22-03-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - అవినాశి జ్ఞాన రత్నాలు మిమ్ములను రాజులుగా చేస్తాయి. ఇది అనంతమైన పాఠశాల. మీరు చదవాలి, ఇతరులను చదివించాలి. జ్ఞాన రత్నాలతో జోలెను నింపుకోవాలి. ''

ప్రశ్న :-

ఎటువంటి పిల్లలు అందరికి ప్రియమనిపిస్తారు? ఉన్నత పదవి పొందేందుకు ఏ పురుషార్థము అవసరము ?

జవాబు :-

ఎవరైతే తమ జోలెను నింపుకొని అనేకమందికి దానము చేస్తారో, వారు అందరికీ ప్రియమనిపిస్తారు. ఉన్నత పదవి కొరకు అనేకమంది ఆశీర్వాదాలు కావాలి. ఇందులో ధనానికి సంబంధించిన విషయము లేదు కానీ జ్ఞాన ధనము ద్వారా అనేకమంది కళ్యాణము చేస్తూ ఉండండి. ప్రసన్నచిత్తులు మరియు యోగీ పిల్లలే తండి పేరును ప్రసిద్ధము చేస్తారు.

ఓంశాంతి.

ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. మనము ఇప్పుడు వాపస్‌ వెళ్లాలని పిల్లలకు తెలుసు. ఇంతకుముందు ఈ విషయము పూర్తిగా తెలియదు. తండ్రి తన పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. డ్రామానుసారము వారు అర్థం చేయించు విషయాలు సరియైనవని ఇప్పుడు తెలుస్తోంది. ఇతరులెవ్వరూ ఈ విధంగా అర్థం చేయించలేరు. ఇప్పుడు మనము వాపస్‌ వెళ్ళాలి. అపవిత్రులెవ్వరూ వాపస్‌ వెళ్లలేరు. ఈ జ్ఞానము కూడా ఈ సమయములో మాత్రమే లభిస్తుంది, దీనిని ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. మొట్టమొదట మేము వాపస్‌ వెళ్ళాలి అను విషయాన్ని గుర్తుంచుకోవాలి. బాబాను పిలుస్తారు కానీ ఈ విషయాలు కొద్దిగా కూడా తెలియవు. సమయము వచ్చినప్పుడు అకస్మాత్తుగా బాబా వచ్చేశారు. ఇప్పుడు క్రొత్త క్రొత్త విషయాలు అర్థము చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు మనము వాపస్‌ వెళ్ళాలని, కనుక పతితుల నుండి పావనంగా అవ్వాలని పిల్లలకు తెలుసు. పావనంగా అవ్వకుంటే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. అంతేకాక పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఇక్కడ రాజుకు, నిరుపేదకు ఎంత వ్యత్యాసముందో, అలా అక్కడ రాజులు పేదలుగా అవుతారు. మొత్తం ఆధారమంతా పురుషార్థము పైనే ఉంది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - స్వయం మీరు కూడా పతితులుగా ఉండేవారు. అందుకే నన్ను పిలిచారు. ఈ విషయాలు కూడా ఇప్పుడు మీకు అర్థం చేయిస్తున్నారు. అజ్ఞాన కాలములో ఈ విషయాలు బుద్ధిలో లేవు. తండ్రి చెప్తున్నారు - ఆత్మ ఏదైతే తమోప్రధానంగా అయ్యి ఉందో, అది సతోప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు సతోప్రధానంగా ఎలా అవ్వాలో - ఇది కూడా సీఢీ(మెట్ల) చిత్రములో తెలుపబడింది. దీనితో పాటు దైవీగుణాలు కూడా ధారణ చేయాలి. ఇది అనంతమైన పాఠశాల. పాఠశాలలో గుడ్‌(మంచి), బెటర్‌(అతిమంచి), బెస్ట్‌(అత్యంత మంచి‌) అని విద్యార్థులకు రిజిస్టర్‌ ఉంచుతారు. ఎవరైతే సేవాధారి పిల్లలుగా ఉన్నారో వారు చాలా మధురమైనవారు. వారి రిజిష్టరు బాగుంటుంది. ఒకవేళ రిజిష్టరు బాగలేకుంటే వారికి ఉత్సాహముండదు. మొత్తం ఆధారమంతా చదువు, యోగము మరియు దైవీగుణాల ధారణ పై ఉంది. అనంతమైన తండ్రి మనలను చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. మొదట మనము శూద్ర వర్ణానికి చెందినవారము. ఇప్పుడు మనది బ్రాహ్మణ వర్ణము. ప్రజాపిత బ్రహ్మ పిల్లలైన మనము ఇప్పుడు బ్రాహ్మణులము. ఇది చాలామంది మర్చిపోతారు. తండ్రిని స్మృతి చేసినప్పుడు బ్రహ్మను కూడా స్మృతి చేయవలసి ఉంటుంది. మనము బ్రాహ్మణ కులానికి చెందిన వారమనే నషా కూడా ఉండాలి. మర్చిపోతే మనము బ్రాహ్మణ కులానికి చెందినవారము, తర్వాత దేవతా కులానికి చెందిన వారిగా అవుతామనే నషా ఎక్కదు. బ్రాహ్మణ కులాన్ని ఎవరు తయారు చేశారు? నేను బ్రహ్మ ద్వారా మిమ్ములను బ్రాహ్మణ కులములోకి తీసుకొస్తాను. బ్రాహ్మణ వంశము కాదు. చిన్న కులము. స్వయాన్ని బ్రాహ్మణులుగా భావిస్తే దేవతలుగా కూడా అవుతారు. మీ మీ పనులలో లగ్నమైనందున ఈ విషయాలన్నీ మర్చిపోతారు. బ్రాహ్మణ లక్ష్యాన్ని కూడా మర్చిపోతారు. పనుల నుండి విడుదలైన వెంటనే పురుషార్థము చేయాలి. కొంతమందికి వ్యాపార వ్యవహారాల పై ఎక్కువగా గమనమివ్వవలసి వస్తుంది. పని పూర్తి అవుతూనే మళ్లీ మీ విషయములో స్థిరమైపోవాలి. స్మృతిలో కూర్చొండి. మీ వద్ద ఉన్న బ్యాడ్జ్‌ చాలా బాగుంది. అందులో లక్ష్మీనారాయణ చిత్రము కూడా ఉంది. త్రిమూర్తి చిత్రము కూడా ఉంది. బాబా మనలను ఈ విధంగా(లక్ష్మినారాయణులు) తయారు చేస్తారు - ఇదే మన్మనాభవ. కొంతమంది అలవాటు పడ్తారు. కొంతమందికి అలవాటు కాదు. ఇప్పుడు భక్తి పూర్తి అయ్యింది, ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. అనంతమైన తండ్రి మీకిప్పుడు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు కనుక మీకు ఖుషీ ఉంటుంది. కొంతమందికి మంచి లగన్‌(ఆకర్షణ) ఏర్పడ్తుంది. కొంతమందికి చాలా తక్కువగా ఉంటుంది. ఇది చాలా సహజమైన విషయము.

