16-02-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - ఉన్నత పదవిని పొందేందుకు మీకు తండ్రి ఏదైతే చదివిస్తున్నారో, ఆ చదువును ఉన్నది ఉన్నట్లుగా(యథాతథంగా) ధారణ చేయండి. సదా శ్రీమతమును అనుసరిస్తూ ఉండండి.''
ప్రశ్న :-
ఎప్పుడూ దు:ఖము కలగకుండా ఉండేందుకు ఏ విషయము పై బాగా చింతన చేయాలి?
జవాబు :-
ప్రతి ఆత్మ ఏ పాత్రను అభినయిస్తూ ఉందో అది డ్రామాలో ఖచ్ఛితంగా నిశ్చితమై ఉంది. ఇది అనాది, అవినాశి నాటకము. ఈ విషయమును గురించి ఆలోచించినట్లైతే, ఎప్పుడూ దు:ఖితులుగా అవ్వజాలరు. డ్రామా ఆది-మధ్య-అంత్యములను రియలైజ్ చేయరో వారికి దు:ఖము కలుగుతుంది. పిల్లలైన మీరు ఈ నాటకమును ఉన్నది ఉన్నట్లుగా సాక్షిగా చూడాలి. ఇందులో విలపించే, అలిగే విషయమేదీ లేదు.
ఓంశాంతి.
ఆత్మ చాలా సూక్ష్మమైనదని ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. ఆత్మ అత్యంత సూక్ష్మమైనది. ఆత్మతో పోల్చినప్పుడు శరీరము ఎంతో పెద్దదిగా కనిపిస్తుంది. చిన్నదైన ఆత్మ శరీరము నుండి వేరైపోతే శరీరము ఇక దేనినీ చూడలేదు. ఆత్మను గురించి ఆలోచించవలసి ఉంటుంది. ఇంత చిన్నదైన బిందువు ఏ ఏ పనులను చేస్తుంది! మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్(భూతద్దాలు) ద్వారా అత్యంత చిన్నవైన వజ్రాలను చూస్తారు. వాటిలో ఏ విధమైన మచ్చ లేదు కదా అని గమనిస్తారు. అలాగే ఆత్మ కూడా చాలా సూక్ష్మమైనది. ఆత్మను చూచేందుకు ఏ భూతద్దము కావాలి! ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఏ సంబంధముంది? ఈ కళ్ళకు భూమి, ఆకాశాలు ఎంతో పెద్దవిగా కనిపిస్తాయి. బిందువు వెలుపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఏమీ ఉండదు(కనిపించదు). ఎలాగైతే బిందువైన తండ్రి ఉన్నారో, ఆత్మ బిందువు కూడా అలాగే ఉంటుంది. ఇంత సూక్ష్మమైన ఆత్మ పవిత్రంగా, అపవిత్రంగా అవుతుంది. ఇవన్నీ చాలా విచార సాగర మథనము చేయవలసిన విషయాలు. ఆత్మ అంటే ఏమిటో, పరమాత్మ అంటే ఎవరో ఈ విషయాలు ఇంకెవ్వరికీ తెలియదు. ఇంత చిన్న ఆత్మ శరీరములో ఉండి ఏమేం చేస్తుందో గమనించండి. ఆ ఆత్మలో 84 జన్మల సంపూర్ణ పాత్ర నిండి ఉంది. అది ఏ విధంగా పని చేస్తుంది. అద్భుతము! ఇంత చిన్న బిందువులో 84 జన్మల పాత్ర నిశ్చితమై ఉంది. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. నెహ్రూ మరణించాడు, క్రీస్తు మరణించాడు అంటే ఆత్మ వెళ్ళిపోయింది కనుక శరీరము మరణించింది. శరీరము ఎంత పెద్దది! ఆత్మ ఎంత చిన్నది! ఈ సృష్టి చక్రము ప్రతి 5 వేల సంవత్సరముల తర్వాత పునరావృతమవుతుందని కూడా బాబా చాలా సార్లు అర్థం చేయించారు. ఫలానావారు మరణించారు. ఇది క్రొత్త విషయమేమీ కాదు. అతని ఆత్మ ఈ శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంది. 5 వేల సంవత్సరాల క్రితం కూడా ఈ నామ-రూపాలను ఇదే సమయములోనే వదిలింది. తాను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరములో ప్రవేశిస్తానని ఆత్మకు తెలుసు.
