15-07-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - తండ్రి జ్ఞాన రత్నాలను ఇచ్చేందుకు, మురళి వినిపించేందుకు వచ్చారు. అందువలన మీరెప్పుడూ మురళి మిస్‌ చేయరాదు. మురళి పై ప్రేమ లేకుంటే తండ్రి పై కూడా ప్రేమ లేనట్లే.''

ప్రశ్న :-

ఈ జ్ఞానము ద్వారా ధారణ చేసే అన్నింటికంటే మంచి స్వభావము(క్యారెక్టర్‌) ఏది?

జవాబు :-

నిర్వికారులుగా అవ్వడము అన్నిటికంటే మంచి స్వభావము. ఈ ప్రపంచమంతా వికారాలతో నిండి ఉంది. వికారమంటేనే సంస్కార హీనము. ఈ జ్ఞానము మీకిప్పుడు లభించింది. నిర్వికారి ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వచ్చారు. నిర్వికారి దేవతలు సత్‌ శీలము(మంచి స్వభావము) గలవారు. తండ్రి స్మృతి ద్వారా స్వభావము బాగుపడ్తుంది.

ఓంశాంతి.

పిల్లలారా! మీరు చదువును ఎప్పటికీ మిస్‌ చేయరాదు. ఒకవేళ చదువును మిస్‌ చేస్తే పదవి నుండి కూడా మిస్‌ అయిపోతారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, ఎక్కడ కూర్చుని ఉన్నారు? భగవంతుని ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయములో కూర్చుని ఉన్నారు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత మనము ఈ విశ్వవిద్యాలయములో చేరుతామని, మన తండ్రి కేవలం తండ్రే కాక టీచరు, గురువు కూడా అని మీకు తెలుసు. ప్రపంచములో తండ్రి, టీచరు, గురువు వేరు వేరుగా ఉంటారు. కానీ ఇక్కడ ముగ్గురూ ఒకే మూర్తి. కానీ ముగ్గురి కర్తవ్యము చేస్తున్నారు అనగా తండ్రిగా అవుతారు, టీచరుగా కూడా అవుతారు, గురువుగా కూడా అవుతారు. మానవ జీవితములో ఈ ముగ్గురు ముఖ్యులు. వారే తండ్రి, టీచరు మరియు గురువు. మూడు పాత్రలు స్వయంగా వారే అభినయిస్తారు. ఒక్కొక్క విషయాన్ని అర్థము చేసుకొని పిల్లలైన మీరు చాలా సంతోషంగా ఉండాలి. అంతేకాక ఇలాంటి త్రిమూర్తి విశ్వవిద్యాలయములో చాలా మందిని తీసుకొచ్చి చేర్పించాలి. ఏయే విశ్వవిద్యాలయములో చదువు బాగుంటుందో, అక్కడ చదువుకునేవారు ఇతరులకు కూడా ఈ విశ్వవిద్యాలయములో చదవండి, ఇక్కడ చాలా మంచి చదువు లభిస్తుంది మరియు స్వభావము కూడా బాగుపడ్తుందని చెప్తూ ఉంటారు. పిల్లలైన మీరు కూడా ఇతరులను తీసుకురావాలి. మాతలకు మాతలు, పురుషులకు పురుషులు అర్థం చేయించాలి. చూడండి! వీరు తండ్రి, టీచరు మరియు గురువు కూడా. ఈ విధంగా అర్థం చేయిస్తున్నామా? లేదా అని ప్రతి ఒక్కరు తమను తాము మనస్సులో ప్రశ్నించుకోండి. వీరు సుప్రీమ్‌ తండ్రి, సుప్రీమ్‌ టీచరు మరియు సుప్రీమ్‌ గురువు కూడా అని ఎప్పుడైనా తమ బంధు-మిత్రులకు, సఖులకు తండ్రిని గురించి అర్థం చేయించారా? ఈ తండ్రి సుప్రీమ్‌(పరమ) తండ్రి, దేవీదేవతలుగా తయారు చేస్తారు. తండ్రి తమ సమానంగా అనగా తండ్రిగా చేయరు. పోతే వారి మహిమలో పిల్లలను కూడా తమ సమానంగా చేస్తారు. తండ్రి కర్తవ్యము - పాలన, పోషణ చేయడం, ప్రేమించడం. ఇలాంటి తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. వారిని ఎవ్వరితోనూ పోల్చలేము. గురువు ద్వారా శాంతి లభిస్తుందని చెప్తారు కానీ వీరు విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. నేను సర్వ ఆత్మలకు తండ్రినని ఎవ్వరూ చెప్పరు. సర్వాత్మలకు తండ్రి ఎవరో ఎవ్వరికీ తెలియదు. ఒకే బేహద్‌ తండ్రిని హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ గాడ్‌ఫాదర్‌ అని తప్పకుండా అంటారు. బుద్ధి తప్పకుండా నిరాకారుని వైపుకే వెళ్తుంది. ఇది ఎవరు చెప్తారు? గాడ్‌ఫాదర్‌ అని ఆత్మయే చెప్తుంది. అందువలన వారిని తప్పకుండా కలుసుకోవాలి కదా. కేవలం తండ్రి అని అంటూ వారిని ఎప్పుడూ కలవకపోతే వారు తండ్రి ఎలా అవుతారు? ప్రపంచములోని పిల్లలందరికి ఉన్న ఆశను వారు పూర్తి చేస్తారు. శాంతిధామానికి వెళ్లాలనే కోరిక అందరికీ ఉంటుంది. ఆత్మకు ఇల్లు గుర్తుకొస్తుంది. రావణ రాజ్యములో ఆత్మ అలసిపోయింది. ఆంగ్లములో కూడా ఓ భగవంతుడా, తండ్రీ(గాడ్‌ ఫాదర్‌)! ముక్తము(లిబరేట్‌) చేయండి అని వేడుకుంటారు. తమోప్రధానమౌతూ పాత్ర చేస్తూ చేస్తూ శాంతిధామానికి వెళ్లిపోతారు. మళ్లీ మొదట సుఖధామములోకి వస్తారు. అంతేకాని మొదట వస్తూనే వికారులుగా అవుతారని కాదు. ఇది వేశ్యాలయము. రావణ రాజ్యము. దీనిని రౌరవ(భయంకరమైన) నరకము అని అంటారని తండ్రి అర్థం చేయిస్తారు.

