22-01-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - ఇప్పుడు మీరు ఈ శరీరాన్ని మరచి అనాసక్తులుగా, కర్మాతీతులుగా అయ్యి ఇంటికి వెళ్ళాలి అందువల్ల సుకర్మలు చేయండి, ఏ విధమైన వికర్మలు చేయకండి.''
ప్రశ్న :-
తమ అవస్థను పరిశీలించుకునేందుకు ఏ ముగ్గురి మహిమను సదా గుర్తుంచుకోవాలి ?
జవాబు :-
1. నిరాకారుల మహిమ 2. దేవతల మహిమ 3. స్వ మహిమ. ఇప్పుడు పరిశీలించుకోండి - మేము నిరాకార తండ్రి సమానంగా పూజ్యులుగా అయినామా? వారిలోని అన్ని గుణాలను ధారణ చేశామా? దేవతల వంటి రాయల్ (శ్రేష్ఠమైన) నడవడిక ఉందా? దేవతలు ఏ ఆహార-పానీయాలు స్వీకరిస్తారో, వారిలో ఏ గుణాలు ఉన్నాయో అవి నాలో ఉన్నాయా? ఏవైతే ఆత్మ వాస్తవిక గుణాలో, ఆ గుణాలన్నీ తెలుసుకొని వాటి స్వరూపంగా అయ్యామా?
ఓంశాంతి.
ఆత్మల నివాసస్థానము టవర్ ఆఫ్ సైలెన్స్ అనగా శాంతి శిఖరము అని పిల్లలకు అర్థము చేయించబడింది. ఉదాహరణానికి హిమాలయ పర్వత శిఖరముంది కదా. అది చాలా ఎత్తుగా ఉంటుంది. మీరు ఉండేది కూడా సర్వోన్నతమైన స్థానములో. వారు పర్వతాలను ఎక్కడం అభ్యాసము చేస్తారు. పోటీ(రేస్) చేస్తారు. పర్వతాలను ఎక్కడంలో కూడా కొందరు తీక్షణంగా ఉంటారు. అందరూ ఎక్కలేరు. ఇందులో పిల్లలైన మీరు ఆ విధమైన రేస్ మొదలైనవేవీ చేయనవసరము లేదు. పతితమైన ఆత్మ పావనంగా తయారై పైకి వెళ్ళాలి. దీనినే శాంతిశిఖరము అని అంటారు. అది సైన్స్ శిఖరము. వారి వద్ద పెద్ద పెద్ద బాంబులు ఉంటాయి. వారిది కూడా టవర్ ఉంటుంది. అక్కడ అపాయకరమైన వస్తువులను ఉంచుతారు. బాంబులలో విషము మొదలైనవి కూడా నింపుతారు. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ! మీరైతే ఇంటి వైపుకు ఎగరాలి. వారేమో ఇంటిలో కూర్చునే అన్నీ సమాప్తము చేయగల బాంబులను వేస్తారు. మీరైతే ఇక్కడి నుండి శాంతి శిఖరము(పరంధామము) పైకి వెళ్ళాలి. అక్కడ నుండి మీరు వచ్చారు మళ్లీ సతోప్రధానమైనప్పుడు అక్కడకే వెళ్తారు. సతోప్రధానము నుండి తమోప్రధానములోకి వచ్చారు. మళ్లీ సతోప్రధానంగా అవ్వాలి. సతోప్రధానముగా తయారయ్యే పురుషార్థము ఎవరు చేస్తారో వారు ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేస్తారు. పిల్లలైన మీరిప్పుడు సుకర్మలు చేయాలి. ఏ వికర్మా చేయరాదు. తండ్రి కర్మల గతిని గురించి కూడా అర్థము చేయించారు. రావణ రాజ్యములో మీరు దుర్గతి పాలయ్యారు. ఇప్పుడు తండ్రి సుకర్మలు చేయడం నేర్పిస్తున్నారు. ఈ 5 వికారాలు చాలా పెద్ద శత్రువులు. మోహము కూడా వికర్మయే. ఏ వికారమూ తక్కువైనది కాదు. మోహమును ఉంచుకోవడం వల్ల కూడా దేహాభిమానములో చిక్కుకుపోతారు. అందువల్ల తండ్రి కన్యలకు దీనిని గురించి చాలా అర్థము చేయిస్తారు. పవిత్రంగా ఉండేవారిని కన్యలని అంటారు. మాతలు కూడా పవిత్రంగా అవ్వాలి. మీరందరూ బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలు. భలే వృద్ధ మాతలు కావచ్చు కాని బ్రహ్మకు సంతానమే కదా.
