12-07-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - ఈ అనాది డ్రామా తిరుగుతూనే ఉంటుంది. టిక్‌ - టిక్‌ అంటూ ఉంటుంది. ఇందులో ఒకరి పాత్ర ఉన్న విధంగా మరొకరి పాత్ర ఉండదు. దీనిని యదార్థంగా అర్థం చేసుకొని సదా హర్షితంగా ఉండాలి.''

ప్రశ్న :-

భగవంతుడు వచ్చేశారని ఏ యుక్తి ద్వారా ఋజువు చేసి చెప్పగలరు?

జవాబు :-

భగవంతుడు వచ్చేశారని ఎవ్వరితోనూ నేరుగా చెప్పరాదు. ఇలా చెప్తే మనుష్యులు ఎగతాళి చేస్తారు, విమర్శిస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో తమను తాము భగవంతుడనని చెప్పుకునేవారు చాలా మంది ఉన్నారు. అందువలన మీరు యుక్తిగా మొదట ఇద్దరు తండ్రుల పరిచయమునివ్వండి. ఒకరు హద్దు తండ్రి, మరొకరు బేహద్‌ తండ్రి. హద్దు తండ్రి ద్వారా హద్దు వారసత్వము లభిస్తుంది. ఇప్పుడు అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వమును ఇస్తున్నారని చెప్తే అర్థము చేసుకుంటారు.

ఓంశాంతి.

ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. సృష్టి అయితే ఇదే కదా. అర్థం చేయించేందుకు తండ్రి కూడా ఇక్కడకే రావలసి వస్తుంది. మూలవతనములో అయితే అర్థం చేయించరు. స్థూలవతనములోనే అర్థం చేయించడం జరుగుతుంది. పిల్లలందరూ పతితంగా ఉన్నారని తండ్రికి తెలుసు. ఎందుకూ పనికిరాకుండా ఉన్నారు. ఈ ప్రపంచములో దు:ఖమే దు:ఖముంది. మీరిప్పుడు విషయ సాగరములో పడి ఉన్నారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మొదట క్షీరసాగరములో ఉండేవారు. విష్ణుపురిని క్షీరసాగరమని అంటారు. ఇప్పుడిక్కడ క్షీరసాగరమైతే ఉండదు. కనుక ఇక్కడ ఒక సరస్సు తయారుచేశారు. అక్కడైతే పాల నదులు ప్రవహించేవని చెప్తారు. అక్కడ ఆవులు కూడా ఫస్ట్‌క్లాస్‌గా చాలా ప్రసిద్ధి చెందినవి. ఇక్కడైతే మానవులు కూడా జబ్బు పడ్తారు. అక్కడైతే ఆవులు కూడా ఎప్పటికీ జబ్బు పడవు. ఫస్ట్‌ క్లాస్‌గా ఉంటాయి. జంతువులు మొదలైనవేవీ జబ్బు పడవు. అక్కడికి, ఇక్కడికి చాలా తేడా ఉంది. తండ్రియే వచ్చి ఈ విషయాలను తెలుపుతున్నారు. ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. ఇది పురుషోత్తమ సంగమ యుగమని మీకు తెలుసు. తండ్రి వచ్చినప్పుడు అందరినీ వాపస్‌ తీసుకువెళ్తారు. పిల్లలు కొందరు 'అల్లాహ్‌' అని, కొందరు 'గాడ్‌' అని, కొందరు భగవంతా! అని వేడుకుంటారని తండ్రి చెప్తున్నారు. నాకు చాలా పేర్లు పెట్టేశారు. మంచి - చెడు ఏ పేరు తోచితే ఆ పేరు పెట్టేశారు. బాబా వచ్చారని మీకు తెలుసు, ప్రపంచానికి తెలియదు. 5 వేల సంవత్సరాల క్రితము అర్థం చేసుకున్నవారే ఇప్పుడు అర్థం చేసుకుంటారు. అందుకే కోటిలో కొందరు, కొందరిలో కూడా ఏ కొందరో అని మహిమ ఉంది. నేనెవరో, ఎలా ఉన్నానో, పిల్లలైన మీకు ఏమి నేర్పిస్తానో అది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీరు తప్ప మరెవ్వరూ అర్థము చేసుకోలేరు. మనము ఏ సాకారము ద్వారా చదువుకోవడం లేదు, నిరాకారుడే చదివిస్తున్నాడు. నిరాకారుడు పైన ఉంటారు. వారెలా చదివిస్తారు! అని మనుష్యులు తప్పకుండా తికమక పడతారు. నిరాకార ఆత్మలైన మీరు కూడా పైననే ఉంటారు. మళ్లీ ఈ సింహాసనము పైకి వస్తారు. ఈ సింహాసనము వినాశి. ఆత్మ అవినాశి. అది ఎప్పటికీ మృత్యువును పొందదు. శరీరము మృత్యువును పొందుతుంది. ఇది చైతన్యమైన సింహసనము. అమృతసర్‌లో కూడా అవినాశి(అకాల) సింహాసనముంది కదా. ఆ సింహాసనము కొయ్యతో చేసింది. ఆత్మ అవినాశి అని దానిని ఎప్పటికీ మృత్యువు కబళించదని, అమాయకులైన వారికి తెలియదు. అకాలమూర్తి(అవినాశి) ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. దానికి కూడా రథము కావాలి కదా. నిరాకార తండ్రికి కూడా తప్పకుండా మానవ రథము కావాలి. ఎందుకంటే తండ్రి జ్ఞానసాగరులు, జ్ఞానేశ్వరులు. ఇప్పుడు జ్ఞానేశ్వర్‌ అనే పేరు చాలా మందికి ఉంది. స్వయాన్ని ఈశ్వరుడని భావిస్తారు కదా. భక్తిలోని శాస్త్రాలలోని విషయాలను వినిపిస్తారు. జ్ఞానేశ్వర్‌ అని పేరు పెడ్తారు. జ్ఞానేశ్వర్‌ అనగా జ్ఞానమునిచ్చే ఈశ్వరుడు. వారు జ్ఞానసాగరులు. వారినే గాడ్‌ఫాదర్‌ అని అంటారు. ఇక్కడైతే అనేక మంది భగవంతులుగా అయ్యారు. చాలా ఎక్కువ గ్లాని జరిగినప్పుడు, చాలా పేదవారిగా తయారైనప్పుడు, దు:ఖితులుగా అయినప్పుడే తండ్రి వస్తారు. తండ్రిని పేదల పెన్నిధి అని అంటారు. చివరికి పేదల పెన్నిధి అయిన తండ్రి వచ్చే రోజు వస్తుంది. తండ్రి వచ్చి స్వర్గస్థాపన చేస్తున్నారని పిల్లలకు తెలుసు. అక్కడేమో చాలా ధనముంటుంది. అక్కడ ధనాన్ని ఎప్పుడూ లెక్కించరు. ఇక్కడ ఎన్ని అరబ్‌ ఖరబ్‌లు(కోటానుకోట్లు) ఖర్చు అయ్యాయని లెక్కిస్తారు. అక్కడ ఈ విషయాలే ఉండవు. లెక్కలేనంత ధనముంటుంది.

