06-05-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - గృహస్థ వ్యవహారములో ఉంటూ ఏ వస్తువులోనూ ఆసక్తి లేనంత నిమిత్తులుగా( ట్రస్టీలుగా ) అవ్వండి, మాదంటూ ఏదీ లేదు అనేంత భికారులుగా అయిపోయిండి ''

ప్రశ్న :-

పిల్లలైన మీ పురుషార్థపు గమ్యము ఏది ?

జవాబు :-

మీరు ప్రపంచానికి మరణించారు, ప్రపంచము మీకు మరణించింది,.............(ఆప్‌ ముయే మర్‌ గయీ దునియా,........) ఇదే మీ గమ్యము. శరీరము పై మమకారము తొలగిపోవాలి. ఏమీ గుర్తుకు రానంత భికారులుగా అవ్వండి. ఆత్మ అశరీరిగా అయిపోవాలి. మేము ఇక వాపస్‌ ఇంటికి పోవాలి, ఇంతకంటే మరేమీ లేదు. ఇటువంటి పురుషార్థము చేసే భికారులే సత్యమైన రాకుమారులుగా అవుతారు. పిల్లలైన మీరే భికారి(ఫకీరు) నుండి ధనవంతులుగా, ధనవంతుల నుండి ఫకీర్లుగా అవుతారు. మీరు ధనవంతులుగా ఉన్నప్పుడు పేదవారు ఒక్కరు కూడా ఉండరు.

ఓంశాంతి.

ఆత్మ వింటున్నదా లేక శరీరము వింటున్నదా? అని తండ్రి పిల్లలను అడుగుతున్నారు(ఆత్మ). ఆత్మ శరీరము ద్వారానే వింటుంది. పిల్లలు ఫలానా ఆత్మ బాప్‌దాదాను స్మృతి చేస్తూ ఉందని వ్రాస్తారు. ఫలానావారి ఆత్మ ఈ రోజు ఫలానా చోటుకు వెళ్తుందని అంటారు. మనం ఆత్మలము అనేది బాగా అలవాటు అయిపోతున్నది. మనమంతా ఆత్మలము, ఎందుకంటే పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఎవరిని చూచినా అచ్చట ఆత్మ - శరీరము రెండూ ఉన్నాయని మీకు తెలుసు. ఇతనిలో రెండు ఆత్మలున్నాయి. ఒక దానిని ఆత్మ, మరో దానిని పరమాత్మ అని అంటారు. ఈ శరీరములో నేను ఉన్నానని పరమాత్మ స్వయంగా చెప్తున్నారు. ఈ శరీరములో ఇతని ఆత్మ కూడా ఉంది. నేను అందులోనే ప్రవేశిస్తాను. శరీరము లేకుండా ఆత్మ ఉండలేదు. స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి చెప్తున్నారు. ఆత్మ అని భావించినప్పుడే తండ్రిని స్మృతి చేస్తారు. అంతేకాక పవిత్రమై శాంతిధామానికి వెళ్తారు. దైవీ గుణాలు ఎంతగా ధారణ చేసి చేయిస్తారో, స్వదర్శన చక్రధారులై ఇతరులను తయారుచేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. ఇందులో ఎవరికైనా నమ్మకము లేకుంటే లేక తికమకపడ్తూ ఉంటే మరలా అడగవచ్చు. నేను కూడా ఆత్మనే, ఇది యథార్థము. బ్రాహ్మణులుగా తయారైన పిల్లలకే తండ్రి చెప్తున్నారు, ఇతరులకు చెప్పరు. పిల్లలే నాకు ప్రియమనిపిస్తారు. ప్రతి తండ్రికి తన పిల్లలు ప్రియంగా ఉంటారు. ఇతరులను పై పైన ప్రేమిస్తారు కానీ బుద్ధిలో వీరు నా పిల్లలు కారు అని ఉంటుంది. నేను పిల్లలతోనే మాట్లాడ్తాను, ఎందుకంటే పిల్లలనే చదివించాలి. వెలుపలివారిని చదివించడం మీ కర్తవ్యము. కొంతమంది వెంటనే అర్థము చేసుకుంటారు. కొంతమంది కొంచెం అర్థము చేసుకొని వెళ్లిపోతారు. ఇది చాలా వృద్ధి చెందుతూ ఉందని తెలిసినప్పుడు మళ్లీ ఏం జరుగుతోందో చూస్తామని వస్తారు. నన్ను స్మృతి చేయండని ఆత్మలందరికీ లేక పిల్లలందరికీ తండ్రి చెప్తున్నారని మీరు అందరికీ అర్థం చేయించండి. ఆత్మలందరినీ పావనంగా తయారు చేయువారు తండ్రి ఒక్కరే. నన్ను తప్ప మరెవ్వరినీ స్మృతి చేయకండి అని వారు చెప్తున్నారు. నా పై అవ్యభిచారి స్మృతి ఉంచితే ఆత్మలైన మీరు పావనమైపోతారు. నేను ఒక్కరిని మాత్రమే పతితపావనుడను, నా స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది, అందుకే తండ్రి చెప్తున్నారు - '' పిల్లలూ! నన్ను ఒక్కరినే స్మృతి చేయండి.'' ఆ తండ్రే పతిత రాజ్యము నుండి పావన రాజ్యంగా తయారుచేస్తారు, ముక్తినిస్తారు. ఎచ్చటకు తీసుకెళ్తారు? శాంతిధామానికి తర్వాత సుఖధామానికి తీసుకెళ్తారు.

