14-02-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - శివజయంతియే గీతాజయంతి అని, గీత ద్వారానే మళ్లీ శ్రీ కృష్ణ జయంతి జరుగుతుందని భారతవాసులకు ఋజువు చేసి తెలపండి.''
ప్రశ్న :-
ఏదైనా ధర్మ స్థాపన జరిగేందుకు ముఖ్యమైన ఆధారము ఏది? తండ్రి చేసే ఏ కర్తవ్యాన్ని ఇతర ధర్మ స్థాపకులు చెయ్యరు ?
జవాబు :-
ఏ ధర్మ స్థాపనకైనా పవిత్రతా బలము అవసరము. ధర్మాలన్నీ పవిత్రతా బలము ఆధారముతోనే స్థాపన అయ్యాయి. అయితే ఏ ధర్మ స్థాపకుడూ ఎవ్వరినీ పావనంగా చేయరు. ఎందుకంటే ధర్మ స్థాపన జరుగునప్పుడు మాయా రాజ్యము ఉంటుంది. అందరూ పతితంగా అవ్వాల్సిందే. పతితులను పావనంగా చేయడం ఒక్క తండ్రి కర్తవ్యమే. వారే పావనంగా తయారయ్యేందుకు శ్రీమతమును ఇస్తారు.
పాట :-
ఈ పాప ప్రపంచము నుండి దూరంగా తీసుకెళ్లు.... (ఇస్ పాప్ కీ దునియా సే దూర్..............) 
ఓంశాంతి.
పాప ప్రపంచము, పుణ్య ప్రపంచము లేదా పావన ప్రపంచము అని వేటిని అంటారో ఇప్పుడు పిల్లలు అర్థము చేసుకున్నారు. వాస్తవానికి పాప ప్రపంచము ఈ భారతదేశమే, మళ్లీ ఈ భారతదేశమే పుణ్య ప్రపంచము, స్వర్గంగా తయారవుతుంది. భారతదేశమే స్వర్గంగా (బహిశ్త్గా) ఉండేది. అదే నరకంగా తయారయ్యింది. ఎందుకంటే కామచితి పై కాలుతూ ఉంటారు. అక్కడ కామచితి పై ఎవ్వరూ కాలిపోరు. అక్కడ కామచితియే ఉండదు. సత్యయుగములో కామచితి ఉందని కూడా అనరు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు కదా! మొట్టమొదట ప్రశ్న ఉదయిస్తుంది - ఏ భారతదేశమైతే పతితంగా, దు:ఖీగా ఉందో అదే భారతదేశము ఒకప్పుడు పావనంగా, సుఖీగా ఉండేది. ఆది సనాతన హిందూ ధర్మము ఉండేదని కూడా చెప్తారు. మరి ఆది సనాతన అని దేనిని అంటారు? ఆది అనగా ఏమిటి, సనాతనము అనగా ఏమి? ఆది అనగా సత్యయుగము. సత్యయుగములో ఎవరు ఉండేవారు? లక్ష్మీ-నారాయణులు ఉండేవారని అందరికీ తెలుసు. వారు సత్యయుగానికి అధిపతులుగా అయ్యేందుకు కూడా తప్పకుండా ఎవరో ఒకరి సంతానంగా ఉంటారు కదా. సత్యయుగాన్ని స్థాపన చేసేవారు పరమపిత పరమాత్మ. లక్ష్మీ- నారాయణులు వారికి సంతానంగా ఉండేవారు. అయితే ఆ సమయములో వారు తమను పరమాత్ముని సంతానంగా భావించరు. ఒకవేళ సంతానంగా భావించినట్లయితే తండ్రిని గుర్తిస్తారు. కాని వారికి తండ్రిని గురించి తెలియనే తెెలియదు. హిందూ ధర్మము అనేది గీతలో లేనే లేదు. గీతలో భారతదేశము అనే పేరు అయితే ఉంది. అది హిందూ మహాసభ అని