03-07-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - ఈ శరీరాన్ని చూడకుండా ఆత్మను చూడండి, స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మతో మాట్లాడండి, ఈ స్థితిని స్థాపించుకోవాలి.

ప్రశ్న :-

పిల్లలైన మీరు తండ్రితో కలిసి పైకి(ఇంటికి) ఎప్పుడు వెళ్తారు ?

జవాబు :-

అపవిత్రత అంశ మాత్రము కూడా మిగలకుండా, తండ్రి ఎంత పవిత్రులో పిల్లలైన మీరు కూడా అంత పవిత్రంగా అయినప్పుడు పైకి వెళ్లగలరు. పిల్లలైన మీరిప్పుడు తండ్రి సన్ముఖములో ఉన్నారు. జ్ఞానసాగరుని ద్వారా జ్ఞానము విని విని సంపూర్ణులైనప్పుడు(ఫుల్‌), తండ్రిని జ్ఞానములో ఖాళీ చేస్తారో అప్పుడు వారు కూడా శాంతిగా ఉండిపోతారు మరియు పిల్లలైన మీరు కూడా శాంతిధామానికి వెళ్లిపోతారు. అక్కడ జ్ఞాన బిందువులు(జల్లులు) ఆగిపోతాయి. సర్వస్వము ఇచ్చిన తర్వాత మౌనంగా(సైలెన్స్‌గా) ఉండిపోవడం వారి పాత్ర.

ఓంశాంతి.

