16-05-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - మొట్టమొదట మీకు మమ్ములను చదివించువారు స్వయం శాంతి సాగరులు, సుఖసాగరులైన తండ్రియే అని నిశ్చయముండాలి. ఏ మానవుడూ ఎవ్వరికీ సుఖ - శాంతులను ఇవ్వలేరు ''

ప్రశ్న :-

అన్నింటికంటే శ్రేష్ఠమైన గమ్యము ఏది? ఆ గమ్యమును పొందేందుకు పురుషార్థమేది?

జవాబు :-

'' ఒక్క తండ్రి స్మృతి పక్కాగా ఉండాలి, బుద్ధి ఇతర వైపులకు పోరాదు, ఇదే ఉన్నతమైన గమ్యము .'' దీని కొరకు ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థము చేయవలసి వస్తుంది. ఆత్మాభిమానులుగా తయారైనప్పుడు మీలోని అన్ని వికారాల ఆలోచనలు సమాప్తమైపోతాయి. బుద్ధి అన్నివైపుల భ్రమించుట (తిరుగుట) సమాప్తమవుతుంది. దేహము వైపు దృష్టి పోనే పోరాదు. ఇదే మీ గమ్యము. అందుకొరకు ఆత్మాభిమానులుగా అవ్వండి.

ఓంశాంతి.

ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు - ఇతనిని(బ్రహ్మాబాబా) ఆత్మిక తండ్రి అని అనరు. ఈ రోజును సద్గురువారము అని అంటారు. గురువారము అనుట తప్పు. సద్గురువారము అని అనాలి. గురువులైతే అనేక మంది ఉన్నారు, కానీ సద్గురువు ఒక్కరే. చాలా మంది స్వయాన్ని గురువునని పిలిపించుకుంటారు. సద్గురువని కూడా అనిపించుకుంటారు. గురువు, సద్గురువుకు ఎంత తేడా ఉందో పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. సత్యము అనగా ట్రూత్‌ . సత్యము అని ఒక్క నిరాకార తండ్రినే అంటారు, మనుష్యులను అనరు. సత్య జ్ఞానమును జ్ఞానసాగరులైన తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి ఇస్తారు. మనిషి మనిషికి ఎప్పుడూ సత్యమైన జ్ఞానము ఇవ్వలేరు. ఒక్క నిరాకార తండ్రి మాత్రమే సత్యమైనవారు. ఇతని పేరు బ్రహ్మ, ఇతను ఎవ్వరికీ జ్ఞానము ఇవ్వజాలడు. బ్రహ్మలో ఏ మాత్రము జ్ఞానము ఉండేది కాదు. ఇప్పుడు కూడా ఇతనిలో సంపూర్ణ జ్ఞానము లేదని అంటారు. సంపూర్ణ జ్ఞానము జ్ఞానసాగరులైన పరమపిత పరమాత్మలో మాత్రమే ఉంది. స్వయాన్ని సద్గురువు అని అనిపించుకోగల మానవులు ఎవ్వరూ లేరు. సద్గురువు అనగా సంపూర్ణ సత్యము. మీరు సత్యంగా తయారైతే తర్వాత ఈ శరీరము ఉండదు. మానవులను ఎప్పుడూ సద్గురువు అని అనరాదు. మనుష్యులలో పైసా భాగము కూడా శక్తి లేదు. నేను కూడా మీ వంటి మనిషినేనని ఇతడు స్వయంగా చెప్తున్నాడు. ఇందులో శక్తి విషయమే లేదు. చదివించేది ఆ తండ్రి, ఈ బ్రహ్మ కాదు. ఈ బ్రహ్మ కూడా వారి ద్వారా చదువుకొని తర్వాత చదివిస్తారు. బ్రహ్మకుమార - కుమారీలు అని అనబడే మీరు కూడా పరమపిత పరమాత్మ సద్గురువు ద్వారా చదువుతున్నారు. మీకు వారి నుండి శక్తి లభిస్తుంది. శక్తి అనగా ఎవరినైనా ముష్ఠిఘాతము(ఘూసా)తో క్రింద పడవేయడం కాదు. ఇది ఆత్మిక శక్తి. ఇది ఆత్మిక తండ్రి ద్వారా లభిస్తుంది. స్మృతి బలము ద్వారా మీరు శాంతిని పొందుతారు, చదువు ద్వారా మీకు సుఖము లభిస్తుంది. ఎలాగైతే ఇతర టీచర్లు మిమ్ములను చదివిస్తారో, అలా తండ్రి కూడా చదివిస్తారు. ఇతడు కూడా చదువుకుంటున్నాడు. కనుక ఇతడు కూడా ఒక విద్యార్థియే. దేహధారులందరూ విద్యార్థులే. తండ్రికి అయితే దేహమే లేదు. వారు నిరాకారులు, వారే వచ్చి చదివిస్తున్నారు. ఇతర విద్యార్థులు ఎలా చదువుతున్నారో అలా మీరు కూడా చదువుకుంటున్నారు. ఇందులో కష్టపడే మాటే లేదు. చదువుకునే సమయములో సదా బ్రహ్మచర్యములో ఉంటారు. బ్రహ్మచర్యములో ఉండి చదువుకుంటారు. చదువు పూర్తి అవుతూనే వికారాలలో పడిపోతారు. చూచేందుకు మనుష్యులు మనుష్యులుగానే కనిపిస్తారు. వీరు ఫలానా వ్యక్తి, వీరు ఎల్‌.ఎల్‌.బి, వీరు ఫలానా ఆఫీసరు అని అంటారు. ముఖమేమో అదే కానీ చదువును బట్టి బిరుదు లభిస్తుంది. ఆ భౌతిక చదువు గురించి మీకు తెలుసు. సాధు-సన్యాసులు మొదలైనవారు ఎవరైతే శాస్త్రాలు చదువుతూ చదివిస్తూ ఉంటారో వారిలో గొప్పతనము ఏదీ లేదు, వారి ద్వారా ఎవ్వరికీ శాంతి లభించదు. స్వయం వారు కూడా శాంతి కొరకు ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. అడవిలో శాంతి లభిస్తే మళ్లీ వాపసు ఎందుకు వస్తారు? ముక్తినైతే ఎవ్వరూ పొందలేరు. రామకృష్ణ పరమహంస మొదలైనవారు ఎవరైతే మంచి-మంచి పేరు ప్రసిద్ధి పొంది వెళ్ళారో వారు కూడా పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ క్రిందికే వచ్చారు. ముక్తి-జీవన్ముక్తులను ఎవ్వరూ పొందలేరు. తమోప్రధానంగా అయ్యే తీరాలి. పైకి ఏ మాత్రము కనిపించదు. మీకు గురువు నుండి ఏమి లభిస్తుంది అని ఎవరినైనా అడిగితే, శాంతి లభిస్తుంది అని అంటారు. కానీ కొంచెం కూడా లభించదు. శాంతి అంటే వారికి అర్థమే తెలియదు. బాబా జ్ఞానసాగరులు, మరి ఏ సాధుసత్పుర్షులు, గురువులు మొదలైనవారు శాంతిసాగరులు అయ్యేందుకు వీలు లేదు అని పిల్లలైన మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. మానవులు ఎవ్వరికీ సత్యమైన శాంతిని ఇవ్వలేరు. శాంతిసాగరులు తండ్రి ఒక్కరేనని వారే మమ్ములను చదివిస్తున్నారని పిల్లలైన మీరు మొదట నిశ్చయము చేసుకోవాలి. సృష్టిచక్రము ఎలా తిరుగుతూ ఉందో అది కూడా తండ్రి అర్థం చేయించారు. మనిషి మనుష్యులకు ఎప్పుడూ సుఖ-శాంతులను ఇవ్వలేరు. ఈ బ్రహ్మ వారి రథము. ఇతడు కూడా మీ వంటి విద్యార్థియే. ఇతడు కూడా గృహస్థ వ్యవహారములో ఉండేవాడు. కేవలం వానప్రస్థ స్థితిలో తన రథమును తండ్రికి అప్పుగా(లోనుగా) ఇచ్చాడు. మీకు అర్థము చేయించువారు ఒక్క తండ్రి మాత్రమే. ఆ తండ్రే అందరూ నిర్వికారులుగా అవ్వాలని చెప్తున్నారు. స్వయం తయారు అవ్వలేనివారు అనేక రకాలైన మాటలు మాట్లాడ్తారు, తిట్టు మాటలు కూడా మాట్లాడ్తారు. జన్మ-జన్మాంతరాల సంపాదన(భోజనము) ఏదైతే తండ్రి(లౌకిక) నుండి వారసత్వముగా లభించిందో దానిని విడిపిస్తున్నారని భావిస్తారు. ఇప్పుడు విడిపించేవారు ఆ అనంతమైన తండ్రియే కదా. ఈ బ్రహ్మను కూడా వారే విడిపించారు. పిల్లలను కూడా రక్షించేందుకు ప్రయత్నించారు. వెలుపలకు రాగలిగిన వారిని వెలుపలికి తీశారు. మనలను చదివిస్తున్నవారు ఏ మానవ మాత్రుడు కాదని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. సర్వశక్తివంతుడు అని ఒక్క నిరాకార తండ్రిని మాత్రమే అంటారు. మరి ఏ ఇతరులనూ ఇలా అనరాదు. వారే మీకు జ్ఞానమును ఇస్తున్నారు. తండ్రే మీకు అర్థం చేయిస్తున్నారు - ఈ వికారాలు మీకు పెద్ద శత్రువులు, వీటిని వదిలేయండి. వదలలేనివారు ఎంతగానో కొట్లాడ్తారు. మాతలలో కూడా కొంతమంది వికారాల కొరకు పెద్ద గొడవ చేసేవారు వెలువడ్తారు.

