09-05-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - శివబాబా మనందరి అద్భుతమైన తండ్రి, టీచరు, సద్గురువు. వారికి తండ్రి ఎవ్వరూ లేరు. వారు ఎప్పుడూ ఎవ్వరితోనూ ఏమీ నేర్చుకోరు. వారికి గురువుల అవసరము లేదు. ఇలా ఆశ్చర్యచకితులై మీరు వారిని స్మృతి చేయాలి. ''
ప్రశ్న :-
స్మృతిలో ఏ నవీనత ఉంటే ఆత్మ సహజంగా పావనమవ్వగలదు?
జవాబు :-
స్మృతిలో కూర్చున్నప్పుడు తండ్రి నుండి కరెంటును లాగుతూ ఉండండి. తండ్రి మిమ్ములను చూడాలి మరియు మీరు తండ్రిని చూడండి. ఇటువంటి స్మృతియే ఆత్మను పావనంగా చేయగలదు. ఇది చాలా సులభమైన స్మృతి కానీ పిల్లలు క్షణ-క్షణము మేము ఆత్మలము, శరీరాలు కాము అని మర్చిపోతారు. దేహీ-అభిమానులుగా ఉన్న పిల్లలే స్మృతిలో ఉండగలరు.
ఓంశాంతి.
మధురాతి మధురమైన పిల్లలకు వీరు మా అనంతమైన తండ్రి అని, వారికి ఏ తండ్రీ లేరని నిశ్చయపూర్వకంగా తెలుసు. ఈ ప్రపంచములో తండ్రి లేని మనుష్యులు ఎవ్వరూ ఉండరు. ఒక్కొక్క మాటను చాలా బాగా అర్థము చేసుకోవాలి. వారు తండ్రే కాక జ్ఞానము కూడా వినిపిస్తారు. కానీ వారు ఎప్పుడూ చదవరు. మనుష్యమాత్రులైతే ఏదో ఒకటి తప్పకుండా చదువుకుంటారు. కృష్ణుడు కూడా చదువుకున్నారు. కానీ ఈ తండ్రి చెప్తున్నారు - నేను ఏం చదవాలి? నేను చదివించేందుకు వచ్చాను. నేను ఏమీ చదువుకోలేదు. నేను ఎవ్వరి నుండి శిక్షణ తీసుకోలేదు. నేను ఏ గురువుల వద్దకు వెళ్లలేదు. డ్రామా ప్లాను అనుసారము తండ్రికి అత్యంత ఉన్నతమైన మహిమ తప్పకుండా ఉంటుంది. ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు అని మహిమ కూడా ఉంది. వారి కంటే ఉన్నతమైనవారు ఎవరుంటారు? వారికి తండ్రి లేడు, టీచరు లేడు, గురువూ లేడు. ఈ అనంతమైన తండ్రికి ఏ తండ్రీ లేడు, ఏ టీచరూ లేడు, ఏ గురువూ లేడు. స్వయం వారే అందరికీ తండ్రి, వారే టీచరు, వారే గురువు. ఇది బాగా అర్థము చేసుకోగలరు. ఇటువంటి వ్యక్తి మరెవ్వరూ ఉండరు. ఈ విధంగా ఆశ్చర్యచకితులై ఇటువంటి తండ్రిని, టీచరును, సద్గురువును స్మృతి చెయ్యాలి. మనుష్యులు '' ఓ గాడ్ఫాదర్ ''....... అని కూడా పిలుస్తారు. వారు జ్ఞానసాగరులైన టీచరే కాక సుప్రీమ్(అత్యుత్తమ) గురువు కూడా. అన్నీ వారొక్కరే. ఇలా అన్నీ ఒక్కరుగానే ఉన్న మనుష్యమాత్రులు ఎవ్వరూ ఉండరు. వారు మానవ శరీరము ద్వారానే చదివిస్తారు. చదివించేందుకు నోరు తప్పకుండా కావాలి కదా. ఈ విషయము పిల్లలకు క్షణ-క్షణము స్మృతిలో ఉండినా వారి నావ తీరానికి చేరిపోతుంది. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశమౌతాయి. సుప్రీమ్ టీచర్ అని భావించినందున మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. వారు సద్గురువు కూడా అయ్యారు. మనకు యోగము నేర్పిస్తున్నారు. ఆ ఒక్కరితోనే యోగము జోడించాలి. సర్వాత్మలకు తండ్రి వారొక్కరే. