04-02-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - అంతర్ముఖులుగా అయ్యి స్వ కళ్యాణము చేసుకోవాలనే ఆలోచన ఉంచుకోండి, విహారానికి(వాకింగ్కు) వెళ్లినప్పుడు ఏకాంతములో విచార సాగర మథనము చేయండి, నేను సదా హర్షితంగా ఉంటున్నానా? - అని స్వయాన్ని ప్రశ్నించుకోండి''
ప్రశ్న :-
దయాహృదయులైన తండ్రికి పిల్లలైన మీరు మీ పై ఏ దయను చూపుకోవాలి ?
జవాబు :-
నా పిల్లలు ముళ్ల నుండి పుష్పాలుగా తయారవ్వాలని తండ్రికి ఏ విధంగా దయ కలుగుతుందో, పిల్లలను సుందరమైన పుష్పాలుగా తయారు చేసేందుకు తండ్రి ఎంత శ్రమ చేస్తున్నారో అలా పిల్లలు కూడా స్వయం పై దయ చూపుకోవాలి - ఓ పతితపావనా! రండి, వచ్చి మమ్ములను పుష్పాలుగా తయారుచేయండి అని పిలిచాము. ఇప్పుడు వారు వచ్చారు, మరి మనం పుష్పాలుగా అవ్వమా? అని పిల్లలకు స్వయం పై దయ కలిగినట్లయితే వారు దేహీ-అభిమానులుగా ఉండాలి. తండ్రి వినిపించే దానిని ధారణ చేయాలి.
ఓంశాంతి.
వీరు తండ్రి, టీచరు, సద్గురువు కూడా అని పిల్లలు అర్థము చేసుకున్నారు. తండ్రి పిల్లలను ప్రశ్నిస్తారు - పిల్లలైన మీరు ఇక్కడకు వచ్చినప్పుడు ఈ లక్ష్మీనారాయణుల చిత్రము, మెట్ల చిత్రాలను చూస్తున్నారా? ఈ రెండింటిని చూడగానే లక్ష్యము - ఉద్ధేశ్యము మరియు మేము దేవతలుగా తయారై మళ్లీ ఈ విధంగా మెట్లు దిగుతూ వచ్చామని సంపూర్ణ చక్రము బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఈ జ్ఞానము పిల్లలైన మీకు మాత్రమే లభిస్తుంది. మీరు విద్యార్థులు, లక్ష్యము - ఉద్ధేశ్యము మీ ఎదురుగా ఉంది. ఇది లక్ష్యము - ఉద్ధేశ్యమని, ఎవరైనా వస్తే వారికి అర్థము చేయించండి. ఈ చదువు ద్వారా ఈ దేవీ దేవతలుగా తయారౌతారు, మళ్లీ 84 జన్మల మెట్లు క్రిందకు దిగుతారు, మళ్లీ పునరావృతము (రిపీట్) చేయాలని చెప్పండి. ఇది చాలా సహజమైన జ్ఞానము అని వచ్చిన వారికి తెలియజేయండి. అయినా చదువుతూ చదువుతూ ఎందుకు ఫెయిల్ అవుతారు? ఆ శారీరిక చదువు కంటే ఈ ఈశ్వరీయ చదువు చాలా సులభము. 84 జన్మల చక్రము, లక్ష్యము - ఉద్ధేశ్యము స్పష్టంగా ఎదురుగానే ఉంది. ఈ రెండు చిత్రాలు విజిటింగ్ రూంలో కూడా ఉండాలి. సేవ చేసేందుకు సేవాసాధనాలు కూడా అవసరము. జ్ఞానమంతా ఈ చిత్రాలలోనే ఉంది. ఈ పురుషార్థము కూడా మనము ఇప్పుడే చేస్తాము. సతోప్రధానంగా అయ్యేందుకు చాలా శ్రమ చేయాలి. ఈ జ్ఞాన మార్గములో అంతర్ముఖులుగా అయ్యి విచార సాగర మథనము చేయాలి. విహరించేందుకు(వాకింగ్కు) వెళ్లినప్పుడు కూడా బుద్ధిలో ఇదే ఉండాలి. నెంబరువారుగా ఉన్నారని బాబాకు తెలుసు. బాగా అర్థము చేసుకున్నవారు గ్రహించినవారు తమ కళ్యాణార్థము తప్పకుండా పురుషార్థము చేస్తూ ఉంటారు. బాగా చదివేవారిని చూసి వీరు బాగా చదువుతారని ప్రతి విద్యార్థి అర్థము చేసుకుంటాడు. స్వయం చదవకపోతే అది మిమ్ములనే నష్టపరుస్తుంది. స్వయాన్ని కొంతైనా యోగ్యులుగా తయారు చేసుకోవాలి. మీరు కూడా విద్యార్థులే. అది కూడా అనంతమైన తండ్రికి. ఈ బ్రహ్మ కూడా చదువుకుంటారు. ఈ లక్ష్మీనారాయణులంటే పదవి. ఇక మెట్ల చిత్రము