27-08-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - పవిత్రమవ్వకుండా మీరు వాపస్‌ వెళ్లలేరు. అందువలన తండ్రిని స్మృతి చేసి ఆత్మ రూపి బ్యాటరీని చార్జ్‌ చేసుకోండి. స్వాభావికంగా ( న్యాచురల్‌గా ) పవిత్రులుగా అవ్వండి. ''

ప్రశ్న :-

ఇంటికి వెళ్లే ముందు పిల్లలైన మీకు బాబా ఏ విషయమును నేర్పిస్తారు ?

జవాబు :-

పిల్లలారా, ఇంటికి వెళ్లే ముందు జీవించి ఉండి కూడా మరణించాలి. అందువలన బాబా మీకు మొదటి నుండే దేహ స్మృతి నుండి భిన్నంగా తీసుకెెళ్లే అభ్యాసము చేయిస్తారు అనగా మరణించడం నేర్పిస్తారు. పైకి వెళ్లడం అనగా మరణించడము. వెళ్లడము మరియు రావడము - ఈ జ్ఞానము మీకిప్పుడు లభించింది. ఆత్మలమైన మనము పై నుండి ఈ శరీరము ద్వారా పాత్ర చేసేందుకు వచ్చామని మీకు తెలుసు. మనము వాస్తవానికి అక్కడ నివసించేవారము. ఇప్పుడు అక్కడికే వాపస్‌ వెళ్లాలి.

ఓంశాంతి.

