25-04-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - ఇతర సాంగత్యాలన్నీ తెంచి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించండి, సోదర దృష్టితో చూడండి, అప్పుడు దేహాన్ని చూడరు. దృష్టి పాడవ్వదు,
ప్రశ్న :-
బాబా పిల్లలకు ఋణపడి ఉన్నారా? లేక పిల్లలు బాబాకు ఋణపడి ఉన్నారా ?
జవాబు :-
పిల్లలైన మీరు హక్కుదారులు, బాబా మీకు ఋణపడి ఉన్నారు. పిల్లలైన మీరు దానము చేస్తారు. కనుక బాబా ఒకటికి నూరు రెట్లు ఇవ్వవలసి పడ్తుంది. ఈశ్వరార్థంగా మీరేమి ఇస్తున్నారో, తర్వాత జన్మలో దానికి ప్రతి ఫలము లభిస్తుంది. మీరు పిడికెడు అటుకులిచ్చి విశ్వాధికారులుగా అవుతారు, మరి మీకు ఎంత విశాల హృదయము ఉండాలి. నేను బాబాకు ఇచ్చానన్న సంకల్పము కూడా ఎప్పుడూ రాకూడదు.
ఓంశాంతి.
ఇది పురుషోత్తమ సంగమ యుగమని మ్యూజియంలు, ప్రదర్శినీలలో అర్థం చేయించాలి. కేవలం మీరు మాత్రమే వివేకవంతులు. కనుక ఇది పురుషోత్తమ సంగమ యుగమని అందరికీ అర్థం చేయించవలసి పడ్తుంది. మ్యూజియమ్ అన్నిటికంటే మంచి సేవాస్థానము. అక్కడికి చాలామంది వస్తారు. మంచి సేవాధారి పిల్లలు తక్కువగా ఉన్నారు. అన్ని సేవాకేంద్రాలు సర్వీసు స్టేషన్లు. ఆధ్యాత్మిక మ్యూజియమ్ అని ఢిల్లీలో వ్రాయబడి ఉంది. ఇది కూడా సరియైన అర్థము కాదు. మీరు భారతదేశానికి ఏ సేవ చేస్తున్నారు? అని చాలామంది ప్రశ్నిస్తారు. భగవానువాచ కదా. ఇది అడవి. మీరు ఈ సమయములో సంగమ యుగములో ఉన్నారు. అడవిలోనూ లేరు, తోటలోనూ లేరు. ఇప్పుడు ఉద్యానవనములోకి(తోటలోకి) వెళ్ళే పురుషార్థము చేస్తున్నారు. మీరు ఈ రావణ రాజ్యాన్ని రామరాజ్యంగా తయారు చేస్తున్నారు. ఇంత ధనము మీకు ఎక్కడి నుండి వస్తుంది? అని మిమ్ములను ప్రశ్నిస్తారు. బి.కెలమైన మేమే ఖర్చు చేస్తున్నామని చెప్పండి. రామ రాజ్యస్థాపన జరుగుతోంది. మేము ఏమి చేస్తున్నామో, మా ముఖ్య లక్ష్యము ఏమిటో మీరు కొద్ది రోజులు వచ్చి తెలుసుకోండి అని వారికి చెప్పండి. వారు సార్వభౌమత్వాన్ని(విశ్వాధికారాన్ని) అంగీకరించరు. అందుకే రాజుల రాజ్యాలను సమాప్తము చేశారు. ఈ సమయములో వారు కూడా తమోప్రధానంగా అయిపోయారు. అందుకే వారు నచ్చరు. డ్రామానుసారము వారి దోషము కూడా లేదు. డ్రామాలో ఏదైతే ఉంటుందో ఆ పాత్రనే మనము అభినయిస్తాము. కల్ప-కల్పము తండ్రి ద్వారా స్థాపనయ్యే ఈ పాత్ర నడుస్తుంది, పిల్లలైన మీ కొరకు మీరే ఖర్చు చేసుకుంటారు. శ్రీమతానుసారము ఖర్చు చేసి మీ కొరకు సత్యయుగ రాజధానిని తయారు చేసుకుంటున్నారు. ఈ విషయము ఇతరులెవ్వరికీ తెలియదు. గుప్త సైనికులని మీ పేరు ప్రసిద్ధమయ్యింది. వాస్తవానికి ఆ సైన్యములో గుప్త సైనికులు ఎవ్వరూ ఉండరు. సిపాయిల రిజిష్టరు ఉంటుంది. పేరు, నెంబరు రిజిష్టరులో లేనివారు ఉండరు. వాస్తవానికి మీరే గుప్త సైనికులు. మీ పేరు ఏ రిజిష్టరులోనూ ఉండదు. మీ వద్ద ఏ ఆయుధ బలము లేదు. ఇందులో శారీరిక హింస లేదు. యోగబలము ద్వారా మీరు విశ్వము పై విజయము పొందుతారు. ఈశ్వరుడు సర్వశక్తివంతుడు కదా. స్మృతి ద్వారా మీరు శక్తిని తీసుకుంటున్నారు. సతోప్రధానంగా అయ్యేందుకు మీరు తండ్రితో యోగాన్ని జోడిస్తున్నారు. మీరు సతోప్రధానంగా అయ్యారంటే మీకు రాజ్యము కూడా సతోప్రధానమైనదే కావాలి. అది మీరు శ్రీమతానుసారము స్థాపన చేస్తున్నారు. ఎవరైతే ఉండి కూడా కనిపించకుండా ఉంటారో వారినే ఇన్కాగ్నిటో (గుప్తము) అని అంటారు. మీరు శివబాబాను కూడా ఈ కళ్ళతో చూడలేరు. మీరు కూడా గుప్తము, శక్తి కూడా మీరు గుప్తంగా తీసుకుంటున్నారు. మనము పతితుల నుండి పావనంగా అవుతున్నాము. పావనంగా ఉండు వారిలోనే శక్తి ఉంటుందని మీకు తెలుసు. సత్యయుగములో మీరంతా పావనంగా ఉంటారు. వారి 84 జన్మల కథనే తండ్రి తెలియచేస్తారు. మీరు తండ్రి నుండి శక్తిని తీసుకుని పవిత్రంగా అయ్యి మళ్లీ పవిత్ర ప్రపంచములో రాజ్య పాలన చేస్తారు. బాహుబలముతో ఎప్పుడూ ఎవ్వరూ విశ్వము పై విజయాన్ని పొందలేరు. ఇది యోగబలానికి సంబంధించిన విషయము. వారు యుద్ధము చేస్తారు. రాజ్యము మీ చేతికి రావాలి. బాబా సర్వశక్తివంతులు, కనుక వారి నుండి శక్తి లభించాలి. మీరు తండ్రిని మరియు రచన ఆదిమధ్యాంతాలను కూడా తెలుసుకున్నారు.
మనమే స్వదర్శన చక్రధారులమని మీకు తెలుసు. ఇది అందరికి స్మృతిలో ఉండదు. పిల్లలైన మీకు ఈ విషయము స్మృతిలో ఉండాలి, ఎందుకంటే పిల్లలైన మీకు మాత్రమే ఈ జ్ఞానము లభిస్తుంది. వెలుపలివారు ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. కనుక వారిని సభలో కూర్చోబెట్టరు. పతితపావనుడైన తండ్రినే అందరూ పిలుస్తారు, కానీ తమను తాము పతితులమని ఎవ్వరూ భావించరు. పతితపావన సీతారామ్......... అని పాడుతూ ఉంటారు. మీరందరూ వధువులు, బాబా వరుడు. వారు అందరికి సద్గతినిచ్చేందుకే వస్తారు. పిల్లలైన మీకు అలంకారము చేస్తారు. మీకు డబుల్ ఇంజన్ లభించింది, రోల్స్ రాయల్స్ కారులో ఇంజను చాలా బాగుంటుంది. తండ్రి కూడా అలా ఉన్నారు. పతితపావనా రండి, మమ్ములను పావనము చేసి జతలో తీసుకెళ్ళండని అంటారు. మీరంతా శాంతిగా కూర్చుని ఉన్నారు. వీణ మొదలైన ఏ వాయిద్యాలను మ్రోగించరు. కష్టపడే మాటే లేదు. నడుస్తూ - తిరుగుతూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఎవరు కలిసినా వారికి మార్గమును చూపుతూ ఉండండి. తండ్రి చెప్తున్నారు - నా భక్తులకు మరియు లక్ష్మీనారాయణ, రాధా-కృష్ణ మొదలైన వారి భక్తులకు ఈ దానాన్నివ్వండి. వ్యర్థముగా వ్యర్థ పరచకండి అని తండ్రి చెప్తున్నారు. పాత్రులైన వారికే దానమివ్వబడ్తుంది. పతిత మనుష్యులు పతితులకే దానమిస్తూ ఉంటారు. తండ్రి సర్వశక్తివంతులు. వారి నుండి మీరు