భారతదేశములో లేక ఈ ప్రపంచములో ఎన్ని శాస్త్రాలు, ఎన్ని చదువుకునే పుస్తకాలు ఉన్నాయి! ఇవన్నీ సమాప్తమైపోతాయి. తండ్రి మనకిచ్చే కానుక ఎప్పటికీ కాలిపోయేది కాదు. ఇది ధారణ చేయాల్సిన విషయము. పనికిరాని వస్తువులు తగులవేయబడ్తాయి. తగులబెట్టేందుకు ఈ జ్ఞానము, శాస్త్రమేమీ కాదు. మీకు లభించు ఈ జ్ఞానము ద్వారా 21 జన్మల వరకు పదవిని పొందుతారు. దీని శాస్త్రాలను కాల్చివేయరు. ఈ జ్ఞానము దానంతట అదే ప్రాయ: లోపమైపోతుంది. ఈ జ్ఞానము చదివే పుస్తకము వంటిది కాదు. జ్ఞాన-విజ్ఞాన భవనము అనే పేరు కూడా ఉంది. కానీ దానికి ఈ పేరు ఎందుకు వచ్చింది? దీని అర్థమేమిటి? అని ఎవ్వరికీ తెలియదు. జ్ఞాన విజ్ఞానాల మహిమ ఎంతో గొప్పది! జ్ఞానము అనగా సృష్టి చక్ర జ్ఞానము. దానిని మీరిప్పుడు ధారణ చేస్తారు. విజ్ఞానమనగా శాంతిధామము. జ్ఞానము నుండి కూడా మీరు అతీతంగా వెళ్తారు. జ్ఞానములోని చదువు ఆధారముతో మళ్లీ మీరు రాజ్యము చేస్తారు. ఆత్మలందరి తండ్రి వచ్చి చదివిస్తున్నారని మీరు భావిస్తారు. లేకపోతే భగవానువాచ అనునది లోపిస్తుంది. భగవంతుడు ఏ శాస్త్రాలను చదువుకొని రారు. భగవంతునిలో అయితే జ్ఞానము - విజ్ఞానము రెండూ ఉన్నాయి. ఎవరు ఎలా ఉంటారో, అలా ఇతరులను తయారు చేస్తారు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. జ్ఞానము కంటే విజ్ఞానము చాలా సూక్ష్మమైనది. జ్ఞానము కంటే అతీతంగా వెళ్లాలి. జ్ఞానము స్థూలమైనది. మనము చదివించినప్పుడు శబ్ధము వస్తుంది కదా. విజ్ఞానము సూక్ష్మమైనది. ఇందులో శబ్ధము నుండి అతీతంగా శాంతిలోకి వెళ్లాల్సి ఉంటుంది. అటువంటి శాంతి కొరకే వెతుకుతూ ఉన్నారు. సన్యాసుల వద్దకు వెళ్తారు. కానీ తండ్రి వద్ద ఉన్న వస్తువు మరెవ్వరి నుండి లభించజాలదు. హఠయోగము చేస్తారు. గోతిలో కూర్చుంటారు. కానీ వాటి ద్వారా ఏ శాంతి లభించదు. ఇక్కడ ఏ కష్టమూ లేదు. చదువు కూడా చాలా సహజమైనది. 7 రోజుల కోర్సు తీసుకోబడ్తుంది. 7 రోజులు కోర్సు పూర్తి చేసి ఎక్కడికౖెెనా బయటకు వెళ్లవచ్చు. ఇలాంటి కోర్సు మరే ఇతర దైహిక కాలేజీలో చేయలేరు. మీ కొరకు 7 రోజుల కోర్సు ఉంది. అందులో అన్నీ అర్థం చేయించబడ్తాయి. కానీ 7 రోజుల సమయము ఎవ్వరూ ఇవ్వలేరు. బుద్ధియోగము ఎక్కడెక్కడికో వెళ్లిపోతుంది. మీరైతే భట్టీలో ఉండేవారు. అప్పుడు ఎవరి ముఖమూ చూచేవారు కాదు. ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. బయటకు కూడా వచ్చేవారు కాదు. తపస్సు చేసేందుకు సముద్ర తీరములో స్మృతిలో కూర్చునేవారు. ఆ సమయములో ఈ చక్రము గురించి తెలియదు. ఈ చదువు గురించి కూడా అర్థమయ్యేది కాదు. మొట్టమొదట బాబాతో యోగముండాలి. తండ్రి పరిచయము కావాలి. తర్వాత టీచర్‌ కావాలి. మొదట తండ్రితో యోగమెలా జోడించాలో నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ తండ్రి అశరీరి, మరెవ్వరూ ఈ విషయము అంగీకరించరు. భగవంతుడు(గాడ్‌ఫాదర్‌) సర్వవ్యాపి అని అంటారు. అంతే. సర్వవ్యాపి జ్ఞానమే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మీ బుద్ధిలో ఆ విషయం లేదు. మీరు విద్యార్థులు. తండ్రి చెప్తున్నారు - మీ వ్యాపారాలు మొదలైనవి చేసుకోండి. కానీ తరగతిలో తప్పకుండా చదవండి. భలే గృహస్థ వ్యవహారములో కూడా ఉండండి. పాఠశాలకు వెళ్లకపోతే తండ్రి కూడా ఏమి చేయగలరు? అరే! భగవాన్‌, భగవతి(దేవీ, దేవతలు)గా చేసేందుకు స్వయం భగవంతుడే చదివిస్తున్నారు. భగవానువాచ - నేను మిమ్ములను రాజులకు రాజుగా చేస్తాను. మరి భగవంతునితో రాజయోగాన్ని నేర్చుకోరా? ఇలాంటి చదువును నేర్చుకోకుండా ఎవరు ఉండగలరు! అందుకే మీరు పారిపోయి వచ్చారు. విషము నుండి రక్షించుకునేందుకు పారిపోయి వచ్చారు. అప్పుడు మీరు వచ్చి భట్టిలో కూర్చున్నారు. ఇక మిమ్ములను ఎవ్వరూ చూడలేకపోయారు, కలుసుకోలేక పోయారు. అప్పుడు మీరు ఎవ్వరినీ చూసేవారే కాదు. మరి మనస్సును ఎవరితో జోడించాలి. భగవంతుడు చదివిస్తున్నారని పిల్లలకు నిశ్చయము కూడా ఉంది. అయినా జబ్బుగా ఉందని, పని ఉందని సాకులు చెప్తారు. తండ్రి చాలా షిప్ట్‌లలో చెప్పగలరు(చాలాసార్లు చెప్పగలరు). ఈ రోజులలో పాఠశాలలో చాలా షిప్ట్‌లు పెడ్తారు. ఇక్కడ చదువు ఎక్కువగా ఏమీ లేదు. కేవలం తండ్రిని(అల్ఫ్‌) మరియు ఆస్తిని(బే) అర్థం చేసుకునేందుకు మంచి బుద్ధి ఉండాలి. తండ్రిని మరియు ఆస్తిని(అల్ఫ్‌ మరియు బే) స్మృతి చేయండి అని అందరికీ చెప్పండి. త్రిమూర్తి చిత్రాలను చాలా తయారు చేశారు. కానీ పైన శివబాబాను చూపించరు. గీతాభగవానుడు శివుడని, వారి ద్వారా ఈ జ్ఞానము తీసుకుని విష్ణువుగా అవుతారని ఎవ్వరికీ తెలియదు. ఇది రాజయోగము కదా. ఇప్పుడు ఇది అనేక జన్మల అంతిమ జన్మ. ఎంత సులభమైన వివరణ! పుస్తకాలు మొదలైనవేవీ చేతిలో ఉండవు. కేవలం ఒక బ్యాడ్జ్‌ ఉండాలి. అందులో కూడా కేవలం త్రిమూర్తి చిత్రము ఉండాలి. బ్యాడ్జ్‌ను చూపిస్తూ తండ్రి బ్రహ్మ ద్వారా ఎలా చదివించి విష్ణు సమానంగా తయారు చేస్తున్నారో అర్థం చేయించాలి.

