25-02-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసము చేసినట్లయితే దైవీగుణాలు వస్తూ ఉంటాయి, క్రిమినల్ (అపవిత్రమైన) ఆలోచనలు సమాప్తమవుతాయి, అపారమైన సంతోషము ఉంటుంది''
ప్రశ్న :-
తమ నడవడికను సరిచేసుకునేందుకు లేదా అపారమైన ఖుషీలో ఉండేందుకు ఏ విషయాన్ని సదా స్మృతిలో ఉంచుకోవాలి ?
జవాబు :-
మేము దైవీ స్వరాజ్య స్థాపన చేస్తున్నాము. మృత్యులోకమును వదిలి వెళ్ళి అమరలోకములోకి వెళ్తున్నామని సదా స్మృతిలో ఉండాలి. దీని ద్వారా చాలా సంతోషంగా ఉంటారు. నడవడిక కూడా బాగవుతూ ఉంటుంది. ఎందుకంటే అమరలోకమైన నూతన ప్రపంచములోకి వెళ్లేందుకు దైవీ గుణాలు తప్పకుండా అవసరము. స్వరాజ్యము కొరకు చాలామంది కళ్యాణము కూడా చేయవలసి ఉంటుంది. అందరికి మార్గాన్ని తెలుపవలసి ఉంటుంది.
ఓంశాంతి.
పిల్లలు స్వయాన్ని ఈ ప్రపంచానికి చెందినవారిగా భావించరాదు. మన రాజ్యము ఏదైతే ఉండేదో, దానిని రామరాజ్యము లేదా సూర్యవంశీ రాజ్యమని అంటారో అందులో ఎంతో సుఖ-శాంతులుండేవని ఇప్పుడు మీకు తెలిసింది. ఇప్పుడు మనము మళ్లీ దేవతలుగా అవుతున్నాము. ఇంతకుముందు కూడా అలా అయ్యాము. మనమే సర్వగుణ సంపన్నులు......... దైవీ గుణాలు గలవారిగా ఉండేవారము. మనము మన రాజ్యములో ఉండేవారము. ఇప్పుడు రావణరాజ్యములో ఉన్నాము. మనము మన రాజ్యములో చాలా సుఖంగా ఉండేవారము. కనుక లోలోపల చాలా ఖుషీ మరియు నిశ్చయము కలగాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు మళ్లీ మీ రాజధానిలోకి వెళ్తున్నారు. రావణుడు మీ రాజ్యాన్ని దోచుకున్నాడు. మనకు మన సూర్యవంశీ స్వరాజ్యముండేదని, మనం రామరాజ్యానికి చెందినవారమని, మనము దివ్యగుణాలు గలవారిగా చాలా సుఖంగా ఉండేవారమని మళ్లీ రావణుడు మన రాజ్యభాగ్యాన్ని దోచుకున్నాడని మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి వచ్చి మన రాజ్యము మరియు పరాయి రాజ్య రహస్యము గురించి అర్థం చేయిస్తున్నారు. అర్ధకల్పము మనము రామరాజ్యములో తర్వాత అర్ధకల్పము రావణరాజ్యములో ఉన్నాము. పిల్లలకు ప్రతి విషయములో నిశ్చయముంటే సంతోషంలో ఉంటారు, నడవడిక కూడా బాగుపడ్తుంది. ఇప్పుడు మనము పరాయి రాజ్యములో చాలా దు:ఖీలుగా ఉన్నాము. తాము పరాయి రాజ్యములో దు:ఖితులుగా ఉండేవారమని ఇప్పుడు(స్వతంత్రము తర్వాత) మన రాజ్యంలో సుఖంగా ఉన్నామని భారతవాసులైన హిందువులు భావిస్తారు. కాని ఇది అల్పకాల కాకిరెట్టకు సమానమైన సుఖము. పిల్లలైన మీరు ఇప్పుడు సదాకాల సుఖ ప్రపంచములోకి వెళ్తున్నారు. కనుక పిల్లలైన మీకు ఇప్పుడు లోపల చాలా సంతోషముండాలి. జ్ఞానములో లేకుంటే మీరు రాతిబుద్ధి వంటివారు. మేము తప్పకుండా మా రాజ్యము తీసుకుంటామని పిల్లలైన మీకు తెలుసు. ఇందులో కష్టపడేే విషయమేదీ లేదు. రాజ్యం తీసుకున్నాము, అర్ధకల్పము రాజ్యము చేశాము తర్వాత రావణుడు వచ్చి మన కళలను, కాయమును అన్నింటినీ నశింపజేశాడు. ఎవరైనా మంచి పిల్లల నడవడిక