మనలను ఇంటికి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారని పిల్లలైన మీకిప్పుడు తెలిసింది. పిల్లలు తమ ఇంటిని మర్చిపోయారు. భక్తిమార్గములో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. దీనిని రాత్రి అని అంటారు. భగవంతుని వెతుకుతూనే ఉంటారు. కానీ భగవంతుడు ఎవ్వరికీ లభించడు. ఇప్పుడు భగవంతుడు వచ్చారని కూడా పిల్లలైన మీకు తెలుసు. నిశ్చయము కూడా ఉంది. అలాగని అందరికీ దృఢ నిశ్చయముందని కాదు. ఎప్పుడో ఒకప్పుడు మాయ మరపింపజేస్తుంది. అందుకే తండ్రి చెప్తారు - ''ఆశ్చర్యపడునట్లు నన్ను చూస్తారు, నా పిల్లలుగా అవుతారు, ఇతరులకు వినిపిస్తారు''. అయినా మాయ తరిమేస్తుంది. ''ఓహో మాయా! నీవు ఎంత శక్తిశాలివి'' అని బాబా అంటారు. చాలా మంది పారిపోయారు. విడాకులిచ్చేవారిగా అవుతారు. తర్వాత వారు ఎక్కడికెళ్లి జన్మ తీసుకుంటారు. చాలా కనిష్టమైన జన్మ తీసుకుంటారు. పరీక్షలో పాస్‌ అవ్వరు. ఇది మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే పరీక్ష. అందరూ నారాయణునిగా అవుతారని తండ్రి అనరు. ఎవరు బాగా పురుషార్థము చేస్తారో, వారు పదవి కూడా మంచిది పొందుతారు. ఇతరులను కూడా మనుష్యుల నుండి దేవతలుగా చేయు పురుషార్థమును చేయిస్తూ అనగా తండ్రి పరిచయమునిస్తున్న మంచి పురుషార్థులెవరో తండ్రికి తెలుసు. ఈ రోజుల్లో అపోజిషన్‌లో మనుష్యులు స్వయాన్ని తామే భగవంతుడని చెప్పుకుంటున్నారు. మిమ్ములను అబలలుగా భావిస్తారు. ఇప్పుడు భగవంతుడు వచ్చారని వారికి ఎలా అర్థం చేయించాలి. అలా నేరుగా చెప్తే ఎవ్వరూ అంగీకరించరు. కావున అర్థం చేయించేందుకు యుక్తి కూడా కావాలి. భగవంతుడు వచ్చారని ఎప్పుడూ ఎవ్వరికీ నేరుగా చెప్పరాదు. మీకు ఇద్దరు తండ్రులున్నారు, ఒకరు పారలౌకిక బేహద్‌ తండ్రి, మరొకరు లౌకిక హద్దు తండ్రి అని అర్థం చేయించాలి. వీరు నిజమే చెప్తున్నారని వారు అర్థం చేసుకునే విధంగా తండ్రి పరిచయమునివ్వాలి. అనంతమైన తండ్రి ద్వారా వారసత్వము లభిస్తుందని ఎవ్వరికీ తెలియదు. వారసత్వము తండ్రి నుండి మాత్రమే లభిస్తుంది. మనుష్యులకు ఇద్దరు తండ్రులున్నారని ఎవ్వరూ ఎప్పుడూ చెప్పరు. లౌకిక హద్దు తండ్రి ద్వారా హద్దు వారసత్వము మరియు పారలౌకిక అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన ఆస్తి అనగా నూతన ప్రపంచపు ఆస్తి లభిస్తుందని మీరు నిరూపించి చెప్తారు. కొత్త ప్రపంచము అనగా స్వర్గము. దానిని తండ్రి వచ్చినప్పుడే ఇస్తారు. ఆ తండ్రి నూతన సృష్టిని రచిస్తారు. అంతేకాని భగవంతుడు వచ్చేశారని చెప్తే ఎప్పటికీ అంగీకరించరు. ఇంకా ఎదిరిస్తారు. విననే వినరు. సత్యయుగములో అయితే అర్థం చేయించడం జరగదు. తండ్రి వచ్చి శిక్షణ ఇచ్చే సమయములోనే అర్థం చేయించవలసి వస్తుంది. సుఖములో ఎవ్వరూ స్మరించరు. దు:ఖములో అందరూ స్మరిస్తారు. కావున ఆ పారలౌకిక తండ్రినే దు:ఖహర్త-సుఖకర్త అని అంటారు. దు:ఖము నుండి విడిపించి మార్గదర్శులుగా అయ్యి మళ్లీ తమ మధురమైన ఇంటికి తీసుకెళ్తారు. దానిని మధురమైన నిశ్శబ్ధముగా ఉన్న ఇల్లు(స్వీట్‌ సైలెన్స్‌ హోమ్‌) అని అంటారు. అక్కడికి మనమెలా వెళ్తామో ఎవ్వరికీ తెలియదు. రచయిత గురించి గాని, రచన ఆదిమధ్యాంతాల గురించి గాని తెలియదు. మనలను నిర్వాణధామానికి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారని మీకు తెలుసు. ఆత్మలందరినీ తీసుకెళ్తారు. ఒక్కరిని కూడా వదిలిపెట్టరు. అది ఆత్మల ఇల్లు. ఇది శరీరాల ఇల్లు. కావున మొట్టమొదట తండ్రి పరిచయమునివ్వాలి. వారు నిరాకార తండ్రి. వారిని పరమపిత అని కూడా అంటారు. పరమపిత అను పదము సరియైనది. అంతేకాక మధురమైనది. కేవలం భగవంతుడా, ఈశ్వరా! అని అన్నందున వారసత్వపు సుగంధము రాదు మీరు పరమపితను స్మృతి చేస్తే వారసత్వము లభిస్తుంది. వారు తండ్రి కదా. సత్యయుగమును సుఖధామమని అంటారని పిల్లలకు కూడా తెలుసు. స్వర్గమును శాంతిధామమని అనరు. ఆత్మలున్న స్థానమును శాంతిధామము అని అంటారు. ఈ విషయాలన్నీ బుద్ధిలో పక్కా చేసుకోండి.

తండ్రి చెప్తున్నారు - మీరు ఈ వేదశాస్త్రాలు మొదలైనవి చదివినందున ఏమీ ప్రాప్తించదు. భగవంతుని పొందుకునేందుకే శాస్త్రాలను చదువుతారు. అయితే శాస్త్రాలను చదవడం ద్వారా నేనెవ్వరికీ లభించనని ఆ భగవంతుడే చెప్తున్నారు. పతిత ప్రపంచము పావనంగా తయారు చేయమని నన్ను ఇక్కడికి పిలుస్తారు. ఈ విషయాలెవ్వరూ అర్థము చేసుకోరు. రాతిబుద్ధి గలవారు కదా. పాఠశాలలో పిల్లలు చదవకపోతే నీది రాతి బుద్ధి(మొద్దు బుద్ధి) అని అంటారు కదా. సత్యయుగములో అలా అనరు. అనంతమైన తండ్రియైన పరమపితయే పారసబుద్ధిగా(బంగారు బుద్ధిగా) తయారు చేస్తారు. ఈ సమయంలో మీరు తండ్రితో ఉన్నారు కాబట్టి మీది పారసబుద్ధిగా ఉంది. మళ్లీ సత్యయుగములో ఒక్క జన్మ ఆలస్యంగా వచ్చినా బుద్ధిలో తప్పకుండా వ్యతాసముంటుంది. 1250 సంవత్సరాలకు 2 కళలు తగ్గిపోతాయి. క్షణ-క్షణము 1250 సంవత్సరాలలో కళలు తగ్గుతూ ఉంటాయి. మీరు తండ్రి వలె జ్ఞానసాగరులుగా, సుఖసాగరులుగా తయారైనప్పుడు మీ జీవితము చాలా ఖచ్ఛితంగా తయారౌతుంది. అన్ని వారసత్వాలు తీసేసుకుంటారు. తండ్రి వచ్చేదే వారసత్వము ఇచ్చేందుకు. మొట్టమొదట మీరు శాంతిధామములోకి వెళ్తారు. ఆ తర్వాత సుఖధామములోకి వెళ్తారు. శాంతిధామములో శాంతిమాత్రమే ఉంటుంది. తర్వాత మళ్లీ సుఖధామములోకి వెళ్తారు. అక్కడ అశాంతి అనే మాటే ఉండదు. మళ్లీ క్రిందికి దిగవలసి ఉంటుంది. నిమిష నిమిషానికి దిగజారుతూ ఉంటారు. కొత్త ప్రపంచము నుండి పాత ప్రపంచంగా అవుతూ పోతుంది. 5 వేల సంవత్సరాలలో ఎన్ని నెలలు, ఎన్ని గంటలు................. ఉంటాయో లెక్క వేయమని బాబా చెప్పారు. అప్పుడు మనుష్యులు ఆశ్చర్యపోతారు. పేరు పూర్తి లెక్కాచారము తెలిపారు అని భావిస్తారు. ఆక్యురేట్‌గా(ఖచ్ఛితంగా) లెక్క తీయాలి. కొద్దిగా కూడా తేడా ఉండరాదు. నిమిష నిమిషము టిక్‌-టిక్‌ అని నడుస్తూనే ఉంటుంది. మొత్తం రీలు అంతా రిపీట్‌ అవుతూనే ఉంటుంది. తిరుగుతూ - తిరుగుతూ మళ్లీ చుట్టుకుంటూ ఉంటుంది. అదే రీలు మళ్లీ రిపీట్‌ అవుతుంది. ఈ పెద్ద రీలు చాలా అద్భుతమైనది. దీనిని ఎవ్వరూ కొలవలేరు. మొత్తము ప్రపంచములోని పాత్ర ఏదైతే జరుగుతూ ఉందో అది టిక్‌ - టిక్‌ అని నడుస్తూనే ఉంటుంది. ఒక్క క్షణము ఉన్న విధంగా మరో క్షణము ఉండదు. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. అది హద్దు డ్రామా, ఇది బేహద్‌ డ్రామా, ఈ అవినాశి డ్రామా గురించి ఇంతకుముందు మీకే మాత్రము తెలియదు. ఇది తయారు చేయబడి తయారవుతూ ఉన్న డ్రామా,............. జరుగుతూ ఉంది. ఏమి జరగాలో అదే జరుగుతుంది. కొత్తది కాదు. అనేకసార్లు క్షణ-క్షణము ఈ డ్రామా రిపీట్‌ అవుతూనే వచ్చింది. మరెవ్వరూ ఈ విషయాలను అర్థము చేయించలేరు. మొట్టమొదట తండ్రి పరిచయమునివ్వాలి. బేహద్‌ తండ్రి బేహద్‌ వారసత్వమునిస్తారు. వారికి 'శివ' అని ఒకే