06-03-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - జ్ఞానసాగరులైన తండ్రి మీకు పళ్ళెములను రత్నాలతో పూర్తిగా నింపి - నింపి ఇస్తున్నారు. ఎంత కావాలో అంత మీ జోలెను నింపుకోండి. అన్ని చింతల నుండి విముక్తి పొందండి.''
ప్రశ్న :-
జ్ఞాన మార్గములోని ఏ విషయాలు భక్తిమార్గములో కూడా ఇష్టపడ్తారు?
సమా :-
''స్వచ్ఛత.'' జ్ఞానమార్గములో పిల్లలైన మీరు స్వచ్ఛంగా తయారవుతారు. తండ్రి మురికి పట్టిన మీ వస్త్రాలను స్వచ్ఛంగా తయారు చేసేందుకు వచ్చారు. ఆత్మ ఎప్పుడైతే స్వచ్ఛంగా అవుతుందో అనగా పావనంగా అయినప్పుడు ఇంటికి వెళ్లేందుకు, ఎగిరేందుకు రెక్కలు లభిస్తాయి. భక్తిమార్గములో కూడా స్వచ్ఛతను చాలా ఇష్టపడ్తారు. స్వచ్ఛంగా అయ్యేందుకు భక్తిమార్గములో గంగానదికి వెళ్ళి స్నానము చేస్తారు. కానీ నీటి వలన ఆత్మ స్వచ్ఛంగా తయారవ్వజాలదు.
ఓంశాంతి.
మధురమైన పిల్లలూ! మీరు స్మృతియాత్రను మర్చిపోరాదు. ఉదయమే ఈ అభ్యాసము మీరు చేస్తారు. ఇందులో మాట్లాడవలసిన పని ఉండదు. ఎందుకంటే అది నిర్వాణధామములోకి వెళ్లేందుకు ఉపాయము. పావనంగా అవ్వకుండా పిల్లలు వెళ్ళలేరు, ఎగురలేరు. సత్యయుగము ప్రారంభ సమయములో లెక్కలేనంత మంది ఆత్మలు ఎగిరిపోతాయని మీకు తెలుసు. ఇప్పుడైతే కోట్ల కొలది ఆత్మలు ఇక్కడ ఉన్నారు. అక్కడ సత్యయుగములో కొన్ని లక్షలు మాత్రమే మిగులుతారు. మిగిలినవారంతా ఎగిరిపోతారు. అలా ఎగిరేందుకు ఎవరో వచ్చి రెక్కలు ఇస్తారు కదా. ఈ స్మృతియాత్ర ద్వారానే ఆత్మ పవిత్రమైపోతుంది. ఇది తప్ప పావనమయ్యేందుకు వేరే ఏ ఉపాయమూ లేదు. పతితపావనుడు కూడా ఒక్క తండ్రి మాత్రమే. వీరినే కొంతమంది ఈశ్వరుడు, పరమాత్మ లేక భగవంతుడు అని అంటారు. ఉన్నవారు ఒక్కరే. అనేకమంది లేరు. అందరి తండ్రి ఒక్కరే. లౌకిక తండ్రి అందరికి వేరు వేరుగా ఉంటారు. పారలౌకిక తండ్రి అయితే అందరికీ ఒక్కరే. వారు ఎప్పుడు వస్తారో, అప్పుడు అందరికీ సుఖము ఇచ్చి వెళ్ళిపోతారు. సుఖము అనుభవించేటప్పుడు వారిని స్మృతి చేసే అవసరము లేదు. అది(సత్యముగము) కూడా జరిగిపోయింది కదా. ఇప్పుడు తండ్రి కూర్చుని భూత-భవిష్య-వర్తమాన సమయాల రహస్యాన్ని అర్థము చేయిస్తున్నారు. ఈ వ్షృము యొక్క భూత-వర్తమాన-భవిష్యత్తులు చాలా సులభమైనవి. విత్తనము నుండి వృక్షము ఎలా వస్తుందో మీకు తెలుసు. తర్వాత వృద్ధి చెందుతూ చెందుతూ చివరికి అంతము వచ్చేస్తుంది. దానినే ఆదిమద్యాంతాలు అని అంటారు. ఇది అనేక ధర్మాల వెరైటీ వృక్షము. రకరకాల రూపు-రేఖల వృక్షము. ఎవరి ఫీచర్ వారికి ఉంటుంది. ఒక్కొక్క ధర్మానికి ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది. వృక్షమును బట్టి పుష్పాలు అనేక రకాలుంటాయి. ఒకే వ్షృములోని పుష్పాలన్నీ ఒకే ఫీచర్ కలిగి ఉంటాయి. కానీ ఈ మానవ సృష్టి రూపి వృక్షములో రకరకాల మనుష్యులుంటారు. ఆ వృక్షాలలో ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క విధమైన శోభ ఉంటుంది. కానీ ఇక్కడ ఒకే వృక్షములో అనేక విధములైన సౌందర్యముంది. శ్యామ సుందరము అనేది దేవీ దేవతలకు చెందుతుందని తండ్రి అర్థం చేయిస్తున్నారు. వారు సతోప్రధానము నుండి తమోప్రధానంగా అయినప్పుడు వారే సుందరము నుండి శ్యామంగా అవుతారు. ఇటువంటి శ్యామసుందరులు ఏ ఇతర ధర్మములో అవ్వరు. వారి ఫీచర్లు కూడా చూడండి. జపాన్ వారి రూపురేఖలు, యూరోపియన్ల, చైనా దేశస్థుల రూపురేఖలు చూడండి. హిందూదేశము(ఇండియా) వారి ఫీచర్లు మారుతూ ఉంటాయి. హిందూ దేశము వారికి మాత్రమే శ్యామసుందరము అనే గాయనముంది. ఇతర ధర్మముల వారెవ్వరికీ లేదు. ఇది మానవ సృష్టి వృక్షము. ఇందులో వెరైటీ ధర్మాలున్నాయి. వారంతా నంబరువారుగా ఎలా వస్తారనే జ్ఞానము పిల్లలైన మీకు ఇప్పుడే లభిస్తుంది. ఇతరులు ఈ విషయాలు అర్థం చేయించలేరు. ఇది 5 వేల సంవత్సరాల కల్పము. దీనిని వృక్షము అని అనండి లేక ప్రపంచమనండి. అర్ధ భాగము భక్తి ఉంది. దానిని రావణ రాజ్యమని అంటారు. ఈ అర్ధములో 5 వికారాల రాజ్యము నడుస్తుంది. కామచితి పై కాలి పతితులుగా నల్లగా తయారైపోతారు. రావణ సంప్రదాయము వారి నడవడిక, దైవీ సంప్రదాయము వారి నడవడికలో రాత్రికి - పగలుకున్నంత తేడా ఉంది. మనుష్యులు వారిని(దేవతలను) మహిమ చేస్తారు. స్వయాన్ని నీచులు, పాపులమని ఒప్పుకుంటారు. అనేక ప్రకారాల మానవులున్నారు. మీరు చాలా భక్తి చేశారు. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ భక్తి చేస్తూ వచ్చారు. మొట్టమొదట అవ్యభిచారి భక్తి ఉంటుంది. ప్రారంభములో ఒక్కరినే భక్తి చేయడం మొదలవుతుంది. ఆ తర్వాత వ్యభిచారి భక్తిగా మారిపోతుంది. చివరిలో పూర్తి వ్యభిచారి భక్తిగా తయారయినప్పుడు, తండ్రి వచ్చి అవ్యభిచారి జ్ఞానమును ఇస్తారు. ఆ జ్ఞానము ద్వారా సద్గతి జరుగుతుంది. ఇది ఎంతవరకు తెలియదో అంతవరకు భక్తిని గురించిన గర్వములోనే ఉంటారు. జ్ఞానసాగరులు ఒక్క పరమపిత పరమాత్మయేనని వారికి తెలియదు. భక్తిమార్గములో ఎన్నో వేద శాస్త్రాలు కంఠస్థము చేసి వల్లిస్తూ, వినిపిస్తూ ఉంటారు. ఇదంతా భక్తిమార్గపు విస్తారము. భక్తిమార్గపు సౌందర్యము. ఇదంతా మృగతృష్ణ సమానమైన సౌందర్యము అని తండ్రి చెప్తున్నారు. దూరము నుండి ఇసుక నీటి వలె వెండి వలె ప్రకాశిస్తూ ఉంటుంది. జింకకు దప్పికైనప్పుడు ఆ ఇసుకలో పరుగెత్తుతూ పరుగెత్తుతూ చిక్కుకొని పోతుంది. భక్తి కూడా అటువంటిదే. అందులో అందరూ చిక్కుకొనిపోయి ఉన్నారు. దాని నుండి వెలుపలికి తీయడంలో పిల్లలకు శ్రమ కలుగుతుంది. ఇందులో చాలా విఘ్నాలు కూడా ఏర్పడ్తాయి. ఎందుకంటే తండ్రి పవిత్రులుగా చేస్తారు. ద్రౌపది కూడా అందుకే దీనంగా పిలిచింది. మొత్తం ప్రపంచములో అనేకమంది ద్రౌపదులే, దుర్యోధనులే. అంతేకాక మీరందరూ పార్వతులే. అమరకథ వింటున్నారు. అని కూడా బాబా అంటున్నారు. తండ్రి మీకు అమరలోకము కొరకు అమరకథను వినిపిస్తున్నారు. ఇది మృత్యులోకము. ఇక్కడ అకాలమృత్యువు జరుగుతూ ఉంటుంది. కూర్చునే ఉంటారు. అకస్మాత్తుగా గుండెపోటుతో మరణిస్తారు. మీరు ఆసుపత్రులకు వెళ్ళి అర్థం చేయించవచ్చు - ఇక్కడ మీ ఆయువు ఎంతో తక్కువ, జబ్బులు పడ్తారు, అచ్చట జబ్బులే ఉండవు అని చెప్పండి.
