07-06-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మాయాజీతులుగా అయ్యేందుకు పొరపాట్లు చేయడం వదిలేయండి, దు:ఖము ఇవ్వడం, దు:ఖము తీసుకోవడం - ఇది చాలా పెద్ద తప్పు,
ప్రశ్న :-
పిల్లలైన మనందరి పట్ల తండ్రికి గల ఒక ఆశ ఏది ?
జవాబు :-
తండ్రి ఆశ - నా పిల్లలంతా నా సమానంగా సదా పవిత్రంగా అయిపోవాలి. తండ్రి సదా పవిత్రంగా ఉంటారు. వారు నల్లగా ఉన్న పిల్లలను తెల్లగా చేసేందుకు వచ్చారు. మాయ నల్లగా చేస్తుంది. తండ్రి తెల్లగా చేస్తారు. లక్ష్మీనారాయణులు తెల్లగా ఉంటారు. అందుకే నల్లగా ఉన్న పతిత మనుష్యులు వారిని మహిమ చేస్తారు. స్వయాన్ని నీచులుగా భావిస్తారు - మధురమైన పిల్లలూ! ఇప్పుడు తెల్లగా, సతోప్రధానంగా అయ్యే పురుషార్థము చేయండి అని తండ్రి శ్రీమతము ఇప్పుడు లభిస్తోంది.
ఓంశాంతి.
తండ్రి ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు? తమోప్రధానమైపోయిన మన ఆత్మలను సతోప్రధానంగా చేసుకోవాలని పిల్లలకూ తెలుసు, అది తండ్రికి కూడా తెలుసు. అలాంటి ఆత్మలను స్వర్ణయుగ ఆత్మలని అంటారు. తండ్రి ఆత్మలను చూస్తారు. ఆత్మనైన నేను నల్లగా అయ్యానని ఆత్మకే ఆలోచన కలుగుతుంది. ఆత్మ కారణంగా శరీరము కూడా నల్లగా అయిపోయింది. లక్ష్మీనారాయణుల మందిరాలకు వెళ్తారు, ఇంతకుముందు జ్ఞానము కొంచెము కూడా ఉండేది కాదు. లక్ష్మీనారాయణులను చూచి వీరు సర్వ గుణ సంపన్నులు, పవిత్రులు, మేము నల్లని భూతాలుగా ఉన్నామని భావించేవారు. కానీ అప్పుడు జ్ఞానము లేదు. ఇప్పుడు లక్ష్మీనారాయణుల మందిరానికి వెళ్తే ఇంతకుముందు మీరు ఈ విధంగా సర్వగుణ సంపన్నులుగా ఉండేవారము, ఇప్పుడు నల్లగా, పతితంగా అయిపోయామని భావిస్తారు. వారి ముందుకు వెళ్లి మేము నల్లగా, వికారులుగా, పాపులుగా ఉన్నామని అంటారు. వివాహము చేసుకునే ముందు వధు-వరులను లక్ష్మీనారాయణుల మందిరానికి తీసుకెళ్తారు. మొదట ఇరువురు నిర్వికారిగా ఉంటారు. తర్వాత వికారులుగా అవుతారు. కావున నిర్వికారులుగా ఉన్న దేవతల ముందుకు వెళ్లి స్వయాన్ని వికారులుగా, పతితులుగా చెప్పుకుంటారు. వివాహానికి ముందు అలా చెప్పరు. వికారాలకు వశమైనందున మందిరానికి వెళ్లి వారిని మహిమ చేస్తారు. ఈ రోజులలో అయితే లక్ష్మీనారాయణుల మందిరములో, శివుని మందిరములో కూడా వివాహాలు జరుగుతున్నాయి. పతితులుగా అయ్యేందుకు కంకణము కట్టుకుంటారు. కానీ ఇప్పుడు మీరు పవిత్రంగా(తెల్లగా) అయ్యేందుకు కంకణము కట్టుకుంటారు. అందుకే తెల్లగా తయారుచేసే శివబాబాను