ఇప్పుడు మీరు శివజయంతిని జరుపుకుంటారు. 5 వేల సంవత్సరాల క్రితం కూడా శివజయంతిని జరుపుకున్నామని చూపిస్తారు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత శివజయంతి ఏదైతే వజ్ర తుల్యమైనదో దానిని ఆచరిస్తూనే వచ్చారు. ఇవి యదార్థమైన విషయాలు. విచార సాగర మథనము చేయవలసి ఉంటుంది. అప్పుడే ఇతరులకు అర్థం చేయించగలరు. ఈ పండుగలు జరుగుతాయి. ఇదేమీ కొత్త విషయము కాదు, చరిత్ర పునరావృతమవుతుందని మీరంటారు. ప్రతి పాత్రధారి 5 వేల సంవత్సరాల తర్వాత మళ్లీ అదే శరీరాన్ని తీసుకుంటుంది. ఒక నామ-రూప-దేశ-కాలములను వదలి మరొకదానిని తీసుకుంటుంది. మనుష్యులు అద్భుతమని ఆశ్చర్యపోయే విధంగా విచార సాగర మథనము చేసి వ్రాయాలి. ఇంతకు ముందు ఎప్పుడైనా కలిశారా? అని పిల్లలతో బాబా అడుగుతారు కదా! ఇంత చిన్నదైన ఆత్మనే ప్రశ్నించడం జరుగుతుంది. మీరు ఈ నామ-రూపాలతో ఇంతకుముందు ఎప్పుడు కలిశారు? ఆత్మ వింటుంది. అవును బాబా! మేము మీతో కల్పక్రితము కలిశామని చాలామంది అంటారు. మొత్తం డ్రామా గురించిన సంపూర్ణ జ్ఞానము బుద్ధిలో ఉంది. వారు హద్దు నాటకములోని పాత్రధారులు. ఇది అనంతమైన నాటకము. ఈ నాటకము చాలా ఖచ్ఛితమైనది. ఇందులో కొద్దిగా కూడా వ్యతాసము ఉండజాలదు. ఆ సినిమాలు హద్దులోనివి. యంత్రము (మెషీన్) ఆధారంగా నడుస్తాయి. అందులో రెండు - నాలుగు రీళ్లు ఉంటాయి. అవి తిరుగుతూ ఉంటాయి. కాని ఇది అనాది అవినాశీ ఒకే అనంతమైన డ్రామా. ఇందులో ఎంత చిన్న ఆత్మ ఒక పాత్రనభినయించి, మళ్లీ మరొక పాత్రను అభినయిస్తుంది. 84 జన్మల ఎంత పెద్ద ఫిల్మ్ రీల్. ఇది ప్రాకృతికము(కుదరత్). ఎవరి బుద్ధిలోనైనా కూర్చుంటుందా! ఇది రికార్డు వంటిది. చాలా అద్భుతము! 84 లక్షలయితే ఉండవు. 84 జన్మల చక్రమే. దీని పరిచయాన్ని ఎలా ఇవ్వాలి! పత్రికల వారికి తెలియజేసినట్లయితే వారు పత్రికలలో ముద్రిస్తారు. మ్యాగజైన్లలో (వారపత్రికలు, మాసపత్రికలు............ మొదలైన వాటిలో) కూడా పదే పదే వేయవచ్చు. మనము ఈ సంగమ సమయములోని ఈ విషయాలనే మాట్లాడ్తాము. సత్యయుగములో ఈ విషయాలు ఉండనే ఉండవు. కలియుగములో కూడా ఉండవు. జంతువులు మొదలైనవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత చూస్తామని చెప్తారు. తేడా ఏమీ ఉండదు. డ్రామాలో అంతా నిశ్చితమై ఉంది. సత్యయుగములో జంతువులు మొదలైనవి కూడా చాలా సుందరంగా ఉంటాయి. ఈ ప్రపంచమంతటి చరిత్ర-భూగోళాలు పునారావృతమౌతాయి. నాటకము షూటింగ్ జరిగినట్లు అవుతుంది. దోమ ఎగిరిందంటే, అది కూడా షూటింగ్ చేయబడ్తుంది. మళ్లీ పునరావృతమవుతుంది. ఇప్పుడు