26-07-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - సత్యమైన తండ్రితో లోపలా, బయటా సత్యంగా ఉండండి. అప్పుడే దేవతలుగా అవ్వగలరు. బ్రాహ్మణులైన మీరే ఫరిస్తాల నుండి దేవతలుగా అవుతారు.''
ప్రశ్న :-
ఈ జ్ఞానమును వినేందుకు లేక ధారణ చేసేందుకు ఎవరు అధికారులుగా అవ్వగలరు?
జవాబు :-
ఎవరైతే ఆల్రౌండు పాత్ర చేశారో, ఎవరైతే అందరికన్నా ఎక్కువ భక్తి చేశారో, వారే జ్ఞానమును ధారణ చేయడంలో చాలా వేగంగా ముందుకెళ్తారు. వారే ఉన్నతమైన పదవిని కూడా పొందుతారు. మీరు శాస్త్రాలను ఒప్పుకోరా? అని ఎవరైనా మిమ్ములను అడిగితే మేము చదివినన్ని శాస్త్రాలు, మేము చేసినంత భక్తి ప్రపంచములో మరెవ్వరూ చేయలేదు, మాకిప్పుడు భక్తికి ఫలితము లభించింది. కావున మాకిప్పుడు భక్తి చేసే అవసరము లేదని చెప్పండి.
ఓంశాంతి.
బేహద్ తండ్రి కూర్చొని బేహద్ పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. సర్వాత్మల తండ్రి సర్వాత్మలకు అర్థం చేయిస్తారు. ఎందుకంటే వారు సర్వుల సద్గతిదాత. ఇక్కడున్న ఆత్మలన్నిటిని జీవాత్మలనే అంటారు. శరీరము లేకుంటే ఆత్మ చూడలేదు. భలే డ్రామా ప్లాను అనుసారం తండ్రి స్వర్గ స్థాపన చేస్తున్నారు. అయితే నేను స్వర్గాన్ని చూడనని తండ్రి అంటున్నారు. అది ఎవరి కొరకు ఉందో వారే చూడగలరు. మిమ్ములను చదివించిన తర్వాత మళ్లీ నేను ఏ శరీరాన్ని ధారణ చేయను. కనుక శరీరము లేకుండా ఎలా చూడగలను? ఎక్కడ పడితే అక్కడ ఉండను. అన్నీ చూస్తాను అనేది లేదు. ఏ పిల్లలను పూల సమానంగా తయారుచేసి స్మృతియాత్ర నేర్పిస్తున్నారో అలాంటి పిల్లలనే తండ్రి చూస్తారు. యోగమను పదము భక్తికి సంబంధించింది. జ్ఞానమును ఇచ్చేవారు జ్ఞాన సాగరుడొక్కరే. వారినే సద్గురువు అని అంటారు. మిగిలిన వారంతా కేవలం గురువులు మాత్రమే. వారే సత్యమును చెప్పేవారు, సత్య ఖండమును స్థాపించేవారు. భారతదేశము సత్య ఖండముగా ఉండేది. అక్కడ అందరూ దేవీ దేవతలే నివసించేవారు. మీరిప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు కాబట్టి సత్యమైన తండ్రితో ఆంతరికముగా, బాహ్యముగా(లోపలా, బయటా) సత్యంగా అవ్వాలని పిల్లలకు అర్థం చేయిస్తారు. మొదట అడుగడుగునా అసత్యమే ఉండేది. స్వర్గములో ఉన్నత పదవి పొందాలంటే అదంతా వదిలేయాలి. స్వర్గానికి అందరూ వెళ్తారు కానీ తండ్రిని తెలుసుకొని కూడా వికర్మలను వినాశము చేసుకోకుంటే శిక్షలను అనుభవించి లెక్కాచారాన్ని సమాప్తము చేసుకోవాల్సి ఉంటుంది. పదవి కూడా చాలా తక్కువది లభిస్తుంది. ఈ పురుషోత్తమ సంగమ యుగములో రాజధాని స్థాపనవుతూ ఉంది. రాజధాని సత్యయుగములో గానీ, కలియుగములో గానీ స్థాపన అవ్వజాలదు. ఎందుకంటే తండ్రి సత్యయుగములోనూ రారు, కలియుగములోనూ రారు. ఈ యుగమును పురుషోత్తమ కళ్యాణకారి యుగమని అంటారు. ఇందులోనే తండ్రి వచ్చి అందరి కళ్యాణము చేస్తారు. కలియుగము తర్వాత సత్యయుగము రావాలి కాబట్టి సంగమయుగము కూడా తప్పకుండా ఉండాలి. ఇది పతిత పాత ప్రపంచమని తండ్రి తెలిపించారు. దూరదేశ నివాసి............. అని మహిమ కూడా ఉంది. అయితే పరాయి దేశములో తన పిల్లలు ఎక్కడ లభిస్తారు. పరాయి దేశములో పరాయి పిల్లలే లభిస్తారు. నేను ఎవరిలో ప్రవేశిస్తానో ఆ పిల్లలకు బాగా అర్థం చేయిస్తాను. స్వ పరిచయము కూడా ఇస్తాను మరియు ఎవరిలో ప్రవేశిస్తానో అతనికి కూడా ఇది నీ అనేక జన్మల అంతిమ జన్మ అని అర్థం చేయిస్తాను. ఎంత స్పష్టంగా ఉంది!
