15-03-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - అంతర్ముఖులుగా అయ్యి విచార సాగర మథనము చేస్తే ఖుషీ మరియు నషా ఉంటాయి. మీరు తండ్రి సమానము టీచరుగా అవుతారు ''
ప్రశ్న :-
ఏ ఆధారము పై ఆంతరిక ఖుషీ స్థిరంగా ఉండగలదు ?
జవాబు :-
ఇతరుల కళ్యాణము కూడా చేసి అందరినీ సంతోషపరిచినప్పుడు స్థిరమైన ఖుషీ ఉంటుంది. దయాహృదయులుగా అయితే వారి బుద్ధిలో ఖుషీ ఉంటుంది. ఎవరైతే దయాహృదయులుగా అవుతారో వారి బుద్ధిలో ఓహో! మమ్ములను సర్వాత్మల తండ్రి చదివిస్తున్నారు, పావనంగా తయారు చేస్తున్నారు, మేము విశ్వ మహారాజులుగా అవుతాము! అనే భావన ఉంటుంది. ఇటువంటి ఖుషీని వారు దానము చేస్తూ ఉంటారు.
ఓంశాంతి.
ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుచున్నారు - పిల్లలూ, ఇప్పుడు ఓంశాంతి అని ఎవరు చెప్పారు?(శివబాబా). అవును శివబాబానే అన్నారు. ఎందుకంటే వీరు సర్వాత్మల తండ్రి అని పిల్లలకు తెలుసు. నేను కల్ప-కల్పము ఈ రథములోనే వచ్చి చదివిస్తానని వారు చెప్తున్నారు. ఇప్పుడు వీరు చదివించే టీచరుగా అయ్యారు. టీచరు వస్తే గుడ్మార్నింగ్(శుభోదయము) అని చెప్తారు. పిల్లలు కూడా గుడ్మార్నింగ్ అని అంటారు. ఆత్మలకు పరమాత్మ గుడ్మార్నింగ్ చెప్తారని పిల్లలకు తెలుసు. లౌకిక రీతిలో గుడ్మార్నింగ్ అని చాలామందికి చెప్తూ ఉంటారు కాని వీరు అనంతమైన తండ్రి, పరంధామము నుండి వచ్చి చదివిస్తున్నారు. పిల్లలకు మొత్తము వృక్షము లేక డ్రామా రహస్యమంతా అర్థము చేయిస్తారు. సర్వాత్మల తండ్రి వచ్చి ఉన్నారని మీకు తెలుసు. అనంతమైన తండ్రి మమ్ములను చదివిస్తున్నారని మన తండ్రి, టీచరు, గురువు అనే నిశ్చయము రోజంతా బుద్ధిలో ఉండాలి. వారిని రచయిత అని కూడా అంటారు. ఇది కూడా అర్థము చేసుకోవలసి ఉంటుంది. ఆత్మలను రచించరు. నేను బీజరూపుడనని అర్థము చేయిస్తారు. ఈ సమయంలో ఈ సృష్టి రూపీ వృక్ష జ్ఞానము మీకు వినిపిస్తాను. ఒక్క బీజము తప్ప ఈ జ్ఞానమును ఎవరు ఇస్తారు? వారు వృక్షమును రచించారని వారు అనరు. వారు చెప్తున్నారు - పిల్లలూ, ఇది అనాది వృక్షము. అలా కాకుంటే నేను ఈ వృక్షమును ఎలా, ఎప్పుడు రచించానో తిథి, తారీఖుల సహితంగా అన్నీ తెలిపేవాడిని. కాని ఇది అనాది రచన. తండ్రిని జ్ఞాన సాగరులని అంటారు. సర్వజ్ఞుడు(జానీ జానన్హార్) అనగా వృక్షము యొక్క ఆది-మధ్య-అంత్యముల రహస్యము తెలిసినవారు. తండ్రియే మనుష్య సృష్టికి బీజరూపులు, జ్ఞానసాగరులు, పూర్తి జ్ఞానమంతా వారిలో మాత్రమే ఉంది. వారే వచ్చి పిల్లలను చదివిస్తున్నారు. మానవులందరూ శాంతి ఎలా స్థాపన అవుతుందని అంటూ ఉంటారు. ఇప్పుడు మీరు శాంతిని, శాంతిసాగరులే స్థాపన చేస్తారని చెప్తారు. వారు శాంతి-సుఖము, జ్ఞానసాగరులు. ఏ జ్ఞానము? సృష్టి ఆది-మధ్య-అంత్యముల జ్ఞానము. వారు శాస్త్రాలను కూడా జ్ఞానమని భావిస్తారు. అలాగైతే శాస్త్రాలను వినిపించేవారు అనేకమంది ఉన్నారు. ఈ అనంతమైన తండ్రి స్వయంగా వచ్చి తమ పరిచయమును ఇస్తారు. అంతేకాక సృష్టి ఆది-మధ్య-అంత్యముల జ్ఞానమును కూడా ఇస్తారు. వారు వస్తేనే శాంతి స్థాపన జరుగుతుందని కూడా తెలుసుకుంటారు. అచ్చట ఉండేదే శాంతి. శాంతిధామములో అందరూ శాంతిలో ఉండేవారని కూడా ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ శాంతి ఎలా స్థాపన అవుతుందని వారు అంటూ ఉంటారు. ఇక్కడ ఒకప్పుడు శాంతి కూడా ఉండేది. రామరాజ్యములో ఉన్న శాంతి కావాలని అంటారు. అయితే రామరాజ్యము ఎప్పుడు ఉండేదో ఎవ్వరికీ తెలియదు. అనేకమంది ఆత్మలున్నారని తండ్రికి తెలుసు. నేను వీరందరి తండ్రిని అని చెప్తున్నారు. ఈ విధంగా ఇతరులెవ్వరూ చెప్పలేరు. ఈ సమయములో ఆత్మలన్నీ ఇక్కడే ఉన్నాయి. మొదట శాంతిధామములో ఉండేవి తర్వాత సుఖధామము నుండి దు:ఖధామములోకి వచ్చాయి. ఈ సుఖ-దు:ఖముల ఆట ఎలా తయారయ్యిందో ఎవ్వరికీ తెలియదు. ఇది వచ్చిపోయే(ఆవాగనమన) ఆట అని ఊరకే అనేస్తారు. వారు మన ఆత్మలందరి తండ్రి అని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. వారు మనకు జ్ఞానము వినిపిస్తున్నారు. వారు వచ్చి స్వర్గ రాజ్యమును స్థాపన చేస్తారు. మనలను చదివిస్తారు. వారు అంటున్నారు - పిల్లలూ, మీరే ఒకప్పుడు దేవతలుగా ఉండేవారు. ఈ విధంగా ఇతరులెవ్వరూ చెప్పరు. సర్వాత్మల తండ్రి మిమ్ములను చదివిస్తున్నారు. ఇది చాలా అనంతమైన పెద్ద నాటకము. వారు లక్షల సంవత్సరాలని అంటారు. మీరు ఇది 5 వేల సంవత్సరాల ఆట అని అంటారు. శాంతి రెండు విధములని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు - ఒకటి శాంతిధామములోని శాంతి, రెండవది సుఖధామములోని శాంతి. సర్వాత్మల తండ్రి మమ్ములను చదివిస్తున్నారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇది ఏ శాస్త్రములోనూ లేదు. వీరు అనంతమైన తండ్రి కదా. అన్ని ధర్మముల వారు అల్లా, గాడ్ఫాదర్, ప్రభువు అని మొదలైన పేర్లతో పిలుస్తారు. వారు చదివించే చదువు కూడా అంత ఉన్నతంగా, శ్రేష్ఠంగా ఉంటుంది. ఇది రోజంతా మీ ఆంతరికములో ఉండాలి. తండ్రి చెప్తున్నారు - నేను మీకు కొత్త విషయాలు వినిపిస్తాను. నూతన పద్ధతిలో చదివిస్తాను. మీరు ఈ చదువును ఇతరులకు చదివిస్తారు. భక్తి మార్గములో దేవతలకు కూడా చాలా గౌరవముంది. వాస్తవంలో ఈ బ్రహ్మ కూడా పెద్ద తల్లి. వీరిని(శివుని) తండ్రి అని మాత్రమే అంటారు. మాతా-పిత అని వీరిని అంటారు. ఈ తల్లి ద్వారా మిమ్ములను తండ్రి దత్తత చేసుకుంటారు. పిల్లలూ - పిల్లలూ! అని పిలుస్తూ ఉంటారు.