చెడిపోయినప్పుడు మీ అదృష్టమంతా నాశనమైపోయిందా? అని అడుగుతారు. ఇవి బేహద్ విషయాలు. మాయ మన అదృష్టాన్ని చెడిపేసిందని భావించాలి. మనము క్రిందపడిపోతూనే వచ్చాము. ఇప్పుడు అనంతమైన తండ్రి దైవీగుణాలను నేర్పిస్తున్నారు. కనుక ఖుషీ పాదరస మట్టము పైకి ఎక్కాలి. టీచరు జ్ఞానమునిస్తారు. ఆ జ్ఞానముతో విద్యార్థికి సంతోషము కలుగుతుంది. ఇది అనంతమైన జ్ఞానము. నాలో ఏ ఆసురీ గుణము లేదు కదా? అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. సంపూర్ణముగా అవ్వనట్లయితే శిక్షలను అనుభవించవలసి పడ్తుంది. కాని మనము శిక్షలను ఎందుకు అనుభవించాలి? అందువల్లనే ఎవరి నుండి రాజ్యము లభిస్తుందో ఆ తండ్రిని స్మృతి చేయాలి. దైవీగుణాలు ఏవైతే మనలో ఉండేవో, వాటిని ఇప్పుడు ధారణ చేయాలి. అక్కడ యథా రాజా - రాణి తథా ప్రజా అందరిలో దైవీగుణాలు ఉండేవి. దైవీగుణాలు ఏవో మీకు తెలుసు కదా. ఒకవేళ తెలియకపోతే వాటిని తెచ్చుకునేదెలా? సర్వ గుణ సంపన్నులు,.......... అని పాడ్తారు కూడా. కనుక పురుషార్థము చేసి ఈ విధంగా(లక్ష్మినారాయణులుగా) అవ్వాలి. అలా తయారవ్వడంలో శ్రమ ఉంటుంది. వికారీ దృష్టి ఏర్పడ్తుంది. తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మ అని భావించినట్లయితే వికారీ ఆలోచనలు ఎగిరిపోతాయి. తండ్రి చాలా యుక్తులను తెలియజేస్తారు. దైవీగుణాలు ఎవరిలో ఉంటాయో, వారిని దేవతలని అంటారు. ఎవరిలో దైవీగుణాలు లేవో వారిని మనుష్యులని అంటారు. ఇరువురూ మనుష్యులే. కాని దేవతలను ఎందుకు పూజిస్తారు? ఎందుకంటే వారిలో దైవీగుణాలున్నాయి. మనుష్యుల కర్తవ్యాలు కోతి సమానంగా ఉన్నాయి. పరస్పరములో ఎంతో పోట్లాడుకుంటారు. సత్యయుగములో ఇటువంటి విషయాలు ఉండవు. ఇక్కడైతే కొట్లాటలు జరుగుతాయి. మీరేదైనా పొరపాటు చేస్తే తప్పకుండా సహనము చేసుకోవాల్సి పడ్తుంది. ఆత్మాభిమానిగా లేకుంటే సహించవలసి వస్తుంది. మీరు ఎంతగా ఆత్మాభిమానులుగా అవుతూ ఉంటారో అంతగా దైవీగుణాలు కూడా ధారణ అవుతాయి. మాలో దైవీగుణాలున్నాయా? అని చెక్ చేసుకోవాలి. తండ్రి సుఖదాత కనుక పిల్లల కర్తవ్యము కూడా అందరికీ సుఖమునివ్వడం. నేను ఎవ్వరికీ దు:ఖమును ఇవ్వలేదు కదా? అని హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. కాని కొందరిలో ఇటువంటి అలవాటు ఉంటుంది - ''ఇతరులకు దు:ఖము ఇవ్వకుండా ఉండలేరు. జైలు పక్షుల వలె బాగుపడనే పడరు. వారు జైలులోనే తమకు సుఖము ఉందని భావిస్తారు. తండ్రి చెప్తున్నారు - అక్కడ జైలు మొదలైనవి ఉండనే ఉండవు. పాపమే జరగలేదంటే ఇక జైలులోకి వెళ్ళడం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ జైలులో శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. ఇప్పుడు మేము మా రాజ్యములో ఉన్నప్పుడు ఎంతో ధనవంతులుగా ఉండేవారమని మీరు అర్థం చేసుకున్నారు. మేము మా రాజ్యస్థాపన చేసుకుంటున్నామని బ్రాహ్మణ కుల భూషణులైనవారు