10-06-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - అవగుణాలను తొలగించుకునేందుకు పూర్తిగా పురుషార్థము చేయండి, ఏ గుణము తక్కువగా ఉందో, లోపించిందో దాని లెక్కాచారము ఉంచుకోండి, గుణ దానము చేస్తే గుణవంతులుగా అవుతారు.''

ప్రశ్న :-

గుణవంతులుగా అయ్యేందుకు మీకు లభించిన మొట్టమొదటి శ్రీమతమేది ?

జవాబు :-

మధురమైన పిల్లలూ, గుణవంతులుగా అవ్వాలంటే 1. ఎవరి దేహమునూ చూడకండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఒక్క తండి నుండి మాతమ్రే వినండి. ఒక్క తండిన్రే చూడండి. మానవ మతాలను చూడకండి 2. దేహాభిమానానికి వశమై, తండిక్రి, బాహ్మ్రణ కులానికి అపకీర్తి కలిగించే పనులేవీ చేయకండి. తప్పుడు నడవడికగలవారు గుణవంతులుగా అవ్వలేరు. వారిని కులకళంకితులని అంటారు.

ఓంశాంతి.

బాప్‌దాదా చేతిలో గుండుమల్లె పూలు ఉన్నాయి). ఇటువంటి సుగంధభరిత పుష్పాలుగా అవ్వాలని బాబా సాక్షాత్కారము చేయిస్తారు. మనము ఒకప్పుడు పుష్పాలుగా అయ్యే ఉంటిమని పిల్లలకు తెలుసు. గులాబి పుష్పాలుగా, మల్లె పూలుగా కూడా అయ్యారు, అలాగే వజ్ర్రాలుగా కూడా తయారయ్యారు. ఇప్పుడు మళ్లీ అలా తయారవుతున్నారు. ఇప్పుడు సత్యంగా అవుతున్నారు. ఇంతకు ముందు అసత్యంగా ఉండేవారు. అది అసత్యమే అసత్యము, సత్యము గురిగింజంత(అంశము) కూడా లేదు. ఇప్పుడు మీరు సత్యంగా తయారవుతారు. సత్యమైన వారిలో అన్ని గుణాలూ ఉండాలి. ఎవరిలో ఎన్ని గుణాలు ఉంటాయో అంత ఇతరులకు కూడా గుణ దానము చేసి తమ సమానంగా చేస్తారు. అందువలన తండ్రి పిల్లలకు చెప్తున్నారు - పిల్లలూ! మీ గుణాల లెక్కాచారము ఉంచుకోండి. మాలో ఏ అవగుణాలు లేవు కదా? దైవీ గుణాలలో ఏ గుణము తక్కువగా ఉంది? ప్రతిరోజూ రాత్రి ఈ లెక్కాచారము చూసుకోండి. ప్రపంచములోని మనుష్యుల విషయము వేరే. ఇప్పుడు మీరు సాధారణ మనుష్యులు కారు, బాహ్మ్రణులు. అందరూ మనుష్యులే. కానీ ప్రతి ఒక్కరి గుణాలలో, నడవడికలలో తేడా ఉంటుంది. మాయా రాజ్యములో కూడా కొంతమంది మనుష్యులు చాలా మంచి గుణవంతులు ఉంటారు. కానీ వారికి తండ్రి ఎవరో తెలియదు. చాలా ధార్మిక మనస్సు గలవారిగా(రిలీజియస్‌ మైండ్‌/=వశ్రీఱస్త్రఱశీబర వీఱఅస) సున్నిత హృదయము గలవారిగా ఉంటారు. ప్రపంచములోని మనుష్యుల గుణాలు రకరకాలుగా ఉంటాయి. దేవతలుగా అయినప్పుడు దైవీగుణాలు అందరిలో ఉంటాయి. పోతే చదువును బట్టి పదవులుంటాయి. మొదటిది చదువుకోవాలి, రెండవది అవగుణాలను తొలగించుకోవాలి. మనము ఈ ప్రపంచానికి భిన్నంగా ఉన్నామని పిల్లలకు తెలుసు. ఇచ్చట అందరూ ఒకే బ్రాహ్మణ కులములో కూర్చుని ఉన్నాము. మనుష్య మతములో ఉన్నవారు శూద్ర కులములో ఉన్నారు. బాహ్మ్రణ కులములో ఈశ్వరీయ మతముంది. మొట్టమొదట మీరు తండ్రి పరిచయమునివ్వాలి. ఫలానివారు వాదిస్తున్నారని మీరు చెప్తారు. ''ఈశ్వరీయ మతము పై నడుస్తున్న మేము బ్రాహ్మణులము లేక బ్రహ్మకుమారి-కుమారులము'' అని వ్రాయమని బాబా తెలిపించారు. అప్పుడు వీరి కంటే ఉన్నతులు మరెవ్వరూ లేరని అర్థము చేసుకుంటారు. అత్యంత శ్రేష్ఠమైనవారు భగవంతుడు. వారి పిల్లలైన మనము కూడా వారి మతమును అనుసరిస్తున్నాము. మేము మనుష్య మతమును అనుసరించడం లేదు ఈశ్వరీయ మతమును అనుసరించి మనము దేవతలుగా అవుతాము. మనుష్య మతమును పూర్తిగా వదిలేశామని చెప్పండి. ఇలా వ్రాస్తే మీతో ఎవరూ వాదవివాదాలు చేయరు. ఇది ఎవరు మీకు నేర్పించారు, ఎక్కడ విన్నారు? అని ఎవరైనా అడిగితే మాది ఈశ్వరీయ మతము, ప్రేరణ విషయము కాదు అని చెప్తారు. అనంతమైన తండ్రి అయిన ఈశ్వరుని ద్వారా మేము అర్థం చేసుకున్నాము. ఇంతకుముందు మేము కూడా భక్తిమార్గములోని శాస్త్ర్రాల ప్రకారము చాలాకాలము నడుచుకున్నాము, ఇప్పుడు మాకు ఈశ్వరీయ మతము లభించిందని కూడా చెప్పండి. పిల్లలైన మీరు తండ్రినే మహిమ చేయాలి. మొట్టమొదట మేము ఈశ్వరీయ మతమును అనుసరిస్తామని వారి బుద్ధిలో కూర్చోపెట్టాలి. మేము మనుష్య మతమును అనుసరించము, వారి మతము వినము. మనుష్యుల చెడు మతాలు వినకు, మనుష్య మతమును చూడకు,........... (నవaతీ చీశీ జుఙఱశ్రీ, ూవవ చీశీ జుఙఱశ్రీ,.....) ఆత్మను చూడండి, శరీరమును చూడకండి అని ఈశ్వరుడు చెప్తున్నారు. ఇది పతిత శరీరము. దీనిని ఏం చూస్తారు, ఈ కనులతో దీనిని చూడకండి. ఈ శరీరము పతిత ఆత్మది కావున పతితంగానే ఉంది. ఈ శరీరాలు ఇక్కడ బాగుపడవు. ఇంకా పాతబడిపోతాయి. రోజురోజుకు ఆత్మ బాగుపడ్తుంది. ఆత్మ అవినాశి. అందుకే చెడు చూడకండి, శరీరాలను కూడా చూడరాదు అని తండ్రి చెప్తున్నారు. దేహ సహితము దేహ సంబంధాలన్నీ మర్చిపోవాలి. ఆత్మను చూడండి, ఒక్క పరమాత్మ తండి ద్వారానే వినండి. ఇందులోనే శమ్ర ఉంది. ఇది చాలా పెద్ద సబ్జక్టు అని మీరు అనుభవము చేస్తారు. ఎవరైతే వివేకవంతులుగా ఉంటారో వారికి పదవి కూడా ఉన్నతమైనది లభిస్తుంది. ఒక్క సెకండులో జీవన్ముక్తి లభించగలదు. కానీ పురుషార్థము పూర్తిగా చేయకుంటే చాలా శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది.

