15-08-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - మీకు సత్యమైన స్వతంత్రమునిచ్చేందుకు, యమదూతల శిక్షల నుండి ముక్తులుగా చేసేందుకు రావణుని పరతంత్రత నుండి విడిపించేందుకు

ప్రశ్న :-

తండ్రి అర్థం చేయించు విధానానికి, మీరకు అర్థం చేయించు విధానానికి గల ముఖ్య తేడా ఏమిటి?

జవాబు :-

తండి అర్థం చేయించునప్పుడు, ''మధురమైన పిల్లలారా'' అంటూ తెలిపిస్తారు, దాని వలన తండి మాటల బాణము నాటుకుంటుంది. పిల్లలైన మీరు పరస్పరములో సోదరులకు అర్థం చేయిస్తారు. కనుక మీరు, ''మధురమైన పిల్లలారా'' అని అనలేరు. తండ్రి పెద్దవారు కనుక వారి మాటలకు ప్రభావముంటుంది. వారు పిల్లలకు అనుభూతి చేయిస్తారు. పిల్లలారా, మీకు సిగ్గు కలగడం లేదా మీరు పతితులైపోయారు, ఇప్పుడు పావనంగా అవ్వండి.

ఓంశాంతి.

బేహద్‌ ఆత్మిక తండ్రి, బేహద్‌ ఆత్మిక పిల్లలకు కూర్చుని అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడీ విషయము బేహద్‌ తండ్రికి, బేహద్‌ పిల్లలకు మాత్రమే తెలుసు. ఇతరులెవ్వరికీ బేహద్‌ తండ్రి గురించి తెలియదు. అంతేకాక ఇతరులెవ్వరూ తమను తాము బేహద్‌ తండ్రి పిల్లలమని భావించరు. బ్రహ్మ ముఖవంశావళీ వారు మాత్రమే అర్థము చేసుకుంటారు, అంగీకరిస్తారు. ఇతరులెవ్వరూ అంగీకరించలేరు. ఆదిదేవుడనబడే బ్రహ్మ కూడా తప్పకుండా కావాలి. అతనిలో తండ్రి ప్రవేశిస్తారు. తండ్రి వచ్చి ఏం చేస్తారు? పావనంగా అవ్వాలని చెప్తారు, స్వయాన్ని ఆత్మ అని నిశ్చయించుకోండని తండ్రి శ్రీమతమునిస్తారు. పిల్లలకు ఆత్మ పరిచయమును కూడా ఇచ్చారు. ఆత్మ భృకుటి మధ్యలో నివసిస్తుంది. ఆత్మ అవినాశి అని బాబా అర్థం చేయించారు. ఈ వినాశి శరీరము ఆత్మకు సింహాసనము. ఒకే తండ్రి పిల్లలమైన మనమందరము పరస్పరములో సోదరులమని మీకు తెలుసు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనడం చాలా పెద్ద తప్పు. ప్రతి ఒక్కరిలో పంచ వికారాలు ప్రవేశమై ఉన్నాయని మీరు బాగా అర్థం చేయిస్తారు. అప్పుడు చాలామంది వీరు కరెక్టుగా చెప్తున్నారని అర్థము చేసుకుంటారు. మనము సోదరులమైతే, తండ్రి నుండి తప్పకుండా వారసత్వము లభించాలి. కానీ ఇక్కడి నుండి వెలుపలికి వెళ్లగానే మాయ తుఫాన్లలో చిక్కుకుంటారు. ఎవరో ఒక్కరు స్థిరంగా నిలుస్తారు. అన్ని స్థానాలలో ఇలాగే ఉంటుంది. ఎవరైనా కొద్దిగా బాగా అర్థము చేసుకుంటే ఎక్కువగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇప్పుడు మీరు అందరికీ అర్థము చేయించగలరు. ఒకవేళ ఎవరైనా చాలా గమనము ఇవ్వకుంటే, వీరు పాత భక్తులు కారని అంటారు. ఈ విషయాలను అర్థము చేసుకోవలసినవారే చేసుకుంటారు. ఎవరైనా అర్థము చేసుకోకుంటే వారు ఇతరులకు కూడా అర్థము చేయించలేరు. మీ వద్ద కూడా నెంబరువారుగా ఉన్నారు, ఎవరైనా మంచి పెద్ద వ్యక్తులు వస్తే, వారికి అర్థం చేయించేందుకు బాగా తెలిపించే వారినే పంపుతారు. అప్పుడే కొంచెమైనా అర్థము చేసుకోగలరు. కానీ పెద్దవారు అంత త్వరగా అర్థము చేసుకోలేరని తెలుసు. వీరు చాలా బాగా అర్థం చేయిస్తున్నారని అభిప్రాయాన్ని వ్రాసి ఇస్తారు. తండ్రి పరిచయాన్ని పూర్తిగా ఇస్తారు. కానీ వారికి ఫుర్సత్తు ఎక్కడుంది? బేహద్‌ తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమౌతాయని మీరు చెప్తారు.
ఇప్పుడు తండ్రి నేరుగా ఆత్మలమైన మనతో మాట్లాడ్తారని మీకు తెలుసు. ప్రత్యక్షంగా వినడం వలన బాణము బాగా తగులుతుంది. వారు బి.కెల ద్వారా వింటారు. ఇక్కడ పరమపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా నేరుగా అర్థము చేయిస్తున్నారు - ఓ పిల్లలారా, మీరు తండ్రి చెప్పినదానిని అంగీకరించరా? మీరు ఇతరులకు ఈ విధంగా చెప్పలేరు కదా. అక్కడైతే తండ్రి లేరు. ఇక్కడ తండ్రి కూర్చొని ఉన్నారు, తండ్రియే మాట్లాడ్తారు - పిల్లలూ, మీరు తండ్రి మాటలు కూడా వినరా! అజ్ఞాన సమయములో కూడా తండ్రి అర్థం చేయించేందుకు, సోదరుడు అర్థం చేయించేందుకు తేడా ఉంటుంది. తండ్రి చెప్పినప్పుడు పడినంత ప్రభావము సోదరుడు చెప్పినప్పుడు పడదు. తండ్రి ఎంతైనా పెద్దవారు కదా, కనుక భయముంటుంది. మీకు కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు - తండ్రినైన నన్ను స్మృతి చేయండి. క్షణ క్షణము మర్చిపోయేందుకు మీకు సిగ్గేయడం లేదా? తండ్రి నేరుగా చెప్తున్నందున దాని ప్రభావము త్వరగా పడ్తుంది. అరే, తండ్రి చెప్పేదానిని పాటించలేరా? బేహద్‌ తండ్రి చెప్తున్నారు - ఈ జన్మలో నిర్వికారులుగా అయితే 21 జన్మలకు నిర్వికారులై పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ఇది అంగీకరించరు(నమ్మరు). తండ్రి మాటలు బాణము వలె తీక్షణంగా ఉంటాయి. తేడా అంటూ ఉంటుంది. సదా క్రొత్తవారితోనే బాబా కలుస్తూ ఉంటారని కూడా కాదు. ఉల్టా-సుల్టాగా ప్రశ్నిస్తుంటారు, ఇది పూర్తిగా నూతన విషయము కనుక బుద్ధిలో కూర్చోదు. గీతలో కృష్ణుని పేరు వ్రాసేశారు. అది సాధ్యము కాదు. ఇప్పుడు డ్రామానుసారము మీ బుద్ధిలో కూర్చుంది. మేము బాబా వద్దకు వెళ్లాలి. నేరుగా మురళీని వినాలని మీరంతా పరుగెెత్తుకొని వస్తారు. అక్కడ సోదరుల ద్వారా వినేవారు, ఇప్పుడిక్కడ తండ్రి ద్వారా నేరుగా వింటారు. తండ్రి ప్రభావముంటుంది. పిల్లలారా! పిల్లలారా! అంటూ మాట్లాడ్తారు. పిల్లలూ! మీకు సిగ్గు కలగదా! తండ్రిని స్మృతి చేయలేరా! తండ్రి పై మీకు ప్రేమ లేదా! ఎంత సమయము స్మృతి చేస్తున్నారు? బాబా, ఒక గంట చేశామని పిల్లలు చెప్తారు. అరే, నిరంతరము స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయి. జన్మ-జన్మల పాప భారము తల పై ఉంది. తండ్రి సన్ముఖంలో అర్థం చేయిస్తున్నారు. మీరు ఎంతగా తండ్రిని నిందించారు! మీ పైన కేసు పెట్టాలి. వార్తాపత్రికలలో ఎవరి గురించి అయినా అకారణంగా నిందిస్తే కేసు పెడ్తారు కదా. మీరు ఏమేమి చేసేవారని తండ్రి స్మృతినిప్పిస్తున్నారు. డ్రామానుసారంగా రావణుని సాంగత్య వశము అవ్వడం వలన ఇలా జరిగిందని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు భక్తిమార్గమంతా పూర్తయ్యింది, గడచిపోయింది, మధ్యలో ఆపేవారు ఎవ్వరూ ఉండరు. రోజురోజుకు దిగజారుతూ దిగజారుతూ తమోప్రధాన బుద్ధిహీనులుగా అయిపోతారు. ఎవరిని