భగవానువాచ - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఇతరుల పై మమకారమును తొలగిస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఆ తర్వాత ఎప్పుడూ జబ్బు పడరు. మృత్యువు కబళించదు. ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ దేవతల ఆయువు ఎక్కువగా ఉండేది దా! అయితే ఆ ఎక్కువ ఆయువు గలవారు ఎక్కడకు వెళ్లారు? పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఆయువు తగ్గిపోతుంది. ఇది సుఖ - దు:ఖాల ఆట. దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. తిరునాళ్ళు, ఉత్సవాలు మొదలైనవి ఎన్నో జరుగుతూ ఉంటాయి. కుంభమేళాలో లెక్కలేనంతమంది స్నానము చేసేందుకు వెళ్ళి ఒక చోట కలుస్తారు. కానీ దీని వలన ఏ లాభమూ లేదు. ప్రతిరోజు మీరు స్నానము చేస్తారు. నీరు ఎక్కడ ఉన్నా అదంతా సాగరము నుండి వచ్చిందే. అన్నింటికంటే స్వచ్ఛమైనది బావి నీరు. నదులలో అయితే మురికి కలుస్తూ ఉంటుంది. బావి నీరు స్వచ్ఛంగా ఉంటుంది కనుక ఆ నీటితో స్నానము చేయడం చాలా మంచిది. మొదట బావిలోనే స్నానము చేసే అలవాటు ఉండేది. కానీ ఇప్పుడు నదులలో చేసే అలవాటు ఏర్పడింది. భక్తిమార్గములో కూడా స్వచ్ఛతను ఇష్టపడ్తారు. ఇప్పుడు మీరు వచ్చి మమ్ములను స్వచ్ఛంగా చేయమని పరమాత్మను పిలుస్తూ ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. గురునానక్ కూడా పరమాత్ముని మహిమను గాయనము చేసారు - మలిన వస్త్రాలను శుభ్రము చేసి................ తండ్రి వచ్చి మలిన వస్త్రాలను స్వచ్ఛంగా చేస్తారు. ఇచ్చట తండ్రి ఆత్మలను స్వచ్ఛంగా చేస్తారు. వారు ఆత్మ నిర్లేపమని భావిస్తారు. ఇది రావణరాజ్యమని, సృష్టికి క్రిందకు దిగజారే కళ అని తండ్రి చెప్తున్నారు. మీరు ఉన్నతమవుతే అందరూ ఉన్నతమౌతారని గాయనము కూడా ఉంది. సర్వులకు సద్గతి జరుగుతుంది. ''ఓ బాబా, మీ ద్వారా అందరికి మంచే జరుగుతుంది.'' సత్యయుగములో అందరూ బాగుంటారు. అక్కడ అందరూ ఒకే రాజ్యములో సంతోషంగా ఉంటారు. ఆ సమయములో మిగిలిన వారంతా శాంతిధామములో ఉంటారు. విశ్వములో శాంతి కావాలని అందరూ తల బాదుకుంటున్నారు(కష్టపడ్తున్నారు). ఇంతకు ముందు ఎప్పుడైనా విశ్వములో శాంతి ఉండేదా, ఇప్పుడు శాంతి అడుగుతున్నారే అని వారిని ప్రశ్నించండి. ఈ కలియుగమింకా 40 వేల సంవత్సరాలుంటుందని వారంటారు. మానవులు గాఢాంధకారములో ఉన్నారు. కల్పమంతా 5 వేల సంవత్సరాలెక్కడ. ఒక కలియుగమే ఇంకా 40 వేల సంవత్సరాలుంటుందనే మాట ఎక్కడ! అనేక మతాలున్నాయి. తండ్రి వచ్చి సత్యము తెలుపుతున్నారు - జన్మలు 84 మాత్రమే. లక్షల సంవత్సరాలని, మానవులు జంతువులు మొదలైన వాటిగా కూడా అవ్వగలరని వారంటారు. ఇవన్నీ సరియైన విషయాలు కావు. చట్టము అలా లేనే లేదు. 