01-04-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - ఈ కనులతో చూస్తున్నదంతా సమాప్తమవుతుంది కనుక దీని పై మీకు అనంతమైన వైరాగ్యము ఉండాలి, తండ్రి మీ కొరకు నూతన ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు''
ప్రశ్న :-
పిల్లలైన మీ సైలెన్స్ (శాంతి)లో ఏ రహస్యము ఇమిడి ఉంది?
జవాబు :-
మీరు సైలెన్స్లో కూర్చున్నప్పుడు శాంతిధామాన్ని స్మృతి చేస్తారు. సైలెన్స్ అనగా జీవించి ఉండి మరణించడమని మీకు తెలుసు. ఇక్కడ తండ్రి సద్గురువు రూపములో మీకు సైలెన్స్గా ఉండడం నేర్పిస్తున్నారు. మీరు సైలెన్స్లో ఉండి మీ వికర్మలను దగ్ధము చేసుకుంటారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలనే జ్ఞానము మీకు ఉంది. ఇతర సత్సంగాలలో శాంతిగా కూర్చున్నా వారికి శాంతిధామము గురించిన జ్ఞానము ఉండదు.
ఓంశాంతి.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలతో శివబాబా మాట్లాడ్తున్నారు కానీ గీతలో శ్రీ కృష్ణుడు మాట్లాడినట్లు ఉంది. వాస్తవానికి చెప్పింది శివబాబాయే. కృష్ణుని, తండ్రి అని అందరూ పిలువరు. లౌకిక మరియు పారలౌకిక - ఇరువురు తండ్రులు ఉంటారని భారతవాసులకు తెలుసు. పారలౌకిక తండ్రిని పరమపిత అంటారు. లౌకిక తండ్రిని పరమపిత అని అనరు. మీకు లౌకిక తండ్రి తెలిపించడము లేదు, పారలౌకిక తండ్రి పారలౌకిక పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. మొట్టమొదట మీరు శాంతిధామానికి వెళ్తారు. దానిని మీరు ముక్తిధామము, నిర్వాణధామము లేక వానప్రస్థమని కూడా అంటారు. తండ్రి చెప్తున్నారు - పిల్లలారా! ఇప్పుడు శాంతిధామానికి వెళ్లాలి. దానిని మాత్రమే శాంతి శిఖరము(టవర్ ఆఫ్ సైలెన్స్) అని అంటారు. ఇక్కడ కూర్చున్నప్పుడు మొట్టమొదట శాంతిలో కూర్చోవాలి. ఏ సత్సంగములోనైనా మొట్టమొదట శాంతిలో కూర్చుంటారు. కానీ వారికి శాంతిధామము గురించిన జ్ఞానము లేదు. ఆత్మలమైన మనము ఈ పాత శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళాలని పిల్లలకు తెలుసు. ఏ సమయములోనైనా శరీరము వదలవచ్చు. కావున ఇప్పుడు తండ్రి ఏమి చదివిస్తున్నారో దానిని బాగా చదువుకోవాలి. వారు పరమ శిక్షకులు కూడా అలాగే వారు సద్గతిదాత అయిన గురువు కూడా అవుతారు. వారితో యోగమును జోడించాలి. ఈ ఒక్కరే మూడు సేవలూ చేస్తారు. ఇలా ఇంకెవ్వరూ ఒక్కరే మూడు సేవలూ చేయలేరు. ఈ తండ్రి సైలెన్స్ను కూడా నేర్పిస్తారు. జీవించి యుండి మరణించుటనే '' సైలెన్స్'' అని అంటారు. ఇప్పుడు మనము శాంతిధామమైన మన ఇంటికెళ్ళాలని పిల్లలకు మీకు తెలుసు. ఎంతవరకు పవిత్ర ఆత్మలుగా అవ్వరో అంతవరకు వాపస్ ఇంటికి ఎవ్వరూ వెళ్ళలేరు. అందరూ వెళ్ళనే వెళ్ళాలి. అందువలన చేసిన పాపకర్మలకు