అనగా 84 జన్మల చక్రము. ఈ శ్రీ కృష్ణుడు మొదటి నెంబరు జన్మ, బ్రహ్మ చివరి నెంబరు జన్మ. మీరు దేవతలుగా అవుతారు. ఎవరైనా లోపలికి రావటంతోనే వారికి లక్ష్యము - ఉద్ధేశ్యము, మెట్ల చిత్రము పై అర్థము చేయించండి. ప్రతి రోజూ వెళ్లి ఈ చిత్రాల ముందు కూర్చుంటే స్మృతిలోకి వస్తుంది. అనంతమైన తండ్రి మనకు అర్థము చేయిస్తున్నారని మీ బుద్ధిలో ఉంది. సంపూర్ణ చక్ర జ్ఞానము మీ బుద్ధిలో సంపన్నంగా ఉన్నట్లైతే మీరు ఎంతో హర్షితంగా ఉండాలి! మాలో ఆ అవస్థ ఎందుకు ఉండడం లేదు? మేము హర్షితముగా ఉండేందుకు ఏ ఆటంకము కలుగుతూ ఉంది? దీనికి కారణమేమిటి? అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. చిత్రాలను తయారు చేసేవారి బుద్ధిలో కూడా ఇది మా భవిష్య పదవి. ఇది మా లక్ష్యము-ఉద్ధేశ్యము మరియు ఇది 84 జన్మల చక్రమని ఉంటుంది. సహజ రాజయోగము అనే మహిమ కూడా ఉంది. ఈ విధంగా బాబా రోజూ అర్థం చేయిస్తూ ఉంటారు - బేహద్ తండ్రికి పిల్లలైనారంటే స్వర్గ వారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలి మరియు సంపూర్ణ చక్ర రహస్యాన్ని కూడా అర్థం చేయించారు కనుక తప్పకుండా దానిని కూడా స్మృతి చేయాల్సి వస్తుంది. అంతేకాక మాట తీరు(మాట్లాడే ధోరణి) కూడా బాగుండాలి. నడవడిక చాలా బాగుండాలి. నడుస్తూ - తిరుగుతూ, కార్యవ్యవహారాలు చేస్తూ బుద్ధిలో కేవలం మేము చదువుకునేందుకు తండ్రి వద్దకు వచ్చామని మాత్రమే ఉండాలి. ఈ జ్ఞానమునే మీరు జతలో తీసుకెళ్లాలి. చదువైతే సులభము, అయితే పూర్తిగా చదువుకోకుంటే - క్లాసులో మంద బుద్ధి గల విద్యార్థులుంటే తనకు చెడ్డ పేరు వస్తుందని, పదోన్నతి(ఇజాఫా) కలుగదని, ప్రభుత్వము ఏమీ ఇవ్వదని టీచరుకు తప్పకుండా ఆలోచన వస్తుంది. ఇది కూడా పాఠశాల కదా! ఇందులో పదోన్నతి మొదలైన వాటి మాటే లేదు. అయినా పురుషార్థము చేయించబడ్తుంది కదా! నడవడికను సరి చేసుకోండి, దైవీ గుణాలను ధారణ చేయండి. నైతిక స్వభావము(క్యారెక్టరు) బాగుండాలి. తండ్రి మీ కళ్యాణార్థమై వచ్చారు కాని తండ్రి శ్రీమతానుసారము నడవలేరు. ఫలానా చోటికి వెళ్లండి అని శ్రీమతము లభించినా వెళ్లరు. అక్కడ చలి ఉంటుంది, ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుందని,...... చెప్తారు. ఈ ఆజ్ఞ ఎవరిస్తున్నారో అనగా తండ్రిని గుర్తించనే గుర్తించరు. ఈ సాధారణ రథమే బుద్ధిలోకి వస్తుంది. ఆ తండ్రి(శివబాబా) బుద్ధిలోకి రానే రారు. పెద్ద రాజులంటే అందరికీ చాలా భయము ఉంటుంది. వారి వద్ద గొప్ప అధికారము ఉంటుంది. ఇక్కడైతే నేను పేదలపెన్నిధినని తండ్రి చెప్తున్నారు. రచయిత అయిన నన్ను మరియు రచనల ఆది-మధ్య-అంతములను గురించి ఎవ్వరికీి తెలియదు. లెక్కలేనంత మంది మనుష్యులున్నారు. ఎటువంటి విషయాలనో మాట్లాడుతుంటారు. ఏమేమో మాట్లాడుతుంటారు. భగవంతుడంటే ఎవరో కూడా తెలియదు. విచిత్రము కదా! నేను సాధారణ తనువులో వచ్చి నా పరిచయము మరియు రచనల ఆది-మధ్య-అంతముల పరిచయమునిస్తానని తండ్రి చెప్తున్నారు. 84 జన్మల ఈ మెట్ల చిత్రము ఎంతో స్పష్టంగా ఉంది!