మనము ఈ చిన్న చిన్న విషయాలను గురించి ఆలోచించము. మొదట తండ్రి స్వయంగా చెప్తున్నారు - ''నేను కల్ప-కల్పము సంగమ యుగములో ఈ భాగ్యశాలీ రథములోనే వస్తాను. పరమాత్మ ఏ విధంగా ఇతనిలో వస్తారో ఆత్మ చెప్తుంది. వారు ఎంతో చిన్న బిందువు! కాని వారిని జ్ఞాన సాగరులని అంటారు. ఈ విషయాలను మీలో కూడా ఎవరైతే వివేకవంతులున్నారో వారే అర్థము చేసుకోగలరు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత నేను వస్తానని తండ్రి చెప్తున్నారు. ఇది ఎంత విలువైన చదువు! తండ్రి వద్దనే ఖచ్ఛితమైన(ఆక్యురేట్) జ్ఞానముంది. దానిని పిల్లలకు ఇస్తారు. మిమ్ములను ఎవరైనా అడిగితే మీరు వెంటనే సత్యయుగ ఆయుష్షు 1250 సంవత్సరాలని చెప్తారు. అక్కడ ఒక్కొక్క జన్మకు 150 సంవత్సరాల ఆయుష్షు ఉంటుంది. ఎంత పాత్ర అభినయించబడ్తుంది! బుద్ధిలో చక్రమంతా తిరుగుతుంది. మనము 84 జన్మలు తీసుకుంటాము. సృష్టి అంతా ఈ విధంగా చక్రములో తిరుగుతూనే ఉంటుంది. ఇది అనాది అవినాశీ తయారుచేసి చేయబడిన నాటకము. ఇందులో నూతనంగా ఎడిషన్ (కొత్తగా చేర్చుట) జరగదు. చింతా తాకీ కీజియే జో అన్హోనీ హోయే......................(ఒకవేళ జరగరానిదేదైనా జరిగినా చింతించాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఇది నిశ్చితమై ఉన్న సృష్టి నాటకము. ఏది ఎలా జరగాలని ఉందో, అలాగే జరుగుతుంది) అనే గాయనము కూడా ఉంది. ఏదైతే జరుగుతుందో అది నాటకములో నిశ్చితమై ఉంది. సాక్షిగా ఉండి చూడవలసి ఉంటుంది. ఆ నాటకములో ఎవరిదైనా ఏడ్చే పాత్ర నడుస్తున్నప్పుడు ప్రేక్షకులలో బలహీనంగా ఉండేవారు ఏడ్వడం ప్రారంభిస్తారు. అది నాటకమే కదా. ఇది నిజమైనది. ఇందులో ప్రతి ఆత్మ తన పాత్రను అభినయిస్తుంది. డ్రామా ఎప్పుడూ ఆగిపోదు. ఇందులో ఏడ్చే లేదా అలిగే మాటే లేదు. ఏదీ కొత్త విషయము కాదు. ఎవరైతే నాటకము ఆది, మధ్య, అంత్యములను గురించి తెలుసుకోలేదో వారే దు:ఖపడతారు. ఇది కూడా మీకు తెలుసు. ఈ సమయములో మనము ఈ జ్ఞానముతో ఏ పదవి పొందుతామో చక్రము తిరిగి మళ్లీ అదే పదవిని పొందుతాము. ఇవి చాలా ఆశ్చర్యకరమైన అద్భుతమైన విచార సాగర మథనము చేయవలసిన విషయాలు. ఏ మనుష్యులకూ ఈ విషయాలు తెలియవు. ఋషులు, మునులు కూడా రచయిత - రచనల గురించి తెలియదని అనేవారు. రచయిత ఇంత చిన్న బిందువని వారికేమి తెలుసు! వారే నూతన సృష్టి రచయిత. వారు పిల్లలైన మిమ్ములను చదివిస్తారు. వారు జ్ఞాన సాగరులు. ఈ విషయాలను పిల్లలైన మీరే అర్థం చేయిస్తారు. మాకు తెలియదని మీరు అనరు. ఈ సమయములో తండ్రి మీకు అన్నీ అర్థం చేయిస్తారు.
మీరు ఏ విషయములోనూ దు:ఖపడుట లేదా పశ్చాత్తాపపడే అవసరము లేదు. సదా హర్షితంగా ఉండాలి. ఆ డ్రామా ఫిల్మ్ నడుస్తూ నడుస్తూ అరిగిపోతుంది, పాతదైపోతుంది. అప్పుడు దానిని మారుస్తారు. పాతదానిని తీసేస్తారు. ఇదైతే బేహద్ అవినాశీ డ్రామా. ఈ విధమైన విషయాలను గురించి విచార సాగర మథనము చేసి దృఢంగా లేక పక్కాగా చేసుకోవాలి. ఇది డ్రామా. మనము తండ్రి శ్రీమతమును అనుసరించి పతితుల నుండి పావనంగా అవుతున్నాము. మనము పతితము నుండి పావనంగా అయ్యే లేదా తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయ్యే మార్గమేదీ ఉండజాలదు. పాత్రను అభినయనము చేస్తూ - చేస్తూ మనము సతోప్రధానము నుండి తమోప్ర్రధానంగా అవ్వాలి. మళ్లీ సతోప్రధానంగా అవ్వాలి. ఆత్మ వినాశనమవ్వదు. ఆత్మలోని పాత్ర కూడా వినాశనమవ్వదు. ఇటువంటి విషయాలను గురించి ఎవ్వరికీ ఆలోచన నడవదు. మనుష్యులు విని ఆశ్చర్యపోతారు. వారు కేవలం భక్తిమార్గములోని శాస్త్రాలను మాత్రమే చదువుతారు. రామాయణము, భాగవతము, గీత మొదలైనవి అవే. ఇందులో విచార సాగర మథనము చేయవలసి ఉంటుంది. బేహద్ తండ్రి దేనిని అర్థము చేయిస్తారో దానిని మనము ఉన్నదున్నట్లు ధారణ చేసినట్లయితే మంచి పదవినే పొందుతాము. అందరూ ఒకేలాగా ధారణ చేయలేరు. కొందరు చాలా సూక్ష్మంగా అర్థం చేయిస్తారు. ఈ రోజుల్లో జైళ్ళలో కూడా ఉపన్యసించేందుకు వెళ్తారు. వేశ్యల వద్దకు కూడా వెళ్తారు. చెవిటివారు, మూగవారి వద్దకు కూడా పిల్లలు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వారికి కూడా జ్ఞానము పొందేందుకు హక్కు ఉంది. సైగలతో అర్థము చేసుకుంటారు. అర్థము చేసుకునే ఆత్మ అయితే లోపల ఉంది కదా! చిత్రాన్ని ఎదురుగా ఉంచినట్లయితే చదువుకోగలరు కదా. ఆత్మలో బుద్ధి ఉంటుంది కదా. భలే గ్రుడ్డివారు, కుంటివారు, వికలాంగులు అయినా ఏదో ఒక రకంగా అర్థము చేసుకుంటారు. గ్రుడ్డివారికి చెవులైతే ఉంటాయి కదా! మీ మెట్ల చిత్రము చాలా బాగుంది. ఈ జ్ఞానాన్ని ఎవరికైనా అర్థము చేయించి స్వర్గములోకి వెళ్లేందుకు యోగ్యముగా చేయవచ్చు. ఆత్మ తండ్రితో వారసత్వాన్ని తీసుకోగలదు. స్వర్గములోకి వెళ్లగలదు. భలే శారీరిక అవయవాలు లోపభూయిష్టంగా ఉండవచ్చు. అక్కడైతే గ్రుడ్డివారు, కుంటివారు, వికలాంగులు మొదలైనవారు ఉండనే ఉండరు. అక్కడ ఆత్మ మరియు శరీరము రెండూ కాంచనంగా ఉంటాయి. ప్రకృతి కూడా బంగారు(కంచన్)లా ఉంటుంది కొత్త వస్తువు తప్పకుండా సతోప్రధానంగా ఉంటుంది. ఇది కూడా డ్రామాలో తయారు చేయబడి ఉంది. ఒక సెకండు మరొక సెకండుతో కలవదు. ఎంతో కొంతైనా వ్యతాసము ఉంటుంది. ఈ విధమైన డ్రామాను ఉన్నదున్నట్లు సాక్షిగా ఉండి చూడాలి. ఈ జ్ఞానము మీకు ఇప్పుడే లభిస్తుంది. తర్వాత ఎప్పుడూ లభించదు. ఇంతకుముందు ఈ జ్ఞానము లేదు. ఇది అనాది, అవినాశిగా తయారు చేయబడిన డ్రామా అని చెప్పబడ్తుంది. దీనిని బాగా అర్థము చేసుకొని ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి.
బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఈ జ్ఞానము తెలుసు. ఈ శక్తివంతమైన బలమునిచ్చు(టానిక్) ఔషధము మీకు లభిస్తుంది. చాలా మంచి వస్తువులను మహిమ చేస్తారు. నూతన ప్రపంచము ఎలా స్థాపన అవుతుందో మళ్లీ ఈ రాజ్యము ఎలా వస్తుందో మీలో కూడా నంబరువారుగా అర్థం చేసుకున్నారు. వారు ఇతరులకు కూడా అర్థం చేయించగలరు. చాలా సంతోషంగా ఉంటారు. కొందరికి ఏ మాత్రం సంతోషం ఉండదు. ప్రతి ఒక్కరికి ఎవరి పాత్ర వారికి ఉంది. ఎవరి బుద్ధిలో కూర్చుంటుందో, విచార సాగర మథనము చేస్తారో, వారు ఇతరులకు కూడా అర్థం చేయించగలరు. ఇది మీ చదువు. దీని ద్వారా మీరు ఇలా తయారవుతారు. మీరు ఎవరికైనా మీరు ఆత్మలని అర్థం చేయించవచ్చు. ఆత్మయే పరమాత్మను స్మృతి చేస్తుంది. ఆత్మలందరూ సోదరులు. గాడ్ ఈజ్ వన్ అని కూడా అంటారు. మిగిలిన మనుష్యులందరిలోనూ ఆత్మ ఉంది. ఆత్మలందరి పారలౌకిక తండ్రి ఒక్కరే. ఎవరైతే పక్కా నిశ్చయబుద్ధి గలవారో వారిని ఎవ్వరూ భ్రమింపజేయలేరు. అనగా జ్ఞానము నుండి దూరము చేయలేరు. కచ్ఛాగా(పరిప్వము లేనివారు) ఉన్నవారిని త్వరగా తిప్పేస్తారు. సర్వవ్యాపి జ్ఞానము పై ఎంతగా డిబేట్ చేస్తారు(వాదిస్తారు). వారు కూడా తమ జ్ఞానము పై పక్కాగా ఉంటారు. వారు ఈ జ్ఞానానికి చెందినవారు కాకపోవచ్చు. వారిని దేవతా ధర్మము వారని ఎలా చెప్పగలరు? ఆది సనాతన దేవీ దేవతా ధర్మము ప్రాయ: లోపమైపోయింది. మన ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే పవిత్ర ప్రవృత్తి మార్గంగా ఉండేదని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు అపవిత్రమైపోయింది. ఎవరైతే మొదట పూజ్యులుగా ఉండేవారో వారే పూజారులుగా అయిపోయారు. చాలా పాయింట్లు కంఠస్థమై ఉంటే వారు ఇతరులకు తెలియజేస్తూ ఉంటారు. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో మీకు తండ్రి అర్థము చేయిస్తారు. మీరు ఇతరులకు అర్థం చేయించండి. మీకు తప్ప ఇంకెవ్వరికీ ఈ విషయాలు తెలియదు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు.
బాబా కూడా ఘడియ - ఘడియ పాయింట్లను రిపీట్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే కొత్తవారు వస్తూ ఉంటారు కదా! ప్రారంభములో ఎలా స్థాపన జరిగింది అని మిమ్ములను అడుగుతారు. మీరు కూడా రిపీట్ చేయవలసి ఉంటుంది. మీరు చాలా బిజీ అయిపోతారు. చిత్రాల పై కూడా మీరు అర్థం చేయించగలరు. కాని జ్ఞాన ధారణ అందరికీ ఒకే విధంగా జరగదు. ఇందులో జ్ఞానము కావాలి. స్మృతి కావాలి. ధారణ చాలా బాగుండాలి. సతోప్రధానంగా అయ్యేందుకు తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. చాలా మంది పిల్లలు తమ వ్యాపారాలలో చిక్కుకొని ఉంటారు. ఏ పురుషార్థమూ చెయ్యరు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. కల్పక్రితము ఎవరెంత పురుషార్థము చేశారో అంతే చేస్తారు. అంతిమంలో పూర్తిగా సోదరులు-సోదరులై ఉండాలి. ఆత్మ నగ్నంగా(శరీరము లేకుండా) వచ్చింది, అలాగే వెళ్లాలి. చివర్లో ఎవ్వరూ గుర్తు రాని విధంగా ఉండాలి. ఇప్పుడు ఎవ్వరూ వాపస్ వెళ్లలేరు. ఎంతవరకు వినాశనము అవ్వదో