ముఖ్యమైన విషయము పవిత్రంగా అవ్వడం. 84 జన్మల చక్రమును అర్థము చేయించడం కూడా సులభమే. చిత్రము చూస్తూనే నిశ్చయమైపోతుంది. అందుకే మ్యూజియమ్‌ తెరవండి, ఆడంబరము చేయండి అని బాబా ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు. ఆడంబరంగా ఉంటే మనుష్యులను ఆకర్షిస్తుంది. చాలామంది వస్తారు. మేము తండ్రి శ్రీమతమును అనుసరించి ఈ విధంగా తయారవుతున్నామని అందరికీ వినిపించండి. నన్ను ఒక్కరినే స్మృతి చేయండని, దైవీ గుణాలు ధారణ చేయండని తండ్రి చెప్తున్నారు. బ్యాడ్జ్‌ తప్పకుండా మీ వెంటనే ఉండాలి. మనము భికారుల నుండి రాకుమారులుగా అవుతామని మీకు తెలుసు. మొదట కృష్ణునిగా అవుతాము కదా. కృష్ణునిగా అవ్వనంత వరకు నారాయణునిగా అవ్వలేరు. బాలుడు పెద్దవానిగా అయినప్పుడే నారాయణ అనే పేరు లభిస్తుంది. అందుకే ఇందులో రెండు చిత్రాలున్నాయి. మీరు ఈ విధంగా అవుతారు. ఇప్పుడు మీరంతా భికారులుగా అయిపోయారు. బ్రహ్మకుమార-కుమారీలందరూ భికారులే. వీరి వద్ద ఏమీ లేదు. భికారి అనగా ఏమీ లేనివారు. కొంతమందిని మనము భికారులు అని అనము. ఈ బాబా అందరికంటే పెద్ద భికారి. ఇందులో పూర్తిగా భికారులుగా అవ్వాల్సి ఉంటుంది. గృహస్థ వ్యవహారములో ఉంటూ ఆసక్తిని సమాప్తం చేయాలి. మీరు డ్రామానుసారము ఆసక్తిని త్యజించారు. మాకున్నదంతా బాబాకు ఇచ్చి వేశామని నిశ్చయబుద్ధి గలవారికి మాత్రమే మీకు తెలుసు. ఓ భగవంతుడా! మీరిచ్చిందంతా మీదే, మాదంటూ ఏమీ లేదు అని అంటారు కదా. అది భక్తిమార్గము. అప్పుడు బాబా చాలా దూరంగా ఉండేవారు, ఇప్పుడు బాబా చాలా సమీపంగా ఉన్నారు. సన్ముఖములో వారికి చెందినవారిగా తయారవ్వాల్సి ఉంటుంది.

