01-01-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - ఇక్కడ మీరు వనవాసంలో ఉన్నారు. మంచి - మంచి దుస్తులు ధరించాలి, తినాలి అనే అభిరుచి పిల్లలైన మీలోఉండరాదు. చదువు మరియు క్యారక్టర్ పై (నడవడిక పై) పూర్తి గమనమివ్వండి''
ప్రశ్న :-
జ్ఞాన రత్నాలతో సదా సంపన్నంగా ఉండేందుకు సాధనము ఏమిటి ?
జవాబు :-
ఆ రత్నాలను ఎంతెంతగా ఇతరులకు దానం చేస్తారో, అంత స్వయం నిండుగా(భర్పూర్గా) ఉంటారు. ఎవరైతే విని ధారణ చేస్తారో, విన్నదానిని ఇతరులకు దానము చేస్తారో వారే తెలివైనవారు. బుద్ధి రూపీ జోలెలో రంధ్రములుంటే అది ఖాళీ అయిపోతుంది, ధారణ జరగదు. కావున నియమానుసారము చదువును చదవాలి. పంచ వికారాల నుండి దూరంగా ఉండాలి. రూపము మరియు సుగంధము కలవారిగా(రూప్బసంత్/జ్ఞాన-యోగులుగా) అవ్వాలి.
ఓంశాంతి.
ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి కూడా కర్మేంద్రియాల ద్వారానే మాట్లాడ్తారు. అలాగే ఆత్మిక పిల్లలు కూడా కర్మేంద్రియాల ద్వారానే వింటారు. ఇది కొత్త విషయము. ప్రపంచములో మానవమాత్రులెవ్వరూ ఈ విధంగా చెప్పలేరు. మీలో కూడా నెంబరువారీగా, పురుషార్థానుసారమే అర్థం చేయిస్తారు. టీచర్ చదివించినప్పుడు విద్యార్థుల రిజిస్టర్ వారి చదువును చూపిస్తుంది. రిజిస్టర్ ద్వారా వారి చదువు మరియు నడవడికలను గూర్చి తెలిసిపోతుంది. ముఖ్యమైనవి చదువు మరియు క్యారక్టర్(నడవడిక). ఇది ఈశ్వరీయ చదువు. దీనిని ఇంకెవ్వరూ చదివించలేరు. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము అనగా సృష్టిచక్ర జ్ఞానము ఉంది. దీనిని గురించి మొత్తం ప్రపంచమంతటిలో మానవమాత్రులెవ్వరికీ తెలియదు. ఋషులు, మునులు ఎవరైతే ఎంతగానో చదివిన అథారిటీలుగా ఉన్నారో ఆ ప్రాచీన ఋషులు, మునులే మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదని అనేవారు. తండ్రియే వచ్చి తమ పరిచయమును ఇచ్చారు. ఇదంతా ముళ్ళ అడవి అన్న గాయనము కూడా ఉంది. అడవికి తప్పకుండా అగ్ని అంటుకుంటుంది. పూలతోటకు ఎప్పుడూ అగ్ని అంటుకోదు. ఎందుకంటే మొత్తం అడవి అంతా ఎండిపోయి ఉంది. పూతోట పచ్చగా ఉంటుంది. పచ్చని తోటకు మంటలు అంటుకోవు. ఎండిపోయిన వాటికే మంటలు వెంటనే అంటుకుంటాయి. ఇది చాలా పెద్ద అడవి. దీనికి కూడా ఇంతకు ముందు మంటలు అంటుకున్నాయి. అలాగే పూతోట స్థాపన కూడా జరిగింది. మీ తోట ఇప్పుడు గుప్తంగా స్థాపనవుతూ ఉంది. మనము పూతోటలోని సుగంధమైన పుష్పాలుగా, దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. దీని పేరే స్వర్గము. ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతోంది. ఆశ్చర్యమేమిటంటే, మీరు ఎంతగా ఇతరులకు అర్థం చేయించినా, ఇది ఎవ్వరి బుద్ధిలోనూ కూర్చోదు. ఈ ధర్మానికి చెందనివారి బుద్ధిలో ఇది కూర్చోదు కూడా. ఒక చెవితో వింటారు, ఇంకొక చెవితో వదిలేస్తారు. సత్య, త్రేతా యుగాలలో భారతవాసులు చాలా కొద్దిమందే ఉంటారు. మళ్లీ ద్వాపర, కలియుగాలలో ఎంతగానో వృద్ధి జరుగుతుంది. అక్కడ ఒకరిద్దరు పిల్లలు ఉంటారు. ఇచ్చట 4-5 మంది పిల్లలుంటారు. కనుక తప్పకుండా వృద్ధి అయినట్లే కదా! భారతవాసులే ఇప్పుడు హిందువులుగా పిలువబడ్తారు. నిజానికి వీరు దేవతా ధర్మానికి చెందినవారు. ఇంకే ధర్మమువారూ ఇలా తమ ధర్మాన్ని మర్చిపోరు. ఈ భారతవాసులే ఇలా మర్చిపోయారు. ఈ సమయంలో ఎంతమంది మనుష్యులు ఉన్నారో చూడండి. ఇంతమంది వచ్చి జ్ఞానము తీసుకోరు. ప్రతి ఒక్కరూ తమ జన్మలను కూడా అర్థం చేసుకోగలరు. ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకొని ఉంటారో వారు తప్పకుండా పాత భక్తులే అయ్యి ఉంటారు. మనం ఎంత భక్తి చేశామో మీరు అర్థం చేసుకోగలరు. కొద్ది భక్తే చేసి ఉంటే జ్ఞానాన్ని కూడా కొద్దిగానే తీసుకుంటారు మరియు కొద్ది మందికే అర్థం చేయిస్తారు. చాలా భక్తి చేసి ఉంటే జ్ఞానము కూడా చాలా తీసుకుంటారు. చాలా మందికి అర్థం చేయిస్తారు. జ్ఞానము తీసుకోకుంటే ఇంతగా అర్థం చేయించలేరు కూడా. కావున వారికి ఫలితము కూడా తక్కువగానే లభిస్తుంది. లెక్క అయితే ఉంది కదా. పిల్లలలో ఒకరు, ఇస్లాం మతస్థులు ఇన్ని జన్మలు తీసుకుంటారు, బౌద్ధులకు ఇన్ని జన్మలు ఉండాలి అంటూ బాబా వద్దకు లెక్కవేసి పంపించారు. బుద్ధుడు కూడా ధర్మస్థాపకుడే. అతని ముందు బౌద్ధ ధర్మంవారు ఎవ్వరూ లేరు. బుద్ధుని ఆత్మ ప్రవేశించింది. తాను బౌద్ధ ధర్మాన్ని స్థాపించింది. ఆ తర్వాత ఆ ఒక్కరి నుండి వృద్ధి జరుగుతుంది. అతడు కూడా ఒక ప్రజాపితయే. ఒక్కరి నుండి ఎంతగా వృద్ధి జరుగుతుంది! మీరైతే కొత్త ప్రపంచములో రాజుగా అవ్వాలి. ఇక్కడ అయితే మీరు వనవాసములో ఉన్నారు. ఇక్కడ మీకు ఏ వస్తువుల పై అభిరుచి ఉండరాదు. మేము మంచి దుస్తులు మొదలైనవి ధరించాలి అన్న భావన కూడా దేహాభిమానమే. ఏది లభిస్తే అది మంచిది. ఈ ప్రపంచమే కొద్ది సమయం ఉంటుంది. ఇక్కడ మంచి బట్టలు ధరిస్తే అక్కడ తగ్గిపోతుంది. ఈ అభిరుచిని కూడా వదిలేయాలి. ముందు ముందు పిల్లలైన మీకు వాటంతకవే సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. మీరు స్వయం అంటారు - వీరు చాలా మంచి సేవ చేస్తున్నారు. అద్భుతము. వీరు తప్పకుండా ఉన్నతమైన నెంబరును తీసుకుంటారు. తర్వాత తమ సమానంగా చేస్తూ ఉంటారు. రోజురోజుకు ఈ తోట అయితే