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని సర్వాత్మలకు వారు చెప్తున్నారు. ఆత్మయే అన్ని పనులు చేస్తుంది. ఈ శరీరమనే కారును నడిపేది ఆత్మనే. శరీరాన్ని రథము అనండి లేక మరేమైనా అనండి కానీ దానిని నడిపేది, ముఖ్యమైనది ఆత్మయే. సర్వాత్మలకు తండ్రి ఒక్కరే. మనమంతా సోదరులమని నోటితో అంటూనే ఉంటారు. ఒకే తండ్రి పిల్లలైన మనమంతా సోదరులమే(భాయీ-భాయీ). ప్రజాపిత బ్రహ్మ శరీరములో తండ్రి ప్రవేశించినప్పుడు సోదరీ-సోదరులుగా అవ్వవలసి వస్తుంది. ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి అయితే సోదరీ-సోదరులవుతారు కదా. సోదరునికి, సోదరితో ఎప్పుడూ వివాహము జరగదు. కావున వీరంతా ప్రజాపిత బ్రహ్మకుమార-కుమారీలుగా అయ్యారు. అందువలన సోదరీ-సోదరులుగా భావించినప్పుడు తండ్రికి అత్యంత ప్రియమైన పిల్లలుగా ఈశ్వరీయ సంప్రదాయానికి చెందినవారిగా అయిపోయారు. మేము నేరుగా ఈశ్వరీయ సంప్రదాయానికి చెందినవారమని మీరు అందరికి చెప్తారు. ఈశ్వరుడైన తండ్రి మనకు అన్నీ నేర్పిస్తున్నారు. వారు ఎవరి వద్దా నేర్చుకోలేదు. వారు సదా సంపూర్ణులు. వారి కళలు ఎప్పుడూ తగ్గిపోవు. మిగిలిన వారందరి కళలు తగ్గిపోతాయి. మనము శివాబాబాను చాలా మహిమ చేస్తాము. శివబాబా అని అనడం చాలా సులభము. ఆ తండ్రే పతితపావనులు. కేవలం ఈశ్వరుడు అన్నందున అంత బాగా అనిపించదు(శోభించదు). తండ్రి వచ్చి పతితులను పావనులుగా ఎలా చేస్తారో చూసి పిల్లలైన మీ హృదయాలలో బాగా ముద్రించబడ్తుంది. లౌకిక తండ్రి ఉన్నారు, పారలౌకిక తండ్రి కూడా ఉన్నారు. పారలౌకిక తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. ఎందుకంటే అందరూ పతితులుగా ఉన్నారు అందుకే స్మృతి చేస్తారు. పావనంగా అయితే స్మృతి చేసి పతితపావనుడైన తండ్రిని పిలిచే అవసరముండదు. డ్రామా ఎలా ఉందో గమనించండి. పతితపావనులైన తండ్రిని స్మృతి చేస్తారు. పావన ప్రపంచానికి యజమానిగా అవ్వాలని కోరుకుంటారు.
శాస్త్రాలలో దేవాసుర యుద్ధము జరిగినట్లు చూపించారు. కానీ అలా కాదు. ఇప్పుడు మనము అసురులమూ కాము, దేవతలమూ కామని మీకు తెలుసు. ఇప్పుడు మనము అలా ఇలా కాక మధ్యలో ఉన్నాము. అందరూ మిమ్ములను దు:ఖపరుస్తూ ఉంటారు. ఈ డ్రామా చాలా మజాగా ఉంటుంది. నాటకములో మజా చూచేందుకే వెళ్తారు కదా. అవన్నీ పరిమిత(హద్దు) డ్రామాలు. ఇది అనంతమైన(బేహద్) డ్రామా. దీనిని గురించి మరెవ్వరికీ తెలియదు. దేవతలకైతే అసలే తెలియదు. ఇప్పుడు మీరు కలియుగము నుండి బయటకు వచ్చేశారు. స్వయం