పిల్లలైన మీరు తండ్రి పరిచయమిచ్చేందుకు గుడ్డివారికి ఊతకర వలె అవుతారు. ఆత్మను చూడలేరు, తెలుసుకోగలరు. ఆత్మ ఎంతో చిన్నది. ఈ ఆకాశ తత్వములో మనుష్యులు ఎంత స్థలమును ఆక్రమిస్తారో గమనించండి. మనుష్యులైతే వస్తూ పోతూ ఉంటారు కదా. ఆత్మ ఎక్కడికైనా వచ్చి పోతుందా? ఆత్మకు ఎంత చిన్న స్థలము ఉంటుంది! ఇది ఆలోచించవలసిన విషయము. ఆత్మల గుంపు ఉంటుంది. శరీరముతో పోలిస్తే ఆత్మ ఎంతో చిన్నది, అది చాలా చిన్న స్థలమును తీసుకుంటుంది. మీకైతే ఉండేందుకు(నివసించేందుకు) చాలా స్థలము కావాలి. ఇప్పుడు పిల్లలైన మీరు విశాల బుద్ధి గలవారిగా అయ్యారు. తండ్రి నూతన ప్రపంచము కొరకు నూతన విషయాలు అర్థం చేయిస్తున్నారు. తెలిపేవారు కూడా కొత్తవారే. మనుష్యులైతే అందరినీ దయ చూపమని వేడుకుంటూ ఉంటారు. స్వయం పై దయ చూపుకునే శక్తి లేదు. మీకు ఆ శక్తి లభిస్తుంది. మీరు తండ్రి నుండి వారసత్వము తీసుకున్నారు. వేరెవ్వరినీ దయాహృదయులని అనరు. మనుష్యులను దేవతలని ఎప్పుడూ అనజాలరు. మనుష్యులను దేవతలుగా తయారు చేసే దయాహృదయులు ఒక్క తండ్రి మాత్రమే. అందుకే పరమపిత పరమాత్ముని మహిమ అపారమైనదని, అంతులేనిదని అంటారు. ఇప్పుడు మీరు వారి దయ అపారమని ప్రాక్టికల్‌గా తెలుసుకున్నారు. తండ్రి తయారు చేసే నూతన ప్రపంచములో అన్నీ కొత్తగానే ఉంటాయి. మనుష్యులు, పశువులు, పక్షులు అన్నీ సతోప్రధానంగా ఉంటాయి. మీరు శ్రేష్ఠంగా తయారైతే మీ ఫర్నీచర్‌ కూడా అత్యంత ఉన్నతంగా గాయనము చేయబడింది అని తండ్రి తెలిపించారు. తండ్రిని కూడా అత్యంత ఉన్నతులని అంటారు. వారి ద్వారా విశ్వచక్రవర్తి పదవి లభిస్తుంది. నేను అరచేతిలో వైకుంఠాన్ని తీసుకొస్తానని తండి నేరుగా స్పష్టంగా చెప్తున్నారు. వారు అరచేతితో కుంకుమ, పూలు మొదలైనవి తీస్తారు, కాని ఇది చదువు విషయము. ఇది సత్యమైన చదువు. మనము చదువుకుంటున్నామని మీకు తెలుసు. మీరు పాఠశాలకు వచ్చారు, చాలా పాఠశాలలు తెరిస్తే అప్పుడు మీ నడవడికలు గమనించడం జరుగుతుంది. ఎవరైనా విరుద్ధంగా నడుచుకుంటే అపకీర్తి వస్తుంది. దేహాభిమానములో ఉన్నవారి నడవడిక వేరుగా ఉంటుంది. వారి నడవడిక ఇలా ఉంది అని ఎవరైనా గమనిస్తే అందరి పై కళంకము ఏర్పడ్తుంది. వీరి నడవడికలో ఎలాంటి మార్పు లేకుంటే తండిన్రి నిందింపజేసినట్లే కదా. సమయము పడ్తుంది. దోషమంతా వారి పైకి వస్తుంది. స్వభావము