04-06-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మొట్టమొదట ఎవరైతే భక్తి ప్రారంభము చేశారో, ఎవరైతే నంబర్వన్ పూజ్యులుగా ఉండి పూజారిగా అయ్యారో, వారి రథములోనే తండ్రి వస్తారు. ఈ రహస్యము అందరికి స్పష్టము చేసి వినిపించండి ''
ప్రశ్న :-
తండ్రి తన వారసులైన పిల్లలకు ఏ వారసత్వమును ఇచ్చేందుకు వచ్చారు?
జవాబు :-
తండ్రి సుఖము, శాంతి, ప్రేమసాగరులు. ఈ ఖజానాలన్నీ వారు మీకు వీలునామా చేస్తారు. 21 జన్మలకు మీరు తింటున్నా తరగనంత ఖజానాల వీలునామా మీకిస్తారు. మిమ్ములను గవ్వ నుండి వజ్ర సమానంగా చేస్తారు. తండ్రి ఖజానాలన్నీ మీరు యోగబలము ద్వారా తీసుకుంటారు. యోగము లేదంటే ఖజానాలు లభించజాలవు.
ఓంశాంతి.
శివభగవానువాచ. ఇప్పుడు శివభగవానుడైన, నిరాకారుని అందరూ అంగీకరిస్తారు. ఆ ఒక్క నిరాకార శివుడినే అందరూ పూజిస్తారు. మిగిలిన దేహధారులందరికీ వారికి సాకార రూపాలున్నాయి. మొట్టమొదట ఆత్మ నిరాకారంగా ఉండేది, తర్వాత సాకారంగా అయ్యింది. శరీరములో ప్రవేశించి సాకారమైనప్పుడు పాత్రను అభినయిస్తుంది. మూలవతనములో అయితే ఏ పాత్రా ఉండదు. నటులు ఇంటిలో ఉన్నప్పుడు నాటకములోని పాత్ర ఉండదు కదా. నాటక రంగము పైకి వస్తే పాత్రను అభినయిస్తారు. ఆత్మలు కూడా ఇచ్చటకు వచ్చి శరీరము ద్వారా పాత్రలు అభినయిస్తాయి. పాత్ర పైనే అంతా ఆధారపడి ఉంది. ఆత్మలో ఎలాంటి తేడా ఉండదు. పిల్లలైన మీ ఆత్మలు ఎలా ఉన్నాయో అలాగే వీరి(శివబాబా) ఆత్మ కూడా ఉంది. తండ్రి అయిన పరమాత్మ ఏమి చేస్తారు? వారి కర్తవ్యమేది? వీటిని గురించి తెలుసుకోవాలి. కొందరు ప్రెసిడెంటుగా ఉంటారు, కొందరు రాజుగా ఉంటారు. ఇవన్నీ ఆత్మల కర్తవ్యాలే కదా. వీరు పవిత్ర దేవతలు. అందుకే వీరిని పూజిస్తారు. ఈ చదువు చదివి లక్ష్మీనారాయణులు విశ్వానికి అధికారులుగా అయ్యారని మీకు తెలుసు. అలా తయారు చేసిందెవరు? పరమ ఆత్మ. ఆత్మలైన మీరు కూడా చదివిస్తారు. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్ములను చదివించడమే గొప్పదనము. వారు రాజయోగము కూడా నేర్పిస్తారు. ఇది ఎంతో సహజమైనది. దీనిని రాజయోగము అని అంటారు. తండ్రిని స్మృతి చేసినందున మనము సతోప్రధానంగా అవుతాము. తండ్రి సదా సతోప్రధానంగానే ఉంటారు. వారి గొప్పతనాన్ని ఎంతగానో మహిమ చేస్తారు. భక్తి మార్గములో పాలు, పండ్లు మొదలైన వాటిని అర్పిస్తారు. అయితే అర్థము ఏ మాత్రము తెలియదు. దేవతలను పూజిస్తారు, శివునికి పాలు, పూలు మొదలైన వాటితో అభిషేకము చేస్తారు. కొంచెము కూడా అర్థము తెలియదు. దేవతలు రాజ్యపాలన చేశారు. అచ్ఛా, శివునికి అభిషేకము ఎందుకు చేస్తారు? ఇంతగా పూజించేందుకు వారు ఏ కర్తవ్యము