02-05-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - ఆత్మాభిమానులుగా అవ్వండి, నేను ఆత్మను, శరీరాన్ని కాను - ఇది మొదటి పాఠము. ఇదే పాఠాన్నే అందరిచే బాగా చదివించండి ''
ప్రశ్న :-
జ్ఞానాన్ని వినిపించే పద్ధతి ఏది? ఏ విధి ద్వారా జ్ఞానాన్ని వినిపించాలి?
జవాబు :-
జ్ఞాన విషయాలను ఖుషీ - ఖుషీగా వినిపించండి, విధి లేక కాదు, మీరు పరస్పరము కూర్చుని జ్ఞాన చర్చ చేయండి, జ్ఞాన మననము చేయండి, స్వయాన్ని ఆత్మగా భావించి, ఆ తర్వాత ఏ ఆత్మకు వినిపించినా వినేవారికి కూడా సంతోషము కలుగుతుంది.
ఓంశాంతి.
తండ్రి అంటున్నారు - ఆత్మాభిమానులు లేక దేహీ-అభిమానులై కూర్చోండి. ఎందుకంటే ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు నిండుతాయి. అన్నింటి ప్రభావము ఆత్మ పైనే పడ్తుంది. ఆత్మనే పతితమని అంటారు. పతితాత్మ అన్నప్పుడు తప్పకుండా జీవాత్మగానే ఉంటుంది. ఆత్మ శరీరముతో పాటే ఉంటుంది. మొట్టమొదటి మాట ఆత్మలై కూర్చోండి అని అంటున్నారు. స్వయాన్ని శరీరముగా కాదు, ఆత్మగా భావించి కూర్చోండి. ఆత్మయే ఈ అవయవాలను నడిపిస్తుంది. పదే పదే స్వయాన్ని ఆత్మ అని భావించినందున పరమాత్మ గుర్తుకు వస్తారు. దేహమును స్మృతి చేస్తే దైహిక తండ్రి గుర్తుకొస్తాడు. అందుకే తండ్రి చెప్తున్నారు - ఆత్మాభిమానులుగా అవ్వండి, ఆ తండ్రే చదివిస్తున్నారు. ఇది మొదటి పాఠము. ఆత్మలైన మీరు అవినాశి, శరీరము వినాశి. నేనొక ఆత్మను, ఈ మొదటి పాఠమును స్మృతి చేయకుంటే కచ్ఛా(అపరిపక్వము)గా ఉంటారు. నేను ఆత్మను, ఈ శరీరము కాదు - ఈ విషయాన్ని ఈ సమయములో తండ్రి చదివిస్తున్నారు. ఇంతకుముందు ఎవ్వరూ ఇలా చదివించేవారు కాదు. ఆత్మాభిమానులుగా తయారుచేసి జ్ఞానమిచ్చేందుకే తండ్రి వచ్చారు. మొట్టమొదటి జ్ఞానమునిస్తున్నారు - '' ఓ ఆత్మా, నీవు పతితంగా ఉన్నావు, ఎందుకంటే ఇది పాత ప్రపంచము.'' ప్రదర్శినీలో కూడా మీరు చాలామందికి అర్థం చేయిస్తారు. ప్రశ్నోత్తరాలు జరుగుతాయి. పగలు మీకు సమయము లభించినప్పుడు పరస్పరము కలుసుకొని సమాచారము అడిగి తెలుసుకోవాలి, ఎవరెవరు ఏమేమి ప్రశ్నలడిగారో దానికి తాము ఏమి సమాధానాలు చెప్పారో, ఎలా అర్థం చేయించారో అడిగి తెలుసుకోవాలి. తర్వాత వారికి అర్థం చేయించాలి. ఫలానా విషయాన్ని, అలా కాదు, ఇలా అర్థము చేయించాలని