చాలా బాగుండాలి. మీ స్వభావాలు మారుటకు ఎంత సమయము పడ్తుంది. కొంతమంది గుణాలు, స్వభావము చాలా ఫస్ట్‌క్లాసుగా ఉంటాయని మీకు తెలుస్తుంది. అది కనిపిస్తుంది కూడా. తండ్రి కూర్చుని ఒక్కొక్క పుత్రుని చూస్తూ, వీరిలో తొలగిపోవాల్సిన ఏ లోపముందో గమనిస్తారు. ఒకొక్కరిని పరిశీలిస్తారు. లోపాలైతే అందరిలో ఉన్నాయి. కావున తండ్రి అందరినీ చూస్తూ ఉంటారు. ఫలితము గమనిస్తూ ఉంటారు. తండ్రికి పిల్లల పై ప్రేమ ఉంటుంది కదా. వీరిలో ఈ లోపముందని, అందుకే ఉన్నతపదవి పొందలేరని తండ్రికి తెలుసు. లోపాలు తొలగకపోతే చాలా కష్టము. చూస్తూనే తెలిసిపోతుంది. ఇంకా సమయము పడ్తుందని వారికి తెలుసు. ఒక్కొక్కరిని పరిశీలిస్తూ తండ్రి దృష్టి ఒక్కొక్కరి గుణాల వైపుకు పోతుంది. మీలో ఏ అవగుణము లేదు కదా? అని అడుగుతారు. తండ్రి ముందు అయితే సత్యమే చెప్తారు. కొంతమంది దేహాభిమానమున్నవారు సత్యము చెప్పరు. తండ్రి ఏమో చెప్తూ ఉంటారు. చెప్పకనే చేయగలిగినవారు దేవతలు, చెప్తే చేసేవారు మనుష్యులు, చెప్పినా చేయనివారు,...... ఈ జన్మలోని లోపాలను మీ అంతకు మీరే తెలపండి అని తండి చెప్తారు. లోపాలు సర్జన్‌కు తెలియచేయాలని బాబా అందరికీ చెప్తారు. శరీరము జబ్బు గురించి కాదు. (ఆత్మ)లోపలి రోగాల గురించి చెప్పాలి. మీలో ఏ ఏ ఆసురీ ఆలోచనలు ఉన్నాయో చెప్తే, వాటిని ఎలా తొలగించుకోవాలో బాబా అర్థం చేయిస్తారు. ఈ స్థితిలో అవగుణాలు తొలగించుకోకుంటే ఉన్నత పదవి పొందలేరు. అవగుణాలు నిందలపాలు చేస్తాయి. భగవంతుడు మనలను చదివిస్తున్నారంటే, మనుష్యులకు అసత్య సంశయము వస్తుంది. భగవంతుడు నామ - రూపాలకు అతీతుడు, సర్వవ్యాపి అయిన భగవంతుడు వీరిని ఎలా చదివిస్తున్నారు, వీరి నడవడిక ఎలా ఉంది? అని అనుమానపడ్తారు. మీ గుణాలు ఎంత ఫస్ట్‌క్లాస్‌గా ఉండాలో తండ్రికి తెలుసు. అవగుణాలను దాచి పెట్టుకుంటే ఇతరుల పై అంత పభ్రావము పడదు. అందువలన వీలైనంత ఎక్కువగా మీలోని అవగుణాలను తొలగించుకుంటూ ఉండండి. నాలో ఈ ఈ లోపాలు ఉన్నాయి అని నోట్‌ చేసుకుంటే లోలోపల మనస్సు తింటుంది. నష్టపోతూ ఉంటే మనస్సు తింటూ ఉంటుంది. వ్యాపారులు ఈ రోజు ఎంత లాభము వచ్చిందని ప్రతి రోజూ వారి ఖాతాను చూసుకుంటారు. అలాగే ఈ తండి కూడా చెప్తున్నారు - మీ నడవడికను పత్రి రోజూ చూసుకోండి, లేకుంటే నష్టపోతారు. తండి పరువును పోగొడ్తారు.