నేను మిమ్ములను ఇలా(లక్ష్మినారాయణులుగా) తయారుచేశాను. మళ్లీ ఇప్పుడు తయారు చేస్తున్నానని తండ్రి చెప్తున్నారు. మీరు పారసబుద్ధి గలవారిగా ఉండేవారు, మళ్లీ మిమ్ములను రాతిబుద్ధి గలవారిగా ఎవరు చేశారు? అర్ధకల్పము రావణరాజ్యములో మీరు దిగజారుతూనే వస్తారు. ఇప్పుడు మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా తప్పకుండా అవ్వాలి. తండ్రి అంటే సత్యం. వారు సత్యమునే తెలిపిస్తారని వివేకము కూడా చెప్తుంది. ఈ బ్రహ్మ కూడా చదువుకుంటారు. మీరు కూడా చదువుతారు. నేను కూడా విద్యార్థినేనని, చదువు పట్ల గమనముంచుకుంటానని ఈ బ్రహ్మ కూడా చెప్తారు. ఖచ్ఛితమైన కర్మాతీత అవస్థ ఇప్పుడింకా తయారవ్వలేదు. ఇంత ఉన్నతమైన పదవిని పొందేందుకు చదువు పట్ల గమనముంచకుండా ఎవరు ఉంటారు? ఇలాంటి ఉన్నతమైన పదవిని తప్పకుండా పొందాలని అందరూ అంటారు. తండ్రికి పిల్లలుగా అయ్యామంటే తప్పకుండా యజమానులుగా అవ్వాలి. చదువులో హెచ్చు-తగ్గులు ఉండనే ఉంటాయి. ఇప్పుడు మీకు జ్ఞాన సారమంతా పూర్తిగా లభించింది. ప్రారంభములో పాత జ్ఞానమే ఉండేది. నెమ్మది-నెమ్మదిగా మీరు అర్థం చేసుకుంటూ వచ్చారు. జ్ఞానమైతే నిజంగా ఇప్పుడు మాకు లభిస్తోందని మీరు భావిస్తారు. ఈ రోజు నేను మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తానని తండ్రి కూడా చెప్తారు. తక్షణమే జీవన్ముక్తిని ఎవ్వరూ పొందలేరు. జ్ఞానాన్నంతా ఒకేసారి తీసుకోలేరు. ఇంతకుముందు ఈ మెట్ల చిత్రము ఉండేదే కాదు. తప్పకుండా మేము ఈ విధమైన చక్రమును తిరిగి వస్తామని, మనమే స్వదర్శన చక్రధారులమని ఇప్పుడు మీరు అర్థము చేసుకున్నారు. బాబా ఆత్మలమైన మనకు చక్ర రహస్యాన్నంతా అర్థం చేయించారు. మీ ధర్మము చాలా సుఖమును ఇచ్చేదని తండ్రి చెప్తారు. తండ్రియే వచ్చి మిమ్ములను స్వర్గానికి యజమానులుగా చేస్తారు. మృత్యువు ఎదురుగా నిలిచి ఉన్న ఈ సమయములో మిగిలిన వారికి సుఖపు పాత్రను అభినయించే సమయము వచ్చింది. ఈ విమానాలు, కరెంటు మొదలైనవి ఇంతకుముందు లేవు. వారి కొరకైతే ఇప్పుడే స్వర్గము వలె ఉంది. ఎంతో గొప్ప-గొప్ప భవనాలను నిర్మిస్తారు. ఇప్పుడు మాకెంతో సుఖముందని వారు భావిస్తారు. ఇక్కడి నుండి చాలా త్వరగా(విమానము ద్వారా) లండనుకు చేరిపోతారు. దీనినే స్వర్గమని భావిస్తారు. కలియుగమంటే స్వర్గము కాదని, సత్యయుగాన్నే స్వర్గమంటారని వారికి ఎవరైనా అర్థం చేయించినప్పుడే కదా తెలుసుకునేది. నరకములో శరీరాన్ని వదిలినట్లయితే పునర్జన్మ కూడా తప్పకుండా నరకములోనే తీసుకుంటారు కదా. ఇంతకుముందు ఈ విషయాలను మీరు కూడా