స్మృతి చేస్తారు. ఈ రథములో భృకుటి మధ్య శివబాబా ఉన్నారని మీకు తెలుసు. వారు సదా పవిత్రులు. పిల్లలు కూడా పవిత్రంగా, తెల్లగా అవ్వాలని, నన్ను ఒక్కరినే స్మృతి చేసి పవిత్రంగా అవ్వాలని వారి ఆశ. ఆత్మ తన తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి కూడా పిల్లలను చూసి చూసి హర్షితమవుతారు. పిల్లలైన మీరు కూడా తండ్రిని చూస్తూ చూస్తూ పవిత్రమైపోవాలని భావిస్తారు. అలా అయినందున మళ్లీ మనము ఇటువంటి లక్ష్మీనారాయణులుగా అవుతాము. ఈ లక్ష్యమును పిల్లలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అంతేకాని బాబా వద్దకు వచ్చేశాము అంతేచాలు అని అనుకోరాదు. మళ్లీ అక్కడకు వెళ్తూనే మీ వ్యాపారాలు మొదలైన వాటిలో పూర్తిగా మునిగిపోవడం కాదు. అందువలన ఇక్కడ సన్ముఖములో తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. భృకుటి మధ్యలో ఆత్మ ఉంటుంది. మృత్యువు లేని(అకాల) ఆత్మకు ఇది సింహాసనము. నా పిల్లలైన ఆత్మలు ఈ సింహాసనము పై కూర్చొని ఉన్నారు. స్వయం ఆత్మనే తమోప్రధానమైనందున సింహాసనము కూడా తమోప్రధానంగా ఉంది. ఇవి మంచిరీతిగా అర్థము చేసుకునే విషయాలు. ఇటువంటి లక్ష్మీనారాయణులుగా అవ్వడం పిన్నమ్మ ఇల్లు కాదు(సులభము కాదు). ఇప్పుడు మనము వీరి వలె తయారవుతున్నామని మీరు భావిస్తారు. ఆత్మ పవిత్రంగా అయ్యే వెళ్తుంది. ఆ తర్వాత దేవీ దేవతలని పిలువబడ్తారు. మనము ఇటువంటి స్వర్గానికి అధికారులుగా అవుతాము. కానీ మాయ మరిపింపజేస్తుంది. చాలామంది ఇక్కడ విని బయటకు వెళ్తూనే మర్చిపోతారు. అందువలన బాబా బాగా పక్కా చేయిస్తున్నారు - ''ఈ దేవతలలో ఏ ఏ గుణాలున్నాయో శ్రీమతమును అనుసరించి మేము ధారణ చేస్తున్నామా?'' అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. చిత్రాలు కూడా మీ ఎదురుగానే ఉన్నాయి. మనము ఇలా అవ్వాలని మీకు తెలుసు. ఆ తండ్రే అలా తయారుచేస్తారు. ఇతరులెవ్వరూ మనుష్యుల నుండి దేవతలుగా చేయలేరు. అలా చేయువారు తండ్రి ఒక్కరే. మనుష్యుల నుండి దేవతలుగా........... అనే గాయనము కూడా ఉంది. మీలో కూడా నంబరువారుగా తెలుసు. ఈ విషయాలు భక్తులకు తెలియదు. ఎంతవరకు భగవంతుని శ్రీమతమును తీసుకోరో అంతవరకు ఏమీ అర్థము చేసుకోలేరు. పిల్లలైన మీరిప్పుడు శ్రీమతమును తీసుకుంటున్నారు. మనము శివబాబా మతమును అనుసరిస్తూ, బాబాను స్మృతి చేస్తూ చేస్తూ ఇలా అవుతాము. స్మృతి ద్వారానే పాపాలు భస్మమవుతాయి. ఏ ఇతర ఉపాయమూ లేదని బుద్ధిలో బాగా ఉంచుకోండి.