మేము రాధలాగా అవ్వాలని కొందరు అనుకుంటారు. కలశమైతే మాతలకు లభిస్తుంది. రాధకు అనేక జన్మల తర్వాత చివరి జన్మలో కలశము లభిస్తుంది. ఈ రహస్యము కూడా తండ్రియే అర్థం చేయించగలరు. మరే మానవమాత్రులూ అర్థం చేయించలేరు. మీ సేవాకేంద్రాలకు ఎంతమంది వస్తారు? కొందరైతే ఒక రోజు వస్తే నాలుగు రోజులు రారు. ఇన్ని రోజులు ఏమి చేశారని వారిని అడగాలి. తండ్రిని స్మృతి చేస్తూ ఉండినారా? స్వదర్శన చక్రమును తిప్పేవారా? అని వారిని అడగాలి. చాలా రోజుల తర్వాత వచ్చేవారిని ఉత్తరాలు కూడా వ్రాసి అడగాలి. కొందరు బదిలీ అవుతూ ఉంటారు. అయినా అక్కడ కూడా ఏదో ఒక సెంటరు ఉంటుంది. తండ్రిని స్మృతి చేయండి మరియు చక్రము త్రిప్పుతూ ఉండాలనే మంత్రము వారికి లభించింది. తండ్రి చాలా సహజమైన విషయాన్ని తెలిపారు. ఉన్నవి రెండే పదాలు. ''మన్మనాభవ, నన్ను స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి.'' ఇందులో మొత్తం చక్రమంతా వచ్చేస్తుంది. ఎవరైనా శరీరము వదిలితే ఫలానావారు స్వర్గస్థులైనారని అంటారు. కానీ స్వర్గమెక్కడ ఉందో ఎవ్వరికీ తెలియదు. అక్కడ రాజ్యముండేదని మీకు తెలుసు. అక్కడ ఉన్నతమైన వారి నుండి నీచమైన వారి వరకు, షాహుకార్ల నుండి పేదల వరకు అందరూ సుఖంగా ఉంటారు. ఇక్కడైతే ఇది దు:ఖ ప్రపంచము. అది సుఖ ప్రపంచము. తండ్రి చాలా బాగా అర్థము చేయిస్తారు. భలే దుకాణాదారులైనా కావచ్చు, మరెవరైనా కావచ్చు, చదువుకునేందుకు సాకులు చెప్పడం మంచిది కాదు. వారు రాకపోతే వారితో - మీరు తండ్రిని ఎంత స్మృతి చేశారు? స్వదర్శన చక్రమును తిప్పుతున్నారా? అని అడగండి. తినండి, త్రాగండి, తిరగండి. దేనికీ అడ్డు లేదు. దీని కొరకు కూడా సమయాన్ని కేటాయించండి. ఇతరుల కళ్యాణము కూడా చేయాలి. వస్త్రాలను శుభ్రము చేయువారు చాలామంది వస్తుంటారు. వారు ముస్లిములు లేక పారసీ లేక హిందువులు ఎవరైనా కావచ్చు. వారితో మీరు స్థూల వస్త్రాలను శుభ్రము చేయిస్తారు కానీ శరీరము చాలా పాతదిగా, మురికి పట్టి ఉంది. ఆత్మ కూడా తమోప్రధానంగా ఉంది. దానిని సతోప్రధానంగా, స్వచ్ఛంగా తయారు చేసుకోవాలని చెప్పండి. ఈ ప్రపంచమంతా తమోప్రధానంగా ఉంది. పతిత కలియుగముగా పాతదైపోయింది. తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వాలనే లక్ష ్యముంది కదా. ఇప్పుడు చేయండి, చేయకపోండి, అర్థం చేసుకోండి, చేసుకోకపోండి మీ ఇష్టము. మీరు ఆత్మలు కదా. ఆత్మ తప్పకుండా పవిత్రంగా ఉండాలి. మీ ఆత్మ ఇప్పుడు అపవిత్రమైపోయింది. ఆత్మ మరియు శరీరము రెండూ మలినమైనాయి. దానిని శుభ్రము చేసేందుకు మీరు తండ్రిని స్మృతి చేస్తే గ్యారెంటీగా ఆత్మ పూర్తిగా 100 శాతము పవిత్రమైన బంగారుగా అవుతుంది. తర్వాత ఆభరణము కూడా మంచి ప్రమాణముతో