14-05-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - తండ్రి నిర్వికారి దృష్టినిచ్చేందుకు వచ్చారు. మీకు జ్ఞానమనే మూడవ నేత్రము లభించింది, అందువలన మీ కనులు (దృష్టి) ఎప్పుడూ వికారీగా అవ్వరాదు ''

ప్రశ్న :-

బేహద్‌(అనంతమైన) సన్యాసులైన మీకు తండ్రి ఏ శ్రీమతమును ఇచ్చారు?

జవాబు :-

మీరు నరకము నుండి, నరకవాసుల నుండి మీ బుద్ధియోగాన్ని దూరము చేసి స్వర్గమును స్మృతి చేయమని తండి శ్రీమతమునిస్తున్నారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ నరకమును బుద్ధి నుండి తొలగించండి. నరకమంటే పాత ప్రపంచము. మీరు బుద్ధి ద్వారా పాత పప్రంచాన్ని మర్చిపోవాలి. అంతేకాని మీరు నివసించే హద్దు ఇంటిని వదిలి మరో చోటికి పొమ్మని కాదు. మీది బేహద్‌ వైరాగ్యము. ఇప్పుడిది మీ వానప్రస్థ అవస్థ. అన్నీ వదిలి ఇంటికి వెళ్లాలి.

ఓంశాంతి.