లక్ష్మీనారాయణులైతే తెల్లగా ఉన్నారు కదా. అయితే మందిరములో నల్లగా చేసి ఉంచారు. రఘునాథ మందిరములో రాముని కూడా నల్లగా చేశారు - ఎందుకు? కారణము ఎవ్వరికీ తెలియదు. విషయము చాలా చిన్నది. రాముడు త్రేతా యుగమువాడు. కొంచెము తేడా ఉంటుంది. రెండు కళలు తగ్గిపోయాయి కదా. బాబా అర్థం చేయిస్తున్నారు - ప్రారంభములో ఇతను సతోప్రధానంగా, సుందరంగా ఉండేవాడు. ప్రజలు కూడా సతోప్రధానంగా అవుతారు. కానీ శిక్షలు అనుభవించి ప్రజలుగా అవుతారు. శిక్షలు ఎంత అధికంగా ఉంటాయో అంత పదవి కూడా తగ్గిపోతుంది. శ్రమ చేయకుంటే పాపాలు నశించవు, పదవి తగ్గిపోతుంది. తండ్రి స్పష్టము చేసి అర్థం చేయిస్తున్నారు. మీరు ఇక్కడ తెల్లగా అయ్యేందుకు కూర్చొని ఉన్నారు. కానీ మాయ చాలా పెద్ద శత్రువు. మాయనే మిమ్ములను నల్లగా తయారు చేసింది. ఇప్పుడు తెల్లగా తయారు చేసేవారు వచ్చారని గమనిస్తూనే మాయ ఎదిరిస్తుంది. తండ్రి అంటున్నారు - డ్రామా అనుసారము అర్ధకల్పము మాయ పాత్ర చేయాలి. మాయ మాటిమాటికి ముఖమును త్రిప్పి మరోవైపుకు తీసుకెళ్తుంది. ''బాబా నన్ను మాయ చాలా విసిగిస్తుందని పిల్లలు వ్రాస్తారు. ఇదే యుద్ధమని బాబా అంటున్నారు. మీరు తెలుపు నుండి నల్లగా, మళ్లీ నలుపు నుండి తెల్లగా అవుతారు, ఇది ఒక ఆట. ఎవరైతే 84 జన్మలు పూర్తిగా తీసుకుంటారో వారికే అర్థం చేయిస్తారు. వారి పాదాలు భారతదేశములోనే వస్తాయి. అలాగని భారతదేశములోని వారందరూ 84 జన్మలు తీసుకునేవారని కూడా కాదు.
ఇప్పుడు పిల్లలైన మీ సమయము అత్యంత విలువైనది. పూర్తిగా పురుషార్థము చేసి ఇలా (లక్ష్మీనారాయణులుగా) తయారవ్వాలి. అందుకు కేవలం నన్ను స్మృతి చేసి దైవీగుణాలను ధారణ చేయండి అని తండ్రి చెప్తున్నారు. ఎవ్వరికీ దుఃఖము ఇవ్వరాదు. పిల్లలూ, ఇప్పుడు ఇటువంటి పొరపాటు చేయవద్దని తండ్రి చెప్తున్నారు. బుద్ధియోగము ఒక్క తండ్రితో జోడించండి. మేము మీకు సమర్పణ అవుతామని ప్రతిజ్ఞ చేశారు. జన్మ-జన్మాంతరాలు ప్రతిజ్ఞ చేస్తూ వచ్చారు. బాబా మీరు వస్తే మేము మీ మతము పైనే నడుచుకుంటాము, పావనంగా అయ్యి దేవతలుగా తయారవుతామని ప్రతిజ్ఞ చేస్తూ వచ్చారు. ఒకవేళ మీ యుగల్(జీవిత భాగస్వామి) మీకు సహయోగము ఇవ్వకపోతే మీ పురుషార్థము మీరు చేయండి. యుగల్ సహయోగిగా అవ్వకపోతే జంట తయారవ్వదు. ఎవరు ఎంత స్మృతి చేసి ఉంటారో, దైవీ గుణాలు ధారణ చేసి ఉంటారో, దానిని బట్టే జంట తయారవుతుంది. ఉదాహరణానికి బ్రహ్మా-సరస్వతులు మంచి పురుషార్థము చేశారు కనుక వారి