తయారువుతుంది. మీరు నమ్మండి, నమ్మకపోండి మీ ఇష్టము అని చెప్పండి. ఇది కూడా ఎంత పెద్ద సేవ! డాక్టర్ల వద్దకు వెళ్లండి, కాలేజీలకు వెళ్లండి. గొప్ప-గొప్ప వారి వద్దకు వెళ్లి క్యారెక్టర్‌(స్వభావము) చాలా బాగుండాలని చెప్పండి. ఇక్కడ అందరూ క్యారెక్టర్‌లెస్‌ (సంస్కార హీనులు)గా ఉన్నారు. నిర్వికారులుగా అవ్వాలని తండ్రి చెప్తున్నారు. నిర్వికారి ప్రపంచము ఉండేది కదా. ఇప్పుడు వికారాలున్నాయి అనగా క్యారెక్టర్‌ లెస్‌గా ఉన్నారు. క్యారెక్టర్‌ చాలా చెడిపోయింది. నిర్వికారిగా అవ్వకుండా పరివర్తన అవ్వరు. ఇక్కడ మనుష్యులందరూ కాముకులుగా ఉన్నారు. ఇప్పుడు వికారీ ప్రపంచములో నిర్వికారి ప్రపంచాన్ని ఒక్క తండ్రియే స్థాపన చేస్తారు. పోతే పాత ప్రపంచము వినాశనమైపోతుంది. ఇది చమ్రు కదా. ఈ చక్రములోని జ్ఞాన వివరణ చాలా బాగుంది. ఇది నిర్వికారి ప్రపంచంగా ఉండేది. అక్కడ దేవీదేవతలు రాజ్యము చేసేవారు. వారిప్పుడు ఎక్కడికి వెళ్లారు? ఆత్మ నశించదు. ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. దేవీ దేవతలు కూడా 84 జన్మలు తీసుకున్నారు. మీరిప్పుడు తెలివైనవారిగా అయ్యారు. ఇంతకుముందు మీకేమీ తెలిసేది కాదు. ఈ పాత ప్రపంచమిప్పుడు ఎంత మురికిగా ఉంది! బాబా చెప్పినవన్నీ యదార్థమేనని మీరు అనుభూతి చేస్తున్నారు. అక్కడ ఉండేదేే పవిత్ర ప్రపంచము. ఇది పవిత్ర ప్రపంచము కాదు. కావున తమను తాము దేవతలము అనుకునే బదులుగా హిందువులు అని పేరు పెట్టుకున్నారు. హిందూస్థాన్‌లో ఉన్నవారిని హిందువులమని అంటున్నారు. దేవతలు స్వర్గములో ఉంటారు. మీరిప్పుడు ఈ చక్రమును అర్థం చేసుకున్నారు. తెలివైనవారు బాగా అర్థము చేసుకోగలరు. తండ్రి ఎలా అర్థం చేయిస్తారో మళ్లీ అదే విధంగా రిపీట్‌ చేయాలి. ముఖ్య ముఖ్యమైన విషయాలను వ్రాసుకుంటూ ఉండండి. తర్వాత తండ్రి ఈ పాయింట్లు వినిపించారని చెప్పండి. నేను గీతా జ్ఞానమును వినిపిస్తున్నానని చెప్పండి. ఇది గీతాయుగము. 4 యుగాలున్నాయని అందరికీ తెలుసు. ఇది లీపు యుగము. ఈ సంగమ యుగము గురించి ఎవ్వరికీ తెలియదు. ఇది పురుషోత్తమ సంగమ యుగమని మీకు తెలుసు. మనుష్యులు శివజయంతిని కూడా జరుపుకుంటారు. కానీ వారు వప్పుడు వచ్చారో, వచ్చి ఏమి చేశారో ఎవ్వరికీ తెలియదు. శివజయంతి తర్వాత కృష్ణజయంతి, ఆ తర్వాత రామ జయంతి. అయితే జగదంబ - జగత్పితల జయంతిని ఎవ్వరూ జరుపుకోరు. అందరూ నెంబరువార్‌గా వస్తారు కదా. మీకిప్పుడు ఈ జ్ఞానమంతా లభిస్తుంది. అచ్ఛా! మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. మనందరి తండ్రి, పరమపిత, పరమ టీచరు, పరమ సద్గురువు - అను విషయాన్ని అందరికీ వినిపించాలి. తండ్రిని మరియు వారసత్వపు చదువును చదివించాలి.