ఇప్పుడు మీరు సంగమ యుగములో ఉన్నారు. ఇది పురుషోత్తమ సంగమ యుగమని కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రి ఎంతో మంచిరీతిగా అర్థం చేయిస్తున్నారు. సంపూర్ణ నిశ్చయము కలిగినవారు చాలామంది ఉన్నారు. కొంతమందికి సగము నిశ్చయము మాత్రమే ఉంది. కొంతమందికి 100 శాతము, కొంతమందికి 10 శాతము మాత్రమే ఉంది. ఇప్పుడు భగవంతుడు శ్రీమతమునిస్తున్నారు - పిల్లలూ! నన్ను స్మృతి చేయండి. ఇది తండి ఇచ్చే గొప్ప ఆజ్ఞ. నిశ్చయము ఉన్నప్పుడు మాత్రమే ఆ ఆజ్ఞను పాలన చేస్తారు కదా. తండ్రి చెప్తున్నారు - నా మధురమైన పిల్లలూ! స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇతనిని స్మృతి చేయరాదు. మీకు చెప్పేది నేను(బ్రహ్మ) కాదు. బాబా నా ద్వారా మీకు చెప్తున్నారు. పిల్లలైన మీరు ఎలా చదువుతున్నారో అలాగే ఇతను(బ్రహ్మ) కూడా చదువుతున్నాడు. అందరూ విద్యార్థులే, చదివించే టీచరు వారు ఒక్కరే. అక్కడంతా మనుష్యులే చదివిస్తారు. ఇచ్చట మిమ్ములను ఈశ్వరుడు చదివిస్తారు. ఆత్మలైన మీరు చదువుతున్నారు. ఆత్మలైన మీరు మళ్లీ ఇతర ఆత్మలను చదివిస్తారు. ఇందులో చాలా ఆత్మాభిమానిగా అవ్వాలి. బ్యారిష్టర్‌, ఇంజినీరుగా అయ్యేది ఆత్మనే. ఆత్మకు ఇప్పుడు దేహాభిమానము వచ్చేసింది. ఆత్మాభిమానికి బదులు దేహాభిమానిగా అయిపోయారు. ఆత్మ-అభిమానులుగా అయినప్పుడు వికారులని అనబడజాలరు. వారికి ఎప్పుడూ వికారీ ఆలోచనలు కూడా రావు. దేహాభిమానము వల్లనే వికారి ఆలోచనలు వస్తాయి. వికార దృష్టితోనే చూస్తారు. దేవతలకు ఎప్పుడూ వికార దృష్టి ఉండదు. జ్ఞానము ద్వారా మళ్లీ దృష్టి పరివర్తనైపోతుంది. సత్యయుగములో ఈ విధంగా ప్రేమించుకోరు, డాన్స్‌ చేయరు. అచ్చట ప్రేమిస్తారు కానీ వికారాల చెడు వాసన(దుర్వాసన)ఉండదు. జన్మ-జన్మాంతరముల నుండి వికారములలోకి వెళ్లారు. కావున ఆ నషా చాలా కష్టంగా దిగుతుంది. తండ్రి నిర్వికారులుగా చేస్తారు. అందువలన చాలామంది ఆడపిల్లలు చాలా శక్తివంతంగా అవుతారు. మేమిప్పుడు పూర్తి నిర్వికారులుగా అవ్వాలి. మేము ఒంటరిగా ఉండేవారము, ఒంటరిగానే వెళ్లాలని భావిస్తారు. వారిని ఎవరైనా కొంచెము తగిలినా వారికి నచ్చదు. ఇతను నాకు చేయి ఎందుకు తగిలించాలి, ఇతనిలో వికారాల వాసన ఉంది అని అంటారు. వికారులు మమ్ములను తగలను కూడా తగలరాదు అని అంటారు. ఈ గమ్యానికి చేరుకోవాలి. దేహము వైపు దృష్టి ఏమాత్రము పోరాదు. అటువంటి కర్మాతీత స్థితిని ఇప్పుడే తయారు చేసుకోవాలి. కేవలం ఆత్మనే చూచేవారిగా ఇంకా తయారవ్వలేదు. ఇదే గమ్యము. తండ్రి ఎల్లప్పుడూ చెప్తూనే ఉన్నారు - పిల్లలూ! స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ శరీరము ఒక తోక వంటిది. అందులో ఉండి మీరు పాత్ర చేస్తున్నారు.