ఎవరైతే తెలుసుకొని ఉంటారో వారు ఇతరులకు కూడా అర్థం చేయించగలరు. ఒక్కసారి డ్రామా చూస్తే మొత్తం డ్రామా అంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఇది మనుష్య సృష్ట్టి రూపి వృక్షమని, దీని బీజము పైన ఉంటుందని బాబా అర్థం చేయించారు. విరాట రూపమని అంటారు కదా. తండ్రి కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. మనుష్యులకు ఈ విషయము గురించి తెలియదు. శివబాబా ఎవరితోనైనా భాష నేర్చుకొని ఉంటారా? వారికి టీచరే లేకుంటే వారు ఏ భాష నేర్చుకొని ఉంటారు? కనుక ఏ రథములో ప్రవేశిస్తారో వారి భాషనే ఉపయోగించుకుంటారు. వారికి వారి స్వంత భాష అంటూ ఏదీ లేదు. వారు స్వయం ఏమీ చదవరు, ఏమీ నేర్చుకోరు. వారికి టీచరు ఎవ్వరూ లేరు. కృష్ణుడైతే నేర్చుకుంటాడు. అతనికి తల్లి, తండ్రి, టీచరు ఉన్నారు. అతనికి గురువుల అవసరమే లేదు ఎందుకంటే అతనికి సద్గతి లభించింది. ఇది కూడా మీకు తెలుసు. బ్రాహ్మణులైన మీరు అందరికంటే ఉన్నతులు. ఇది మీరు స్మృతిలో ఉంచుకోండి - మనలను చదివించేవారు తండ్రి. ఇప్పుడు మనము బ్రాహ్మణులము. బ్రాహ్మణులు, దేవతలు.......... ఎంత స్పష్టంగా ఉంది! తండ్రికి అన్నీ తెలుసని మొదటి నుండి అంటూనే ఉంటారు. అయితే వారికేమి తెలుసో ఎవ్వరికీ తెలియదు. వారు జ్ఞానసాగరులు. ఈ మొత్తము సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము వారికి మాత్రమే ఉంది. బీజానికి మొత్తం వృక్ష జ్ఞానమంతా ఉంటుంది. అది జడ బీజము, మీరేమో చైతన్యము. మీరు మీ వృక్ష జ్ఞానాన్ని అర్థము చేయిస్తారు. ఈ వెరైటి మనుష్య సృష్టికి నేను బీజమును అని తండ్రి చెప్తున్నారు. అందరూ మనుష్యులే కానీ రకరకాలున్నారు. ఒక్క ఆత్మ శారీరిక రూపురేఖలు రెండవవారి వలె ఉండవు. ఇరువురు పాత్రధారులు ఒకే రకంగా ఉండరు. ఇది అనంతమైన డ్రామా. మనము మనుష్యులను పాత్రధారులని అనము, ఆత్మలను అంటాము. వారు మనుష్యులనే పాత్రధారులని భావిస్తారు. ఆత్మలమైన మనము పాత్రధారులమని మీ బుద్ధిలో ఉంది. ఆ మానవులు నృత్యము చేస్తారు. మనుష్యులు కోతులను నాట్యము చేయిస్తారు కదా. అలాగే ఇచ్చట ఆత్మ ఈ శరీరముతో డ్యాన్స్ చేయిస్తుంది, పాత్రను అభినయింపజేస్తుంది. ఇవి చాలా సులభంగా అర్థము చేసుకునే విషయాలు. బేహద్ తండ్రి తప్పకుండా వస్తారు. వారు రారు అనే మాటే లేదు. శివజయంతి కూడా జరుగుతుంది. ప్రపంచము ఎప్పుడు పరివర్తన చెందవలసి ఉంటుందో అప్పుడు తండ్రి వస్తారు. భక్తిమార్గములో కృష్ణుని తల్చుకుంటూ ఉంటారు. కానీ కృష్ణుడు ఎలా రాగలడు? కలియుగములో గానీ, సంగమ యుగములో గానీ కృష్ణుని రూపమును ఈ కనులతో చూడలేము. అటువంటప్పుడు అతడిని భగవంతుడని ఎలా అంటారు? అతడు