04-03-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - ఈ ప్రపంచమంతటిలో మీ వంటి పదమాపదమ్ భాగ్యశాలి విద్యార్థులు ఎవ్వరూ లేరు. మిమ్ములను స్వయం జ్ఞానసాగరులైన తండ్రే టీచర్ అయ్యి చదివిస్తున్నారు.''
ప్రశ్న :-
ఏ ఆసక్తి సదా ఉంటే మోహపు నరాలు(సూక్ష్మ బంధనాలు) తెగిపోతాయి ?
సమా :-
సేవ చేసేందుకు ఆసక్తి ఉంటే మోహపు సూక్ష్మ బంధనాలు తొలగిపోతాయి. ఈ కనులతో చూచేదంతా నాశనమౌతుందని సదా బుద్ధిలో ఉండాలి. వాటిని చూస్తూ కూడా చూడనట్లుండాలి. తండ్రి శ్రీమతము - చెడు వినకు, చెడు కనకు,........
ఓంశాంతి.
శివభగవానువాచ - మధురమైన సాలిగ్రామాలకు లేక ఆత్మిక పిల్లలకు తెలుపుతున్నారు. మనము సత్యయుగము ఆదిలో ఆదిసనాతన పవిత్ర దేవీదేవతా ధర్మానికి చెందిన వారమని అర్థం చేసుకున్నారు. ఆది సనాతన దేవీదేవతా ధర్మమునైతే చాలా మంది అంగీకరిస్తారు. కాని దానికి హిందూ ధర్మమని పేరుంచారు. ఆది సనాతనములో మనమెవరో మీకు తెలుసు. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఈ విధంగా అయ్యారు. ఇది స్వయంగా భగవంతుడే కూర్చొని అర్థం చేయిస్తున్నారు. భగవంతుడు దేహధారి మానవుడు కాదు. ఇతరులందరికీ వారి వారి దేహాలున్నాయి. శివబాబాను విదేహి అని అంటారు. వారికి తమ స్వంత దేహము లేదు. మిగిలిన వారందరికీ వారి స్వంత దేహములున్నాయి. కావున స్వయాన్ని కూడా విదేహినని భావిస్తే ఎంత మధురంగా ఉంటుంది! మనము ఎలా ఉండేవారము? ఇప్పుడు ఎలా తయారవుతున్నాము? ఈ డ్రామా ఎలా తయారయ్యిందో, దీనిని గురించి కూడా మీకు తెలుసు. ఈ దేవీ దేవతా ధర్మమే పవిత్ర గృహస్థ ఆశ్రమంగా ఉండేది. ఇప్పుడు ఆశ్రమంగా లేదు. ఇప్పుడు మనము ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. దానికి ఇప్పుడు హిందూ ధర్మమని పేరుంచారు. ఆది సనాతన హిందూ ధర్మము లేనే లేదు. బాబా అనేక పర్యాయాలు - ఆది సనాతన ధర్మము వారికి అర్థం చేయించమని చెప్పారు. మీరు ఆది సనాతన దేవీదేవతా పవిత్ర ధర్మానికి చెందినవారా? లేక హిందూ ధర్మానికి చెందినవారా? అని ఇందులో వ్రాయమని వారికి చెప్పండి. అప్పుడు వారికి 84 జన్మలు తెలుస్తాయి. ఈ జ్ఞానము చాలా సహజమైనది. లక్షల సంవత్సరాలు అన్నందువలన మానవులు తికమకపడ్తున్నారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. సతోప్రధానము నుండి తమోప్రధానంగా తయారవ్వడం కూడా డ్రామాలో ఒక భాగమే. దేవతా ధర్మము వారే 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ చాలా ఛీ-ఛీగా అయ్యారు(పాడైపోయారు). మొదట భారతదేశము ఎంతో ఉన్నతంగా ఉండేది. భారతదేశమునే మహిమ చేయాలి. ఇప్పుడు మళ్లీ తమోప్రధానము నుండి సతోప్రధానంగా, పాత ప్రపంచము నుండి నూతన ప్రపంచముగా తప్పకుండా తయారవ్వనున్నది. పోను పోను మీ మాటలు అందరూ తప్పకుండా అర్థము చేసుకుంటారు. గాఢనిద్ర నుండి మేల్కోండి. తండ్రిని, వారసత్వమును స్మృతి చేయమని అందరికీ చెప్పండి. పిల్లలైన మీరు రోజంతా సంతోషంగా ఉండాలి. ప్రపంచమంతటిలో, భారతదేశమంతటిలో మీ వంటి పదమాపదమ్ భాగ్యశాలీ విద్యార్థులు మరెవ్వరూ లేరు. మనము ఎలా ఉండేవారమో మళ్లీ అలాగే తయారవుతామని మీకు తెలుసు. మళ్లీ వారే శుభ్రమై వస్తారు. ఇందులో మీరు సంశయపడకండి. ప్రదర్శనీలో కొద్దిగా విని వెళ్ళినా వారు ప్రజలుగా అవుతూ ఉంటారు. ఎందుకంటే ఈ అవినాశి జ్ఞాన ధనము వినాశనమవ్వదు. రోజు రోజుకు మీ సంస్థ వేగమును పుంజుకుంటుంది. తర్వాత గుంపులు గుంపులుగా మీ వద్దకు వస్తారు. నెమ్మదిగా ధర్మస్థాపన అవుతుంది. ఎవరైనా గొప్పవారు బయట నుండి వస్తే వారిని చూచేందుకు అనేకమంది మనుష్యులు గుంపులు గుంపులుగా వెళ్తారు. ఇచ్చట అటువంటి మాట లేదు. ఈ ప్రపంచములో ఉన్న వస్తువులన్నీ వినాశనమయ్యేవని మీకు తెలుసు. వాటిని చూడరాదు. చెడు చూడకు,........... ఈ మురికి అంతా భస్మమవ్వనున్నది. మీరు చూచే మానవులు మొదలైన వారందరూ కలియుగములోని వారని మీకు తెలుసు. మీరు సంగమ యుగములోని బ్రాహ్మణులు. సంగమ యుగము గురించి ఎవ్వరికీ తెలియదు. ఇది సంగమ యుగము. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని స్మృతి చేయండి చాలు. పవిత్రంగా కూడా అవ్వాలి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - ఈ కామ వికారము ఆది-మధ్య-అంత్యము దు:ఖమిచ్చేది. దీనిని జయించండి. విషము కొరకు ఎంత విసిగిస్తారో చూడండి. తండ్రి చెప్తున్నారు - కామము మహాశత్రువు. దానిని జయించాలి. ఇప్పుడు ఈ ప్రపంచములో అనేకమంది మనుష్యులున్నారు. మీరు ఒక్కొక్కరికి ఎంతవరకు అర్థం చేయిస్తారు? ఒకరికి అర్థం చేయిస్తే రెండవవారు ఇది ఇంద్రజాలమని అంటారు, చదువు వదిలేస్తారు. అందుకే తండ్రి ఆది సనాతన ధర్మానికి చెందినవారికి అర్థం చేయించమని చెప్తున్నారు. ఆది సనాతనమే దేవతా ధర్మము. ఈ లక్ష్మీ నారాయణులు ఈ పదవి ఎలా పొందుకున్నారో మీరు అర్థం చేయిస్తారు. మానవుల నుండి దేవతలుగా ఎలా తయారయ్యారు? తప్పకుండా ఇది అంతిమ జన్మ అయ్యి ఉంటుంది. 