మీరిప్పుడు ఇంకా పురుషార్థులు. సంపూర్ణ పవిత్రులుగా లేరు. సంపూర్ణ పవిత్రులను ఫరిస్తాలని అంటారు. ఎవరైతే పవిత్రంగా లేరో వారిని పతితులనే అంటారు. ఫరిస్తాలుగా అయిన తర్వాత మళ్లీ దేవతలుగా అవుతారు. సూక్ష్మ వతనములో మీరు సంపూర్ణ ఫరిస్తాలను(సూక్ష్మ దేవతలను) చూస్తారు. వారిని ఫరిస్తాలని అంటారు. కాబట్టి తండ్రి అర్థం చేయిస్తారు - పిల్లలారా! ఒక్క అల్ఫ్నే(తండ్రినే) స్మృతి చేయండి. అల్ఫ్ అనగా బాబా వారిని అల్లాహ్ అని కూడా అంటారు. తండ్రి ద్వారా స్వర్గ వారసత్వము లభిస్తుందని పిల్లలు అర్థము చేసుకున్నారు. స్వర్గమును ఎలా రచిస్తారు? స్మృతియాత్ర మరియు జ్ఞానము ద్వారా. భక్తిలో జ్ఞానముండదు. బ్రాహ్మణులకు కేవలం ఒక్క తండ్రి మాత్రమే జ్ఞానమిస్తారు. బ్రాహ్మణులు శిఖ కదా(ఉన్నతమైనవారు). మీరిప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నారు. తర్వాత పల్టీలాట, (బాజోలి) ఆడ్తారు. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, శూద్రులుగా అగుటనే విరాట రూపమని అంటారు. విరాట రూపము బ్రహ్మ, విష్ణు, శంకరులదని అనరు. అందులో శిఖ అయిన బ్రాహ్మణులే లేరు. తండ్రి బ్రహ్మ తనువులో వస్తారని ఎవ్వరికీ తెలియదు. బ్రాహ్మణ కులమే సర్వోత్తమ కులము. ఇప్పుడు తండ్రి వచ్చి చదివిస్తున్నారు. తండ్రి శూద్రులనైతే చదివించరు కదా. వారు బ్రాహ్మణులనే చదివిస్తారు. చదువించుటలో కూడా సమయము పడ్తుంది. రాజధాని స్థాపన అవ్వనున్నది. మీరు ఉన్నతాతి ఉన్నతమైన పురుషోత్తములుగా అవ్వండి. కొత్త ప్రపంచాన్ని ఎవరు రచిస్తారు? తండ్రియే రచిస్తారు. ఇది మర్చిపోకండి. మాయ మిమ్ములను మరిపింపజేస్తుంది. దాని కర్తవ్యమే మరపింపచేయడం. అది జ్ఞానములో అంతగా జోక్యము చేసుకోదు. స్మృతిలోనే జోక్యము చేసుకుంటుంది. ఆత్మలో చాలా మురికి నిండి ఉంది. అది తండ్రి స్మృతి లేకుండా శుభ్రము అవ్వలేదు. యోగమనే పదము విని పిల్లలు తికమక