తండ్రి అర్థము చేయిస్తున్నారు - అత్యంత మధురమైన పిల్లలారా! ఇప్పుడు కుమారుల-కుమారీల స్థితి కంటే ఉన్నతంగా వెళ్ళండి. ఏ విధంగా మొట్టమొదటి శరీరములోకి పవిత్రంగా వచ్చారో అలాగే మళ్లీ పవిత్రమై దీని నుండి వెలువడి వెళ్ళిపోవాలి. దీని కొరకు శ్రమ చేయాలి. ఒకవేళ ఉన్నత పదవిని పొందాలనుకుంటే ఇతరులెవ్వరి స్మృతి రాకూడదు. మన దగ్గర ఏముంది? ఖాళీ చేతులతో వచ్చాము కదా! మన వద్ద ఏమీ లేదు. ఈ శరీరము కూడా మనది కాదు. ఇప్పుడు ఈ శరీరాన్ని మర్చిపోవాలి. అనాసక్తులై కర్మాతీతులై వెళ్ళాలి. ట్రస్టీ(నిమిత్తము)గా అవ్వండి. తండ్రి చెప్తున్నారు - భలే హాయిగా తిరగండి కాని వ్యర్థంగా ఖర్చు చేయకండి. మనుష్యులు దానాలు కూడా చాలా చేస్తారు. ఫలానావారు గొప్ప దాతలని పత్రికలలో కూడా ముద్రించబడ్తుంది. వైద్యశాలలు మొదలైనవి నిర్మించారని కూడా వ్రాస్తారు. ఎవరు ఎక్కువగా దానము చేస్తారో, వారికి ప్రభుత్వము ద్వారా బిరుదు లభిస్తుంది. అన్నింటికంటే మొదటి టైటిల్ హిస్ హోలీనెస్, హర్ హోలీనెస్. హోలీ అని పవిత్రులను అంటారు. దేవతలెలా పవిత్రంగా ఉండేవారో, అలా తయారవ్వాలి. తర్వాత అర్ధకల్పము పవిత్రంగా ఉంటారు. ఇది ఎలా సాధ్యపడుతుంది? అని చాలామంది అంటారు. అక్కడ కూడా పిల్లలు జన్మిస్తారు కదా అని అడుగుతారు. అప్పుడు వెంటనే అచ్చట రావణుడు ఉండడని వారికి చెప్పండి. రావణుని ద్వారానే వికారీ ప్రపంచము ఏర్పడుతుంది. తండ్రియైన రాముడు వచ్చి పావనంగా చేస్తారు. అక్కడ పతితులెవ్వరూ ఉండజాలరు. పవిత్రత విషయమే మాట్లాడరాదని, శరీరము ఎలా నడుస్తుందని కొందరంటారు. ఒకప్పుడు పవిత్ర ప్రపంచము ఉండేదని కూడా వారికి తెలియదు. ఇప్పుడిది అపవిత్ర ప్రపంచము. ఇది వేశ్యాలయము మరియు శివాలయము.......... పతిత ప్రపంచము మరియు పావన ప్రపంచముల ఆట. మొదట సుఖముంటుంది, తర్వాత దు:ఖముంటుంది. ఇది రాజ్యభాగ్యమును ఎలా తీసుకున్నారో మళ్లీ ఎలా పోగొట్టుకున్నారో తెలియచేసే కథ. దీనిని బాగా అర్థము చేసుకోవాలి. మనము ఓడిపోయాము, మనమే విజయాన్ని పొందాలి, ధైర్యవంతులుగా అవ్వాలి. మన అవస్థను జమ చేసుకోవాలి. గృహస్థ వ్యవహారములో ఉంటూ, ఇల్లూ-వాకిళ్ళను సంభాళిస్తూ తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఎటువంటి అపవిత్ర కార్యము చేయరాదు. చాలామందిలో మోహము కూడా ఉంటుంది. మిమ్ములను తప్ప ఇతరులెవ్వరినీ ప్రేమించము అని ప్రతిజ్ఞ చేసిన తర్వాత కూడా ఇతరులను ఎందుకు ప్రేమిస్తున్నాము! అని స్వయాన్ని పరిశీలించుకోండి. అత్యంత ప్రియమైన వస్తువు ఏదైతే ఉందో అది(శివబాబా) గుర్తుకు రావాలి. అప్పుడు ఇతర దేహ సంబంధాలన్నీ మర్చిపోతారు. అందరినీ చూస్తూ ఈ విధంగా భావించాలి - '' మేము ఇప్పుడు స్వర్గములోకి వెళ్తున్నాము, ఇవన్నీ కలియుగ బంధనాలు, మేము దైవీ సంబంధములోనికి వెళ్తున్నాము. '' ఇతర ఏ మనుష్యుల బుద్ధిలోనూ ఈ జ్ఞానము లేదు. తండ్రి స్మృతిలో మీరు మంచి రీతిగా ఉన్నట్లైతే, ఖుషీ పాదరస మట్టము ఎక్కి ఉంటుంది. ఎంత వీలైతే అంత బంధనాలను తగ్గించుకుంటూ ఉండండి. స్వయాన్ని తేలికగా చేసుకోండి. బంధనాలను పెంచుకునే అవసరము లేదు. ఈ రాజ్యాన్ని పొందడంలో ఖర్చు చేయవలసిన అవసరమేమీ లేదు. ఖర్చు లేకుండా విశ్వరాజ్యభాగ్యాన్ని తీసుకుంటారు. వారు ఫిరంగుల కొరకు, సైన్యము కొరకు ఎంతగా ఖర్చు చేస్తారు! మీకు ఖర్చయ్యే మాటే లేదు. మీరు ఏదైతే తండ్రికి ఇస్తారో, అది ఇవ్వడం కాదు, వాస్తవానికి తీసుకోవడం. తండ్రి ఏమో గుప్తంగా ఉన్నారు. వారు శ్రీమతమును ఇస్తూ ఉంటారు - మ్యూజియమ్ తెరవండి. వైద్యశాల, యూనివర్శిటీని తెరవండి. వీటి ద్వారా జ్ఞానమును ప్రాప్తి చేసుకుంటారు. యోగము ద్వారా మీరు సదా కాలము కొరకు నిరోగులుగా అవుతారు. ఆరోగ్యము, సంపద మరియు వాటి జతలో సంతోషము కూడా 21 జన్మల వరకు ఉండనే ఉంటుంది. ఒక్క సెకండులో ముక్తి-జీవన్ముక్తులు ఎలా లభిస్తాయో వచ్చి అర్థము చేసుకోండి. ద్వారము(గడప/గేటు)లోనే అర్థము చేయించవచ్చు. ఉదాహరణానికి మీ వాకిలి వద్దకు భిక్షము అడుక్కునేందుకు వస్తారు కదా! మీరు కూడా అలా భిక్షము ఇస్తారు. దీని ద్వారా మనుష్యులు ఒక్కసారిగా సంపన్నులైపోతారు. ఎవరు వచ్చినా, మీరేమీ కావాలని వేడుకుంటున్నారు? మేము మీకు ఎలాంటి భిక్షమునిస్తామంటే మీరు జన్మ-జన్మల కొరకు భిక్షాటన చేయడం నుండి విడుదలౌతారు. అనంతమైన తండ్రి మరియు సృష్టి చక్రాలను గురించి తెలుసుకోవడం ద్వారా మీరు ఈ విధంగా (లక్ష్మీనారాయణులుగా) అవుతారు.