తండ్రి చెప్తున్నారు - నేను ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత మీకు ఈ జ్ఞానము వినిపిస్తాను. ఈ చక్రము కూడా మీ బుద్ధిలో ఉంది. మీరు ఒక్కొక్క పదము క్రొత్తగా వింటారు. జ్ఞాన సాగరులైన తండ్రిది మాత్రమే ఆత్మిక జ్ఞానము. ఆత్మ అయిన తండ్రి ఒక్కరే జ్ఞాన సాగరులు. ఆత్మ వారిని బాబా అని పిలుస్తుంది. పిల్లలు కూడా అన్ని విషయాలు బుద్ధిలో ధారణ చేస్తారు. అంతర్ముఖులుగా అయ్యి ఇలా ఎప్పుడు విచార సాగర మథనము చేస్తారో అప్పుడు ఆ ఖుషీ మరియు నషా ఉంటాయి. అందరికంటే పెద్ద టీచరు శివబాబా. వారు మిమ్ములను కూడా టీచర్లుగా తయారు చేస్తారు. వారిలో కూడా నంబరువారుగా ఉన్నారు. ఈ పుత్రుడు చాలా బాగా చదివిస్తారని, అందరూ సంతోషిస్తారని బాబాకు తెలుసు. మిమ్ములను ఇలా తయారు చేసిన ఇటువంటి బాబా వద్దకు మమ్ములను కూడా త్వరగా తీసుకెళ్లమని అంటారు. బాబా తెలుపుచున్నారు - నేను ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమ సమయములో ప్రవేశించి మిమ్ములను చదివిస్తాను. కల్ప-కల్పము మనము ఎన్నిసార్లు ఈ భారతదేశములో వచ్చి ఉంటాము. మీరు ఈ నూతన విషయాలు విని ఆశ్చర్యపడ్తారు. అనంతమైన తండ్రి మనలను చదివిస్తున్నారు. భక్తిమార్గమలో వారికి ఎన్నో పేర్లు ఉన్నాయి. కొంతమంది పరమాత్మ అని, రాముడని, ప్రభువు అని, అల్లా అని అంటారు. ఒక్క టీచరు ఎన్ని పేర్లు ఉంచారో గమనించండి. టీచరుకు ఒక్క పేరు మాత్రమే ఉంటుంది. అనేక పేర్లు ఏమైనా ఉంటాయా? ఎన్ని భాషలున్నాయి. అందువలన కొంతమంది ఖుదా అని, కొంతమంది గాడ్ అని ఏమేమో అనేస్తారు. పిల్లలను చదివించేందుకు వచ్చానని వారే అర్థము చేసుకుంటారు. చదువుకొని దేవతలుగా అయినప్పుడు వినాశనము అయిపోతుంది. ఇది పాత ప్రపంచము. దీనిని క్రొత్తదిగా ఎవరు తయారుచేస్తారు? ఇది నా పాత్రే అని, నేను డ్రామా వశములో ఉన్నానని తండ్రి చెప్తున్నారు. భక్తి ఎంత విస్తారంగా ఉందో కూడా పిల్లలకు తెలుసు. ఇది కూడా డ్రామాయే. భక్తికి అర్ధకల్పము పడుతుంది. ఇప్పుడు మళ్లీ తండ్రి వచ్చారు. మనలను చదివించేవారు కూడా వారే. శాంతి స్థాపన చేయువారు కూడా వారే. లక్ష్మీనారాయణుల రాజ్యమున్నప్పుడు శాంతి ఉండేది. ఇప్పుడిక్కడ అశాంతి ఉంది. ఆత్మలు లెక్కలేనన్ని ఉన్నాయి. తండ్రి మాత్రము ఒక్కరే. ఇది ఎంత అద్భుతమైన డ్రామా. బాబా సర్వాత్మలకు తండ్రి. వారే మనలను చదివిస్తున్నారు. ఎంత సంతోషముండాలి.