భావిస్తారు. అక్కడ మన రాజ్యము ఒక్కటే ఉండేది. దానిని దేవతల రాజ్యమని అంటారు. ఆత్మకు జ్ఞానము లభించినప్పుడు సంతోషము కలుగుతుంది. జీవాత్మ అని తప్పకుండా అనవలసి ఉంటుంది. మనము జీవాత్మలము దేవీ దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారము. అప్పుడు సంపూర్ణ విశ్వము పై మన రాజ్యము ఉండేది. ఈ జ్ఞానము మీ కొరకే. మా రాజ్యము ఉండేదని, మనమే సతోప్రధానంగా ఉండేవారమని భారతవాసులకు తెలియదు. మీరే ఈ జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. కనుక మనమే దేవతలుగా ఉండేవారము. మళ్లీ ఇప్పుడు మనమే దేవతలుగా అవ్వాలి. భలే విఘ్నాలు కూడా వస్తాయి. కాని రోజురోజుకు మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది. మీ పేరు ప్రసిద్ధమవుతూ ఉంటుంది. ఇది మంచి సంస్థ అని, వీరు మంచి పని చేస్తున్నారని చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారని అందరూ తెలుసుకుంటారు. మీరే సతోప్రధానంగా ఉండేవారు, దేవతలుగా ఉండేవారు, మీ రాజధానిలో ఉండేవారు. ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు. ఇతరులెవ్వరూ స్వయాన్ని రావణరాజ్యంలో ఉన్నామని భావించరు.
మనమెంత స్వచ్ఛంగా ఉండేవారమో, ఇప్పుడు తుచ్ఛమైనవారిగా అయ్యామో మీకు తెలుసు. పునర్జన్మ తీసుకుంటూ తీసుకుంటూ పారసబుద్ధి నుండి రాతిబుద్ధి గలవారిగా అయిపోయారు. ఇప్పుడు మనము మన రాజ్యమును స్థాపన చేస్తున్నాము. కనుక మీ ఉత్సాహము ఉప్పొంగాలి. పురుషార్థములో నిమగ్నమవ్వాలి. కల్పక్రితము ఎవరైతే నిమగ్నమై ఉండినారో, వారు మళ్లీ ఇప్పుడు కూడా తప్పకుండా నిమగ్నమవుతారు. నంబరువారు పురుషార్థానుసారము మనము మన దైవీ రాజ్యస్థాపన చేస్తున్నాము. ఇది కూడా మీరు ఘడియ ఘడియకు మర్చిపోతారు. లేనిచో లోలోపల చాలా సంతోషము ఉండాలి. మన్మనాభవ అని ఒకరికొకరు స్మృతినిప్పిస్తూ ఉండండి. తండ్రిని స్మృతి చేయండి. దీని నుండే ఇప్పుడు మీరు రాజ్యమును తీసుకుంటారు. ఇదేమీ కొత్త విషయము కాదు. కల్ప-కల్పము మనకు తండ్రి శ్రీమతమును ఇస్తారు. దీని ద్వారా మనము దైవీగుణాలు ధారణ చేస్తాము. అలా కానిచో శిక్షలు పొంది తక్కువ పదవిని తీసుకుంటాము. ఇది చాలా పెద్ద లాటరీ. ఇప్పుడు పురుషార్థము చేసి ఉన్నతమైన పదవిని పొందుకుంటే కల్ప-కల్పాంతరాలు పొందుతూనే ఉంటారు. తండ్రి ఎంతో సహజంగా అర్థం చేయిస్తారు. ప్రదర్శినిలో కూడా భారతవాసులమైన మనమే దేవతల రాజధానికి చెందినవారిగా ఉండేవారమని తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మెట్లు దిగుతూ దిగుతూ ఇలా అయ్యామని తెలపండి. ఎంత సహజంగా అర్థం చేయిస్తున్నారు! వారు సుప్రీమ్ తండ్రి, సుప్రీమ్ టీచరు, సుప్రీమ్ గురువు కదా. మీరు ఎంత లెక్కలేనంతమంది విద్యార్థులున్నారు. పరుగు(పురుషార్థములో) తీస్తూ ఉంటారు. ఎంతమంది నిర్వికారులుగా, పవిత్రంగా అయ్యారని బాబా కూడా లిస్టు తెప్పించుకుంటూ ఉంటారు.