మిమ్ములను మీరు ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడంలో ఏ కష్టమూ లేదు, అగిపోరాదు. దీనినే సహజమైన స్మృతి అని అంటారు. మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మనే శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తుంది. సంస్కారము కూడా ఆత్మలోనే ఉంటుంది. ఆత్మ స్వతంత్రమైనది. తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఈ జ్ఞానము మీకిప్పుడే లభిస్తుంది. తర్వాత లభించదు. మీరిక్కడ శాంతిగా కూర్చున్న విషయము ప్రపంచములోని వారికి తెలియదు. దీనిని స్వాభావికమైన లేక సహజమైన(న్యాచురల్‌) శాంతి అని అంటారు. ఆత్మలమైన మనము పై నుండి ఈ శరీరము ద్వారా పాత్ర చేసేందుకు వచ్చాము. ఆత్మలమైన మనము మొదట అక్కడ నివసించేవారము. బుద్ధిలో ఈ జ్ఞానముంది. ఇందులో హఠయోగము మాటేదీ లేదు. చాలా సహజమైనది. ఆత్మలమైన మనమిప్పుడు ఇంటికి వెళ్లాలి. కాని పవిత్రమవ్వకుండా వెళ్లలేము. పవిత్రంగా అయ్యేందుకు పరమాత్ముడైన తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి చేస్తూ చేస్తూ పాపాలు సమాప్తమైపోతాయి. కష్టమైన విషయమేదీ లేదు. మీరు వాకింగ్‌కు వెళ్లినప్పుడు కూడా తండ్రి స్మృతిలో ఉండండి. ఇప్పుడే స్మృతి ద్వారా పవిత్రంగా అవ్వగలరు. అక్కడది పవిత్ర ప్రపంచము. ఆ పావన ప్రపంచములో ఈ జ్ఞానమేమీ అవసరముండదు. ఎందుకంటే అక్కడ ఏ వికర్మలూ జరగవు. ఇక్కడ స్మృతి చేయడం ద్వారా వికర్మలను వినాశనం చేసుకోవాలి. ఇక్కడ నడుచుకున్న విధంగానే అక్కడ కూడా మీరు న్యాచురల్‌గా నడుచుకుంటారు. తర్వాత కొద్ది కొద్దిగా క్రిందకు దిగుతారు. అక్కడ కూడా ఈ అభ్యాసము చేసే అవసరము లేదు. అభ్యాసము ఇప్పుడే చేయాలి. బ్యాటరీని ఇప్పుడు చార్జ్‌ చేసుకోవాలి. తర్వాత నెమ్మది నెమ్మదిగా బ్యాటరీ డిస్‌చార్జ్‌ అవ్వాల్సిందే. బ్యాటరీని చార్జ్‌ చేసుకునే జ్ఞానము మీకు ఇప్పుడు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. సతోప్రధానంగా ఉన్నవారు తమోప్రధానంగా అయ్యేందుకు ఎంత సమయము పడ్తుంది! ప్రారంభము నుండి ఎంతో కొంత బ్యాటరీలో చార్జ్‌ తగ్గుతూ ఉంటుంది. మూలవతనములో అయితే ఆత్మలే ఉంటాయి, శరీరమైతే ఉండదు. కనుక బ్యాటరీలో చార్జ్‌ తక్కువ అయ్యే మాటే లేదు. మోటరు వెళ్తునప్పుడే బ్యాటరీ తక్కువవుతూ ఉంటుంది. మోటరు నిలబడి ఉంటే బ్యాటరీ నడవదు అనగా ఖర్చు అవ్వదు. మోటరు వెళ్తునప్పుడు బ్యాటరీ పని చేయడం ప్రారంభమవుతుంది. భలే మోటరులో అయితే బ్యాటరీ చార్జ్‌ అవుతూ ఉంటుంది. కానీ మీ బ్యాటరీ ఒకేసారి ఈ సమయములో మాత్రమే చార్జ్‌ అవుతుంది. మీరు ఇక్కడ ఈ శరీరము ద్వారా పని చేస్తూ ఉన్నప్పుడు బ్యాటరీ కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. ఎవరినైతే సర్వాత్మలు స్మృతి చేస్తున్నారో, వారు మనందరికీ పరమపిత అని మొదటే అర్థం చేయించాలి. ఓ భగవంతుడా! అని అంటారు కదా. వారు తండ్రి. మనము వారి పిల్లలము. ఇక్కడ పిల్లలైన మీకు బ్యాటరీని ఎలా చార్జ్‌ చేసుకోవాలో అర్థం చేయించబడ్తుంది. భలే తిరుగుతూ విహరిస్తూ ఉండండి. కాని తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే సతోప్రధానంగా అవుతారు. ఏ విషయమైనా అర్థమవ్వకపోతే అడగవచ్చు. చాలా సహజము. 