24-08-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - తండ్రి, టీచరు, సద్గురువు - ఈ మూడు పదాలను గుర్తు చేసుకుంటే అనేక విశేషతలు వచ్చేస్తాయి ''

ప్రశ్న :-

ఏ పిల్లలు వేసే ప్రతి అడుగులో పదమాల(కోటానుకోట్ల) సంపాదన జమ అవుతూ ఉంటుంది ?

జవాబు :-

ఎవరైతే ప్రతి అడుగులో సర్వీసులో ముందుకు వెళ్తూ ఉంటారో, వారే పదమాల సంపాదన జమ చేసుకుంటారు. ఒకవేళ బాబా సర్వీసు చేసేందుకు అడుగు ముందుకు వేయకపోతే పదమాల సంపాదన ఎలా పొందుతారు ? సర్వీస్‌ ప్రతి అడుగులో పదమాల సంపాదననిస్తుంది. దీని ద్వారానే పదమాపదమ్‌ పతులుగా అవుతారు.

ప్రశ్న :-

ఏ రహస్యాన్ని తెలుసుకున్నందువలన పిల్లలైన మీరు సర్వుల కళ్యాణకారులుగా అవుతారు ?

జవాబు :-

అందరికీ ఉన్న దుకాణము ఇదొక్కటే, అందరూ చివరకు ఇక్కడికి రావల్సిందే అను రహస్యాన్ని బాబా పిల్లలైన మనకు తెలిపించారు. ఇది అత్యంత గుహ్యమైన రహస్యము. ఈ రహస్యము తెలిసిన పిల్లలే అందరి కళ్యాణకారులుగా అవుతారు.

ఓంశాంతి.

ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలైన ప్రతి ఒక్కరికీ బాబా తమకు తండ్రి, టీచరు, సద్గురువు కూడా అయినారని తెలిసే ఉంటుంది. పిల్లలకు తెలుసు, తెలిసినా క్షణ-క్షణము మర్చిపోతారు. ఇక్కడ కూర్చున్నవారు కూడా తెలుసుకొని ఉంటారు కదా! కాని మర్చిపోతూ ఉంటారు. ప్రపంచంలో వారికైతే బొత్తిగా తెలియదు. ఈ మూడు పదములు గుర్తున్నా చాలా సర్వీసు చేయగలరని తండ్రి చెప్తున్నారు. ప్రదర్శిని లేక మ్యూజియంలో మీ వద్దకు చాలామంది వస్తారు. ఇంటికి కూడా బంధు-మిత్రులు మొదలైనవారు చాలామంది వస్తారు. ఎవరు వచ్చినా, ఎవరినైతే భగవంతుడని అంటున్నామో వారు తండ్రి, టీచరు, సద్గురువుగా కూడా అవుతారని తెలియజేయాలి. ఇది గుర్తున్నా మంచిదే. ఇతరులెవ్వరి స్మృతి రాకూడదు. ఇతరులెవ్వరి గురించి ఈ విధంగా చెప్పలేము. మన బాబా తండ్రి, టీచరే కాక సద్గురువు కూడా అయ్యారని మీకు తెలుసు. ఎంత సహజము! కాని కొందరి బుద్ధి ఈ మూడు పదాలను కూడా ధారణ చేయలేనంత రాతిబుద్ధిగా ఉంటుంది, మర్చిపోతారు. బాబా మనలను మానవుల నుండి దేవతలుగా చేస్తారు. ఎందుకంటే బేహద్‌ తండ్రి కదా. బేహద్‌ తండ్రి కనుక తప్పకుండా వారసత్వమునే ఇస్తారు. దేవతల దగ్గర బేహద్‌ వారసత్వముంది. ఇంత మాత్రము స్మృతి చేసినా ఇంటిలో కూడా చాలా సర్వీసు చేయగలరు. కాని ఇది కూడా మర్చిపోయినందున ఎవ్వరికీ తెలుపలేరు. క్షణ-క్షణము మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే కల్పమంతా మర్చిపోయి ఉన్నారు. ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. వాస్తవంగా ఈ జ్ఞానము చాలా సరళమైనది. పోతే స్మృతియాత్ర ద్వారా సంపూర్ణంగా అవ్వడంలో శ్రమ ఉంది. బాబా మనకు తండ్రిగా కూడా ఉన్నారు, శిక్షణ కూడా ఇస్తున్నారు, వారసత్వము కూడా ఇస్తారు, పవిత్రంగా కూడా తయారు చేస్తారు. ఎందుకంటే తండ్రి పతితపావనుడు. కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని అందరికీ చెప్పమని చెప్తారు. తండ్రి సర్వీసు చేసేందుకు ఏ మాత్రము అడుగు ముందుకు వేయకపోతే వారు పదమాలను ఎలా పొందుతారు! సర్వీసు చేయడం ద్వారానే పదమ్‌పతులుగా అవ్వగలరు. సర్వీసే అడుగులో పదమ్‌ను తీసుకొస్తుంది. సర్వీసు చేసేందుకు పిల్లలు ఎక్కడెక్కడి నుండో పరుగెత్తుతూ ఉంటారు. ఎన్ని అడుగులు వేస్తారు. పదమాలు వారికి లభిస్తాయి కదా. మొదట శూద్రులను బ్రాహ్మణులుగా తయారుచేయవలసి ఉంటుందని కూడా బుద్ధి చెప్తుంది. బ్రాహ్మణులనే చేయకుంటే వారు ఏమిగా అవుతారు? సర్వీసు చేయాలి కదా. పిల్లలకు సర్వీసు సమాచారాన్ని కూడా ప్రేరేపించేందుకే వినిపిస్తారు. సర్వీసు చేయడం ద్వారానే పదమ్‌ లభించింది. ప్రపంచములోని వారెవ్వరికీ తెలియని ఒకే విషయమును తెలపండి. బేహద్‌ తండ్రి, తండ్రి అయినారు. కాని తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు. కేవలం ఊరకే గాడ్‌ఫాదర్‌(భగవంతుడు) అని అంటూ ఉంటారు. వారు టీచర్‌ అని ఎవరి బుద్ధిలోనూ ఉండదు. విద్యార్థుల బుద్ధిలో సదా టీచర్‌ గుర్తు ఉంటారు. పూర్తిగా చదువుకోనివారిని నిరక్షరాస్యులు అని అంటారు. నష్టమేమీ లేదని బాబా అంటారు. మీరేమీ చదువుకోకపోయినా పరస్పరములో మనము సోదరులమని అర్థం చేసుకోగలరు కదా! మన తండ్రి బేహద్‌ తండ్రి. బ్రహ్మ ద్వారా ఏక ధర్మమును స్థాపించేందుకే తండ్రి వస్తారు. కాని దీనిని ప్రజలు కొంచెము కూడా అర్థము చేసుకోరు. ఒకవేళ ఈశ్వరుడు ఎప్పుడూ వచ్చి ఉండకపోతే ఓ ముక్తిదాతా(లిబరేటర్‌)! రండి, ఓ పతితపావనా! రండి అని