01-05-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీరు ఇచ్చటకు మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే ట్యూషన్ తీసుకునేందుకు వచ్చారు, గవ్వల నుండి వజ్రాలుగా అవుతున్నారు ''
ప్రశ్న :-
పిల్లలైన మీకు ఈ చదువులో ఏ ఖర్చూ ఉండదు - ఎందుకు ?
జవాబు :-
ఎందుకంటే ఇక్కడ మీ తండ్రియే మీకు టీచరు. తండ్రి పిల్లల నుండి ఫీజు ఎలా తీసుకుంటారు? తండ్రికి పిల్లలుగా అయ్యారు. ఒడిలోకి వస్తూనే వారసత్వానికి అధికారులుగా అయ్యారు. పిల్లలైన మీరు పైసా ఖర్చు లేకుండా గవ్వల నుండి వజ్ర సమానమైన దేవతలుగా అవుతారు. భక్తిమార్గములో తీర్థ యాత్రలు చేస్తారు, దాన-పుణ్యాదులు చేస్తారు. కావున అందులో ఖర్చే ఖర్చు ఉంటుంది. ఇక్కడైతే తండ్రి పిల్లలకు రాజ్యము ఇస్తారు. మొత్తం వారసత్వమంతా ఉచితంగా ఇచ్చేస్తారు. పావనంగా అవ్వండి, వారసత్వము తీసుకోండి.
ఓంశాంతి.
మేము విద్యార్థులమని పిల్లలు భావిస్తారు. తండ్రికి విద్యార్థులైన మీరు ఏం చదువుతున్నారు? మనము మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు ట్యూషన్ తీసుకుంటున్నాము. ఆత్మలమైన మనము పరమపిత పరమాత్మ నుండి ట్యూషన్ తీసుకుంటున్నాము. జన్మ-జన్మలుగా స్వయాన్ని ఆత్మ అని భావించక దేహమనే భావిస్తూ వచ్చామని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఆ లౌకిక తండ్రి ట్యూషన్ కొరకు మరో చోటుకు పంపుతాడు, సద్గతి కొరకు మరో చోటుకు పంపిస్తాడు. తండ్రి వృద్ధునిగా అయితే వానప్రస్థములోకి వెళ్లేందుకు ఇష్టపడ్తాడు. అయితే వానప్రస్థమునకు అర్థము ఎవ్వరికీ తెలియదు. శబ్ధము నుండి దూరంగా మనము ఎలా వెళ్లగలము? అది బుద్ధిలో నిలువదు. ఇప్పుడైతే మనము పతితులుగా ఉన్నాము. ఆత్మలమైన మనము ఎక్కడ నుండి వచ్చామో అక్కడ మీరు పావనంగా ఉండేవారు. ఇచ్చటకు వచ్చి పాత్ర చేస్తూ చేస్తూ పతితమైపోయారు. ఇప్పుడు మరలా పావనంగా ఎవరు చేస్తారు? ''ఓ పతితపావనా'' అని పిలుస్తారు కూడా. గురువులను ఎవ్వరూ పతితపావనులు అని అనజాలరు. గురువులను ఆశ్రయిస్తారు కానీ ఒక్కరిలోనే పూర్తి నిశ్చయముండదు. అందుకే మనలను మన ఇంటికి లేక వానప్రస్థ అవస్థకు చేర్చు గురువు దొరకాలని వెతుకుతూ ఉంటారు, అందుకు చాలా యుక్తులు రచిస్తారు. ఫలానా వారు చాలా మహిమ గలవారని వింటూనే అక్కడకు వెళ్తారు. ఎవరైతే ఈ వృక్షానికి అంటుగా ఉంటారో వారికి మీ జ్ఞాన బాణము తగులుతుంది. వారు ఇది చాలా స్పష్టమైన సత్యమైన విషయమని భావిస్తారు. మీరు తప్పకుండా వానప్రస్థ అవస్థకు వెళ్తారు కదా. అదేమంత పెద్ద విషయమేమీ కాదు టీచరుకు పాఠశాలలో చదివించడం పెద్ద విషయమేమీ కాదు. భక్తులకు ఏం కావాలో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ డ్రామా చక్రమును బాగా తెలుసుకున్నారు. తప్పకుండా తండ్రే వారసత్వము ఇచ్చారని, వారే ఇప్పుడు ఇస్తున్నారని, మళ్లీ అదే స్థితిలో వస్తారని పిల్లలైన మీరు అర్థము చేసుకున్నారు. మొట్టమొదటి ముఖ్య విషయము పావనంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయాలి. లౌకిక తండ్రి అయితే అందరికీ గుర్తుంటాడు. పారలౌకిక తండ్రి గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడం సులభములో సులభమని కష్టములో కష్టమని కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు.