ఇతనిలో శక్తి ఉందని చాలామంది అంటారు కానీ శక్తిని గురించిన విషయమే లేదు. ఇది ఒక చదువు. ఇతరులు ఎలా చదువుతారో ఇతడు కూడా అలాగే చదువుతున్నాడు. పవిత్రత కొరకు ఎంతో తల కొట్టుకోవలసి వస్తుంది. ఇది చాలా శ్రమతో కూడిన పని. అందువలన తండ్రి అంటున్నారు - ఒకరినొకరు ఆత్మగానే చూడండి. సత్యయుగములో కూడా మీరు ఆత్మాభిమానులుగా ఉంటారు. అచ్చట రావణరాజ్యమే ఉండదు. వికారాల మాటే లేదు. ఇక్కడ రావణ రాజ్యములో అందరూ వికారులే, అందుకే తండ్రి వచ్చి నిర్వికారులుగా తయారు చేస్తున్నారు. తయారవ్వకుంటే శిక్షలు అనుభవించవలసి వస్తుంది. ఆత్మ పవిత్రమవ్వకుండా పైకి పోలేదు. లెక్కాచారము చుక్తా చేసుకోవలసి వస్తుంది. అయినా పదవి తగ్గిపోతుంది. రాజధాని స్థాపనవుతూ ఉంది. స్వర్గములో ఒకే ఒక ఆదిసనాతన దేవీ-దేవతల రాజ్యముండేదని పిల్లలైన మీకు తెలుసు. మొట్టమొదట తప్పకుండా ఒకే రాజు-రాణి ఉంటారు. తర్వాత వంశము ఏర్పడ్తుంది. ప్రజలు అనేకమంది తయారవుతారు. వారి అవస్థలలో తేడాలుంటాయి. పూర్తిగా నిశ్చయము లేనివారు చదువు కూడా పూర్తిగా చదవలేరు. పవిత్రంగా అవ్వలేరు. అర్ధకల్పపు పతితులు ఒక్క జన్మలో 21 జన్మలకు పావనంగా తయారవ్వడం పిన్నమ్మ ఇల్లా!(సులభము కాదు). ముఖ్యమైనది కామవికారము. క్రోధము మొదలైన వికారాలు అంత పెద్దవి కావు. బుద్ధి ఎక్కడికైనా వెళ్తే తండ్రిని స్మృతి చేయరు. తండ్రి స్మృతి పక్కా అయితే ఇతర వైపులకు బుద్ధి పోదు. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. పవిత్రత మాట విని కోపాగ్నిలో కాలిపోతారు. ఈ మాట ఇంతవరకు ఎవరూ చెప్పనే లేదు అని అంటారు. ఈ మాటలు ఏ శాస్త్రాలలో లేవు అని అంటారు. చాలా కష్టంగా అర్థము చేసుకుంటారు. వారిది నివృత్తి మార్గము. వారి ధర్మమే వేరు. వారు పునర్జన్మలు తీసుకుని మళ్లీ సన్యాస ధర్మములోకే పోతారు, అదే సంస్కారము తీసుకుపోతారు. మీరు ఇల్లు-వాకిలి వదలరాదు. భలే ఇంటిలో ఉండండి, ఇంటిలోని వారికి కూడా ఇది సంగమ యుగము అని తెలపండి. పవిత్రులుగా అవ్వకుంటే సత్యయుగములో దేవీ దేవతలుగా అవ్వలేరు. జ్ఞానము కొద్దిగా విన్నా వారు ప్రజలుగా అవుతారు. ప్రజలు చాలా మంది ఉంటారు కదా. సత్యయుగములో మంత్రులు కూడా ఉండరు. ఎందుకంటే తండ్రి సంపూర్ణ జ్ఞానులుగా తయారు చేస్తారు. మంత్రులు మొదలైనవారు అజ్ఞానులకు అవసరము. ఇప్పుడు ఒకరినొకరు చంపుకుంటూ ఎలా ఉన్నారో చూడండి, శతృ స్వభావము చాలా కఠినమైనది. ఇప్పుడు మనము ఈ పాత శరీరము వదిలి మరొకటి తీసుకుంటామని మీకు తెలుసు. ఇదేమైనా పెద్ద విషయమా, వారు దుఃఖముతో మరణిస్తారు. మీరు సుఖంగా తండ్రి స్మృతిలో వెళ్ళాలి. తండిన్రైన నన్ను