చెప్పాలి. అర్థం చేయించే యుక్తులు అందరివీ ఒకే విధంగా ఉండవు. ముఖ్యమైన విషయము స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారా లేక దేహముగా భావిస్తున్నారా? అందరికీ ఇద్దరు తండ్రులు తప్పకుండా ఉంటారు. దేహధారులందరికీ లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి ఇరువురూ ఉంటారు. హద్దు తండ్రి (దేహానికి తండ్రి) సాధారణమే. ఇక్కడ మీకు అనంతమైన తండ్రి లభించారు. వారు కూర్చుని ఆత్మలైన మనకు అర్థం చేయిస్తున్నారు. వారొక్కరే తండ్రి, టీచరు, గురువు కూడా అయ్యారు. ఇది పక్కా చేయాలి. మీరు ఎవరికైనా అర్థం చేయించినప్పుడు వారు ఏ ఏ ప్రశ్నలు అడుగుతారో వాటి పై పరస్పరము కూర్చుని చర్చించుకోవాలి. మీలో చురుకుగా ఉన్నవారు కూడా కూర్చోవాలి. మీకు పగటి పూట కొంత సమయము లభిస్తుంది. అంతేకాని భోజనము తిన్న వెంటనే నిద్ర మత్తు వస్తుందని అనుకోరాదు. ఎవరైతే ఎక్కువగా తింటారో వారికే నిద అనే సోమరితనము వస్తుంది. ఫలానావారు అడిగిన ఫలానా ప్రశ్నకు నేను ఇలా సమాధానము ఇచ్చాను అని పగటి పూట పరస్పరము క్లాసు చేసుకోవాలి. రకరకాల ప్రశ్నలు అడుగుతారు. వాటికి యదార్థమైన జవాబులు ఇవ్వాలి. సమాధానాలకు వారు తృప్తి చెందారా, వారిని మీ సమాధానాలు ఆకర్షించాయా, తృప్తి పరచాయా? అని చూసుకోవాలి. లేకుంటే సరిదిద్దుకోవాలి. చురుకైనవారు కూడా కూర్చోవాలి. అంతేకాని భోజనము చేశాము, వెంటనే నిద్ర వస్తుందని అనుకోరాదు. దేవతలు చాలా తక్కువగా తింటారు ఎందుకంటే వారికి సంతోషముంటుంది కదా. అందుకే సంతోషమే సగము బలము, సంతోషము వంటి టానిక్ లేదు(ఖుషీ జైసీ ఖురాక్ నహీ) అని కూడా అంటారు. పిల్లలైన మీకు అపారమైన సంతోషము ఉండాలి. బ్రాహ్మణులుగా అవ్వడంలో చాలా సంతోషముంది. సంతోషము లభించినప్పుడే బ్రాహ్మణులుగా అవుతారు. దేవతల వద్ద ధనము, భవనాలు మొదలైనవన్నీ ఉంటాయి. కాబట్టి వారికి సంతోషముంటుంది. కావున వారికి సంతోషమే చాలు. సంతోషములో భోజనము కూడా చాలా తక్కువగా, సూక్ష్మంగా తింటారు. ఇది కూడా ఒక నియమము. ఎక్కువగా తినేవారికి నిద్ర ఎక్కువగా వస్తుంది. నిద్ర మత్తు ఉండేవారు ఎవ్వరికీ అర్థం కూడా చేయించలేరు. విధి లేక ఇది తప్పుదు అన్నట్లు చెప్తారు. ఈ జ్ఞాన విషయాలు చాలా సంతోషంగా విని వినిపించాలి. అప్పుడు అర్థము చేయించడం సహజమవుతుంది.