ఆత్మ చాలా చిన్న నక్షత్రము. తండ్రి కూడా నక్షత్రమే. వారేమో సంపూర్ణ పవిత్రాత్మ. ఇతడేమో సంపూర్ణ అపవిత్ర ఆత్మ. సంపూర్ణ పవిత్రుని సాంగత్యము తేలుస్తుంది,................ అలా తేల్చేది(రక్షించేది) ఒక్కరి సాంగత్యమే. సాంగత్యము తప్పకుండా కావాలి. మళ్లీ 5 వికారాల రావణుని సాంగత్యము కూడా లభిస్తుంది. దానిని రావణ సంప్రదాయము అని అంటారు. మీరిప్పుడు రామ సంప్రదాయము వారిగా అవుతున్నారు. మీరు రామ సంప్రదాయమువారిగా అయిన తర్వాత ఈ రావణ సంప్రదాయము ఉండదు. ఈ జ్ఞానము ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. రాముడంటే భగవంతుడు. భగవంతుడే వచ్చి రామ రాజ్య స్థాపన చేస్తున్నారు అనగా సూర్యవంశ రాజ్యమును స్థాపన చేస్తారు. రామ రాజ్యమని కూడా అనరు కానీ సులభంగా అర్థం చేయించేందుకు రామరాజ్యము, రావణరాజ్యము అని అంటారు. వాస్తవంగా అది సూర్యవంశీయుల రాజ్యము. వజ్ర తుల్య జీవితమునెలా చేసుకోవాలనే చిన్న పుస్తకమొకటి మీ వద్ద ఉంది. ఇప్పుడు వజ్ర తుల్య జీవితమని దేనినంటారో మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. వజ్ర తుల్య దైవీ జీవితము ఎలా తయారవుతుంది? అని వ్రాయాలి. దేవత అనే పదమును కలపాలి. మనమిచ్చట వజ్ర సమానమైన జీవితమును తయారు చేసుకుంటున్నామని మీరు అనుభవము చేస్తున్నారు. తండ్రి తప్ప మరెవ్వరూ అటువంటి జీవితమును తయారు చేయలేరు. ఇది మంచి పుస్తకము. కేవలం ఈ పదము ఒక్కటి కలుపుకోండి. మీరు పైసా ఖర్చు లేకుండా గవ్వ సమాన ఆసురీ జన్మ నుండి వజ్ర సమాన దేవతా జన్మను ఒక్క సెకెండులో ప్రాప్తి చేసుకోగలరు. కొడుకు తండ్రి వద్ద జన్మ తీసుకోగానే వారసత్వానికి హక్కుధారునిగా అవుతాడు. కొడుకుకు ఏమైనా ఖర్చవుతుందా? ఒడిలోకి వస్తూనే వారసత్వానికి హక్కుధారునిగా అవుతాడు. ఖర్చు తండ్రి భరిస్తాడు కానీ కొడుకు కాదు. ఇప్పుడు మీరు ఏం ఖర్చు చేశారు? తండ్రివారిగా అవ్వడంలో ఖర్చు ఏమైనా ఉందా? - లేదు. ఎలాగైతే లౌకిక సంతానమవ్వడంలో ఖర్చు లేదో అదే విధంగా పారలౌకిక తండ్రికి సంతానంగా అవ్వడంలో కూడా ఏ ఖర్చు ఉండదు. ఇక్కడ తండ్రి కూర్చుని చదివిస్తారు, చదివించి మిమ్ములను దేవతలుగా చేస్తారు. మీరేమీ చిన్న పిల్లలు కారు, పెద్దవారు. తండ్రికి చెందిన వారిగా అయినందున తండ్రి మీకు సలహానిస్తారు. మీరు మీ రాజధానిని స్థాపన చేయాలి. దీని కొరకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఇందులో ఖర్చు ఏమీ లేదు. గంగా నదికి, తీర్థ స్థానాలకు స్నానము చేసేందుకు వెళ్తారు, ఖర్చు చేస్తారు కదా. మీకు తండ్రి పై నిశ్చయము ఏర్పడింది. ఇందులో ఖర్చు ఏమైనా అయ్యిందా? జనులు మీ వద్దకు, సేవాకేంద్రాలకు వస్తారు. ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి వారసత్వము తీసుకోండి, తండ్రిని స్మృతి చేయండి అని మీరు వారికి చెప్తారు. వారు తండ్రి కదా. తండ్రి స్వయంగా చెప్తున్నారు - ''నా వారసత్వము మీకు కావాలనుంకుంటే పతితుల నుండి పావనంగా అవ్వండి, అప్పుడు పావన విశ్వానికి అధికారులుగా అవ్వగలరు.'' తండ్రి వైకుంఠాన్ని స్థాపన చేస్తున్నారని కూడా మీకు తెలుసు. తెలివిగల పిల్లలు మంచి రీతిగా అర్థము చేసుకుంటారు. ఆ చదువులో చాలా ఖర్చు అవుతుంది, కానీ ఇక్కడ ఏ ఖర్చూ లేదు. నేను అవినాశిని, ఈ శరీరము వినాశనమైపోతుందని ఆత్మ అంటుంది. పిల్లలు మొదలైనవారందరూ వినాశనమైపోతారు. అప్పుడు జమ చేసిన ఈ ధనమంతా ఏం చేసుకుంటారు? ఆలోచన కలుగుతుంది కదా. చాలా షాహుకార్లుగా కూడా ఉంటారు, వారికి ఎవ్వరూ లేరనుకోండి, జ్ఞానము లభించినప్పుడు, ఈ పరిస్థితిలో ధనము ఏం చేసుకుంటాము? అని అనుకుంటారు. చదువు సంపాదనకు ఆధారము. తండ్రి తెలిపారు - అబ్రహమ్ లింకన్ చాలా పేదవాడిగా ఉండేవాడు, రాత్రుళ్లు మేలుకొని చదువుకునేవాడు. బాగా చదివి చదివి, ప్రెసిడెంట్ (అధ్యక్షుడు) అయ్యేటంత తెలివిగలవానిగా అయ్యాడు, అందులో ఏమైనా ఖర్చుందా? ఏ ఖర్చూ లేదు. పేదవారు చాలామంది ఉంటారు. చదువుకునేందుకు వారి వద్ద ప్రభుత్వము ధనము తీసుకోదు. ఈ విధంగా చాలామంది చదువుకుంటారు. అలా అబ్రహం లింకన్ కూడా ఫీజు లేకుండా ప్రెసిడెంట్ అయ్యాడు. ఎంత గొప్ప పదవి పొందాడు! ఈ ప్రభుత్వము(గవర్నమెంట్) కూడా ఏ ఫీజు తీసుకోదు. ఈ ప్రపంచములోని వారంతా పేదవారేనని ఈ ప్రభుత్వము భావిస్తుంది. ఎంత ధనవంతులైనా, లక్షాధికారులు, కోటీశ్వరులు వారు కూడా పేదవారనే అంటారు. నేను వారిని ధనవంతులుగా చేస్తాను. ఎంత