పిలవబడ్తుంది. శ్రీమత్ భగవత్ గీత సర్వశాస్త్రమయి శిరోమణి గీతా జయంతిని శివజయంతిని కూడా జరుపుతారు. అయితే ఇప్పుడు శివజయంతి ఎప్పుడు జరిగిందో కూడా తెలియాలి కదా. తర్వాత కృష్ణ జయంతి జరుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు శివజయంతి తర్వాత గీతా జయంతి జరుగుతుందని తెలుసుకున్నారు. గీతా జయంతి తర్వాత కృష ్ణజయంతి జరుగుతుంది. గీతా జయంతి ద్వారానే దేవి దేవతా ధర్మస్థాపన జరుగుతుంది. గీతా జయంతికి మహాభారతముతో కూడా సంబంధముంది. అందులో యుద్ధము విషయము వస్తుంది. యుద్ధమైదానములో కౌరవులు, పాండవులు మరియు యాదవులు అనే మూడు సైన్యాలు ఉన్నట్లుగా చూపిస్తారు. యాదవులు ముసలాలను (మిస్సైల్స్ను) తయారు చేస్తారు. అక్కడ సారాయి తాగి, ముసలాన్ని తీశారని చూపించారు. ఖచ్ఛితంగా ఇప్పుడు మిసైల్స్ తయారవుతున్నాయని మీకు తెలుసు. అది కూడా తమ కులాన్నే వినాశనము చేసుకునేందుకు ఒకరు మరొకరిని పరస్పరములో బెదిరించుకుంటున్నారు. అందరూ క్రైస్తవులే. ఆ యూరోప్ వాసులే యాదవులు. కనుక ఒకటి వారి సభ. వారు పరస్పరములో పోట్లాడి వినాశనమయ్యారు. అందులో పూర్తి యూరోప్ అంతా వచ్చేసింది. అనగా అందులోనే ఇస్లామ్, బౌద్ధ ధర్మము, క్రైస్తవ ధర్మము అన్నీ వచ్చేస్తాయి. ఇక భారతదేశములో కౌరవులు మరియు పాండవులు ఉన్నారు. కౌరవులు కూడా వినాశనము పొందారు. విజయము పాండవులకు లభించింది. ఇప్పుడు గీతా భగవంతుడు ఎవరు? సహజయోగమును మరియు సహజ జ్ఞానమును నేర్పించి రాజాధి రాజులుగా తయారుచేసింది లేదా పావన ప్రపంచ స్థాపన చేసింది ఎవరు? అనే ప్రశ్న ఉదయిస్తుంది. శ్రీ కృష్ణుడు ఏమైనా వచ్చాడా ? కౌరవులైతే కలియుగములో ఉండేవారు. కౌరవులు, పాండవుల సమయములో శ్రీ కృష్ణుడు ఎలా రాగలడు? శ్రీ కృష్ణ జయంతిని జరుపుకుంటారు. సత్యయుగం ఆదిలో కృష్ణునికి 16 కళలు, తర్వాత త్రేతా యుగములో రామునికి 14 కళలు ఉంటాయి. కృష్ణుడు రాజాధి రాజు లేదా రాకుమారులకు రాజకుమారుడు(ప్రిన్స్ కా ప్రిన్స్). వికారీ రాకుమారులు కూడా శ్రీ కృష్ణుని పూజిస్తారు ఎందుకంటే తాము వికారులని, శ్రీ కృష్ణుడు 16 కళా సంపూర్ణుడని సత్యయుగ రాకుమారుడని వారికి తెలుసు. ఆ రాకుమారులు కూడా తప్పకుండా ఇలాగే చెప్తారు కదా. ఇక మిగిలింది శివజయంతి. శివుని మందిరాలే అన్నిటికంటే పెద్దవిగా నిర్మించారు. అది నిరాకార శివుని మందిరము. వారినే పరమపిత పరమాత్మ అని అంటారు. బ్రహ్మ-విష్ణు-శంకరులు కూడా దేవతలే.