ముఖ్యమైనది - తండ్రి పరిచయము ఇవ్వడము. బ్రహ్మ గురించి అయితే ఎవ్వరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు. అతనికి అనేకమంది ప్రజలున్నారు. వీరు ప్రజాపిత ఎలా అవుతారో చాలా బాగా అర్థము చేయించాలి. తండ్రి అర్థం చేయించారు - ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో, అందులో కూడా అంత్యములో వానప్రస్థ అవస్థలో నేను ప్రవేశిస్తాను. అలా కాకుంటే రథము ఎక్కడ నుండి వస్తుంది? రథమనే గాయనము శివబాబా కొరకే ఉంది. రథములో ఎలా వస్తారని తికమకపడ్తారు. రథమైతే తప్పకుండా కావాలి. కృష్ణుడయ్యేందుకు వీలు లేదు కావున తప్పకుండా బ్రహ్మ ద్వారానే అర్థం చేయిస్తారు. పై నుండి మాట్లాడరు. బ్రహ్మ ఎక్కడ నుండి వచ్చారు? ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకున్నారో వారిలోనే ప్రవేశిస్తానని తండ్రి వినిపించారు. స్వయం ఇతనికి కూడా ఈ విషయాలు తెలియదు. నేను వినిపిస్తాను. కృష్ణునికైతే రథము అవసరమే లేదు. కృష్ణుడు అని అన్నందున భగీరథుడు అదృశ్యమౌతాడు. కృష్ణుని భగీరథుడు అని అనరు. అది అతని మొదటి రాజకుమారుని జన్మ. పిల్లలు ఆంతరికములో విచార సాగర మథనము చేయాలి, ఇవి శాస్త్రాలలో వ్రాయబడిన విషయాలు కావు అని పిల్లలకు తెలుసు. పిల్లలు విచార సాగర మథనము చేసి కలశమును లక్ష్మికి ఇచ్చారనేది వాస్తవము. లక్ష్మి మళ్లీ ఇతరులకు అమృతము త్రాగించింది. అప్పుడు స్వర్గ ద్వారాలు తెరచుకున్నాయి. కానీ పరమపిత పరమాత్మకు విచార సాగర మథనము చేసే అవసరము లేదు. వారు బీజరూపులు. వారిలో జ్ఞానముంది. జ్ఞానము వారికే తెలుసు, మీకు కూడా తెలుసు. ఇప్పుడు దీనిని బాగా తప్పకుండా అర్థము చేయించాలి. అర్థము చేసుకోకుంటే దేవతా పదవి ఎలా పొందుతారు? ఆత్మలను తాజాగా చేసేందుకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. మిగిలిన వారికి కొంచెం కూడా తెలియదు. తండ్రి వచ్చి తెలిపించినప్పుడు మీ లంగరు భక్తిమార్గము నుండి లేచింది. ఇప్పుడు జ్ఞాన మార్గములోనికి వచ్చింది. తండ్రి చెప్తున్నారు - నేను మీకిచ్చే జ్ఞానము ప్రాయ: లోపమైపోతుంది.
ఒకరేమో నిరాకార తండ్రి, రెండవవారు సాకార తండ్రి. ఈ విషయము చాలా బాగా అర్థం చేయించబడింది. కానీ మాయ ఎటువంటిదంటే ఆకర్షించి మురికిలోకి తీసుకెళ్తుంది, పతితమైపోతారు. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, మీరు కామచితి పైకి ఎక్కి ఒక్కసారిగా శ్మశానములోకి వచ్చేశారు. మళ్లీ ఇక్కడే తప్పకుండా స్వర్గము ఏర్పడ్తుంది. అర్ధకల్పము స్వర్గము నడుస్తుంది తర్వాత మళ్లీ అర్ధకల్పము శ్మశానము ఉంటుంది. ఇప్పుడందరూ శ్మశానవాసులుగా అవ్వనున్నారు. మెటికల చిత్రము పై కూడా చాలా బాగా అర్థం చేయించగలరు. ఇది పతిత రాజ్యము, ఇది తప్పకుండా వినాశనమైపోతుంది. ఇప్పుడు ఈ భూమి పై శ్మశానముంది. మళ్లీ ఈ భూమియే పరివర్తన అవుతుంది అనగా ఇనుప యుగము నుండి బంగారు యుగముగా అవుతుంది. తర్వాత రెండు కళలు తగ్గిపోతాయి. తత్వాల కళలు కూడా తగ్గిపోయినప్పుడు ఉపద్రవాలు జరుగుతాయి. మీరందరూ మంచి రీతిగా అర్థం చేయిస్తారు. వారు అర్థము చేసుకోకపోతే గవ్వ సమానము, వారికి ఏ విలువా ఉండదు. ఈ విలువ తండ్రి కూర్చుని తెలిపిస్తున్నారు. వజ్ర తుల్య జన్మ,............. అనే గాయనము కూడా ఉంది. మీకు కూడా ముందు తండ్రి ఎవరో తెలియదు. గవ్వ సమానంగా ఉండేవారు. ఇప్పుడు తండ్రి వచ్చి వజ్ర సమానంగా చేస్తారు. తండ్రి ద్వారానే వజ్ర సమాన జన్మ లభిస్తుంది. తర్వాత మళ్లీ గవ్వ సమానంగా ఎందుకవుతారు? మీరు ఈశ్వరీయ సంతానము కదా. ఆత్మ పరమాత్మ చాలా కాలము నుండి వేరుగా ఉన్నారు,.........