మీ బ్యాడ్జ్ కూడా అద్భుతము చేయగలదు. సెకండులో అనంతమైన వారసత్వాన్ని దీని ద్వారా మీరు ఎవరికైనా ఇవ్వవచ్చు. సర్వీసు చేయాలి. తండ్రి సెకండులో విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. తర్వాత పురుషార్థము పై ఆధారపడి ఉంది. చిన్నవారైనా, పెద్దవారైనా అందరికీ తండ్రి స్మృతి చేయమని చెప్తారు. రైలులో కూడా మీరు బ్యాడ్జ్ ద్వారా సర్వీసు చేయవచ్చు. మీ వద్ద బ్యాడ్జ్ ఉన్నట్లైతే అందరికీ మీకు ఇద్దరు తండ్రులున్నారని, ఇరువురి నుండే వారసత్వము లభిస్తుందని అర్థము చేయించవచ్చు. బ్రహ్మ నుండి వారసత్వము లభించదు. వారేమో దళారి(మధ్యవర్తి) కదా! ఇతని ద్వారా తండ్రి మీకు నేర్పిస్తారు, వారసత్వమునిస్తారు. మనిషి మనిషిని పరిశీలించి వివరంగా అర్థము చేయించాలి. చాలామంది యాత్రలకు కూడా వెళ్తూ ఉంటారు. అవన్నీ శారీరిక యాత్రలు, ఇది ఆత్మిక యాత్ర. దీని ద్వారా మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు. భౌతిక యాత్రల ద్వారా ఎదురుదెబ్బలు తింటూనే ఉంటారు. మెట్ల(సీఢీ) చిత్రము కూడా జతలో ఉండాలి. సేవ చేయువారికి భోజనము మొదలైనవి కూడా అవసరముండదు. ఖుషీ వంటి ఆహారము ఇంకొకటి లేదని చెప్పబడ్తుంది. ధనము లేకపోతే వారికి క్షణ-క్షణము ఆకలి అవుతూ ఉంటుంది. ధనవంతులైన రాజులకు కడుపు నిండినట్లుగా ఉంటుంది(తృప్తిగా ఉంటుంది). నడవడికలు చాలా శ్రేష్ఠంగా ఉంటాయి. వారు మాట్లాడు విధానము కూడా ఫస్ట్క్లాస్గా ఉంటుంది. మనము ఎలా(ఎవరిగా) అవుతున్నామో మీకు తెలుసు. అక్కడ ఆహార పానీయాదులు మొదలైనవి చాలా శ్రేష్ఠంగా(రాయల్గా) ఉంటాయి. సమయము కాని సమయములో అక్కడ ఎప్పుడూ భుజించరు. చాలా రాయల్గా, శాంతిగా భోజనము చేస్తారు. మీరు అన్ని గుణాలను నేర్చుకోవాలి. నిరాకారుని మహిమ, దేవతల మహిమ మరియు స్వంత మహిమలను మూడింటిని పరిశీలించుకోండి. ఇప్పుడు మీరు బాబా గుణాలు గలవారిగా అవుతున్నారు. తర్వాత దేవతా గుణాలు గలవారిగా అవుతారు. కనుక ఆ గుణాలను ఇప్పుడే ధారణ చేయాలి. ఇప్పుడు మీరు దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు. శాంతిసాగరా, ప్రేమసాగరా,....... అని పాడ్తారు. తండ్రి ఎలా పూజింపబడుతున్నారో అలా మీరు కూడా పూజింపబడ్తారు. తండ్రి మీకు నమస్కరిస్తున్నారు. మీకైతే డబల్ పూజ జరుగుతుంది. ఈ విషయాలన్నీ తండ్రియే అర్థము చేయిస్తారు. పురుషార్థము చేసి ఇలా తయారవ్వండి అని మీ మహిమను కూడా అర్థము చేయిస్తారు. మేము ఇలా తయారయ్యామా? అని మనస్సులో ప్రశ్నించుకోండి. మనము ఎలా అశరీరిగా వచ్చామో అలా అశరీరులై వెళ్ళాలి. కర్రను కూడా వదిలేయమని శాస్త్రాలలో కూడా ఉంది. కానీ ఇందులో లాఠీ(ఊతకర్ర) మాట లేదు. ఇక్కడ శరీరాన్ని వదిలే విషయమును గురించి చెప్తున్నారు. మిగిలినవన్నీ భక్తి మార్గములోని విషయాలు, ఇక్కడ కేవలం తండ్రినే స్మృతి చేయాలి. తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు.