శివభగవానువాచ - ఇంకెవ్వరి పేరు తీసుకోలేదు. ఇతని(బ్రహ్మ) పేరు కూడా తీసుకోలేదు. ఈ తండ్రి పతితపావనుడు. అందుకే ఇక్కడకు పతితులను పావనంగా చేసేందుకు తప్పకుండా వస్తారు. పావనంగా తయారుచేసే యుక్తి కూడా ఇచ్చటనే తెలియజేస్తారు. శివభగవానువాచ, కృష్ణ భగవానువాచ కాదు. దీనిని తప్పకుండా అర్థము చేయించాలి. మీ వద్ద బ్యాడ్జ్‌ ఉంది. ఇందులో రచయిత, రచనల ఆదిమధ్యాంతాల రహస్యమంతా చూపించబడింది. ఈ బ్యాడ్జి తక్కువదేమీ కాదు. ఇది సూచించే విషయము. మీరందరూ నంబరువారు పురుషార్థానుసారము ఆస్తికులుగా ఉన్నారు. నంబరువారుగా అని తప్పకుండా అంటారు. చాలా మంది రచయిత-రచనల జ్ఞానమును కూడా అర్థము చేయించలేరు. కనుక వారిని సతోప్రధాన బుద్ధి గలవారని అనరు. సతోప్రధాన బుద్ధిగలవారు, రజోప్రధాన బుద్ధిగలవారు, తమోప్రధాన బుద్ధి గలవారు కూడా ఉన్నారు. ఎవరెవరు ఎలా అర్థము చేసుకుంటారో అటువంటి టైటిల్‌(బిరుదు) లభిస్తుంది. వీరు సతోప్రధాన బుద్ధి, వీరు రజోబుద్ధి గలవారని అంటారు. అయితే బయటకు చెప్పరు. ఎందుకంటే వారు ఫంక్‌ అవ్వరాదు(భయపడరాదు). నంబరువారుగా ఉండనే ఉంటారు. ఫస్ట్‌ క్లాస్‌గా ఉండువాటి విలువ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీకు సత్య-సత్యమైన సద్గురువు లభించారు, వారు మిమ్ములను పూర్తి సత్య-సత్యముగా తయారుచేస్తారని మీకు తెలుసు. దేవీ దేవతలు సత్యమైనవారు. వారే వామమార్గములో అసత్యంగా అవుతారు. సత్యయుగములో దేవీ దేవతలైన మీరు మాత్రమే ఉంటారు. మరెవ్వరూ ఉండరు. ఇదెలా సాధ్యమని కొంతమంది జ్ఞానము లేనివారు అంటారు. ఇప్పుడు మనము నాస్తికుల నుండి ఆస్తికులుగా అయ్యామని పిల్లలైన మీకు తెలుసు. రచయిత, రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానమును ఇప్పుడు మీరు ఖచ్ఛితంగా తెలుసుకున్నారు. నామ-రూపాల నుండి భిన్నంగా ఉన్న వస్తువును చూడలేము. ఆకాశము శూన్యమైనప్పటికి అది ఆకాశమని అనుభవము చేస్తారు కదా. ఇది కూడా జ్ఞానము. మొత్తం ఆధారమంతా బుద్ధి పై ఉంది. రచయిత - రచనల జ్ఞానము ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. ఇచ్చట రచయిత-రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము లభించగలదని కూడా వ్రాయాలి. ఇలాంటి స్లోగన్లు చాలా ఉన్నాయి. రోజురోజుకు నూతన పాయింట్లు, నూతన స్లోగన్లు వస్తూ ఉంటాయి. ఆస్తికులుగా అయ్యేందుకు రచయిత-రచనల జ్ఞానము తప్పనిసరి. ఈ జ్ఞానము ద్వారా నాస్తికత్వం వదిలిపోతుంది. మీరు ఆస్తికులుగా తయారై విశ్వానికి అధికారులుగా అయిపోతారు. ఇక్కడ మీరు ఆస్తికులుగా ఉన్నారు కానీ నంబరువారు పురుషార్థానుసారముగా ఉన్నారు. అర్థము చేసుకునేది మనుష్యులే కదా. జంతువులు అర్థము చేసుకోవు. మనుష్యులే చాలా ఉన్నతంగా ఉన్నారు. వారే అత్యంత నీచంగానూ ఉన్నారు. ఈ సమయంలో మనుష్యమాత్రులెవ్వరికీ రచయిత-రచనల జ్ఞానము తెలియదు. బుద్ధికి గాడ్రెజ్‌ తాళము వేయబడింది. నంబరువారు పురుషార్థానుసారము మేము తండ్రి వద్దకు విశ్వానికి అధికారులుగా అయ్యేందుకు వచ్చామని మీకు తెలుసు. మీరు నూటికి నూరు శాతము పవిత్రంగా ఉంటారు. పవిత్రత, శాంతి, సుఖము అన్నీ ఉన్నాయి. ఆశీర్వాదాలు ఇస్తారు కదా. అయితే ఈ పదాలు భక్తిమార్గానికి చెందినవి. మీరు ఈ లక్ష్మీనారాయణులుగా చదువు ద్వారా అవుతారు. మీరు చదివి అందరినీ చదివించాలి కూడా. పాఠశాలలో కుమార్లు-కుమారీలు చదువుకునేందుకు వెళ్తారు. కలిసి ఉన్నందున చాలా చెడిపోను కూడా చెడిపోతారు. ఎందుకంటే వికారి దృష్టి ఉంటుంది కదా. వికారి దృష్టి కారణంగా పర్దా కూడా వేసుకుంటారు. అక్కడ వికారి దృష్టి ఉండనే ఉండదు. కనుక ముసుగు వేసుకునే అవసరమే ఉండదు. ఈ లక్ష్మీనారాయణులకు ముసుగు వేసుకునే అవసరమే ఉండదు. ఈ లక్ష్మీనారాయణులు ముసుగు వేసుకోవడం ఎప్పుడైనా చూశారా? అక్కడ మురికి(వికారి) ఆలోచనలు కూడా ఎప్పుడూ రానే రావు. ఇక్కడ ఉండేదే రావణ రాజ్యము. ఈ కనులు పిశాచపు కనులు. తండ్రి వచ్చి జ్ఞాన నేత్రమిస్తారు. అన్నీ వినేది, మాట్లాడేది, సర్వస్వము చేసేది ఆత్మనే. మీ ఆత్మలిప్పుడు సరిదిద్దబడుతున్నవి. ఆత్మయే చెడిపోయి పాపాత్మగా అయ్యింది. వికారి దృష్టి ఎవరికుంటుందో వారిని పాపాత్మ అని అంటారు. ఈ వికారి దృష్టిని తండ్రి తప్ప మరెవ్వరూ సరిదిద్దలేరు. పవిత్రమైన జ్ఞాన నేత్రమును ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. ఈ జ్ఞానము కూడా మీకు మాత్రమే తెలుసు. శాస్త్రాలలో ఈ జ్ఞానము లేనే లేదు.