ఎంత ఎక్కువగా స్మృతి చేస్తే అంత మిగిలిన వాటన్నింటినీ మర్చిపోతారు. ఎవ్వరూ గుర్తుండరు. అయితే పక్కా నిశ్చయమున్నప్పుడే ఈ స్థితి కలుగుతుంది. నిశ్చయము లేకుంటే స్మృతి కూడా నిలువదు. కేవలం నామమాత్రంగా చెప్తుంటారు. నిశ్చయమే లేకుంటే ఎవరిని స్మృతి చేస్తారు? అందరికీ ఒకే విధమైన నిశ్చయము లేదు కదా. మాయ నిశ్చయాన్ని తొలగింపజేస్తుంది. మొదట ఎలా ఉండేవారో మళ్లీ అలాగే అవుతారు. మొదట తండ్రి పై నిశ్చయముండాలి. వీరు తండ్రి కాదని సంశయము కలుగుతుందా? అనంతమైన తండ్రియే జ్ఞానమిస్తున్నారు. ఇతడు(ఈ బ్రహ్మ) సృష్టి రచయిత, రచన గురించి నాకు తెలియదని అనేవాడు. నాకు ఎవరైనా వినిపిస్తారని భావించేవాడిని. నేను 12 మంది గురువులను ఆశ్రయించాను. వారందరిని వదలవలసి వచ్చింది. గురువులైతే నాకు జ్ఞానము ఇవ్వలేదు. అకస్మాత్తుగా నాలో సద్గురువు ప్రవేశించారు. ఏమి జరుగుతుందో ఏమో అని భావించాను. అర్జునునికి కూడా సాక్షాత్కారము చేయించారని గీతలో కూడా ఉంది కదా. వాస్తవానికి అర్జునుని మాట కాదు, ఇది రథము కదా. ఇతడు కూడా మొదట గీత చదివేవాడు. తండ్రి ప్రవేశించాడు - జ్ఞానాన్ని ఇచ్చేవారు తండ్రియే అని సాక్షాత్కారము చేయించారు. కావున ఆ గీతను వదిలేశాడు. తండ్రి జ్ఞానసాగరులు. మనకు వారే తెలుపుతారు కదా. గీతనే తల్లి-తండ్రి. ఆ తండిన్రే త్వమేవ మాతాశ్చపితా...... అని అంటారు. వారు రచనను రచిస్తారు, దత్తు తీసుకుంటారు కదా. ఈ బ్రహ్మ కూడా మీలాగే ఉన్నాడు. ఇతనికి వానప్రస్థ స్థితి వచ్చినప్పుడు నేను ఇతనిలో ప్రవేశిస్తానని తండ్రి చెప్తున్నారు. కుమారీలంటేనే పవిత్రంగా ఉండేవారు. పవిత్రంగా ఉండుట వారికి చాలా సులభము. వివాహము తర్వాత ఎన్నో సంబంధాలు పెరుగుతాయి. అందువలన దేహీ-అభిమానులుగా అయ్యేందుకు శ్రమ కలుగుతుంది. వాస్తవానికి ఆత్మ శరీరానికి భిన్నంగా ఉంటుంది. కానీ అర్ధకల్పము దేహాభిమానములో ఉంటారు. అంతిమ జన్మలో తండ్రి వచ్చి ఆత్మాభిమానులుగా చేస్తున్నారు. అందువలన కష్టమనిపిస్తుంది. పురుషార్థము చేస్తూ చేస్తూ చాలా కొంతమంది మాత్రమే పాస్‌ అవుతారు. అష్టరత్నాలు మాత్రమే వెలువడ్తారు. స్వయాన్ని మా లైను క్లియర్‌గా ఉందా? అని పశ్న్రించుకోండి. ఒక్క తండి తప్ప ఇంకేమీ గుర్తు రావడం లేదు కదా ? ఈ స్థితి చివరిలో వస్తుంది. ఆత్మాభిమానిగా తయారవ్వడంలో చాలా శ్రమ ఉంది. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. జ్ఞానము ద్వారా మీ దృష్టిని పరివర్తన చేసుకోవాలి. ఆత్మాభిమానులై వికారీ ఆలోచనలను సమాప్తము చేసుకోవాలి. ఏ వికారాల చెడువాసన ఉండరాదు, దేహము వైపు కొద్దిగా కూడా దృష్టి వెళ్లరాదు.