మనమే గోప-గోపులమని, గోపీ వల్లభుడు తండ్రి అని ఇప్పుడు మీరు అర్థము చేసుకున్నారు. కేవలం ఆత్మలను గోప-గోపులమని అనరు. శరీరములున్నప్పుడే గోప-గోపులని లేక సోదరీ-సోదరులని అంటారు. గోపీ వల్లభుడైన శివబాబా పిల్లలము. గోప-గోపులమను పదమే మధురమైనది. అచ్యుతమ్, కేశవమ్, గోపీ వల్లభమ్, జానకీ నాథమ్..... అని గాయనము కూడా ఉంది. ఈ మహిమ కూడా ఈ సమయానికి చెందినదే. కానీ సత్యము తెలియనందున అన్ని విషయాలు కలగాపులగము చేసేశారు. ఇప్పుడు తండ్రి కూర్చుని ప్రపంచ చరిత్ర-భూగోళాలు వినిపిస్తారు. వారికి కేవలం ఈ ఖండాలు మాత్రమే తెలుసు. సత్యయుగములో ఎవరి రాజ్యముండేది, ఎంత సమయము ఉండినది - ఈ విషయాలు వారికి తెలియవు. ఎందుకంటే కల్పము ఆయువు లక్షల సంవత్సరాలని అనేశారు. పూర్తి గాఢాంధకారములో ఉన్నారు. ఇప్పుడు తండ్రి వచ్చి సృష్టిచక్ర జ్ఞానమునిస్తారు. జ్ఞానమును తెలుసుకున్నందున త్రికాలదర్శులుగా, త్రినేత్రిగా అవుతారు. ఇది విలువైన చదువు. తండ్రి స్వయంగా చెప్తున్నారు - నేను కల్ప-కల్పము, కల్పము యొక్క సంగమ యుగములో వచ్చి మిమ్ములను పురుషోత్తములుగా తయారుచేస్తాను. మీరే నంబరువారుగా అవుతారు. చదువు ద్వారానే పదవి లభిస్తుంది. మనలను అనంతమైన తండ్రి చదివిస్తున్నారని మీకు తెలుసు. వారు పరమాత్మ నామ-రూపాలకు భిన్నంగా ఉన్నారని, రాయి-రప్పలలో ఉన్నారని అంటారు. అంతేకాక ఇంకా ఏమేమో చెప్తూ ఉంటారు. దేవీలకు కూడా ఎన్నో భుజాలు ఇచ్చేశారు. రావణునికి పది తలలు ఇచ్చారు. కావున సర్వాత్మల తండ్రి మనలను చదివిస్తున్నారని, పావనంగా చేస్తారని పిల్లల మనసులోకి వస్తే ఆంతరికములో ఎంతో ఖుషీ ఉంటుంది. అయితే ఈ ఖుషీ ఎప్పుడు కలుగుతుందంటే ఇతరుల కళ్యాణము చేసి అందరినీ సంతోషపరచి దయా హృదయులుగా అయినప్పుడు ఈ ఖుషీ కలుగుతుంది. ఓహో, బాబా మీరు మమ్ములను విశ్వ మహారాజుగా తయారు చేస్తారు! రాజా, రాణి, ప్రజలు అందరూ విశ్వానికి అధికారులుగా అవుతారు కదా. అక్కడ మంత్రి ఉండరు. ఇప్పుడు రాజులు ఎవ్వరూ లేరు. కనుక అందరూ మంత్రులే మంత్రులు. ఇప్పుడు ప్రజల పై ప్రజా రాజ్యముంది. కనుక క్షణ-క్షణము అనంతమైన తండ్రి ఏమి చదివిస్తున్నారో ఆ చదువు బుద్ధిలోకి రావాలి. ఎవరైతే మంచి రీతిగా చదువుకుంటారో వారే మొదట వస్తారు. ఉన్నత పదవి పొందుతారు ఈ లక్ష్మీనారాయణులు ఇంత ధనవంతులుగా ఎలా అయ్యారు? ఏమి చేశారు? భక్తి మార్గములో కొంతమంది చాలా ధనవంతులుగా అవుతారు. వీరు చాలా మంచి కర్మలు చేసి ఉండవచ్చని భావిస్తారు. ఈశ్వరార్థంగా దాన-పుణ్యాలు కూడా చేస్తుంటారు. దీని ఫలితముగా మాకు ఏమైనా లభిస్తుందని భావిస్తారు. కనుక మరో జన్మలో ధనవంతులుగా అవుతారు. కానీ వారు నేరుగా ఇవ్వరు. కావున అల్పకాలము కొరకు ఏదో కొంత లభిస్తుంది. ఇప్పుడు తండ్రి నేరుగా వచ్చారు. ఇప్పుడు బాబా మీరు వచ్చి పావనంగా తయారు చేయండి అని వారిని స్మృతి చేస్తారు. కానీ మీరు వచ్చి జ్ఞానము ఇచ్చి ఈ లక్ష్మీనారాయణుల వలె మమ్ములను తయారు చేయండి అని అనరు. మనుష్యుల బుద్ధిలో కృష్ణుడే గుర్తుకు వస్తాడు. తండ్రి ఎవరో తెలియనందున ఎంతో దు:ఖితులై ఉన్నారు. ఇప్పుడు తండ్రి మిమ్ములను దైవీ సంప్రదాయానికి చెందిన వారిగా తయారు చేస్తున్నారు. మీరు శాంతిధామానికి వెళ్లి మళ్లీ సుఖధామములోకి వస్తారు. తండ్రి ఎంతో మంచిరీతిగా అర్థము చేయిస్తున్నారు. భలే వింటారు కానీ వినని వారుగానే ఉండిపోతారు. రాతి బుద్ధి నుండి పారస బుద్ధిగా అవ్వనే అవ్వరు. రోజంతా బాబా-బాబాయే స్మృతిలో ఉండాలి. స్త్రీ ప్రాణము తన పతి ప్రాణముతో ఎలా వెళ్లిపోతుందో అలా వెళ్లాలి. స్త్రీకి తన పతి పట్ల చాలా ప్రేమ ఉంటుంది. ఇచ్చట మీరందరూ నా పిల్లలు. అయినా నంబరువారుగా ఉంటారు కదా.