(ఆత్మా ఔర్ పరమాత్మ అలగ్ రహే బహుకాల్,........) అనే గాయనము కూడా ఉంది. శాంతిధామములో కలిసి ఉన్నప్పుడు ఆ మిలనములో ఏ లాభము ఉండదు. అది కేవలం పవిత్రత లేక శాంతికి స్థానము. ఇక్కడ మీరు జీవాత్మలుగా ఉన్నారు. తండ్రి అయిన పరమాత్మకు తన శరీరమంటూ ఏదీ లేదు. వారు శరీరము ధారణ చేసి పిల్లలైన మిమ్ములను చదివిస్తున్నారు. మీరు తండ్రిని తెలుసుకున్నారు. మీరు తండ్రితో - '' ఓ బాబా! '' అని అంటారు. తండ్రి - '' ఓ పుత్రులారా! అని అంటారు. లౌకిక తండ్రి కూడా - '' ఓ పిల్లలారా, ఇలా రండి మీకు మిఠాయి తినిపిస్తాను'' అని అంటాడు కదా. వెంటనే పిల్లలందరూ పరుగెత్తి వస్తారు. ఈ తండ్రి కూడా - '' పిల్లలూ! మీరు వస్తే మిమ్ములను వైకుంఠానికి అధికారులుగా చేస్తానని అంటారు.'' అప్పుడు అందరూ తప్పకుండా పరుగెత్తుకుని వస్తారు. పతితులైన మమ్ములను పావనంగా చేసి పావన ప్రపంచానికి అధికారులుగా చేయండి అని పిలువను కూడా పిలుస్తారు. నిశ్చయముంటే అంగీకరించాలి. పిల్లలే పిలిచారు. నేను పిల్లల కొరకే వస్తాను. మీరే నన్ను పిలిచారని పిల్లలకే చెప్తున్నాను. ఇప్పుడు నేను వచ్చాను. పతిత పావనులని కూడా తండ్రినే అంటారు కదా. గంగా నది నీరు మొదలైనవాటితో మీరు పావనంగా అవ్వజాలరు. అర్ధకల్పము మీరు తప్పుగా నడిచారు. భగవంతుని వెతుకుతారు కానీ అది ఎవ్వరికీ అర్థము కాదు. తండ్రి - ''ఓ పిల్లలారా!'' అని పిలుస్తారు. పిల్లల నోటి నుండి కూడా అదే ఉత్సాహముతో ''ఓ బాబా'' అని వెలువడాలి. అయితే ఇంత ఉత్సాహముతో వెలువడలేదు. దీనిని దేహాభిమానము అని అంటారు. దేహీ - అభిమానము అని అనరు. మీరు ఇప్పుడు తండ్రి సన్ముఖములో కూర్చుని ఉన్నారు. అనంతమైన తండ్రిని స్మృతి చేసినందున అనంతమైన చక్రవర్తి పదవి కూడా తప్పకుండా గుర్తుకు వస్తుంది. ఇటువంటి తండ్రికి ఎంతో ప్రేమగా బదులివ్వాలి మీరు పిలిచినందున తండ్రి వచ్చారు. డ్రామానుసారము ఒక్క నిముషము కూడా ముందు వెనుక జరగదు. అందరూ అంటున్నారు - ''ఓ తండ్రీ! దయ చూపండి, ముక్తినివ్వండి, మేమంతా రావణుని సంకెళ్లలో ఉన్నాము, మీరు మాకు మార్గదర్శకులుగా అవ్వండి.'' అందువలన తండ్రి మార్గదర్శకులు కూడా అవుతారు. అందరూ వారిని పిలుస్తారు - ''ఓ ముక్తిదాతా, ఓ మార్గదర్శకా! వచ్చి మాకు మార్గదర్శకులుగా అవ్వండి. మమ్ములను కూడా వెంట తీసుకెళ్లండి.'' ఇప్పుడు మీరు సంగమ యుగములో ఉన్నారు. తండ్రి సత్యయుగమును స్థాపన చేస్తున్నారు. ఇప్పుడిది కలియుగము. కోట్లాది మనుష్యులున్నారు. సత్యయుగములో అయితే కేవలం దేవీ దేవతలు కొంతమంది మాత్రమే ఉండేవారు. కావున తప్పకుండా వినాశనము జరిగే ఉంటుంది. అది కూడా మీ ముందే దగ్గరగా నిలబడి ఉంది. దానికున్న గాయనము - సైన్సు ఆడంబరము, బుద్ధి ద్వారా ఎంతో తెలివిని ఉపయోగిస్తూ ఉంటారు. వారిది యాదవ సంప్రదాయము. మళ్లీ చరిత్ర రిపీట్(నఱర్శీతీవ =వజూవa్ర) అవుతుంది. ఇప్పుడు మళ్లీ సత్యయుగ చరిత్ర పునరావృతమవుతుంది.