గీత ఆదిలో, అంత్యములో 'మన్మనాభవ' అనే పదముంది. ఇది అదే గీతా అధ్యాయము. కేవలం కృష్ణుని పేరు వేశారు. భక్తిమార్గములో ఏవైతే దృష్టాంతాలు మొదలైనవి ఉన్నాయో అవన్నీ ఈ సమయానికి చెందినవే. భక్తిమార్గములో ఎవ్వరూ దేహ భావమును కూడా వదలండి, స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్పరు. ఇచ్చట మీకు తండ్రి వస్తూనే ఈ శిక్షణ ఇస్తారు. మన ద్వారా దేవీదేవతా ధర్మస్థాపన జరుగుతోందని మీకు నిశ్చయముంది. రాజధాని కూడా స్థాపన అవుతూ ఉంది. ఈ స్థాపనలో యుద్ధము మొదలైన విషయాలేవీ లేవు. తండ్రి మీకిప్పుడు పవిత్రతను నేర్పిస్తున్నారు. ఇది అర్ధకల్పము స్థిరంగా ఉంటుంది. అక్కడ రావణ రాజ్యము ఉండనే ఉండదు. ఇప్పుడు మీరు వికారాల పై విజయము పొందుతున్నారు. మనము కల్పక్రితము ఎలాగైతే రాజధాని స్థాపన చేశామో ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తున్నామని మీకు తెలుసు. మన కొరకు ఈ పాత ప్రపంచము సమాప్తము అవ్వనున్నది. డ్రామా చక్రము తిరుగుతూ ఉంటుంది. అక్కడ బంగారమే బంగారముంటుంది. ఒకప్పుడు ఏది ఉండేదో అది మళ్లీ ఉంటుంది. ఇందులో తికమకపడే విషయమేదీ లేదు. మాయామశ్చీంద్ర నాటకాన్ని చూపిస్తారు. కల(ధ్యానము)లో బంగారు ఇటుకలు చూశారు. మీరు కూడా వైకుంఠములో బంగారు మహళ్ళు చూస్తారు. అచ్చటి వస్తువులను మీరు ఇక్కడికి తీసుకురాలేరు. ఇది సాక్షాత్కారము భక్తిమార్గములో మీకు ఈ విషయాలు తెలియవు. ఇప్పుడు మిమ్ములను తీసుకెళ్లేందుకు నేను వచ్చానని తండ్రి చెప్తున్నారు. మీరు లేకుంటే నాకు సుఖము ఉండదు. సమయము వచ్చినప్పుడు నాకు అసౌఖ్యమనిపిస్తుంది. పిల్లలు చాలా దు:ఖపడ్తున్నారు, పిలుస్తున్నారు. ఇక పోదాము అనిపిస్తుంది. ఇక పోవాల్సిందేనని జాలి కలుగుతుంది. డ్రామాలో సమయము అయినప్పుడు ఇక వెళ్లాలని ఆలోచన కలుగుతుంది. విష్ణువు అవతరణ అనే నాటకము చూపిస్తారు కానీ విష్ణు అవతరణ జరగనే జరగదు. రోజురోజుకు మనుష్యుల బుద్ధి ఖాళీ అవుతూ పోతుంది. కొద్దిగా కూడా అర్థము కాదు. ఆత్మ పతితమైపోయింది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - పిల్లలూ! పావనంగా అయితే రామరాజ్యము వస్తుంది. రాముడంటే ఎవరో తెలియదు. ఏ శివుని పూజిస్తున్నారో వారిని రాముడని అనరు. శివబాబా అనడం శోభిస్తుంది. భక్తిమార్గములో ఎలాంటి సారమూ(రసానుభూతి) లేదు. ఇప్పుడు మీకు సారము వస్తుంది. తండ్రి స్వయంగా చెప్తున్నారు - మధురమైన పిల్లలూ! నేను మిమ్ములను తీసుకెళ్లేందుకు వచ్చాను. మళ్లీ మీ ఆత్మ అక్కడి నుండి దానంతకదే సుఖధామములోకి వెళ్లిపోతుంది. అక్కడ(సత్యముగములో) నేను మీ జతలో ఉండను. మీ స్థితి అనుసారము మీ ఆత్మ వెళ్లి మరో శరీరములో గర్భములో ప్రవేశిస్తుంది. సముద్రములో రావి ఆకు పై శ్రీ కృష్ణుడు వచ్చినట్లు చూపిస్తారు. వాస్తవానికి సాగరము విషయమే లేదు. గర్భములో చాలా సుఖంగా ఉంటారు. బాబా చెప్తున్నారు - నేను గర్భములో ప్రవేశించను. నేను ఇతని(బ్రహ్మ) శరీరములో ప్రవేశము చేస్తాను. నేను బాలునిగా అవ్వను. నా బదులుగా కృష్ణుని బాలునిగా భావించి మనసును ఆహ్లాదపరుస్తారు. కృష్ణుడే జ్ఞానాన్ని ఇచ్చారనుకొని చాలా ప్రేమిస్తారు. నేను అందరినీ జతలో తీసుకెళ్తాను. మళ్లీ మిమ్ములను పంపిస్తాను. తర్వాత నా పాత్ర పూర్తవుతుంది. అర్ధకల్పము నాకు ఏ పాత్రా ఉండదు. మళ్లీ భక్తిమార్గములో నా పాత్ర ప్రారంభమవుతుంది. ఇది కూడా తయారు చేయబడిన డ్రామా.