ఇటువంటి అనంతమైన తండ్రిని మనము క్షణ-క్షణము మరచిపోతామని మీకు తెలుసు. తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేసినందున మీ వికర్మలు వినాశనమైపోతాయి అయినా మీరు నన్ను మర్చిపోతారు. అరే! ఇటువంటి తండ్రి ఎవరైతే మనలను విశ్వాధికారులుగా తయారుచేస్తారో, వారిని మీరు ఎందుకు మర్చిపోతారు? మాయా తుఫానులు వస్తాయి అయినా మీరు ప్రయత్నము చేస్తూ ఉండండి. తండ్రిని స్మృతి చేస్తే మీకు వారసత్వము లభిస్తుంది. స్వర్గ వాసులైన దేవతలుగా మీరందరూ తయారవుతారు. కాకపోతే శిక్షలు అనుభవించిన తర్వాత దేవతలుగా అవుతారు. అప్పుడు పదవి కూడా చాలా తగ్గిపోతుంది. ఇవన్నీ నూతన విషయాలు. తండ్రిని, టీచరును స్మృతి చేస్తూ ఉంటే గమనము వస్తుంది. మీరు టీచరును కూడా మర్చిపోతారు. తండ్రి చెప్తున్నారు - నేను ఎంతవరకు ఉంటానో, వినాశన సమయము వస్తుందో, అన్నియు ఈ జ్ఞాన-యజ్ఞములో స్వాహా అవుతాయో అంతవరకు ఈ చదువు కొనసాగుతూ ఉంటుంది. పూర్తిగా చదివించారు కదా. ఇంకా ఏమి చదివిస్తారు? అని మీరు అడుగుతారు. బాబా చెప్తున్నారు - క్రొత్త-క్రొత్త పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. మీరు విని సంతోషిస్తారు కదా కావున మంచిరీతిగా చదవండి. సుదాముని వలె ఏది బదిలీ(ట్రాన్స్ఫర్) చేయాలో అదంతా చేస్తూ ఉండండి. ఇది చాలా పెద్ద వ్యాపారము. బాబా వ్యాపారములో చాలా విశాల హృదయులుగా ఉండేవారు. ఒక రూపాయికి ఒక్క అణా ధర్మభాగము తీసి పెట్టేవారు. భలే నష్టము వచ్చేది ఎందుకంటే అందరికంటే ముందు నేను తీయవలసి వచ్చేది. మీరు ఎంత ఎక్కువగా నింపుతారో, మిమ్ములను చూసి అందరూ నింపుతారు అని అనేవారు. అలా చేస్తే, చాలామంది కళ్యాణము జరుగుతుంది. అది భక్తి మార్గము. ఇచ్చటైతే సర్వమూ తండ్రికిచ్చేశారు. బాబా ఇదంతా తీసుకోండి అని మీరంటారు. మీకు విశ్వమంతటికీ చక్రవర్తి పదవినిస్తానని తండ్రి చెప్తున్నారు. వినాశ సాక్షాత్కారము, చతుర్భుజుని సాక్షాత్కారము జరిగాయి. ఆ సమయములో విశ్వాధికారిగా అవుతానని అర్థమయ్యింది. బాబా ప్రవేశించి ఉన్నారు కదా. వినాశనము చూశాడు. ఈ ప్రపంచము సమాప్తమవుతూ ఉంది. ఈ వ్యాపారము మొదలైనవి ఇంకా ఏమి చేయాలి? ఈ గాడిద బరువును వదిలి మనకు రాజ్య పదవి లభిస్తూ ఉంది అని అనుకున్నాడు. ఇప్పుడు ఈ మొత్తం పాత ప్రపంచమంతా వినాశనము అవ్వనున్నదని తండ్రి మీకు కూడా అర్థము చేయిస్తున్నారు. మిమ్ములను కుంభకర్ణుని నిద్ర నుండి మేల్కొలిపేందుకు ఎంత పురుషార్థము