పూజిస్తున్నారో వారిని రాళ్ళు-రప్పలలో ఉన్నారని అనేస్తారు. దీనిని బేహద్‌ బుద్ధిహీనత అని అంటారు. బేహద్‌ పిల్లల బేహద్‌ బుద్ధిహీనత, ఒకవైపు శివబాబాను పూజిస్తారు, మరోవైపు ఆ తండ్రినే సర్వవ్యాపి అని అంటారు. తండ్రినే నిందించేటంత బుద్ధిహీనులైపోయామని ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. ఇప్పుడు భికారుల నుండి రాజకుమారులయ్యేందుకు పురుషార్థము చేస్తున్నామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. శ్రీ కృష్ణుడు సత్యయుగ రాజకుమారుడని వారికి 16,108 రాణులుండేవారని, పిల్లలుండేవారని చెప్తారు. ఇప్పుడు మీకు సిగ్గు కలుగుతుంది. ఎవరైనా పాపము చేస్తే భగవంతుని ముందుకు వెళ్లి చెవులు పట్టుకుని - ఓ భగవంతుడా! చాలా పెద్ద తప్పైపోయింది, దయ చూపండి, క్షమించండి అని ప్రార్థిస్తారు. మీరు ఎంత పెద్ద తప్పు చేశారు! తండ్రి చెప్తున్నారు - డ్రామాలో అలా ఉంది, అలా అయినప్పుడే నేను వస్తాను.
ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మీరు అన్ని ధర్మాల వారికి కళ్యాణము చేయాలి. సర్వులకు సద్గతిని ఇచ్చే తండ్రి గురించి అన్ని ధర్మాలవారు సర్వవ్యాపి అని అంటారు. ఇది ఎక్కడ నుండి నేర్చుకున్నారు! భగవానువాచ - నేను సర్వవ్యాపిని కాదు. మీ కారణంగా ఇతరులకు కూడా ఇదే గతి పట్టింది. 'ఓ పతితపావనా.......' అని పిలుస్తారు కానీ అర్థము చేసుకోరు. మనము మొట్టమొదట ఇంటి నుండి వచ్చినప్పుడు పతితంగా ఉన్నామా? దేహాభిమానులుగా అయినందున పతితులుగా అయ్యారు. ఏ ధర్మమువారు వచ్చినా, వారిని - పరమపిత పరమాత్మ గురించి మీకు తెలుసా? వారు ఎవరు? ఎక్కడ నివసిస్తారు? అని ప్రశ్నించాలి. అప్పుడు పైన ఉంటారు లేక సర్వవ్యాపి అని చెప్తారు. తండ్రి చెప్తున్నారు - మీ కారణంగా పూర్తి ప్రపంచము నష్ట ఖాతాలోకి వచ్చేసింది. మీరు నిమిత్తంగా అయ్యారు. అందరికీ అర్థం చేయించవలసి ఉంటుంది. భలే డ్రామానుసారము జరిగినా మీరు పతితులైపోయారు కదా. అందరూ పాపాత్మలే. ఇప్పుడు పుణ్యాత్మలుగా అయ్యేందుకు నన్ను పిలుస్తారు. అన్ని ధర్మాలవారి ఇల్లైన ముక్తిధామానికి వెళ్లాలి. అక్కడ పవిత్రంగా ఉంటారు. ఇది కూడా డ్రామాలో రచింపబడింది. ఈ విషయము తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు. అన్ని ధర్మాల కొరకు ఇదే జ్ఞానము. బాబా వద్దకు సమాచారము వచ్చింది. ఎవరో ఒక ఆచార్యుడు ఇలా చెప్పాడు. '' మీ అందరి ఆత్మలలో పరమాత్మ ఉన్నారని భావించి నమస్కరిస్తున్నాను.'' ఇంతమంది పరమాత్మలు ఎక్కడైనా ఉంటారా? కొంచెము కూడా తెలివి లేదు. ఎవరైతే ఎక్కువ భక్తి చేసి ఉండరో వారు నిలువలేరు. సేవాకేంద్రాలలో కూడా కొందరు కొంత సమయము, ఇంకొందరు ఇంకొంత సమయము నిలుస్తారు. భక్తి తక్కువ చేశారు కనుక నిలువలేకపోయారని భావించాలి, అయినా ఎక్కడకు వెళ్తారు? ఇతర దుకాణము ఏదీ లేదు. మనుష్యులు త్వరగా అర్థము చేసుకునే విధంగా ఏదైనా యుక్తిని రచించాలి. ఇప్పుడు అందరికి సందేశమును ఇవ్వాలి - '' తండ్రిని స్మృతి చేయండి అని చెప్పాలి. '' మీరే పూర్తిగా స్మృతి చేయలేకుంటే మీ బాణము