శక్తిని పొంది ఉత్తములుగా అవుతారు. రావణుడు ఎప్పుడు వస్తాడో, అది కూడా త్రేతా మరియు ద్వాపర యుగాల సంగమ సమయము. ఇది కలియుగము మరియు సత్యయుగముల సంగమము. జ్ఞానము ఎంత సమయము నడుస్తుందో, భక్తి ఎంత సమయము నడుస్తుందో ఈ విషయాలన్నీ మీరు అర్థము చేసుకొని ఇతరులకు అర్థం చేయించాలి. ముఖ్యమైన విషయము అనంతమైన తండ్రిని స్మృతి చేయడం. అనంతమైన తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడు వినాశనము కూడా జరుగుతుంది. మహాభారత యుద్ధము ఎప్పుడు జరిగింది? భగవంతుడు రాజయోగమును నేర్పించినప్పుడు. నూతన ప్రపంచము ఆది, పాత ప్రపంచము అంతము అనగా వినాశనము జరగనున్నదని అర్థమౌతుంది. ప్రపంచము గాఢాంధకారములో పడి ఉంది. ఇప్పుడు వారిని మేల్కొల్పాలి. అర్ధకల్పము నుండి నిదురిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి సోదర దృష్టితో చూడండని తండ్రి అర్థం చేయిస్తున్నారు. అప్పుడే మీరెవ్వరికి జ్ఞానమిచ్చినా మీ మాటలలో శక్తి వస్తుంది. ఆత్మనే పావనంగా మళ్లీ పతితంగా అవుతుంది. ఆత్మ పావనమైనప్పుడే శరీరము కూడా పావనమైనది లభిస్తుంది. ఇప్పుడు లభించదు. కొందరు యోగ బలముతో, కొందరు శిక్షలతో అందరూ పావనంగా అవ్వనే అవ్వాలి. స్మృతియాత్ర చేయడమే శ్రమ. బాబా అభ్యాసము కూడా చేయిస్తూ ఉంటారు. ఎక్కడకు వెళ్లినా బాబా స్మృతిలో వెళ్ళండి. ఫాదర్లు శాంతిగా ఏసుక్రీస్తును స్మృతి చేస్తూ వెళ్తుంటారు. భారతవాసులు అనే మందిని స్మృతి చేస్తారు. తండ్రి చెప్తున్నారు - ఒక్కరిని తప్ప మరెవ్వరినీ స్మృతి చేయకండి. అనంతమైన తండ్రి ద్వారా ముక్తి-జీవన్ముక్తుల హక్కుదారులుగా అవుతారు. క్షణములో జీవన్ముక్తి లభిస్తుంది. సత్యయుగములో అందరూ జీవన్ముక్తిలో ఉంటారు. కలియుగములో అందరూ జీవన బంధనములో ఉన్నారు. ఇది ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాలన్నీ తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు మళ్లీ తండ్ర్రిని ప్రత్యక్షము చేస్తారు. అన్ని వైపులా తిరుగుతుంటారు. ఇది పురుషోత్తమ సంగమ యుగమని, మనుష్య మాత్రులందరికి సందేశము ఇవ్వడమే మీ కర్తవ్యము. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వమును ఇచ్చేందుకు వచ్చారు. తండ్రి చెప్తున్నారు - సదా నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే, వికర్మలు వినాశనమౌతాయి. పాపాలు కట్ అవుతాయి. ఈ సత్య గీతను తండ్రే వినిపిస్తారు. మనుష్యుల మతము ద్వారా దిగజారిపోయారు. భగవంతుని మతము ద్వారా మీరు వారసత్వాన్ని పొందుకుంటున్నారు. ముఖ్యమైన విషయము - నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి అందరికి వారి పరిచయమునిస్తూ ఉండండి. బ్యాడ్జ్ అయితే మీ వద్ద ఉంది. ఉచితంగా ఇవ్వడంలో నష్టమేమీ లేదు. కానీ యోగ్యతను చూసి ఇవ్వాలి.