చేశారు? దేవతల గురించి అయితే వారు స్వర్గానికి యజమానులని మీకు తెలుసు. వారిని అలా తయారుచేసింది ఎవరో కూడా తెలియదు. శివుని పూజిస్తారు కూడా. కాని వారు భగవంతుడని ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. భగవంతుడే వీరిని అలా దేవతలుగా తయారు చేశారు. ఎంత భక్తి చేస్తారు! అందరూ అజ్ఞానములోనే ఉన్నారు. మీరు కూడా శివుని పూజించి ఉంటారు. ఇప్పుడు మీరు అర్థము చేసుకున్నారు, ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు. వారి కర్తవ్యమేమిటి, వారు ఇచ్చే సుఖమేది, వీటిని గురించి ఏమీ తెలియదు. ఈ దేవతలు సుఖమిస్తారా? భలే రాజు, రాణి ప్రజలకు సుఖమునిస్తారు. అయితే వారిని అలా తయారు చేసింది శివబాబాయే కదా. బలిహారమంతా వారిదే. ఈ దేవతలు కేవలం రాజ్యపాలన చేస్తారు. ప్రజలు కూడా తయారవుతారు. అంతేకాని వీరు ఎవరి కళ్యాణమును చేయరు. ఒకవేళ చేసినా, అది అల్పకాలము కొరకు మాత్రమే. ఇప్పుడు పిల్లలైన మిమ్ములను తండ్రి కూర్చొని చదివిస్తున్నారు. వారిని కళ్యాణకారి అని అంటారు. తండ్రి తన పరిచయమిస్తున్నారు. మీరు నా చిహ్నమైన లింగాన్ని పూజించేవారు. దానిని పరమాత్మ అని అనేవారు. పరమ ఆత్మ నుండి పరమాత్మగా అయిపోయింది. అయితే వారు ఏమి చేస్తారో ఎవ్వరికీి తెలియదు. కేవలం వారు సర్వవ్యాపి అని నామ-రూపాలకు భిన్నంగా ఉన్నారని అంటారు. అలా అంటూ వారిని పాలు మొదలైన వాటితో అభిషేకించడం శోభించదు. ఆకారముంటేనే కదా అభిషేకము చేస్తారు. కనుక వారిని నిరాకారమని అనలేరు. మనుష్యులు మీతో చాలా వాదిస్తారు. బాబా ముందుకు వచ్చినా వారు వాదిస్తారు. అనవసరంగా తల పాడు చేస్తారు, లాభమేమీ ఉండదు. ఇదంతా అర్థం చేయించడం పిల్లలైన మీ కర్తవ్యము. బాబా మనలను ఎంతో శ్రేష్ఠంగా చేశారో పిల్లలైన మీకు తెలుసు. ఇది చదువు, తండ్రి టీచరుగా అయ్యి చదివిస్తారు. మీరు మానవుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు. దేవీ దేవతలు సత్యయుగములో ఉంటారు, కలియుగములో ఉండరు. పవిత్రంగా ఉండగలిగేందుకు ఇక్కడ రామరాజ్యమే లేదు. దేవీదేవతలు ఉండేవారు. తర్వాత వామమార్గములోకి(వేద విరుద్ధమెనౖ తంత్ర మంత్రములతో కూడి మద్యమాంసమైథునాలకు తావిచ్చెడి విధానములోకి) వెళ్ళిపోతారు. కాని చిత్రాలలో చూపించినట్లు ఉండరు. జగన్నాథ మందిరములో మీరు నల్లని చిత్రాలు చూస్తారు. మాయను జయించి జగజ్జీతులుగా అవ్వమ్మని తండ్రి చెప్తున్నారు. వారు జగన్నాథుడని పేరు పెట్టారు. పై భాగములో అన్నీ వికారీ, అశుద్ధమైన చిత్రాలను చూపించారు. దేవతలు వామమార్గములోకి వెళ్లి నల్ల(అపవిత్రము)గా అయిపోయారు. వారిని కూడా పూజిస్తూ ఉంటారు. మనము పూజ్యులుగా ఎప్పుడు ఉండేవారమో మానవులకు ఏ మాత్రము తెలియదు. 