పెరుగుతూనే ఉంటుంది. ఎంత మంది దేవీ దేవతలైతే సత్య యుగములో లేక త్రేతా యుగములో ఉంటారో వారందరూ ఇప్పుడు ఇక్కడే గుప్తంగా కూర్చుని ఉన్నారు. మళ్లీ వారు ప్రత్యక్షమైపోతారు. ఇప్పుడు మీరు గుప్తంగా పదవిని పొందుతున్నారు. మనం మృత్యులోకములో చదువుతున్నామని, అమరలోకములో పదవి పొందుతామని మీకు తెలుసు. ఇటువంటి చదువును ఎప్పుడైనా చూశారా? ఇది ఆశ్చర్యం! పాత ప్రపంచములో చదవడం, కొత్త ప్రపంచములో పదవిని పొందడం. ఎవరైతే అమరలోక స్థాపనను మరియు మృత్యులోకమును వినాశనాన్ని చేయిస్తారో వారే చదివిస్తారు. మీ ఈ పురుషోత్తమ సంగమ యుగము చాలా చిన్నది. మిమ్ములను చదివించేందుకు తండ్రి ఇతనిలోకే వస్తారు. వారు రావడంతోటే చదువు ప్రారంభమవుతుంది. కావున శివజయంతియే గీతా జయంతి అని వ్రాయమని తండ్రి అంటారు. దీనిని గూర్చి మనుష్యులకు తెలియదు. వారు కృష్ణుని పేరును ఉంచేశారు. ఇప్పుడు ఈ పొరపాటును అర్థం చేసుకోవాలి. మ్యూజియమ్లో ఎంతోమంది గొప్ప గొప్పవారు వస్తారు అలాగని వారందరూ తండ్రిని తెలుసుకున్నారని కాదు. కొంచెము కూడా అర్థము చేసుకోరు. కావున బాబా చెప్తున్నారు - ఫారమ్ నింపిస్తే, ఏదైనా నేర్చుకున్నారా? లేదా? అని తెలిసిపోతుంది. అంతేకాని వారు ఇక్కడకు వచ్చి ఏమి చేస్తారు? సాధు సన్యాసులు, మహాత్ముల వద్దకు వెళ్తారు. కానీ ఇక్కడ అటువంటి విషయమేదీ లేదు. ఇక్కడ వీరిది అప్పటి సాధారణ రూపమే. వీరి వస్త్రధారణలో కూడా తేడా ఏమీ లేదు. అందుకే ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అతడు ఒక వ్యాపారిగా ఉండేవాడని భావిస్తారు. ఇంతకుముందు వినాశీ రత్నాల వ్యాపారి. ఇప్పుడు అవినాశీ రత్నాల వ్యాపారిగా అయ్యాడు. మీరు అనంతమైన తండ్రితో వ్యాపారము చేస్తారు. వారు ఒక గొప్ప వ్యాపారి, ఇంద్రజాలికుడు, రత్నాకరుడు కావున ప్రతి ఒక్కరు స్వయాన్ని మేము రూపబసంతులమని భావించాలి. మాలో లక్షల రూపాయల విలువ చేసే జ్ఞానరత్నాలు ఉన్నాయి. ఈ జ్ఞానరత్నాల ద్వారా మీరు పారసబుద్ధి గలవారిగా అయిపోతారు. ఇది కూడా అర్థం చేసుకోవలసిన విషయమే. ఈ విషయాలను ధారణ చేయడంలో కొందరు చాలా మంచి వివేకవంతులుగా ఉన్నారు. ధారణ జరగకపోతే వారు ఎందుకూ పనికిరారు. వారి జోలెలో రంధ్రము ఉందని, అంతా ఖాళీ అయ్యిందని అర్థము చేసుకోండి. నేను మీకు అవినాశీ జ్ఞాన రత్నాలను దానం చేస్తాను. మీరు వాటిని దానం చేస్తూ ఉన్నట్లయితే నిండుగా అవుతూ ఉంటుంది. లేకపోతే ఏమీ ఉండదు. ఖాళీ అయిపోతుంది. వారు చదవరు. నియమానుసారముగా నడవరు. ఇందులో చాలా మంచి సబ్జెక్టులు ఉన్నాయి. మీరు పంచ వికారాల నుండి పూర్తి దూరంగా వెళ్లాలి.