భారతదేశములోనే శివజయంతిని జరుపుకుంటారు. ఇప్పుడు చూడండి! శివజయంతి రానున్నది. శివుడే జ్ఞానసాగరుడు అనగా సృష్టిని పావనంగా చేయువారు పరమపిత పరమాత్మయేనని నిరూపించి అర్థము చేయించాలి. గాంధీ కూడా పతితపావన............ అని వారిని గురించే పాడేవారు. శ్రీ కృష్ణుని పేరును ఉచ్ఛరించలేదు. ఇప్పుడు ప్రశ్న ఉదయిస్తుంది - శివ జయంతియే గీతా జయంతా? లేక కృష్ణ జయంతియే గీతా జయంతా? కృష్ణ జయంతి సత్యయుగములో జరుగుతుంది. శివజయంతి ఎప్పుడు జరిగిందో ఎవ్వరికీ తెలియదు. శివుడు నిరాకార పరమపిత పరమాత్మ. వారు సంగమ యుగములోనే సృష్టిని రచించారు. సత్యయుగములో శ్రీ కృష్ణుని రాజ్యముండేది. కనుక తప్పకుండా మొదట శివజయంతియే జరుగుతుంది. ఎవరైతే సేవలో తత్పరులై ఉంటారో, ఆ బ్రాహ్మణ కులభూషణులు ఈ విషయాలను బుద్ధిలోకి తీసుకు రావాలి - శివజయంతియే గీతా జయంతి అని గీత ద్వారా కృష్ణ జయంతి జరుగుతుందని అనగా రాజాధి రాజు జయంతి జరుగుతుందని ఋజువు చేసి భారతవాసులకు ఎలా అర్థం చేయించాలి? కృష్ణుడు పావన ప్రపంచానికి రాజు. అక్కడ రాజ్యముంటుంది. సత్యయుగములో శ్రీ కృష్ణుడు జన్మించిన తర్వాత గీతను చెప్పలేదు. అంతేకాకుండా సత్యయుగములో మహాభారత యుద్ధము మొదలైనవి ఏవీ జరగజాలవు. అదంతా తప్పకుండా సంగమ యుగములోనే జరిగి ఉంటుంది. పిల్లలైన మీరు ఈ విషయాలను బాగా తెలియజేయాలి.
పాండవులు మరియు కౌరవుల సభ ప్రసిద్ధి చెందింది. పాండవపతిగా శ్రీ కృష్ణుని చూపుతారు. అతడు సహజ జ్ఞానము, సహజ రాజయోగమును నేర్పించాడని భావిస్తారు. వాస్తవానికి యుద్ధము మాటే లేదు. పరమపిత పరమాత్మ ఎవరికైతే సహజ రాజయోగాన్ని నేర్పించారో, ఆ పాండవులకే (సంగమయుగ బ్రాహ్మణులు) విజయము లభించింది. వారే 21 జన్మలు సూర్య వంశస్థులు, చంద్ర వంశస్థులుగా అయ్యారు కనుక మొదట హిందూ మహాసభలోని వారికి తెలియజేయాలి. లోక సభ, రాజ్య సభ,.............. ఇలా ఇంకా ఇతర సభలు కూడా ఉన్నాయి. ఈ హిందూ సభయే ముఖ్యమైనది. మూడు సైన్యాలు - యాదవులు, కౌరవులు మరియు పాండవులు అని మహిమ చేయబడి ఉన్నాయి. అయితే ఇదంతా సంగమ యుగములోనే జరిగింది. ఇప్పుడు సత్యయుగ స్థాపన జరుగుతోంది. శ్రీ కృష్ణుని జన్మ కొరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తప్పకుండా సంగమ యుగములోనే గీత చెప్పబడింది. మరి ఇప్పుడు సంగమ యుగములో ఎవరిని తీసుకు రావాలి? కృష్ణుడైతే