చేయిస్తున్నారు. అయినా మీరు మేలుకోరు కనుక పిల్లలైన మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. సర్వమూ తండ్రికి ఇచ్చేశారు. అందువలన తప్పకుండా ఒక్క తండ్రి మాత్రమే గుర్తుకు వస్తారు. పిల్లలైన మీరు ఎక్కువగా స్మృతి చేయగలరు. బంధనములో ఉన్న మాతల సమాచారము చాలా అందుతుంది. పాపము దెబ్బలు తింటున్నారని అని బాబాకు ఆలోచన కలుగుతుంది. వారి పతులు వారిని ఎంతగానో సతాయిస్తారు. ఇదంతా డ్రామాలో ఉందని, ఏమీ చేయలేరని అర్థము చేసుకుంటారు. కల్పక్రితము కూడా అబలల పై అత్యాచారాలు జరిగాయి. నూతన ప్రపంచ స్థాపన జరగనే జరుగుతుంది. తండ్రి చెప్తున్నారు - అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమ సమయములో ప్రవేశిస్తాను. మనమే పవిత్రంగా ఉండేవారము. ఇప్పుడు అపవిత్రమైపోయాము. నేనే మొదటి నంబరులో వెళతాను. నేను వెళ్లి కృష్ణునిగా అవుతాను. ఈ చిత్రమును చూచినప్పుడు నేను వెళ్లి ఇలా తయారవుతాను అనే ఆలోచన వస్తుంది. ఇప్పుడు తండ్రి పిల్లలకు మంచి రీతిగా అర్థము చేయిస్తున్నారు. అర్థము చేసుకొని ఇతరులకు అర్థము చేయించుట పిల్లల కర్తవ్యము. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మేము గోపీ వల్లభుని గోప-గోపికలము అను ఖుషీ లేక నషాలో ఉండాలి. అంతర్ముఖులుగా అయ్యి తండ్రి సమానము విచార సాగర మథనము చేసి తండ్రి సమానము టీచరుగా అవ్వాలి.
2. సుదాముని వలె తమదంతా బదిలీ చేసి జత-జతలో చదువు కూడా మంచిరీతిగా చదువుకోవాలి. వినాశనానికి ముందే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. కుంభకర్ణుని నిద్రలో నిదురిస్తున్న వారిని మేల్కొల్పాలి.
వరదానము :-
'' త్రికాలదర్శులుగా అయ్యి దివ్యబుద్ధి వరదానాన్ని కార్యములో ఉపయోగించే సఫలతా సంపన్న భవ ''
బాప్దాదా ప్రతి పుత్రునికి దివ్యబుద్ధిని వరదానంగా ఇచ్చారు. దివ్యబుద్ధి ద్వారానే తండ్రిని, స్వయాన్ని, మూడు కాలాలను స్పష్టంగా తెలుసుకోగలరు, సర్వ శక్తులను ధారణ చేయగలరు. దివ్యబుద్ధి గల ఆత్మ ఏ సంకల్పమును అయినా, కర్మ లేక వాచాలోకి తీసుకొచ్చేందుకు ముందు ప్రతి మాట, ప్రతి కర్మల మూడు కాలాలను తెలుసుకొని ఆచరణలోకి వస్తుంది. వారి ముందు భూతకాలమే కాక భవిష్యత్తు కూడా వర్తమానమంత స్పష్టంగా ఉంటుంది. ఇటువంటి దివ్యబుద్ధి గలవారు త్రికాలదర్శులుగా ఉన్న కారణంగా సదా సఫలతా సంపన్నులుగా అవుతారు.
స్లోగన్ :-
'' సంపూర్ణ పవిత్రతను ధారణ చేయువారే పరమానందాన్ని అనుభవం చేయగలరు. ''