84 జన్మల లెక్కాచారము ఎవరి బుద్ధిలోనూ లేదు. మొదట పూజ్యులుగా, సతోప్రధానంగా ఉండేవారు. తర్వాత 84 జన్మలు తీసుకుంటూ - తీసుకుంటూ తమోప్రధాన పూజారులుగా అయిపోతారు. రఘునాథ మందిరములో నల్లని చిత్రాలు చూపిస్తారు. దాని అర్థము ఏ మాత్రము తెలుసుకోరు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి కూర్చుని దాని అర్థము తెలిపిస్తున్నారు. జ్ఞాన చితి పై కూర్చొని తెల్లగా(పవిత్రంగా) అవుతారు. కామచితి పై కూర్చొని నల్లగా(అపవిత్రంగా) అయిపోతారు. దేవతలు వామమార్గములోకి వెళ్లి వికారులుగా అయిన తర్వాత వారిని దేవతలు అని అనజాలము. వామమార్గములోకి వెళ్లినందున నల్లగా అయిపోయారు. అందుకే ఈ గుర్తులు చూపించారు. కృష్ణుడిని, రాముడిని కూడా నల్లగా, శివుడిని కూడా నల్లగా చేసేశారు. శివబాబా నల్లగా అవ్వనే అవ్వండని మీకు తెలుసు. వారేమో వజ్రము వంటివారు. మిమ్ములను కూడా వజ్ర సమానంగా తయారు చేస్తారు. వారు ఎప్పుడూ నల్లగా అవ్వరు. అయితే వారిని నల్లగా ఎందుకు చేసేశారు! నల్లగా ఉన్న వారెవరో కూర్చొని ఇలా నల్లగా తయారు చేసి ఉంటారు. నేను ఏం తప్పు చేశానని నన్ను నల్లగా చేశారు? నేను వచ్చేదే అందరినీ తెల్లగా చేసేందుకు. నేను సదా పవిత్రంగా, తెల్లగా ఉంటానని శివబాబా అంటున్నారు. మనుష్యుల బుద్ధి ఎలా తయారైపోయిందంటే వారు ఏమీ అర్థము చేసుకోరు. శివబాబా అందరినీ వజ్ర సమానంగా చేసేవారు. నేను సదా సుందరమైన తెల్లగా ఉండే ప్రయాణికుడను. నేను ఏం చేశానని నన్ను నల్లగా తయారు చేశారు? ఇప్పుడు ఉన్నత పదవి కొరకు మీరు కూడా తెల్లగా, పవిత్రంగా తయారవ్వాలి. ఉన్నత పదవిని ఎలా పొందాలి? తండ్రిని అనుసరించమని తండ్రి అర్థం చేయించారు. ఎలాగైతే ఈ బాబా సర్వస్వమూ తండ్రికి సమర్పించారో అలా అనుసరించండి. భలే సాధారణంగా ఉండేవారు చాలా నిరుపేదా కాదు, చాలా శ్రీమంతుడూ కాదు. బాబా ఇప్పుడు కూడా చెప్తున్నారు - మీ ఆహార-పానీయాలు మధ్యస్థంగా, సాధారణంగా ఉండాలి. చాలా ఉన్నతముగానూ ఉండరాదు, చాలా తక్కువగానూ ఉండరాదు. మధ్యస్థంగా ఉండాలి. అన్ని శిక్షణలు ఆ తండ్రే ఇస్తున్నారు. చూసేందుకు వీరు కూడా చాలా సాధారణంగానే ఉన్నారు. భగవంతుడు ఎక్కడున్నారో చూపించమని మిమ్ములను అడుగుతారు. అరే! ఆత్మ ఒక సూక్ష్మమైన బిందువు. దానిని మీరు చూడగలరా? ఈ కనులకు ఆత్మ సాక్షాత్కారము జరగదని మీకు తెలుసు. భగవంతుడు చదివిస్తున్నారని మీరంటారు అనగా తప్పకుండా ఎవరో శరీరధారిగా ఉంటారు కదా. నిరాకారుడు ఎలా చదివిస్తారు? మనుష్యులకు ఏ మాత్రము తెలియదు. మీరు ఆత్మలు, శరీరము ద్వారా పాత్రను అభినయిస్తారు. ఆత్మనే పాత్రను అభినయిస్తుంది. ఆత్మయే