పడతారు. బాబా, మాకు యోగము కుదరడము లేదు అని అంటారు. వాస్తవానికి యోగమను పదము హఠయోగులకు సంబంధించినది. సన్యాసులు బ్రహ్మముతో యోగము చేయాలని చెప్తారు. బ్రహ్మతత్వము చాలా విశాలమైనది. ఆకాశములో నక్షత్రాలు కనిపించిన విధంగా అక్కడ కూడా చిన్న-చిన్న నక్షత్రాల వంటి ఆత్మలు ఉంటాయి. అది సూర్య-చంద్రుల వెలుగు పడజాలని స్థానములో ఆకాశానికి అతీతంగా ఉంటుంది. కాబట్టి మీరెంత చిన్న చిన్న రాకెట్ అయ్యారో చూడండి. అందుకే మొట్టమొదట ఆత్మ జ్ఞానమునివ్వాలని బాబా చెప్తారు. అది ఒక్క భగవంతుడు మాత్రమే ఇవ్వగలరు. కేవలం భగవంతుని గురించే కాదు వారికి ఆత్మల గురించి కూడా ఏమీ తెలియదు. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల చక్రపు అవినాశి పాత్ర నిండి ఉంది. దీనిని కూడా ప్రకృతి సిద్ధము అని తప్ప మరేమీ అనలేరు. ఆత్మ 84 జన్మల చక్రములో తిరుగుతూనే ఉంటుంది. ప్రతి 5 వేల సంవత్సరాలకు ఒకసారి ఈ చక్రము రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇది డ్రామాలో రచింపబడింది. ప్రపంచము అవినాశి, వినాశమెప్పుడూ అవ్వదు. వారు పెద్ద ప్రళయమవుతుందని, తర్వాత కృష్ణుడు రావి ఆకు పై బొటన వ్రేలును చప్పరిస్తూ వస్తున్నట్లు చూపిస్తారు. కానీ ఇలాంటిదేమీ జరగదు. అది నియమ విరుద్ధము. మహాప్రళయము ఎప్పుడూ జరగదు. ఒకే ధర్మ స్థాపన, అనేక ధర్మాల వినాశనము నడుస్తూనే ఉంటుంది. ఈ సమయములో ముఖ్యంగా మూడు ధర్మాలున్నాయి. ఇది శుభకరమైన సంగమ యుగము. పాత ప్రపంచము మరియు కొత్త ప్రపంచానికి రాత్రికి, పగలుకున్నంత తేడా ఉంది. నిన్న కొత్త ప్రపంచము ఉండేది. ఈ రోజు అదే పాతదయ్యింది. నిన్నటి ప్రపంచమెలా ఉండేదో మీకు తెలుసు. ఎవరు ఏ ధర్మానికి చెందినవారో వారు వచ్చి ఆ ధర్మమునే స్థాపన చేస్తారు. వారైతే కేవలం ఒక్కరే వస్తారు. చాలామంది ఉండరు. తర్వాత మళ్లీ నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతుంది.