ధనమున్నా, కొన్ని రోజుల వరకేనని మీకు తెలుసు. ఇదంతయూ మట్టిలో కలిసిపోతుంది. కనుక అందరూ పేదవారే కదా. ఆధారమంతా చదువు పైననే. చదువు కొరకు తండ్రి తన పిల్లల వద్ద ఏం తీసుకుంటాడు? తండ్రి ఈ విశ్వమంతటికీ అధికారి. మనము భవిష్యత్తులో ఇలా (లక్ష్మీనారాయణులు) అవుతామని పిల్లలకు తెలుసు. దీనిని స్థాపించేందుకు నేను వచ్చాను. బ్యాడ్జిలో కూడా ఈ జ్ఞానమంతా ఉంది. నూతన పరిశోధనలు, అన్వేషణలు అనేకము వెలువడ్తూ ఉంటాయి. మన ఆత్మలలో పాత్ర అంతా నిండి ఉందని శివబాబా చెప్తున్నారు. వికారులుగా, పతితంగా తయారైన వారిని తండ్రి వచ్చి పావనంగా చేస్తారు. 5 వేల సంవత్సరాల క్రితము తండ్రి నుండి ఈ విశ్వ చక్రవర్తి పదవిని తీసుకున్నామని కూడా మీకు తెలుసు. ముఖ్యమైన విషయం - ''నన్ను ఒక్కరినే స్మృతి చేయండి'' అని తండ్రి చెప్తున్నారు. వారు నేరుగా వచ్చి సన్ముఖములో చెప్తున్నారు. రథము లభించింది, కనుక తండ్రి కూడా వచ్చేశారు. రథము తప్పకుండా ఒకటి నిశ్చయింపబడి ఉంటుంది కదా. ఇది తయారైన డ్రామా. ఇందులో ఏ మార్పు జరగజాలదు. ఈ వజ్రాల వ్యాపారి ప్రజాపిత బ్రహ్మ ఎలా అవుతాడని అడుగుతారు. ఇతడు వజ్రాల వ్యాపారి అని భావిస్తారు. వజ్రాలు నకిలీవి ఉంటాయి, నిజమైనవి ఉంటాయి. ఇందులో కూడా అసలైన వజ్రాలు, రత్నాలు తండ్రి ఇస్తారు. అప్పుడు అవి(నకిలీ వజ్రాలు, రత్నాలు) దేనికి పనికి వస్తాయి? ఇవి జ్ఞాన రత్నాలు. వీటి ముందు ఆ రత్నాలు, మణులకు ఏ విలువా లేదు. ఈ జ్ఞాన రత్నాలు లభించినప్పుడు ఆ రత్నాల వ్యాపారము దేనికీ పనికి రాదని అర్థం చేసుకున్నాడు. ఈ ఒక్కొక్క ఈ అవినాశి జ్ఞాన రత్నము లక్షలు, కోట్ల రూపాయల విలువైనది. మీకు ఇటువంటి రత్నాలు అనేకము లభిస్తాయి. ఈ జ్ఞాన రత్నాలే సత్యమైనవిగా అవుతాయి. జోలెను నింపుకునేందుకు తండ్రి ఈ రత్నాలనిస్తారని మీకు తెలుసు. ఇవి ఉచితంగా లభిస్తాయి. ఇందులో ఏ ఖర్చూ లేదు. అక్కడైతే (సత్యయుగము) గోడలకు, పై కప్పులకు కూడా రత్నాలు, మణులు పొదగబడి ఉంటాయి. వాటి విలువ ఎంత ఉంటుంది! అక్కడ విలువ ఉండదు. విలువ తర్వాత వస్తుంది. అచ్చట వజ్రాలు, రత్నాలు కూడా మీకు లెక్కలేదు, విలువ ఉండదు. దీని పై పిల్లలకు నిశ్చయముండాలి.