సత్యయుగములోని మొట్టమొదటి రాకుమారుడు. అతనికి తండ్రి, టీచరు కూడా ఉన్నారు. అతనికి గురువు అవసరము లేదు. ఎందుకంటే అతడు సద్గతిలో ఉంటాడు. స్వర్గమును సద్గతి అని అంటారు. లెక్కాచారము కూడా స్పష్టంగా ఉంది. మనుష్యులు 84 జన్మలు తీసుకుంటారని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఎవరెవరు ఎన్ని జన్మలు తీసుకుంటారో లెక్క వేస్తారు. దేవతా కుటుంబానికి చెందినవారు తప్పకుండా మొట్టమొదట వస్తారు. వారే మొదట జన్మలు తీసుకుంటారు. ఒకరు జన్మిస్తే వారి వెనుక అందరూ వచ్చేస్తారు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. మీలో కూడా కొంతమంది ఆ చదువులో వలె చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఇది చాలా సులభమైన చదువు. కేవలం గుప్తమైన కష్టమొకటుంది. మీరు తండ్రిని స్మృతి చేస్తారు, అందులో మాయ విఘ్నాలు కలిగిస్తుంది. ఎందుకంటే మాయా రావణునికి ఈర్ష్య కలుగుతుంది. మీరు రాముడిని స్మృతి చేస్తే, నా దాసుడు రాముడిని ఎందుకు స్మృతి చేస్తాడు! అని రావణునికి ఈర్ష్య లుగుతుంది. ఇది కూడా డ్రామాలో మొదటి నుండి నిశ్చయమై ఉంది. క్రొత్త విషయము కాదు. కల్పక్రితము కూడా ఏ పాత్రను అభినయించారో అదే పాత్ర మళ్లీ అభినయిస్తారు. ఇప్పుడు మీరు పురుషార్థము చేస్తున్నారు. కల్పక్రితము ఏ పురుషార్థము చేశారో అదే ఇప్పుడు మళ్లీ చేస్తున్నారు. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ నిల్చిపోదు. సమయము కూడా టిక్ టిక్ అని జరుగుతూ ఉంటుంది. ఇది 5 వేల సంవత్సరాల డ్రామా అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. శాస్త్రాలలో ఏవేవో రకరకాల మాటలు వ్రాసేశారు. భక్తి వదలండని తండ్రి ఎప్పుడూ చెప్పరు. ఎందుకంటే ఇచ్చట కొనసాగలేక అది కూడా వదిలేస్తే అటు ఇటు కాకుండా పోతారు. దేనికీ పనికి రాకుండా పోతారు. అందువలన చాలామంది మనుష్యులు భక్తి మొదలైనవి చేయనివారు ఉంటారు. ఊరక అలాగే నడుస్తూ(బ్రతుకుతూ) ఉంటారు. కొంతమంది ఆ భగవంతుడే అనేక రూపాలలో భూమి పై ఉన్నారని అంటారు. అరే! ఇది అనంతమైన డ్రామా, అనాదిగా తయారైన డ్రామా, మళ్లీ మళ్లీ రిపీటౌతూ ఉంటుంది. అందుకే దీనిని అనాది, అవినాశి ప్రపంచ నాటకము అని అంటారు. దీనిని కూడా పిల్లలైన మీరు మాత్రమే అర్థము చేసుకుంటున్నారు. ఇందులో కూడా కుమారీలైన మీకు చాలా సులభము. మాతలు ఏ మెట్లనైతే ఎక్కారో అవన్నీ దిగవలసి ఉంటుంది. కుమారీలకైతే ఇక ఏ ఇతర బంధనమూ లేదు, చింత కూడా లేదు. తండ్రి వారిగా అయిపోవాలి. లౌకిక సంబంధాన్ని మరచి పారలౌకిక సంబంధాన్ని జోడించాలి. కలియుగంలో ఉండేది దుర్గతియే. డ్రామానుసారము క్రిందికి దిగాల్సిందే.