బాబా పిల్లలతో ఫిర్యాదు చేస్తున్నారు - మీరు లౌకిక తండ్రిని స్మృతి చేస్తారు కానీ పారలౌకిక తండ్రినైన నన్ను మర్చిపోతారు. సిగ్గు వేయడం లేదా? మీరే పవిత్ర ప్రవృత్తి మార్గపు గృహస్థ వ్యవహారములో ఉండేవారు, ఇప్పుడు మళ్లీ అలా తయారవ్వాలి. మీరు భగవంతునితో వ్యాపారము చేస్తున్నారు. బుద్ధి ఎక్కడా తిరగడము లేదు కదా? తండ్రిని ఎంత సమయము స్మృతి చేశాను? అని స్వయాన్ని పరిశీలించుకోండి. బాబా చెప్తున్నారు - ఇతర సాంగత్యాలను వదిలి నా ఒక్కరితోనే మనస్సును జోడించండి. తప్పు చేయరాదు. సోదర దృష్టితో చూస్తే దేహాన్ని చూడరని కూడా బాబా చెప్తున్నారు. దృష్టి దిగజారదు. ఇదే గమ్యము. ఈ జ్ఞానము మీకిప్పుడే లభిస్తోంది. అందరూ సోదరులే అని అందరూ అంటారు. సోదరత్వము అని మనుష్యులు అంటారు. ఇది నిజమే. మనము పరమపిత పరమాత్ముని సంతానము. మరి ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? తండ్రి స్వర్గస్థాపన చేస్తున్నారు. ఇలా అందరికీి అర్థం చేయిస్తూ ఉన్నతిని ప్రాప్తి చేసుకుంటూ ఉండండి. బాబాకు సర్వీసెబుల్ కన్యలు చాలా మంది కావాలి. సేవాకేంద్రాలు తెరవబడ్తూ ఉంటాయి. పిల్లలకు చాలా ఆసక్తి ఉంది. చాలామందికి కళ్యాణము జరుగుతుందని భావిస్తారు. కాని సంభాళించే టీచర్లు కూడా మంచి మహారథులుగా ఉండాలి. టీచర్లు కూడా నెంబరువారుగా ఉన్నారు. ఎక్కడెక్కడ లక్ష్మీనారాయణుల మందిరాలు, శివుని మందిరాలు ఉన్నాయో గంగానది తీరములో, ఎక్కడ ఎక్కువ జనము ఉంటారో అక్కడకు వెళ్లి సర్వీసు చేయాలి. భగవంతుడు - కామము మహాశత్రువని చెప్తున్నారని అందరికి తెలిపించండి. మీరు శ్రీమతానుసారము సర్వీసు చేస్తున్నారు. ఇది మీ ఈశ్వరీయ పరివారము. ఇక్కడ 7రోజులు భట్టిలో పరివారములో కూర్చుని ఉన్నారు. పిల్లలైన మీకు చాలా ఖుషీ ఉండాలి. అనంతమైన తండ్రి ద్వారా మీరు పదమాపదమ్ భాగ్యశాలురుగా అవుతారు. భగవంతుడు కూడా చదివించగలరని ప్రపంచానికి తెలియదు. ఇక్కడ మీరు చదువుతున్నారు. మరి మీకెంత సంతోషముండాలి. మీరు శ్రేష్ఠాతి శ్రేష్ఠంగా అయ్యేందుకు చదువుతున్నారు. ఎంత ఉదార హృదయులుగా ఉండాలి. బాబానే మీరు ఋణగ్రస్థునిగా చేస్తున్నారు. ఈశ్వరార్థంగా ఏమి ఇస్తారో, అందుకు ప్రతిఫలము తర్వాతి జన్మలో లభిస్తుంది. తండ్రికి మీరు సర్వస్వమూ ఇచ్చినందున బాబా కూడా మీకు సర్వస్వము ఇవ్వవలసి పడ్తుంది. నేను తండ్రికి ఇచ్చాననే సంకల్పము కూడా ఎప్పుడూ రాకూడదు. మేము ఇంత ఇచ్చాము, కానీ మా పై ఎందుకు ప్రత్యేక శ్రద్ధ చూపడము లేదని చాలా మందికి లోలోపల చింతన నడుస్తుంది. మీరు పిడికెడు అటుకులనిచ్చి విశ్వ చక్రవర్తి పదవిని తీసుకుంటున్నారు. బాబా దాత కదా. రాజులు రాయల్గా ఉంటారు. రాజుల వద్ద ఎవరైనా కలవడానికి వచ్చినప్పుడు, కలిసేవారు ఏమైనా కానుకలు ఇచ్చేందుకు వెళ్తే రాజు సెక్రటరి వైపు సైగ చేస్తారు, స్వయంగా తమ చేతితో తీసుకోరు. మరి దాత అయిన శివబాబా ఎలా తీసుకుంటారు? వీరు