శరీరము ద్వారా మాట్లాడ్తుంది. అందువలన 'ఆత్మా ఉవాచ.' కానీ ఆత్మ ఉవాచ అనే పదము శోభించదు. ఆత్మ వానప్రస్థము అనగా వాణి నుండి అతీతంగా ఉంటుంది. శరీరము ద్వారానే ఉవాచ అనగా మాట్లాడ్తుంది. శబ్ధానికి అతీతంగా కేవలం ఆత్మయే ఉంటుంది. శబ్ధములోకి రావాలంటే శరీరము తప్పకుండా అవసరము. తండ్రి కూడా జ్ఞానసాగరులే. కనుక తప్పకుండా ఎవరో ఒకరి శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారు కదా. దానిని రథము అని అంటారు. లేకుంటే ఎలా వినిపిస్తారు? తండ్రి పతితుల నుండి పావనంగా చేసేందుకు శిక్షణలు ఇస్తారు. ఇందులో ప్రేరణ అను మాటే లేదు. ఇది జ్ఞాన విషయము. వారు ఎలా వస్తారు? ఎవరి శరీరములో వస్తారు? వచ్చేదేమో మనుష్యుల శరీరములోనే అయితే ఏ మనిషిలో వస్తారు? ఇది మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. రచయిత స్వయంగా కూర్చొని తాను ఎలా ఏ రథములో వస్తారో తెలియజేసి తమ పరిచయమునిస్తున్నారు. తండ్రి రథము ఏదో పిల్లలకు తెలుసు. చాలామంది మానవులు తికమక చెంది ఉన్నారు. రకరకాల రథాలు తయారుచేస్తారు. జంతువులు మొదలైన వాటిలో అయితే రాలేరు. తండ్రి చెప్తున్నారు - నేను ఏ మనిషిలో వస్తానో అర్థము చేసుకోలేరు. వస్తే భారతదేశములోనే రావలసి ఉంటుంది. భారతీయులలో కూడా ఎవరి శరీరములో రావాలి? ప్రెసిడెంటు శరీరములో, సాధు సన్యాసుల శరీరములో వస్తానా? పవిత్ర రథములోనే రావాలని కూడా లేదు. ఇది రావణ రాజ్యము. దూరదేశములో ఉండేవారు...........(దూర్ దేశ్ మే రహనేవాలా ఆయా దేశ్ పరాయే..........) అని గాయనము కూడా ఉంది.
భారతదేశము అవినాశి ఖండమని కకూడా పిల్లలకు తెలుసు. ఇది ఎప్పుడూ వినాశనమవ్వదు. అవినాశి తండ్రి అవినాశి భారత ఖండములోనే వస్తారు. ఏ శరీరములో వస్తారో స్వయం వారే తెలుపుతారు. మరెవ్వరికీ తెలియదు. ఏ సాధు-మహాత్ములలో కూడా రాజాలరని మీకు తెలుసు. వారు హఠయోగులు, నివృత్తి మార్గానికి చెందినవారు. మిగిలింది భారతవాసులైన భక్తులు. భక్తులలో కూడా ఇప్పుడు ఏ భక్తునిలో వస్తారు? పాత భక్తుడుగా, చాలా భక్తి చేసినవారిగా ఉండాలి. భక్తి ఫలితమును ఇచ్చేందుకు భగవంతుడు రావలసి ఉంటుంది. భారతదేశములో అనేకమంది భక్తులున్నారు. ఇతను చాలా గొప్ప భక్తుడు. ఇతనిలోకి రావాలని అంటారు. అలాగైతే ఎంతోమంది భక్తులున్నారు. రేపు ఎవరికైనా వైరాగ్యము వస్తే అతను కూడా భక్తునిగా అయిపోతారు. వారు కేవలం ఈ జన్మకు మాత్రమే భక్తులుగా అవుతారు. ఎవరు మొట్టమొదట భక్తి ప్రారంభము చేశారో, అతడిలోనే నేను వస్తాను. ద్వాపరము నుండి భక్తి ప్రారంభమయ్యింది. ఈ లెక్కాచారము ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. ఇవి చాలా