శివభగవానువాచ. శివభగవానువాచ అని అన్నప్పుడు శివుడొక్కరే భగవంతుడు లేక పరమపిత అని అర్థం చేసుకోవాలి. వారినే పిల్లలైన మీరు లేక ఆత్మలు స్మృతి చేస్తారు. రచయిత అయిన తండ్రి ద్వారా పరిచయమైతే లభించింది. తప్పకుండా నంబరువారు పురుషార్థానుసారంగానే స్మృతి చేస్తూ ఉంటారు. ఏకరసంగా అందరూ స్మృతి చేయరు. ఇది చాలా సూక్ష్మమైన విషయము. స్వయాన్ని ఆత్మగా భావించి ఇతరులను కూడా ఆత్మగా భావించే స్థితిని తయారు చేసుకునేందుకు సమయము పడ్తుంది. ఆ మనుష్యులకైతే ఏమీ తెలియదు, అందువలన సర్వవ్యాపి అని అనేస్తారు. మీరు ఏ విధంగా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తారో, అలా మరెవ్వరూ స్మృతి చేయలేరు. ఏ ఆత్మ యోగము కూడా తండ్రితో లేదు. ఈ విషయాలన్నీ చాలా సూక్ష్మమైనవి, గుహ్యమైనవి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి అందుకే మనమంతా సోదరులమని కూడా అంటారు నుక ఆత్మనే చూడాలి, శరీరాన్ని చూడరాదు. ఇది చాలా గొప్ప గమ్యము. తండ్రిని ఎప్పుడూ స్మృతి కూడా చేయనివారు చాలా మంది ఉన్నారు, ఆత్మ పై చాలా మలినముంది. ముఖ్యంగా ఇది ఆత్మకు సంబంధించిన విషయమే. సతోప్రధానంగా ఉన్న ఆత్మయే తమోప్రధానంగా అయిందనే జ్ఞానము ఇప్పుడు ఆత్మలో ఉంది. పరమాత్మయే జ్ఞానసాగరులు. మీరు స్వయాన్ని జ్ఞానసాగరులని అనరు. తండ్రి నుండి పూర్తిగా జ్ఞానము తీసుకోవాలని మీకు తెలుసు. వారు తమ వద్ద ఉంచుకొని ఏం చేస్తారు?! అవినాశి జ్ఞానరత్నాల ధనాన్ని పిల్లలకు ఇవ్వాల్సిందే. పిల్లలు నంబరువారు పురుషార్థానుసారము తీసుకుంటారు. ఎవరు ఎక్కువ తీసుకుంటారో వారే మంచి సర్వీసు చేయగలరు. బాబాను జ్ఞానసాగరులని అంటారు. వారూ ఆత్మయే, మీరు కూడా ఆత్మలే. ఆత్మలైన మీరు మొత్తం జ్ఞానమంతా తీసేసుకుంటారు. వారు ఎలాగైతే సదా పవిత్రంగా ఉన్నారో, మీరు కూడా అలాగే సదా పవిత్రంగా అవుతారు. మళ్లీ ఎప్పుడైతే అపవిత్రత అంశమాత్రము కూడా ఉండదో అప్పుడు పైకి వెళ్లిపోతారు. స్మృతియాత్ర చేసే యుక్తిని తండ్రి నేర్పిస్తారు. రోజంతా స్మృతి ఉండదని తెలుసు. ఇక్కడ పిల్లలైన మీకు తండ్రి సన్ముఖములో కూర్చుని అర్థం చేయిస్తారు. ఇతర పిల్లలు సన్ముఖంగా వినరు. మురళి చదువుకుంటారు. ఇక్కడ మీరు సన్ముఖంలో ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి, జ్ఞానమును కూడా ధారణ చేయండి. మనము తండ్రి వలె సంపూర్ణ జ్ఞానసాగరులుగా అవ్వాలి. మొత్తం జ్ఞానమంతా అర్థం చేసుకుంటే అది తండ్రిని జ్ఞానంలో ఖాళీ చేసినట్లే అవుతుంది. చెప్పడం పూర్తి అవ్వగానే వారు శాంతిగా ఉండిపోతారు. అలాగని వారిలో జ్ఞానము