అనంతమైన తండ్రి కదా. వీరి ముందు మీరు కానుక పెడ్తారు. కానీ బాబా అందుకు ప్రతిఫలంగా 100 రెట్లు ఇస్తారు. నేను ఇచ్చానన్న సంకల్పము కూడా ఎప్పుడూ రాకూడదు. సదా మేము తీసుకుంటున్నామని భావించండి. అక్కడ మీరు పదమాపదమ్ పతులుగా అవుతారు. మీరు వాస్తవానికి పదమాపదమ్ భాగ్యశాలురుగా అవుతారు. చాలామంది పిల్లలు విశాలహృదయము గలవారిగా కూడా ఉన్నారు. కొందరు పిసినారులుగా కూడా ఉన్నారు. మేము పదమాపదమ్ పతులుగా అవుతున్నాము, అత్యంత సుఖీలుగా అవుతున్నామని అర్థమే చేసుకోరు. పరమాత్మ తండ్రి లేనప్పుడు కూడా పరోక్షంగా అల్పకాలానికి ఫలమునిస్తారు. ప్రత్యక్షంగా సన్ముఖములో ఉన్నప్పుడు 21 జన్మలకు ఇస్తారు. శివబాబా భండారము భర్పూర్(సంపన్నము) అని గాయనముంది. ఎంతమంది పిల్లలున్నారో చూడండి. ఎవరు ఎంత ఇస్తారో ఎవ్వరికీ తెలియదు. బాబాకు తెలుసు, బాబా సంచికి(బ్రహ్మాబాబాకు) తెలుసు(గుడ్ జానే గుడ్ కీ గోథరీ జానే, బెల్లానికి తెలుసు, బెల్లం సంచికి తెలుసు). ఎవరిలో బాబా ఉంటున్నారో వారు చాలా సాధారణంగా ఉన్నారు. అందువలన పిల్లలు ఇక్కడ నుండి వెలుపలకు వెళ్ళగానే ఆ నషా అదృశ్యమైపోతుంది. జ్ఞాన-యోగాలు లేకుంటే వ్యర్థ చింతన నడుస్తూ ఉంటుంది. మంచి-మంచి పిల్లలను కూడా మాయ ఓడించేస్తుంది. మాయ బాబా నుండి విముఖులుగా చేసేస్తుంది. ఏ శివబాబా వద్దకు మీరు వస్తున్నారో వారినే మీరు స్మృతి చేయలేరా? ఆంతరికములో అనంతమైన ఖుషీ ఉండాలి. ఏ రోజు కోసము ఎదురుచూస్తూ, మీరు వస్తే మేము మీవారిమైపోతామని అన్నామో ఆ రోజు ఇప్పుడు రానే వచ్చింది. భగవంతుడు వచ్చి స్వయంగా దత్తు తీసుకుంటున్నారంటే వారిని ఎంత అదృష్టవంతులని అంటారు. ఎంత సంతోషంగా ఉండాలి. కాని మాయ సంతోషాన్ని ఎగురగొట్టేస్తుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము -
1. భగవంతుడు మనలను దత్తు తీసుకున్నారు, వారే టీచరై మనలను చదివిస్తున్నారని మీ పదమాపదమ్ భాగ్యాన్ని స్మరణ చేస్తూ సంతోషంగా ఉండాలి.
2. ఆత్మలమైన మనము సోదరులము, ఈ దృష్టిని పక్కా చేసుకోవాలి. దేహాన్ని చూడరాదు. భగవంతునితో ఒప్పందమైన తర్వాత బుద్ధిని భ్రమింపచేయరాదు.
వరదా నము :-
'' మీ సూక్ష్మ బలహీనతలను చింతన చేయుట ద్వారా పరివర్తన చేసుకొను స్వచింతక్ భవ ''
కేవలం జ్ఞాన పాయింట్లను రిపీట్ చేయడం, విని వినిపించడం మాత్రమే స్వచింతన కాదు. స్వచింతన అనగా తమ సూక్ష్మ బలహీనతలను, తమ చిన్న చిన్న తప్పులను గురించి చింతన చేసి నిర్మూలించాలి, పరివర్తన చేసుకోవాలి. దీనినే స్వచింతకులుగా అవ్వడమని అంటారు. పిల్లలందరూ జ్ఞాన చింతననైతే చాలా బాగా చేస్తారు కానీ జ్ఞానాన్ని స్వయం పట్ల ఉపయోగించి ధారణా స్వరూపులుగా అవ్వాలి, స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. వీటికే ఫైనల్ రిజల్టులో మార్కులు లభిస్తాయి.
స్లోగన్ :-
'' ప్రతి సమయంలో చేసి చేయించే బాబా గుర్తుంటే 'నాది (మై పన్)' అనే అభిమానము రాజాలదు. ''