రక్షాబంధనమేదైతే జరుపుతారో, అది కూడా ఈ సమయానికి చెందిందేనని బాబా అర్థం చేయించారు. కానీ మనుష్యులకు రక్షాబంధనము ఎందుకు కడతారో తెలియదు. వారు ఒకవైపు అపవిత్రముగా అవుతుంటారు. మరొక వైపు రాఖీని కట్టుకుంటూ ఉంటారు. ఇంతకు ముందు బ్రాహ్మణులు రాఖీని కట్టేవారు. ఇప్పుడు చేతి ఖర్చు కోసం సొదరి తన సోదరులకు రాఖీ కడ్తుంది. అక్కడ పవిత్రత యొక్క విషయం ఉండదు. చాలా ఫ్యాషనబుల్ రాఖీలను తయారు చేస్తారు. ఈ దీపావళి, దశరా పండుగలన్నీ సంగమయుగానికి చెందినవే. తండ్రి ఏ కర్మనైతే చేస్తారో, అది మళ్లీ భక్తిమార్గములో కొనసాగుతుంది. తండ్రి మీకు సత్యమైన గీతను వినిపించి ఈ లక్ష్మీనారాయణులుగా తయారు చేస్తారు. ఇప్పుడు మీరు ప్రథమ శ్రేణిలోకి వెళ్తారు. సత్యనారాయణ కథను విని మీరు నరుని నుండి నారాయణునిగా అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు మొత్తం ప్రపంచమంతటినీ మేల్కొలపాలి. మరి ఎంతటి యోగశక్తి కావాలి! యోగశక్తి ద్వారానే మీరు కల్ప-కల్పము స్వర్గ స్థాపన చేస్తారు. యోగబలము ద్వారా స్థాపన జరుగుతుంది. బాహుబలము ద్వారా వినాశనము జరుగుతుంది. రెండే పదాలు ఉన్నాయి. అల్లా మరియు వారసత్వము(అల్ఫ్, బే) యోగబలము ద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు. మీ జ్ఞానము చాలా గుప్తమైనది. సతోప్రధానంగా ఉండిన మీరే తమోప్రధానంగా అయ్యారు. మళ్లీ సతోప్రధానంగా అవ్వాలి. ప్రతి వస్తువూ తప్పకుండా క్రొత్త నుండి పాతదిగా అవుతుంది. క్రొత్త ప్రపంచములో లేనిదేమీ ఉండదు. పాత ప్రపంచములో అసలు ఏమీ లేవు. బోలుగా ఉన్నట్లుంది. స్వర్గముగా ఉన్న భారతదేశము ఎక్కడ? నరకంగా ఉన్న ఇప్పటి భారతదేశము ఎక్కడ? రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. రావణుని దిష్టిబొమ్మను తయారుచేసి తగులబెడ్తారు. కానీ దాని అర్థము తెలియదు. వారు ఎందుకు చేస్తున్నారో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీలో కూడా నిన్నటి వరకు అజ్ఞానము ఉండేది. ఈ రోజు జ్ఞానముంది. నిన్నటి వరకు నరకములో ఉండినారు. ఈ రోజు స్వర్గములోకి వెళ్తున్నారు - ఇది నిజము. ప్రపంచములోని వారు స్వర్గవాసులయ్యారు అని అన్నట్లు కాదు. ఇప్పుడు మీరు స్వర్గములోకి వెళ్తే మళ్లీ నరకమనేదే ఉండదు. ఇది ఎంతో అర్థము చేసుకోవలసిన విషయము! ఇది ఒక్క సెకండు విషయమే. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఇది అందరికీ తెలియజేస్తూ ఉండండి. మీరు ఈ లక్ష్మీనారాయణుల వలె ఉండేవారు, వారు 84 జన్మలు తీసుకొని ఇలా అయ్యారని చెప్పండి. సతోప్రధానం నుండి తమోప్రధానంగా అయ్యారు. మళ్లీ సతోప్రధానంగా అవ్వాల్సిందే. ఆత్మ నశించదు. పోతే అది మళ్లీ తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయ్యే తీరాలి. బాబా రకరకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. నా బ్యాటరీ ఎప్పుడూ పాతబడదు. స్వయాన్ని కేవలం బిందు స్వరూప ఆత్మగా భావించండి అని మాత్రమే తండ్రి చెప్తారు. వీరి ఆత్మ వెళ్ళిపోయిందని అంటారు. కావున ఆత్మ, సంస్కారాల అనుసారము ఒక శరీరాన్ని వదలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు ఆత్మలు ఇంటికి వెళ్లాలి. ఇది కూడా డ్రామాయే. సృష్టి చక్రము పునరావృతమవుతూనే ఉంటుంది. చివరిలో ప్రపంచములో ఇంతమంది మనుష్యులు ఉన్నారని లెక్కవేసి చెప్తారు. ఇందరు ఆత్మలు ఉన్నారు అని ఎందుకు అనరు? పిల్లలూ! - మీరు నన్ను ఎంతగా మర్చిపోయారు! అని తండ్రి అంటారు. మళ్ళీ నేనే వచ్చి అందరి కళ్యాణము చేయాలి. అందుకే తండ్రిని పిలుస్తారు. మీరు తండ్రిని మర్చిపోతారు కాని తండ్రి పిల్లలను ఎప్పుడూ మర్చిపోరు. తండ్రి పతితులను పావనంగా తయారు చేసేందుకే వస్తారు. ఇది గోముఖము(బ్రహ్మ). అంతేకాని ఎద్దు మొదలైనవాటి విషయమేదీ లేదు. ఇతడు భాగ్యశాలీ రథము. శివబాబా నన్ను అలంకరిస్తారని ఈ బాబా పిల్లలైన మీకు చెప్తున్నారు. ఇది పక్కాగా గుర్తుండాలి. శివబాబాను స్మృతి చేస్తే ఎంతో లాభముంటుంది. తండ్రి మనలను ఈ బ్రహ్మ ద్వారా చదివిస్తారు. కావున ఇతడిని స్మృతి చేయరాదు. సద్గురువు ఒక్క శివబాబాయే. వారికే మీరు బలిహారమవ్వాలి. ఇతడు కూడా వారికే బలిహారమయ్యాడు కదా! నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి అంటారు. పిల్లలు సత్యయుగ పూల ప్రపంచములోకి వెళ్తారు. మరి ఈ ముళ్ల పైన వ్యామోహమెందుకు ఉండాలి? 63 జన్మలు భక్తిమార్గపు శాస్త్రాలను చదువుతూ పూజలు చేస్తూ వచ్చారు. మీరు పూజ కూడా మొదట శివబాబాదే చేశారు. అందుకే సోమనాథ మందిరాన్ని నిర్మించారు. మందిరాలు రాజులందరి ఇళ్ళలోనూ ఉన్నాయి. ఎన్ని వజ్రవైఢూర్యాలు ఉండేవి! ఆ తర్వాత వచ్చి దాడి చేశారు. ఒక్క మందిరము నుండే ఎంత బంగారము మొదలైనవి దోచుకు వెళ్ళారు! మీరు అంతటి ధనవంతులుగా, విశ్వాధిపతులుగా అవుతారు. ఇతడు ధనవంతునిగా ఉండేవాడు. విశ్వాధిపతిగా ఉండేవాడు. కానీ వారి రాజ్యము ఎన్నోరోజుల క్రితము ఉండేదో ఎవ్వరికీ తెలియదు. తండ్రి అంటున్నారు - 5 వేల సంవత్సరాలయింది. 2500 సంవత్సరాలు రాజ్యము చేశారు. మిగిలిన 2500 సంవత్సరాలలో ఎన్నో మఠాలు, మార్గాలు మొదలైనవి వృద్ధి చెందుతాయి.