తండ్రి చెప్తున్నారు - ఈ వేదాలు, శాస్త్ర్రాలు, ఉపనిషత్తులు మొదలైనవన్నీ భక్తిమార్గానికి చెందినవి. జపము, తపము, తీర్థ స్థానములు తిరిగినందున నన్ను ఎవ్వరూ కలుసుకోలేరు. ఈ భక్తి అర్ధకల్పము నడుస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ సందేశమును అందరికీ ఇవ్వాలి. మీరు వస్తే మేము మీకు రచయిత, రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము వినిపిస్తాము, పరమపిత పరమాత్ముని జీవితచరిత్ర తెలుపుతామని చెప్పాలి. మానవమాత్రులెవ్వరికీ ఈ జ్ఞానము తెలియనే తెలియదు. ఇది చాలా ముఖ్యమైన పదము. ''సోదరీ-సోదురులారా, రండి వచ్చి రచయిత-రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము వినండి, చదువు చదవండి, దాని వలన మీరు ఇలా(లక్ష్మీనారాయణులుగా) అవుతారు.'' ఈ జ్ఞానము పొందుట వలన, సృష్టి చక్రమును అర్థము చేసుకోవడం వలన మీరు ఇటువంటి చక్రవర్తులుగా, సత్యయుగములోని మహారాజా-మహారాణులుగా అవ్వగలరు. ఈ లక్ష్మీనారాయణులు కూడా ఈ చదువు ద్వారానే ఇలా అయ్యారు. మీరు కూడా చదువు ద్వారా తయారవుతూ ఉన్నారు. ఈ పురుషోత్తమ సంగమయుగానికి చాలా ప్రభావముంది. తండ్రి వచ్చేదే భారతదేశములో. ఇతర ఖండాలలో ఎందుకు వస్తారు? తండ్రి అవినాశి సర్జన్‌. కావున ఎల్లప్పుడు స్థిరంగా ఉండు భూమి పైకే వస్తారు. ఏ భూమి పై భగవంతుడు కాలుపెట్టాడో ఆ భూమి ఎప్పుడూ వినాశనము అవ్వజాలదు. ఈ భారతదేశము దేవతల కొరకు తప్పకుండా ఉంటుంది కదా? కేవలం మార్పు చెందుతుంది. పోతే భారతదేశము సత్యమైన ఖండము. ఇదే భారతదేశము అసత్య ఖండముగా కూడా అవుతుంది. భారతదేశానికే ఆల్‌రౌండ్‌ పాత్ర ఉంది. ఇతర ఏ ఖండముల గురించి ఇలా అనరు. సత్యము అనగా ట్రూత్‌, భగవంతుడే వచ్చి సత్యమైన ఖండంగా చేస్తారు. మళ్లీ దీనిని రావణుడు అసత్య ఖండంగా చేస్తాడు. తర్వాత ఏ కాస్త సత్యము కూడా ఉండదు. అందువలన సత్యమైన గురువు కూడా లభించడు. వారేమో సన్యాసులు, వారి శిష్యులు గృహస్థులు. అలాంటప్పుడు వారిని శిష్యులని(ఫాలోయర్స్‌) ఎలా అంటారు? ఇప్పుడు స్వయం తండ్రి చెప్తున్నారు - ''పిల్లలూ, పవిత్రంగా అవ్వండి, దైవీ గుణాలు ధారణ చేయండి.'' మీరిప్పుడు దేవతలుగా తయారవ్వాలి. సన్యాసులు సంపూర్ణ నిర్వికారులుగా లేనే లేరు. మాటిమాటికి వికారీల వద్ద జన్మిస్తారు. చాలామంది బాలబ్రహ్మచారులు కూడా ఉంటారు. ఇటువంటి వారైతే చాలామంది ఉన్నారు. విదేశాలలో కూడా చాలామంది ఉన్నారు. ముసలి వారైనప్పుడు సహాయము కొరకు వివాహము చేసుకుంటారు. వారికి ధనమును కూడా వదిలి వెళ్లిపోతారు. మిగిలిన ధనాన్ని దానధర్మాలు చేస్తారు. ఇక్కడ ఉన్నవారికి వారి పిల్లల పై చాలా మమకారము ఉంటుంది. 