'బాబా' అని మీరు నన్ను పిలుస్తారు. బాబా శరీరమును చూడరాదు. బాబా అని అంటూనే బుద్ధి పైకి వెళ్లిపోతుంది. ఇది భలే అప్పుగా తీసుకున్న శరీరము. కానీ శివబాబాతో మాట్లాడుతున్నామని మీ బుద్ధికి తెలుసు. ఇది బాడుగకు తీసుకున్న రథము. వారిది కానే కాదు. ఎంత గొప్పవారైతే అంత ఎక్కువ బాడుగ కూడా లభిస్తుందని కూడా మీకు తెలుసు. ఇంటి యజమాని రాజులుకే ఇవ్వాలని, అప్పుడు ఒక వేయి బాడుగకు 4 వేలు చెప్తామని, ఎందుంటే మంచి ధనవంతులు కనుక ఎక్కువ బాడుగ లభిస్తుందని భావిస్తాడు. బాడుగ ఎక్కువ తీసుకుంటారని రాజులు ఎప్పుడూ అనరు, ఎందుకంటే వారికి ధనమంటే లెక్కే లేదు. వారు స్వయంగా ఎవరితోనూ మాట్లాడరు. వారి ప్రైవేటు సెక్రటరీలే (వ్యక్తిగత కార్యదర్శి) మాట్లాడ్తారు. ఈ కాలములో లంచము లేకుండా ఏ పనీ జరగదు. బాబా చాలా అనుభవము గలవారు. వారు చాలా రాయల్‌గా ఉంటారు. వారు ఇష్టపడాలి. ఇష్టపడిన తర్వాత సెక్రటరీకి ఇది కొనుగోలు చేసి రమ్మని చెప్తారు. వస్తువులన్నీ వారి ముందు పరచి ఉంచుతారు. మహారాజ-మహారాణి ఇరువురూ వస్తారు. ఏ వస్తువును ఇష్టపడతారో కేవలం కంటితో సైగ చేస్తారు. సెక్రటరీ మాట్లాడి, మధ్యలో తన భాగము తీసుకుంటాడు. కొంతమంది రాజులు డబ్బు వెంట తెచ్చుకుంటారు. ఇతనికి డబ్బులు ఇచ్చేయమని సెక్రటరీకి చెప్తారు. ఈ బాబాకు అందరితో సంబంధాలు ఉన్నాయి. వారు ఎలాంటివారో, ఎలా నడుచుకుంటారో బాబాకు అన్నీ బాగా తెలుసు. ఎలాగైతే రాజుల వద్ద కోశాధికారి ఉంటాడో అలా ఇచ్చట కూడా శివబాబా వద్ద కోశాధికారి ఉన్నాడు. ఇతడు కేవలం నిమిత్తమే. బాబాకు వీటి పై ఏ మాత్రము మోహము లేదు. ఇతడు తన ధనము పైననే మోహముంచుకోలేదు. సర్వస్వమూ శివబాబాకిచ్చేశాడు. అటువంటప్పుడు శివబాబా ధనము పై ఇతనికి మోహమెందుకుంటుంది, ఇతడు కేవలం నిమిత్తము(ట్రస్టీ) ధనము ఎవరి వద్ద ఎక్కువగా ఉంటుందో, ప్రభుత్వము వారు వారి పై ఎంత నిఘా ఉంచుతారు! విదేశాల నుండి వచ్చినప్పుడు వారిని పూర్తిగా పరీక్షిస్తారు.