పిల్లలైన మీకు జ్ఞానము లభించింది, మనుష్యులు గురువుల సంకెళ్ళలో ఎంతగా చిక్కుకుపోయి ఉన్నారో మీకు తెలుసు. అనేక రకాల గురువులున్నారు. ఇప్పుడు మీకు గురువు అవసరము లేదు. ఏదీ చదువుకోనవసరము కూడా లేదు. తండ్రి నన్నొక్కరినే స్మృతి చేయండి(మామేకమ్ యాద్ కరో) అను ఒకే మంత్రమునిచ్చేశారు. వారసత్వమును స్మృతి చేయండి దైవీ గుణాలను ధారణ చేయండి. గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. ఇక్కడకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. మేము బాబా సన్ముఖములో కూర్చొని ఉన్నామని ఇక్కడ భావిస్తారు. అక్కడ ఉన్నప్పుడు బాబా, మధువనములో కూర్చొని ఉన్నారని భావిస్తారు. మన ఆత్మ ఎలా సింహాసనము పై కూర్చొని ఉందో, అలాగే బాబా కూడా ఈ సింహాసనము పై (బ్రహ్మ భృకుటిలో) కూర్చుని ఉన్నారు. బాబా ఏ గీతా శాస్త్రము మొదలైనవి చేతికి తీసుకోరు. అలాగని ఇతడు కంఠస్థము చేశాడని కూడా కాదు. అక్కడ సన్యాసులు మొదలైనవారు కంఠస్థము చేస్తారు. వీరు జ్ఞానసాగరులు, బ్రహ్మ ద్వారా అన్ని రహస్యాలను అర్థము చేయిస్తారు. శివబాబా ఎప్పుడైనా ఏ పాఠశాలకైనా, సత్సంగానికైనా వెళ్ళారా? తండ్రి సర్వస్వము తెలిసినవారు. వారికి(శివబాబాకు) సైన్స్ గురించి తెలుసా? అని భలే కొందరు ప్రశ్నిస్తారు. బాబా అంటారు - ఆ విజ్ఞాన శాస్త్రము(సైన్స్) ద్వారా నేనేం చేయాలి? నన్ను పతితులను పావనంగా చేసేందుకు పిలిచారు. దీని కొరకు నేను సైన్సు ఎందుకు నేర్చుకుంటాను? శివబాబా ఫలానా శాస్త్ర్రాన్ని చదివారా? అని కొందరు అడుగుతారు, అరే! వారిని జ్ఞానసాగరులని అంటారు. ఇవైతే భక్తిమార్గములోని శాస్త్రాలు. విష్ణువుకు శంఖు, చక్రము, గదాదులను ఇచ్చేశారు. వాటి అర్థము గురించి ఏమీ తెలియదు. వాస్తవానికి ఈ అలంకారాలు బ్రహ్మకు, బ్రాహ్మణులకు ఇవ్వాలి. సూక్ష్మవతనములో అయితే ఈ శరీరమే ఉండదు. ఇంటిలో కూర్చుని ఉండగానే బ్రహ్మ సాక్షాత్కారము, కృష్ణుని సాక్షాత్కారము అనేమందికి కలుగుతుంది. దీని అర్థమేమంటే ఈ బ్రహ్మ వద్దకు వెళ్తే కృష్ణుని వలె అవుతారు లేక కృష్ణుని ఒడిలోకి వచ్చేస్తారు. అక్కడ కేవలం రాకుమారుని (కృష్ణుని) సాక్షాత్కారమే జరుగుతుంది. ఒకవేళ మీరు బాగా చదువుకుంటే ఇలా అవ్వగలరు. ఇది మీ లక్ష్యము - ఉద్ధేశ్యము. ఉదాహరణ అయితే ఒక్కరిదే ఇస్తారు కదా! దానిని మాడల్ అని అంటారు. సత్యనారాయణ కథను వినిపించుటకు, నరుని