ఇతడు రూపవంతుడు కూడా అయ్యారు, బసంత్ కూడా అయ్యారని తండ్రి అర్థం చేయించారు. బాబాది చాలా చిన్న రూపము. వారిని జ్ఞాన సాగరులని అంటారు. ఈ జ్ఞాన రత్నాలతో మీరు చాలా గొప్ప ధనవంతులుగా అవుతారు. అంతేకాని అమృతము లేక నీరు మొదలైన వాటి వర్షము కాదు. చదువులో నీటి మాటే ఉండదు. పవిత్రంగా అయ్యేందుకు ఖర్చు చేసే మాటే లేదు. మీకిప్పుడు వివేకము లభించింది. పతితపావనులు ఒకే ఒక్క తండ్రేనని మీకు తెలుసు. మీరు మీ యోగబలము ద్వారా పవిత్రంగా అవుతున్నారు. పావనమై, పావన ప్రపంచములోనికి వెళ్తామని కూడా తెలుసు. ఇప్పుడిది రైటా? అది రైటా? ఈ మాటలన్నిటి పై మీ బుద్ధి నడవాలి. డ్రామాలో ఈ భక్తి పాత్ర కూడా జరగాల్సిందే. ఇప్పుడు మీరు పావనమై పావన ప్రపంచములోకి వెళ్లాలని తండ్రి చెప్తున్నారు. ఎవరైతే పావనంగా అవుతారో వారు వెళ్తారు. ఎవరైతే ఇక్కడి స్యాప్లింగ్గా ఉంటారో వారు వస్తారు(ఇచ్చటకు రావలసిన వారే వస్తారు). మిగిలిన వారికి అర్థమే కాదు. వారు ఊబిలో చిక్కుకునే ఉంటారు. చివరిలో విన్నప్పుడు - ఓహో ప్రభూ మీ లీల,........... మీరు పాత ప్రపంచాన్ని కొత్తదిగా ఎంత అద్భుతంగా చేస్తున్నారని అంటారు. ఈ జ్ఞానము గురించి వార్తాపత్రికలలో చాలా చాలా ప్రచురిస్తారు. ముఖ్యంగా ఈ చిత్రాలను రంగులలో వార్తాపత్రికల యందు ప్రచురించండి. ఆ చిత్రము క్రింద శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా చదివించి స్వర్గానికి అధిపతులుగా(ఈ లక్ష్మీ నారాయణులుగా) చేస్తారని వ్రాయండి. ఎలా? స్మృతి యాత్ర ద్వారా చేస్తారు. స్మృతి చేస్తూ - చేస్తూ మీ తుప్పు వదిలిపోతుంది. మీరు నిల్చొనే అందరికీ ఈ దారి చూపించగలరు. ఏ దారి అనునది తండ్రి తెలియజేస్తున్నారు - నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. పదే పదే ఈ స్మృతినిప్పించి వారి ముఖము ఏమైనా మారుతుందా? అని గమనించండి. కనులు ఏమైనా నీటితో తడుస్తున్నాయా అని గమనించండి. తడుస్తే బుద్ధిలో ఏమో కూర్చుందని అర్థం చేసుకోండి. మొట్టమొదట ఈ ఒక్క మాటే అర్థం చేయించాలి. 5 వేల సంవత్సరాల క్రితము కూడా తండ్రి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని చెప్పారు. శివబాబా వచ్చారు, అందుకే శివజయంతి పండుగను జరుపుకుంటున్నారు. భారతదేశాన్ని స్వర్గంగా చేసేందుకు - ''నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీరు పావనమైపోతారని అర్థం చేయించారు.'' చిన్న చిన్న పిల్లలు కూడా కూర్చుని ఈ విధంగా అర్థం చేయించాలి - అనంతమైన తండ్రి శివబాబా ఇలా తెలిపారని చెప్పాలి. బాబా అనే పదము చాలా మధురమైనది. తండ్రి మరియు వారసత్వము. పిల్లలకు ఇంత నిశ్చయముండాలి. ఇది మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే విద్యాలయము. దేవతలంటేనే పవిత్రులు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి. 