పేరు ఉంది. ధర్మము అతిగ్లానికి లోనైనప్పుడు నేనొస్తానని తండ్రి చెప్తున్నారు. దీనినే ఘోర కలియుగము అని అంటారు. ఇక్కడ చాలా దు:ఖముంది. ఈ ఘోర కలియుగములో పవిత్రంగా ఎలా ఉండగలరని కొందరంటారు. కానీ పావనంగా చేసేదెవరో వారికి తెలియదు. తండ్రియే సంగమ యుగములో వచ్చి పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. అక్కడ స్త్రీ - పురుషులిరువురూ పవిత్రంగా ఉంటారు. ఇక్కడ ఇరువురూ అపవిత్రంగా ఉన్నారు. ఈ ప్రపంచమే అపవిత్రమైనది. అది స్వర్గము, హెవెన్‌ - పవిత్రమైన ప్రపంచము. ఇది నరకము. దోజక్‌, హెల్‌. పిల్లలైన మీరు నెంబర్‌వార్‌ పురుషార్థానుసారము తెలుసుకున్నారు. అర్థం చేయించడం కూడా కష్టమే. పేదవారు వెంటనే అర్థము చేసుకుంటారు. రోజురోజుకు వృద్ధి అవుతూ ఉంటుంది. మరి ఇల్లు కూడా అంత పెద్దది కావాలి కదా. చాలా మంది పిల్లలు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు తండ్రి ఎక్కడకూ వెళ్ళరు కదా. ఇంతకుముందు ఎవరు అడగకపోయినా బాబానే తమంతకు తామే వెళ్ళేవారు. ఇప్పుడైతే ఇక్కడికే పిల్లలు వస్తూ ఉంటారు. చలిలో కూడా రావలసి ఉంటుంది. కార్యక్రమాన్ని తయారు చేయవలసి ఉంటుంది. ఫలానా - ఫలానా సమయములో రండి. అప్పుడు రద్దీగా ఉండదు. అందరూ ఒకే సమయములో రాలేరు. పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. ఇక్కడ పిల్లలు చిన్న - చిన్న ఇళ్ళు నిర్మిస్తూ ఉంటారు. అక్కడైతే చాలా మహళ్లు లభిస్తాయి. ధనమంతా మట్టిపాలౌతుందని మీకు తెలుసు. చాలామంది గోతులు త్రవ్వి అందులో దాచుకుంటారు. అయినా దొంగల పాలౌతుంది. లేకపోతే అలాగే భూమిలోనే ఉండిపోతుంది. మళ్లీ వ్యవసాయము చేయు సమయములో ధనము కనిపిస్తుంది. ఇప్పుడు వినాశనమైతే అంతా కూరుకుపోతుంది. మళ్లీ అక్కడ అన్నీ కొత్తవి లభిస్తాయి. ఇలా రాజుల కోటలు ఎన్నో ఉన్నాయి. అందులో చాలా సామాగ్రి కూరుకుపోయి ఉంది. పెద్ద పెద్ద వజ్ర్రాలు కూడా బయటపడ్తాయి. కనుక వేలాది, లక్షలాది సంపాదన జరుగుతుంది. అలాగని స్వర్గములో మీరు వజ్రాలను త్రవ్వి తీయరు. అక్కడ ప్రతి వస్తువు యొక్క ఖజానాలన్నీ కొత్తగా, నిండుగా ఉంటాయి. ఇక్కడ బీడు భూమిలో శక్తి ఉండదు. నాటే విత్తనాలలో కూడా శక్తి లేదు. పనికిరాని అశుద్ధమైనవన్నీ వేస్తారు. అక్కడైతే అశుద్ధమైన వస్తువు పేరు కూడా ఉండదు. ప్రతి వస్తువూ క్రొత్తగా ఉంటుంది. పిల్లలు స్వర్గమును కూడా సాక్షత్కారములో చూసి వస్తారు. అక్కడ సహజమైన సౌందర్యముంటుంది. మీరిప్పుడు ఆ ప్రపంచానికి వెళ్ళే పురుషార్థము చేస్తున్నారు. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. ఈ సమయములోనే తండ్రి సమానంగా సంపూర్ణమై వారసత్వాన్ని పూర్తిగా తీసుకోవాలి. తండ్రి ఇచ్చే శిక్షణలన్నీ స్వయంలో ధారణ చేసి వారి సమానంగా జ్ఞాన సాగరులుగా, శాంతి, సుఖ సాగరులుగా అవ్వాలి.

