09-07-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - సమయము వచ్చినప్పుడు మీరు ఇంటికి వాపసు వెళ్లాలి. కావున స్మృతి వేగమును పెంచండి. ఈ దు:ఖధామమును మర్చిపోయి శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయండి.''

ప్రశ్న :-

ఏ గుహ్య రహస్యాన్ని మీరు మానవులకు వినిపిస్తే వారి బుద్ధిలో అలజడి మొదలవుతుంది?

జవాబు :-

ఇంత చిన్న బిందువైన ఆత్మలో సదాకాలపు పాత్ర నిండి ఉంది. అది ఆ పాత్రను చేస్తూనే ఉంటుంది. ఎప్పటికీ అలసిపోదు. మ్షోము ఎవ్వరికీ లభించదనే నిగూఢ రహస్యాన్ని అందరికీ చెప్పండి. మానవులు చాలా దు:ఖము చూచి మోక్షము లభిస్తే బాగుంటుందని అంటారు. కాని అవినాశి ఆత్మ పాత్ర చేయకుండా ఉండలేదు. ఈ విషయము వింటే వారి లోపల అలజడి మొదలవుతుంది.

ఓంశాంతి.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తారు. ఇక్కడ ఆత్మిక పిల్లలున్నారు. తండ్రి ప్రతి రోజు అర్థం చేయిస్తారు. ఈ ప్రపంచములో పేదలకు ఎన్ని దు:ఖాలున్నాయి! వరదలు మొదలైనవి వస్తే పేదలకు దు:ఖము కలుగుతుంది. వారి సామానులు మొదలైన వాటి గతి ఏమవుతుంది? దు:ఖమైతే కలుగుతుంది కదా! అపారమైన దు:ఖముంది. ధనవంతులకు సుఖమున్నా అది కూడా అల్పకాలానికే. ధనవంతులు కూడా జబ్బుపడ్తారు. మృత్యువు కూడా చాలా వస్తుంది - ఈ రోజు ఫలానావారు మరణించారు, ఈ రోజు ఇది జరిగింది అని అంటూ ఉంటారు. ఈ రోజు రాష్ట్రపతిగా ఉన్నవాడు రేపు సింహాసనము వదలవలసి వస్తుంది. అందరూ చుట్టుముట్టి వారిని దింపేస్తారు. ఇది కూడా దు:ఖమే. ఈ దు:ఖధామములో ఎన్ని విధాల దు:ఖముందో ఆ దు:ఖాల లిస్టు(పట్టిక)ను కూడా వ్రాయండి అని తండ్రి చెప్తున్నారు. పిల్లలైన మీకు సుఖధామము గురించి కూడా తెలుసు. ప్రపంచానికి ఏమీ తెలియదు. వారు దు:ఖధామాన్ని, సుఖధామాన్ని పోల్చలేరు. తండ్రి చెప్తున్నారు - మీకు అన్నీ తెలుసు. అంతా సత్యమే చెప్తున్నారని అంగీకరిస్తారు. ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు, విమానాలు మొదలైనవి ఉన్నవారు కలియుగము ఇంకా 40 వేల సవంత్సరాలు జరుగుతుందని, తర్వాత సత్యయుగము వస్తుందని వారు భావిస్తారు. ఘోరమైన అంధకారములో ఉన్నారు కదా! వారినిప్పుడు సమీపానికి తీసుకు రావాలి. ఇక కొద్ది సమయము మాత్రమే ఉంది. వారు లక్షల సంవత్సరాలని అంటారు. 5 వేల సంవత్సరాలని మీరు ఋజువు చేసి తెలుపుతారు. 5 వేల సంవత్సరాల తర్వాత ఈ చక్రము పునరావృతమౌతుంది. లక్షల సంవత్సరాల డ్రామా ఏదీ ఉండదు. ఏమి జరుగుతుందో అదంతా 5 వేల సంవత్సరాలలో జరుగుతుందని మీకు తెలుసు. ఇక్కడ ఈ దు:ఖధామములో రోగాలు మొదలైనవన్నీ ఉంటాయి. మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను వ్రాయండి. స్వర్గములో దు:ఖమనే మాటే ఉండదు. మృత్యువు ఎదురుగానే ఉందని తండ్రి అర్థం చేయిస్తారు. ఆ గీతా అధ్యాయమే ఇప్పుడు జరుగుతూ ఉంది. తప్పకుండా సంగమ యుగములోనే సత్యయుగ స్థాపన జరుగుతుంది. తప్పకుండా సంగమ యుగములోనే సత్యయుగ స్థాపన జరుగుతుంది. నేను రాజులకే రాజుగా చేస్తాను కనుక సత్యయుగము వారిగానే తయారు చేస్తారు కదా అని తండ్రి బాగా అర్థం చేయిస్తారు.