నుండి నారాయణునిగా చేసేందుకు బాబా వచ్చారని మీకు తెలుసు. మొదట తప్పకుండా రాకుమారునిగా అవుతాడు. కృష్ణుడు వెన్నముద్ద తిన్నారని శాస్త్రాలలో చూపించారు. వాస్తవానికి అది వెన్నముద్ద కాదు కాని విశ్వసామ్రాజ్య గోళము. అంతేకాని చంద్రుడు మొదలైన వాటిని నోటిలో ఎలా చూపిస్తారు? రెండు పిల్లులు పరస్పరములో పోట్లాడుకుంటుంటే మధ్యలో ఎవరైతే విశ్వ అధికారులుగా అయ్యారో వారి నోటిలో వెన్నను చూపించారు. మేము అలా అయ్యామా? లేదా? అని ఇప్పుడు స్వయాన్ని చూసుకోండి. ఈ చదువు రాజ్యపదవి కొరకే ఉంది. ప్రజా పాఠశాల అని దీనిని అనరు. ఇది నరుని నుండి నారాయణునిగా తయారయ్యే పాఠశాల, గాడ్లీ యూనివర్శిటీ. ఇక్కడ భగవంతుడు చదివిస్తారు. బాబా - ఈశ్వరీయ విశ్వ విద్యాలయము అని వ్రాసి బ్రాకెట్లో యూనివర్శిటీ అని వ్రాయండి అని చెప్పారు. కాని అలా వ్రాయడం మర్చిపోతారు. మీరు సాహిత్యము మొదలైనవి ఎంత ఇచ్చినా వారు అర్థము చేసుకోరు. ఇందులో సన్ముఖములో ఉండి అర్థము చేయించవలసి ఉంటుంది. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వము లభిస్తుంది. జన్మ-జన్మాంతరాల నుండి మీరు హద్దు వారసత్వాన్ని తీసుకుంటూ వచ్చారు. మీరు బ్యాడ్జీతో సర్వీసు చేయగలరు. భలే ఎవరైనా అవహేళన చేసినా సర్వీసు చేయాలి. ఇద్దరు తండ్రుల విషయము చాలా బాగుంది. ఈ విధంగా చాలామంది తమ పిల్లలకు అర్థము చేయిస్తారు. పిల్లలు కూడా తండ్రికి అర్థము చేయిస్తూ ఉంటారు. స్త్రీ తన పతిని జ్ఞాన మార్గములోకి తీసుకొస్తుంది. అక్కడక్కడా జగలాడుకుంటూ ఉంటారు. ఆత్మలైన మనమంతా తండ్రి సంతానమని మీకు తెలుసు. మీరు వారసత్వానికి అధికారులు. లౌకిక సంబంధములో కుమార్తెలు వివాహము చేసుకొని మరొక ఇంటికి వెళ్ళిపోతారు. దానిని కన్యాదానమని అంటారు. ఇతరులకు ఇస్తారు కదా. ఇప్పుడైతే అలా చేయరాదు. అక్కడ స్వర్గములో కూడా కన్య అత్తవారింటికి వెళ్తుంది. కాని పవిత్రంగా ఉంటుంది. ఇది పతిత ప్రపంచము. అది సత్యయుగము, శివాలయము, పావన ప్రపంచము. పిల్లలైన మీ పై ఇప్పుడు బృహస్పతి దశ ఉంది. మీరు స్వర్గములోకైతే తప్పకుండా వెళ్తారు. ఇదైతే పక్కా పక్కా. ఇకపోతే పురుషార్థము ద్వారా ఉన్నత పదవిని పొందాలి. హృదయ పూర్వకంగా ప్రశ్నించుకోవాలి - మేము ఫలానావారిలాగా సేవ చేస్తున్నామా? అంతేకాని బ్రాహ్మణి(టీచరు) కావాలని అనరాదు. స్వయం మీరే టీచరుగా అవ్వండి అచ్ఛా.