60 సంవత్సరాల తర్వాత పిల్లలకు అప్పజెప్పి మళ్లీ పరిశీలిస్తూ ఉంటారు. మా తర్వాత బాగా నడుపుకుంటారా లేదా అని గమనిస్తూ ఉంటారు. కానీ ఈనాటి పిల్లలు తండ్రి వానప్రస్థములోకి వెళ్లిపోతే చాలా బాగుంది, తాళంచెవి లభించిందని అంటారు. బ్రతికి ఉండగానే భోజనము కూడా పెట్టరు. ఇంట్లో నుండి వెళ్లిపొమ్మని తల్లిదండ్రులను బయటకు పొమ్మని గెంటి వేస్తారు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు - ''సోదరీ-సోదరులారా, వచ్చి రచయిత-రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినండని ప్రదర్శినీలో వ్రాయండి.'' ''ఈ సృష్టి చక్ర జ్ఞానమును తెలుసుకుంటే మీరు చక్రవర్తులుగా, దేవీదేవతలుగా విశ్వానికి మహారాజా-మహారాణులుగా అవుతారు.'' పిల్లలకు ఈ బాబా ఈ సూచనలిస్తున్నారు. ఇది అనేక జన్మల అంతిమ జన్మ అని తండ్రి చెప్తున్నారు. నేను ఇతనిలోనే ప్రవేశిస్తాను, బ్రహ్మకు ముందు విష్ణువు ఉన్నారు. విష్ణువుకు నాలుగు భుజాలు ఎందుకు చూపిస్తారు? రెండు పురుషునివి, రెండు స్త్రీవి. నాలుగు భుజాల మనుష్యులు ఇక్కడ ఎవ్వరూ ఉండరు. ఇతరులకు అర్థము చేయించేందుకు ఇలా చెప్పాలి. విష్ణువనగా లక్ష్మీనారాయణులు. బ్రహ్మకు కూడా నాలుగు భుజాలు చూపిస్తారు. రెండు భుజాలు బ్రహ్మవి, రెండు భుజాలు సరస్వతివి. ఇద్దరూ అనంతమైన సన్యాసులు. అంతేగాని సన్యసించి మరోచోటికి వెళ్లిపోవాలని కాదు. గృహస్థ వ్యవహారములో ఉంటూ బుద్ధి నుండి నరకాన్ని త్యాగము చేయమని తండ్రి చెప్తున్నారు. నరకాన్ని మరచి స్వర్గమును బుద్ధితో స్మృతి చేయాలి. నరకము, నరకవాసుల నుండి బుద్ధియోగము తొలగించి స్వర్గవాసులైన దేవతలతో బుద్ధియోగాన్ని జోడించాలి. ఎవరు చదువుతారో వారి బుద్ధిలో మేము పాసవుతామని, ఆ తర్వాత ఇలా అవుతామని ఉంటుంది కదా. ఇంతకుముందు వానప్రస్థ అవస్థ వచ్చినప్పుడు గురువులను ఆశ్రయించేవారు. తండ్రి చెప్తున్నారు - నేను కూడా ఇతని వానప్రస్థ అవస్థలోనే ప్రవేశిస్తాను. ఇది ఇతని అనేక జన్మల అంతిమ జన్మ. భగవానువాచ - నేను అనేక జన్మల అంతిమ జన్మలోనే ప్రవేశిస్తాను. ఎవరైతే ప్రారంభము నుండి చివరి వరకు పాత్ర చేశారో వారిలోనే ప్రవేశిస్తాను. ఎందుకంటే అతడే మొదటి నంబరులోకి వెళ్లాలి. బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మ,........ ఇరువురికి నాలుగు భుజాలు చూపిస్తారు. బ్రహ్మ-సరస్వతుల నుండి లక్ష్మీ నారాయణులు మళ్లీ లక్ష్మీనారాయణుల నుండి బ్రహ్మ సరస్వతులుగా అవుతారని లెక్కాచారము కూడా ఉంది. పిల్లలైన మీరు వెంటనే ఈ లెక్క తెలపగలరు. విష్ణువనగా లక్ష్మీనారాయణులు. 