ఎలా తగులుతుంది? అందుకే బాబా చెప్తున్నారు - చార్టు ఉంచండి, పావనంగా అవ్వడమే ముఖ్యమైనది. ఎంత పావనంగా అవుతారో అంత జ్ఞానము ధారణ అవుతుంది. సంతోషము కూడా కలుగుతుంది. మేము అందరినీ ఉద్ధరించాలని పిల్లలకు చాలా సంతోషము ఉండాలి. తండ్రియే వచ్చి సద్గతిని ఇస్తారు. తండ్రికి దు:ఖము, సంతోషాల మాటే లేదు. ఇది తయారైన డ్రామా. మీకెటువంటి దు:ఖముండరాదు. తండ్రే లభించి ఉండగా ఇంకేం కావాలి. కేవలం తండ్రి మతమును అనుసరించాలి. ఈ జ్ఞానము కూడా ఇప్పుడే లభిస్తుంది. సత్యయుగములో లభించదు. అక్కడ జ్ఞాన విషయమే ఉండదు. ఇక్కడ మీకు బేహద్‌ తండ్రి లభించారు కనుక మీకు స్వర్గములో కంటే ఎక్కువ సంతోషముండాలి.
తండ్రి చెప్తున్నారు - విదేశాలకు కూడా వెళ్లి మీరు ఇది అర్థం చేయించాలి, అన్ని ధర్మాలవారి పై మీకు జాలి కలుగుతుంది. 'ఓ భగవంతుడా దయ చూపండి, ఆశీర్వదించండి, దు:ఖముల నుండి విముక్తి చేయండి' అని ప్రార్థిస్తారు. అయితే ఏమీ అర్థము చేసుకోరు. తండ్రి అనేక ప్రకారాల యుక్తులు తెలిపిస్తారు. మీరు రావణుని జైలులో పడి ఉన్నారని అందరికీ తెలిపించండి. స్వతంత్రము లభించాలని అంటారు కాని వాస్తవానికి స్వతంత్య్రమని దేనిని అంటారో ఎవ్వరికీ తెలియదు. అందరూ చిక్కుకుని ఉన్నారు. ఇప్పుడు సత్యమైన స్వతంత్రము ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. అయినా రావణుని జైలులో పరతంత్రులై పాపాలు చేస్తూ ఉంటారు. సత్యమైన స్వతంత్రమంటే ఏమిటో మనుష్యులకు తెలిపించాలి. ఈ రావణ రాజ్యములో స్వతంత్రము లేదని మీరు వార్తాపత్రికలలో కూడా వేయించవచ్చు. చాలా సంక్షిప్తంగా వ్రాయాలి. ఎక్కువగా వ్రాస్తే ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. వారికి చెప్పండి - మీకు స్వతంత్రత ఎక్కడ ఉంది? మీరు రావణుని జైలులో పడి ఉన్నారు, విదేశాలలోని వారు గ్రహించి స్పందిస్తే తర్వాత ఇక్కడి వారు వెంటనే అర్థం చేసుకుంటారు. ఒకరి పై ఒకరు(ఘెరావ్‌) చేసుకుంటూ ఉంటారు. దీనిని స్వతంత్రత అని అంటారా? స్వతంత్రమునైతే తండ్రి మీకు ఇస్తున్నారు. రావణుని జైలు నుండి మిమ్ములను స్వతంత్రులుగా చేస్తున్నారు. మనము అక్కడ చాలా స్వతంత్రులుగా, చాలా ధనవంతులుగా ఉంటామని మీకు తెలుసు. ఇతరుల దృష్టి కూడా పడదు. తర్వాత మీరు బలహీనులైనప్పుడు మీ సంపద పైన దృష్టి పడింది. మెహమ్మద్‌ ఘజనీ వచ్చి మందిరాన్ని దోచుకున్నప్పటి నుండి మీ స్వతంత్రత ముగిసి పోయింది. రావణుని రాజ్యములో మీరు పరతంత్రులైపోయారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారు. ఇప్పుడు సత్యమైన స్వతంత్య్రమును పొందుతున్నారు. వారికి స్వతంత్రము గురించే తెలియదు. కావున ఈ విషయాన్ని కూడా యుక్తిగా అర్థం చేయించాలి. కల్పక్రితము స్వతంత్రాన్ని పొందుకున్నవారే ఇప్పుడు అంగీకరిస్తారు. మీరు అర్థం చేయిస్తున్నా బుద్ధిహీనుల వలె ఎంతగానో వాదిస్తారు. సమయము వ్యర్థము చేస్తూ ఉంటే మాట్లాడాలని అనిపించదు.