84 జన్మలు మనుష్యులే తీసుకుంటారు. దాని లెక్కాచారము కూడా తండ్రి తెలుపుతున్నారు. ఈ జ్ఞానము పిల్లలైన మీరు ధారణ చేయాలి. ఋషులు, మునులు, నేతి - నేతి అంటూ వెళ్ళిపోయారు అనగా మాకు తెలియదు అని అన్నారు. తెలియదంటే నాస్తికులని అర్థము. తప్పకుండా ఆస్తికులు ఎవరో ఉంటారు. దేవతలు ఆస్తికులు. రావణ రాజ్యములో ఉండేది నాస్తికులు. జ్ఞానము ద్వారా మీరు ఆస్తికులుగా అవుతారు. 21 జన్మలకు వారసత్వము లభిస్తుంది. ఆ తర్వాత జ్ఞానము అవసరమే ఉండదు. ఇది పురుషోత్తమ సంగమయుగము. ఇందులో మనము ఉత్తమోత్తమ పురుషులుగా, స్వర్గాధికారులుగా అవుతున్నాము. ఎవరెంత బాగా చదువుకుంటారో అంత ఉన్నత పదవి పొందుతారు. బాగా చదువుకొని వ్రాసుకుంటే విశ్వానికి అధికారులుగా అవుతారు. లేకుంటే తక్కువ పదవిని పొందుతారు. అక్కడ రాజ్యపదవి సుఖమిస్తుంది. ఇచ్చట దు:ఖమునిస్తుంది. ఆస్తికులుగా అవుతే సుఖమునిచ్చే రాజ్యపాలన చేస్తారు. ఆ తర్వాత రావణుడు వస్తూనే నాస్తికులుగా అవుతారు. నుక దు:ఖము కలుగుతుంది. భారతదేశము సంపన్నంగా ఉన్నప్పుడు అపారమైన ధనముండేది. సోమనాథ మందిరము ఎంతో భారీగా అపారమైన ఖర్చుతో, అత్యంత వైభవంగా నిర్మింపబడింది. మందిరాలు నిర్మించేందుకే అంత ధనముంటే కట్టించినవారి వద్ద ఇంకెంత ధనముండేది! వారికింత ధనము ఎచ్చట నుండి లభించింది? సాగరుడు పళ్ళెములు నింపి నింపి రత్నాలిచ్చారని వ్రాసి ఉన్నారు. ఇప్పుడు జ్ఞానసాగరులు మీకు రత్నాల పళ్ళెములు నింపి - నింపి ఇస్తున్నారు. ఇప్పుడు మీ జోలె నిండుతోంది. అక్కడ వారు శంకరుని ముందుకు వెళ్ళి జోలె నింపమని అడుగుతారు. వారికి తండ్రిని గురించి తెలియదు. తండ్రి మన జోలెను నింపుతున్నారని ఇప్పుడు మీకు తెలుసు. ఎవరికి ఎంత కావాలో అంత నింపుకోమంటున్నారు. ఎంత బాగా చదువుకుంటున్నారో అంత మంచి స్కాలర్షిప్ లభిస్తుంది. కావాలనుకుంటే అత్యంత ఉన్నతమైన డబుల్ కిరీటధారులుగా అవ్వండి లేకుంటే పేదవారుగా లేక దాస-దాసీలుగా అవ్వండి. చాలా మంది విడాకులు కూడా ఇచ్చి వెళ్ళిపోతారు. వారు కూడా ఉన్నారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. తండ్రి అంటున్నారు - నాకు ఏ చింతా లేదు. నేను చింతా విముక్తుడను. నా మాదిరే మిమ్ములను కూడా చింతా రహితులుగా తయారు చేస్తున్నాను. సద్గురువు చింతల నుండి విడుదల చేసే సద్గురు స్వామి,....... అనే గాయనముంది. స్వామి అనగా సర్వుల తండ్రి. వారిని యజమాని అని కూడా అంటారు. నేను మీ బేహద్ టీచరును కూడా అని తండ్రి అంటున్నారు. భక్తిమార్గములో మీరు అనేక మంది టీచర్ల నుండి అనేక చదువులు చదువుతారు. కానీ తండ్రి చదివించే ఈ చదువు అన్ని విద్యల కంటే భిన్నమైన జ్ఞానము. వారు జ్ఞాన సాగరులు. వారిని జానీ జానన్హార్ అని అనరాదు. చాలామంది మీకు మా లోపల ఏముందో తెలుసు అని అంటారు. తండ్రి అంటున్నారు - నాకు అదంతా ఏమీ తెలియదు. నేను పిల్లలైన మిమ్ములను చదివించేందుకు వస్తాను. ఆత్మలైన మీరు మీ సింహాసనము పై విరాజమానమై ఉన్నారు. నేను కూడా ఈ సింహాసనము పై కూర్చుని ఉన్నాను. ఆత్మ అత్యంత చిన్న బిందువు అని ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు - మొదట ఆత్మను అని అర్థం చేసుకోండి. ఆ తర్వాత తండ్రిని అర్థం చేసుకుంటారు. మొట్టమొదట ఆత్మ జ్ఞానమును అర్థం చేయిస్తారు. తర్వాత తండ్రి పరిచయమిస్తారు. భక్తిలో సాలిగ్రామాలను తయారుచేసి పూజించిన తర్వాత మట్టిలో(లేక నీళ్ళలో) కలిపేస్తారు. ఇదంతా బొమ్మల పూజ అని తండ్రి అంటున్నారు. ఈ విషయాలన్నీ ఎవరు బాగా అర్థం చేసుకుంటారో వారు ఇతరుల కళ్యాణము కూడా చేస్తారు. తండ్రి కళ్యాణకారి కనుక పిల్లలు కూడా కళ్యాణకారులుగా అవ్వాలి. కొంతమంది ఇతరులను ఊబి నుండి వెలుపలికు తీస్తూ తీస్తూ వారే అందులో చిక్కుకొని మరణిస్తారు, అపవిత్రులుగా అవుతారు, సంపాదన పోగొట్టుకుంటారు. అందుకే తండ్రి చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు. కామచితి పై కూర్చున్నందునే మీరు అపవిత్రంగా నల్లగా అయ్యారు. మేమే సుందరంగా పవిత్రంగా ఉండేవారము, మేమే అపవిత్రంగా అయ్యామని మీరంటారు. మేమే దేవతలుగా ఉండేవారము, మేమే క్రిందకు దిగిపోయామని అంటారు. లేకుంటే 84 జన్మలు ఎవరు తీసుకుంటారు? ఈ లెక్కాచారమంతా తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లలు చాలా శ్రమ చేయాల్సి వస్తుంది. అర్ధకల్పము నుండి విషయ సాగరములో పడి మునిగి ఉన్నవారిని వెలుపలికి తీయడం పిన్నమ్మ ఇల్లు కాదు (సులభము కాదు). ఎవరైనా కొంత జ్ఞానము తీసుకున్నా, ఆ జ్ఞానము ఎప్పుడూ నశించదు. ఈ కథ సత్యనారాయణులుగా తయారయ్యే కథ. ఆ తర్వాత ప్రజలుగా కూడా అవుతారు. కొద్దిగా అర్థము చేసుకొని తెలుసుకొని వెళ్ళిపోతారు. వారు మళ్లీ వచ్చి తెలుసుకోవచ్చు. పోను పోను మానవులకు వైరాగ్యము కూడా కలుగుతుంది. శ్మశానములో వైరాగ్యము కలిగి వెలుపలకు వస్తూనే సమాప్తమైపోతుంది. అదే విధంగా మీరు అర్థం చేయించినప్పుడు చాలా బాగుంది, బాగుంది అని అంటారు. వెలుపలకు వెళ్తూనే సమాప్తమవుతారు. ఈ పని పూర్తి చేసి వస్తామని అంటారు. బయటకు వెళ్తూనే మాయ తలలు తిప్పేస్తుంది. కోట్లలో ఏ ఒక్కరో వెలువడ్తారు. రాజ్యపదవి పొందుకోవడంలో శ్రమ ఉంటుంది. అనంతమైన తండ్రిని మేము ఎంతగా స్మృతి చేస్తున్నాము అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని హృదయములో ప్రశ్నించుకోండి. తండ్రి స్మృతిని మర్చిపోతామని అంటారు. అరే! అజ్ఞాన కాలములో తండ్రిని మర్చిపోయామని ఎప్పుడైనా అన్నారా?