ఎందుకు పిలుస్తారు? పతితపావనుని స్మృతి చేస్తున్నప్పుడు శాస్త్రాలను ఎందుకు చదువుతారు? తీర్థయాత్రలకు ఎందుకు వెళ్తారు? వారు అక్కడ ఏమైనా కూర్చుని ఉన్నారా? ఎవ్వరికీ తెలియనే తెలియదు. పతితపావనుడు ఈశ్వరుడైతే గంగా స్నానాలు మొదలైన వాటి ద్వారా ఎవరైనా పావనంగా అవ్వగలరా? స్వర్గానికి ఎవరైనా ఎలా వెళ్లగలరు? ఇక్కడే జన్మ తీసుకోవాలి. కొత్త ప్రపంచానికి, పాత ప్రపంచానికి తేడా అయితే ఉంది కదా. దీనిని సత్యయుగమని అనరు, ఇప్పుడిది కలియుగము కదా. మానవులు పూర్తిగా రాతిబుద్ధి గలవారిగా ఉన్నారు. ఎక్కడైనా కొద్దిగా సుఖము చూస్తే దానిని స్వర్గమని భావిస్తారు. ఈ విషయాలు తండ్రియే అర్థం చేయిస్తారు. తండ్రి ఎవ్వరినీ నిందించరు. స్వయం వారే తెలియజేస్తున్నారు. తండ్రి శిక్షణను కూడా ఇస్తారు, అందరికీ సద్గతిని కూడా ఇస్తారు. భగవంతుడే తండ్రి అయితే తండ్రి ద్వారా ఏదో కొంత లభించాలి. బాబా అనే పదము కూడా ఎటువంటిదంటే దాని నుండి వారసత్వము అనే సువాసన తప్పకుండా వస్తుంది. పినతండ్రి, మామ ఇలా ఎంతమంది ఉన్నా వారి ద్వారా వారసత్వము అనే సువాసన రాదు. తండ్రి కరెక్టుగా చెప్తున్నారా అని అంతర్ముఖులై ఆలోచించాలి. గురువుల దగ్గర ఏ ఆస్తి ఉండదు. స్వయంగా వారే ఇల్లు-వాకిళ్లు వదిలేస్తారు. మీరు వికారాలను సన్యసించారు. మేము ఇల్లు-వాకిళ్లను వదిలేశామని వారు చెప్తారు. మేము ప్రపంచములోని వికారాలన్నీ సన్యసించామని మీరు చెప్తారు. కొత్త ప్రపంచములోకి వెళ్లడం ఎంత సహజము! మనము ఈ పాత సృష్టినంతటినీ, తమోప్రధాన ప్రపంచమునంతటినీ సన్యసిస్తాము. సత్యయుగము కొత్త ప్రపంచము. ఒకప్పుడు తప్పకుండా కొత్త ప్రపంచము ఉండేదని కూడా మీరు తెలుసుకున్నారు. కొత్త ప్రపంచమునే స్వర్గమని అంటారు. కాని వారు చెప్పడము వరకే తప్ప కొంచెము కూడా అర్థము చేసుకోరు. కావున తండ్రి పిల్లలకు చెప్తున్నారు - బాబా మనకు తండ్రిగానూ ఉన్నారు, శిక్షకులుగా మరియు సద్గురువుగా కూడా ఉన్నారని ఆలోచించండి. అందరినీ తీసుకెళ్తారు. 'మన్మనాభవ' అను రెండే అక్షరాలే ఉన్నాయి. ఇందులోనే అన్నీ వచ్చేస్తాయి. కాని ఇది కూడా మర్చిపోతారు. బుద్ధిలో ఏమేమి కూర్చుంటాయో తెలియదు. లేకుంటే నేను ఇంత సమయము ఏ స్థితిలో ఉన్నానని ప్రతిరోజూ వ్రాసి ఇవ్వండి. మీరు తండ్రి, టీచరు, సద్గురువు ఎదుట కూర్చుని ఉన్నారు కావున వారే గుర్తుకు రావాలి కదా. విద్యార్థికి టీచరే గుర్తుకు వస్తారు కాని ఇక్కడ మాయ ఉంది కదా. మాయ పూర్తిగా తలను తిప్పేస్తుంది. రాజ్యభాగ్యమంతటిని మీకు తెలియకుండానే తీసుకునేస్తుంది. వారసత్వము తీసుకునేందుకు వచ్చారు కాని ఏమీ లభించదు అనే అంటారు కదా. స్వర్గములోకి అయితే వెళ్తారు కాని వెళ్లడం ఏమైనా గొప్పనా! ఇక్కడికి వచ్చి చదువుకోకపోయినా స్వర్గములోకి అయితే వస్తారు కదా. ఇక్కడ కూర్చుని ఉన్నాము కదా. స్వర్గములోకి వెళ్లాలని, అక్కడ ఏ పదవి పొందినా పర్వాలేదు అని భావిస్తారు. అలా అనుకుంటే అప్పుడది చదువు కాదు కదా. కొద్దిగా విన్నా దాని ఫలితము లభిస్తుంది. చదువు ద్వారా అయితే చాలా గొప్ప స్కాలర్‌షిప్‌ లభిస్తుంది. తండ్రి ద్వారా ఉన్నతాతి ఉన్నతమైన పదవి పొందాలంటే పురుషార్థము చేయవలసి వస్తుంది. చదువు గుర్తుంటే 84 జన్మల చక్రము కూడా గుర్తుకొస్తుంది. ఇక్కడ కూర్చోగానే అంతా గుర్తు రావాలి. కాని ఇది కూడా గుర్తుకు రాదు. ఒకవేళ స్మృతి ఉంటే ఇతరులకు కూడా వినిపిస్తారు. చిత్రాలైతే అందరి వద్ద ఉన్నాయి. శివుని చిత్రము గురించి ఎవరికైనా వినిపిస్తే