30-07-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీరిప్పుడు ఈశ్వరీయ సంతానము నుండి రాకుమారులుగా అవ్వాలి, కాబట్టి స్మృతి యాత్ర ద్వారా మీ వికర్మలను భస్మము చేసుకోండి ''
ప్రశ్న :-
ఏ విధి ద్వారా మీ దు:ఖాలన్నీ దూరమైపోతాయి ?
జవాబు :-
తమ దృష్టిని తండ్రి దృష్టితో కలిపినప్పుడు, దృష్టి కలయిక ద్వారా మీ దు:ఖాలన్నీ దూరమైపోతాయి. ఎందుకంటే స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినందున పాపాలన్నీ సమాప్తమైపోతాయి. ఇదే స్మృతి యాత్ర. మీరు దేహ ధర్మాలన్నీ వదిలి తండ్రిని స్మృతి చేస్తారు. దీని ద్వారా ఆత్మ సతోప్రధానంగా అవుతుంది, మీరు సుఖధామానికి అధిపతులుగా అవుతారు.
ఓంశాంతి.
శివభగవానువాచ - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి అని తండ్రి ఆదేశమిస్తున్నారు. శివభగవానువాచ అంటేనే - శివబాబా అర్థం చేయిస్తున్నారు అని అర్థం. పిల్లలూ! స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. ఎందుకంటే మీరందరూ సోదరులు. ఒకే తండ్రి పిల్లలు. 5 వేల సంవత్సరాల ముందు ఎలాగైతే తండ్రి నుండి వారసత్వము తీసుకున్నారో, అలాగే ఇప్పుడు వారసత్వము తీసుకోవాలి. మీరు ఆదిసనాతన దేవీ దేవతల రాజధానిలో ఉండేవారు. సూర్య వంశీయులు అనగా విశ్వానికి అధిపతులుగా ఎలా అవ్వగలరో తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మీ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఆత్మలైన మీరందరూ సోదరులు ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు ఒక్కరే. ఆ సత్యమైన తండ్రి పిల్లలైన మీరు సాహెబ్ జాదే(ఈశ్వరీయ సంతానము). ఈ విషయాలు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. వారి శ్రీమతము పై బుద్ధి యోగాన్ని జోడిస్తే మీ పాపాలన్నీ సమాప్తమై పోతాయని, దు:ఖాలన్నీ దూరమైపోతాయని తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రితో మన దృష్టి కలిసినప్పుడు అన్ని దు:ఖాలు దూరమైపోతాయి. కనులు కలపడం ఏమిటో కూడా అర్థం చేయిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి, ఇదే స్మృతియాత్ర. దీనిని యోగాగ్ని అని కూడా అంటారు. ఈ యోగాగ్ని ద్వారా మీ జన్మ-జన్మాంతర పాపాలన్నీ భస్మమైపోతాయి. ఈ ప్రపంచమే దు:ఖధామము. అందరూ నరకవాసులుగా ఉన్నారు. మీరు చాలా పాపాలు చేశారు. దీనిని రావణ రాజ్యమని