5 వేల సంవత్సరాల తర్వాత మన బ్యాటరీ డిస్‌చార్జ్‌ అయిపోతుంది. తండ్రి వచ్చి అందరి బ్యాటరీని చార్జ్‌ చేస్తారు. వినాశ సమయములో అందరూ ఈశ్వరుని స్మృతి చేస్తారు. వరదలొచ్చినప్పుడు కూడా భక్తులైనవారు భగవంతుడినే స్మృతి చేస్తారు. కాని ఆ సమయములో వారికి భగవంతుడు గుర్తుకు రాజాలడు. బంధు-మిత్రులు, ధనము, ఆస్తి - ఇవే గుర్తుకు వచ్చేస్తాయి. భలే ఓ భగవంతుడా! అని అంటారు, కాని అది నోటితో అనడం వరకే. భగవంతుడు మనందరికీ తండ్రి, మనము వారి పిల్లలము. ఇది వారికి తెలియనే తెలియదు. వారికి సర్వవ్యాపి అనే ఉల్టా జ్ఞానము లభిస్తుంది. తండ్రి వచ్చి సుల్టా(కరెక్ట్‌) జ్ఞానమును ఇస్తారు. భక్తి విభాగమే వేరుగా ఉంది. భక్తిలో ఎదురుదెబ్బలు తినాల్సి ఉంటుంది. బ్రహ్మరాత్రి అంటే బ్రాహ్మణుల రాత్రి. బ్రహ్మ పగలే బ్రాహ్మణుల పగలు. శూద్రుల పగలు, శూద్రుల రాత్రి అని అనరు. ఈ రహస్యాన్ని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇది బేహద్‌ రాత్రి లేక బేహద్‌ పగలు. మీరు ఇప్పుడు పగలులోకి వెళ్తారు, రాత్రి పూర్తవుతుంది. ఈ వాక్యాలు శాస్త్రాలలో ఉన్నాయి. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అని అంటారు. కానీ దీనిని గురించి తెలియదు. మీ బుద్ధి ఇప్పుడు బేహద్‌ వైపుకు వెళ్లింది. మీరు దేవతల గురించి కూడా, విష్ణు పగలు, విష్ణు రాత్రి అని అంటారు. ఎందుకంటే విష్ణువుకు మరియు బ్రహ్మకు ఉన్న సంబంధము కూడా అర్థం చేయించబడ్తుంది. త్రిమూర్తి కర్తవ్యమేమిటో ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. వారైతే భగవంతుడినే కూర్మావతారము, మత్సా ్యవతారములో లేక జనన-మరణ చక్రములోకి తీసుకెళ్లారు. రాధా-కృష్ణులు మొదలైనవారు కూడా మనుష్యులే. కాని దైవీగుణాలు కలిగినవారు. మీరిప్పుడు అలా తయారవ్వాలి. మరుసటి జన్మలో దేవతలుగా అవుతారు. 84 జన్మల లెక్కాచారము ఇప్పుడు పూర్తి అయ్యింది. మళ్లీ పునరావృతమౌతుంది. ఈ శిక్షణ మీకిప్పుడు లభిస్తూ ఉంది.
తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా! - స్వయాన్ని ఆత్మ అని నిశ్చయించుకోండి. మనము పాత్రధారులమని కూడా అంటారు కదా. కాని ఆత్మలమైన మనము పై నుండి ఎలా వస్తామో అర్థం కాదు. స్వయాన్ని దేహధారులమనే భావిస్తారు. ఆత్మలమైన మనము పై నుండి వస్తాము మళ్లీ ఎప్పుడు వెళ్తాము? పైకి వెళ్ళడము అంటే మరణించడము, శరీరాన్ని వదిలేయడం. మరణించాలని ఎవరు అనుకుంటారు? ఇక్కడైతే మీకు తండ్రి, మీ ఈ శరీరాన్ని మర్చిపోతూ వెళ్లండి అని చెప్తున్నారు. జీవించి ఉండి మరణించడం(జీతేజీ మర్‌నా) మీకు నేర్పిస్తారు. దీనిని ఇతరులెవ్వరూ నేర్పించలేరు. మీరు ఇంటికి వెళ్లేందుకు ఇక్కడికి వచ్చారు. ఇంటికి వలా వెళ్లాలి అనే ఈ జ్ఞానము మీకు ఇప్పుడు మాత్రమే లభిస్తుంది. ఈ మృత్యు లోకములో మీకిది అంతిమ జన్మ. సత్యయుగమును అమరలోకమని అంటారు. మనము త్వరత్వరగా వెళ్లాలని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మొట్టమొదట ముక్తిధామమైన ఇంటికి వెళ్లవలసి ఉంటుంది. ఈ శరీరమనే వస్త్రమును ఇక్కడే వదిలేయాలి. తర్వాత మళ్లీ ఆత్మ ఇంటికి వెళ్లిపోతుంది. ఎలాగైతే హద్దు నాటకము పూర్తి కాగానే పాత్రధారులు డ్రామా వస్త్రాలను వదిలి ముందు వేసుకున్న ఇంటి వస్త్రములనే ధరిస్తారో, అలా మీరు కూడా ఇప్పుడు శరీరమును వదిలి వెళ్లాలి. సత్యయుగములో అయితే దేవతలు కొద్దిమందే ఉంటారు. ఇక్కడైతే లెక్కలేనంతమంది మనుష్యులు ఉన్నారు. అక్కడ ఆది సనాతన దేవీ దేవతా ధర్మమొక్కటే ఉంటుంది. ఇప్పుడైతే స్వయాన్ని హిందువులు అని చెప్పుకుంటారు. తమ శ్రేష్ఠమైన ధర్మము - కర్మమును మర్చిపోయారు. అందుకే దు:ఖితులుగా అయ్యారు. సత్యయుగములో మీరు శ్రేష్ఠమైన ధర్మ-కర్మములను ఆచరించేవారు. కలియుగములో ఇప్పుడు ధర్మభ్రష్టులుగా ఉన్నారు. మనమెలా పడిపోయినామో బుద్ధిలోకి వస్తుందా? మరిప్పుడు బేహద్‌ తండ్రి పరిచయమునిస్తారు. బేహద్‌ తండ్రే వచ్చి క్రొత్త ప్రపంచమైన స్వర్గమును రచిస్తారు. 