14-06-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీరు ఇచ్చటికి పరివర్తన అగుటకై వచ్చారు, మీరు ఆసురీ గుణములను పరివర్తన చేసుకొని, దైవీ గుణములు ధారణ చేయాలి. ఇది దేవతలుగా అగుటకు చదివే చదువు. ''
ప్రశ్న :-
పిల్లలైన మీరు, ఇతరులెవ్వరూ చదివించలేని ఏ చదువును తండ్రి ద్వారా చదువుతున్నారు?
జవాబు :-
మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే చదువు, అపవిత్రుల నుండి పవిత్రులుగా తయారై నూతన ప్రపంచానికి వెళ్ళే ఈ చదువును ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ చదివించలేరు. ఆ తండ్రి మాత్రమే సహజ జ్ఞానము, రాజయోగముల చదువు ద్వారా పవిత్ర ప్రవృత్తి మార్గమును స్థాపన చేస్తారు.
ఓంశాంతి.
తండ్రి కూర్చొని పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. వాస్తవానికి ఇద్దరూ తండ్రులే, ఒకరు హద్దులోని తండ్రి, మరొకరు బేహద్(అనంతమైన) తండ్రి. అతడూ తండ్రియే, వీరూ తండ్రియే. బేహద్ తండ్రి వచ్చి చదివిస్తారు. మనము నూతన ప్రపంచమైన సత్యయుగము కొరకు చదువుతున్నామని పిల్లలకు తెలుసు. ఇటువంటి చదువు మరెక్కడా లభించజాలదు. మీరు చాలా సత్సంగాలకు వెళ్లారు. మీరు భక్తులుగా ఉండేవారు కదా. గురువులను ఆశ్రయించారు, శాస్త్రాలు కూడా అధ్యయనము చేశారు. అయితే ఇప్పుడు తండ్రి వచ్చి మేల్కొలిపారు. ఇప్పుడు పాత ప్రపంచము పరివర్తన అవ్వనున్నదని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు నేను మిమ్ములను నూతన ప్రపంచము కొరకు చదివిస్తున్నాను. నేను మీ టీచరును, ఏ గురువును కూడా టీచరు అని అనరు. పాఠశాలలో టీచరు ఉంటారు, అతని ద్వారా ఉన్నత పదవి పొందుతారు. కానీ అతను ఈ ప్రపంచము కొరకే చదివిస్తారు. ఇప్పుడు మనము చదివే చదువు నూతన ప్రపంచము కొరకు అని మీకు తెలుసు. దానిని స్వర్ణయుగ ప్రపంచమని అంటారు. ఇప్పుడు ఆసురీ గుణాలు పరివర్తన చేసుకొని దైవీ గుణాలు ధారణ చేయాలని కూడా మీకు తెలుసు. మీరు పరివర్తన చెందేందుకు ఇక్కడకు వచ్చారు. స్వభావమును(నడవడికను) పొగుడుతారు. దేవతల ముందుకు వెళ్ళి మీరు అలా ఉన్నారు, మేము ఒకప్పుడు ఇలా ఉన్నామని పాడ్తారు. ఇప్పుడు మీకు లక్ష్యము లభించింది. భవిష్యత్తు కొరకు ఆ తండ్రి మిమ్ములను చదివిస్తున్నారు, నూతన ప్రపంచము కూడా స్థాపన చేస్తున్నారు. అక్కడ వికారముల మాటే ఉండదు. మీరు రావణుని పై విజయము పొందుతారు. రావణ రాజ్యములో ఉండేవారంతా వికారులే. యథా రాజ, రాణి తథా ప్రజా. ఇప్పుడైతే ఇది పంచాయితీ రాజ్యము. అంతకు ముందు రాజా-రాణుల రాజ్యముండేది. కానీ వారు కూడా పతితులుగానే ఉండేవారు. ఆ పతిత రాజుల వద్ద మందిరాలు కూడా ఉంటాయి. నిర్వికారి దేవతల పూజ చేసేవారు. ఆ దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయారని వారికి తెలుసు. ఇప్పుడు వారి రాజ్యము లేనే లేదు. ఆ తండ్రే ఆత్మలను పావనముగా చేస్తారు. అంతేకాక మీరు దేవతా శరీరములో ఉండేవారని కూడా స్మృతిని ఇప్పిస్తారు. అప్పుడు మీ శరీరము, ఆత్మ రెండూ పవిత్రంగా ఉండేవి. ఇప్పుడు మళ్లీ తండ్రి వచ్చి పతితుల నుండి పావనంగా చేస్తారు. అందుకే మీరు ఇక్కడికి వచ్చారు.