84 జన్మలు పూర్తి చేసుకొని మళ్లీ ఇలా(బ్రహ్మ) తయారయ్యారు. ఎవరికి సేవ చేయాలని ఆసక్తి ఉంటుందో, వారు అందులో నిమగ్నమై ఉంటారు. మిగిలిన అన్ని వైపుల నుండి మోహము మొదలైనవన్నీ తొలగిపోతాయి. మనము ఈ కళ్ళ ద్వారా చూచేదంతా మర్చిపోవాలి. చూసినా చూడనట్లుండాలి. చెడు చూడకు,...... మానవులు కోతుల చిత్రాలను తయారుచేస్తారు. ఏ మాత్రము అర్థము చేసుకోరు. పిల్లలు ఎంతో శ్రమ చేస్తారు. ఇతరులకు తెలిపి అర్హులుగా తయారు చేసేవారిని బాబా శభాష్ అని మెచ్చుకుంటారు. బహుమతి కూడా చేసి చూపించిన వారికే లభిస్తుంది. బాబా మనకు ఎన్ని బహుమతులనిస్తారో మీకు తెలుసు. మొదటి నెంబరు బహుమతి సూర్యవంశ రాజధాని. రెండవ నెంబరు చంద్రవంశపు రాజధాని. నెంబరువారుగా ఉండనే ఉంటాయి. భక్తిమార్గములో శాస్త్రాలు కూడా ఎన్నో కూర్చుని తయారు చేశారు. ఈ శాస్త్రాలను చదవడం, యజ్ఞము, తపము చేయడం ద్వారా నన్ను ఎవ్వరూ కలుసుకోలేరని తండ్రి చెప్తున్నారు. రోజురోజుకు ఎంతో పాపాత్మలుగా అవుతూ పోతారు. పుణ్యాత్మలుగా ఎవ్వరూ తయారవ్వరు. తండ్రే స్వయంగా వచ్చి పుణ్యాత్మలుగా తయారు చేస్తారు. ఒకటేమో హద్దులోని దానపుణ్యాలు. రెండవది బేహద్(అనంతము). భక్తిమార్గములో పరోక్షంగా ఈశ్వరార్థము దానపుణ్యాలు చేస్తారు. అయితే ఈశ్వరుడెవరో వారికి తెలియనే తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు. శివబాబా ఎలా ఉన్న మమ్ములను ఎలా తయారు చేస్తారో మీరు అందరికీ చెప్తారు. భగవంతుడు ఒక్కరే. వారిని సర్వవ్యాపి అని అనేశారు. జనులు ఏమి చేశారో మీరు వారికి విపులంగా అర్థం చేయించాలి. మీ వద్దకు వచ్చి కూడా కొద్దిగా వింటారు. బయటకు పోతూనే మర్చిపోతారు. జ్ఞానము చాలా బాగుంది. మేము మళ్లీ వస్తామని మీకు చెప్తారు. కాని మోహపు నరాలు తెగిపోవు. మోహజిత్ రాజు కథ ఎంతో బాగుంది. ఫస్ట్క్లాస్ మోహజీత్ రాజు ఈ లక్ష్మీనారాయణులే. కాని మానవులు అర్థము చేసుకోరు. ఆశ్చర్యము కదా. పైకి వెళ్ళి ఒక్కసారిగా క్రిందకు పడిపోతారు. పిల్లలు ఆడుకుంటారు. పైకి వెళ్లి ఒక్కసారిగా క్రిందికి దూకుతారు. మీ ఆట చాలా సులభమైనది. బాగా ధారణ చేయమని, ఛీ-ఛీ పనులు ఏవీ చేయరాదని తండ్రి చెప్తున్నారు.