జంట తయారవుతుంది. ఇతడు చాలా మంచి సేవ చేస్తారు. స్మృతి కూడా చేస్తాడు. ఇది కూడా గుణమే కదా. గోపులలో (అన్నయ్యలలో) కూడా మంచి-మంచి పిల్లలు చాలామంది ఉన్నారు. మాయ ఆకర్షిస్తుందని, ఈ సంకెళ్లు తెగిపోవడం లేదని కొందరు స్వయంగా అర్థం చేసుకుంటారు కూడా. మాయ పదే పదే నామ-రూపాలలో చిక్కుకునేలా చేస్తుంది. నామ-రూపాలలో చిక్కుకోకండి, నాలోనే చిక్కుకోండి అని బాబా అంటున్నారు. మీరు ఎలాగైతే నిరాకారులో అలా నేను కూడా నిరాకారుడనేే. మిమ్ములను నా సమానంగా తయారు చేస్తాను. టీచరు తమ సమానంగా తయారు చేస్తాడు కదా. సర్జన్ సర్జన్లా తయారు చేస్తాడు. వీరు అనంతమైన తండ్రి. వీరి పేరు ఎంతో ప్రసిద్ధమైనది. ఓ పతిత పావనా! రండి అని కూడా పిలుస్తారు. ఆత్మయే శరీరము ద్వారా తండ్రిని ''మీరు వచ్చి మమ్ములను పవిత్రంగా చేయండని పిలుస్తుంది.'' మనలను పావనంగా ఎలా చేస్తున్నారో మీకు తెలుసు. ఉదాహరణానికి వజ్రాలలో కొన్ని నల్ల మచ్చలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆత్మలైన మీలో మలినము మిశ్రమమై ఉంది. దానిని తొలగించి మళ్లీ స్వచ్ఛమైన బంగారుగా తయారు చేస్తారు. ఆత్మ చాలా పవిత్రంగా తయారవ్వాలి. మీ లక్ష్యము, ఉద్ధేశ్యము స్పష్టంగా ఉంది. ఈ విధంగా ఇతర సత్సంగాలలో ఎప్పుడూ చెప్పరు.
ఇలా(లక్ష్మీనారాయణులుగా) తయారవ్వడమే మీ ఉద్ధేశ్యమని తండ్రి అర్థం చేయిస్తారు. డ్రామానుసారము అర్ధకల్పము రావణుని సాంగత్యములో వికారులుగా అయ్యామని కూడా తెలుసు. ఇప్పుడు ఈ విధంగా తయారవ్వాలి. మీ వద్ద బ్యాడ్జి కూడా ఉంది. ఈ బ్యాడ్జి ద్వారా అర్థం చేయించడం చాలా సులభము. ఇది త్రిమూర్తి బ్యాడ్జి. బ్రహ్మ ద్వారా స్థాపన అని అంటారు కానీ బ్రహ్మ స్థాపన చేయడు కదా. అతను పతితము నుండి పావనంగా అవుతాడు. పతితులే మళ్లీ పావనంగా అవుతారని మానవులకు తెలియదు. ఈ చదువు యొక్క లక్ష్యము చాలా ఉన్నతమైనదని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. మనలను చదివించేందుకే తండ్రి వచ్చారు. ఈ జ్ఞానము ఒక్క తండ్రిలో మాత్రమే ఉంది. వారు ఎవరి వద్దా చదవలేదు. డ్రామాప్లాను అనుసారము వారిలో జ్ఞానముంది. వీరిలోకి జ్ఞానము ఎక్కడి నుండి వచ్చిందని అడగరాదు. వారు సదా జ్ఞానసాగరులు. వారే మిమ్ములను పతితుల నుండి పావనంగా చేస్తారు. మానవులైతే పావనంగా అయ్యేందుకు గంగా నది మొదలైన నదులలో స్నానము చేస్తూనే ఉంటారు. సముద్రములో కూడా స్నానము చేస్తారు. సాగరమును దేవతగా భావించి పూజలు కూడా చేస్తారు. నిజానికి