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ చివరిలో సాధారణమైన ఈ బ్రహ్మ-సరస్వతులుగా అవుతారు. వీరి పేర్లు కూడా బాబా తర్వాత పెట్టినవి లేకుంటే బ్రహ్మకు తండ్రి ఎవరు? శివబాబా అని తప్పకుండా అంటారు. ఎలా రచించారు? దత్తత తీసుకున్నారు. నేను ఇతనిలో ప్రవేశిస్తానని తండ్రి అంటున్నారు. కనుక శివభగవానువాచ - ఏ బ్రహ్మకైతే తన జన్మలను గురించి తెలియదో అతనిలో నేను ప్రవేశిస్తానని వ్రాయాలి. అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమ సమయములో ప్రవేశిస్తాను. అది కూడా వానప్రస్థ స్థితిలో వస్తాను. ఈ ప్రపంచము పాతదై పతితమైనప్పుడు నేను వస్తాను. ఇవన్నీ చాలా సహజమైన విషయాలు. ఇంతకుముందు 60 సంవత్సరాల వయసులో గురువులను ఆశ్రయించేవారు. ఇప్పుడు పుట్టినప్పటి నుండి గురువుల వద్దకు పంపిస్తారు. ఈ పద్ధతిని క్రైస్తవుల ద్వారా నేర్చుకున్నారు. చిన్నతనములో గురువుల వద్దకు పోయే అవసరమేముంది? చిన్నతనములో మరణిస్తే సద్గతి పొందుతారని భావిస్తారు. ఇక్కడ ఎవ్వరికీ సద్గతి జరగదని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు తండ్రి మీకు ఎంతో సులభంగా అర్థం చేయించి ఉన్నతంగా తయారు చేస్తున్నారు. భక్తిలో మీరు మెట్లు దిగుతూనే వచ్చారు. ఇది రావణరాజ్యము కదా. వికారి ప్రపంచము ప్రారంభమవుతుంది. అందరూ గురువులను చేసుకున్నారు. ఈ బ్రహ్మ కూడా స్వయంగా చెప్తున్నారు - నేను చాలామంది గురువులను ఆశ్రయించాను. సద్గతినిచ్చే భగవంతుని గురించి తెలియనే తెలియదు. భక్తిమార్గములోని గొలుసులు(సంకెళ్లు) కూడా చాలా కఠినంగా ఉన్నాయి. కొన్ని లావుగా ఉంటాయి, కొన్ని పతలాగా(సన్నగా) ఉంటాయి. ఏదైనా భారమైన వస్తువును పైకెత్తాలంటే చాలా లావు గొలుసును ఉపయోగించి పైకి ఎత్తుతారు. ఇందులో కూడా అంతే. కొంతమంది వెంటనే వచ్చి మీ మాటలు వింటారు. బాగా చదువుతారు. కొందరు అర్థమే చేసుకోరు. నంబరువారిగా మాలలోని మణులుగా అవుతారు. మనుష్యులు భక్తిమార్గంలో మాలను స్మరిస్తారు. ఏ మాత్రము జ్ఞానముండదు. గురువు మాల త్రిప్పమని చెప్పారు, ఆ చెప్పిందే తడువుగా రామ-రామ అనే శబ్ధము చేస్తూ ఉంటారు. ఏదైనా వాయిద్యము మ్రోగుతున్నట్లు శబ్ధము చేస్తూ ఉంటారు. చాలా మధురంగా ఉంటుంది. అది వింటూ ఉంటారు. అంతేకాని వారికి ఏ మాత్రము తెలియదు. రాముడంటే ఎవరు, కృష్ణుడంటే ఎవరు, వారెప్పుడు వస్తారు ఇవన్నీ ఏమీ తెలియదు. కృష్ణుడిని కూడా ద్వాపర యుగములోకి తీసుకెళ్లారు. ఇది ఎవరు నేర్పించారు? గురువులు. కృష్ణుడు ద్వాపరములో వచ్చినట్లయితే ద్వాపరము తర్వాత కలియుగము వచ్చేసింది, తమోప్రధానమైపోయింది. నేను సంగము యుగములోనే వచ్చి తమోప్రధానము నుండి సతోప్రధానంగా చేస్తానని తండ్రి చెప్తున్నారు. మీరెంతో అంధవిశ్వాసము గలవారిగా అయ్యారు.