వారు ఎప్పటికీ కోపపడరు. ఈ శివుడు అనంతమైన తండ్రి కదా, మీరు వస్తే వారితో మీకున్న సంబంధమేమిటో తెలిపిస్తామని చెప్పండి. ఇది వ్యర్థమైన, సాధారణ చిత్రము కాదు. శివుని భగవంతుడని తప్పకుండా అంటారు. భగవంతుడైతే నిరాకారుడుగానే ఉంటాడు. వారిని తండ్రి అని అంటారు. వారు శిక్షణను కూడా ఇస్తారు. ఆత్మలైన మీరు శిక్షణను తీసుకుంటారు. ఆత్మయే అన్నీ చేస్తుంది. టీచరుగా కూడా ఆత్మయే అవుతుంది. తండ్రి కూడా ఈ రథములోకి వచ్చి చదివిస్తాడు. సత్యయుగాన్ని స్థాపన చేస్తాడు. అక్కడ కలియుగము నామ-రూపాలు కూడా ఉండవు. మానవులు ఎక్కడి నుండి వస్తారు? సర్వీసు చేసే పిల్లలకు రోజంతా ఆలోచన నడుస్తూ ఉంటుంది. సర్వీసు చేయకపోతే బుద్ధి పని చేయదని భావిస్తారు. బుద్ధూ(బుద్ధిహీనులు, మూర్ఖులు)గా కూర్చొని ఉండేవారు తండ్రిని అర్థము చేసుకోలేరు. పతితపావనులైన తండ్రిని స్మృతి చేస్తేనే వారసత్వము లభిస్తుంది. స్మృతి చేస్తూ చేస్తూ మరణిస్తే తండ్రి ఆస్తి అంతా లభిస్తుంది. ''బేహద్‌ తండ్రి ఇచ్చే ఆస్తి - స్వర్గము.''
పిల్లల వద్ద బ్యాడ్జ్‌ కూడా ఉంది. ఇంటికి బంధు-మిత్రులు చాలా మంది వస్తారు. ఎవరైనా మరణించినా చాలామంది వస్తారు. వారికి కూడా మీరు చాలా బాగా సర్వీసు చేయవచ్చు. శివబాబా చిత్రమైతే చాలా బాగుంది. భలే పెద్దదిగానే ఉంచండి. ఎవ్వరూ ఏమీ అనరు. శివబాబాను చూసి బ్రహ్మ అని అనరు. వీరు గుప్తంగా ఉన్నారు. మీరు గుప్తంగా కూడా అర్థం చేయించవచ్చు. కేవలం శివుని చిత్రమును మాత్రమే ఉంచండి. ఇతర చిత్రాలన్నీ తీసేయండి. ఈ శివబాబా తండ్రి, టీచరు, సద్గురువు. కొత్త ప్రపంచమును స్థాపన చేసేందుకే సంగమ యుగములోనే వారు వస్తారు. ఈ జ్ఞానమైతే బుద్ధిలో ఉంది కదా. శివబాబాను స్మృతి చేయండి, మరెవ్వరినీ స్మృతి చేయకండి అని చెప్పండి. శివబాబా పతితపావనుడు, నన్ను స్మృతి చేస్తే మీరు వచ్చి నాతో కలుసుకుంటారని శివబాబా చెప్తున్నారు. మీరు గుప్తంగా సర్వీసు చేయవచ్చు. మీరు ఈ జ్ఞానము ద్వారానే లక్ష్మీనారాయణులుగా అయ్యారు. శివబాబా నిరాకారుడని చెప్తారు కదా, వారెలా వస్తారు? అని అడుగుతారు. అరే! ఆత్మలైన మీరు కూడా నిరాకారులే. మీరు ఎలా వస్తారు? అవి కూడా పాత్ర చేసేందుకు పై నుండే వస్తాయి కదా. ఇది కూడా తండ్రి వచ్చి అర్థము చేయిస్తున్నారు. ఎద్దు పైన రాలేరు, అలాగైతే ఎలా మాట్లాడ్తారు? సాధారణ వృద్ధుని తనువులో వస్తారు. అర్థం చేయించేందుకు కూడా చాలా యుక్తి ఉండాలి. మీరు భక్తి చేయరా? అని ఎవరైనా అడుగుతారు. మేము అన్నీ చేస్తాము అని చెప్పండి. యుక్తిగా నడచుకోవలసి ఉంటుంది. ఇతరులను ఉన్నతి చేసేందుకు ఏం చేయాలి? అని ఆలోచించాలి. ఎవ్వరి పైనా కోపగించుకోరాదు. గృహస్థ వ్యవహారములో ఉంటూ కేవలం పవిత్రంగా ఉండాలి. బాబా, సర్వీసు చేయుటకు అవకాశము లభించదు అని అంటారు. అరే! చాలా సర్వీసు చేయగలరు. గంగా నది తీరములో కూర్చోండి. ఈ నీటిలో స్నానము చేస్తే ఏం వస్తుంది? పావనంగా అవుతారా? అని అడగండి. పతితపావనా! రండి, వచ్చి పావనంగా తయారుచేయండి అని మీరు భగవంతుని అడుగుతారు. కావున పతితపావనులు భగవంతుడా లేక నదులా? అని అడగండి. ఇలాంటి నదులైతే చాలా ఉన్నాయి. పతితపావనుడైన తండ్రి అయితే ఒక్కరే. ఈ నీటి నదులు సదా ఉండనే ఉన్నాయి. పావనంగా చేసేందుకు తండ్రే రావలసి వస్తుంది. పురుషోత్తమ సంగమ యుగములోనే వచ్చి పావనంగా చేస్తారు. అక్కడ పతితులెవ్వరూ ఉండరు. దాని పేరే స్వర్గము, క్రొత్త ప్రపంచము. ఇప్పుడిది పాత ప్రపంచము. ఈ సంగమ యుగము గురించి మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. సర్వీసు చేసేందుకు ఎన్నో యుక్తులు కూడా బాబా తెలియజేస్తారు. బుద్ధిహీనులుగా కూడా అవ్వకండి. అమరనాథ్‌లో కూడా పావురము ఉంటుందని, పావురము సందేశమును చేర్చుతుందని చెప్తారు. పరమాత్ముని సందేశాన్ని పావురము పై నుండి తెస్తుందని కాదు. ఇది కూడా నేర్పిస్తారు. వ్రాసిన జాబును దాని కాలికి కట్టి పంపితే తీసుకెళ్తుంది. దానికి ధాన్యము సహజంగా లభిస్తూ ఉంటే ఇంకెక్కడా తిరిగే అవసరము లేదు. మీకు కూడా ఇక్కడ ఆహారము లభిస్తుంది. విశ్వరాజ్య చక్రవర్తి పదవి మీ బుద్ధిలో ఉంది. అది ఇక్కడ మాత్రమే లభిస్తుంది. వాస్తవికమైన ధాన్యము దొరికేది ఇక్కడే అని అర్థమైనప్పుడు ఈ వైపుకు మరలుతారు. మీరు చైతన్యంగా ఉన్నారు. మీకు అవినాశి జ్ఞాన రత్నాల ఆహారము లభిస్తుంది. శాస్త్రాలలో కూడా పక్షులు సాగరాన్ని మింగేశాయని ఉంది, చాలా కథలు వ్రాసేశారు. ఇది సత్యమని మానవులంటారు. సాగరము నుండి దేవతలు వచ్చారని అంటారు. రత్నాలను పళ్ళెములో నింపుకుని తీసుకొచ్చారని చెప్తే, ఇది సత్యమని అంటారు. ఇప్పుడు సముద్రము నుండి దేవతలు ఎలా వస్తారు? సముద్రములో మానవులు లేక దేవతలేమైనా ఉంటారా! ఏమీ అర్థము చేసుకోరు. జన్మ - జన్మల నుండి అసత్యమునే చదువుతూ, వింటూ వచ్చారు. అందువలన అసత్యపు మాయ,................ (ఝూఠీ మాయా, ఝూఠీ కాయా.........) అని అంటారు. సత్యమైన ప్రపంచానికి, అసత్య ప్రపంచానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేెడా ఉంది! అసత్యము చెప్తూ చెప్తూ నిరుపేదలుగా అయ్యారు, దివాలా తీశారు. మీరు ఎంత యుక్తిగా అర్థం చేయించినా కోటిలో కొందరి బుద్ధిలోనే కూర్చుంటుంది. ఇది చాలా సహజమైన జ్ఞానము, సహజమైన యోగము. తండ్రి, టీచరు, సద్గురువును స్మృతి చేయడం వలన వారి విశేషతలు కూడా బుద్ధిలోకి వచ్చేస్తాయి. తమను తాము పరీక్షించుకోవాలి. మేము తండ్రిని స్మృతి చేస్తున్నామా? లేక బుద్ధి మరెటు వైపైనా వెళ్తోందా? మీ బుద్ధికి ఇప్పుడు జ్ఞ్ఞానము లభిస్తుంది. ఎంత మధురమైన విషయాలను తండ్రి అర్థం చేయిస్తారు! యుక్తులు తెలుపుతున్నారు. మీరు ఎవరికైనా కూర్చొని అర్థం చేయిస్తే మీకు శత్రువులు కూడా ఉండరు. శివబాబానే మీకు తండ్రి, టీచరు, సద్గురువు. వారిని స్మృతి చేయండి అని చెప్పండి. అర్థం చేయించేందుకు యుక్తులు రచించాలి. బ్రహ్మ చిత్రమును చూసి చాలామంది అభ్యంతరము తెలుపుతారు. శివుని చిత్రము గురించి ఎవ్వరూ ఆక్షేపణ చేయరు. అరే! వీరు సర్వాత్మలకు తండ్రి కదా. కావున తండ్రిని స్మృతి చేయండి అని చెప్పండి. దీని ద్వారా చాలా మందికి లాభము అవ్వగలదు. తండ్రిని స్మృతి చేయడం వలన మీరు పతితము నుండి పావనంగా అవుతారు. వారు అందరికీ తండ్రి. తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తుకు రాకూడదు. ఇతర సాంగత్యాలను వదిలి ఒక్క తండ్రితో సాంగత్యము జోడించండి. ఇది ఇతరుల కళ్యాణము చేసేందుకు యుక్తి. తండ్రిని స్మృతే చేయలేకుంటే పావనంగా ఎలా అవుతారు. ఇంట్లో కూడా మీరు చాలా సేవ చేయవచ్చు. బంధు-మిత్రులు చాలామంది మీతో కలుస్తారు. కావున భిన్న-భిన్న యుక్తులను రచించండి. చాలా మందికి కళ్యాణము చేయవచ్చు. ఉన్న దుకాణమేమో ఒక్కటే. మరే దుకాణము లేనే లేదు, మరి ఇక ఎక్కడికెెళ్తారు? మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. గృహస్థ వ్యవహారములో చాలా యుక్తిగా నడుచుకోవాలి, ఎవ్వరినీ విసిగించరాదు, తప్పకుండా పవిత్రముగా కూడా అవ్వాలి.