రాలేడు. పావన ప్రపంచాన్ని వదిలి పతిత ప్రపంచములోకి రావలసిన అవసరము అతనికి ఏముంది? ఇక్కడ కృష్ణుడు లేను కూడా లేడు. ఇప్పుడు అతని ఆత్మ 84వ జన్మలో ఉందని మీకు తెలుసు. చాలామంది శ్రీ కృష్ణుడు ప్రత్యక్ష దైవమని(హాజీరా హజూర్!) సర్వవ్యాపి అని భావిస్తారు. కృష్ణుని భక్తులు అంతటా కృష్ణుడే కృష్ణుడు ఉన్నాడని అంటారు. కృష్ణుడు ఈ రూపాన్ని ధరించారని చెప్తారు. రాధ భక్తులు ఎక్కడ చూసినా రాధయే రాధ ఉందని, నేను కూడా రాధ, మీరు కూడా రాధ.......... అని అంటారు. ఇలా అనేక మతాలు వెలువడ్డాయి. కొందరు ఈశ్వరుని సర్వవ్యాపి అంటే మరి కొందరు కృష్ణుని, ఇంకొందరు రాధను సర్వవ్యాపి అని అంటారు. ఇప్పుడు తండ్రి తన పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు - తండ్రి వరల్డ్ ఆల్మైటీ అథారిటీ కనుక పిల్లలైన మీకు కూడా వారందరికీ ఎలా తెలియజేయాలనే అథారిటీని ఇస్తున్నారు. హిందూ మహాసభ వారికి అర్థం చేయించండి. వారు ఈ విషయాలను అర్థము చేసుకోగలరు. వారు తమను ధార్మిక చింతన గలవారిగా (రిలీజెస్ మైండెడ్) భావిస్తారు. ప్రభుత్వమైతే ఏ ధర్మాన్నీ అంగీకరించదు. స్వయం వారే తికమక చెంది ఉన్నారు. శివపరమాత్మ నిరాకార జ్ఞానసాగరుడు ఇంకెవ్వరినీ జ్ఞానసాగరుడు అని అనేందుకు వీలు లేదు. వారు సన్ముఖములో వచ్చి జ్ఞానము ఇచ్చినప్పుడే రాజ్య స్థాపన జరుగుతుంది. రాజ్యస్థాపన జరిగిన తర్వాత మళ్లీ ఎప్పుడు రాజ్యమును పోగొట్టుకుంటారో అప్పుడే సన్ముఖములోకి వస్తారు. కనుక శివపరమాత్మయే నిరాకార జ్ఞానసాగరుడని, శివజయంతియే గీతా జయంతి అని మీరు ఋజువు చేయాలి. మనుష్యుల బుద్ధి నుండి కృష్ణుని విషయము తొలగిపోయేందుకు ఈ అంశాలను గురించి నాటకాన్ని తయారు చేయాలి. నిరాకార శివ పరమాత్మనే పతితపావనుడు అని అంటారు. శాస్త్రాలు మొదలైనవి ఏవైతే తయారయ్యాయో అవన్నీ మనుష్యుల మతానుసారము మనుష్యులే తయారు చేశారు. బాబా శాస్త్రమంటూ ఏదీ లేదు. నేను సన్ముఖములో వచ్చి పిల్లలైన మిమ్ములను నిరుపేదల(భికారుల) నుండి రాకుమారులుగా(బెగ్గర్ టు ప్రిన్స్) తయారు చేస్తాను. తర్వాత నేను వెళ్లిపోతానని తండ్రి చెప్తున్నారు. ఈ జ్ఞానాన్ని మీ సన్ముఖములోకి వచ్చి నేను మాత్రమే వినిపించగలను. అక్కడ గీతను వినిపించేవారు భలే గీతను వినిపిస్తారే కాని అక్కడ భగవంతుడు సన్ముఖములో లేనే లేరు. గీతా భగవంతుడు సన్ముఖములో ఉండి స్వర్గ స్థాపన చేసి వెళ్ళిపోయాడని అంటారు. మరి ఆ గీతను వినడం ద్వారా మనుష్యులెవరైనా స్వర్గవాసులుగా అవ్వగలరా? మరణ కాలములో కూడా మనుష్యులకు గీతను వినిపిస్తారే కాని ఇతర శాస్త్రాలు ఏవీ వినిపించరు. గీత ద్వారా స్వర్గ స్థాపన జరిగిందని కనుక గీతనే వినిపించాలని భావిస్తారు. అయితే ఆ గీత ఒక్కటే ఉండాలి కదా. ఇతర ధర్మాలన్నీ తర్వాత వస్తాయి. మీరు స్వర్గవాసులుగా అవుతారని ఇంకెవ్వరూ చెప్పలేరు. మనుష్యులకు గంగా జలమునే తాపుతారు కాని యమునా జలాన్ని తాపించరు. గంగా జలానికే మహత్వముంది. చాలామంది వైష్ణవులు వెళ్లి కడవలతో గంగా జలమును నింపుకొని వస్తారు. తర్వాత ఒక్కొక్క చుక్క తీసుకొని తాగుతూ ఉంటారు. దాని నుండి రోగాలన్నీ నశిస్తాయని భావిస్తారు. వాస్తవానికి ఇది జ్ఞానామృత ధార. దీని నుండి 21 జన్మలకు దు:ఖాలన్నీ తొలగిపోతాయి. చైతన్య జ్ఞాన గంగలైన మీలో స్నానము చేయడం ద్వారా మనుష్యులు స్వర్గవాసులుగా అవుతారు. కనుక తప్పకుండా అంతిమంలో జ్ఞానగంగలు వెలువడి ఉంటారు. ఆ నీటి నదులైతే ఉండనే ఉన్నాయి. నీటిని తాగడం ద్వారా ఎవ్వరూ దేవతలుగా అవ్వడం జరగదు. ఇక్కడ ఎవరైనా కొద్దిగా జ్ఞానము విన్నా స్వర్గానికి హక్కుదారులుగా అవుతారు. వీరు జ్ఞానసాగరుడైన శివబాబా జ్ఞాన గంగలు. జ్ఞానసాగరుడు, గీతా జ్ఞానదాత ఒక్క శివుడే కాని, కృష్ణుడు కాదు. సత్యయుగములో జ్ఞానాన్ని ఇవ్వటానికి అక్కడ పతితులు ఎవ్వరూ ఉండరు. ఈ విషయాలన్నీ భగవంతుడే కూర్చుని అర్థం చేయిస్తారు. ఓ అర్జునా! లేక ఓ సంజయా!.... అనే పేర్లు ప్రసిద్ధము. (జగదీష్ భాయీజీ) వ్రాయడంలో చాలా చురుకుగా ఉన్నాడు. నిమిత్తంగా అయ్యి ఉన్నాడు. ఇప్పుడు శివజయంతి వస్తుందంటే దానిని గురించి పెద్ద పెద్ద అక్షరాలలో వ్రాయాలి. శివుడు నిరాకారుడు. వారిని జ్ఞానసాగరులు, ఆనందసాగరులు అని అంటారు. కృష్ణుని జ్ఞానసాగరుడు, ఆనందసాగరుడని అనరు. శివపరమాత్మయే జ్ఞానమునిస్తారు. దయ చూపుతారు. జ్ఞానము ఇవ్వడమే వారు మన పై దయ చూపడము. టీచరు దయ చూపి చదివిస్తారు. అప్పుడే బ్యారిష్టరు, ఇంజనీరు మొదలైనవారిగా అవుతారు. సత్యయుగములో ఆనందము అవసరమే లేదు. కనుక మొట్టమొదట నిరాకార జ్ఞానసాగరుడైన శివ జయంతియే గీతాజయంతియా లేక సత్యయుగీ సాకార కృష్ణ జయంతియే గీతా జయంతియా? అనునది ఋజువు చేయాలి. దీనిని పిల్లలైన మీరు ఋజువు చేయాలి.