నేను బీజరూపుడను, సత్-చిత్-ఆనంద స్వరూపుడను, జ్ఞానసాగరుడనని తండ్రి చెప్తున్నారు. జ్ఞానసాగరులు పైననే కూర్చుని ఉంటారా? ఎప్పుడో ఒకసారి వచ్చి జ్ఞానమిచ్చే ఉంటారు. జ్ఞానమేమిటో కూడా ఎవ్వరికీ తెలియదు. నేను మిమ్ములను చదివించేందుకు వస్తాను. రెగ్యులర్గా చదవుకోవాలి. ఒక్క రోజు కూడా చదువు మిస్ చేయరాదు. ఏదో ఒక మంచి పాయింటు తప్పకుండా లభిస్తుంది. మురళి చదవకుంటే ఆ పాయింటు తప్పకుండా మిస్ అయిపోతుంది. అనేక పాయింట్లు ఉన్నాయి. భారతవాసులైన మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారని అర్థం చేయించాలి. ఇప్పుడు అనేక ధర్మాలున్నాయి. చరిత్ర తప్పకుండా రిపీట్ అయ్యే తీరాలి. ఇది పైకి ఎక్కి కిందకు దిగే నిచ్చెన(మెట్లు). తాపలు ఎక్కి దిగుతూ ఉండమని ఆజ్ఞాపిస్తారు కదా. మీరందరూ జిన్నులే కదా. 84 మెట్లు పైకి ఎక్కుతారు. మళ్లీ క్రిందకు దిగుతారు. అనేకమంది మనుష్యులున్నారు. ప్రతి ఒక్కరూ పాత్ర చేయాల్సి ఉంటుంది. పిల్లలు చాలా ఆశ్చర్యపడాలి. మీకు అనంతమైన నాటకమును గురించిన సంపూర్ణ జ్ఞానము లభించింది. ఈ మొత్తము సృష్టి ఆదిమధ్యాంతాలను గురించి ఇప్పుడు మీకు మాత్రమే తెలుసు. ఇతర ఏ మనుష్యులకు తెలియదు. సత్యయుగములో ఎవరి నోటి నుండి కూడా చెడు శబ్ధాలు వెలువడవు. ఇచ్చట ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. ఇది విషయ వైతరిణీ నది, రౌరవ నరకము. మానవులంతా రౌరవ నరములో పడి ఉన్నారు. ఇచ్చట అందరూ యథా రాజా రాణి తథా ప్రజా. చివరిలో మీకు తప్పకుండా విజయము లభిస్తుంది. అప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని ఎవరు స్థాపించారో తెలుసుకుంటారు. ఇది మొట్టమొదటి ముఖ్య విషయము. దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు.
నేను పేదలపెన్నిధి అని తండ్రి అంటున్నారు. చివరిలో చాలా ఆలస్యమైనప్పుడు(టూ లేట్) అందరూ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీకు మూడవ నేత్రము లభించింది. మధురమైన ఇల్లు. మధురమైన రాజ్యము బుద్ధిలో గుర్తున్నాయి. ఇప్పుడు శాంతిధామము, సుఖధామానికి వెళ్ళాలని తండ్రి చెప్తున్నారు. మీరు ఏ పాత్ర అభినయించారో అదంతా బుద్ధిలోకి వస్తుంది కదా. బ్రాహ్మణులు తప్ప మిగిలినవారంతా చచ్చిపడి ఉన్నారు. బ్రాహ్మణులు మాత్రమే నిలుస్తారు. బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు. ఏకధర్మ స్థాపన జరుగుతోంది. ఇతర ధర్మాలు ఎలా స్థాపన అవుతాయో కూడా మీ బుద్ధిలో ఉంది. తెలిపించేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇటువంటి తండ్రిని క్షణ క్షణము గుర్తు చేసుకోవాలి. వ్యాపారము మొదలైనవి భలే చేయండి. తప్పకుండా పవిత్రంగా అవ్వండి. ఆది సనాతన దేవీదేవతా ధర్మము పవిత్రంగా ఉండేది. ఇప్పుడు మళ్లీ పవిత్రంగా అవ్వాలి. నడుస్తూ తిరుగుతూ పనులు చూసుకుంటూ తండ్రినైన నన్ను స్మృతి చేస్తే మీరు సతోప్రధానంగా అవుతారు. సతోప్రధానమైనప్పుడే శక్తి వస్తుంది. స్మృతియాత్ర చేయకుండా ఉన్నత పదవిని ఎప్పుడూ పొందలేరు. సతోప్రధానము వరకు చేరుకున్నప్పుడే మీ పాపాలు తొలగిపోతాయి. ఇది యోగాగ్ని - ఈ పదము గీతలోనిది. యోగము - యోగము అంటూ తల బాదుకుంటూ ఉంటారు. విదేశస్థులను కూడా చిక్కించుకొని యోగము నేర్పించేందుకు తీసుకొస్తారు. ఇప్పుడు మీరు చెప్పే మాటలు ఎవరైనా అర్థము చేసుకుంటారా! పరమాత్మ సుప్రీమ్ సోల్ ఒక్కరే. వారే వచ్చి అందరినీ సుప్రీమ్(అత్యంత శ్రేష్ఠము)గా తయారు చేస్తారు. ఒకానొక రోజు వార్తా పత్రికలవారు ఈ విషయాలు వ్రాస్తారు. వేస్తారు. ఇది సత్యము. ఒక్క పరమపిత పరమాత్మ తప్ప రాజయోగమును ఇతరులెవ్వరూ నేర్పించలేరు. ఇటువంటి విషయాలను పెద్ద పెద్ద అక్షరాలలో పత్రికలలో వేయించాలి. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు
కనులు లేని వారికి దారి చూపండి ప్రభూ,........... ఈ పాట మనుష్యులు పాడుతూ ఉంటారు అనగా దారి చూపించేవారు ఒక్క పరమాత్ముడు మాత్రమే. అందుకే పరమాత్మను పిలుస్తారు. ఎప్పుడైతే ఓ ప్రభూ! దారి చూపండి అని పరమాత్మను పిలుస్తారో, అప్పుడు తప్పకుండా మనుష్యులకు దారి చూపేందుకు స్వయం పరమాత్మ నిరాకార రూపము నుండి సాకార రూపములో తప్పకుండా రావలసి పడ్తుంది. అప్పుడే స్థూలములో దారి చూపిస్తారు. వారు రాకుండా దారి చూపించలేరు కదా. ఇప్పుడు మనుష్యులు ఎవరైతే తికమకపడి ఉన్నారో వారికి దారి కావాలి. అందువలన పరమాత్మను కనులు లేనివారికి దారి చూపండి ప్రభూ! అని పిలుస్తారు,......... వారినే మళ్లీ నావికుడు అని కూడా అంటారు. వారు ఆవలి తీరానికి అనగా ఈ 5 తత్వాలతో తయారైన ఈ సృష్టి ఏదైతే ఉందో దాని నుండి ఆవలి తీరము అనగా 5 తత్వాలకు దూరంగా ఏదైతే 6వ అఖండ జ్యోతి మహాతత్వముందో అందులోకి తీసుకెళ్తారు. కనుక పరమాత్మ కూడా తమ ధామము నుండి రావలసి పడ్తుంది. అప్పుడే పరమాత్మను నావికుడని అంటారు. వారే మన బోటును(ఆత్మ రూపి నావను) తీరానికి తీసుకెళ్తారు. ఇప్పుడు ఎవరైతే పరమాత్మతో యోగము చేస్తారో వారిని జతలో తీసుకెళ్తారు. పోతే ఇక ఎవరైతే మిగిలిపోతారో వారు ధర్మరాజు శిక్షలు అనుభవించిన తర్వాత ముక్తులైపోతారు.
2. ''ముళ్లు'' అనగా దు:ఖ ప్రపంచము నుండి పుష్పాల ఛావ్ అనగా సుఖ ప్రపంచములోకి తీసుకెళ్లే వారు పరమాత్మ. ముళ్ల ప్రపంచము నుండి పుష్పాల ఛావ్(నీడ, పై కప్పు)లోకి తీసుకెళ్లు అనే పిలుపు కేవలం పరమాత్మ కొరకే. మనుష్యులు ఎప్పుడైతే చాలా దు:ఖితులుగా అవుతారో అప్పుడు పరమాత్మను, ఓ పరమాత్మా! ఈ ముళ్ల ప్రపంచము నుండి పుష్పాల ఛావ్లోకి తీసుకెళ్లు అని స్మృతి చేస్తారు. దీని వలన తప్పకుండా అటువంటి