గురువును నిందింప చేయువారికి ఎక్కడా స్థానము ఉండదు. దేహాభిమానులు ఆధారమును పొందలేరు. దేహీ-అభిమానులు మంచి స్థానాన్ని పొందుతారు. దేహీ-అభిమానిగా అయ్యేందుకే అందరూ పురుషార్థము చేస్తారు. రోజురోజుకు చక్కబడ్తూ ఉంటారు. దేహాభిమానము వలన జరిగే పనులను తొలగించుకుంటూ ఉండాలి. దేహాభిమానము వలన పాపాలు తప్పకుండా జరుగుతాయి. అందువలన దేహీ-అభిమానులుగా అవుతూ ఉండండి. జన్మిస్తూనే ఎవ్వరూ రాజులుగా అవ్వరని మీకు తెలుసు. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు సమయము పడ్తుంది కదా. ఇప్పుడు మనము వాపస్‌ ఇంటికి పోవాలని కూడా మీరు అర్థము చేసుకున్నారు. బాబా వద్దకు పిల్లలు వస్తారు. కొంతమంది 6 మాసాల తర్వాత వస్తారు, కొంతమంది 8 మాసాల తర్వాత కూడా వస్తారు. ఇంత సమయములో ఎంత ఉన్నతి అయినారని బాబా గమనిస్తారు. రోజులు గడచిన కొలది బాగు పడ్తున్నారా లేక లోపాలున్నాయా? అని గమనిస్తారు. కొంతమంది నడుస్తూ నడుస్తూ చదువు వదిలేస్తారు. తండి చెప్తున్నారు - భగవాన్‌, భగవతిగా తయారు చేసేందుకు స్వయం భగవంతుడే మిమ్ములను చదివిస్తుంటే అటువంటి చదువును మీరు వదిలేస్తారా! అరే! వర్‌ల్డ్‌ గాడ్‌ ఫాదర్‌ (ఔశీతీశ్రీస +శీస-ఖీa్‌ష్ట్రవతీ) చదివిస్తున్నారు. ఇందులో గైరుహాజరా(ఆబ్సంటా)! మాయ ఎంత పబ్రలమైనది. ఫస్ట్‌ క్లాస్‌ చదువు నుండి మీ ముఖాన్ని తిప్పేస్తుంది. నడుస్తూ - నడుస్తూ చదువును కాలితో తన్నేసేవారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మన ముఖము స్వర్గము వైపు, కాళ్లు నరకము వైపు ఉన్నాయని మీకు తెలుసు. మీరు సంగమ యుగములోని బ్రాహ్మణులు, ఇది పాత రావణ ప్రపంచము. మనము శాంతిధామము ద్వారా సుఖధామము వైపుకు వెళ్తాము. పిల్లలు ఇదే గుర్తుంచుకోవాలి - సమయము చాలా తక్కువగా ఉంది, రేపే ఈ శరీరాన్ని వదిలేయవచ్చు. తండ్రి స్మృతి లేకుంటే అంత్యకాలములో,............ తండ్రి ఎంతగానో తెలుపుతున్నారు. బాబా ఎంతగానో అర్థము చేయిస్తారు. ఇవి చాలా గుప్తమైన విషయాలు. జ్ఞానము కూడా గుప్తమైనది. కల్పక్రితము ఎవరెంత పురుషార్థము చేశారో ఇప్పుడూ అంతే చేస్తున్నారని వారికి తెలుసు. డ్రామానుసారము బాబా కూడా కల్పక్రితము వలె అర్థము చేయిస్తూ ఉంటారు. ఇందులో ఏ మాత్రము తేడా ఉండదు. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మీ వికర్మలు వినాశమవుతూపోతాయి. శిక్షలను అనుభవించవలసిన పని ఉండదు. తండ్రి ముందు శిక్షలను అనుభవిస్తూ ఉంటే తండ్రి ఏమంటారు? మీరు సాక్షాత్కారములో కూడా చూశారు. ఆ సమయములో క్షమించలేరు. ఇతని ద్వారా తండ్రి చదివిస్తున్నారు కావున ఇతని సాక్షాత్కారమే జరుగుతుంది. అక్కడ కూడా ఇతని ద్వారానే మీరు ఇలాంటి పనులు చేశారని అర్థం చేయిస్తారు. అప్పుడు చాలా ఏడుస్తారు, అరుస్తారు, పశ్చాత్తాపపడ్తారు. సాక్షాత్కారము చేయించకుండా శిక్షలు వేయించరు. మిమ్ములను అంతగా చదివించాను అయినా మీరు ఇటువంటి పనులు ఎందుకు చేశారు అని అడుగుతారు. రావణుని మతముననుసరించి ఎన్ని పాపాలు చేశామో మీకు కూడా తెలుసు. పూజ్యుల నుండి పూజారులుగా అయిపోయారు. తండ్రిని సర్వవ్యాపి అని అంటూ వచ్చారు. ఇది నెంబరువన్‌ అవమానము. దీని లెక్కాచారము కూడా చాలా ఉంది. నిన్ను నీవు ఎలా చెంపదెబ్బ కొట్టుకున్నావో చూడు అని తండ్రి ఫిర్యాదు చేస్తారు. భారతీయులే ఎంతో క్రిందపడ్డారు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు - మీకు ఇప్పుడు ఎంతో వివేకము లభించింది. అది కూడా నెంబరువారుగా డ్రామానుసారము అర్థము చేసుకుంటారు. ఇంతకు ముందు కూడా ఇదే విధంగా ఇప్పటివరకు జరిగిన క్లాసు ఫలితము ఇలాగే ఉంది అని అంటారు. తండ్రి సరియైనదే (సత్యమే) చెప్తారు కదా. కావున పిల్లలూ, మీ ఉన్నతి మీరు చేసుకుంటూ ఉండండి. మాయ ఎటువంటిదంటే దేహీ - అభిమానులుగా ఉండనివ్వదు. ఇదే చాలా పెద్ద సబ్జెక్టు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే పాపాలు భస్మమవుతాయి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. దేహాభిమానములోకి రావడం వలన తప్పకుండా పాపాలు జరుగుతాయి. దేహాభిమానులకు (స్వర్గంలో) స్థానము లభించదు, అందువలన దేహీ-అభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థము చేయాలి. తండ్రిని నిందనపాలు చేసే ఏ కర్మా చేయరాదు.