మెదులుతూ ఉండదని కాదు. అంతా ఇచ్చేసిన తర్వాత మౌనంగా ఉండడమే వారి పాత్ర. మీరు సైలెన్స్‌లో(శాంతిధామంలో) ఉన్నప్పుడు మీలో జ్ఞానము మెదలదు. ఆత్మ సంస్కారాన్ని తీసుకెళ్తుందని తండ్రి అర్థం చేయించారు. సన్యాసి ఆత్మ అయితే వారికి చిన్నతనములోనే శాస్త్ర్రాలు కంఠస్థమవుతాయి. అప్పుడు ఆ ఆత్మ పేరు చాలా ప్రసిద్ధమవుతుంది. మీరిప్పుడు కొత్త ప్రపంచములోకి వెళ్లేందుకు ఇక్కడకు వచ్చారు. అక్కడకు జ్ఞాన సంస్కారాన్ని తీసుకు రాలేరు. ఈ సంస్కారము గుప్తమైపోతుంది. పోతే ఆత్మలు నంబరువార్‌ పురుషార్థానుసారంగా తమ సీట్లు తీసుకుంటాయి, తర్వాత మీ శరీరాలకు పేర్లు ఉంటాయి. శివబాబా నిరాకారులు. నేను ఈ అవయవాలను అప్పుగా తీసుకుంటానని వారు చెప్తున్నారు. కేవలం వినిపించేందుకు మాత్రమే వారు వస్తారు. స్వయం జ్ఞానసాగరులు కనుక ఇతరులు చెప్పే జ్ఞానాన్ని వారు వినరు. కేవలం నోటి ద్వారానే వారు ముఖ్యమైన కర్తవ్యాన్ని చేస్తారు. అందరికీ మార్గాన్ని తెలిపేందుకే వారు వస్తారు. మిగతా విషయాలు విని ఏం చేస్తారు? ఇలా ఇలా చేయమని వారు సదా వినిపిస్తూనే ఉంటారు. మొత్తం వృక్షమంతటి రహస్యాన్ని వినిపిస్తారు. కొత్త ప్రపంచము చాలా చిన్నదిగా ఉంటుందని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఈ పాత ప్రపంచము ఎంత పెద్దది! మొత్తం ప్రపంచంలో ఎన్ని లైట్లు వెలుగుతూ ఉంటాయి! లైట్ల ద్వారా ఏమేమి జరుగుతాయి? అక్కడైతే ప్రపంచము కూడా చిన్నదిగా ఉంటుంది, లైట్లు కూడా కొద్దిగానే ఉంటాయి. చిన్న గ్రామము వలె ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ ఎంతెంత పెద్ద పెద్ద గ్రామాలున్నాయి! అక్కడ ఇన్ని ఉండవు. ఇక్కడ కొన్ని ముఖ్యమైన మంచి మార్గాలు ఉంటాయి. పంచతత్వాలు కూడా అక్కడ సతోప్రధానంగా అవుతాయి. అవి ఎప్పుడూ చంచలమవ్వవు. దానిని సుఖధామమని అంటారు. దాని పేరే స్వర్గము. పోను పోను మీరు ఎంత సమీపంగా వస్తారో అంత వృద్ధిని పొందుతూ ఉంటారు. తండ్రి కూడా సాక్షాత్కారము చేయిస్తూ ఉంటారు. తర్వాత ఆ సమయంలో యుద్ధములో సైన్యము లేక విమానాలు మొదలైనవేవీ అవసరముండవు. ఇక్కడ కూర్చుని అందరినీ సమాప్తము చేయగలమని అంటారు. అప్పుడు ఈ విమానాలు మొదలైనవేవీ పనికిరావు. తర్వాత చంద్రుడు మొదలైన వాటిలో స్థలాలు చూచేందుకు కూడా వెళ్లరు. ఇది అంతా వ్యర్థ విజ్ఞానపు డాంభికము. ఎంత వైభవము చూపించుకుంటున్నారు! ప్రదర్శన చేస్తున్నారు! జ్ఞానములో ఎంత నిశ్శబ్ధముంది! దీనిని ఈశ్వరీయ ప్రసాదము(దేన్‌) అని అంటారు. విజ్ఞానములో అయితే అంతా హంగామాయే(గలభాయే). వారికి శాంతి గురించే తెలియదు.