ప్రపంచమేదో ఉందని ఋజువవుతుంది. ఇప్పటి ఈ ప్రపంచము ముళ్లతో నిండి ఉందని మనుష్యులందరికీి తెలుసు. ఈ కారణంగానే మనుష్యులు దు:ఖము మరియు అశాంతిని పొందుతూ పుష్పాల ప్రపంచాన్ని స్మృతి చేస్తున్నారు. కనుక ఆత్మలో అటువంటి సంస్కారము నిండిన మరో ప్రపంచమేదో తప్పకుండా ఉంటుంది. దు:ఖము, అశాంతి ఇవన్నీ కర్మబంధనాల లెక్కాచారమని ఇప్పుడు మనకు తెలుసు. రాజుల నుండి పేదల వరకు మనుష్య మాత్రులందరూ ఈ లెక్కలో పూర్తిగా బంధింపబడి ఉన్నారు. అందువలన పరమాత్మ స్వయంగా చెప్తున్నారు - ఇప్పటి ఈ ప్రపంచము కలియుగం. ఇదంతా కర్మబంధనాలతో తయారు చేయబడి ఉంది. ఇంతకుముందు సత్యయుగ ప్రపంచముండేది. దానిని పుష్పల ప్రపంచమని అంటారు. అది కర్మబంధన రహిత జీవన్ముక్త దేవీ దేవతల రాజ్యము. ఇప్పుడు ఆ ప్రపంచము లేదు. జీవన్ముక్తులంటే అర్థము దేహాల నుండి ముక్తులని కాదు, వారికి దేహ భావము లేదు. వారు దేహంలో ఉంటున్నా దు:ఖాన్ని పొందేవారు కాదు అనగా అక్కడ ఎలాంటి కర్మబంధన లెక్కాచారము లేదు. వారు శరీరాన్ని తీసుకుంటూ, వదులుతూ ఆది- మధ్య-అంతాలు సుఖాన్ని పొందుతారు. కనుక జీవన్ముక్తి అంటే జీవించి ఉంటూ కర్మాతీతులు. ఇప్పుడు ఈ ప్రపంచమంతా పూర్తి 5 వికారాలతో గట్టిగా బంధింపబడి ఉంది. 5 వికారాల దుర్గంధం పూర్తిగా వ్యాపించి ఉన్నట్లు ఉంది. అయితే ఈ 5 భూతాలను జయించగలిగే శక్తి లేదు. అప్పుడే పరమాత్మ స్వయంగా వచ్చి 5 భూతాల నుండి విడిపించి భవిష్య ప్రాలబ్ధమైన దేవీ దేవతా పదవిని ప్రాప్తి చేయిస్తారు.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. సూర్యవంశ రాజధానిని బహుమతిగా తీసుకునేందుకు బాప్దాదా శభాష్ అని మెచ్చుకునేలా సేవ చేసి చూపించాలి. మోహపు సూక్ష్మ బంధనాలను తెంచి వేయాలి.
2. జ్ఞానసాగరులైన విదేహి తండ్రి స్వయంగా చదివించేందుకు వస్తారు. కనుక ప్రతిరోజు క్రమము తప్పకుండా చదవాలి. ఒక్క రోజు కూడా చదువు మిస్ చేయరాదు. తండ్రి సమానము విదేహులుగా అయ్యే పురుషార్థము చేయాలి.
వరదానము :-
''శ్రేష్ఠ వృత్తి అనే వ్రతాన్ని ధారణ చేసి సత్యమైన శివరాత్రిని జరుపుకునే విశ్వపరివర్తక్ భవ''
భక్త జనులైతే స్థూల వస్తువుల వ్రతాన్ని ఉంచుకుంటారు. కానీ మీరు మీ బలహీన వృత్తులను సదా కొరకు నిర్మూలించుకునే వ్రతము తీసుకుంటారు. ఎందుకంటే ఏదైనా మంచి లేక చెడు విషయము మొదట వృత్తిలో ధారణ అవుతుంది తర్వాత వాచాలోకి, కర్మలోకి వస్తుంది. మీ శుభ వృత్తి ద్వారా జరిగే శ్రేష్ఠమైన మాటలు మరియు కర్మల ద్వారానే విశ్వ పరివర్తన అనే మహోన్నత కార్యము సంపన్నమవుతుంది. ఈ శ్రేష్ఠమైన వృత్తి అనే వ్రతాన్ని ధారణ చేయడమే శివరాత్రిని జరుపుకొనుట.
స్లోగన్ :-
''ఎవరి హృదయంలో సదా ఖుషీ(సంతోషము) అనే సూర్యుడు ఉదయించి ఉంటాడో, వారే ఖుష్నుమ: (ప్రసన్నవదనంతో ఉంటారు).''