2. లోపల(ఆత్మ లోపల) ఉన్న జబ్బులను తండ్రికి సత్యంగా తెలిపించాలి. అవగుణాలను దాచుకోరాదు. నాలో ఏ అవగుణాలున్నాయి? అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. చదువు ద్వారా స్వయాన్ని గుణవంతులుగా తయారు చేసుకోవాలి.

వరదానము :-

'' శక్తిశాలి బ్రేక్‌ ద్వారా సెకండులో నెగటివ్‌ను పాజిటివ్‌లోకి పరివర్తన చేసే స్వ పరివర్తక్‌ భవ ''

నెగటివ్‌ లేక వ్యర్థ సంకల్పాలు నడిచినప్పుడు, వాటి వేగము చాలా తీవ్రంగా ఉంటుంది. అటువంటి తీవ్రగతి సమయంలో శక్తిశాలి బ్రేక్‌ వేసి, వాటిని పరివర్తన చేసే అభ్యాసముండాలి. అక్కడ కూడా పర్వతము పైకి ఎక్కునప్పుడు మొదట బ్రేక్‌ను చెక్‌ చేస్తారు. మీరు మీ ఉన్నత స్థితిని తయారు చేసుకునేందుకు సంకల్పాలకు సెకండులో బ్రేక్‌ వేసే అభ్యాసాన్ని పెంచండి. ఎప్పుడైతే మీ సంకల్పాలు, సంస్కారాలను ఒక్క సెకండులో నెగటివ్‌ నుండి పాజిటివ్‌లోకి పరివర్తన చేసుకుంటారో అప్పుడు స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తనా కార్యము సంపన్నమౌతుంది.

స్లోగన్‌ :-

'' స్వయం పట్ల, సర్వ ఆత్మల పట్ల శ్రేష్ఠ పరివర్తన శక్తిని కార్యములోకి తీసుకొచ్చేవారే సత్యమైన కర్మయోగులు ''