అంటారు. సత్యయుగాన్ని రామరాజ్యమని అంటారని మీరు అర్థం చేయించవచ్చు. ఎంత పెద్ద సభ అయినా ఉపన్యసించేందుకు సంకోచించరాదు. మీరు భగవానువాచ అని అంటూ ఉంటారు. శివభగవానువాచ - ఆత్మలైన మనమందరము వారి సంతానము, సోదరులము. పోతే శ్రీ కృష్ణుని సంతానము అని ఎవ్వరూ అనరు. అలాగే ఇంతమంది రాణులు కూడా లేరు. కృష్ణుడికి స్వయంవరము జరిగినప్పుడు పేరే మారిపోతుంది. లక్ష్మినారాయణులకు పిల్లలున్నారని అంటారు. రాధా-కృష్ణులే స్వయంవరము తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు. వారికి ఒక పుత్రుడు కలుగుతాడు, తర్వాత వారి వంశము కొనసాగుతుంది. పిల్లలైన మీరిప్పుడు నన్ను ఒక్కరినే స్మృతి చేయాలి. దేహ ధర్మాలన్నీ వదిలి, తండ్రిని స్మృతి చేస్తే మీ పాపాలన్నీ తొలగిపోతాయి. సతోప్రధానంగా అయ్యి స్వర్గానికి వెళ్తారు. స్వర్గములో ఎలాంటి దు:ఖము ఉండదు. నరకములో చాలా దు:ఖముంది, సుఖానికి నామ-రూపాలు కూడా లేవు అని యుక్తిగా తెలిపించాలి. శివభగవానువాచ - హే పిల్లలారా! మీరిప్పుడు పతితమైన ఆత్మలు, ఇప్పుడు పావనంగా ఎలా అవ్వాలి? నన్ను - ''హే పతితపావనా!'' రండి అని పిలిచారు. సత్యయుగములో పావనులుగా ఉంటారు, కలియుగములో పతితులుంటారు. కలియుగము తర్వాత మళ్లీ సత్యయుగము తప్పకుండా అవ్వాలి. నూతన ప్రపంచ స్థాపన, పాత ప్రపంచము వినాశనము జరుగుతుంది. బ్రహ్మ ద్వారా స్థాపన అని గాయనము కూడా ఉంది. బ్రహ్మకుమార - బ్రహ్మకుమారీలైన మనము దత్తు చేసుకోబడిన పిల్లలము. బ్రాహ్మణులైన మనము శిఖతో సమానము. విరాట రూపము కూడా ఉంది కదా. మొదట తప్పకుండా బ్రాహ్మణులుగా అవ్వాల్సి ఉంటుంది. బ్రహ్మ కూడా బ్రాహ్మణుడే. దేవతలు సత్యయుగములోనే ఉంటారు. సత్యయుగములో సదా సుఖముంటుంది. దు:ఖమను పేరే ఉండదు. కలియుగములో అపారమైన దు:ఖముంది. అందరూ దు:ఖితులే, దు:ఖము లేని వారుండరు. ఇది రావణ రాజ్యము. ఈ రావణుడు భారతదేశానికి మొదటి శత్రువు. ప్రతి ఒక్కరిలో 5 వికారాలున్నాయి. సత్యయుగములో ఏ వికారాలూ ఉండవు. అక్కడ పవిత్ర గృహస్థ ధర్మముంటుంది. ఇప్పుడు దు:ఖపు కొండలు విరిగిపడ్డాయి, ఇంకా పడనున్నాయి. వారు తయారు చేసే బాంబులు దాచి ఉంచుకోవడానికి కాదు. చాలా రిఫైన్ చేస్తున్నారు. తర్వాత రిహార్సల్ జరుగుతుంది, ఆ తర్వాత ఫైనల్ జరుగుతుంది. సమయమిప్పుడు చాలా కొద్దిగానే ఉంది. సమయానుసారంగా డ్రామా ఏమో పూర్తవుతుంది కదా.