మనమిప్పుడు సుఖధామానికి వెళ్తాము. తండ్రి తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎవరైతే నిరంతరము స్మృతి చేస్తారో, వారే ఉన్నత పదవిని పొందుతారు. అందుకొరకు బాబా యుక్తులు తెలుపుతూ ఉంటారు. స్మృతి చేయు వేగమును పెంచండి. కుంభమేళాలోకి కూడా సమయానికి వెళ్లవలసి ఉంటుంది. మీరు కూడా సమయానికి వెళ్లాలి. అంతేగాని త్వర త్వరగా వెళ్లలేరు. త్వర త్వరగా చేయడం మన చేతిలో లేదు. ఇది డ్రామాలో నిర్ణయించబడింది. మొత్తం మహిమ అంతా డ్రామాదే. ఇక్కడ జీవ జంతువులు మొదలైనవి ఎంత దు:ఖమిచ్చేవిగా ఉన్నాయి! సత్యయుగములో ఇవేవీ ఉండవు. అక్కడ ఫలానా ఫలానా ఉంటాయని ఆలోచిస్తూ ఉండాలి. సత్యయుగమైతే గుర్తుకు వస్తుంది కదా. సత్యయుగ స్థాపన తండ్రి చేస్తారు. చివర్లో జ్ఞాన సారాంశమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఉదాహరణానికి చిన్న బీజములో ఎంత పెద్ద వృక్షముంది! అదైతే జడమైన వస్తువు, ఇది చైతన్యము. వీరిని గురించి ఎవ్వరికీ తెలియదు. తెలియకుండానే కల్పము ఆయువును ఎంతో పద్దదిగా చేసేశారు. భారతదేశమే చాలా సుఖమును పొందుతుంది. కనుక దు:ఖమును కూడా భారతదేశమే పొందుతుంది. రోగాలు మొదలైనవి కూడా భారతదేశములోనే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ దోమల వలె మనుష్యులు మరణిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయువు తక్కువగా ఉంది. ఇక్కడ శుభ్రము చేయువారికి మరియు విదేశాలలో శుభ్రము చేయువారికి ఎంత తేడా ఉంది! విదేశాలలో ఆవిష్కరింపబడినవన్నీ ఇక్కడికి వస్తాయి. సత్యయుగము పేరే స్వర్గము(ప్యారడైజ్‌). అక్కడ అన్నీ సతోప్రధానంగా ఉంటాయి. మీకు అన్నీ సాక్షాత్కారమౌతాయి. ఇప్పుడిది సంగమ యుగము. తండ్రి వచ్చి కూర్చుని కొత్త - కొత్త విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. ప్రతి రోజూ ఎన్నో గుహ్యమైన విషయాలను వినిపిస్తానని తండ్రి చెప్తున్నారు. బాబా ఎంత చిన్న బిందువు. వారిలో సదా కాలానికి పాత్ర నిండి ఉందని ఇంతకుముందు తెలియదు. మీరు పాత్రను అభినయిస్తూ వచ్చారనే విషయము ఎవరికైనా తెలిపితే వీరు ఏమి చెప్తున్నారు! ఇంత చిన్న బిందువులో ఇంత మొత్తం పాత్ర అంతా నిండి ఉందా? అది ఎప్పుడూ పాత్ర చేస్తూనే ఉంటుందా? మరి ఎప్పుడూ అలసిపోదా! అని వారి బుద్ధిలో అలజడి కలుగుతుంది. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. అర్ధకల్పము సుఖము, అర్ధకల్పము దు:ఖముంటుందని మీకిప్పుడు అర్థమయ్యింది. చాలా దు:ఖాలను చూచి మానవులు దీనికన్నా మోక్షము పొందడం మంచిదని భావిస్తారు. అక్కడ సుఖము, శాంతిలో ఉన్నప్పుడు ఇలా అనరు. ఈ జ్ఞానమంతా ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. తండ్రి బీజము కనుక వారి వద్ద మొత్తం వృక్షమంతటి జ్ఞానము ఉంది. వృక్షము నమూనా రూపాన్ని చూపించారు. పెద్దదిగా చూపించలేరు. బుద్ధిలోకి జ్ఞానమంతా వచ్చేస్తుంది. కాబట్టి పిల్లలైన మీకు ఎంత విశాలబుద్ధి ఉండాలి! ఎంతగా అర్థం చేయించవలసి ఉంటుంది! ఫలానావారు ఫలానా సమయములో పాత్ర చేసేందుకు మళ్లీ వస్తారు. ఇది ఎంత పెద్ద విశాలమైన డ్రామా! ఈ మొత్తం డ్రామానంతటినీ ఎప్పుడూ ఎవ్వరూ చూడలేరు కూడా. అసాధ్యము. దివ్యదృష్టి ద్వారా మంచి వస్తువులనే చూడటం జరుగుతుంది. గణేశుడు, హనుమంతుడు, వీరంతా భక్తి మార్గానికి చెందినవారు. కానీ మనుష్యులకు వారిలో భావన ఏర్పడినందున భక్తిని వదిలి పెట్టలేరు. పిల్లలైన మీరిప్పుడు పురుషార్థము చేయాలి. కల్పక్రితము వలె పదవి పొందేందుకు చదవాలి. పునర్జన్మలు ప్రతి ఒక్కరూ తీసుకోవలసిందేనని మీకు తెలుసు. మెట్లు ఎలా దిగారో పిల్లలైన మీరు తెలుసుకున్నారు. ఎవరైతే తెలుసుకుంటారో, వారు ఇతరులకు కూడా తెలియచేయడంలో లగ్నమవుతారు. కల్పక్రితము కూడా ఇదే చేసి ఉంటారు. మ్యూజియమ్‌ కూడా ఇలాగే తయారు చేసి కల్పక్రితము కూడా పిల్లలకు నేర్పించి ఉంటారు. పురుషార్థము చేస్తూ ఉన్నారు, చేస్తూ ఉంటారు. డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. ఇలా ఎంతో మంది తయారవుతారు. వీధి-వీధిలో, ఇంటింటిలో ఈ పాఠశాల ఉంటుంది. కేవలం ధారణ చేయవలసి ఉంటుంది. మీకు ఇద్దరు తండ్రులున్నారని చెప్పండి. అందులో పెద్ద తండ్రి ఎవరు? అని అడగండి. వారినే దయ చూపమని వేడుకుంటారు. అడగడము ద్వారా ఏమీ లభించదని తండ్రి చెప్త్తున్నారు. నేనేమో దారి చూపించాను. మార్గమును తెలిపేందుకే నేను వస్తాను. మొత్తం వృక్ష జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది.