అర్థం చేసుకునేవారు కాదు. ఇప్పుడు అర్థం చేసుకున్నారు. రావణరాజ్యము వచ్చినట్లైతే మనము క్రింద పడడం మొదలవుతుంది. వికారాలన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు జ్ఞానము పూర్తిగా లభించిందంటే మీ నడవడిక మొదలైనవి కూడా చాలా రాయల్గా ఉండాలి. ఇప్పుడు మీరు సత్యయుగములోని వారికంటే ఎక్కువ విలువైనవారు. జ్ఞానసాగరులైన తండ్రి జ్ఞానమునంతా ఇప్పుడే ఇస్తారు. భక్తి మరియు జ్ఞానాలను గురించి ఇతర మనుష్యులెవ్వరూ అర్థం చేసుకోలేరు. కలగాపులగం చేసేశారు. శాస్త్రాలను చదవడం జ్ఞానమని, పూజలు చేయడం భక్తి అని భావిస్తారు. ఇప్పుడు సుందరమైన పుష్పాలుగా చేసేందుకు బాబా ఎంతగా శ్రమ చేస్తున్నారు. బాబా! మీరు వచ్చి పతితులమైన మమ్ములను పావనంగా, పుష్పాలుగా తయారు చేయమని బాబాను పిలిచామని పిల్లలకు కూడా జాలి కలగాలి. ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక మీరు మీ పై కూడా దయ చూపించుకోవాలి. మనము ఈ విధమైన పుష్పాలుగా తయారవ్వలేమా! అని ఇప్పుడు స్వయము పై కూడా దయ చూపుకోవాలి. ఇప్పటివరకు మనము బాబా హృదయ సింహాసనము పై ఎందుకు ఎక్కలేదు! గమనముంచరు. తండ్రి ఎంత దయాహృదయులు! పతిత ప్రపంచములోకి వచ్చి పావనంగా తయారు చేయమనే తండ్రిని పిలుస్తారు. కనుక ఎలాగైతే తండ్రికి దయ కలుగుతుందో, అలా పిల్లలకు కూడా దయ కలగాలి. అలా కానిచో సద్గురువును నిందింపజేసేవారిగా అయ్యి నిలువ స్థానమును పొందుకోలేరు. సద్గురువు ఎవరో ఎవ్వరికీ స్వప్నములో కూడా ఉండదు. ఎక్కడ గురువులు శాపమునిస్తారో, మా పై ఎక్కడ అకృప అయిపోతుందోనని ఆ గురువులను గురించి ప్రజలు భయపడ్తారు. పిల్లలు పుట్టారంటే అది గురువు కృప అని భావిస్తారు. ఇవన్నీ అల్పకాలిక సుఖమునిచ్చే విషయాలు. పిల్లలూ! మీరు స్వయం పై దయ చూపుకోమని తండ్రి చెప్తున్నారు. దేహీ-అభిమానులుగా అయితే ధారణ కూడా జరుగుతుంది. సర్వస్వమూ ఆత్మయే చేస్తుంది. నేను కూడా ఆత్మలనే చదివిస్తాను. స్వయాన్ని ఆత్మ అని దృఢంగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేయకుంటే వికర్మలు వినాశనమెలా అవుతాయి? ఓ భగవంతుడా! దయ చూపమని భక్తిమార్గములో కూడా స్మృతి చేస్తారు. తండ్రి ముక్తిదాత(లిబరేటర్) మరియు మార్గదర్శకుడు(గైడ్) కూడా....... ఇది కూడా వారి గుప్త మహిమ. భక్తిమార్గములో మీరు గుర్తు చేసుకునేవారని తండ్రియే వచ్చి అన్ని విషయాలు తెలియజేస్తారు. నేను తప్పకుండా నా సమయానుసారంగానే వస్తాను. అంతేగాని ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రాలేను. నాటకములో నిశ్చితమై