2. బేహద్‌ తండ్రియే మనలను చదివిస్తున్నారని పక్కా నిశ్చయముంటే స్మృతి శక్తిశాలిగా ఉంటుంది. నిశ్చయాన్ని మాయ కొద్దిగా కూడా కదిలించరాదని గమనముండాలి.

వరదానము :-

'' పవిత్రత పునాది ద్వారా సదా శ్రేష్ఠ కర్మలు చేసే పూజ్య ఆత్మా భవ ''

పవిత్రత పూజ్యులుగా చేస్తుంది. ఎవరైతే సదా శ్రేష్ఠ కర్మలు చేస్తారో వారే పూజ్యులుగా అవుతారు. కానీ పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యమే కాదు, సంకల్పంలో కూడా ఎవ్వరి పట్ల నెగటివ్‌ సంకల్పము ఉత్పన్నమవ్వరాదు, మాటలు కూడా అయ్యథార్థంగా ఉండరాదు, సంబంధ-సంపర్కంలో కూడా తేడా ఉండరాదు. అందరితో ఒకే రకమైన మంచి సంబంధముండాలి. మనసా-వాచా- కర్మణా దేనిలోనూ పవిత్రత ఖండితమవ్వరాదు. అప్పుడు వారిని పూజ్య ఆత్మలని అంటారు. ''నేను పరమ పూజ్య ఆత్మను'' - ఈ స్మృతి ద్వారా పవిత్రతా పునాదిని గట్టి చేసుకోండి.

స్లోగన్‌ :-

'' సదా '' వాహ్‌ రే నేను '' అనే అలౌకిక నశాలో ఉంటే మనసు మరియు శరీరముతో సంతోషముతో న్యాచురల్‌గా డాన్స్‌ చేస్తూ ఉంటారు. ''