ఇప్పుడు పిల్లలకు జ్ఞానము అర్థము చేసుకునేందుకు, ఇతరులకు చేయించేందుకు సులభము. ఇతరులకు వినిపిస్తే చాలా సంతోషము కలుగుతుంది, అంతేకాక పదవి ఉన్నతమైనది కూడా పొందుతారు. ఇక్కడ కూర్చొని వింటున్నంత వరకు చాలా బాగుందనిపిస్తుంది. వెలుపలికి వెళ్తూనే మర్చిపోతారు. ఉదాహరణకు జైలు పక్షులు ఉంటాయి కదా. ఏదో ఒక తప్పు చేసి జైలుకు వెళ్తూనే ఉంటారు. మీ స్థితి కూడా ఇలాగే ఉంటుంది. గర్భములో ఇక మీదట తప్పు చేయనని ప్రతిజ్ఞ చేసి మళ్లీ అలాగే తప్పు చేస్తూ ఉంటారు. మనుష్యులు పాప కర్మలు చేయకుండా ఉండేందుకు ఇలాంటి విషయాలు తయారు చేయబడ్డాయి. ఆత్మ తన వెంట సంస్కారాలు తీసుకెళ్తుంది. అందుకే కొందరు బాల్యములోనే పండితులైపోతారు. ఆత్మ నిర్లేపమని మనుష్యులు భావిస్తారు. కానీ ఆత్మ నిర్లేపము కాదు. మంచి లేక చెడు సంస్కారాలను ఆత్మయే తీసుకెళ్తుంది అప్పుడే కర్మభోగమును అనుభవిస్తుంది. ఇప్పుడు మీరు పవిత్ర సంస్కారాలు తీసుకెళ్తారు. మీరు చదువుకొని మళ్లీ పదవిని పొందుతారు. బాబా ఆత్మల గుంపునంతటినీ వాపస్‌ తీసుకెళ్తారు. కొన్ని ఆత్మలు మాత్రమే మిగిలి ఉంటాయి. అవి చివరిలో వస్తూ ఉంటాయి. ఏ ఆత్మలైతే చివరిలో రావాలో అవి అచ్చటనే పరంధామములో ఉంటాయి. ఇది మాల కదా. నంబరువారుగా తయారవుతూ ఉంటారు. చివరిలో తయారయ్యే వారు స్వర్గములో కూడా చివరిలోనే వస్తారు. బాబా ఎంతో బాగా అర్థము చేయిస్తారు. అయితే కొంతమందికి ధారణ అవుతుంది, కొంతమందికి ధారణ అవ్వదు. స్థితి ఎలా ఉంటుందో పదవి కూడా అలాంటిదే లభిస్తుంది. పిల్లలైన మీరు దయాహృదయులుగా, కళ్యాణకారులుగా అవ్వాలి. డ్రామాయే ఇలా తయారు చేయబడింది. ఎవ్వరిదీ దోషము లేదు. కల్పక్రితము ఎంత చదువుకొని ఉంటారో అంతే చదువుకుంటారు. ఎక్కువగా జరగదు. ఎంత పురుషార్థము చేయించినా వ్యత్యాసమేమీ ఉండదు. ఎవరికైనా వినిపించినప్పుడు వ్యత్యాసము తెలుస్తుంది. నెంబరువారుగా ఉండనే ఉన్నారు. రాజు ఎక్కడ, పేద ఎక్కడ! ఈ అవినాశి జ్ఞాన రత్నాలు రాజులుగా చేస్తాయి. పురుషార్థము చేయకుంటే పేదవారిగా అవుతారు. ఇది అనంతమైన పాఠశాల ఇందులో ఫస్ట్‌, సెకండు, థర్డ్‌(ప్రథమ, ద్వితీయ, తృతీయ/ఖీఱతీర్‌, ూవషశీఅస, ుష్ట్రఱతీస) ఉంటారు. భక్తిలో చదువు విషయమేదీ లేదు. అదంతా క్రిందికి దిగజారే విషయమే. చాలా శోభిస్తూ ఉంటుంది. వీణ వాయిస్తారు, స్తుతి చేస్తారు కానీ ఇచ్చట శాంతిగా ఉండాలి. భజనలు మొదలైనవేవీ లేవు. మీరు అర్ధకల్పము భక్తి చేశారు, భక్తిలో ఎంతో ఆడంబరము ఉంటుంది. అందరికీ వారి వారి పాత్రలున్నాయి. కొంతమంది క్రింద పడిపోతారు, కొంతమంది ఉన్నతి చెందుతారు, కొంతమంది అదృష్టము బాగుంటుంది, కొంతమందికి తక్కువ భాగ్యముంటుంది. బాబా ఏమో ఏకరస పురుషార్థము చేయిస్తారు. చదువు కూడా ఒక్కటే, టీచరు కూడా ఒక్కరే. మీరందరూ మాస్టరులే. కొంతమంది పెద్ద మనుష్యులు ఫుర్సత్‌(తీరిక) లేదు అని అంటారు. అప్పుడు మీ ఇంటికి వచ్చి చెప్పమంటారా? అని అడగండి. ఎందుకంటే వారికి తమ అహంకారముంటుంది. ఒక్కరిని పట్టుకుంటే ఇతరుల పై కూడా ప్రభావము పడ్తుంది. ఒకవేళ ఎవరికైనా వారు ఈ జ్ఞానము బాగుంది అని చెప్తే, అరే! వీరికి కూడా బ్రహ్మకుమారీల రంగు పడింది అని అంటారు. అందువలన బాగుంది అని మాత్రము అంటారు. పిల్లలలో మంచి యోగశక్తి ఉండాలి. జ్ఞాన ఖడ్గములో యోగమనే పదును ఉండాలి. ప్రసన్నచిత్తులుగా, యోగులుగా ఉంటే పేరు ప్రఖ్యాతము చేస్తారు. నంబరువారుగా ఉన్నారు. రాజధాని తయారవ్వాలి. ధారణ అయితే చాలా సులభమని తండ్రి చెప్తున్నారు. బాబాను ఎంతగా స్మృతి చేస్తారో అంత ప్రేమ కలుగుతుంది. ఆకర్షణ ఉంటుంది. సూది శుద్ధంగా ఉంటే అయస్కాంతము తన వైపుకు లాక్కుంటుంది. సూది పై త్రుప్పు ఉంటే అయస్కాంతము లాక్కోలేదు. ఇది కూడా అటువంటిదే. మీరు శుభ్రమైపోతే మొదటి నెంబరులో వెళ్లిపోతారు. తండ్రి స్మృతి ద్వారా తుప్పు వదిలి పోతుంది.