శిక్షలు అంతిమ సమయములో లభిస్తాయి. తర్వాత పదవి కూడా భ్రష్టమైపోతుంది. మాయతో ఓడిపోవడము వలన శిక్షలు కూడా తినవలసి పడ్తుంది. మాయ పై విజయము కలిగించేందుకే తండ్రి వస్తారు. కానీ అజాగ్రత్త వలన తండ్రిని స్మృతి చేయరు. ఇక్కడ ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. భక్తిమార్గములో కూడా చాలా భ్రమిస్తూ ఉంటారు. ఎవరికి తల వంచి నమస్కరిస్తున్నారో వారి గురించే తెలియదు. తండ్రి వచ్చి భ్రమించడం(వెతకడం) నుండి ముక్తి కలిగిస్తారు. జ్ఞానము పగలని, భక్తి రాత్రి అని తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. రాత్రి సమయములోనే ఎదురుదెబ్బలు తింటారు. జ్ఞానము ద్వారా పగలు అనగా సత్య, త్రేతా యుగాలు, భక్తి అనగా రాత్రి, ద్వాపర-కలియుగాలు. ఇది పూర్తి డ్రామాలోని కాలపరిమితి. సగం సమయము పగలు, సగం సమయము రాత్రి. ప్రజాపిత బ్రహ్మాకుమారీల పగలు మరియు రాత్రి. ఇది అనంతమైన విషయము. అనంతమైన తండ్రి అనంతమైన సంగమ యుగములో వస్తారు. అందుకే దీనిని శివరాత్రి అని అంటారు. శివరాత్రి అని దేనికంటారో మనుష్యులకు తెలియదు. ఇది మధ్య సమయము అందువలన మీకు తప్ప ఇంకెవ్వరికీ శివరాత్రి మహత్యము తెలియదు. రాత్రి సమాప్తమై పగలు ప్రారంభమైనప్పుడు దానిని పురుషోత్తమ సంగమయుగమని అంటారు. పాత మరియు నూతన ప్రపంచముల మధ్య సమయము. తండ్రి ప్రతి పురుషోత్తమ సంగమ యుగములో వస్తారు. అంతేకాని యుగయుగములో రారు. సత్య, త్రేతా యుగముల సంగమాన్ని కూడా సంగమ యుగమని అంటారు. ఇది తప్పని(సత్య-త్రేతాల మధ్య సమయాన్ని సంగమయుగమని అనడము) తండ్రి చెప్తున్నారు.
నన్ను స్మృతి చేస్తే పాపాలు వినాశమవుతాయని శివబాబా చెప్తున్నారు. దీనిని యోగాగ్ని అని అంటారు. మీరంతా బ్రాహ్మణులు, పవిత్రంగా అయ్యేందుకు యోగమును నేర్పిస్తారు. ఆ బ్రాహ్మణులు కామచితి పై కూర్చోబెడ్తారు. ఆ బ్రాహ్మణులకు సత్యమైన బ్రాహ్మణులైన మీకు రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసముంది. వారు కుఖవంశావళి(గర్భ జనితులు), మీరు ముఖవంశావళి. ప్రతి విషయాన్ని బాగా అర్థము చేసుకోవాలి. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశమవుతాయని అంతేకాక వారి నుండి వారసత్వము లభిస్తుందని ఎవరు వచ్చినా, వారికి అర్థం చేయించబడ్తుంది. ఎంతెంత దైవీ గుణాలను ధారణ చేసి, ఇతరులతో చేయిస్తారో అంత శ్రేష్ఠమైన పదవిని పొందుతారు. పతితులను పావనంగా చేసేందుకే తండ్రి వస్తారు. కావున మీరు కూడా ఈ సర్వీసు చేయాలి. అందరూ పతితులే. గురువులు ఎవ్వరినీ పావనంగా చేయలేరు, పతితపావనుడనే పేరు ఒక్క శివబాబాదే. వారు ఇక్కడికే వస్తారు. డ్రామా ప్లాను అనుసారంగా అందరూ పూర్తి పతితులైనప్పుడు తండ్రి వస్తారు. మొట్టమొదట