తండ్రి ఎంతో శ్రమ చేస్తూ ఉంటారు! ఇక చాలా కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది. నాకు సర్వీసు చేసే పిల్లలు కావాలి. ప్రతి ఇంట్లో గీతా పాఠశాల ఉండాలి. చిత్రాలు మొదలైనవి ఉండకపోయినా కేవలం బయట వ్రాయండి. చిత్ర్రాలకు బదులు ఈ బ్యాడ్జి చాలు. చివర్లో ఈ బ్యాడ్జియే మీకు పనికి వస్తుంది. ఇది సూచనలతో కూడిన విషయము. అనంతమైన తండ్రి తప్పకుండా స్వర్గమునే రచిస్తారని తెలసిపోతుంది. కనుక తండ్రిని స్మృతి చేస్తారు. అప్పుడే కదా స్వర్గానికి వెళ్తారు. మనము పతితులుగా ఉన్నాము, స్మృతి ద్వారానే పావనంగా అవుతాము. ఇది తప్ప వేరే ఉపాయమేదీ లేదని మీరు అర్థం చేసుకున్నారు. స్వర్గము పావన ప్రపంచము. స్వర్గానికి అధికారులుగా అవ్వాలంటే తప్పకుండా పావనంగా అవ్వాలి. స్వర్గములోకి వెళ్లేవారు మళ్లీ నరకములో ఎలా మునకలు వేస్తారు? అందుకే ''మన్మనాభవ'' అని అంటారు. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే అంతమతి అనుసారము గతి లభిస్తుంది. స్వర్గములోకి వెళ్లేవారు వికారాలలోకి వెళ్లరు. భక్తులు అంతగా వికారాలలోకి వెళ్లరు. సన్యాసులు కూడా పవిత్రంగా ఉండమని చెప్పరు. ఎందుకంటే స్వయంగా వారే వివాహాలు చేయిస్తారు. వారు నెలకొకసారి వికారాలలోకి వెళ్లమని గృహస్థులకు చెప్తారు. మీరు వివాహము చేసుకోరాదని బ్రహ్మచారులకు చెప్పరు. మీ వద్ద గాంధర్వ వివాహము చేసుకుంటారు. కానీ మరుసటి రోజే ఆట సమాప్తమైపోతుంది. మాయ చాలా ఆకర్షిస్తుంది. అయినా పవిత్రంగా అయ్యే పురుషార్థము ఈ సమయములోనే జరుగుతుంది. ఆ తర్వాత ప్రాలబ్ధము లభిస్తుంది. అక్కడైతే రావణ రాజ్యమే ఉండదు. చెడు(క్రిమినల్‌) ఆలోచనలే ఉండవు. రావణుడే క్రిమినల్‌గా తయారు చేస్తాడు. శివబాబా శుద్ధము(సివిల్‌)గా తయారు చేస్తారు. ఇది కూడా స్మృతి చేయాలి. ప్రతి ఇంటిలో క్లాసు చేస్తూ ఉంటే అందరూ అర్థం చేయించేవారిగా అవుతారు. ప్రతి ఇంటిని గీతా పాఠశాలగా చేసి ఇంటిలోని వారిని సరిదిద్దాలి. ఈ విధంగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. సాధారణమైనవారు మరియు పేదవారు............ వారు కూడా సహవాసీలుగా అవుతారు(హమ్‌జీన్స్‌). గొప్ప గొప్ప వ్యక్తులు, చిన్న చిన్న వ్యక్తుల సత్సంగములోకి వచ్చేందుకు సిగ్గుపడ్తారు. ఎందుకంటే ఇక్కడ గారడీ చేస్తారని, సోదర - సోదరీలుగా చేస్తారని విన్నారు కదా. అరే! అది మంచిదే కదా! గృహస్థములో ఎంత జంజాటముంటుంది! ఎంత దు:ఖీలుగా అవుతారు! ఇది దు:ఖ ప్రపంచము. ఇందులో అపారమైన దు:ఖముంది. మళ్లీ అక్కడ సుఖము కూడా అపారంగా ఉంటుంది. మీరు లిస్టును తయారు చేసేందుకు ప్రయత్నించండి. 25 - 30 ముఖ్యమైన దు:ఖమిచ్చే విషయాలను లిస్టు వ్రాయండి.