పిల్లలు పురుషార్థము చేయాలి. పోతే బాబా ఎవరి వద్దనైనా ధనము తీసుకొని ఏం చేస్తారు? మీరు వెళ్లి మ్యూజియమ్ మొదలైనవి తెరవండి. ఈ భవనాలు మొదలైనవన్నీ ఇక్కడే సమాప్తమైపోతాయి. బాబా అయితే వ్యాపారి కదా అందులోనూ బంగారు వ్యాపారి, దు:ఖపు సంకెళ్ళ నుండి విడిపించి సుఖమునిచ్చేవారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - చాలా గడచిపోయింది, ఇక కొంచెము మాత్రమే మిగిలి ఉంది....... చాలా గొడవలు జరగడము మీరు చూస్తారు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ట్రస్టీలు(నిమిత్తులు) మరియు అనాసక్తులుగా అయ్యి ఉండండి. ఏ రకమైన వ్యర్థమైన ఖర్చు చేయకండి. స్వయాన్ని దేవతల వలె పవిత్రంగా తయారు చేసుకునే పురుషార్థము చేస్తూ ఉండండి.
2. అత్యంత ప్రియమైన ఒక్క వస్తువు(శివబాబా)నే స్మృతి చేయండి. ఎంత వీలైతే అంత కలియుగ బంధనాలను తేలిక చేసుకుంటూ ఉండండి, పెంచుకోకండి. సత్యయుగీ దైవీ సంబంధములోకి వెళ్తున్నామనే ఖుషీలో ఉండండి.
వరదానము :-
''జ్ఞాన స్వరూపులుగా అయ్యి వ్యర్థ ప్రశ్నలన్నిటిని యజ్ఞములో స్వాహా చేసే నిర్విఘ్న భవ''
ఏదైనా విఘ్నము వచ్చినప్పుడు ఎందుకు? ఏమి? అని అనేక ప్రశ్నలలోకి వెళ్లిపోతారు. ప్రశ్నచిత్తులుగా అవ్వడం అనగా వ్యాకుల పడడం(పరేశాన్). జ్ఞాన స్వరూపులుగా అయ్యి యజ్ఞములో వ్యర్థ ప్రశ్నలన్నిటిని స్వాహా చేస్తే మీ సమయమూ మిగులుతుంది, ఇతరుల సమయం కూడా మిగులుతుంది. ఇందులో సహజంగానే నిర్విఘ్నంగా అయిపోతారు. నిశ్చయం మరియు విజయము మీ జన్మ సిద్ధ అధికారము - ఈ శాన్(స్వమానం)లో ఉంటే ఎప్పుడూ పరేశాన్ అవ్వరు (వ్యాకులపడరు).
స్లోగన్ :-
''సదా ఉత్సాహంలో ఉండి ఇతరులకు ఉత్సాహమును ఇప్పించుటే, మీ కర్తవ్యము.''
బ్రహ్మబాబా సమానంగా అయ్యేందుకు విశేషమైన పురుషార్థము
ఎలాగైతే బ్రహ్మాబాబా సదా లవ్లీన్ స్థితిలో ఉండి 'నాది' అనే వృత్తిని (భావాన్ని)
కూడా త్యాగము చేశాడో, అందరి ధ్యాస తండ్రి వైపు ఆకర్షింపజేశాడో, అలా తండ్రిని
అనుసరించండి. జ్ఞానము ఆధారంతో తండ్రి స్మృతిలో ఇలా ఇమిడి ఉండండి. ఇలా ఇమిడి పోవడమే
లవ్లీన స్థితి.