మొట్టమొదట శివబాబా ఇచ్చిన జ్ఞానముండాలి. ఏదైనా ఉపన్యాసము మొదలైనవి ప్రారంభించినప్పుడు మొట్టమొదట నమ:శివాయ(శివాయ నమ:) అని అనాలి. ఎందుకంటే శివబాబాకున్నంత మహిమ మరెవ్వరికీ లేదు. శివజయంతియే వజ్ర తుల్యమైనది. కృష్ణునికి చరిత్ర మొదలైనవి ఏమీ లేవు. సత్యయుగములో చిన్న పిల్లలు కూడా సతోప్రధానంగానే ఉంటారు. పిల్లలలో చంచలత మొదలైనవి ఏవీ ఉండవు. కృష్ణుని గురించి వెన్న తిన్నాడని, అది చేశాడని, ఇది చేశాడని చూపిస్తారు. ఇది మహిమ చేసేందుకు బదులు ఇంకా గ్లాని చేయడమే అవుతుంది. ఈశ్వరుడు సర్వవ్యాపి అని చాలా సంతోషంగా చెప్తారు. నీలో ఉన్నాడు, నాలో కూడా ఉన్నాడని అంటారు. ఇది చాలా పెద్ద నింద(గ్లాని). కానీ తమోప్రధానమైన మనుష్యులు ఈ విషయాలను అర్థము చేసుకోలేరు. కాబట్టి మొట్టమొదట తండ్రి పరిచయమునివ్వాలి. ఆ తండ్ర్రి నిరాకారుడు, వారి పేరే ''కళ్యాణకారి శివ'', ''సర్వుల సద్గతిదాత.'' ఆ నిరాకార తండ్రి సుఖసాగరుడు, శాంతి సాగరుడు. ఇప్పుడు ఇంత దు:ఖము ఎందుకు కలిగింది? ఎందుకంటే ఇది రావణ రాజ్యము. రావణుడు అందరికీ శత్రువు. అతడిని చంపినా చనిపోడు. ఇక్కడ ఏదో ఒక విధమైన దు:ఖము కాదు, పలు విధాల అపారమైన దు:ఖముంది. సత్యయుగములో అపారమైన సుఖముంది. 5 వేల సంవత్సరాల క్రితము బేహద్ తండ్రికి పిల్లలుగా అయ్యారు. అంతేకాక ఈ వారసత్వము కూడా తండ్రి నుండి తీసుకున్నారు. శివబాబా తప్పకుండా వచ్చి ఏదో ఒకటి తప్పకుండా చేస్తారు కదా. ఖచ్ఛితంగా చేస్తారు. అందుకే వారి మహిమ పాడుతూ ఉంటారు. శివరాత్రి అని కూడా అంటారు, తర్వాత కృష్ణరాత్రి వస్తుంది. ఇప్పుడు శివరాత్రి తర్వాత కృష్ణరాత్రిని కూడా అర్థము చేసుకోవాలి. శివుడు వచ్చేదే బేహద్ రాత్రిలో. కృష్ణుని జన్మ రాత్రిలో కాదు, అమృతవేళలో జరుగుతుంది. శివరాత్రి జరుపుకుంటారు కానీ తిథి, తారీఖు లేదు. కృష్ణుని జన్మ అమృతవేళలో జరుగుతుంది. అమృతవేళ అన్నింటికంటే శుభ మూహుర్తంగా భావిస్తారు. వారు కృష్ణుని జన్మ 12 గంటలకు జరుపుకుంటారు. కానీ అది ప్రభాతము కాదు. ఉదయము 2-3 గంటల సమయాన్ని ప్రభాతము అని అంటారు, అప్పుడు స్మరణ కూడా చేయగలరు. 12 గంటలకు వికారాలతో లేచి భగవంతుని ఎవరైనా స్మరిస్తారా? లేనే లేదు. 12 గంటల సమయాన్ని అమృతవేళ అని అనరు. ఆ సమయములో మనుష్యులు పతితంగా అవుతారు. వాయుమండలమంతా చెడిపోయి ఉంటుంది. రెండున్నర గంటలకు ఎవ్వరూ లేవరు. 3-4 గంటల సమయాన్ని అమృతవేళ అని అంటారు. ఆ సమయములో లేచి మనుష్యులు భక్తి చేస్తారు. ఈ సమయాన్ని మనుష్యులు తయారుచేశారు. నిజానికి ఈ సమయమేదీ కాదు. కృష్ణుడు జన్మించిన సమయాన్ని తెెలుసుకోవచ్చు. శివుడు వచ్చిన సమయాన్ని ఏ మాత్రమూ తెలుసుకోలేరు. వారే స్వయంగా వచ్చి అర్థం చేయిస్తారు. కాబట్టి మొట్టమొదట శివబాబా మహిమను తెలపాలి. పాటను కూడా ముందు వేయాలి, తర్వాత కాదు. శివబాబా అందరికంటే మధురమైన బాబా, వారి ద్వారా బేహద్ వారసత్వము లభిస్తుంది. నేటి నుండి 5 వేల సంవత్సరాల క్రితము శ్రీ కృష్ణుడు సత్యయుగానికి మొదటి రాకుమారునిగా ఉండేవాడు. అక్కడ అపారమైన సుఖముండేది. ఇప్పటికీ స్వర్గము గురించి మహిమ చేస్తూ ఉంటారు. ఎవరైనా మరణిస్తే ఫలానావారు స్వర్గస్థులైనారని అంటారు. అరే! ఇప్పుడిది నరకము. స్వర్గమైతే స్వర్గములో పునర్జన్మలు తీసుకోగలరు.