అనంతమైన తండ్రి నుండి వారసత్వము పొందేందుకు ఎంత పురుషార్థము చేయాలి! తండ్రి ఈ రథము ద్వారా మనకు అర్థం చేయిస్తారు. ఈ దాదా కూడా విద్యార్థియే. దేహధారులందరూ విద్యార్థులే. చదివించే టీచరు విదేహీ. మిమ్ములను కూడా విదేహులుగా తయారు చేస్తారు. అందువలన శరీర భావమును వదిలిపెట్టండి అని తండ్రి చెప్తున్నారు. ఈ భవనాలు మొదలైనవేవీ ఉండవు. అక్కడ అన్నీ క్రొత్తవి లభిస్తాయి. చివర్లో మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి. ఆటమిక్‌ బాంబులతో అటువైపు చాలా వినాశనము అవుతుందని మీకు తెలుసు. ఇక్కడైతే రక్తపు నదులు ప్రవహిస్తాయి. అయితే దీనికి సమయము పడ్తుంది. ఇక్కడ మృత్యువు భయంకరంగా ఉంటుంది. ఇది అవినాశి ఖండము. ప్రపంచ పటములో చూస్తే హిందూస్థాన్‌ ఒక మూల వలె ఉంటుంది. డ్రామానుసారంగా ఇక్కడ వాటి(బాంబుల) ప్రభావమే ఉండదు. ఇక్కడ రక్తపు నదులు ప్రవహిస్తాయి. ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. చివర్లో వీరికి బాంబులు కూడా అప్పుగా ఇస్తారు. వేయగానే ప్రపంచము సమాప్తమయ్యే బాంబులను అప్పుగా ఇవ్వరు. తేలికైన వాటిని ఇస్తారు. పనికొచ్చే వస్తువులను ఎవ్వరూ ఇవ్వరు. కల్పక్రితము వలెనే వినాశమవ్వనే అవ్వాలి. ఇది కొత్త విషయము కాదు. అనేక ధర్మాల వినాశనము, ఒకే ధర్మ స్థాపన జరుగుతుంది. భారత ఖండము ఎప్పటికీ వినాశమవ్వదు. కొంతయినా మిగిలి ఉంటుంది. అందరూ మరణిస్తే ప్రళయము జరిగినట్లే. రోజురోజుకు తమ బుద్ధి విశాలమవుతూ ఉంటుంది. మీ పై చాలా గౌరవముంటుంది. ఇప్పుడంత గౌరవము లేదు కాబట్టి తక్కువగా పాస్‌(ఉత్తీర్ణత) అవుతారు. ఎన్ని శిక్షలు అనుభవించవలసి వస్తుందో రావడము కూడా అంత ఆలస్యముగా వస్తారని బుద్ధిలోకి రాదు. మళ్లీ క్రింద పడినట్లైతే సంపాదనంతా సమాప్తమైపోతుంది. నల్లగా అయిపోతారు. మళ్లీ లేచి నిల్చోలేరు. ఎంతోమంది వెళ్లిపోయారు. ఇంకా ఎంత మందో వెళ్లిపోనున్నారు. ఈ పరిస్థితిలో శరీరము వదలిపోతే తాము ఎటువంటి గతిని పొందుతారో, ఏమవుతుందో వారికే అర్థమవుతుంది. ఇది అర్థము చేసుకోవాల్సిన విషయం కదా! పిల్లలైన మీరు శాంతి స్థాపన చేయువారు, మీలోనే అశాంతి ఉంటే పదవి భ్రష్ఠమైపోతుంది. ఎవ్వరికీ దు:ఖమునిచ్చే అవసరము లేదు. తండ్రి ఎంతో ప్రేమగా అందరినీ పిల్లలూ! - పిల్లలూ! అని పిలుస్తూ మాట్లాడ్తారు. వీరు అనంతమైన తండ్రి కదా. ప్రపంచమంతటి జ్ఞానము వీరిలో ఉంది. అందుకే అర్థము చేయిస్తారు. ఈ ప్రపంచములో ఎన్ని రకాల దు:ఖాలున్నాయి! లెక్కలేనన్ని దు:ఖ విషయాలను మీరు వ్రాయగలరు. ఈ విషయాన్ని నిరూపించి మీరు తెలిపినప్పుడు ఇది పూర్తిగా సరియైన విషయమని అర్థము చేసుకుంటారు. ఈ అపారమైన దు:ఖాలను తండ్రి తప్ప మరెవ్వరూ దూరము చేయలేరు. దు:ఖాల లిస్టు ఉంటే ఎంతో కొంత బుద్ధిలో కూర్చుంటుంది. లేకపోతే వినీ విననట్లు ఉంటారు. సంగీతము గురించి గొర్రెకేమి తెలుసు అని అలాంటివారిని ఉద్ధేశించే అంటారు. మీరు ఇలాంటి పుష్పాలుగా తయారవ్వాలని తండ్రి అర్థం చేయిస్తారు. ఎటువంటి అశాంతి, అశుద్ధత ఉండరాదు. అశాంతిని వ్యాపింపజేసే వారు దేహాభిమానములో ఉంటారు. వారి నుండి దూరంగా ఉండాలి. అలాంటి వారిని తాకను కూడా తాకరాదు. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. ఎలాగైతే చదివించే టీచరు విదేహీగా ఉన్నారో, వారికి దేహ భావము లేదో అలా మీరు కూడా విదేహీగా అవ్వాలి. శరీర భావమును వదులుతూ ఉండాలి. చెడు(క్రిమినల్‌) దృష్టిని పరివర్తన చేసి మంచి(సివిల్‌) దృష్టిని తయారు చేసుకోవాలి.