తండ్రి అంటున్నారు - ఎన్ని తుఫానులు వచ్చినా, మీరు చలించరాదు. తుఫానులు వస్తాయి కానీ కర్మేంద్రియాలతో కర్మలు చేయరాదు. బాబా, మాయ ఇంద్రజాలము చేసేసింది అని అంటారు. బాబా అంటున్నారు - మధురమైన పిల్లలూ, నన్ను స్మృతి చేస్తే మీ మురికి తొలగిపోతుంది. ఆత్మ పై మురికి ఏర్పడ్తుంది. అది స్మృతి ద్వారానే తొలగిపోతుంది. తండ్రి కూడా బిందువే. తండ్రి స్మృతి తప్ప మురికిని తొలగించుకునేందుకు వేరే ఏ ఉపాయమూ లేదు. అచ్ఛా! (మంచిది!)
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మనము కళ్యాణకారి తండ్రి పిల్లలము. అందువలన స్వ కళ్యాణాన్ని మరియు సర్వుల కళ్యాణాన్ని చేయాలి. చేసిన సంపాదన సమాప్తమయ్యే ఏ కర్మలు చేయరాదు. ఇందులో చాలా హెచ్చరికతో ఉండాలి.
2. బాగా చదువుకొని జ్ఞాన రత్నాలతో మీ జోలెను పూర్తిగా నింపుకోవాలి. స్కాలర్షిప్ తీసుకునే పురుషార్థము చేయాలి. తండ్రి సమానము చింతాముక్తులుగా, నిశ్చింతులుగా ఉండాలి.
వరదానము :-
''బ్రాహ్మణ జన్మ యొక్క విశేషతలను సహజ స్వభావంగా చేసుకునే సహజ పురుషార్థీ భవ''
బ్రాహ్మణ జన్మ కూడా విశేషమైనదే, బ్రాహ్మణ ధర్మము, బ్రాహ్మణుల కర్మలు కూడా విశేషమైనవి అనగా సర్వ శ్రేష్ఠమైనవి. ఎందుకంటే బ్రాహ్మణులు కర్మలో సాకార బ్రహ్మబాబాను ఫాలో చేస్తారు (అనుసరిస్తారు). కనుక బ్రాహ్మణుల నేచరే విశేషమైన నేచర్(స్వభావము). సాధారణము లేక మాయావి నేచర్ బ్రాహ్మణుల నేచర్ కాదు. కేవలం నేను విశేషమైన ఆత్మను అనే స్మృతి స్వరూపంలో ఉండండి. ఈ నేచర్ ఎప్పుడైతే న్యాచురల్గా(సహజంగా) అవుతుందో అప్పుడు తండ్రి సమానంగా అవ్వడం సహజంగా అనుభవం చేస్తారు. స్మృతి స్వరూపము నుండి సమర్థ స్వరూపులుగా అవుతారు. ఇదే సహజ పురుషార్థము.
స్లోగన్ :-
''పవిత్రత మరియు శాంతి లైటును నలువైపులా వ్యాపింపజేయువారే లైట్హౌస్లు''