అంతవరకు స్వర్గములోకి ఎలా వెళ్లగలరు. తప్పకుండా సూక్ష్మవతనానికైనా వెళ్తారు లేక ఇక్కడే మరో జన్మ తీసుకుంటారు. ఏ లోపము మిగిలి ఉందో దాని కొరకు పురుషార్థము చేస్తారు. అది కూడా వారు పెద్దవారైనప్పుడే అర్థము చేసుకోగలరు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. మీకు ఏకరస అవస్థ చివరిలో తయారవుతుంది. అంతేకాని వ్రాసుకొనుట ద్వారా అంతా గుర్తుంటుందని కాదు. మరి గ్రంథాలయాలలో ఇన్ని పుస్తకాలు ఎందుకుంటాయి! వైద్యులు, వకీళ్లు.......... మొదలైనవారు చాలా పుస్తకాలు ఉంచుకుంటారు. అధ్యయనము చేస్తూ ఉంటారు. మనుష్యులు మనుష్యులకు వకీళ్లుగా అవుతారు. ఆత్మలైన మీరు ఆత్మలకు వకీలుగా అవుతారు. ఆత్మలు ఆత్మలను చదివిస్తారు. అది శారీరిక చదువు. ఇది ఆత్మిక చదువు. ఈ ఆత్మిక చదువు ద్వారా మళ్లీ మీరు 21 జన్మలు ఎప్పుడూ పొరపాట్లు చెయ్యరు. మాయా రాజ్యములో చాలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఈ కారణంగా చాలా సహనము చేయవలసి పడ్తుంది. ఎవరు పూర్తిగా చదువుకోరో, కర్మాతీత అవస్థను పొందుకోరో వారు చాలా సహనము చేయవలసే ఉంటుంది. పదవి కూడా తక్కువైపోతుంది. విచార సాగర మథనము చేసి ఇతరులకు కూడా వినిపిస్తూ ఉంటే మీలో చింతన జరుగుతుంది. కల్పక్రితము కూడా ఈ విధంగానే తండ్రి వచ్చారు. వారి శివజయంతి జరుపబడ్తుందని పిల్లలకు తెలుసు. యుద్ధము మొదలైనవాటి మాటే లేదు. అవన్నీ శాస్త్రాలలోని విషయాలు. ఇది చదువు. సంపాదనలో ఖుషీ ఉంటుంది. ఎవరికి లక్షల సంపాదన జరుగుతుందో వారికి చాలా ఖుషీ కలుగుతుంది. కొందరు లక్షాధికారులుగా ఉంటే కొందరు ఏమీ లేనివారు కూడా ఉంటారు అనగా తక్కువ ధనము కలిగినవారు కూడా ఉంటారు. ఎవరి వద్ద ఎన్ని జ్ఞాన రత్నాలు ఉంటాయో వారికి అంత ఖుషీ కూడా ఉంటుంది. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. విచార సాగర మథనము చేసి స్వయాన్ని జ్ఞాన రత్నాలతో నింపుకోవాలి. డ్రామా రహస్యాన్ని బాగా అర్థము చేసుకొని ఇతరులకు అర్థము చేయించాలి. ఏ విషయములోనూ దు:ఖపడకుండా హర్షితంగా ఉండాలి.
2. మీ స్థితిని చాలా కాలము ఏకరసంగా తయారు చేసుకోవాలి. తద్వారా చివర్లో ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ గుర్తు రాకూడదు. మేమంతా భాయీ - భాయీ(సోదరులము) ఇప్పుడు వాపస్ వెళ్లాలి అని అభ్యాసము చెయ్యాలి.
వరదానము :-
''అంతా తండ్రి అధీనము చేసి కమలపుష్ప సమానంగా న్యారా - ప్యారాగా ఉండే డబల్లైట్ భవ''
తండ్రికి చెందినవారిగా అవ్వడం అనగా బరువునంతా తండ్రికి ఇచ్చేయడం. డబల్లైట్ అంటేనే అంతా తండ్రి అధీనము చేయడం. ఈ శరీరము కూడా నాది కాదు. కనుక శరీరమే నాది కాకుంటే ఇక నాదంటూ ఏముంది? మీరందరూ నా శరీరమూ నీదే, మనసూ నీదే, ధనమూ నీదేనని ప్రమాణము చేశారు. అంతా నీదే అని అన్నప్పుడు ఇక మీకు బరువు ఏ విషయము గురించి ఉంది? అందువలన కమలపుష్పము ఉదాహరణాన్ని స్మృతిలో ఉంచుకొని సదా న్యారా - ప్యారాగా ఉంటే డబల్లైట్గా అవుతారు.
స్లోగన్ :-
''ఆత్మీయత (రుహానియత్) ద్వారా ఆవేశాన్ని (రోబ్ను) సమాప్తం చేసి స్వంత శరీర స్మృతిని కరిగించేవారే సత్యమైన పాండవులు.''