గురువు గారు, మీ సమర్పణ అత్యంత గొప్పది,......... అనే గాయనముంది. అందువలన గురు బ్రహ్మ, గురు విష్ణు అని అంటారు. అచ్చట నిశ్చితార్థము చేయించే గురువు మానవుడు. మీరు శివునితో నిశ్చితార్థము చేసుకున్నారు, బ్రహ్మతో కాదు. కావున శివబాబానే స్మృతి చేయాలి. దళారి(బ్రహ్మ) చిత్రము కూడా అవసరము లేదు. నిశ్చితార్థము పక్కా అయిన తర్వాత ఒకరినొకరు స్మృతి చేసుకుంటూ ఉంటారు. ఇతనికి కూడా దళారి రుసుము లభిస్తుంది. నిశ్చితార్థానికి కూడా లభిస్తుంది కదా. అంతేకాక ఇతనిలో ప్రవేశిస్తారు. వీరి దేహమును అప్పుగా తీసుకుంటారు. కనుక బ్రహ్మ కూడా ఆకర్షిస్తారు. మీరు ఎంత ఎక్కువమందికి కళ్యాణము చేస్తారో అంత మీకు ఫలితము లభిస్తుందని పిల్లలకు కూడా తెలియజేస్తారు. ఇవన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయాలు. ఇతరులకు జ్ఞానము ఇస్తూ ఉంటే ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇక్కడ ధనముతో అవసరము లేదు. మమ్మా వద్ద భలే ధనము లేకున్నా చాలామందికి కళ్యాణము చేశారు. డ్రామాలో ప్రతి ఒక్కరికీ పాత్ర ఉంది. కొంతమంది ధనవంతులు ధనమునిస్తారు. మ్యూజియం నిర్మిస్తారు. దీని వలన చాలామంది ఆశీర్వాదాలు లభిస్తాయి. వారికి మంచి ధనవంతుల పదవి లభిస్తుంది. ధనవంతుల వద్ద అనేకమంది దాస-దాసీలు ఉంటారు. ప్రజలలో ధనవంతుల వద్ద చాలా ధనముంటుంది. వారి నుండి అప్పు తీసుకుంటారు. ధనవంతులుగా అవ్వడం కూడా మంచిదే అయితే ఇచ్చటి పేదలే అచ్చట ధనవంతులుగా అవుతారు. ఇచ్చట ధనవంతులకు ధైర్యము ఎక్కడ ఉంది! ఈ బ్రహ్మ ఒక్క క్షణములో సర్వస్వమూ ఇచ్చేశారు. ఎవరి చేయి ఇచ్చేదిగా ఉంటే........ అని అంటారు. బాబా ప్రవేశించిన వెంటనే అన్నిటి నుండి విడిపించారు. కరాచీలో మీరు ఎలా ఉండేవారు? పెద్ద పెద్ద ధనవంతులు, మోటారు కార్లు, బస్సులు మొదలైనవన్నీ ఉండేవి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - ఆత్మాభిమానులుగా అవ్వండి. భగవంతుడే చదివిస్తున్నారంటే మనకు ఎంత నషా ఎక్కి ఉండాలి! తండ్రి మీకు అంతులేని ఖజానాలను ఇస్తున్నారు. మీరు ధారణ చేయరు. తీసుకునే ధైర్యము లేదు. శ్రీమతమును అనుసరించరు. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ! మీ జోలెను నింపుకోండి. వారు శంకరుని ముందుకెళ్లి జోలె నింపమంటారు. బాబా ఇచ్చట అనేకమంది జోలెను నింపుతారు. వెలుపలికి వెళ్తూనే జోలె ఖాళీ అయిపోతుంది. తండ్రి చెప్తున్నారు - మీకు చాలా గొప్ప ఖజానాలు ఇస్తాను. జ్ఞానరత్నాలతో మీ జోలెను నింపి నింపి ఇస్తాను. అలా ఇస్తున్నా తమ జోలెను నింపుకొనువారు నంబరువారుగా ఉన్నారు. వారు మళ్లీ దానము కూడా చేస్తారు. అందరికీ ప్రియంగా కూడా ఉంటారు. మీ వద్దనే లేకుంటే ఇతరులకేమి ఇస్తారు?