తండ్రి వచ్చి స్వతంత్రమును ఇస్తారు. రావణుని పరతంత్రతలో చాలా దు:ఖముంది. అపారమైన దు:ఖముంది, తండ్రి రాజ్యములో మనమెంత స్వతంత్రంగా ఉంటాము! పవిత్ర దేవీ దేవతలుగా అయినప్పుడు మనము రావణరాజ్యము నుండి విడుదలవుతాము. దీనినే సత్యమైన స్వతంత్రత అని అంటారు. సత్యమైన స్వతంత్రాన్ని తండ్రే వచ్చి ఇస్తారు. ఇప్పుడు పరాయి రాజ్యములో అందరూ దు:ఖములో ఉన్నారు. ఇది స్వతంత్రము లభించే పురుషోత్తమ సంగమ యుగము. విదేశీ ప్రభుత్వము పోయింది కనుక స్వతంత్రులుగా అయ్యామని వారు అంటారు. కానీ పావనంగా అవ్వనంతవరకు స్వతంత్రులని అనరని మీకు తెలుసు. తర్వాత యమభటుల శిక్షలు అనుభవించవలసి వస్తుంది. పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఇంటికి తీసుకెళ్లేందుకు తండ్రి వస్తారు. అక్కడ అందరూ స్వతంత్రులుగా ఉంటారు. మీరు అన్ని ధర్మాల వారికి మీరు ఆత్మలు ముక్తిధామము నుండి పాత్రను అభినయించేందుకు వచ్చారని సుఖధామము నుండి తిరిగి దు:ఖధామము, తమోప్రధాన ప్రపంచములోకి వచ్చేశారని అర్థం చేయించవచ్చు. తండ్రి చెప్తున్నారు - మీరు నా సంతానము, రావణుని సంతానము కాదు. నేను మీకు రాజ్యభాగ్యమును ఇచ్చి వెళ్లాను. మీరు మీ రాజ్యములో ఎంత స్వతంత్రులుగా ఉండేవారు! ఇప్పుడు మళ్లీ అక్కడకు వెళ్లేందుకు పావనంగా అవ్వాలి. మీరెంత ధనవంతులుగా అవుతారు, అక్కడ ధనము గురించిన చింత ఉండదు. పేదవారైనా ధనము కొరకు చింత ఉండదు, సుఖంగా ఉంటారు. ఇక్కడ చింత ఉంటుంది. అయితే రాజధానిలో నెంబరువారుగా పదువులుంటాయి. అందరూ సూర్యవంశీ రాజుల వలె అవ్వలేరు. ఎంత శ్రమ చేస్తారో అంత పదవి లభిస్తుంది. మీరు అన్ని ధర్మాల వారికి సేవ చేసేవారు. విదేశీయులకు కూడా అర్థం చేయించాలి. మీరు పరస్పరము సోదరులు కదా. అందరూ శాంతిధామములో ఉండేవారు, ఇప్పుడు రావణ రాజ్యములో ఉన్నారు. ఇప్పుడు మీకు ఇంటికి వెళ్లే మార్గాన్ని తెలిపిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి. భగవంతుడు అందరికీ ముక్తినిస్తారని అంటారు. కానీ ఎలా ఇస్తారో తెలియదు. పిల్లలు కూడా తికమక పడినప్పుడు బాబా, మమ్ములను ముక్తులను గావించి ఇంటికి తీసుకెళ్ళండని అంటారు. ఉదాహరణానికి మీరు పొగమంచు కమ్ముకున్న అడవిలో చిక్కుకుపోయారు కదా. మార్గమే కనిపించలేదు. తర్వాత ముక్తిదాత లభించి మార్గాన్ని తెలియజేశారు. బేహద్‌ తండ్రిని కూడా ''బాబా, మమ్ములను ముక్తులుగా చేయండి, మీరు నడవండి, మీ వెనుకే మేము కూడా నడుస్తాము'' అని అంటారు. తండ్రి తప్ప మరెవ్వరూ దారి తెలియజేయలేరు. ఎన్ని శాస్త్రాలను చదివేవారు, తీర్థయాత్రలలో ఎదురుదెబ్బలు తినేవారు అయినా భగవంతుని గురించి తెలియని కారణంగా ఎక్కడ, ఎంతగా వెతుకుతారు? సర్వవ్యాపి అయితే ఎలా లభిస్తారు? ఎంత అజ్ఞాన అంధకారములో ఉన్నారు! సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రే, వారే వచ్చి పిల్లలైన మిమ్ములను అజ్ఞాన అంధాకారము నుండి వెలుపలికి తీస్తారు అచ్ఛా! మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. తండ్రి లభించినందున ఏ విషయము గురించి చింత చేయరాదు. వారి మతముననుసరించి, అనంతమైన తెలివి గలవారిగా అయ్యి ఖుషీ - ఖుషీగా అందరినీ ఉద్ధరించేందుకు నిమిత్తులుగా అవ్వాలి.