2. బుద్ధిని పారసము(బంగారు)గా చేసుకునేందుకు చదువు పై పూర్తిగా గమనమివ్వాలి. నిశ్చయబుద్ధి గలవారై మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే పరీక్షలో పాస్‌ అవ్వాలి.

వరదానము :-

'' త్రికాలదర్శి స్థితి ద్వారా మూడు కాలాలను స్పష్టంగా అనుభవం చేసే మాస్టర్‌ నాలెడ్జ్‌ఫుల్‌ భవ ''

ఎవరైతే త్రికాలదర్శి స్థితిలో స్థితమై ఉంటారో వారు ఒక సెకండులో మూడు కాలాలను స్పష్టంగా చూడగలరు. నిన్న ఎలా ఉండేవారము, ఈ రోజు ఎలా ఉన్నాము, రేపు ఎలా అవుతాము....... ఇవన్నీ వారి ముందు స్పష్టమైపోతాయి. ఎలాగైతే ఏదైనా దేశంలో అత్యంత ఎత్తైన స్థానంలో నిల్చొని మొత్తం పట్టణాన్నంతా చూసినప్పుడు మజాగా ఉంటుందో అలాగే ఈ సంగమ యుగము అత్యంత ఎత్తైన స్థానము(టాప్‌ పాయింట్‌). దీని పై నిల్చొని మూడు కాలాలను చూడండి. నశాతో మేమే దేవతలుగా ఉండేవారము, మళ్లీ మేమే అవుతామని చెప్పండి. ఇటువంటి వారినే మాస్టర్‌ నాలెడ్జ్‌ఫుల్‌ అని అంటారు.

స్లోగన్‌ :-

'' '' ప్రతి సమయం అంతిమ ఘడియ '' అనే స్మృతి ద్వారా ఎవర్‌రెడీగా అవ్వండి. ''