బాబా ఆర్డినెన్స్(ఎమర్జెన్సీలో ప్రెసిడెంటు సంతకముతో వెలువడు ఆజ్ఞ) ఇస్తున్నారు - '' పిల్లలూ, కామము మహాశత్రువు, ఇది మీకు ఆదిమధ్యాంతాలు దు:ఖమునిస్తుంది.'' ఇప్పుడు మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ పావనవంగా అవ్వాలి. దేవతలకు పరస్పరము ప్రేమ లేదని కాదు. కానీ అక్కడ వికారీ దృష్టి ఉండదు. వారు నిర్వికారులుగా ఉంటారు. తండ్రి కూడా - గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండండి అని అంటారు. మీరు ఎలాగైతే పవిత్ర జంటగా ఉండేవారో, అలా మీ భవిష్యత్తును తయారు చేసుకోవాలి. ప్రతి ఆత్మ భిన్న-భిన్న నామ-రూపాలతో పాత్ర చేస్తూ వచ్చింది. ఇప్పుడిది మీ చివరి పాత్ర. పవిత్రత కొరకు చాలా సంశయిస్తారు(తికమకపడ్తారు) - కలిసి ఎలా పవిత్రంగా ఉండాలి? ఏం చేయాలి? అని తికమకపడుతూ ఉంటారు. కంపానియన్గా ఉండడం అనగా అర్థమేమి? విదేశాలలో వృద్ధాప్యములో జతలో(కంపానియన్గా) ఉండి సంభాళించేందుకు వివాహము చేసుకుంటారు. చాలామంది బ్రహ్మచారులుగా ఉండేందుకే ఇష్టపడ్తారు. సన్యాసుల మాట అయితే వేరు. గృహస్థములో ఉంటున్నా చాలా మంది వివాహము చేసుకునేందుకు ఇష్టపడరు. పెళ్లి చేసుకొని పిల్లాపాపలు మొదలైన వారిని సంభాళించడం..... స్వయం చిక్కుకునే ఇటువంటి వలను ఎందుకు తయారు చేసుకోవాలి? అందులో స్వయం ఎందుకు చిక్కుకోవాలి? అని అంటారు. అటువంటివారు ఇక్కడకు కూడా చాలామంది వస్తారు. 40 సంవత్సరములు దాటినా బ్రహ్మచారిగా ఉన్నాను. ఇప్పుడు ఎందుకు వివాహము చేసుకోవాలి? అని అంటారు. స్వతంత్రముగా ఉండుటకు ఇష్టపడతారు. వారిని చూచి తండ్రి చాలా సంతోషిస్తారు. వారు ముందే బంధన ముక్తులు. ఇప్పుడు శరీర బంధనము మాత్రమే ఉంటుంది. దేహ సహితంగా అన్నీ మర్చిపోవాలి. కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. ఏసుక్రీస్తు మొదలైన దేహధారులెవ్వరినీ స్మృతి చేయరాదు. నిరాకార శివుడు దేహధారి కాదు. వారి పేరు శివుడు. శివుని మందిరాలు కూడా ఉన్నాయి. ఆత్మకు 84 జన్మల పాత్ర ఉంది. ఇది అవినాశి డ్రామా. ఇందులో ఏ మార్పూ ఉండదు.