ఉన్నప్పుడే నేను వస్తాను. మిగిలిన సమయములో నాకు రావాలనే ఆలోచన కూడా రాదు. మిమ్ములను చదివించేది ఆ తండ్రియే. ఈ బ్రహ్మ కూడా వారి నుండే చదువుతారు. వారు ఎప్పుడూ ఏ పొరపాటు చేయరు. ఎవ్వరినీ దు:ఖపెట్టరు. మిగిలినవారంతా నెంబరువారుగా ఉన్న టీచర్లు. ఆ సత్యమైన తండ్రి మీకు సత్యమునే నేర్పిస్తారు. సత్యమైనవారి పిల్లలు కూడా సత్యమైనవారే. ఆ తర్వాత అసత్యమైనవారి పిల్లలుగా అవ్వడం నుండి అర్ధకల్పము అసత్యమైనవారిగా అవుతారు. సత్యమైన తండ్రినే మర్చిపోతారు.
ఇది సత్యయుగ నూతన ప్రపంచమా లేక కలియుగ పురాతన ప్రపంచమా? అను విషయం గురించి మొట్టమొదట అర్థము చేయించండి. అప్పుడు వీరు చాలామంచి ప్రశ్న వేశారని మనుష్యులు భావిస్తారు. ఈ సమయములో పంచ వికారాలు అందరిలో ప్రవేశించి ఉన్నాయి, అక్కడ 5 వికారాలు ఉండనే ఉండవు. నిజానికి ఇవి అర్థము చేసుకునేందుకు చాలా సులభమైన విషయాలే. స్వయం మీరే అర్థము చేసుకోకుంటే ఇక ప్రదర్శనీలో ఇతరులకు ఏమి అర్థము చేయించగలరు? సర్వీసు చేసేందుకు బదులు ఇంకా డిస్-సర్వీసు చేసి వస్తారు. బయటకు వెళ్లి సర్వీసు చేయడం పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులభమేమీ కాదు. చాలా వివేకము అవసరము. బాబా ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా తెలుసుకోగలరు. తండ్రి అయితే తండ్రే కాని ఇదే నాటకములో ఉంది అని తండ్రి కూడా చెప్తారు. ఎవరైనా వస్తే వారికి బ్రహ్మకుమారీలు అర్థం చేయించడం బాగుంటుంది. పేరు కూడా బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. బ్రహ్మాకుమారీల పేరే ప్రసిద్ధి చెందవలసి ఉంది. ఈ సమయములో అందరూ 5 వికారాలకు అలవాటుపడి ఉన్నారు. వెళ్లి వారికి అర్థం చేయించడం చాలా కష్టమవుతుంది. ఏ మాత్రమూ అర్థము చేసుకోరు. కేవలం జ్ఞానము బాగుందని మాత్రమే అంటారు. స్వయం అర్థం చేసుకోరు. విఘ్నాలు వస్తూనే ఉంటాయి. అప్పుడు యుక్తులను రచించవలసి వస్తుంది. పోలీసులను కాపలా ఉంచండి. చిత్రాలను ఇన్ష్యూర్(భీమా) చేయించండి. ఇది యజ్ఞము ఇందులో తప్పకుండా విఘ్నాలు కలుగుతాయి. మొత్తం పాత ప్రపంచమంతా ఇందులో స్వాహా అవ్వవలసి ఉంది. అలా కానిచో యజ్ఞమనే పేరు ఎందుకు వచ్చింది, యజ్ఞములో స్వాహా అవ్వాలి. దీనికి రుద్ర జ్ఞానమనే పేరు వచ్చింది. జ్ఞానాన్ని చదువు అని కూడా అంటారు. ఇది పాఠశాల కూడా అయ్యింది, యజ్ఞము కూడా అయ్యింది. మీరు పాఠశాలలో చదువుకొని దేవతలుగా అవుతారు. మళ్లీ ఇదంతా ఈ యజ్ఞములో స్వాహా అయిపోతుంది. ఎవరైతే రోజూ అభ్యాసము చేస్తూ ఉంటారో వారే అర్థం చేయించగలరు. ఒకవేళ అభ్యాసము