివబాబాను తప్పకుండా స్మృతి చేయాలి. అనంతమైన తండ్రి నుండి వారసత్వము తీసుకునే హక్కు అందరికీ ఉంది. ఎలా హద్దు ఆస్తి జన్మ సిద్ధ అధికారంగా లభిస్తుందో, అలాగే ఇది కూడా అనంతమైన ఆస్తి. శివబాబా ద్వారా మీకు పూర్తి విశ్వరాజ్యము లభిస్తుంది. చిన్న-చిన్న పిల్లలకు కూడా ఇది అర్థం చేయించాలి. తండ్రి నుండి జన్మ సిద్ధ అధికారము తీసుకోవడము ప్రతి ఒక్క ఆత్మకు హక్కు. కల్ప-కల్పమూ తప్పకుండా తీసుకుంటారు. మీరు జీవన్ముక్తి వారసత్వమును తీసుకుంటారు. ఎవరికైతే ముక్తి వారసత్వముగా లభిస్తుందో, వారు కూడా జీవన్ముక్తిలోకి తప్పకుండా వస్తారు. వారి మొదటి జన్మ సుఖమైనదిగానే ఉంటుంది. ఇది మీ 84వ జన్మ. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉండాలి. అనంతమైన తండ్రి మనలను చదివిస్తున్నారని మర్చిపోకండి. దేహధారులెప్పుడూ జ్ఞానమునివ్వలేరు. వారిలో ఆత్మిక జ్ఞానము ఉండదు. మేము సోదర-సోదరులము(భాయి-భాయి) అని భావించండని మీకు అర్థం చేయించబడ్తుంది. ఇతర మనుష్యమాత్రులెవ్వరికీ ఈ శిక్షణ లభించదు. భగవానువాచ - కామము మహాశత్రువు. దీని పై విజయము పొందడం వలన మీరు జగజ్జీతులుగా అవుతారని గీత కూడా వినిపిస్తారు. కానీ అర్థం చేసుకోరు. ఇప్పుడు భగవంతుడు సత్యమైనవారు, దేవతలు కూడా భగవంతుని నుండి సత్యమును నేర్చుకున్నారు. కృష్ణుడు కూడా ఈ పదవిని ఎక్కడ నుండి పొందాడు? లక్ష్మీనారాయణులుగా ఎలా అయ్యారు? ఏ కర్మ చేశారు? ఎవరైనా చెప్పగలరా? నిరాకారులైన తండ్రియే వారికి అటువంటి కర్మలు బ్రహ్మబాబా ద్వారా నేర్పించారని మీకు తెలుసు. ఇది సృష్టి కదా. ఇప్పుడు మీరు ప్రజాపిత బ్రహ్మకుమార-కుమారీలు, మీ వద్ద ఆత్మిక తండ్రి ఇచ్చిన జ్ఞానముంది. మేము భగవంతుని తెలుసుకున్నాము. సర్వ శ్రేష్ఠమైనవారు ఆ నిరాకారులు. వారికి సాకార రూపము లేదు. మీరు చూస్తున్న మిగిలిన వారందరూ సాకారులు. మందిరాలలో కూడా శివలింగమును చూస్తారు. అనగా వారికి శరీరము లేదు. అలాగని వారు నామ-రూపాలు లేనివారని కాదు. నిజమే మిగిలిన దేహధారులకు పేర్లున్నాయి. వారికి జాతకముంది. శివబాబా అయితే నిరాకారులు. వారికి జాతకము లేదు. కృష్ణుని జన్మ నెంబరువన్‌. శివజయంతి కూడా ఆచరిస్తారు. శివాబాబా నిరాకారులు, కళ్యాణకారి. తండ్రి వచ్చారంటే తప్పకుండా ఆస్తినిస్తారు. వారి పేరు శివ. వారు తండ్రి, టీచరు, సద్గురువు. ముగ్గురూ ఒక్కరే. ఎంత బాగా చదివిస్తారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము -

1. ఈ దు:ఖధామాన్ని బుద్ధి ద్వారా సన్యసించి శాంతిధామము మరియు సుఖధామమును స్మృతిలో ఉంచుకోవాలి. భారతదేశ సేవనూ చేయాలి, మీ సేవనూ చేసుకోవాలి. అందరికీ ఆత్మిక జ్ఞానమును వినిపించాలి.

2. మీ సత్యయుగీ జన్మ సిద్ధ అధికారమును తీసుకునేందుకు ఒక్క తండ్రి పై పూర్తి నిశ్చయాన్ని ఉంచుకోవాలి. ఆంతరికంగా అజపాజపము చేస్తూ ఉండాలి. ప్రతి రోజూ చదువును తప్పకుండా చదువుకోవాలి.

వరదా నము :-

'' సైలెన్స్‌ శక్తి ద్వారా ఆత్మిక శక్తితో ఎగురుటను తీవ్రతరము చేసే విశ్వపరివర్తక్‌ భవ ''

సైన్సు సాధనాల వేగాన్ని సైన్స్‌ ద్వారా తగ్గించనూగలరు, పట్టుకోనూగలరు(నిలుపగలరు) కానీ ఆత్మిక గతిని ఇంతవరకు ఎవ్వరూ ఆపలేదు, ఆపలేరు కూడా. ఇందులో సైన్సు వారు స్వయాన్ని ఫెయిల్‌ అయ్యామని అర్థం చేసుకున్నారు. ఎక్కడ సైన్స్‌ ఫెయిల్‌ అవుతుందో అక్కడ సైలెన్స్‌ శక్తి ద్వారా ఏం కావాలంటే అది చేయగలరు. కనుక ఆత్మ శక్తితో ఎగురుటను తీవ్రతరము చేయండి. ఈ శక్తి ద్వారా స్వయాన్ని, ఇతరుల వృత్తిని, వాయుమండలాన్ని పరివర్తన చేసి విశ్వపరివర్తకులుగా అవ్వగలరు. తీవ్రతకు గుర్తు - ''అనుకున్న వెంటనే అయిపోవడం.''

స్లోగన్‌ :-

'' శిక్షా దాత (బాబా)తో పాటు దయాహృదయులై సహయోగులుగా అవ్వండి. ''