2. ఒకే తండ్రి ద్వారా అవినాశి జ్ఞాన రత్నాలనే ఆహారమును తీసుకుని తమ బుద్ధి రూపి జోలెను నింపుకోవాలి, బుద్ధిని భ్రమింపజేయరాదు, సందేశకులై అందరికీ తండ్రి సందేశమును ఇవ్వాలి.

వరదానము :-

'' బ్రాహ్మణ జీవితములో వెరైటి అనుభూతుల ద్వారా రమణీకతను అనుభవం చేసే సంపన్న ఆత్మా భవ ''

జీవితంలో ప్రతి మనుష్యాత్మకు గల ఇష్టాలు రకరకాలుగా ఉంటాయి. కనుక మొత్తం రోజంతటిలో భిన్న-భిన్న సంబంధాలు, భిన్న-భిన్న స్వరూపాల వెరైటీని అనుభవం చేయండి. అప్పుడు చాలా రమణీకమైన జీవితాన్ని అనుభవం చేస్తారు. బ్రాహ్మణ జీవితము భగవంతునితో సర్వ సంబంధాలు అనుభవం చేసే సంపన్నమైన జీవితము. అందువలన ఒక్క సంబంధాన్ని కూడా విడిచిపెట్టరాదు. ఒకవేళ ఏదైనా చిన్న లేక తేలికైన ఆత్మ సంబంధము మిక్స్‌ అయితే సర్వ అనే శబ్ధము సమాప్తమై పోతుంది. ఎక్కడైతే సర్వమూ ఉన్నాయో అక్కడే సంపన్నత ఉంటుంది. అందువలన సర్వ సంబంధాలతో స్మృతి స్వరూపులుగా అవ్వండి.

స్లోగన్‌ :-

'' తండ్రి సమానం అవ్యక్త రూపధారులుగా అయ్యి ప్రకృతిలోని ప్రతి దృశ్యాన్ని చూస్తే ఆందోళనలోకి రారు. ''