2. యమదూతల శిక్షల నుండి రక్షింపబడేందుకు లేక సత్యమైన స్వతంత్రమును పొందేందుకు తప్ప పావనంగా అవ్వాలి. జ్ఞానము ఆదాయానికి మూలము, దానిని ధారణ చేసి ధనవంతులుగా అవ్వాలి.

వరదానము :-

'' సేవ చేస్తూ కర్మాతీత స్థితిని అనుభవం చేసే తపస్వీమూర్త్‌ భవ ''

సమయం తక్కువగా ఉంది, చేయాల్సిన సేవ ఎక్కువగా ఉంది. సేవలోనే మాయ వచ్చేందుకు అవకాశముంది. సేవలోనే స్వభావ-సంబంధాల విస్తారముంటుంది, స్వార్థము కూడా ఇమిడి ఉంటుంది. అందులో బ్యాలన్స్‌ కొంచెం తక్కువైనా మాయ కొత్త కొత్త రూపాన్ని ధారణ చేసి వస్తుంది. అందువలన సేవ మరియు స్వస్థితుల బ్యాలన్స్‌ ఉంచుకోవడం అభ్యాసము చేయండి. యజమానులుగా అయ్యి కర్మేంద్రియాలనే సేవకుల ద్వారా సేవ తీసుకోండి. మనసులో ''ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు'' - ఈ స్మృతి ఎమర్జ్‌ అయ్యి ఉంటే, అప్పుడు కర్మాతీత స్థితిని అనుభవం చేసే తపస్వీమూర్తులని అంటారు.

స్లోగన్‌ :-

'' కారణమనే నెగటివ్‌ను సమాధానమనే పాజిటివ్‌గా చేయండి. ''