మేము నూతన ప్రపంచములో ఉన్నత పదవిని పొందుకునే పురుషార్థము చేస్తున్నామని మీరు అర్థం చేసుకున్నారు. పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. ఈ పతిత ప్రపంచము తప్పకుండా వినాశనమవుతుందని మీకు తెలుసు. మీ పిల్లలు మొదలైనవారు కూడా బ్రతికి ఉండరు. ఎవ్వరూ వారసులుగానూ అవ్వరు. వివాహాలు మొదలైనవి కూడా జరగవు. చాలా గడిచిపోయింది, కొంచెమే మిగిలి ఉంది,..... (బహుత్ గయీ బాకీ థోడీ రహీ,..........) సమయము కొద్దిగానే మిగిలి ఉంది. దానికి కూడా లెక్క ఉంది. ఇంతకుముందు ఇలా అనేవారు కారు. ఇప్పుడు సమయం చాలా కొద్దిగా ఉంది. ఇంతకుముందు ఎవరైతే శరీరము వదిలి వెళ్లారో వారు నంబరువారు పురుషార్థానుసారముగా జన్మ తీసుకున్నారు. కొంతమంది ఇచ్చటకు వచ్చి ఉంటారు కూడా. వారిని చూస్తూనే ఇక్కడ నుండి తప్పిపోయినవారని అనిపిస్తుంది. వారికి జ్ఞానము లేకుంటే మజా ఉండదు. మేము ఇక్కడకు వస్తామని వారి తల్లిదండ్రులకు కూడా చెప్తారు. ఇది సులభంగా అర్థము చేసుకునే విషయము. వినాశనము తప్పకుండా జరగాల్సిందే. యుద్ధానికి ఏర్పాట్లు కూడా చూస్తున్నారు. వీరి సగం ఖర్చు యుద్ధ సామానుకే ఖర్చు అవుతుంది. విమానాలు మొదలైనవి ఎలాంటివి తయారుచేస్తున్నారంటే ఇంట్లో కూర్చునే సర్వమూ సమాప్తమైపోతుందని అంటారు. ఇటువంటి వస్తువులను తయారు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆస్పత్రులు మొదలైనవేవీ ఉండవు. డ్రామాలో ఇది కూడా తండ్రి ఇచ్చే సూచన అనుసారమే జరిగినట్లు ఉంటుంది. అది కూడా డ్రామాలో నిశ్చయింపబడింది. జబ్బు పడరాదని అనుకుంటారు, అందరూ తప్పకుండా మరణించాల్సిందే. రాముడూ పోయాడు, రావణుడూ పోయాడు,............. ఎవరైతే యోగము చేస్తూ ఆయవు పెంచుకుంటారో వారి ఆయువు తప్పకుండా వృద్ధి చెందుతుంది. సంతోషంగా స్వ ఇచ్ఛతో శరీరాన్ని వదిలేస్తారు. ఉదాహరణకు బ్రహ్మ జ్ఞానులని అంటారు. వారు కూడా బ్రహ్మ తత్వములోకి వెళ్లేందుకు సంతోషంగా శరీరాన్ని వదుల్తారని అంటారు. కానీ బ్రహ్మతత్వములోకి ఎవ్వరూ వెళ్లరు, పాపాలు కూడా నశించవు. పునర్జన్మ మళ్లీ ఇక్కడే తీసుకుంటారు. పాపము తొలిగేందుకు తండ్రి యుక్తి తెలుపుతారు - ''నన్నొక్కరినే స్మృతి చేయండి, ఇతరులెవ్వరినీ స్మృతి చేయకండి.'' లక్ష్మీనారాయణులను కూడా స్మృతి చేయరాదు. ఈ పురుషార్థము ద్వారా మనము ఈ పదవిని