ఇప్పుడు భికారిగా ఎలా అవ్వాలో పిల్లలైన మీకు తెలుసు. ఏదీ గుర్తు రాకూడదు. ఆత్మ అశరీరిగా అయిపోవాలి. ఈ శరీరమును కూడా నాది అని భావించరాదు. నాదంటూ ఏమీ ఉండరాదు. స్వయాన్ని ఆత్మగా భావించండి, ఇప్పుడు మీరు వాపస్‌ ఇంటికెళ్లాలని తండ్రి అర్థం చేయిస్తున్నారు. భికారిగా ఎలా అవ్వాలో మీకు తెలుసు. మీ శరీరము పై కూడా మీకు మమకారము తొలగిపోవాలి. మీరు ప్రపంచానికి మరణించారు, ప్రపంచము మీ కొరకు మరణించింది,............. ఇదే గమ్యము. బాబా, ఖచ్చితంగా నిజమే తెలుపుతున్నారని మీరు భావిస్తారు. ఇప్పుడు మనము వాపస్‌ వెళ్లాలి. శివబాబాకు మీరు ఏమేమి ఇస్తారో దానికి బదులుగా మరుసటి జన్మలో మీకు లభిస్తుంది. అందుకే ఇదంతా ఈశ్వరుడే ఇచ్చారని అంటారు. వెనుకటి జన్మలో మంచి కర్మలు చేసినందున దాని ఫలితము లభించిందని అంటారు. శివబాబా ఎవరిదీ ఉంచుకోరు. గొప్ప గొప్ప రాజులు, జమీందార్లు మొదలైనవారైతే వారికి బహుమతులు కూడా ఇస్తారు. కొంతమంది బహుమతులు తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. అచ్చట మీరు దాన-పుణ్యాలు ఏవీ చేయరు. ఎందుకంటే అందరి వద్ద అపారమైన ధనరాసులుంటాయి. కావున ధనము ఎవరికి దానమిస్తారు? పేదవారైతే అచ్చట ఉండనే ఉండరు, మీరే భికారుల నుండి ధనవంతులుగా, ధనవంతుల నుండి భికారులుగా అవుతారు. వీరికి ఆరోగ్యమివ్వండి, కృప చూపండి అని అంటారు. ఇది చేయండి, అది చేయండని అడుగుతారు. ప్రారంభములో కూడా శివబాబాను యాచించేవారు. ఆ తర్వాత వ్యభిచారులుగా అయ్యారు. అందువలన అందరి వద్దకు వెళ్తూ ఉంటారు. అలా వెళ్లి జోలె నింపమని యాచిస్తూ ఉంటారు. ఎంతో రాతిబుద్ధిగా మారిపోయారు. రాతిబుద్ధి నుండి బంగారు బుద్ధిగా చేస్తారని కూడా అంటారు. కావున పిల్లలైన మీకు అపారమైన సంతోషముండాలి. అతీంద్రియ సుఖమును గురించి అడగాలంటే గోపీ వల్లభుని గోప-గోపికలను అడగండని మహిమ కూడా ఉంది. చాలా లాభము పొందినవారైతే చాలా సంతోషంగా ఉంటారు. అందువలన పిల్లలైన మీకు కూడా చాలా సంతోషము ఉండాలి. మీకు నూటికి నూరు శాతము సంతోషముండేది, ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఏ మాత్రము సంతోషము లేదు. మొదట అనంతమైన చక్రవర్తి పదవి ఉండేది, ఆ తర్వాత పరిమిత రాజరికము, అల్పకాలము కొరకు ఉంటుంది. ఇప్పుడు బిర్లా వద్ద ఎంతో పెద్ద ఆస్తి ఉంది, మందిరాలు కట్టిస్తారు, కానీ దాని వలన ఏమీ లభించదు. పేదవారికి కొద్దిగా కూడా ఇవ్వరు. మందిరాలు కట్టించారు, అచ్చట మనుష్యులు వచ్చి తల వంచి నమస్కరిస్తారు. పేదవారికి దానము చేస్తే దానికి బదులుగా ఏదైనా లభిస్తుంది. ధర్మశాలలు కట్టిస్తే చాలా మంది మనుష్యులు వెళ్లి అచ్చట విశ్రమిస్తారు. దాని ఫలితము మరుసటి జన్మలో అల్పకాల సుఖము లభిస్తుంది. ఎవరైనా ఆసుపత్రులు కట్టిస్తే అల్పకాలము కొరకు ఒక జన్మలో సుఖము లభిస్తుంది. ఇవన్నీ అనంతమైన తండ్రి కూర్చుని పిల్లలకు తెలిపిస్తున్నారు. ఈ పురుషోత్తమ సంగమ యుగానికి చాలా గొప్ప మహిమ ఉంది. మీకు కూడా చాలా మహిమ ఉంది. ఎందుకంటే మీరు పురుషోత్తములుగా అవుతారు. బ్రాహ్మణులైన మిమ్ములను మాత్రమే భగవంతుడు వచ్చి చదివిస్తారు. వారే జ్ఞాన సాగరులు, ఈ మొత్తము మానవ సృష్టి రూపి వృక్షానికి బీజము. డ్రామా ఆదిమధ్యాంతముల రహస్యమంతటినీ తెలిపిస్తున్నారు. మిమ్ములను చదివిస్తున్నారా! అని అడుగుతారు. గీతలో కూడా భగవానువాచ అని ఉంది కదా? మీరు మర్చిపోయారా? అని చెప్పండి, అంతేకాక మిమ్ములను రాజాధి రాజులుగా తయారు చేస్తానని కూడా చెప్పారు కదా. దాని అర్థము ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. పతిత రాజులు పావన రాజులను పూజిస్తారు. అందుకే మిమ్ములను రాజాధి రాజులుగా తయారు చేస్తానని తండ్రి చెప్తున్నారు. ఈ లక్ష్మీ నారాయణులు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు కదా. స్వర్గములోని దేవతలను ద్వాపర- కలియుగాలలో అందరూ పూజించి నమస్కరిస్తారు. ఈ మాటలన్నీ ఇప్పుడు మీరు అర్థము చేసుకుంటున్నారు. భక్తులకు ఏ మాత్రము అర్థము కాదు. వారు కేవలం శాస్త్రాలలోని కథలను చదువుతూ, వినిపిస్తూ ఉంటారు. మీరు అర్ధకల్పము నుండి చదువుతూ, వింటూ ఉన్న గీత ద్వారా ఏమైనా ప్రాప్తి జరిగిందా? అని బాబా అడుగుతున్నారు. కడుపు ఏ మాత్రము నిండలేదు. ఇప్పుడు మీ కడుపు నిండుతూ ఉంది. ఈ పాత్ర ఒక్కసారి మాత్రమే ఉంటుందని మీకు తెలుసు. ఈ శరీరములో నేను ప్రవేశిస్తానని స్వయంగా భగవంతుడే చెప్తున్నారు. తండ్రి వీరి ద్వారా మాట్లాడుతున్నారు అనగా తప్పక ప్రవేశిస్తారు. పై నుండే ఆదేశాలిస్తారా! నేను మీ సన్ముఖములో వస్తానని చెప్తున్నారు. ఇప్పుడు మీరు సన్ముఖములో వింటున్నారు. ఈ బ్రహ్మకు కూడా మొదట ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు తెలుసుకుంటున్నారు. అంతేకాని గంగానదిలోని నీరు పావనంగా చేయదు. ఇది జ్ఞాన విషయము. తండ్రి సన్ముఖములో కూర్చుని ఉన్నారని మీకు తెలుసు. ఇప్పుడు మీ బుద్ధి పైకి వెళ్లదు. ఇది వారి రథము. దీనిని బాబా పాదరక్ష(బూటు, డిబ్బి, డబ్బా) అని కూడా అంటారు. ఈ చిన్న డబ్బాలోనే ఆ వజ్రముంది. ఎంతో ఫస్ట్‌క్లాసు వస్తువు. దీనిని బంగారు డబ్బాలో ఉంచాలి. బంగారు యుగపు డబ్బాగా తయారు చేస్తారు. చాకలి ఇంటికి వెళ్తే మాయమైపోతుంది అని బాబా అంటారు కదా. దీనినే ఛూ మంత్రమంటారు. ఛూ మంత్రము ద్వారా ఒక్క సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది. అందుకే వారిని ఇంద్రజాలికులు అని కూడా అంటారు. ఒక్క సెకండులో మనము ఇలా తయారవుతామని నిశ్చయమైపోతుంది. ఈ విషయాలన్నీ ఇప్పుడే మీరు ప్రాక్టికల్‌గా వింటున్నారు. మొదట సత్యనారాయణ కథ వినునప్పుడు ఈ విధంగా అర్థము చేసుకునేవారా? అప్పుడు కథ వినునప్పుడు విదేశాలు, స్టీమర్లు మొదలైనవన్నీ గుర్తు వచ్చేవి. సత్యనారాయణ కథ విని మళ్లీ ప్రయాణము చేసేవారు. ఆ తర్వాత మళ్లీ తిరిగి వచ్చేవారు. కానీ మీరు మళ్లీ ఈ ఛీ-ఛీ ప్రపంచములోకి తిరిగి రాకూడదని బాబా చెప్తున్నారు. భారతదేశము అమరలోకము. దేవీ దేవతల స్వర్గ రాజ్యముండేది. ఈ లక్ష్మీ నారాయణులు విశ్వమంతటికీ అధికారులు కదా. వీరి రాజ్యములో పవిత్రత, సుఖము, శాంతి ఉండేవి. విశ్వములో శాంతి ఉండాలని, అందరూ కలిసి ఐకమత్యంగా ఉండాలని ప్రపంచములోనివారు కూడా కోరుకుంటారు. ఇప్పుడు ఈ అనేక ధర్మాలన్నీ కలిసి ఒక్కటిగా ఎలా అవుతాయి! ప్రతి ఒక్క ధర్మము, వారి లక్షణాలు (ఫీచర్స్‌) వేరు వేరుగా ఉన్నాయి. అన్నీ కలిసి ఒక్కటిగా ఎలా అవుతాయి! దానిని శాంతిధామము, సుఖధామము అని అంటారు. అక్కడ ఒకే ధర్మము, ఒకే రాజ్యముంటుంది. ఒకరితో ఒకరు ఘర్షణ పడేందుకు వేరే ధర్మమే ఉండదు. దానినే విశ్వములో శాంతి అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మిమ్ములను తండ్రి చదివిస్తున్నారు. పిల్లలందరూ ఒకే రీతిగా చదవరని కూడా తెలుసు. నంబరువారుగా ఉండనే ఉంటారు. ఇక్కడ కూడా రాజధాని స్థాపనవుతూ ఉంది. పిల్లలను వివేకవంతులుగా తయారు చేయడం జరుగుతుంది.