'మన్మనాభవ' ఈ పదము విన్నారా, వినకుంటే తండ్రి వినిపిస్తున్నారు. తండ్రి చెప్తున్నారు - నేన్నొక్కరినే పతితపావనుడను, నన్ను స్మృతి చేస్తే మీ మురికి తొలగిపోయి సతోప్రధానంగా అవుతారు. శ్రమ అంతా ఇందులోనే ఉంది. జ్ఞానమేమో అందరూ బాగుందని, ఫస్ట్క్లాస్ జ్ఞానమని అంటారు. కానీ ప్రాచీన యోగమంటే ఏమిటో ఎవ్వరికీ తెలియదు. పవిత్రంగా అవ్వాలనే మాట మీరు వినిపించినా అర్థము చేసుకోరు. తండ్రి అంటున్నారు - ''ఇప్పుడు మీరంతా పతితమై తమోప్ర్రధానంగా అయ్యారు.'' మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి. నిజానికి ఆత్మలైన మీరు మొదట నా జతలోనే ఉండేవారు కదా. నన్ను మీరు '' ఓ గాడ్ ఫాదర్ రండి '' అని కూడా పిలిచారు. ఇప్పుడు నేను వచ్చాను, మీరు నా మతమును అనుసరించండి. ఇది అయ్యిందే పతితము నుండి పావనమయ్యే మతము. నేను సర్వశక్తివంతుడను, సదా పవిత్రుడను. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. దీనినే ప్రాచీన రాజయోగమని అంటారు. మీరు వృత్తి వ్యాపారాదులు భలే చేయండి, పిల్లలు మొదలైన వారిని భలే సంభాళించండి, కేవలం బుద్ధి యోగాన్ని మిగిలిన వాటి నుండి తొలగించి నాతో జోడించండి. ఇదే అన్నిటికంటే ముఖ్యమైన విషయము. ఇది అర్థము చేసుకోకుంటే ఏమీ అర్థం కానట్లే. ''జ్ఞానమేమో మంచి జ్ఞానమిస్తున్నారు, పవిత్రత కూడా మంచిదే, అయితే మేము పవిత్రమెలా అవ్వాలి '' అని అడుగుతారు. సదా కొరకు పవిత్రంగా ఉండాలని అర్థము చేసుకోరు. దేవతలు ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండేవారు కదా, వారు ఎలా తయారయ్యారు? మొట్టమొదట ఈ విషయాన్ని అర్థము చేయించాలి. తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి. స్మృతి ద్వారానే పాపాలు నశిస్తాయి. అంతేకాక మీరు దేవతలుగా అవుతారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. స్వయాన్ని పేదల నుండి ధనవంతులుగా చేసుకునేందుకు తండ్రి నుండి అవినాశి జ్ఞాన రత్నాలు తీసుకోవాలి. ఒక్కొక్క జ్ఞాన రత్నము లక్షల, కోట్ల రూపాయల విలువగలది. వీటి విలువను తెలుసుకొని ఈ చదువును చదువుకోవాలి. ఈ చదువే సంపాదనకు మూలము, దీని ద్వారానే ఉన్నత పదవిని పొందాలి.
2. రామ సంప్రదాయములోకి వచ్చేందుకు సంపూర్ణ పవిత్రులైన ఒక్క తండ్రి సాంగత్యమే చేయాలి. చెడు సాంగత్యము నుండి సదా దూరంగా ఉండాలి. అందరి నుండి బుద్ధి యోగమును తొలగించి ఒక్క తండ్రితో జోడించాలి.
వరదానము :-
'' స్వయంలో సర్వ శక్తులను ఎమర్జ్ రూపంలో అనుభవం చేసే సర్వ సిద్ధిస్వరూప భవ ''
లౌకికంలో ఎవరి వద్దనైనా, ఏదైనా శక్తి ఉంటే, ధనము కావచ్చు, బుద్ధి కావచ్చు, సంబంధ సంపర్కము కావచ్చు.............. వారికి ఇదేమంత పెద్ద విషయము అని నిశ్చయముంటుంది. వారికి గల శక్తి ఆధారంతో సిద్ధిని ప్రాప్తి చేసుకుంటారు. మీ వద్ద అయితే అన్ని శక్తులు ఉన్నాయి. అవినాశి ధన శక్తి సదా మీ జతలో ఉంది. బుద్ధి శక్తితో పాటు పొజిషన్ శక్తి కూడా ఉంది. మీలో సర్వ శక్తులూ ఉన్నాయి. వాటిని కేవలం ఎమర్జ్ రూపంలో అనుభవం చేస్తే సమయానికి విధి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకొని సిద్ధిస్వరూపులుగా అవుతారు.
స్లోగన్ :-
'' మనసును ప్రభువు తాకట్టుగా భావించి దానిని సదా శ్రేష్ఠ కార్యములో ఉపయోగించండి. ''