మొట్టమొదట శ్రేష్ఠంగా ఉండే మన ధర్మము, కర్మలు భ్రష్ఠంగా అయ్యాయని మీకు తెలుసు. దేవతా ధర్మమే నశించిపోయిందని కాదు. దేవతలు సర్వ గుణ సంపన్నంగా ఉండేవారని కూడా మహిమ చేస్తారు. లక్ష్మీనారాయణులు ఇరువురూ పవిత్రంగా ఉండేవారు. పవిత్ర ప్రవృత్తి మార్గము ఉండేది. ఇప్పుడు అపవిత్ర ప్రవృత్తి మార్గముగా అయ్యింది. 84 జన్మలలో భిన్న-భిన్న నామ-రూపాలు మారుతూ వచ్చాయి. తండ్రి తెలుపుచున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ! మీ జన్మలు మీకు తెలియదు. నేను ఇప్పుడు మీకు మీ 84 జన్మల కథ వినిపిస్తాను. కావున తప్పకుండా మొదటి జన్మ నుండి అర్థము చేయించవలసి వస్తుంది. మీరు పవిత్రంగా ఉండేవారు. కానీ ఇప్పుడు వికారులుగా అయ్యారు. కావున దేవతల ముందుకు వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు. క్రైస్తవులు ఏసుక్రీస్తు ముందు, బౌద్ధులు బుద్ధుని ముందు, సిక్కులు గురునానక్ దర్బారు ముందుకు వెళ్లి తల వంచి నమస్కరిస్తారు. దాని ద్వారా వారు ఏ మార్గానికి చెందినవారో తెలిసిపోతుంది. మిమ్ములను హిందువులని అంటారు. ఆదిసనాతన దేవీదేవతా ధర్మము ఎచ్చటికి పోయిందో ఎవ్వరికీ తెలియదు. అది ప్రాయః లోపమైపోయింది. భారతదేశములో అనేక చిత్రాలు తయారు చేయబడి ఉన్నాయి. అనేక మానవ మతాలున్నాయి. శివునికి కూడా అనేక నామ-రూపాలు ఇచ్చారు. వాస్తవానికి వారి పేరు శివుడు ఒక్కటే. అంతేకాని వారు పునర్జన్మ తీసుకున్నందున అనేక పేర్లు ఉన్నాయని అనుకోరాదు. అలా జరగదు. మానవ మతాలు అనేకమున్నాయి. కనుక అనేక పేర్లు ఉంచేశారు. శ్రీనాథ ద్వారములోకి వెళ్తే అక్కడ కూడా అదే లక్ష్మీనారాయణులు, జగన్నాథ మందిరములో కూడా అవేే విగ్రహాలు ఉన్నాయి. పేర్లు మాత్రము వేరు వేరుగా ఉంచేశారు. మీరు సూర్య వంశీయులుగా ఉన్నప్పుడు పూజలు మొదలైనవి చేసేవారు కాదు. మొత్తము విశ్వము పై మీ రాజ్యము ఉండేది. చాలా సుఖంగా ఉండేవారు. శ్రీమతమును అనుసరించి శ్రేష్ఠ రాజ్య స్థాపన చేశారు. దానిని సుఖధామము అని అంటారు. మమ్ములను తండ్రి చదివిస్తున్నారని, మానవుల నుండి దేవతలుగా మారుస్తున్నారని మరెవ్వరూ చెప్పరు. వారి గుర్తులు కూడా ఉన్నాయి. వారి రాజ్యమే ఉండేది. అక్కడ కోటలు మొదలైనవి ఉండవు. కోటలు మొదలైనవి రక్షణ కొరకు నిర్మించుకుంటారు. ఈ దేవీ దేవతల రాజ్యములో కోటలు మొదలైనవి లేనే లేవు. అక్కడ దండెత్తి వచ్చేవారు ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు అదే దేవీదేవతా ధర్మములోకి బదిలీ అవుతున్నామని మీకు తెలుసు. అందుకు మీరు రాజయోగ చదువు చదువుతున్నారు. మీరు రాజ్యమును పొందాలి. భగవానువాచ - నేను మిమ్ములను రాజాధి రాజులుగా చేస్తాను. ఇప్పుడు రాజా-రాణి ఎవ్వరూ లేరు. ఎన్నో కొట్లాటలు, జగడాలు జరుగుతూ ఉంటాయి. ఇది కలియుగము, ఐరన్ ఏజ్డ్ వరల్డ్(ఇనుపయుగ ప్రపంచము). మీరు బంగారు యుగములో ఉండేవారు. ఇప్పుడు మళ్లీ పురుషోత్తమ సంగమ యుగములో నిలబడి ఉన్నారు. మిమ్ములను మొదటి నంబరులోకి తీసుకెళ్ళేందుకు తండ్రి వచ్చారు. వారు అందరి కళ్యాణము చేస్తారు. మన కళ్యాణము కూడా జరుగుతుందని మీకు తెలుసు. మొట్టమొదట మనము సత్యయుగములోకి వస్తాము. మిగిలిన ధర్మములోని వారంతా శాంతిధామములోనికి వెళ్లిపోతారు. తండ్రి చెప్తున్నారు - అందరూ పవిత్రంగా కూడా అవ్వాలి. మీరు పవిత్ర దేశములో ఉండేవారు. దానిని నిర్వాణధామము అని కూడా అంటారు. ధ్వనికి దూరంగా, కేవలం అశరీరి ఆత్మలు మాత్రమే ఉంటారు. ఇప్పుడు మిమ్ములను తండ్రి ధ్వనికి దూరంగా తీసుకెళ్తున్నారు. నేను మిమ్ములను నిర్వాణధామానికి, శాంతిధామానికి తీసుకెళ్తానని మరెవ్వరూ అనజాలరు. వారైతే మేము బ్రహ్మంలో లీనమవుతామని అంటారు. ఇది తమోప్రధాన ప్రపంచమని పిల్లలైన మీకు తెలుసు. ఈ ప్రపంచములో మీకు ఎలాంటి రుచి ఉండదు. అందుకే నూతన ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనము చేసేందుకు భగవంతుడు ఇక్కడకు రావలసి ఉంటుంది. శివజయంతి కూడా ఇక్కడే జరుపుకుంటారు. వారు వచ్చి ఏమి చేస్తారో ఎవరైనా చెప్పగలరా? జయంతి జరుపుకుంటున్నారంటే వారు తప్పకుండా వస్తారనే కదా. వారు వచ్చి రథము పై విరాజమానమై ఉంటారు. వారు గుఱ్ఱాల రథమును చూపించారు, తండ్రి ఏ రథములో వస్తారో వారే తెలుపుతున్నారు. పిల్లలకు మాత్రమే తెలుపుతాను. ఈ జ్ఞానము మళ్లీ ప్రాయః లోపమైపోతుంది. ఇతని 84 జన్మల అంత్యములో బాబా రావలసి ఉంటుంది. ఈ జ్ఞానము ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. జ్ఞానము అనగా పగలు, భక్తి అనగా రాత్రి. క్రిందకు దిగజారుతూనే ఉంటారు. భక్తికి ఎంతో ఆడంబరము ఉంది. ఎన్నో కుంభమేళాలు ఫలానా