తండ్రి చెప్తున్నారు - పిల్లలైన మీకు ఎలాంటి కష్టమునివ్వను. పిల్లలకు కష్టమునెలా ఇస్తాను! అతి ప్రియమైన తండ్రిని కదా. నేను మీ సద్గతిదాతను, దు:ఖహర్త, సుఖకర్తను. స్మృతి కూడా నన్ను ఒక్కరినే చేస్తారు. భక్తిమార్గములో ఏమేమో చేసేశారు, నన్ను ఎంతగానో నిందించారు. భగవంతుడు ఒక్కరే అని అంటారు. సృష్టిచక్రము కూడా ఒక్కటే. ఆకాశములో మరొక ప్రపంచమేదీ లేదు. ఆకాశములో నక్షత్రాలున్నాయి. ఒక్కొక్క నక్షత్రములో సృష్టి ఉందని, క్రింద కూడా ప్రపంచముందని మానవులనుకుంటారు. ఇవన్నీ భక్తిమార్గానికి చెందినవి. ఉన్నతాతి ఉన్నతమైనవారు భగవంతుడొక్కరే. మొత్తం సృష్టిలోని ఆత్మలన్నీ మీతో కూర్చబడి ఉన్నవని కూడా మహిమ చేస్తారు. ఇది మాల వంటిది. దీనిని బేహద్ రుద్రమాల అని కూడా అనవచ్చు. సూత్రములో బంధించబడి ఉన్నారు. మహిమ చేస్తారు కానీ ఏమీ అర్థము చేసుకోరు. తండ్రి వచ్చి తెలియచేస్తున్నారు - పిల్లలారా, నేను మీకు ఏ మాత్రము కష్టమునివ్వను. మొట్టమొదట భక్తి ఎవరు చేశారో వారే జ్ఞానమార్గములో తీవ్రంగా ముందుకు వెళ్తారు. ఎక్కువగా భక్తి చేస్తే వారికి ఫలము కూడా ఎక్కువగా లభించాలి. భక్తికి ఫలము భగవంతుడిస్తారని అంటారు. వారు జ్ఞానసాగరులు. కాబట్టి తప్పకుండా జ్ఞానము ద్వారానే ఫలమునిస్తారు కదా. భక్తి ఫలము గురించి ఎవ్వరికీ తెలియదు. భక్తికి ఫలము జ్ఞానము. దాని ద్వారా స్వర్గ వారసత్వము, సుఖము లభిస్తుంది. కాబట్టి ఫలము ఇస్తారు అనగా నరకవాసుల నుండి స్వర్గవాసులుగా ఒక్క తండ్రియే తయారు చేస్తారు. రావణుని గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. దీనిని పాత ప్రపంచము అని కూడా అంటారు. ఎప్పటి నుండి పాతగా అయ్యింది? ఇది ఎవ్వరూ లెక్కించలేరు. తండ్రి మానవ సృష్టి రూపి వృక్షానికి బీజరూపము. వారు సత్యమైనవారు. వారు ఎప్పటికీ వినాశనమవ్వరు. దీనిని తలక్రిందుల వృక్షమని అంటారు. తండ్రి పైనున్నారు. ఆత్మలు తండ్రిని పైన చూస్తూ పిలుస్తారు. శరీరమైతే పిలువలేదు. ఆత్మ ఒక శరీరము నుండి వేరై మరొక శరీరములోకి వెళ్లిపోతుంది. ఆత్మ క్షీణించదు, వృద్ధి చెందదు, మృత్యువును పొందదు. ఇది తయారు చేయబడిన డ్రామా. మొత్తం ఆట అంతటి ఆదిమధ్యాంత రహస్యాన్ని తండ్రి తెలిపించారు. ఆస్తికులుగా కూడా చేశారు. ఈ లక్ష్మినారాయణులలో ఈ జ్ఞానము లేదని కూడా తండ్రి తెలిపించారు. అక్కడైతే ఆస్తికులు, నాస్తికుల గురించి తెలియను కూడా తెలియదు. ఇప్పుడు ఈ సమయములో తండ్రియే అర్థమును తెలియ చేస్తున్నారు. ఎవరికైతే తండ్రి మరియు రచనల ఆదిమధ్యాంతాలు, దాని కాల పరిమితి గురించి తెలియదో అలాంటి వారిని నాస్తికులని అంటారు. ఇప్పుడు మీరు ఆస్తికులుగా అయ్యారు. అక్కడ ఈ విషయాలేవీ ఉండవు. ఇది ఆట కదా. ఒక సెకండులో జరిగిన విషయము మరొక సెకండులో జరగదు. డ్రామా టిక్-టిక్ అంటూ తిరుగుతూనే ఉంటుంది. జరిగిపోయిన