భృకుటి మధ్యలో ఆత్మ మెరుస్తూ ఉంటుందని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. నేను కూడా ఇక్కడ (బ్రహ్మాబాబా భృకుటి మధ్యలో) వచ్చి కూర్చొని నా పాత్రను అభినయిస్తాను. నా పాత్రయే పతితులను పావనంగా చేయడం అని తండ్రి చెప్తున్నారు. నేను జ్ఞాన సాగరుడను. పిల్లలు జన్మిస్తారు. కొందరు చాలా మంచివారుంటారు, కొందరు చెడ్డవారుగా కూడా అవుతారు. ఆశ్చర్యంగా వింటారు, వర్ణిస్తారు మళ్లీ పారిపోతారు. అరే మాయా! నీవెంత ప్రబలమైనదానివి! అయినా తండ్రి చెప్తున్నారు - జ్ఞానము వదిలి వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్తారు? తరింపజేయువాడు ఒక్క తండ్రి మాత్రమే. సద్గతిదాత వారొక్కరే. ఇతరులెవ్వరికీ ఈ జ్ఞానము కొద్దిగా కూడా తెలియదు. కల్పక్రితము ఎవరైతే అంగీకరించారో, వారే ఇప్పుడు కూడా అంగీకరిస్తారు. ఇందులో మన నడవడికను చాలా బాగు చేసుకోవలసి వస్తుంది. సర్వీసు చేయవలసి వస్తుంది. అనేకమందికి కళ్యాణము చేయాలి. అనేకమందికి మార్గాన్ని తెలియజేయాలి. భారతవాసులైన మీరే విశ్వాధిపతులుగా ఉండేవారని అత్యంత మధురమైన భాషతో అర్థం చేయించాలి. ఇప్పుడు మీరు మళ్లీ అదే రీతిగా మీ రాజ్యమును తీసుకోగలరు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఈ విధంగా అర్థం చేయించలేరని మీరు అర్థం చేసుకున్నారు. అయినా కొందరూ నడుస్తూ నడుస్తూ మాయతో ఓడిపోతారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు - వికారాల పై విజయమును పొందడం ద్వారానే మీరు జగత్జీతులుగా అవుతారు. ఈ దేవతలు జగజ్జీతులుగా అయినవారు. వారు తప్పకుండా అటువంటి కర్మ చేసి ఉంటారు. తండ్రి కర్మల గతిని కూడా తెలిపించారు. రావణరాజ్యములో కర్మలు వికర్మలుగానే అవుతాయి. రామరాజ్యములో కర్మలు అకర్మలుగా అవుతాయి. ముఖ్యమైన విషయము కామము పై విజయము పొంది జగత్జీతులుగా అవ్వడము. తండ్రిని స్మృతి చెయ్యండి. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. మనం 100 శాతము నిశ్చితంగా మన రాజ్యభాగ్యాన్ని తీసుకుంటాము. కాని ఇక్కడ రాజ్య పాలన చెయ్యము. ఇక్కడ రాజ్యమును తీసుకుంటాము. అమరలోకములో రాజ్యము చేస్తాము. ఇప్పుడు మృత్యులోకము మరియు అమరలోకము మధ్యలో ఉన్నాము. ఈ విషయము కూడా మర్చిపోతారు. అందువల్ల తండ్రి ఘడియ - ఘడియ స్మృతినిప్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మనము మన రాజధానిలోకి వెళ్ళిపోతామని పక్కా నిశ్చయముంది. ఈ పురాతన రాజధాని తప్పకుండా సమాప్తమవుతుంది. ఇప్పుడు నూతన ప్రపంచములోకి వెళ్లేందుకు దైవీ గుణాలు తప్పకుండా ధారణ చేయాలి. స్వయంతో మాట్లాడుకోవాలి. స్వయాన్ని ఆత్మ అని భావించాలి. ఎందుకంటే మనము ఇప్పుడే వాపస్ వెళ్ళాలి. కనుక స్వయాన్ని ఆత్మ అని ఇప్పుడే భావించాలి. తర్వాత ఇంకెప్పుడూ వాపస్ వెళ్లేందుకు ఈ జ్ఞానము లభించదు. అక్కడ మనము యోగమును జోడించవలసిన అవసరమే ఉండదు. ఎందుకంటే అక్కడ 5 వికారాలే ఉండవు. పావనంగా అయ్యేందుకు ఈ సమయంలోనే యోగము జోడించవలసి ఉంటుంది. అక్కడైతే అందరూ బాగుపడినవారే ఉంటారు. తర్వాత నెమ్మది నెమ్మదిగా కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఇది చాలా సహజము. క్రోధము కూడా ఇతరులను దు:ఖ పెడ్తుంది కదా. ముఖ్యమైనది దేహాభిమానము. అక్కడైతే దేహాభిమానము ఉండనే ఉండదు. ఆత్మ అభిమానిగా ఉండడం వలన వికారీ దృష్టి ఉండదు. నిర్వికారీ దృష్టిగా అయిపోతుంది. రావణరాజ్యములో వికారీ దృష్టిగా అయిపోతుంది. మీరు మీ రాజ్యములో చాలా సుఖంగా ఉండేవారని మీకు తెలుసు. అక్కడ కామము గలవారెవ్వరూ ఉండరు. క్రోధము గలవారెవ్వరూ ఉండరు. దీని పై ప్రారంభములో ఒక పాట కూడా తయారు చేయబడింది. అక్కడ ఈ వికారాలు ఉండవు. మనకు అనేక సార్లు ఈ ఓటమి - గెలుపులు లభించాయి. సత్యయుగము నుండి కలియుగము వరకు ఏమేమి జరిగాయో అవన్నీ పునరావృతమవుతాయి. తండ్రి లేక టీచరు వద్ద ఏ జ్ఞానముందో, అది మీకు వినిపిస్తూ ఉంటారు. ఈ ఆత్మిక టీచరు కూడా అద్భుతమైనవారు. భగవంతుడు సర్వోన్నతమైన వారు. వారు సర్వోన్నతమైన టీచరు కూడా అయినారు. వారు మనలను కూడా సర్వోన్నతమైన దేవతలుగా చేస్తారు. తండ్రి ఎలా దైవీరాజ్యమును స్థాపన చేస్తున్నారో మీరు స్వయంగా చూస్తున్నారు. స్వయం మీరే దేవతలుగా అవుతున్నారు. ఇప్పుడైతే అందరూ స్వయాన్ని హిందువులని చెప్పుకుంటూ ఉంటారు. వాస్తవానికి ఆదిసనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారని, మిగిలినవారందరి ధర్మాలు నడుస్తున్నాయని కూడా వారికి అర్థం చేయించడం జరుగుతుంది. ఈ ఒక్క దేవీ దేవతా ధర్మమే ప్రాయ: లోపమైపోయింది. ఇది చాలా పవిత్రమైన ధర్మము. దీని వంటి పవిత్ర ధర్మము ఇంకొకటి ఉండదు. ఇప్పుడు పవిత్రంగా లేని కారణంగా ఎవ్వరూ స్వయాన్ని దేవత అని చెప్పుకోలేరు. మనము ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారమని అందుకే దేవతలను పూజిస్తామని మీరు అర్థం చేయించవచ్చు. క్రీస్తును పూజించేవారు క్రిస్టియన్లు, బుద్ధుని పూజించేవారు బౌద్ధులు. అలాగే దేవతలను పూజించేవారు దేవతలు. మరి స్వయాన్ని హిందువులని ఎందుకు చెప్పుకుంటున్నారు? యుక్తిగా అర్థం చేయించాలి. కేవలం హిందూ ధర్మమని అంటారు. అది ధర్మమే కాదని చెప్తే వెంటనే కొట్లాటకు వస్తారు. హిందువులు ఆదిసనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారని చెప్పండి. అప్పుడు ఆది సనాతన ధర్మము హిందూ ధర్మము కాదని కొంతైనా అర్థం చేసుకుంటారు. ఆది సనాతన అనే పదము సరియైనది. దేవతలు పవిత్రంగా ఉండేవారు. హిందువులు అపవిత్రులు అందుకే తమను దేవతలమని చెప్పుకోలేరు. కల్ప-కల్పము ఈ విధంగానే జరుగుతుంది. వీరి రాజ్యములో చాలా ధనవంతులుగా ఉండేవారు. ఇప్పుడు నిరుపేదలుగా అయిపోయారు. వారు పదమా పదమ్పతులుగా ఉండేవారు. తండ్రి చాలా మంచి యుక్తులు తెలియజేస్తున్నారు. మీరు సత్యయుగములో ఉన్నారా? లేక కలియుగములో ఉన్నారా? అని ప్రశ్నించండి. కలియుగవాసులైతే తప్పకుండా నరకవాసులుగా, సత్యయుగములో ఉండేవారైతే స్వర్గవాసులైన దేవతలుగా ఉంటారు. ఈ విధంగా ప్రశ్నించినట్లయితే ఈ ప్రశ్నను అడుగుతున్నారంటే వీరు తప్పకుండా ట్రాన్స్ఫర్ చేసి దేవతలుగా తయారు చేయగలరని భావిస్తారు. ఇతరులు ఎవ్వరూ ఈ ప్రశ్నలు అడగలేరు. ఆ భక్తిమార్గమే వేరు. భక్తికి ఫలితము ఏమిటి?- జ్ఞానము. సత్య, త్రేతా యుగాలలో భక్తి ఉండదు. జ్ఞానము ద్వారా అర్ధకల్పము పగలు, భక్తి ద్వారా అర్ధకల్పము రాత్రి. అంగీకరించేవారైతే అంగీకరిస్తారు. అంగీకరించనివారు జ్ఞానాన్ని కూడా అంగీకరించరు. భక్తిని కూడా అంగీకరించరు. వారికి కేవలం ధనము సంపాదించడం మాత్రమే తెలుసు.
పిల్లలైన మీరు యోగబలముతో శ్రీమతానుసారము ఇప్పుడు రాజ్యస్థాపన చేస్తున్నారు. తర్వాత మళ్లీ అర్ధకల్పము తర్వాత రాజ్యమును పోగొట్టుకుంటారు కూడా. ఈ చక్రము ఇలా నడుస్తూనే ఉంటుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. చాలామందికి కళ్యాణము చేసేందుకు తమ మాటలను అత్యంత మధురంగా చేసుకోవాలి. మధురమైన నాలుకతో(మధురమైన భాషతో) సర్వీసు చేయాలి. సహనశీలురుగా అవ్వాలి.
2. కర్మల గుహ్యగతిని అర్థం చేసుకొని వికారాల పై విజయము పొందాలి. జగత్జీత్ దేవతలుగా అవ్వాలి. ఆత్మాభిమానులుగా అయ్యి వికారీ దృష్టిని నిర్వికారీ దృష్టిగా మార్చుకోవాలి.
వరదానము :-
''బ్రాహ్మణ జన్మ యొక్క జన్మపత్రిని (జాతకాన్ని) తెలుసుకొని సదా సంతోషంగా ఉండే శ్రేష్ఠ భాగ్యవాన్ భవ ''
బ్రాహ్మణ జీవితమంటే కొత్త జీవితము. బ్రాహ్మణులు ఆదిలో దేవీదేవతలు, ఇప్పుడు బి.కె లు. బ్రాహ్మణుల జాతకంలో మూడు కాలాలూ అత్యంత మంచివే. జరిగిపోయింది మంచిది, ఇప్పుడు జరుగుతున్నది ఇంకా(చాలా) మంచిది, ఇకమీదట జరిగేది ఇంకా ఇంకా(చాలా చాలా) మంచిది. బ్రాహ్మణుల జాతకము సదా బాగుంటుంది, ఇది గ్యారంటీ. కనుక స్వయం భాగ్యవిధాత అయిన తండ్రి శ్రేష్ఠమైన భాగ్యరేఖ గీచి తనవారిగా చేసుకున్నారనే సంతోషంలో సదా ఉండండి.
స్లోగన్ :-
''ఏకరస స్థితిని అనుభవం చేయాలంటే ఒక్క తండ్రితో సర్వ సంబంధాల రసాన్ని తీసుకోండి.''