మమ్ములను అనంతమైన తండ్రి చదివిస్తున్నారని పిల్లలైన మీకు చాలా సంతోషము ఉండాలి. అపారమైన ఆస్తి లభిస్తుంది. సముద్రము నుండి దేవతలు వెలువడి పళ్లేలలో రత్నాలను నింపి ఇచ్చినట్లుగా చూపిస్తారు. ఇప్పుడు మీకు జ్ఞాన రత్నాల పళ్లేలు నిండుగా లభిస్తాయి. తండ్రి జ్ఞానసాగరుడు. కొందరు తమ పాత్రలను బాగా నింపుకుంటారు. కొందరి పాత్రలు ఖాళీ అయిపోతాయి. ఎవరైతే బాగా చదువుతారో, చదివిస్తారో వారు తప్పకుండా మంచి ధనవంతులుగా అవుతారు. రాజధాని స్థాపన అవుత#3147;ంది. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. ఎవరైతే బాగా చదువుతారో వారికే స్కాలర్షిప్ లభిస్తుంది. ఇది అవినాశీ ఈశ్వరీయ స్కాలర్షిప్. అది వినాశి. మెట్ల చిత్రము చాలా అద్భుతమైనది. 84 జన్మల కథ ఉంది కదా! మెట్ల చిత్రము ట్రాన్స్లైట్ చిత్రాన్ని ఎంత పెద్దగా తయారు చేయాలంటే అది దూరము నుండే చాలా స్పష్టంగా కనిపించాలి. మనుష్యులు చూసి ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత మీ పేరు కూడా ప్రఖ్యాతమవుతుంది. ఇప్పుడు ఎవరైతే చుట్టూ తిరిగి వెళ్ళిపోతారో వారు చివరిలో వస్తారు. 2-4 సార్లు చుట్టూ తిరిగి, భాగ్యములో ఉంటే నిల్చిపోతారు. దీపమైతే ఒక్కటే. మరి ఇంకెక్కడికి వెళ్తారు? పిల్లలు చాలా మధురంగా అవ్వాలి. ఎప్పుడైతే యోగములో ఉంటారో అప్పుడు మధురంగా అవుతారు. యోగము ద్వారానే అకర్షణ కూడా కలుగుతుంది. ఎంతవరకు ఈ త్రుప్పు తొలగిపోదో, ఆకర్షణ కూడా కలగదు. ఈ మెట్ల రహస్యాన్ని ఆత్మలందరికీ తెలియజేయాలి. మెల్ల-మెల్లగా నెంబర్వారీగా అందరూ తెలుసుకుంటూ ఉంటారు. ఇదంతా ఒక డ్రామా. ప్రపంచము చరిత్ర-భూగోళము పునరావృతమవుతూ ఉంటుంది. ఎవరైతే ఈ విషయాలను అర్థం చేయించారో వారిని స్మృతి చేయాలి కదా! తండ్రిని సర్వవ్యాపి అని అంటారు. కాని అక్కడ మాయ సర్వవ్యాపిగా ఉంది. ఇక్కడ తండ్రి ఉన్నారు. ఎందుకంటే వారు ఒక్క క్షణములో రాగలరు. బాబా వీరిలో కూర్చుని ఉన్నారని మీరు భావించాలి. చేసి చేయించేవారు కదా. వారు చేస్తారు మరియు చేయిస్తారు కూడా! పిల్లలకు డైరెక్షన్(ఆదేశమును) ఇస్తారు. అలాగే వారు స్వయం కూడా చేస్తూ ఉంటారు. వారు ఈ శరీరములో ఏమి చేయగలరో, ఏమి చేయలేరో లెక్క వేయండి. బాబా తినరు. కానీ భావన తీసుకుంటారు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. రూపము మరియు సుగంధము(రూపబసంత్/జ్ఞాన-యోగాలు) గలవారిగా అయ్యి మీ బుద్ధి రూపి జోలెను అవినాశీ జ్ఞాన రత్నాలతో సదా నిండుగా ఉంచుకోవాలి. బుద్ధి రూపి జోలెలో ఏ విధమైన రంధ్రమూ ఉండరాదు. జ్ఞాన రత్నాలను ధారణ చేసి ఇతరులకు దానం చేయాలి.
