23-01-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - '' భగవంతుడు మనలను చదివిస్తున్నారు, మా ఈ విద్యార్థి జీవితము అత్యంత శ్రేష్ఠమైనది, మా పైన బృహస్పతి దశ ఉంది'' అన్న నషాలోనే ఎల్లప్పుడూ ఉండండి.''

ప్రశ్న :-

ఏ పిల్లలకు అందరి ప్రేమ లభిస్తుంది ?

జవాబు :-

ఎవరైతే అనేమంది కళ్యాణానికి నిమిత్తులుగా అవుతారో వారు అందరి ప్రేమను పొందుతారు. ఎవరి కళ్యాణమైతే జరుగుతుందో, వారు తమ కళ్యాణానికి నిమిత్తమైన వారిని మీరు నాకు తల్లి అని అంటారు. కావున ''నేను ఎందరి కళ్యాణము చేస్తున్నాను, తండ్రి సందేశాన్ని ఎంతమంది ఆత్మలకు ఇస్తున్నాను?'' అని మిమ్ములను మీరు పరిశీలించుకోండి. తండ్రి కూడా సందేశకులే. పిల్లలైన మీరు కూడా తండ్రి సందేశమును ఇవ్వాలి. ''మీకు ఇద్దరు తండ్రులున్నారు. అనంతమైన తండ్రిని మరియు వారసత్వమును స్మృతి చేయండి'' అని అందరికీ చెప్పండి.

పాట :-

నీవు ప్రేమసాగరుడవు.............. (తూ ప్యార్‌ కా సాగర్‌ హై,...............)   

ఓంశాంతి.

పిల్లలూ! ఆత్మాభిమానులై కూర్చోండి అని ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు ప్రతి రోజూ అర్థము చేయిస్తారు. బుద్ధి బయట భ్రమిస్తూ ఉండరాదు. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. వారే జ్ఞాన సాగరులు, ప్రేమ సాగరులు. జ్ఞాన బిందువు ఒక్కటైనా చాలు అని అంటారు. తండ్రి అంటారు - '' మధురాతి మధురమైన పిల్లలూ! ఆత్మిక తండ్రిని స్మృతి చేస్తే మీకు ఈ వారసత్వము లభిస్తుంది. తద్వారా అమరపురి అయిన వైకుంఠములోకి వెళ్లిపోతారు''. పోతే ఈ సమయములో శిరస్సు పై పాపాల భారమేదైతే ఉందో దానిని దించుకోవాలి. నియమానుసారము వివేకానుసారము పిల్లలైన మీకు అర్థము చేయించబడ్తుంది. ఎవరైతే ఉన్నతోన్నతులుగా ఉండేవారో వారే మళ్లీ అంతిమములో కింద తపస్సు చేస్తున్నారు. రాజయోగ తపస్సును ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు. హఠయోగము పూర్తిగా వేరు. అది హద్దులోనిది, ఇది అనంతమైనది. అది నివృత్తి మార్గము. ఇది ప్రవృత్తి మార్గము. తండ్రి చెప్తున్నారు - ''మీరు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు. యథా రాజా-రాణి తథా ప్రజా,....... అందరూ ప్రవృత్తి మార్గములోని దేవీ దేవతలుగా ఉండేవారు, తర్వాత దేవతలు వామ మార్గము (పూజ్యులుగా ఉన్నవారు మధు-మాంసము, మైధునాలతో కూడిన శాస్త్ర విరుద్ధ మార్గము)లోకి వెళ్లిపోతారు''. వామమార్గపు చిత్రాలు కూడా ఉన్నాయి. చాలా అశుద్ధమైన చిత్రాలను తయారుచేస్తారు. వాటిని చూసేందుకు కూడా సిగ్గు అవుతుంది. ఎందుకంటే బుద్ధి పూర్తిగా అంతమైపోతుంది. నీవు ప్రేమ సాగరుడవు,.............. అన్నది తండ్రి మహిమ. ప్రేమ బిందువనే మాట లేదు. ఇవి జ్ఞాన బిందువులు. మీరు తండ్రిని గుర్తించి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వస్తారు. తండ్రి సద్గతికి వెళ్లే జ్ఞానమునే ఇస్తారు. కొద్దిగా విన్నా సద్గతిలోనికి వచ్చేస్తారు. పిల్లలైన మీరు ఇక్కడి నుండి క్రొత్త ప్రపంచములోకి వెళ్లాలి. మనం వైకుంఠానికి అధిపతులుగా అవుతామని మీకు తెలుసు. ఈ సమయములో విశ్వమంతటి పై రావణరాజ్యముంది. విశ్వరాజ్యమును ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. మీరందరూ విశ్వాధిపతులుగా ఉండేవారు. ఇప్పటివరకు కూడా ఆ చిత్రాలు ఉన్నాయి. లక్షల సంవత్సరాల విషయమేదీ లేదు. అది తప్పు. తండ్రినే ఎల్లప్పుడూ న్యాయబద్ధమైనవారు(రైటియస్‌) అని అంటారు. తండ్రి ద్వారా మొత్తం విశ్వమంతా న్యాయ బద్ధముగా అవుతుంది. ఇప్పుడిది అధర్మయుక్తమైనది. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. కాని ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడి ఉంది. కొందరు జ్ఞానము వింటూ వింటూ ఆశ్చర్యంగా వింటారు, వర్ణిస్తారు మళ్లీ పారిపోతారు. అహో మమ మాయా! నీవు ఎంత శక్తివంతమైన దానవు! నీవు తండ్రి నుండి విముఖులుగా చేసేస్తావు! అది శక్తివంతముగా ఎందుకు ఉండదు? అర్ధకల్పము దాని రాజ్యము నడుస్తుంది. రావణుడు అంటే ఏమిటో కూడా మీకు తెలుసు. ఇక్కడ కూడా కొందరు పిల్లలు వివేకవంతులుగా ఉన్నారు. కొందరు బుద్ధిహీనులుగా ఉన్నారు.