84 జన్మల చక్రమును మీరు బాగా అర్థము చేసుకొని, ఇతరులకు అర్థము చేయించాలి. పోతే యోగము కొరకు శ్రమించాలి. ఇప్పుడు మీరు యుద్ధ మైదానములో ఉన్నారు. మాయ పై విజయము పొందుకునేందుకు మీరు యుద్ధము చేస్తారు. ఉత్తీర్ణులుగా అవ్వకుంటే చంద్రవంశములోకి వెళ్ళిపోతారు. ఇది అర్థము చేసుకునే విషయము. పిల్లలకు అపారమైన ఖుషీ ఉండాలి - బాబా మీరు మాకు ఎంత గొప్ప వారసత్వమునిస్తున్నారు! లేస్తూ - కూర్చుంటూ పూర్తి రోజంతా ఇది బుద్ధిలో ఉండాలి. అప్పుడే ధారణ అవుతుంది. ముఖ్యమైనది యోగము. యోగము ద్వారానే మీరు విశ్వాన్ని పవిత్రంగా చేస్తారు. జ్ఞానమనుసారము మీరు రాజ్య పాలన చేస్తారు. ఇచ్చటి ధనము మొదలైనవన్నియు మట్టిలో కలిసిపోతాయి. పోతే ఈ అవినాశి సంపాదన అంతా మీ తోడుగా వస్తుంది. ఎవరు తెలివిగలవారుగా ఉంటారో వారు బాబా నుండి పూర్తి వారసత్వము తీసుకుంటామని అంటారు. భాగ్యములో లేకుంటే చాలా చిన్న పదవి (పైసా పదవి) పొందుతారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మీ చదువు రిజిస్టరును, దైవీగుణాల రిజిస్ట్టరును సరిగ్గా ఉంచుకోవాలి. చాలా చాలా మధురంగా తయారవ్వాలి. మనము బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులము అనే నషా ఉండాలి.