'మన్మనాభవ' అని అంటారు. అది గీతలోని పదమే. సహజ రాజయోగ జ్ఞానానికి భగవద్గీత అను పేరు పెట్టబడింది. ఇది మీ పాఠశాల. పిల్లలు వచ్చి చదువుకుంటారు. కనుక ఇది మా బాబా పాఠశాల అని అంటారు. ఏ పిల్లల తండ్రి అయినా ప్రిన్సిపల్‌గా ఉంటే ఆ పిల్లలు, మా నాన్నగారి కళాశాలలో చదువుకుంటున్నామని అంటారు. వారి తల్లి కూడా ప్రిన్సిపాల్‌గా ఉంటే, మా అమ్మ-నాన్నా ఇద్దరూ ప్రిన్సిపాలుగా ఉన్నారని అంటారు. ఇద్దరూ చదివిస్తారు. మా అమ్మ-నాన్నల కళాశాల అని అంటారు. మీరు మా మమ్మా-బాబాల పాఠశాల అని అంటారు. ఇరువురూ చదివిస్తారు. ఇరువురూ ఈ ఆత్మిక కాలేజీ లేక యూనివర్సిటీని(విశ్వవిద్యాలయము) తెరిచారు. ఇద్దరూ కలిసి చదివిస్తారు. బ్రహ్మ దత్తు తీసుకున్నారు కదా. ఇవి చాలా రహస్యయుక్తమైన జ్ఞాన విషయాలు. తండ్రి క్రొత్త విషయాలేవీ అర్థం చేయించరు. వీటిని కల్పక్రితము కూడా అర్థం చేయించారు. అవును, రోజురోజుకు గుహ్యంగా అవుతూ పోతుంది, ఇది అపారమైన జ్ఞానము. ఆత్మ జ్ఞానము ఇప్పుడు మీకు ఎలా లభిస్తోందో చూడండి. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. అది ఎప్పుడూ వినాశనమవ్వదు. ఆత్మ అవినాశిగా ఉంటుంది. కావున అందులోని పాత్ర కూడా అవినాశిగా ఉంటుంది. ఆత్మయే చెవుల ద్వారా వింటుంది. శరీరముంటే పాత్ర ఉంటుంది. శరీరము నుండి ఆత్మ వేరైనప్పుడు జవాబు లభించదు. ఇప్పుడు తండ్రి - '' పిల్లలారా! మీరు వాపస్‌ ఇంటికి పోవాలి, ఈ పురుషోత్తమ యుగము వచ్చినప్పుడే వాపస్‌ వెళ్లవలసి వస్తుంది '' అని చెప్తున్నారు. ఇందులో ముఖ్యంగా పవిత్రతయే ఉండాలి. శాంతిధామములో అయితే పవిత్ర ఆత్మలే ఉంటాయి. శాంతిధామము మరియు సుఖధామము రెండూ పవిత్రమైనధామాలే. శాంతిధామములో శరీరమే ఉండదు. ఆత్మ పవిత్రంగా ఉంటుంది. అక్కడ బ్యాటరీ డిస్‌చార్జ్‌ అవ్వదు. ఇక్కడ శరీరమును ధారణ చేయడం ద్వారా మోటరు పని చేస్తుంది. మోటరు ఆగి ఉంటే పెట్రోలు ఏ మాత్రము తగ్గిపోదు. ఇప్పుడు మీ ఆత్మ జ్యోతి యొక్క వెలుగు చాలా తక్కువైపోయింది. పూర్తిగా ఆరిపోదు. ఎవరైనా మరణిస్తే దీపము వెలిగిస్తారు. అది ఆరిపోకుండా చూసుకుంటూ ఉంటారు. ఆత్మ జ్యోతి ఎప్పటికీ ఆరిపోదు. అది అవినాశి. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. వీరు చాలా మధురమైన పిల్లలని, వీరందరూ కామచితి పై కూర్చొని కాలిపోయి భస్మమైపోయారని తండ్రికి తెలుసు. నేను మళ్లీ వీరిని మేల్కొల్పుతాను. పూర్తి తమోప్రధానంగా మృతులుగా అయిపోయారు. తండ్రిని గురించి తెలియనే తెలియదు. మనుష్యులు దేనికీ పనికి రాకుండా ఉన్నారు. మానవుని మట్టి శరీరము దేనికీ పనికి రాదు. గొప్ప వ్యక్తుల మట్టి పనికి వచ్చి, పేదల మట్టి పనికిరాదని కాదు. ఎవరిదైనా సరే మట్టి మట్టిలో కలిసిపోతుంది. కొందరు కాలుస్తారు, కొందరు శ్మశానములో పాతి పెడ్తారు. పారసీలు గోతి పై పెట్టేస్తారు. తర్వాత పక్షి ఆ మాంసమును తినేస్తుంది. తర్వాత ఎముకలు క్రింద గోతిలో పడిపోతాయి. తర్వాత అవైనా పనికి వదిలేయాలి. మీరిక్కడకు శరీరమును వదిలేసి ఇంటికి వెళ్లేందుకు అనగా మరణించేందుకే వచ్చారు. జీవన్ముక్తికి వెళ్తామని మీరు సంతోషంగా వెళ్తారు.
ఎవరు ఏ పాత్ర చేశారో, చివరి వరకు అదే పాత్ర చేస్తారు. తండ్రి పురుషార్థమును చేయిస్తూ ఉంటారు. సాక్షిగా చూస్తూ ఉంటారు. ఇది అర్థము చేసుకోవలసిన విషయము. ఇందులో భయపడే విషయమేదీ లేదు. మనము స్వర్గానికి వెళ్లేందుకు పురుషార్థము చేసి శరీరాన్ని మనమే వదిలేస్తాము. తండ్రినే స్మృతి చేస్తూ ఉండాలి. దాని వలన అంతమతి సో గతి(అంతమతి సో గతి)గా అవుతుంది. శ్రమ ఇందులోనే ఉంది. ప్రతి చదువులోనూ కష్టముంది. భగవంతుడు వచ్చి చదివించవలసి వస్తుంది. ఈ చదువు చాలా గొప్పగా ఉంటుంది. ఇందులో దైవీగుణాలు కూడా కావాలి. ఈ లక్ష్మీనారాయణుల వలె తయారవ్వాలి కదా. వీరు సత్యయుగములో ఉండేవారు. మీరు ఇప్పుడు మళ్లీ సత్యయుగములోని దేవీదేవతలుగా అయ్యేందుకు వచ్చారు. లక్ష్యము, ఉద్ధేశ్యము ఎంత సహజంగా ఉంది. త్రిమూర్తి చిత్రములో చాలా స్పష్టంగా ఉంది. బ్రహ్మ-విష్ణు-శంకరుల చిత్ర్రాలు లేకపోతే మనమెలా అర్థం చేయించగలము. బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మ. బ్రహ్మకు 8 భుజాలు, 100 భుజాలు చూపిస్తారు. ఎందుకంటే బ్రహ్మకు ఎంతమంది పిల్లలున్నారు! కావున వారు ఆ విధంగా చిత్రాన్ని తయారు చేశారు. మనుష్యులెవ్వరూ ఇన్ని భుజాలు కలిగి ఉండరు. రావణునికున్న 10 తలలకు కూడా అర్థముంది. ఇటువంటి మనుష్యులు ఉండరు. తండ్రియే కూర్చొని వీటిని అర్థం చేయిస్తారు. మానవులకైతే ఏమీ తెలియదు. ఇది కూడా ఆట. ఇది ఎప్పటి నుండి ప్రారంభమయ్యిందో ఎవ్వరికీ తెలియదు. పరంపర నుండి అని అనేస్తారు. అరే! అది కూడా ఎప్పటి నుండి? కావున మధురాతి మధురమైన పిల్లలను తండ్రి చదివిస్తారు. వారు టీచరుగా, గురువుగా కూడా ఉన్నారు. మరి పిల్లలకు ఎంత సంతోషముండాలి!
ఈ మ్యూజియం మొదలైన వాటిని ఎవరి ఆదేశాల(డైరక్షన్‌) ప్రకారము తెరుస్తారు? ఇక్కడ తల్లి, తండ్రి మరియు పిల్లలు మాత్రమే ఉన్నారు. చాలామంది పిల్లలున్నారు. డైరక్షన్‌ అనుసారంగా తెరుస్తూ ఉంటారు. మీరు రథము ద్వారా భగవానువాచ అని అంటారు కదా. కావున రథము ద్వారా మాకు భగవంతుని సాక్షాత్కారము చేయించండి అని అడుగుతారు. అరే, మీకు ఆత్మ సాక్షాత్కారమయ్యిందా? ఇంత చిన్న బిందువును ఎలా సాక్షాత్కారము చేసుకుంటారు? చేసుకోలేరు. అసలు దాని అవసరమే లేదు. మొదట ఆత్మ గురించి తెలుసుకోవలసి ఉంటుంది. ఆత్మ భృకుటి మధ్య ఉంటుంది. దీని ఆధారముతోనే ఇంత పెద్ద శరీరము నడుస్తుంది. ఇప్పుడు మీ వద్ద ప్రకాశ కిరీటమూ లేదు. రత్నజడిత కిరీటమూ లేదు. రెండు కిరీటాలను ప్రాప్తి చేసుకునేందుకు మీరు మళ్లీ పురుషార్థము చేస్తున్నారు. కల్ప-కల్పము మీరు తండ్రి ద్వారా వారసత్వము తీసుకుంటారు. ఇంతకు ముందు ఎప్పుడైనా కలుసుకున్నారా? అని బాబా అడుగుతారు. అవును బాబా కల్ప-కల్పము కలుస్తూ వచ్చామని అంటారు. ఎందుకు? ఈ లక్ష్మీనారాయణుల వలె అయ్యేందుకు. అందరూ ఇదే మాట చెప్తారు. తండ్రి చెప్తున్నారు - మంచిది. శుభము పలికారు. ఇప్పుడు పురుషార్థము చేయండి. అందరూ నరుల నుండి నారాయణులుగా అవ్వరు. ప్రజలు కూడా కావాలి కదా! సత్యనారాయణుని కథ కూడా ఉంది. వారు కథను వినిపిస్తారు. కాని బుద్ధిలో ఏమీ ఉండదు. అది శాంతిధామమని, నిరాకార ప్రపంచమని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అక్కడ నుండి మళ్లీ సుఖధామానికి వెళ్తారు. సుఖధామానికి తీసుకెళ్లేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్తామని అందరికీ అర్థం చేయించండి. ఆత్మను అశరీరి అయిన తండ్రియే ఇంటికి తీసుకెళ్తారు. ఇప్పుడు తండ్రి వచ్చారు. వారిని గురించి ఎవ్వరికీ తెలియదు. నేను ఎవరి తనువులో వచ్చానో వారిని గురించి కూడా తెలియదని తండ్రి అంటున్నారు. రథము కూడా ఉంది కదా. ప్రతి ఒక్కరి రథములో ఆత్మ ప్రవేశిస్తుంది. ఆత్మ అందరికీ భృకుటి మధ్యలో ఉంటుంది. తండ్రి వచ్చి భృకుటి మధ్యలో కూర్చుంటారు. చాలా సహజంగా అర్థం చేయిస్తారు. పతితపావనులు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి పిల్లలందరూ సమానమైనవారు. ప్రతి ఒక్కరికీ తమ-తమ పాత్ర ఉంది. ఇందులో ఎవరూ జోక్యము చేసుకోలేరు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. ఈ శరీరమనే వస్త్రము పై మమత్వమును తొలగించి జీవించి ఉండి మరణించాలి. అనగా తమ పాత లెక్కాచారమునంతా సమాప్తము చేసుకోవాలి.