దేవదూతలు(పైగంబర్) మొదలైనవారు ఎవరు వచ్చినా వారు పావనంగా చేయరని మీకు తెలుసు. ద్వాపర యుగము నుండి మాయా రాజ్యము ప్రారంభమవ్వడం వలన అందరూ పతితులుగా అయిపోతారు. తర్వాత విసిగిపోయినప్పుడు, ఇంటికి(పరంధామము) వెళ్ళాలని కోరుకుంటారు. ఏ ఏ ధర్మాలు స్థాపనవుతాయో, అవి తర్వాత వృద్ధి చెందుతాయి. పవిత్రతా బలము ద్వారా ధర్మస్థాపన చేస్తారు. తర్వాత అపవిత్రము అవ్వాల్సిందే. ముఖ్యమైనవి నాలుగు ధర్మాలు. వీటి నుండే వృద్ధి జరుగుతుంది. తర్వాత కొమ్మలు - రెమ్మలు వెలువడ్తాయి. శివజయంతి, గీతా జయంతి ఋజువు అయినట్లైతే మిగిలిన శాస్త్రాలన్నీ విలువ లేకుండా పోతాయి. ఎందుకంటే అవన్నీ మనుష్యుల ద్వారా తయారుచేయబడినవి. వాస్తవానికి భారతదేశ శాస్త్రము ఒక్క గీతయే. అత్యంత ప్రియమైన(మోస్ట్ బిలవ్డ్) తండ్రి ఎంతో సహజము చేసి అర్థం చేయిస్తారు. వారిది అత్యంత శ్రేష్ఠమైన మతము. నిరాకార జ్ఞానసాగరుని జయంతియే గీతా జయంతి అవుతుందా లేక సత్యయుగ సాకార శ్రీ కృష్ణ జయంతియే గీతా జయంతి అవుతుందా? అని మీరు ఇప్పుడు ఋజువు చేయాలి. దీని కొరకు పెద్ద కాన్ఫరెన్స్ (సమావేశము) ఏర్పాటు చేయాలి. ఈ విషయము ఋజువు అయినట్లైతే ఇక పండితులందరూ వచ్చి మీ నుండి ఈ లక్ష్యమును తీసుకుంటారు. శివజయంతి సందర్భములో ఏమైనా చేయాలి కదా. హిందూ మహాసభ వారికి తెలియజేయండి. వారిది పెద్ద సంస్థ. సత్యయుగములో ఆదిసనాతన దేవీ దేవతా ధర్మముంటుంది. అంతేకాని సభ మొదలైనవేవీ ఉండవు. సభలు సంగమ యుగములోనే జరుగుతాయి. ఆదిసనాతన సభ ఈ బ్రాహ్మణులది, పాండవులది అనే విషయాన్ని మొట్టమొదట ఋజువు చేయాలి. పాండవులే విజయమును పొంది తర్వాత స్వర్గవాసులయ్యారు. ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవతల సభ అని ఎవ్వరూ అనజాలరు. దేవతల సభ అని అనరు. ఎందుకంటే అది సామ్రాజ్యము(సావరెంటీ). కల్పము యొక్క సంగమ యుగములోనే ఈ సభలు జరిగాయి. అందులో ఒకటి పాండవుల సభ. దానినే ఆదిసనాతన బ్రాహ్మణుల సభ అని అంటారు. దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. కృష్ణుని పేరుతో బ్రాహ్మణులు ఎవ్వరూ లేరు. బ్రాహ్మణుల శిఖరము(చోటి) బ్రహ్మ పేరుతోనే ఉంది. బ్రహ్మ పేరుతో మీరు బ్రాహ్మణుల