ఇది ఈశ్వరీయ విశ్వ విద్యాలయము. భక్తులు అర్థము చేసుకోరు. భగవానువాచ అని కూడా అనేకమార్లు విన్నారు. ఎందుకంటే భారతీయుల ధర్మ శాస్త్రమే గీత. గీతకు అపారమైన మహిమ ఉంది. సర్వ శాస్త్రమయి శిరోమణి భగవద్గీత. శిరోమణి అనగా శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనది. పతితపావనులు, సద్గతిదాత ఒకే ఒక భగవంతుడు మాత్రమే. వారే సర్వాత్మలకు తండ్రి. భారతీయులకు అర్థమే తెలియదు. తెలియకనే కేవలం అందరూ సోదరులే(భాయి - భాయి) అని అంటారు. ఇప్పుడు తండ్రి మీకు మనమంతా సోదరులమేనని అర్థం చేయించారు. మనమంతా శాంతిధామములో ఉండేవారము, పాత్రను అభినయించేందుకు ఇచ్చటకు వచ్చి తండ్రిని కూడా మర్చిపోతాము, ఇంటిని కూడా మర్చిపోతాము. ఏ తండ్రి అయితే భారతదేశానికి, మొత్తం విశ్వ రాజ్యాన్నంతా ఇస్తారో అటువంటి తండ్రిని అందరూ మర్చిపోతారు. ఈ రహస్యాలన్నీ తండ్రే అర్థం చేయిస్తున్నారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. అతీంద్రియ సుఖమును అనుభవము చేసేందుకు ఇది పురుషోత్తమ యుగమని, ఇప్పుడే మనలను భగవంతుడు చదివిస్తున్నారని, ఈ చదువు ద్వారా మనము రాజాధి రాజులుగా అవుతామని స్మృతిలో ఉండాలి. ఇప్పుడు మాత్రమే మనకు డ్రామాలోని ఆదిమధ్యాంతాల జ్ఞానముంటుంది.