గుప్తమైన విషయాలు. ఎవరైతే మొట్టమొదట భక్తి ప్రారంభించారో అతడిలోనే నేను వస్తాను. ఎవరైతే నంబరువన్ పూజ్యునిగా ఉన్నారో మళ్లీ అతనే నంబరువన్ పూజారిగా కూడా అవుతారు. ఈ రథమే మొదటి నంబరులో వస్తారని స్వయం బాబాయే చెప్తున్నారు. మళ్లీ 84 జన్మలు కూడా ఇతనే తీసుకుంటాడు. నేను ఇతని చాలా జన్మల అంతిమ జన్మలో అంతిమ సమయములో ప్రవేశిస్తాను. ఇతనే మళ్లీ నంబరువన్ రాజుగా అవ్వాలి. ఇతను చాలా భక్తి చేసేవాడు. భక్తికి ఫలితము కూడా ఇతనికే లభించాలి. తండ్రి పిల్లలకు చెప్తున్నారు - ఇతను నా పై ఎలా సమర్పణమయ్యారో చూడండి. సర్వస్వమూ ఇచ్చేశారు. ఇంతమంది పిల్లలకు నేర్పించేందుకు ధనము కూడా కావాలి. ఈశ్వరుడు యజ్ఞాన్ని రచించారు. ఖుదా(భగవంతుడు) ఇతడిలో కూర్చొని రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు. దీనినే చదువు అని కూడా అంటారు. రుద్ర శివబాబా జ్ఞానసాగరులు, జ్ఞానము ఇచ్చేందుకు యజ్ఞాన్ని రచించారు. ఈ పదాలు చాలా ఖచ్ఛితమైనవి. ఇది రాజ్యమును, స్వరాజ్యమును పొందేందుకు చేసే యజ్ఞము. దీనిని యజ్ఞమని ఎందుకంటారు? వారు యజ్ఞములో అనేక ఆహుతులు మొదలైనవి వేస్తారు. మీరు చదువుకుంటున్నారు. మీరు ఏమి ఆహుతి చేస్తారు? మనము చదువుకొని తెలివైనవారిగా అవుతామని మీకు తెలుసు. ఆ తర్వాత ఈ ప్రపంచమంతా ఇందులో స్వాహా అయిపోతుంది. చివరిలో ఏమేమి మిగిలి ఉంటాయో అవన్నీ యజ్ఞములో వేసేస్తారు.
ఇప్పుడు మనలను తండ్రి చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి చాలా సాధారణంగా ఉంటారు. వారిని గూర్చి మనుష్యులకేం తెలుసు. అక్కడి గొప్ప గొప్ప వ్యక్తులకు చాలా మహిమ ఉంటుంది. తండ్రి చాలా సాధారణంగా, సరళంగా కూర్చొని ఉన్నారు. మనుష్యులకు ఎలా తెలియాలి? ఈ దాదా అయితే వజ్రాల వ్యాపారిగా ఉండేవారు. ఇతనిలో ఏ శక్తీ కనిపించదు. కేవలం ఇతనిలో ఏదో శక్తి ఉందని అనేస్తారు, అంతే. ఇతనిలో సర్వశక్తివంతుడైన తండ్రి కూర్చొని ఉన్నారని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇతనిలో ఉన్న శక్తి ఎక్కడి నుండి వచ్చింది? ఇతనిలో తండ్రి ప్రవేశించారు కదా. తండ్రి వద్ద ఉన్న ఖజానాలు ఇలా ఊరికే ఇవ్వరు. మీరు యోగబలము ద్వారా తీసుకుంటారు. వారు సర్వశక్తివంతులు. వారి శక్తులు ఎక్కడికీ వెళ్లిపోవు. పరమాత్మను సర్వశక్తివంతులని ఎందుకు మహిమ చేస్తారో, అది కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రి వచ్చి అన్ని విషయాలు అర్థము చేయిస్తున్నారు. నేను ఎవరిలో ప్రవేశిస్తానో, అతనిలో పూర్తిగా మలినాలు(త్రుప్పు) చేరి ఉన్నాయి. తండ్రి చెప్తున్నారు - పాత దేశములోకి, పాత శరీరములోకి అతని అనేక జన్మల అంతిమములో