ప్రవహించే నదులు ఉండనే ఉంటాయి. ఎప్పటికీ వినాశమవ్వవు. కాకుంటే ఇంతకుముందు అవి పద్ధతిగా ప్రవహించేవి. అనగా వరదలు మొదలైనవి ఉండేవి కావు. వరద అనే పేరే తెలియదు. మానవులు ఎప్పుడూ అందులో మునిగిపోయేవారు కాదు. అక్కడైతే మనుష్యులు చాలా కొంతమందే ఉండేవారు. ఆ తర్వాత వృద్ధి చెందుతూ ఉంటారు. కలియుగమ అంతానికి ఎంతమంది మనుష్యులైపోతారు! అక్కడ ఆయువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా తక్కువమంది మనుష్యులుంటారు. 2500 సంవత్సరాలలో ఎంత వృద్ధి జరుగుతుంది! వృక్షము చాలా విస్తారమైపోతుంది. మొట్టమొదట భారతదేశములో కేవలం మన రాజ్యమే ఉండేదని మీరంటారు. మీలో కూడా కొంతమందికి మనము మన రాజ్యమును స్థాపన చేస్తున్నామని గుర్తుంటుంది. మనము ఆత్మిక యోధులము, యోగబలము కలిగిన యోధులమని కూడా మర్చిపోతారు. మనము మాయతో యుద్ధము చేసేవారము. ఇప్పుడు ఈ రాజధాని స్థాపన అవుతోంది. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, అంత విజయులుగా అవుతారు. ఈ విధంగా తయారవ్వడమే మన లక్ష్యము. ఇతని ద్వారా బాబా మనలను ఈ దేవతలుగా తయారు చేస్తున్నారు. అందుకు మళ్లీ ఏం చేయాలి? తండ్రిని స్మృతి చేయాలి. ఇతను దళారి. ఎప్పుడైతే సద్గురువు దళారి రూపములో లభిస్తారో,......... అన్న గాయనము కూడా ఉంది. బాబా ఇతని శరీరము తీసుకున్నారు కనుక బాబాకు మనకు మధ్య ఇతడు(బ్రహ్మ) దళారి అయ్యాడు కదా. మీ యోగమును శివబాబాతో జోడింపజేస్తాడు. అంతేకాని నిశ్చితార్థము మొదలైన పేర్లు వాడకండి. శివబాబా ఇతని ద్వారా ఆత్మలైన మనలను పావనంగా చేస్తున్నారు. ఓ పిల్లలారా! నన్ము స్మృతి చేయండని అంటున్నారు. తండ్రి అయిన నన్ను స్మృతి చేయండని మీరు అనరు. బాబా ఈ విధంగా చెప్తున్నారని మీరు ఇతరులకు తండ్రి జ్ఞానాన్ని వినిపిస్తారు. ఈ విషయాన్ని కూడా తండ్రి మంచిరీతిగా అర్థము చేయిస్తారు. పోను పోను చాలా మందికి సాక్షాత్కారమవుతుంది. అప్పుడు మనసు లోలోపల తింటూ ఉంటుంది. ఇప్పుడు చాలా తక్కువ సమయముందని తండ్రి అంటున్నారు. ఈ కనులతో మీరు వినాశనము చూస్తారు. వినాశనము ఎలా జరుగుతుందో దాని రిహార్సల్ మీరు చూస్తారు. ఈ కనులతో కూడా చాలా చూస్తారు. చాలామందికి వైకుంఠము కూడా సాక్షాత్కారమవుతుంది. ఇవన్నీ చాలా త్వరత్వరగా జరుగుతూ ఉంటాయి. ఈ జ్ఞాన మార్గములో అన్నీ సత్యమైనవే, భక్తిమార్గములో అన్నీ నకిలీవి. కేవలం సాక్షాత్కారము చేసుకుంటారు. కానీ అలా ఎవ్వరూ తయారవ్వలేదు. మీరు తయారవుతారు. సాక్షాత్కారము అయిన వాటిని మళ్ళీ ఈ కనులతో చూస్తారు. వినాశనము చూడడం పిన్నమ్మ ఇల్లేమి కాదు. ఎలా ఉంటుందో అడగవద్దు. ఒకరినొకరు ఎదురుగానే హత్య చేసుకుంటారు. రెండు చేతులతోనే కదా చప్పట్లు మ్రోగేవి. పరస్పరము పోట్లాడుకోమని అన్నదమ్ములను వేరు చేసేస్తారు. ఇది కూడా డ్రామాలో తయారై ఉంది. ఈ రహస్యాన్ని వారు అర్థము చేసుకోరు. అన్నదమ్ములను విడదీసినందున పోట్లాడుకుంటూ ఉంటారు. దాని వలన వారు ఫిరంగులు, తుపాకులు అమ్ముడవుతూ ఉంటాయి. అది వారికి సంపాదన కదా, కానీ చివరిలో వీటితో పని జరగదు. ఇంట్లో కూర్చునే బాంబులు వేస్తారు. అందరూ సమాప్తమైపోతారు. అందులో మనుష్యుల అవసరము గానీ, ఆయుధాల అవసరము గానీ ఉండదు. అందువలన తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలారా! స్థాపన తప్పకుండా జరిగే తీరాలి. ఎవరు ఎంత పురుషార్థము చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తున్నారు. ఈ కామ ఖడ్గమును ఉపయోగించకండి. కామమును జయిస్తే జగత్జీతులుగా అవుతారని భగవంతుడు అంటున్నారు. చివర్లో కొందరికి బాణము తప్పకుండా తగులుతుంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఈ సమయము చాలా విలువైనది, ఇప్పుడే పురుషార్థము చేసి పూర్తిగా తండ్రికి బలిహారమవ్వాలి. దైవీ గుణాలు ధారణ చేయాలి. ఎలాంటి పొరపాట్లు చేయరాదు. ఒక్క తండ్రి మతము అనుసారము నడుచుకోవాలి.
2. లక్ష్యమును, ఉద్ధేశ్యాన్ని ఎదురుగా ఉంచుకొని చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఆత్మను సతోప్రధానంగా, పవిత్రంగా చేసుకునేందుకు శ్రమించాలి. ఆంతరికములో ఉన్న మచ్చలను (మలినాలను) పరిశీలించి తొలగించి వేయాలి.
వరదానము :-
'' బ్రాహ్మణ జీవితంలో సదా సంతోషమనే ఆహారాన్ని తిని, సంతోషాన్ని పంచే అదృష్టశాలీ భవ ''
ఈ ప్రపంచంలో బ్రాహ్మణులైన మీ వంటి అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ఈ జీవితంలోనే మీ అందరికి బాప్దాదా హృదయ సింహాసనము లభిస్తుంది. సదా సంతోషమనే ఆహారము తింటారు, సంతోషాన్నే పంచుతారు. ఈ సమయంలో మీరు చింతలేని చక్రవర్తులు. ఈ విధమైన చింతలేని జీవితము మొత్తం కల్పములో, ఏ ఇతర యుగములో లేదు. సత్యయుగంలో చింత లేకుండా ఉంటారు కానీ అక్కడ జ్ఞానముండదు. ఇప్పుడు మీకు జ్ఞానముంది. అందువలన హృదయం నుండి ''నా వంటి అదృష్టశాలురెవ్వరూ లేరనే మాట వెలువడ్తుంది.''
స్లోగన్ :-
'' సంగమ యుగములోని స్వరాజ్య అధికారులే భవిష్యత్తులో విశ్వ రాజ్య అధికారులుగా అవుతారు. ''