ఇప్పుడు మన పై బృహస్పతి దశ ఉందని, అందుకే మనం స్వర్గములోకి వెళ్లేందుకు పురుషార్థము చేస్తున్నామని మీకు తెలుసు. ఏ మనుష్యులైతే మరణిస్తారో వారు స్వర్గములోకి వెళ్లేందుకు పురుషార్థము చేయరు. కేవలం స్వర్గస్థులయ్యారని నామమాత్రంగా అనేస్తారు. సత్యమైన స్వర్గములోకి వెళ్ళేందుకు లేక స్వర్గాధిపతులుగా అయ్యేందుకు మనం పురుషార్థము చేస్తున్నామని మీకు తెలుసు. వీరు స్వర్గానికి వెళ్తున్నారని,.......... ఎప్పుడూ ఎవ్వరూ అనరు. అలా ఎందుకు అంటున్నావు. నోరు మూసుకో అని అంటారు. మనుష్యులు హద్దులోని విషయాలనే వినిపిస్తారు. తండ్రి మీకు అనంతమైన విషయాలను వినిపిస్తారు. పిల్లలైన మీరు చాలా పురుషార్థము చేయాలి. ఎంతో నషా ఎక్కాలి. ఎవరైతే కల్పపూర్వము పురుషార్థము చేశారో, ఎవరైతే పదవి పొందారో వారే మళ్లీ పొందుతారు. అనేకమార్లు పిల్లలైన మీచే మాయ పై విజయము కలిగించాము. మళ్లీ మీరు ఓడిపోయారు కూడా! ఇది కూడా డ్రామాలో తయారై ఉంది. కావున పిల్లలకు ఎంతో సంతోషము కలగాలి - మీరు మృత్యులోకము నుండి అమర లోకములోకి వెళ్తున్నారు. విద్యార్థి జీవితము అత్యంత శ్రేష్ఠమైనది. ఈ సమయములో మీది అత్యంత శ్రేష్ఠమైన జీవితము దీనిని గురించి మనుష్యులెవ్వరికీ తెలియదు. స్వయంగా భగవంతుడే వచ్చి చదివిస్తారు. ఇది శ్రేష్ఠమైన విద్యార్థి జీవితము. ఆత్మయే చదివిస్తుంది. అప్పుడు వీరి పేరు ఫలానా అని అంటారు. ఆత్మయే టీచరు కదా! ఆత్మయే విని, ధారణ చేస్తుంది. వినేది ఆత్మయే కాని దేహాభిమాన కారణంగా అర్థము చేసుకోరు. సత్యయుగములో కూడా ఆత్మనైన నాకు ఈ శరీరము లభించింది. ఇప్పుడు వృద్ధావస్థ వచ్చిందని అర్థము చేసుకుంటారు. ఇప్పుడు నేను ఈ పురాతన వస్త్రాన్ని వదిలి క్రొత్త దానిని తీసుకుంటున్నానని వెంటనే సాక్షాత్కారము అవుతుంది. భ్రమరము ఉదాహరణ కూడా ఈ సమయానికి చెందినదే. ఇప్పుడు మనము బ్రాహ్మణీలమని మీకు తెలుసు. డ్రామా ప్లాను అనుసారము ఎవరైతే మీ వద్దకు వస్తారో, వారి పై భూ-భూ చేస్తూ జ్ఞానము వినిపిస్తారు. మళ్లీ వారిలో కూడా కొందరు కచ్ఛాగా ఉంటారు(పక్వము కారు), కొందరు కుళ్లిపోతారు. సన్యాసులు ఈ ఉదాహరణను ఇవ్వజాలరు. వారెప్పుడూ తమ సమానంగా తయారుచేయరు. మీ వద్ద లక్ష్యముంది, ఉద్ధ్దేశ్యముంది. ఈ సత్యనారాయణ కథ, అమరకథ............. ఇవన్నీ మీవే. ఒక్క తండ్రి మాత్రమే సత్యమును వినిపిస్తారు. మిగిలినదంతా అసత్యము. అక్కడ సత్యనారాయణ కథను వినిపించి ప్రసాదాన్ని తినిపిస్తూ ఉంటారు. ఆ హద్దులోని విషయాలు ఎక్కడ, ఈ అనంతమైన విషయాలు ఎక్కడ? తండ్రి మీకు ఏ ఆదేశాలను ఇస్తారో, అవి మీరు నోట్‌ చేసుకుంటారు. ఇక మిగిలిన పుస్తకాలు, శాస్త్రాలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. పాత వస్తువేదీ ఉండదు. కలియుగము ఇంకా సుమారు 40 వేల సంవత్సరాలు ఉంటుందని మనుష్యులు భావిస్తారు. అందుకే పెద్ద పెద్ద భవనాలు మొదలైన వాటిని తయారు చేస్తూ ఉంటారు. ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు కాని సముద్రము వదులుతుందా? ఒక్క అలతో అంతా మింగేస్తుంది. ఒకప్పుడు ఈ బొంబాయి ఉండేది కాదు, అలాగే భవిష్యత్తులో ఉండదు కూడా. ఈ 100 సంవత్సరాలలో ఏవేవి వెలువడ్డాయో చూడండి. ఇంతకు ముందు వైస్‌రాయ్‌ కూడా 4 గుర్రాల బండిలో వచ్చేవారు, ఇప్పుడు కొద్ది సమయములో ఏవేవి తయారైపోయాయో చూడండి. స్వర్గమైతే చాలా చిన్నది. నదీ తీరాలలో మీ భవనాలు ఉంటాయి.