చక్రము పునరావృతమౌతూ ఉంటుంది. ఉదాహరణానికి 2 లేక 3 గంటల తర్వాత అదే సినిమా రీలు మళ్లీ ఎలా తిరుగుతూ ఉంటుందో ఇది కూడా అలాగే తిరుగుతూ ఉంటుంది. అందులో ఇల్లు మొదలైనవి పడగొడ్తారు, మళ్లీ చూస్తే నిర్మింపబడి ఉంటాయి. అదే ఉన్నది ఉన్నట్లుగా రిపీట్ అవుతూ ఉంటుంది. ఇందులో తికమకపడే విషయమే లేదు. ముఖ్యమైన విషయము - ఆత్మల తండ్రి పరమాత్మ. ఆత్మలు, పరమాత్మ చాలా కాలము నుండి వేరుగా ఉన్నారు.......... వేరుగా అయ్యి పాత్ర చేసేందుకు ఇక్కడకు వస్తారు. మీరు పూర్తి 5 వేల సంవత్సరాలు వేరుగా ఉన్నారు. మధురమైన పిల్లలైన మీకు ఆల్రౌండు పాత్ర లభించింది. కనుక మీకు మాత్రమే అర్థం చేయిస్తున్నాను. మీరు జ్ఞానానికి కూడా అధికారులు. అందరికంటే భక్తి ఎవరు ఎక్కువగా చేశారో జ్ఞానములో కూడా వారే చురుకుగా ముందుకు వెళ్తారు, ఉన్నతమైన పదవిని కూడా పొందుతారు. మొదట ఒక్క శివబాబాకు మాత్రమే భక్తి జరుగుతుంది, తర్వాత దేవతలకు, తర్వాత 5 తత్వాలకు కూడా భక్తి చేస్తారు. వ్యభిచారులుగా అయిపోతారు. ఇప్పుడు అనంతమైన తండ్రి మిమ్ములను బేహద్లోకి తీసుకెళ్తారు. వారు మళ్లీ బేహద్ భక్తి యొక్క అజ్ఞానములోకి తీసుకెళ్తారు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. అయినా ఇక్కడ నుండి వెలుపలికి వెళ్లగానే మాయ మరపింపచేస్తుంది. ఎలాగైతే గర్భములో ఉన్నప్పుడు మేమిలా తప్పులు చేయమని పశ్చాత్తాప పడి బయటకు వస్తూనే మర్చిపోతారో ఇక్కడ కూడా అలాగే బయటకు వస్తూనే మర్చిపోతారు. ఇది మరుపు-స్మృతుల ఆట. మీరిప్పుడు తండ్రికి దత్తు పిల్లలుగా అయ్యారు. శివబాబా సర్వాత్మల అనంతమైన తండ్రి. తండ్రి ఎంత దూరము నుండి వస్తారు! వారి ఇల్లు పరంధామము. పరంధామము నుండి వచ్చారంటే తప్పకుండా పిల్లల కొరకు బహుమతి తీసుకొస్తారు. అరచేతిలో వైకుంఠాన్ని(స్వర్గాన్ని) కానుకగా తీసుకొస్తారు. తండ్రి చెప్తున్నారు - 'క్షణములో స్వర్గ రాజ్యమును తీసుకోండి.' అందుకు కేవలం తండ్రిని తెలుసుకోండి అని తండ్రి అంటారు. వారు సర్వాత్మలకు తండ్రి కదా. నేను మీ తండ్రినని వారు చెప్తున్నారు. నేనెలా వస్తానో కూడా మీకు అర్థం చేయిస్తాను. నాకు రథము తప్పకుండా కావాలి. ఎలాంటి రథము? ఏ మహాత్మది తీసుకోను. మీరు బ్రహ్మను భగవంతుడని, బ్రహ్మను దేవత అని కూడా చూపిస్తున్నారని వెలుపలివారు అంటారు. అరే! మేమెక్కడ చెప్తున్నాము. వృక్షము పై చిట్టచివరన వృక్షమంతా తమోప్రధానమైనప్పుడు అతడు నిలబడి ఉన్నాడు. బ్రహ్మ అని కూడా అక్కడ నిలబడి ఉన్నారంటే అనేక జన్మల అంతిమ జన్మ అని అర్థము కదా. నేను నా అనేక జన్మల అంతిమ జన్మలో వానప్రస్థ స్థితిలో ఉన్నపుడు తండ్రి వచ్చారని బ్రహ్మయే స్వయంగా చెప్తున్నారు. వారు వచ్చి వ్యాపారము మొదలైనవన్నీ విడిపించారు. 60 సంవత్సరాల తర్వాత మానవులు భగవంతునితో మిలనము చేసేందుకు భక్తి చేస్తారు.