సభ అని అంటారు. ఈ విషయాలను అర్థము చేయించేందుకు వివేకవంతులు అవసరము. వారిలో జ్ఞాన పరాకాష్ఠ ఉండాలి. నిరాకార శివుడే గీతా జ్ఞానదాత. దివ్యచక్షు విధాత. ఇవన్నీ ధారణ చేసి కాన్ఫ్రెన్స్లకు పిలుస్తారు. ఎవరైతే(బాబా పిల్లలు) ఋజువు చేసి తెలియజేయగలమని భావిస్తారో, వారందరూ పరస్పరము కలవాలి. యుద్ధ మైదానములో మేజర్లు, కమాండర్లు మొదలైనవారి సభ జరుగుతుంది. ఇక్కడ మహారథిని కమాండర్ అని అంటారు. బాబా క్రియేటర్, డైరక్టర్. వారు స్వర్గమును రచిస్తారు. మహాసభను ఏర్పాటు చేసి ఈ విషయాన్ని గూర్చి చర్చించమని ఆదేశమునిస్తారు. గీతా భగవంతుడు ఋజువైన తర్వాత వారితో యోగమును జోడించాలని అందరూ అంగీకరిస్తారు. బాబా చెప్తున్నారు - నేను మార్గదర్శకుడనై వచ్చాను. అయితే మీరు నా జతలో ఎగిరేందుకు యోగ్యులుగా అవ్వండి. మాయ మీ రెక్కలను విరిచేసింది. యోగము జోడించడం ద్వారా మీ ఆత్మ పవిత్రమై ఎగురుతుంది. అచ్ఛా! (మంచిది!)
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. జ్ఞానామృతధారతో అందరినీ నిరోగులుగా లేక స్వర్గ వాసులుగా చేసే సేవ చెయ్యాలి. మనుష్యులను దేవతలుగా చెయ్యాలి. తండ్రి సమానము దయాహృదయులుగా అవ్వాలి.
2. జ్ఞాన పరాకాష్ఠ ద్వారా వివేకవంతులై శివజయంతి నాడు శివజయంతియే గీతాజయంతి అని, గీతా జ్ఞానము ద్వారానే శ్రీ కృష్ణుడు జన్మిస్తాడని నిరూపించాలి.
వరదానము :-
''తండ్రి స్నేహాన్ని(ప్రేమను) హృదయంలో ధారణ చేసి అన్ని ఆకర్షణల నుండి ముక్తులుగా ఉండే సత్యమైన స్నేహీ భవ''
తండ్రి పిల్లలందరికి ఒకే విధమైన స్నేహమునిస్తారు. కాని పిల్లలు తమ శక్తానుసారము స్నేహాన్ని ధారణ చేస్తారు. ఎవరైతే ఆది సమయమైన అమృతవేళలో తండ్రి స్నేహాన్ని ధారణ చేస్తారో, వారి హృదయంలో పరమాత్మ స్నేహం నిండి ఉన్నందున ఏ ఇతర స్నేహమూ వారిని ఆకర్షించలేదు. హృదయంలో స్నేహాన్ని ధారణ చేయకుంటే అందులో జాగా ఉన్నందున మాయ భిన్న భిన్న రూపాలతో అనేక రకాల స్నేహాలలోకి ఆకర్షిస్తుంది. అందువలన సత్యమైన స్నేహీలుగా అయ్యి పరమాత్మ ప్రేమతో నిండుగా ఉండండి.
స్లోగన్ :-
''దేహము, దేహము యొక్క పాత ప్రపంచము నుండి, సంబంధాల నుండి పైకి ఎగిరేవారే ఇంద్రప్రస్థ నివాసులు''