ఇప్పుడు పిల్లలైన మీ పై బృహస్పతి దశ ఉంది. మేము ఇంత శ్రీమంతులుగా అవుతున్నామని పిల్లలకు ఎంతో సంతోషముండాలి. ఎవరైనా దివాలా తీస్తే, దానిని రాహు దశ అని అంటారు. మీరు మీ దశ పై హర్షితులుగా ఉండండి - భగవంతుడైన తండ్రి మనలను చదివిస్తున్నారు. భగవంతుడు ఎవరినైనా చదివిస్తారా? మన ఈ విద్యార్థి జీవితము అత్యంత శ్రేష్ఠమైనదని పిల్లలైన మీకు తెలుసు. మనము నరుని నుండి నారాయణునిగా, విశ్వాధిపతులుగా అవుతాము. ఇక్కడ మనము రావణ రాజ్యములోకి వచ్చి చిక్కుకున్నాము, మళ్లీ సుఖధామములోకి వెళ్తాము. మీరు సంగమ యుగములోని బ్రాహ్మణులు. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. ఒక్కరే ఉండరు కదా! చాలామంది ఉంటారు కదా! మీరు ఈశ్వరీయ సేవాధారులు(ఖుదాయీ ఖిద్‌మత్‌గార్‌)గా అవుతారు. ఖుదా(భగవంతుడు) స్వర్గ స్థాపన చేసే సేవనేదైతే చేస్తారో అందులో మీరు సహాయపడ్తారు. ఎవరైతే ఎక్కువగా సహాయము చేస్తారో, వారు ఉన్నత పదవిని పొందుతారు. ఎవ్వరూ ఆకలితో మరణించజాలరు. ఇక్కడ ఫకీర్ల వద్ద కూడా వెతుకుతే వేలాది రూపాయలు ఉంటాయి. ఆకలితో ఎవరూ మరణించజాలరు. ఇక్కడ కూడా మీరు తండ్రికి చెందినవారిగా అయ్యారు. తండ్రి పేదవాడైనా పిల్లలకు ఎప్పటివరకైతే భోజనము లభించదో అప్పటివరకు తను స్వయం తినడు. ఎందుకంటే పిల్లలు వారసులు. వారి పై ప్రేమ ఉంటుంది. అక్కడైతే పేదరికమే ఉండదు. అపారమైన ధాన్యముంటుంది. అనంతమైన సంపద ఉంటుంది. అక్కడి దుస్తులు ఎంత సుందరంగా ఉంటాయో చూడండి. అందుకే ఖాళీ దొరికినప్పుడంతా లక్ష్మీనారాయణుల చిత్రము ముందు వెళ్ళి కూర్చోండి అని బాబా అంటారు. రాత్రివేళలో కూడా కూర్చోవచ్చు. ఈ లక్ష్మీనారాయణులను చూస్తూ చూస్తూ నిదురించండి, ఓహో బాబా! మమ్ములను మీరు ఇలా తయారు చేస్తున్నారు!........ అంటూ మీరు ఇలా అభ్యాసము చేసి చూడండి. ఎంత ఆనందము కలుగుతుందో గమనించండి! మళ్లీ ఉదయము లేచి అనుభవము వినిపించండి. లక్ష్మీనారాయణుల చిత్రము మరియు మెట్ల(సీఢీ) చిత్రము అందరి వద్ద ఉండాలి. తమను ఎవరు చదివిస్తున్నారో విద్యార్థులకు తెలుసు. వారి చిత్రము కూడా ఉంది. మొత్తం ఆధారమంతా చదువు పైననే ఉంది. స్వర్గాధిపతులుగా అయితేే అవుతారు కాని పదవికి ఆధారము చదువు. బాబా ఈ పురుషార్థమును చేయమని చెప్తున్నారు - నేను ఒక ఆత్మను, శరీరాన్ని కాను, నేను బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాను. ఇందులో ఏ కష్టమూ లేదు. మాతలకైతే ఇది చాలా సులభము. పురుషులైతే వ్యాపార వ్యవహారాలలోకి వెళ్ళిపోతారు. ఈ లక్ష్యము - ఉద్ధేశ్యమును తెలుపు చిత్రమును చూపి మీరు చాలా సేవ చేయగలరు. అనేమందికి కళ్యాణము చేస్తే, మిమ్ములను ఎంతగానో ప్రేమిస్తారు. మీరు నా తల్లి వంటి వారని అంటారు. జగత్‌ కళ్యాణము కొరకు మాతలైన మీరు నిమిత్తులు. నేను ఎంతమంది కళ్యాణము చేశాను, ఎంతమందికి తండ్రి సందేశాన్ని ఇచ్చానని మిమ్ములను మీరు పరిశీలించుకోండి. తండ్రి కూడా సందేశకుడే. ఇంకెవ్వరినీ సందేశకులని అనరు. తండ్రి, పిల్లలకు సందేశాన్నిచ్చి అందరికీ వినిపించమని చెప్తున్నారు - '' అనంతమైన తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. అంతేకాక 84 జన్మల చక్రమును కూడా స్మృతి చేయండి.'' సందేశకుడైన తండ్రి పిల్లలైన మీరు కూడా అందరికీ సందేశమును ఇచ్చేవారు. ఇద్దరు తండ్రులున్నారని అందరికీ చెప్పండి. అనంతమైన తండ్రి సుఖ-శాంతుల వారసత్వాన్ని ఇచ్చారు. మనము సుఖధామములో ఉన్నప్పుడు మిగిలిన వారంతా శాంతిధామములో ఉండేవారు. మళ్లీ జీవన్ముక్తిలోకి వస్తారు. ఇప్పుడు మనము వాపస్‌ వెళ్ళాలి. మళ్లీ అక్కడ మనమే విశ్వాధిపతులుగా అవుతాము. ''బాబా! మీ నుండి మాకు మొత్తం విశ్వరాజ్యాధికారము లభిస్తుంది'' అన్న ఒక పాట కూడా ఉంది. మొత్తము భూమి, సముద్రము, ఆకాశము అన్నీ మన చేతిలోనే ఉంటాయి. ఈ సమయములో మనము తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నాము. మీరు గుప్త యోధులు, శివశక్తి సైన్యము. ఇది జ్ఞాన ఖడ్గము. ఇవి జ్ఞాన బాణాలు. వారైతే దేవీలకు స్థూలమైన మారణాయుధాలు ఇచ్చేశారు. భక్తిమార్గములో ఎన్ని మందిరాలు నిర్మించారు! ఎన్ని చిత్రాలు మొదలైనవి ఉన్నాయి! అందుకే మీరు భక్తిమార్గములో ధనము మొదలైన వాటన్నిటినీ సమాప్తము చేసేశారని తండ్రి అంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ సమాప్తమవ్వనున్నవి, మునిగిపోతాయి. అక్కడ ఏ విధంగా గనుల నుండి వజ్రాలు, నగలు మొదలైన వాటిని తీసుకు వస్తారో మీకు సాక్షాత్కారము కూడా చేయించడము జరిగింది ఎందుకంటే ఇవన్నీ భూస్థాపితమై పోతాయి. గొప్ప-గొప్ప రాజుల వద్ద భూగర్భ మహళ్లు ఉంటాయి. అవన్నీ భూస్థాపితమై పోతాయి. మళ్లీ మీ కార్మికులు వెళ్లి తీసుకొస్తారు. లేకపోతే ఇంత బంగారము మొదలైనవి ఎక్కడి నుండి వస్తాయి? స్వర్గ దృశ్యమును అజ్మీరులో చూస్తున్నారు కదా! మ్యూజియమ్‌ కూడా ఇదే విధంగా తయారు చేయండి అని బాబా అన్నారు కదా. స్వర్గము మాడల్‌ను ఫస్ట్‌క్లాస్‌గా తయారు చేయాలి. ఇప్పుడు మన రాజధానిని స్థాపిస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఇంతకు ముందు ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు అన్నీ తెలుసుకుంటున్నారు. మనము అందరిలో ఏముందో తెలుసుకుంటామని కాదు. కొంతమంది వికారులు కూడా వచ్చేవారు. ఎందుకు వస్తున్నారు? అని వారిని అడిగేతే, మేము వస్తేనే కదా, వికారాల నుండి విముక్తులౌతాము. మేము చాలా పాపాత్ములమని అనేవారు. అచ్ఛా! కళ్యాణము జరుగుగాక అని బాబా అంటారు. మాయ చాలా శక్తివంతమైనది. పిల్లలూ! మీరు ఈ వికారాల పై విజయాన్ని పొందాలి. అప్పుడే జగత్‌జీతులుగా అవుతారని బాబా అంటారు. మాయ కూడా తక్కువైనదేమీ కాదు. ఇప్పుడు మీరు పురుషార్థము చేసి ఈ లక్ష్మీనారాయణుల వలె అవుతారు. వీరి వంటి సౌందర్యము ఇంకెవ్వరికీ ఉండదు. వీరిది సహజ సౌందర్యము. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత స్వర్గ స్థాపన జరుగుతుంది. మళ్లీ 84 జన్మల చక్రములోకి వస్తారు. ఇది యూనివర్శిటీ కమ్‌ ఆసుపత్రి అని మీరు వ్రాయవచ్చు. అదేమో ఆరోగ్యము కొరకు, ఇదేమో సంపద కొరకు. మీరు వచ్చి 21 జన్మల వరకు ఆరోగ్యము, సంపద, సంతోషాలను పొందండి అని వ్రాయండి. వ్యాపారస్థులు కూడా తమ బోర్డును పెట్టుకుంటారు. ఇళ్ళలో కూడా బోర్డు పెడ్తారు. ఎవరైతే నషాలో ఉంటారో వారు ఆ విధంగా వ్రాస్తారు. ఎవరు వచ్చినా వారికి - మీరు అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకొని ఉండినారు. తర్వాత 84 జన్మలను తీసుకొని పతితులైపోయారు. కావున ఇప్పుడు పావనంగా అవ్వండి అని అర్థము చేయించండి. స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి. ఈ బాబా కూడా అలాగే చేస్తారు. వీరు నంబర్‌వన్‌ పురుషార్థీ. బాబా! తుఫానులు వస్తున్నాయని చాలామంది పిల్లలు వ్రాస్తారు. అవి రానే వస్తాయి. అన్ని రకాలైన తుఫానులు మొదట నా వద్దకు వస్తాయి. నేను మొదట అనుభవీగా అయితేనే ఇతరులకు అర్థము చేయించగలను కదా! అని నేను వ్రాస్తాను. ఇదంతా మాయ చేసే పని.

ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన ప్రియమైన పిల్లలూ! ఇప్పుడు మీ పై బృహస్పతి దశ ఉంది. మీరు ఎవ్వరికీ మీ జాతకాలు మొదలైన వాటిని చూపించవలసిన అవసరము లేదు. బాబా అన్ని విషయాలు తెలుపుతారు. అక్కడ ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. కృష్ణుడిని కూడా యోగేశ్వరుడని అంటారు. వారికి యోగేశ్వరుడు యోగమును నేర్పించారు. అందుకే వారిలా తయారయ్యారు. ఏ మనుష్య మాత్రులను, సన్యాసులు మొదలైనవారిని యోగేశ్వరుడు అని అనడానికి వీలు లేదు. మీకు ఈశ్వరుడు యోగము నేర్పిస్తారు కనుక యోగేశ్వర-యోగేశ్వరి అని పేర్లు ఉంచారు. ఈ సమయములో జ్ఞానేశ్వర-జ్ఞానేశ్వరీలు కూడా మీరే తర్వాత వెళ్లి రాజ-రాజేశ్వరీలుగా కూడా మీరే అవుతారు. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. మీ లక్ష్యము, ఉద్ధేశ్యాలను ముందుంచుకొని పురుషార్థము చేయండి. లక్ష్మీనారాయణుల చిత్రాన్ని మీ ముందుంచుకుని చూస్తూ ఓహో బాబా! మీరు మమ్ములను ఈ విధంగా తయారు చేస్తున్నారు! ఇప్పుడు మా పైన బృహస్పతి దశ ఉంది అని అంటూ మీతో మీరు మాట్లాడుకోండి.