2. ఇప్పుడు వాపస్‌ ఇంటికి వెళ్లాలి. అందుకే ఈ శరీరము నుండి కూడా పూర్తిగా భికారులుగా అవ్వాలి. దీనిని మర్చిపోయి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించాలి.

వరదానము :-

'' తండ్రి సమానం దయాహృదయులై అందరినీ క్షమించి స్నేహాన్ని, ప్రేమను ఇచ్చే మాస్టర్‌ దాతా భవ ''

ఎలాగైతే తండ్రిని దయాహృదయులు, కరుణా సాగరులని అంటారో, అలా పిల్లలైన మీరు కూడా మాస్టర్‌ దయాహృదయులు. దయాహృదయులుగా ఉండేవారే కళ్యాణము చేయగలరు. అకళ్యాణము చేసేవారిని కూడా క్షమించగలరు. వారు మాస్టర్‌ స్నేహసాగరులుగా ఉంటారు. వారి వద్ద స్నేహము తప్ప ఇంకేమీ ఉండనే ఉండదు. వర్తమాన సమయంలో సంపద కంటే స్నేహము ఎక్కువగా అవసరముంది. అందువలన మాస్టర్‌ దాతలుగా అయ్యి స్నేహమునిస్తూ ఉండండి. ఖాళీ చేతులతో ఎవ్వరూ వెళ్లరాదు.

స్లోగన్‌ :-

'' తీవ్ర పురుషార్థిగా అవ్వాలనే కోరిక ఉంటే, కోరిక ఉన్న చోట దారి తప్పకుండా లభిస్తుంది. ''