విశ్వములో శాంతి నూతన ప్రపంచములో ఉండేదని, అది సుఖధామమని మీకు తెలుసు. ఇప్పుడైతే దు:ఖము, అశాంతి ఉన్నాయి. మీరు శాంతిని కోరుకుంటున్నారు. అసలు అశాంతియే ఉండరాదని అనుకుంటున్నారు. అది కేవలం శాంతిధామము మరియు సుఖధామములో ఉంటందని కూడా అర్థం చేయించాలి. స్వర్గమునైతే అందరూ కోరుకుంటారు. భారతీయులే స్వర్గమును స్మృతి చేస్తుంటారు. ఇతర ధర్మాలవారు వైకుంఠాన్ని స్మృతి చేయరు. వారు కేవలం శాంతిని తలచుకుంటారు. సుఖమునైతే వారు తలుచుకోలేరు. చట్టము అలా లేదు. సుఖమునైతే మీరే తలుచుకుంటారు. కాబట్టి మమ్ములను దు:ఖము నుండి విడిపించండి అని పిలుస్తూ ఉంటారు. వాస్తవానికి ఆత్మలు శాంతిధామంలో నివసిస్తాయి. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు తెలివిహీనులుగా ఉండేవారు. ఎప్పటి నుండి తెలివిహీనులుగా అయ్యారు? 16 కళలు నుండి 14-12 కళలవారిగా అవుతారు అంటే బుద్ధిహీనులుగా అవుతారు. ఇప్పుడు ఏ కళలూ లేవు. సమావేశాలు(కాన్ఫరెన్సులు) జరుపుతూ ఉంటారు. స్త్రీలకు దు:ఖము ఎందుకుంది? అరే! ప్రపంచమంతటా దు:ఖముంది. అంతులేని దు:ఖముంది. ఇప్పుడు విశ్వములో శాంతి ఎలా ఏర్పడగలదు? ఇప్పుడైతే అనేక ధర్మాలున్నాయి, విశ్వమంతటా శాంతి ఇప్పుడు ఏర్పడజాలదు. సుఖము గురించి తెలియనే తెలియదు. ఈ ప్రపంచములో అనేక ప్రకారాల దు:ఖముంది, అశాంతి ఉంది అని పిల్లలైన మీరు కూర్చుని అర్థం చేయిస్తారు. ఎక్కడ నుండైతే ఆత్మలైన మనము వచ్చామో అది శాంతిధామము, ఎక్కడైతే ఈ ఆదిసనాతన దేవీదేవతా ధర్మము ఉండేదో అది సుఖధామము. ఆదిసనాతన హిందూ ధర్మము అని అనరు. ఆది అనగా ప్రాచీనము. ఆది సత్యయుగములో ఉండేది. ఆ సమయములో అందరూ పవిత్రంగా ఉండేవారు. ఆది నిర్వికారి ప్రపంచము. అక్కడ వికారమనే పేరు లేదు. తేడా ఉంది కదా. మొట్టమొదట నిర్వికారితనము కావాలి కదా. కాబట్టి తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా! కామము పై విజయము పొందండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు ఆత్మ అపవిత్రంగా ఉంది. ఆత్మలో త్రుప్పు(మలినాలు) చేరినందున ఆభరణము(శరీరము) కూడా అలాగే తయారయ్యింది. ఆత్మ పవిత్రంగా ఉంటే నగలు (శరీరాలు) కూడా పవిత్రంగానే ఉంటాయి. దానినే నిర్వికారి ప్రపంచమని అంటారు. మఱ్ఱిచెట్టు ఉదాహరణను కూడా మీరు ఇవ్వవచ్చు. మొత్తం వృక్షమంతా ఉంది, కానీ దాని కాండము(పునాది) లేదు. అలా ఈ ఆది సనాతన ధర్మము లేదు, మిగిలినవన్నీ ఉన్నాయి. అందరూ అపవిత్రంగా ఉన్నారు, వీరిని మానవులని అంటారు, వారు దేవతలు. నేను మానవులను దేవతలుగా చేసేందుకు వచ్చాను. 84 జన్మలు కూడా మనుష్యులు తీసుకుంటారు. తమోప్రధానంగా అయినప్పుడు హిందువులని అంటారని మెటికల చిత్రములో చూపించాలి. పతితులుగా అయ్యారు కనుక దేవతలని అనజాలరు. డ్రామాలో ఈ రహస్యముంది కదా. లేకుంటే వాస్తవానికి హిందూ ధర్మమంటూ ఏదీ లేదు. ఆదిసనాతన దేవీదేవతలుగా మనమే ఉండేవారము, భారతదేశమే పవిత్రంగా ఉండేది, ఇప్పుడు అపవిత్రంగా అయ్యింది. కనుక స్వయాన్ని హిందువులని చెప్పుకుంటారు. హిందూ ధర్మాన్ని ఎవ్వరూ స్థాపించలేదు. దీనిని పిల్లలు బాగా ధారణ చేసి అర్థము చేయించాలి. ఈ రోజుల్లో అయితే అంత సమయాన్ని కూడా ఇవ్వడం లేదు. కనీసము అర్ధగంట అయినా ఇస్తే అప్పుడు ఈ పాయింట్లు వినిపించవచ్చు. పాయింట్లైతే చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి వినిపించబడ్తాయి. ఆ చదువులో కూడా చదువుకుంటూ చదువుకుంటూ ఉంటే చిన్న-చిన్న విషయాలు గుర్తుండవు. 'అల్ఫ్‌ మరియు బే' లను మర్చిపోతారు. మీతో కూడా ఇప్పుడు మీ జ్ఞానము మారిపోయిందని అంటారు. అరే! చదువులో పైకి వెళ్తూ ఉంటే మొదటి చదువును మర్చిపోతూ ఉంటారు కదా. తండ్రి కూడా మనకు నిత్యము కొత్త కొత్త విషయాలు వినిపిస్తూ ఉంటారు. మొదట తేలికపాటి చదువు ఉండేది. ఇప్పుడు తండ్రి గుహ్యమైన విషయాలు వినిపిస్తూ ఉన్నారు. జ్ఞానసాగరులు కదా. వినిపిస్తూ వినిపిస్తూ మళ్లీ చివరిలో రెండు పదాలు చెప్తూ అల్ఫ్‌(బాబా)ను గురించి తెలుసుకున్నా చాలు అని అంటారు. అల్ఫ్‌ను తెలుసుకోవడం ద్వారా 'బే' ను (ఆస్తిని) కూడా తెలుసుకుంటారు. ఇంత మాత్రం అర్థం చేయించినా చాలు. జ్ఞానాన్ని ఎక్కువగా ధారణ చేయలేని వారు ఉన్నత పదవిని కూడా పొందలేరు. గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు అవ్వలేరు. కర్మాతీత స్థితిని పొందలేరు. ఇందులో చాలా కష్టపడాలి. స్మృతిలో కూడా శ్రమ ఉంది. జ్ఞాన ధారణ చేయడం కూడా శ్రమతో కూడినది. రెండిటి(స్మృతి మరియు జ్ఞానము)లో అందరూ చురుకైనవారిగా అవ్వలేరు. రాజధాని స్థాపన జరుగుతోంది. అందరూ నరుని నుండి నారాయణునిగా ఎలా అవ్వగలరు? ఈ గీతాపాఠశాల లక్ష్యమైతే అదే, ఇది ఆ గీతా జ్ఞానమే. అది కూడా ఎవరు ఇస్తారు? ఈ విషయము మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఇప్పుడిది శ్మశానము. ఇదే మళ్లీ స్వర్గము(పరిస్తానము)గా అవ్వనున్నది.