పిల్లలకు పరమాత్మ అయిన నన్ను స్మృతి చేయండని అల్ఫ్ తెలిపిస్తున్నారు. వారు పతితపావనులని మీరు అంటారు కదా. ఆత్మిక తండ్రిని పతితపావనుడని అంటారు. ' ఓ భగవంతుడా! లేక ఓ తండ్రీ (బాబా)! అని అంటారు. కానీ ఎవ్వరికీ వారి పరిచయము లేదు. ఇప్పుడు సంగమ వాసులైన మీకు పరిచయము లభించింది. వారు నరకవాసులు, మీరు నరకవాసులు కాదు. అవును, ఎవరైనా ఓడిపోతే ఒక్కసారిగా క్రింద పడిపోతారు. చేసిన సంపాదనంతా సమాప్తమైపోతుంది. పతితుల నుండి పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయము. ఇది వికారి ప్రపంచము, అది నిర్వికారి ప్రపంచము. నూతన ప్రపంచములో దేవతలు రాజ్యము చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ విషయము తెలిసింది. మొట్టమొదట దేవతలే అందరికంటే ఎక్కువ జన్మలు తీసుకుంటారు. అందులో కూడా మొదట సూర్యవంశీయులు వస్తారు, 21 తరాలకు వారసత్వాన్ని పొందుతారు. అది ఎంతటి పవిత్రత, సుఖ-శాంతుల బేహద్ వారసత్వము! సత్యయుగమును పూర్తి సుఖధామమని అంటారు. త్రేతాను సెమీ(అర్ధము) అని అంటారు. ఎందుకంటే 2 కళలు తగ్గిపోతాయి. కళలు తగ్గిపోతే ప్రకాశము కూడా తగ్గపోతుంది. చంద్రునిలో కూడా కళలు తగ్గగానే ప్రకాశము తక్కువైపోతుంది. చివరికి ఒక గీత(రేఖ) మాత్రం మిగులుతుంది. పూర్తిగా నశించదు. మీది కూడా అలాగే పూర్తిగా నిల్(పూర్తిగా ఖాళీ) అయిపోదు. దీనినే పిండిలో ఉప్పు ఉన్నంత అని అంటారు.
తండ్రి కూర్చుని ఆత్మలకు తెలియచేస్తున్నారు. ఇది ఆత్మ మరియు పరమాత్మల మేళా. ఇది బుద్ధి ద్వారా గ్రహించవలసిన విషయము. పరమాత్మ ఎప్పుడు వస్తారు? ఎప్పుడైతే చాలామంది ఆత్మలు లేక చాలామంది మనుష్యులవుతారో అప్పుడు పరమాత్మ మేళాలో వస్తారు. ఆత్మల మరియు పరమాత్మ మేళా ఎందుకు జరుగుతుంది? ఆ మేళాలైతే మలినపరచేందుకు జరుగుతాయి. ఈ సమయములో మీరు తోట యజమాని ద్వారా ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. ఎలా అవుతారు? స్మృతి బలముతో అవుతారు. తండ్రిని సర్వశక్తివంతుడని అంటారు. తండ్రి ఎలా సర్వశక్తివంతుడో అలా రావణుడు కూడా తక్కువ శక్తిశాలి కాదు. తండ్రి స్వయంగా చెప్తున్నారు - మాయ చాలా శక్తివంతమైనది, దుస్తరమైనది(జయింపనలవి కానిది). బాబా మేము మిమ్ములను తలంపు చేస్తాము. కానీ మాయ మా స్మృతిని మరపింపజేస్తుందని పిల్లలంటారు. ఒకరికొకరు శత్రువులు కదా. తండ్రి వచ్చి మాయ పైన విజయము కలిగిస్తారు, మాయ మళ్లీ ఓడిస్తుంది. దేవతలు మరియు అసురుల యుద్ధమును చూపించారు. కానీ అలాంటిదేదీ లేదు. వాస్తవానికి యుద్ధము ఇదే. మీరు తండ్రిని స్మృతి చేయడం ద్వారా దేవతలుగా అవుతారు. మాయ స్మృతిలోనే విఘ్నాలు వేస్తుంది, చదువులో విఘ్నాలు కలిగించదు. స్మృతిలోనే విఘ్నాలు