ముళ్ల నుండి పుష్పాలుగా తయారయ్యేవారు వెంటనే అర్థము చేసుకుంటారు. ఇది పూర్తి సత్యమైన విషయము అని వెంటనే అంటారు. కొంతమంది చాలా బాగా అర్థము చేసుకుంటారు. అందువలన మీరు బాగా అర్థం చేయిస్తున్నారని అంటారు. 84 జన్మల కథ కూడా సరిగ్గా ఉంది. తండ్రి ఒక్కరే జ్ఞానసాగరులు. వారు వచ్చి మీకు సంపూర్ణ జ్ఞానమును ఇస్తున్నారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. సద్గురువైన తండ్రి స్మృతి ద్వారా బుద్ధిని సతోప్రధానంగా చేసుకోవాలి. సత్యంగా తయారవ్వాలి. ఆస్తికులుగా అయ్యి ఆస్తికులుగా తయారు చేసే సేవ చేయాలి.

2. ఇప్పుడు మీది వానప్రస్థ అవస్థ అందువలన అనంతమైన సన్యాసులుగా అయ్యి అందరి నుండి బుద్ధి యోగాన్ని తొలగించాలి. పవిత్రంగా తయారవ్వాలి. దైవీ గుణాలు ధారణ చేయాలి.

వరదానము :-

'' అంతా '' నీదే - నీదే '' అని సమర్పించి అంశమాత్రము మేరేపన్‌ (నాది)ను కూడా సమాప్తము చేసే డబల్‌లైట్‌ భవ ''

నా స్వభావము, నా సంస్కారము, నా నేచర్‌.............. మొదలైన మేరాపన్‌ ఏది ఉండినా అది భారమవుతుంది. అటువంటి భారముండేవారు ఎగరలేరు. ఈ మేరాపన్‌(నాది - నాది)యే మురికిగా చేస్తుంది. అందువలన ఇప్పుడు 'నీది - నిది' అంటూ స్వచ్ఛంగా అవ్వండి. ఫరిస్తా అంటే 'మేరాపన్‌(నాది)' అంశమాత్రము కూడా లేనివారు. సంకల్పంలో కూడా నాది అనే భావము వచ్చిందంటే మైల వచ్చిందని అర్థం చేసుకోండి. కనుక ఈ మైలను సమాప్తం చేసి డబల్‌లైట్‌గా అవ్వండి.

స్లోగన్‌ :-

'' బాప్‌దాదాను తమ కనులలో ఇముడ్చుకునే వారే ఈ విశ్వానికి వెలుగు (జహాన్‌ కే నూర్‌).