లేకుంటే వారు ఏమి మాట్లాడగలరు? ప్రపంచములోని వారి కొరకు స్వర్గము ఇప్పుడే అల్పకాలము కొరకు ఉంది. మీ కొరకు స్వర్గము అర్ధకల్పము పాటు ఉంటుంది. ఇది కూడా డ్రామాలో తయారై ఉంది. విచారము చేసినట్లైతే చాలా అద్భుతమనిపిస్తుంది. ఇప్పుడు రావణ రాజ్యము సమాప్తమై రామరాజ్యము స్థాపనౌతుంది. ఇందులో యుద్ధము మొదలైన విషయాలేవీ లేవు. ఈ మెట్ల చిత్రమును చూసి ప్రజలు చాలా ఆశ్చర్యపడ్తారు. తండ్రి ఏమేమి అర్థం చేయించారో వాటన్నిటినీ ఈ బ్రహ్మ కూడా తండ్రి నుండే నేర్చుకున్నారు. దానిని ఇతరులకు అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలు కూడా అర్థం చేయిస్తారు. ఎవరైతే చాలామందికి కళ్యాణము చేస్తారో వారికి తప్పకుండా ఎక్కువ ఫలము లభిస్తుంది. చదువుకున్నవారి ముందు చదువుకోనివారు తప్పకుండా సేవ చేస్తారు. స్వ కళ్యాణము చేసుకోమని తండ్రి ప్రతిరోజూ అర్థం చేయిస్తారు. ఈ చిత్రాలను ఎదురుగా ఉంచుకుంటూనే నషా ఎక్కుతుంది. అందువల్లనే బాబా గదిలో ఈ చిత్రాలను ఉంచుకున్నారు. లక్ష్యము-ఉద్ధేశ్యము ఎంత సహజంగా ఉంది! ఇందులో నైతిక స్వభావము చాలా బాగుండాలి. హృదయము స్వచ్ఛంగా ఉంటే సర్వమనోకామనలు నెరవేరుతాయి. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మేము అనంతమైన తండ్రికి విద్యార్థులమని భగవంతుడే మమ్ములను చదివిస్తున్నారని అందువలన బాగా చదువుకొని తండ్రి పేరును ప్రసిద్ధము చేయాలని సదా స్మృతిలో ఉంచుకోవాలి. మీ నడవడికలను చాలా శ్రేష్ఠంగా(రాయల్గా) ఉంచుకోవాలి.
2. తండ్రి సమానంగా దయాహృదయులుగా అయ్యి ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవ్వాలి, ఇతరులను కూడా పుష్పాలుగా తయారు చేయాలి. అంతర్ముఖులుగా అయ్యి స్వ మరియు ఇతరుల కళ్యాణమును గురించి చింతన చేయాలి.
వరదానము :-
''వికారాలనే విష సర్పాలను కంఠహారాలుగా చేసుకునే శంకరుని సమానమైన తపస్వీమూర్త్ భవ''
పంచవికారాలు ఏవైతే జనులకు విషసర్పాలుగా ఉన్నాయో అవి యోగీ లేక ప్రయోగీ ఆత్మలైన మీకు కంఠహారంగా అవుతాయి. ఇది బ్రాహ్మణులైన మీ తపస్వీ రూపానికి లేక బ్రహ్మాబాబా అశరీరి తపస్వీ శంకర స్వరూపానికి స్మృతి చిహ్నంగా, ఈ రోజుకు కూడా పూజింపబడ్తోంది. రెండవది - ఈ పాములు సంతోషంగా నాట్యము చేసే స్టేజిగా అవుతాయి - ఈ స్థితిని స్టేజి రూపములో చూపిస్తారు. కనుక ఎప్పుడైతే వికారాల పై ఇటువంటి విజయము పొందుతారో అప్పుడు మిమ్ములను తపస్వీ మూర్తులని, ప్రయోగీ ఆత్మలని అంటారు.
స్లోగన్ :-
''ఎవరి స్వభావము మధురంగా, శాంతచిత్తంగా ఉంటుందో వారి పై క్రోధమనే భూతము దాడి చేయలేదు''