ఏర్పడ్తాయి. క్షణ-క్షణము మాయ మరపింపజేస్తుంది. దేహాభిమానులుగా అయితే మాయ ద్వారా చెంపదెబ్బలు తగులుతాయి. కామవికారులకు చాలా కఠినమైన శబ్ధాలను వాడవలసి వస్తుంది. ఇది రావణరాజ్యము. పావనంగా అవ్వమని ఇక్కడ కూడా అర్థం చేయిస్తారు. అయినా పావనంగా అవ్వరు. తండ్రి చెప్తున్నారు - పిల్లలారా ! వికారాలలోకి వెళ్ళకండి. ముఖము నల్లగా చేసుకోకండి అయినా మాయ ఓడించిందని వ్రాస్తారు అనగా ముఖము నల్లగా చేసుకొని కూర్చుంటారు. తెల్లగా మరియు నల్లగా ఉంటారు కదా. వికారులు అనగా నల్లనివారు, నిర్వికారులు అనగా తెల్లనివారు. శ్యామసుందరుని అర్థము కూడా మీకు తప్ప ప్రపంచంలో మరెవ్వరికీ తెలియదు. కృష్ణుని కూడా శ్యామసుందరుడని అంటారు. తండ్రి వారి పేరుకు అర్థమును తెలియచేస్తున్నారు. కృష్ణుడు స్వర్గములో ప్రప్రథమ రాకుమారుడు. సుందరతలో వీరు నెంబరువన్లో పాస్ అవుతారు, తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ క్రిందకు దిగుతూ దిగుతూ నల్లగా, అపవిత్రంగా అవుతాడు. కనుక శ్యామసుందరుడని పేరు పెట్టారు. ఈ అర్థమును కూడా తండ్రి తెలియచేస్తారు. శివబాబా అయితే సదా సుందరులు. వారు వచ్చి పిల్లలైన మిమ్ములను సుందరంగా, పవిత్రంగా చేస్తారు. పతితులు నల్లగా, పావనులు సుందరంగా ఉంటారు. సహజ సౌందర్యం ఉంటుంది. స్వర్గాధికారులుగా అవ్వాలని పిల్లలైన మీరు ఇచ్చటకు వచ్చారు. కనుకనే మాతలు స్వర్గ ద్వారమును తెరుస్తారని శివభగవానువాచ. వారు చెప్తున్నారు, అందుకే వందేమాతరమ్ అని గాయనము చేయబడ్తుంది. వందేమాతరమ్ అన్నప్పుడు పిత కూడా ఉంటారు అనునది స్పష్టమౌతుంది. తండ్రి-మాతల మహిమను పెంచుతారు. మొదట లక్ష్మి, తర్వాత నారాయణుడు. ఇక్కడ మొదట మిస్టర్, తర్వాత మిసెస్. డ్రామా రహస్యము ఇలా తయారై ఉంది. రచయిత అయిన తండ్రి మొదట తమ పరిచయమును ఇస్తారు. ఒకరు హద్దులోని లౌకిక తండ్రి, మరొకరు అనంతమైన పారలౌకిక తండ్రి. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు ఎందుకంటే వారి ద్వారా అనంతమైన వారసత్వము లభిస్తుంది. హద్దులోని వారసత్వము లభిస్తున్నా అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. '' బాబా ! మీరు వచ్చినట్లయితే మేము ఇతర సాంగత్యాలను వదిలి ఒక్క మీతోనే బుద్ధిని జోడిస్తాము '' అని అంటారు. ఇది ఎవరన్నారు? ఆత్మ అంటుంది. ఆత్మనే ఈ అవయవాల ద్వారా పాత్రను అభినయిస్తుంది. ప్రతి ఆత్మ ఎలాంటి కర్మలు చేస్తుందో అలాంటి జన్మ తీసుకుంటుంది. ధనవంతంగా, పేదగా అవుతుంది. ఇవి కర్మలు(కర్మల ఫలితము) కదా. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి అధికారులు. వీరు ఏమి చేశారో మీకు మాత్రమే తెలుసు. అంతేకాక మీరు మాత్రమే ఇతరులకు అర్థం చేయించగలరు.