2. జ్ఞానము అనగా సృష్టి చక్ర జ్ఞానాన్ని ధారణ చేసి స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. అంతేకాక విజ్ఞానము అనగా శబ్ధము నుండి అతీతంగా శాంతిలోకి వెళ్లాలి. 7 రోజుల కోర్సు తీసుకుని తర్వాత ఎక్కడ ఉన్నా చదువును చదువుకోవాలి.

వరదానము :-

'' ప్రకృతి ద్వారా వచ్చే పరిస్థితుల పై విజయాన్ని ప్రాప్తి చేసుకునే పురుషోత్తమ ఆత్మా భవ ''

బ్రాహ్మణాత్మలంటే పురుషోత్తమ ఆత్మలు. ప్రకృతి పురుషోత్తమ ఆత్మలకు దాసిగా ఉంటుంది. పురుషోత్తమ ఆత్మను ప్రకృతి ప్రభావితం చేయలేదు. కనుక ప్రకృతిలో కలిగే అలజడి మిమ్ములను తన వైపు ఆకర్షించుకోవడం లేదు కదా అని చెక్‌ చేసుకోండి. ప్రకృతి, సాధనాలు మరియు సాల్వేషన్‌్‌ రూపంలో ప్రభావితం చేయడం లేదు కదా. యోగి, ప్రయోగి ఆత్మల సాధన ముందు సాధనాలు స్వతహాగా వచ్చేస్తాయి. సాధనాలు, సాధనకు ఆధారం కాదు. కానీ సాధన సాధనాలను ఆధారంగా చేసుకుంటుంది.

స్లోగన్‌ :-

'' జ్ఞానమంటే అనుభవం చేయడం, ఇతరులను అనుభవీలుగా చేయడం. ''