పొందుతున్నామని మీకు తెలుసు. స్వర్గ స్థాపన జరుగుతోంది. ఈ పదవి పొందేందుకు మనము నంబర్వార్ పురుషార్థము చదువుతున్నాము. తండ్రి ఈ సంగమ యుగములోనే అక్కడ నడిచే రాజ వంశమును స్థాపన చేస్తారు. మీరు ఎలా ఉపన్యసించాలంటే అది ఎవరి బుద్ధిలోనైనా బాగా కూర్చుండిపోవాలి. ఈ సమయములో మనము ఈశ్వరీయ సంప్రదాయానికి చెందినవారము. ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి సోదర-సోదరీలము. ఆత్మలైన మనమంతా భాయి-భాయి. బ్రహ్మకుమారీ - కుమారుల వివాహము జరగదు. క్రింద ఎలా పడిపోతారో కూడా తండ్రి అర్థం చేయిస్తారు. కామాగ్ని కాల్చేస్తుంది. ఒక్కసారి క్రిందపడ్డామంటే సంపాదనంతా సమాప్తమైపోతుందని భయముంటుంది. కామము ద్వారా ఓడిపోతే పదవి భ్రష్ఠమైపోతుంది. సంపాదన ఎంత ఉన్నతమైనది! మనుష్యులు కోట్లు, పదమాలు సంపాదిస్తారు. ఇక కొద్ది సమయంలో అదంతా సమాప్తమవుతుందని వారికి తెలియదు. బాంబులు తయారుచేసేవారికి, ఈ ప్రపంచము సమాప్తమైపోతుందని, మమ్ములను ఎవరో ప్రేరేపిస్తున్నారని, అందుకే బాంబులు తయారు చేస్తున్నామని తెలుసు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. లోలోపల జ్ఞానాన్ని బాగా నూరాలి(ఘోట్నా) అనగా విచార సాగర మథనము చేయాలి. పరస్పరము జ్ఞానానికి సంబంధించిన ఆత్మిక సంభాషణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి. బద్ధకాన్ని, సోమరితనాన్ని వదిలేయాలి.
2. దేహీ-అభిమానులుగా అయ్యి చాలా ఉత్సాహముతో తండ్రిని స్మృతి చేయాలి. గవ్వ నుండి వజ్రంగా అయ్యేందుకు తండ్రి వద్దకు వచ్చామనే నషా సదా ఉండాలి. మనము ఈశ్వరీయ సంతానము.
వరదానము :-
'' మనసు - బుద్ధి ద్వారా శ్రేష్ఠ స్థితి అనే ఆసనం పై స్థితమై ఉండే తపస్వీమూర్త్ భవ ''
తపస్వీలు సదా ఏదో ఒక ఆసనము పై కూర్చొని తపస్సు చేస్తారు. తపస్వీ ఆత్మలైన మీ ఆసనము ఏకరస స్థితి, ఫరిస్తా స్థితి................ ఈ శ్రేష్ఠమైన స్థితులలో స్థితమవ్వడం అనగా ఆసనము పై కూర్చోవడం. స్థూల ఆసనం పై అయితే స్థూల శరీరం కూర్చుంటుంది. కానీ మీరు ఈ శ్రేష్ఠ ఆసనం పై మనసును, బుద్ధిని కూర్చోబెడ్తారు. ఆ తపస్వీలు ఒంటి కాలి పై నిల్చుంటారు. మీరు ఏకరస స్థితిలో ఏకాగ్రమౌతారు. వారిది హఠయోగము, మీది సహజ యోగము.
స్లోగన్ :-
'' మీరు ప్రేమసాగరుడైన తండ్రి పిల్లలు, ప్రేమతో నిండిన గంగలై ఉండండి. ''