2. సర్వుల ప్రేమ, ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునేందుకు మీ జోలెను జ్ఞానరత్నాలతో నింపుకొని దానమివ్వాలి, చాలా మంది కళ్యాణము చేసేందుకు నిమిత్తంగా అవ్వాలి.

వరదానము :-

'' తండ్రి ప్రేమలో మీలోని ముఖ్యమైన బలహీనతను సమర్పణ(బలి) చేసే జ్ఞానయుక్త ఆత్మా భవ ''

మెజారిటి పిల్లలలో ఇంకా పంచ వికారాల వ్యర్థ సంకల్పాలు నడుస్తున్నాయని బాప్‌దాదా గమనించారు. జ్ఞానీ ఆత్మలలో కూడా అప్పుడప్పుడు తమ గుణాలు లేక విశేషతల అభిమానము వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరికి తమ ముఖ్యమైన బలహీనత లేక మూల సంస్కారమేదో కూడా తెలుసు, ఆ బలహీనతను తండ్రి ప్రేమలో సమర్పణ చేయడమే ప్రేమకు ఋజువు. స్నేహీ లేక జ్ఞానయుక్త ఆత్మలు తండ్రి ప్రేమలో వ్యర్థ సంకల్పాలను కూడా సమర్పణ చేసేస్తారు.

స్లోగన్‌ :-

'' స్వమానమనే సీటు పై స్థితమై ఉండి అందరికి గౌరవమిచ్చే గౌరవనీయ (మాననీయ) ఆత్మలుగా అవ్వండి. ''