మీరందరూ మానవ మతమనుసారము నడిచేవారు. ఇప్పుడు తండ్రి మీకు శ్రీమతమును ఇస్తున్నారని బాబా చెప్తున్నారు. శాస్త్రాలు వ్రాసేవారు కూడా మనుష్యులే. దేవతలు వ్రాయరు, చదవరు. సత్యయుగములో శాస్త్రాలు ఉండవు. భక్తియే ఉండదు. శాస్త్రాలలో అంతా కర్మకాండ గురించి వ్రాయబడి ఉంది. ఇక్కడ అలాంటి విషయమే లేదు. బాబా జ్ఞానమునివ్వడం మీరు చూస్తారు. భక్తిమార్గములో అయితే చాలా శాస్త్రాలను చదివాము. మీరు వేద శాస్త్రాలు మొదలైనవి నమ్మరా? అని ఎవరైనా అడిగితే మనుష్యమాత్రులందరి కంటే మేమే ఎక్కువగా ఒప్పుకుంటామని చెప్పండి. మొదటి నుండి అవ్యభిచారి భక్తి కూడా మేమే ప్రారంభించాము కానీ మాకిప్పుడు జ్ఞానము లభించింది. జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది. కనుక మేము ఇంకెందుకు భక్తి చేస్తాము? అని చెప్పండి. తండ్రి చెప్తున్నారు - పిల్లలారా, చెడు వినకండి, చెడు చూడకండి,............. మధురాతి మధురమైన పిల్లలారా! స్వయాన్ని ఆత్మ అని నిశ్చయము చేసుకోండి అని తండ్రి చాలా సరళంగా తెలియజేస్తున్నారు. వారు నేనే అల్లాను అని అనేస్తారు. ఇక్కడ నేను ఆత్మను, తండ్రి సంతానాన్ని అని మీకు శిక్షణ లభించింది. దీనిని మాయ క్షణ-క్షణము మరపింపజేస్తుంది. దేహాభిమానము ఉంటేనే ఉల్టా(తప్పు) పనులు జరుగుతాయి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - పిల్లలారా, తండ్రిని మర్చిపోకండి, సమయాన్ని వృథా చేయకండి. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. రచయిత మరియు రచనల రహస్యాన్ని యధార్థంగా అర్థము చేసుకొని ఆస్తికులుగా అవ్వాలి. డ్రామా జ్ఞానములో తికమక పడరాదు. తమ బుద్ధిని హద్దు నుండి బేహద్లోకి తీసుకెళ్లాలి.
2. సూక్ష్మవతన వాసి ఫరిస్తా(సూక్ష్మదేవత)గా అవ్వాలంటే సంపూర్ణ పవిత్రులుగా అవ్వాలి. ఆత్మలో నిండిన మురికిని స్మృతి బలము ద్వారా తొలగించి శుభ్రము చేసుకోవాలి.
వరదానము :-
'' ఆత్మిక చిరునవ్వు ద్వారా, మొఖము ద్వారా ప్రసన్నతా ప్రకాశాన్ని చూపించే విశేష ఆత్మా భవ ''
బ్రాహ్మణ జీవితములోని విశేషత - ప్రసన్నత. ప్రసన్నత అనగా ఆత్మిక చిరునవ్వు. జోరుగా నవ్వరాదు, చిరునవ్వుతో ఉండాలి. మిమ్ములను ఎవరైనా తిట్తూ ఉన్నా మీ మొఖము పై దు:ఖపు అల రాకూడదు. సదా ప్రసన్నచిత్తులుగా ఉండాలి. ఎవరో ఒక గంట మాట్లాడారు, నేను ఒక సెకండే మాట్లాడాను అని అనుకోకండి. సెకండు మాట్లాడినా లేక ఆలోచించినా మొఖము పై అప్రసన్నత వచ్చిందంటే ఫెయిల్ అయిపోతారు. ఒక గంట సహించాను, తర్వాత గాలి పోయింది అని అనరాదు. శ్రేష్ఠమైన జీవితము గడపాలనే లక్ష్యముంటే విశేష ఆత్మలు, గాలితో నిండిన బెలూన్లగా అవ్వరు.
స్లోగన్ :-
'' శీతల శరీరము గల యోగులు స్వయం శీతలంగా అయ్యి ఇతరులను శీతలమైన దృష్టితో తృప్తి పరుస్తారు. ''