మీరిప్పుడు జ్ఞానచితి పై కూర్చుని పూజారీల నుండి పూజ్యులుగా తప్పకుండా అవ్వాలి. వైజ్ఞానికులు కూడా ఎంతో చురుకుగా అవుతూ ఉంటారు. క్రొత్త విషయాలను ఆవిష్కరిస్తూ ఉంటారు. భారతీయులు ప్రతి విషయాన్ని(తెలివిని) అక్కడి నుండి నేర్చుకుని వస్తారు. వారు కూడా చివర్లో ఇక్కడకు వస్తారు కాని పూర్తి జ్ఞానమును తీసుకోలేరు. తర్వాత అక్కడకు కూడా వచ్చి ఇదే ఇంజనీరింగు పని చేస్తారు కానీ రాజా-రాణులుగా అయితే అవ్వలేరు. రాజా-రాణుల వద్ద సేవ చేస్తారు. ఇలాంటి ఆవిష్కరణలు నకుగొంటూ ఉంటారు. సుఖంగా ఉండేందుకే రాజా- రాణులుగా అవుతారు. అక్కడైతే అన్ని సుఖాలు లభిస్తాయి. కావున పిల్లలు పూర్తిగా పురుషార్థము చేయాలి. పూర్తిగా ఉత్తీర్ణులై కర్మాతీత స్థితిని పొందుకోవాలి. త్వరగా వెళ్లిపోవాలి అన్న ఆలోచన రాకూడదు. మీరిప్పుడు ఈశ్వరీయ సంతానులు, తండ్రి చదివిస్తూ ఉన్నారు. ఇది మానవులను పరివర్తన చేయు మిషను(ప్రచార సంస్థ). బౌద్ధుల, క్రైస్తవుల మిషన్లు(సేవాసంస్థలు) కూడా ఉన్నాయి కదా. కృష్ణుడు, క్రీస్తు(క్రిశ్చియన్‌)ల రాశి కూడా కలుస్తుంది. ఇచ్చి పుచ్చుకోవడంలో కూడా వారిద్దరికి చాలా సంబంధముంది. ఇంత సహాయము చేస్తున్న వారి భాష మొదలైన వాటిని వదిలి పెట్టడం కూడా ఒక విధంగా అవమానమే. వారు వచ్చేదే చివర్లో. వారికి ఎక్కువ సుఖమూ ఉండదు, చాలా దు:ఖము కూడా ఉండదు. కొత్త విషయాలన్నీ ఆవిష్కరిస్తూ ఉంటారు. ఇక్కడ భలే ప్రయత్నిస్తారు కాని ఖచ్ఛితంగా ఎప్పటికీ తయారు చేయలేరు. విదేశీ వస్తువులు బాగుంటాయి. నిజాయితీగా (హానెస్టీగా) తయారుచేస్తారు. ఇక్కడైతే నిజాయితీగా చేయరు. అపారమైన దు:ఖముంది. తండ్రి తప్ప మరెవ్వరూ అందరి దు:ఖాలను దూరం చేయలేరు. విశ్వములో శాంతి ఏర్పడాలని ఎన్ని సమావేశాలు జరిపినా ఎదురుదెబ్బలు తింటూనే ఉంటారు. కేవలం మాతల దు:ఖమే కాదు, ఇక్కడ అనేక ప్రకారాల దు:ఖముంది. ప్రపంచమంతటా కొట్లాటలు, మారణహోమాలే ఉన్నాయి. పైసా లెక్క కోసము మారణహోమాలే జరుపుతారు. అక్కడ దు:ఖమనే మాటే ఉండదు. ఇది కూడా లెక్క తీయాలి. యుద్ధము ఎప్పుడైనా ప్రారంభమవ్వవచ్చు. భారతదేశములో రావణుడు వచ్చినప్పుడు మొట్టమొదట ఇంటిలో యుద్ధము ప్రారంభమవుతుంది, విభజనలు చేసుకుని విడిపోతారు. పరస్పరములో యుద్ధాలు చేసి మరణిస్తారు. తర్వాతనే బయటి దేశాల వారు వచ్చారు, మొదట ఆంగ్లేయులు లేరు. తర్వాత మధ్యలో వారొచ్చి లంచాలిచ్చి తమ రాజ్యముగా చేసుకున్నారు. రాత్రికి-పగలుకున్నంత తేడా ఉంది. కొత్త వారెవ్వరూ ఇది అర్థము చేసుకోలేరు. ఇది కొత్త జ్ఞానము కదా, మళ్లీ ఇది ప్రాయ: లోపమైపోతుంది. తండ్రి ఇచ్చిన జ్ఞానము మళ్లీ మాయమైపోతుంది. ఇది ఒకే చదువు, ఒకేసారి, ఒక్క తండ్రి ద్వారానే లభిస్తుంది. మీరు ఏ విధంగా అవుతారో మున్ముందు మీ అందరికీ సాక్షాత్కారమవుతుంది కానీ ఆ సమయములో ఏం చేయగలరు? ఉన్నతిని పొందుకోలేరు. ఫలితాలు(రిజల్టు) వెలువడిన తర్వాత బదిలీ(ట్రాన్స్‌ఫర్‌) కావడము ఖచ్ఛితము. ఏడుస్తారు, తల బాదుకుని ఏడుస్తారు. మనము నూతన ప్రపంచానికి ట్రాన్స్‌ఫర్‌ అయిపోతాము. త్వరత్వరగా శబ్ధము(బాబా సందేశము) వ్యాపించాలని అని మీరు కష్టపడ్తూ ఉంటారు. తర్వాత తమంతకు తామే సెంటర్లకు పరిగెడ్తూ వస్తారు. కానీ ఎంత ఆలస్యమవుతుందో అంత టూలేట్‌ (చాలా ఆలస్యము) అవుతూ ఉంటారు. తర్వాత ఏమీ జమ అవ్వదు. పైసలతో అవసరమే ఉండదు. ఇతరులకు అర్థం చేయించేందుకు మీకు ఈ బ్యాడ్జియే చాలు. ఇతడు బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మగా అవుతాడు. శాస్త్ర్రాలన్నిటిి సారముండే విధంగా ఈ బ్యాడ్జి ఉంది. బాబా బ్యాడ్జి గురించి చాలా మహిమ చేస్తారు. మీ బ్యాడ్జిని అందరూ కళ్లకు హత్తుకునే సమయము వస్తుంది. 'మన్మనాభవ', నన్ను స్మృతి చేస్తే ఇలా అవుతారని ఇందులో ఉంది. మళ్లీ వీరే 84 జన్మలు తీసుకుంటారు. పునర్జన్మలు తీసుకోనివారు తండ్రి ఒక్కరే. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. స్మృతి చేయు శ్రమ, జ్ఞానమును ధారణ చేయడం ద్వారా కర్మాతీత స్థితిని పొందే పురుషార్థము చేయాలి. జ్ఞానసాగరుని సంపూర్ణ జ్ఞానాన్ని స్వయంలో ధారణ చేయాలి.