ఈ కనుల ద్వారా ఏమేమి చూస్తారో వాటన్నింటి పై వైరాగ్యము కలిగియుండాలని తండ్రి చెప్తారు. ఇవన్నీ సమాప్తమవ్వనున్నవి. నూతన ఇల్లు కడ్తున్నప్పుడు పాతదాని పై వైరాగ్యము వచ్చేస్తుంది. బాబా క్రొత్త ఇంటిని తయారు చేస్తున్నారు. కావున మేము అందులోకి వెళ్తామని పిల్లలు అంటారు. ఈ పాత ఇల్లు విరిగి ముక్కలైపోతుంది. ఇది బేహద్ విషయము. తండ్రి స్వర్గ స్థాపన చేసేందుకు వచ్చారని, ఇది పాత ఛీ-ఛీ ప్రపంచమని పిల్లలకు తెలుసు.
పిల్లలైన మీరిప్పుడు త్రిమూర్తి శివుని ఎదురుగా కూర్చుని ఉన్నారు. మీరు విజయులుగా అవుతారు. వాస్తవానికి ఈ త్రిమూర్తి మీ రాజముద్రిక . మీ ఈ బ్రాహ్మణ కులము అన్నిటికంటే శ్రేష్ఠమైనది. ఇది శిఖరము(పిలక) వంటిది. ఇక్కడ రాజ్యము స్థాపన అవుతూ ఉంది. ఈ రాజముద్ర్రికను గురించి బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. శివబాబా మనలను దేవీదేవతలుగా చేసేందుకు బ్రహ్మ ద్వారా చదివిస్తున్నారు. వినాశమైతే తప్పకుండా జరుగుతుంది. ప్రపంచము తమోప్రధానంగా అయిపోయింది. ఇందులో ప్రాకృతిక వైపరీత్యాలు కూడా సహాయము చేస్తాయి. బుద్ధి ద్వారా ఎంతో విజ్ఞానాన్ని తెలుపుతూ ఉంటారు, కడుపు నుండి ఏ రోకలి వెలువడలేదు. ఈ వినాశ సాధనాలు విజ్ఞానము ద్వారానే వెలువడ్డాయి. దీని ద్వారా మొత్తం కులమునంతా సమాప్తము చేసేస్తారు. శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు శివబాబా అని పిల్లలకు అర్థం చేయించబడింది. పూజ కూడా ఒక్క శివబాబాకు మరియు దేవతలకు చేయవలసి ఉంటుంది. బ్రాహ్మణులకు పూజ జరగదు ఎందుకంటే మీ ఆత్మ పవిత్రమయింది కానీ శరీరము పవిత్రంగా లేదు. కనుక పూజకు అర్హత కలిగి ఉండరు. కానీ మహిమకు యోగ్యులు. మీరు మళ్లీ ఎప్పుడు దేవతలుగా అవుతారో అప్పుడు ఆత్మ కూడా పవిత్రము, శరీరము కూడా క్రొత్తది, పవిత్రమైనది లభిస్తుంది. ఈ సమయములో మీరు మహిమా యోగ్యులుగా అయ్యారు. వందేమాతరం అని గాయనము చేయబడ్తుంది. మాతల సైన్యము ఏమి చేసింది? మాతలే అందరికీ శ్రీమతానుసారము జ్ఞానమునిచ్చారు. మాతలే అందరికీ జ్ఞానామృతాన్ని త్రాగిస్తారు. యధార్థ రీతిలో మీరు మాత్రమే అర్థం చేయిస్తారు. శాస్త్రాలలో అయితే అనేక కథలను వ్రాసేశారు. అవి వారు కూర్చుని వినిపిస్తారు. మీరు అవి వింటూ సత్యము - సత్యము అని అనేవారు. మీరు ఇప్పుడు కూర్చుని ఈ జ్ఞానాన్ని వినిపిస్తే వారు సత్యము - సత్యము అని అంటారు. ఇప్పుడు మీరు సత్యము - సత్యము అని అనరు. మనుష్యులు ఎంత రాతిబుద్ధి గలవారిగా అయ్యారంటే అన్నింటికి సత్యము - సత్యము అని అంటూనే ఉంటారు. రాతిబుద్ధి మరియు బంగారు బుద్ధి అని గాయనము కూడా ఉంది. పారసబుద్ధి(బంగారుబుద్ధి) అనగా పారసనాథుడు. నేపాలులో పారసనాథుని చిత్రముందని అంటారు. పారసపురానికి నాథులు ఈ లక్ష్మీనారాయణులే. వారి రాజ వంశముంది. ఇప్పుడు ముఖ్యమైన విషయము - రచయిత మరియు రచనల రహస్యము తెలుసుకోవడము. దీనిని గురించి ఋషులు - మునులు కూడా నేతి - నేతి అని అంటూ వచ్చారు. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా అన్నీ తెలుసుకున్నారు అనగా ఆస్తికులుగా అవుతారు. మాయా రావణుడు నాస్తికులుగా చేస్తాడు. అచ్ఛా!(మంచిది!)
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మేము బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులము, మాది సర్వోత్తమ కులము. మేము పవిత్రంగా అవ్వాలి, పవిత్రంగా చేయాలి, పతితపావనులైన తండ్రికి సహాయకారులుగా అవ్వాలి అను స్మృతి సదా ఉండాలి.
2. స్మృతిలో ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండి తప్పులు చేయరాదు. దేహాభిమానము కారణంగానే మాయ స్మృతిలో విఘ్నాలను వేస్తుంది. కనుక మొదట దేహాభిమానాన్ని వదలాలి. యోగాగ్ని ద్వారా పాపాలను నాశనము చేసుకోవాలి.
వరదానము :-
''భయంకర రూపము ధరించి మాయ ఆడే ఆటను సాక్షిగా ఉండి చూచే మాయాజీత్ భవ''
మాయను ఆహ్వానించేవారు దాని భయంకర రూపాన్ని చూచి భయపడరు. సాక్షిగా ఉండి ఆటను చూస్తూ ఉంటే మజాగా(ఆనందంగా) ఉంటుంది. ఎందుకంటే మాయ బాహ్యరూపము పెద్ద పులి రూపము కానీ దానిలో పిల్లికున్నంత శక్తి కూడా లేదు. కేవలం మీరు భయపడి దానిని పెద్దదిగా చేస్తారు - '' ఏం చేయాలి, ఎలా అవుతుంది,......'' అని భయపడ్తూ ఉంటారు. ఇప్పుడు జరుగుతూ ఉండేది మంచిదే, జరగబోయేది ఇంకా మంచిది అనే పాఠము గుర్తుంచుకోండి. సాక్షిగా ఉండి ఆట చూస్తే మాయాజీతులుగా అవుతారు.
స్లోగన్ :-
''ఎవరైతే సహనశీలురుగా ఉంటారో వారు ఎవ్వరి భావ - స్వభావాలలో కాలిపోరు. వ్యర్థ విషయాలను ఒక చెవితో విని మరో చెవితో వదిలేస్తారు.''