2. మీ సమానంగా తయారు చేసేందుకు భ్రమరము వలె జ్ఞానమును భూ - భూ చేయండి. ఈశ్వరీయ సేవాధారులుగా అయ్యి స్వర్గ స్థాపనలో తండ్రికి సహాయము చేయండి.

వరదానము :-

''దేహాభిమానాన్ని దేహి-అభిమాని స్థితిలోకి పరివర్తన చేసే అనంతమైన(బేహద్‌) వైరాగీ భవ''

నడుస్తూ, తిరుగుతూ వైరాగ్యము ఖండితమయ్యిందంటే అందుకు కారణం - దేహ భావము. ఎంతవరకు దేహ భావము పై వైరాగ్యము లేదో అంతవరకు ఏ విషయం పైనా సదాకాలానికి వైరాగ్యముండజాలదు. సంబంధాల పై వైరాగ్యము కలగడం ఏమంత పెద్ద విషయం కాదు. ప్రపంచములోని వారిలో కూడా చాలామందికి ఈ వైరాగ్యము వచ్చేస్తుంది. కాని ఇక్కడ దేహ భావము వలన కలిగే రకరకాల ఆకర్షణల గురించి తెలుసుకొని దేహ భావమును, దేహి-అభిమాని స్థితిలోకి పరివర్తన చేయాలి. ఇదే బేహద్‌ వైరాగిగా అయ్యే విధి.

స్లోగన్‌ :-

''సంకల్పమనే పాదము దృఢంగా ఉంటే నల్లని మేఘాల వంటి విషయాలు కూడా పరివర్తనైపోతాయి.''

బ్రహ్మబాబా సమానంగా అయ్యేందుకు విశేషమైన పురుషార్థము

ఈ జన్మలోని లెక్కాచారము గాని, వెనుకటి జన్మల లెక్కాచారము గాని లగ్నమనే అగ్ని స్వరూప స్థితి లేకుండా భస్మమవ్వదు. ఇప్పుడు బ్రహ్మాబాబా సమానంగా సదా అగ్ని స్వరూప శక్తిశాలి స్మృతి శక్తి, బీజరూప స్థితి, లైట్‌హౌస్‌, మైట్‌హౌస్‌ స్థితి పై విశేషమైన గమనముంచి(అటెన్షన్‌ ఉంచి) అన్ని లెక్కాచారాలను భస్మము చేయండి.