మేళాలు అని అనేకం జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మీరు పవిత్రమై పవిత్ర ప్రపంచానికి వెళ్లాలని తండ్రి తప్ప ఎవ్వరూ చెప్పరు. ఇది సంగమ యుగమని స్వయంగా తండ్రే తెలుపుతున్నారు. కల్పక్రితము లభించిన చదువే ఇప్పుడూ లభిస్తుంది. అప్పుడు మానవుల నుండి దేవతలుగా అయ్యారు. మానవుల నుండి దేవతలుగా చేసిన..... అని మహిమ కూడా ఉంది. అలా చేసేది తండ్రే కదా. మనము అపవిత్ర గృహస్థ ధర్మము వారిగా ఉండేవారము. ఇప్పుడు తండ్రి వచ్చి మళ్లీ పవిత్ర ప్రవృత్తి మార్గము వారిగా తయారు చేస్తారు. మీరు చాలా ఉన్నత పదవి పొందుతారు. అత్యంత ఉన్నతమైన తండ్రి, ఎంతో ఉన్నతంగా తయారు చేస్తారు. తండ్రిది శ్రీ శ్రీ అనగా అత్యంత శ్రేష్ఠమైన మతము. మనము శ్రేష్ఠంగా తయారవుతాము. శ్రీ శ్రీ అర్థము గూర్చి ఎవ్వరికీ తెలియదు. ఈ బిరుదు ఒక్క శివబాబాకు మాత్రమే. కానీ వారు స్వయాన్ని శ్రీ శ్రీ అని చెప్పుకుంటారు. మాల త్రిప్పబడ్తుంది. 108 మాల ఉంటుంది. వారు 16,108 మాలను తయారు చేశారు. అందులో 8 రానే రావాలి. నాలుగు జంటలు, వీరు కాక తండ్రి ఒక్కరు. 8 రత్నాలు వారు కాక నేను 9వ వాడిని. వారిని రత్నాలు అని అంటారు. అయితే వారిని ఈ విధంగా తయారు చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. మీరు తండ్రి ద్వారా పారసబుద్ధి గలవారిగా తయారవుతారు. రంగూన్లో ఒక సరస్సు ఉంది. అందులో స్నానము చేస్తే దేవ కన్యలుగా అవుతారని అంటారు. వాస్తవానికి ఇది జ్ఞాన స్నానము. దీని ద్వారా మీరు దేవతలుగా అవుతారు. మిగిలినవన్నీ భక్తి మార్గములోని విషయాలు. అంతేకాని నీటిలో స్నానము చేస్తే దేవతలుగా అవ్వడం అసంభవము. అదంతా భక్తి మార్గము. రకరకాల విషయాలు తయారుచేశారు. కొంచెము కూడా అర్థము చేసుకోరు. ఇప్పుడు మీరు అర్థము చేసుకున్నారు. దిల్వాడా మందిరము, గురుశిఖరము మొదలైనవి మీ స్మృతి చిహ్నాలే. తండ్రి చాలా ఉన్నతముగా ఉంటారు కదా. తండ్రి మరియు ఆత్మలైన మనము నివసించే స్థానమే మూలవతనమని మీకు తెలుసు. సూక్ష్మవతనములో కేవలం సాక్షాత్కారాలు మాత్రమే జరుగుతాయి. అది ప్రపంచము కాదు. సూక్ష్మ వతనము, మూలవతనాల గురించి చరిత్ర-భూగోళము రిపీట్ అవుతుందని అనరు. ఉండే ప్రపంచము ఒక్కటే. దీని చరిత్ర రిపీట్ అవుతుందని అనేది ఈ ప్రపంచము గురించే.