2. స్కాలర్షిప్ తీసుకునేందుకు బాగా చదవాలి. పూర్తిగా వనవాసములో ఉండాలి. ఎటువంటి ఆసక్తి ఉంచుకోరాదు. సుగంధమయమైన పుష్పాలుగా తయారై ఇతరులను కూడా అలా తయారు చేయాలి.
వరదానము :-
''శుభ చింతక స్థితి ద్వారా సర్వుల సహయోగాన్ని ప్రాప్తి చేసుకునే సర్వుల స్నేహీ భవ''
శుభచింతక ఆత్మల పట్ల ప్రతి ఒక్కరి హృదయంలో స్నేహము ఉత్పన్నమౌతుంది. ఆ స్నేహమే సహయోగిగా చేస్తుంది. ఎక్కడ స్నేహముంటుందో, అక్కడ సమయం, సంపద, సహయోగము సదా సమర్పణ అయ్యేందుకు సిద్ధంగా ఉంటాయి. కనుక శుభ చింతన స్నేహీలుగా చేస్తుంది. స్నేహము అన్ని ప్రకారాల సహయోగాన్ని సమర్పణ చేస్తుంది. అందువలన సదా శుభ చింతనతో సంపన్నంగా ఉండండి, శుభ చింతకులుగా అయ్యి అందరిని స్నేహీలుగా, సహయోగులుగా చేసుకోండి.
స్లోగన్ :-
''మీ రాజ్యంలో జన్మ-జన్మాంతరాలు ప్రతి ఆత్మ సంపన్నంగా ఉండాలంటే ఈ సమయంలో దాతలుగా అవ్వండి.''
సూచన -
ఇది అవ్యక్త మాసము. మన బ్రహ్మవత్సలందరికి వరదానీ మాసము. ఈ మాసంలో మనము అంతర్ముఖులుగా
అయి సాకార బ్రహ్మబాబా సమానంగా అయ్యే లక్ష్యముంచుకొని తీవ్రపురుషార్థము చేస్తాము.
అందుకు ఈ జనవరి మాసములో ప్రతిరోజు మురళి క్రింద విశేషంగా పురుషార్థము చేసేందుకు ఒక
పాయింట్ వ్రాస్తున్నారు. దయ ఉంచి అందరూ ఇదే విధంగా అటెన్షన్ ఉంచి పూర్తి రోజంతా
దీని పై మనన చింతన చేసి అవ్యక్త వతనంలో విహరించండి. బ్రహ్మబాబా సమానంగా అయ్యేందుకు
విశేషమైన పురుషార్థము.
బ్రహ్మబాబా
సమానంగా అయ్యేందుకు విశేషమైన పురుషార్థము
సమయ ప్రమాణంగా మూడు శబ్ధాలు సదా గుర్తుంచుకోండి - అంతర్ముఖత, అవ్యక్తము, అలౌకికము.
ఇంతవరకు కొంత లౌకికత మిక్స్ అయ్యి ఉంది. కాని ఎప్పుడైతే పూర్తి అలౌకిక అంతర్ముఖలుగా
అవుతారో అప్పుడు అవ్యక్త ఫరిస్తాలు కనిపిస్తారు. ఆత్మిక స్థితిలో లేక అలౌకిక
స్థితిలో ఉండేందుకు అంతర్ముఖులుగా అవ్వండి.