2. తమ బుద్ధిని విశాలంగా చేసుకోవాలి. శిక్షల నుండి ముక్తులుగా అయ్యేందుకు తండ్రి పై మరియు చదువు పై గౌరవముంచాలి. ఎప్పుడూ దు:ఖమునివ్వరాదు. అశాంతిని వ్యాపింప చేయరాదు.

వరదానము :-

''నడుస్తూ - తిరుగుతూ తమ ద్వారా అష్టశక్తుల కిరణాలను అనుభవం చేయించే ఫరిస్తా రూప్‌ భవ ''

చాలా విలువైన మచ్చలేని మాణిక్యాన్ని లైటు ముందు ఉంచితే రకరకాల రంగులు కనిపిస్తాయి. అలా ఎప్పుడైతే మీరు ఫరిస్తా రూపాలుగా అవుతారో, నడుస్తూ తిరుగుతూ ఉన్నా, మీ ద్వారా అష్టశక్తుల కిరణాలు అనుభవమవుతాయి, ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క రకము శక్తులు అనుభవమవుతాయి.

స్లోగన్‌ :-

''ఎవరి ప్రతి కర్మ అందరికి ప్రేరణనిచ్చేదిగా ఉంటుందో, వారే ప్రత్యక్ష ప్రమాణము.''