2. ఆత్మలో కలిసిన మురికిని తొలగించి సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. అంశ మాత్రము కూడా అపవిత్రత ఉండరాదు. ఆత్మలైన మనము సోదరులము,....... ఈ అభ్యాసము చేయాలి.

వరదానము :-

'' పవిత్రత యొక్క రాయల్టీ ద్వారా శ్రేష్ఠమైన జీవితము యొక్క ప్రకాశాన్ని చూపించే విశేషతా సంపన్న భవ ''

బ్రాహ్మణ జీవితములోని విశేషత - ''పవిత్రత యొక్క రాయల్టీ.'' ఎలాగైతే రాయల్‌ కుటుంబములోని వారి మొఖము మరియు నడవడిక ద్వారా, వీరు ఏదో రాయల్‌ కులానికి చెందిన వారని తెలుస్తుందో, అలా బ్రాహ్మణ జీవితము వారి పవిత్రత యొక్క ప్రకాశము ద్వారా తెలుస్తుంది. ఎప్పుడైతే సంకల్పములో కూడా అపవిత్రత నామ-రూపాలు కూడా ఉండవో అప్పుడు వారి నడవడిక మరియు మొఖము ద్వారా పవిత్రత యొక్క ప్రకాశము కనిపిస్తుంది. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్య వ్రతము మాత్రమే కాదు. వారి పై ఏలాటి వికారము అనగా అశుద్ధత యొక్క ప్రభావము లేనప్పుడే విశేషతా సంపన్నమైన బ్రాహ్మణాత్మ అని అంటారు.

స్లోగన్‌ :-

'' ఎవరైతే స్వదర్శనము చేస్తారో, వారే సదా ప్రసన్నచిత్తులుగా, సర్వ ప్రాప్తులకు అధికారులుగా ఉంటారు . ''