వస్తాను. ఆత్మలో చేరిన మలినాలను ఎవ్వరూ తొలగించలేరు. అలా తొలగించువారు సద్గురువు ఒక్కరే. వారు సదా పవిత్రంగానే ఉంటారు. ఇది మీరు అర్థము చేసుకుంటారు. ఈ విషయాలన్నీ బుద్ధిలో కూర్చోపెట్టేందుకు కూడా సమయము పడ్తుంది. తండ్రి తన సర్వస్వాన్ని పిల్లలైన మీకు వీలునామా చేస్తారు. తండ్రి జ్ఞానసాగరులు, శాంతిసాగరులు, సర్వస్వమూ పిల్లలకు వీలునామా చేసేస్తారు. వచ్చేది కూడా పాత ప్రపంచములో. ఒకప్పుడు వజ్ర సమానంగా ఉండి, గవ్వ సమానంగా అయిన వారి శరీరములోనే ప్రవేశిస్తారు. అతడిప్పుడు కోటీశ్వరుడిగా ఉండినా కేవలం అల్పకాలము కొరకే. అందరిదీ సమాప్తమైపోతుంది. మీరు సంపన్నంగా అవుతారు. ఇప్పుడు మీరు కూడా విద్యార్థులే, ఇతను కూడా విద్యార్థియే. ఇతడు కూడా అనేక జన్మల తర్వాత చివరి జన్మలో ఉన్నాడు. త్రుప్పు పట్టి ఉంది. ఎవరు బాగా చదువుతారో వారిలోనే తుప్పు ఏర్పడి ఉంది. అతడే అందరికంటే ఎక్కువగా పతితమవుతాడు. మళ్లీ అతడే పావనంగా అవ్వాలి. ఇది తయారైన డ్రామా. తండ్రి సత్యమైన మాటలు వినిపిస్తున్నారు. తండ్రి సత్యమైనవారు. వారెప్పుడూ అసత్యము చెప్పరు. ఈ విషయాలేవీ మనుష్యులు అర్థము చేసుకోలేరు. పిల్లలైన మీరు లేకుంటే మనుష్యులకు ఎలా తెలుస్తాయి? మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. శేష్ఠమైన పదవిని పొందేందుకకు తండ్రిని పూర్తిగా అనుసరించాలి(ఫాలో ఫాదర్). అంతా బాబాకు అర్పించి ట్రస్టీలుగా అయ్యి సంభాళించాలి. పూర్తిగా బలిహారమవ్వాలి. ఆహార-పానీయాలు, ఉండడం, ధరించడం మధ్యస్థంగా, సాధారణంగా ఉంచుకోవాలి. అతిఉన్నతమూ కాదు, అతినీచమూ కాదు.
2. తండ్రి వీలునామా చేసి ఇచ్చిన సుఖము-శాంతి, జ్ఞాన ఖజానాలను ఇతరులకు కూడా ఇవ్వాలి. కళ్యాణకారులుగా అవ్వాలి.
వరదానము :-
'' సర్వ సంబంధాలతో ఒక్క తండ్రిని మీ సాథీగా చేసుకునే సహజ పురుషార్థీ భవ ''
సర్వ సంబంధాలతో తోడు నిభాయిస్తానని తండ్రే స్వయంగా ఆఫర్ చేస్తున్నారు. ఎటువంటి సమయమో, అటువంటి సంబంధముతో తండ్రి జతలో ఉండండి, సాథీగా(స్నేహితునిగా/తోడుగా) చేసుకోండి. ఎక్కడైతే తండ్రి సదా తోడుగా ఉంటారో, సాథీగా కూడా ఉంటారో, అక్కడ ఎలాంటి కష్టమూ ఉండజాలదు. ఎప్పుడైతే స్వయాన్ని ఒంటరిగా అనుభవం చేస్తారో అప్పుడు తండ్రిని బిందు రూపంలో స్మృతి చేయకండి. ప్రాప్తుల లిస్టును ముందుకు తీసుకు రండి. భిన్న భిన్న సమయాలలో చేసిన రమణీయమైన అనుభవాల కథలను స్మృతిలోకి తీసుకు రండి. సర్వ సంబంధాల రసాన్ని అనుభవం చేస్తే శ్రమ సమాప్తమైపోయింది. మీరు సహజ పురుషార్థులుగా అవుతారు.
స్లోగన్ :-
'' బహురూపులుగా అయ్యి మాయ బహు రూపాలను పరిశీలిస్తే (గుర్తిస్తే), మాస్టర్ మాయాపతిగా అవుతారు. ''