మాకు ఇన్ని సంవత్సరాల అనుభవముంది, దానినంతా కేవలం 15 నిముషాలలో అర్థం చేయించలేము, అందుకు సమయము అవసరము అని చెప్పాలి. మొట్టమొదట ఒక్క సెకండు విషయాన్ని వినిపిస్తాము, దు:ఖహర్త-సుఖకర్త అయిన బేహద్ తండ్రి పరిచయమునిస్తాము. వారు మన ఆత్మలందరి తండ్రి. బ్రహ్మకుమార-కుమారీలైన మేమంతా శివబాబా శ్రీమతమును అనుసరిస్తాము. మీరందరు పరస్పరములో సహోదరులు, నేను మీ తండ్రిని, 5 వేల సంవత్సరాల క్రితము వచ్చాను అందువల్లనే శివజయంతి జరుపుకుంటున్నారని తండ్రి చెప్తున్నారు. స్వర్గములో ఏమీ జరుపుకోరు. శివజయంతి జరుగుతుంది, దీనినే భక్తి మార్గములో స్మారక చిహ్నముగా జరుపుకుంటారు. ఇప్పుడు గీతా అధ్యాయము జరుగుతూ ఉంది. బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచ స్థాపన, శంకరుని ద్వారా పాత ప్రపంచ వినాశనము జరుగుతుంది. మీరిప్పుడు పాత ప్రపంచ వాయుమండలమునైతే మీరు చూస్తున్నారు, ఈ పతిత ప్రపంచము తప్పకుండా వినాశనమవుతుంది. అందువలన పావన ప్రపంచానికి తీసుకెళ్లమని అంటారు. చాలా దు:ఖముంది - యుద్ధము, మృత్యువు, విధవతనము, జీవఘాతము చేసుకోవడము..... మొదలైనవి. సత్యయుగములో అయితే అపారమైన సుఖాల రాజ్యముండేది. లక్ష్యమున్న ఈ చిత్రాన్ని తప్పకుండా అక్కడికి తీసుకెళ్లాలి. ఈ లక్ష్మీనారాయణులు విశ్వాధికారులుగా ఉండేవారు 5 వేల సంవత్సరాల మాట వినిపిస్తాము - వీరెలా ఈ జన్మను పొందుకున్నారు? ఎటువంటి కర్మలు చేసి ఈ విధంగా తయారయ్యారు? కర్మ-అకర్మ-వికర్మల గతిని గురించి తండ్రియే అర్థం చేయిస్తారు. సత్యయుగములో కర్మ-అకర్మగా ఉంటుంది. ఇక్కడైతే రావణ రాజ్యమున్నందున కావున కర్మ వికర్మగా తయారవుతుంది. అందువలన దీనిని పాపాత్మల ప్రపంచమని అంటారు. ఇచ్చి -పుచ్చుకోవడాలు కూడా పాపాత్మలతోనే ఉంటుంది. గర్భములో బిడ్డ ఉన్నా వివాహము, నిశ్చితార్థము చేసేస్తారు. ఎంత చెడు దృష్టి ఉంది! ఇక్కడ ఉండేదే చెడు దృష్టి గల మనుష్యులు. సత్యయుగమును పవిత్ర దృష్టి ప్రపంచమని అంటారు. ఇక్కడ కళ్లు చాలా పాపము చేస్తాయి. అక్కడ ఏ పాపము చేయవు. సత్యయుగము నుండి కలియుగ అంతము వరకు చరిత్ర, భూగోళాలు పునరావృతమవుతాయి. దీనిని గురించి తెలుసుకోవాలి కదా. దు:ఖధామమని, సుఖధామమని ఎందుకు అంటారు? అంతా పతితము మరియు పావనంగా తయారవ్వడం పైనే ఆధారపడి ఉంది. అందువల్లనే కామము మహాశత్రువు, దీనిని జయిస్తే మీరు జగత్జీతలుగా అవుతారని తండ్రి చెప్తున్నారు. అర్ధకల్పము పవిత్ర ప్రపంచముగా ఉండేది, అందులో శ్రేష్ఠమైన దేవతలుండేవారు. ఇప్పుడైతే భ్రష్టాచారులున్నారు. ఒకవైపు ఇది భ్రష్ఠాచారి ప్రపంచమని అంటారు, మరొక వైపు అందరిని శ్రీ శ్రీ అని అంటూ ఉంటారు. ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ అర్థము చేసుకోవాలి. ఇప్పుడైతే మృత్యువు ఎదురుగానే ఉంది. నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే పాపము సమాప్తమవుతుందని, మీరు సతోప్రధానంగా అవుతారని, సుఖధామానికి అధికారులుగా అవుతారని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు ఉండేదే దు:ఖము. వారు ఎన్ని సమావేశాలు, ఎన్ని సమ్మేళనాలు చేసినా వాటి వల్ల ఏ లాభమూ లేదు. మెట్లు దిగుతూనే వస్తారు. తండ్రి తన కార్యాన్ని తన పిల్లల ద్వారా చేస్తున్నారు. ''పతితపావనా! రండి'' అని మీరు పిలిచారు. కనుక నేను నా సమయం అనుసారంగా వచ్చాను. యదా యదాహి ధర్మస్య,........... దీని అర్థము కూడా తెలియదు. పిలుస్తున్నారంటే స్వయం తప్పకుండా పతితులుగా ఉన్నారు. రావణుడు మిమ్ములను పతితంగా చేశాడు. నేను ఇప్పుడు పావనంగా చేసేందుకు వచ్చానని తండ్రి చెప్తున్నారు. అది పావన ప్రపంచము. ఇప్పుడిది పతిత ప్రపంచము. అందరిలో 5 వికారాలున్నాయి. అపారమైన దు:ఖముంది. అన్ని వైపులా అశాంతియే అశాంతి ఉంది. మీరు పూర్తిగా తమోప్రధానంగా, పాపాత్మలుగా అయినప్పుడు నేను వస్తాను. నన్ను సర్వవ్యాపి అంటూ నాకు అపకారము చేసినవారికి కూడా నేను ఉపకారము చేసేందుకు వస్తాను. ''ఈ పతిత రావణ ప్రపంచములో, పతిత శరీరములో రండి'' అని మీరు నన్ను ఆహ్వానించారు. నాకు కూడా రథము కావాలి కదా. పావన రథమైతే అవసరం లేదు. రావణ రాజ్యములో పతితులే ఉంటారు. పావనులెవ్వరూ లేరు. అందరూ వికారాల నుండే జన్మిస్తారు. ఇది వికారీ ప్రపంచము, అది నిర్వికారి ప్రపంచము. మీరిప్పుడు తమోప్రధానము నుండి సతోప్రధానంగా ఎలా అవుతారు? నేను పతితపావనుడను. నాతో యోగము చేయండి, ఇది భారత ప్రాచీన రాజయోగము. తప్పకుండా గృహస్థ మార్గములోనే వస్తారు. ఎంత అద్భుతమైన, విచిత్రమైన పద్ధతిలో వస్తారు! వీరు తండ్రి మరియు తల్లి కూడా అయినారు ఎందుకంటే అమృతము వెలువడేందుకు గోముఖము కావాలి, కాబట్టి వీరు తల్లి - తండ్రి అయినారు. మళ్లీ మాతలను సంభాళించేందుకు సరస్వతిని హెడ్గా ఉంచారు. వారిని జగదంబ అని అంటారు, కాళీమాత అని అంటారు. అలాంటి నల్లటి శరీరము ఎక్కడైనా ఉంటుందా! కృష్ణుని నల్లగా చేసేశారు ఎందుకంటే