2. డబల్‌ కరీటధారులుగా అయ్యేందుకు కష్టపడి చదవాలి. దైవీగుణాలను ధారణ చేయాలి. లక్ష ్యమనుసారంగా, శుభమైన మాటల అనుసారంగా పురుషార్థము చేయాలి.

వరదానము :-

'' సిద్ధిని స్వీకరించేందుకు బదులు సిద్ధికి ప్రత్యక్ష ఋజువును చూపించే శక్తిశాలి ఆత్మా భవ ''

ఇప్పుడు మీ అందరి సిద్ధికి ప్రత్యక్ష రూపము కనిపిస్తుంది. ఏదైనా చెడిపోయిన కార్యము కూడా మీ దృష్టి ద్వారా, మీ సహయోగము ద్వారా సహజంగా సరిపోతుంది. ఏదైనా సిద్ధి రూపంలో మీరు ఈ పని అయిపోతుంది అని అనరు. కానీ మీ డైరక్షన్‌(ఆదేశము) స్వతహాగా సిద్ధిని ప్రాప్తి చేయిస్తూ ఉంటుంది. అప్పుడు ప్రజలు త్వరత్వరగా తయారవుతారు. అన్ని వైపుల నుండి వెలుపలికి వచ్చి మీ వైపుకు వస్తారు. ఈ సిద్ధి పాత్ర ఇప్పుడు నడుస్తుంది కానీ మొదట ఎంత శక్తిశాలిగా అవ్వాలంటే సిద్ధిని స్వీకరించకండి. అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది.

స్లోగన్‌ :-

'' అవ్యక్త స్థితిలో స్థితమై మిలనము చేస్తే వరదానాల భండారము తెరుచుకుంటుంది. ''