మానవులు ప్రపంచములో శాంతి ఏర్పడాలని అంటారు. ఆత్మ స్వధర్మమే శాంతి అని వారికి తెలియదు. పోతే అడవులలో శాంతి లభించదు. పిల్లలైన మీకు సుఖము, మిగిలినవారందరికీ శాంతి లభిస్తుంది. వచ్చినవారంతా మొదట శాంతిధామానికి వెళ్లి తర్వాత సుఖధామంలోకి వస్తారు. కొందరు మేము జ్ఞానము తీసుకోకపోతే చివరిలో వస్తాము కదా అని అంటారు. చివరిలో వస్తే అప్పటివరకు ముక్తిధామములోనే ఉంటారు. చాలా సమయము ముక్తిధామములో ఉండడం మంచిదే కదా అని అంటారు. ఇక్కడ 1-2 జన్మలు మాత్రము తీసుకుని పదవి పొందుతారు. వారిని ఏమనవచ్చు? దోమలు పుడ్తాయి, మరణిస్తాయి. ఒక్క జన్మలో ఇక్కడ ఏ సుఖము ఉంటుంది? అది దేనికీ పనికిరాదు. అసలు పాత్ర లేనట్లే ఉంటుంది. మీ పాత్ర చాలా ఉన్నతమైనది. మీరు చూచే సుఖము మరెవ్వరూ చూడలేరు. అందుకే పురుషార్థము చేయాలి, చేస్తూ కూడా ఉంటారు. కల్పక్రితము కూడా మీరు పురుషార్థము చేశారు. మీ పురుషార్థానుసారము ప్రాలబ్ధాన్ని పొందారు. పురుషార్థము చేయకుండా ప్రాలబ్ధము పొందలేరు. పురుషార్థము తప్పకుండా చేయాలి. తండ్రి చెప్తున్నారు - ఇది కూడా తయారైన డ్రామా. మీ పురుషార్థము కూడా జరుగుతూ ఉంటుంది. ఊరికే ఉంటే జరగదు. మీరు తప్పకుండా పురుషార్థము చేయవలసి వస్తుంది. పురుషార్థము చేయకుంటే ఏ పనీ జరగదు. దగ్గు దానంతకు అదే ఎలా బాగవుతుంది? ఔషధము తీసుకొను పురుషార్థము చేయవలసి వస్తుంది. కొంతమంది డ్రామా పై వదిలి, డ్రామాలో ఉన్నట్లు జరుగుతుందిలే అని కూర్చుంటారు. ఇలాంటి ఉల్టా(తలక్రిందులైన) జ్ఞానము బుద్ధిలోకి రానివ్వరాదు. ఈ విధంగా కూడా మాయ విఘ్నాలు కలిగిస్తుంది. పిల్లలు చదువును కూడా వదిలేస్తారు. అలా చేస్తే దానిని - మాయతో ఓటమి అని అంటారు. ఇది యుద్ధము కదా. అది కూడా చాలా తీవ్రమైన యుద్ధము. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. శ్రేష్ఠమైన రాజ్యమును స్థాపన చేసేందుకు శ్రీమతమును అనుసరిస్తూ తండ్రికి సహయోగులుగా అవ్వాలి. ఎలాగైతే దేవతలు నిర్వికారులుగా ఉన్నారో, అలా గృహస్థములో ఉంటూ నిర్వికారులుగా అవ్వాలి. పవిత్ర ప్రవృత్తిని తయారు చేసుకోవాలి.
2. డ్రామా పాయింటును ఉల్టా రూపములో ఉపయోగించరాదు. డ్రామా అనుకొని కూర్చుండిపోరాదు. చదువు పై పూర్తిగా గమనముంచాలి. పురుషార్థము ద్వారా శ్రేష్ఠ ప్రాలబ్ధమును తయారు చేసుకోవాలి.
వరదానము :-
'' స్నేహ శక్తి ద్వారా మాయ శక్తిని సమాప్తము చేసే సంపూర్ణ జ్ఞాని భవ ''
స్నేహములో ఇమిడిపోవడమే సంపూర్ణ జ్ఞానము. స్నేహము బ్రాహ్మణ జన్మలో వరదానము. సంగమ యుగములో స్నేహసాగరుడు పళ్ళేలను స్నేహమనే వజ్రాలు, ముత్యాలతో నింపి ఇస్తున్నారు. కనుక స్నేహములో సంపన్నంగా అవ్వండి. స్నేహము యొక్క శక్తి ద్వారా పరిస్థితులనే పర్వతము పరివర్తనై నీటి వలె తేలికైపోతుంది. మాయ ఎంత భయంకర రూపంలో లేక రాయల్ రూపంలో ఎదిరించినా ఒక సెకనులో స్నేహసాగరంలో ఇమిడిపోండి. అప్పుడు స్నేహశక్తి ద్వారా మాయ యొక్క శక్తి సమాప్తమైపోతుంది.
స్లోగన్ :-
'' తనువు - మనసు - ధనము, మనసా -వాచా- కర్మల ద్వారా తండ్రి కర్తవ్యములో సదా సహయోగులుగా ఉండువారే యోగులు ''