కామచితి పై కూర్చుని నల్లగా అయిపోయాడు. కృష్ణుడే సుందరంగా మళ్లీ శ్యామంగా అవుతాడు. ఈ విషయాలన్నీ అర్థము చేసుకునేందుకు కూడా సమయము కావాలి. కోటిలో కొందరు, కొందరిలో కూడా కొందరి బుద్ధిలోనే ఉంటుంది. ఎందుకంటే అందరిలో 5 వికారాలు ప్రవేశించి ఉన్నాయి. మీరు ఈ విషయాలన్నీ సభలో కూడా అర్థం చేయించవచ్చు. ఎందుకంటే ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంది. ఇలాంటి అవకాశాన్ని తీసుకోవాలి. అఫిషియల్ సభలలో మధ్యలో ఎవ్వరూ ప్రశ్నలు అడగరు. వినాలని లేకుంటే శాంతిగా వెళ్లిపోండి, శబ్ధము చేయకండి, ఇలా ఇలా కూర్చుని అర్థము చేయించండి. ఇప్పుడైతే అపారమైన దు:ఖముంది. దు:ఖపు కొండలు పడనున్నాయి. మేము తండ్రిని, రచనను తెలుసుకున్నాము. మీకు ఎవరి కర్తవ్యము గురించి కూడా తెలియదు. తండ్రి భారతదేశాన్ని స్వర్గంగా ఎప్పుడు ఎలా తయారు చేశారో మీకు తెలియదు, మీరు వస్తే మేము అర్థం చేయిస్తాము. 84 జన్మలు ఎలా తీసుకుంటారు? 7 రోజుల కోర్సు తీసుకుంటే మిమ్ములను 21 జన్మల వరకు పాపాత్మల నుండి పుణ్యాత్మలుగా తయారుచేస్తామని చెప్పండి. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. కర్మ-అకర్మ-వికర్మల గుహ్య గతిని గురించి ఏదైతే తండ్రి అర్థం చేయించారో అది బుద్ధిలో ఉంచుకొని, ఇప్పుడు పాపాత్మలతో ఇచ్చి పుచ్చుకోరాదు.
2. శ్రీమతానుసారము ఒకే తండ్రితో తమ బుద్ధియోగమును జోడించాలి. సతోప్రధానంగా అయ్యే పురుషార్థము చేయాలి. దు:ఖధామాన్ని సుఖధామంగా చేసేందుకు పతితము నుండి పావనంగా అయ్యే పురుషార్థము చేయాలి. చెడు(క్రిమినల్) దృష్టిని పరివర్తన చేసుకోవాలి.
వరదానము :-
'' సర్వ ఖజానాలతో సంపన్నంగా అయ్యి నిరంతర సేవ చేసే తరగని అఖండ మహాదానీ భవ ''
బాప్దాదా సంగమ యుగంలో పిల్లలందరికి ''అటల్-అఖండ్(స్థిరమైన, అఖండమైన)'' అనే వరదానమునిచ్చారు. ఎవరైతే ఈ వరదానాన్ని జీవితంలో ధారణ చేసి అఖండ మహాదానులు అనగా నిరంతర సేవాధారులుగా అవుతారో వారు నంబరువన్గా అవుతారు. ద్వాపరయుగం నుండి భక్త ఆత్మలు కూడా దానీలుగా అవుతారు కానీ వారు తరగని ఖజానాల దానీలుగా అవ్వలేరు. వినాశి ఖజానాలు లేక వస్తువుల దానీలుగా అవుతారు. అయితే దాత పిల్లలైన మీరు ఎవరైతే సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్నారో వారు ఒక సెకండు కూడా దానము ఇవ్వకుండా ఉండలేరు.
స్లోగన్ :-
'' స్వభావములో సరళత ఉంటే ఆంతరిక సత్యత, స్వచ్ఛత ప్రత్యక్షమవుతుంది. ''