ఈ సర్వస్వమూ ఈశ్వరునిదేనని వారే యజమాని అని భారతవాసులు అంటారు. మీరు ఎవరు? మనము ఆత్మలము. మిగిలినదంతా ఈశ్వరునిది. ఈ దేహము మొదలైనవన్నీ పరమాత్ముడే మనకిచ్చారు. నోటితో యథార్థంగానే ఈ మాటలు అంటారు. ఇదంతా ఈశ్వరుడే ఇచ్చాడని అంటారు. మంచిది, వారిచ్చిన వస్తువులను అపహరించరాదు. కానీ ఆ మాట మీద కూడా నడవరు. రావణ మతమును అనుసరిస్తారు. మీరు కేవలం నిమిత్తమేనని తండ్రి తెలిపిస్తున్నారు. కానీ రావణ సంప్రదాయమైనందున మీరు నిమిత్తంగా ఉండక మిమ్ములను మీరు మోసగించుకుంటారు. నోటితో చెప్పేదొకటి, చేసేది మరొకటి. తండ్రి ఇచ్చిన వస్తువులు వారే తీసుకుంటే మీకు దు:ఖమెందుకు కలుగుతుంది? మమకారమును నశింపజేసేందుకే ఈ విషయాలు తండ్రి తన పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు తండ్రి నేరుగా వచ్చారు. బాబా, మమ్ములను వెంట తీసుకెళ్లమని మీరే వారిని పిలిచారు. మేము రావణ రాజ్యములో చాలా దు:ఖపడుచున్నాము, మీరు వచ్చి మమ్ములను పావనంగా తయారుచేయండి అని పిలిచారు. ఎందుకంటే పావనంగా అవ్వకుండా ఇక్కడ నుండి వెళ్లలేమని తెలుసుకున్నాము. మమ్ములను తీసుకెళ్లండి అని పిలిచారు, ఎక్కడికి? ఇంటికి తీసుకెళ్లండ.ి అందరూ ఇంటికి పోవాలని అంటారు. కృష్ణుని భక్తులు కృష్ణపురికి, వైకుంఠానికి వెళ్లాలని కోరుకుంటారు. వారికి సత్యయుగమే గుర్తు ఉంటుంది. అది చాలా ప్రియమైనది. మనుష్యులు మరణిస్తే స్వర్గానికి వెళ్లరు. స్వర్గమైతే సత్యయుగములోనే ఉంటుంది. కలియుగములో నరకమే ఉంటుంది. కావున పునర్జన్మలు తప్పకుండా నరకములోనే లభిస్తాయి. ఇది సత్యయుగమేమీ కాదు. అది ప్రపంచములో అత్యంత అద్భుతమైనది. నోటితో అంటారు, అర్థము కూడా చేసుకుంటారు. అయినా ఎవరైనా మరణించినప్పుడు వారి బంధువులు ఏమీ అర్థము చేసుకోరు. తండ్రి వద్ద గల 84 జన్మల చక్ర జ్ఞానము వారే ఇవ్వగలరు. మీరు స్వయాన్ని దేహమని భావిస్తూ ఉండేవారు. అది తప్పు అని తెలుసుకున్నారు. ఇప్పుడు తండ్రి '' దేహీ-అభిమాని భవ '' అని అంటున్నారు. కృష్ణుడు అలా చెప్పలేడు. ఎందుకంటే అతనికి తన దేహముంది కదా. శివబాబాకు తన దేహమంటూ లేదు. ఇది వారి రథము. ఈ రథములో వారు విరాజమానమై ఉన్నారు. ఇది వారి రథము. ఇతని రథము కూడా ఇదే. ఇతనికి తన ఆత్మ కూడా ఉంది. ఈ రథమును తండ్రి కూడా అప్పుగా తీసుకున్నారు. ఇతని శరీరాన్ని ఆధారంగా తీసుకున్నానని తండ్రి చెప్తున్నారు. తనదైతే లేదు మరి ఎలా చదివిస్తారు? తండ్రి ప్రతిరోజు కూర్చుని పిల్లలను ఆకర్షిస్తారు - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని చూడండి. ఈ శరీరమును కూడా మర్చిపోవాలి. నేను మిమ్ములను చూస్తాను, మీరు నన్ను చూడండి. మీరు ఎంతగా తండ్రిని చూస్తూ ఉంటారో అంత పవిత్రమౌతూ ఉంటారు. పావనంగా అయ్యేందుకు మరో ఉపాయమేదీ లేదు. ఒకవేళ ఏదైనా ఉపాయముంటే చెప్పండి. ఆత్మ పవిత్రమయ్యే మార్గము ఏదైనా ఉందా? గంగా నదిలోని నీటి వలన పావనంగా అవ్వలేరు. మొదట ఎవరికైనా తండ్రి పరిచయమునివ్వాలి. ఇటువంటి తండ్రి మరొకరు ఎవ్వరూ ఉండరు. నాడిని చూడండి, ఆశ్చర్యపడేటట్లు అర్థము చేసుకున్నారా అని పరిశీలించండి. అలా చెప్పినందున వీరినే పరమాత్మ అని అంటారని భావించాలి. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి తన పరిచయము ఇస్తున్నారు. ''నేను ఎవరు?'' ఇది కూడా పిల్లలకు ఇప్పుడు తెలుసు. చరిత్ర పునరావృతమౌతుంది. ఈ కులానికి చెందినవారే వస్తారు. మిగిలినవారంతా తమ తమ ధర్మాలలోకి వెళ్లిపోతారు. ఎవరైతే ఇతర ధర్మాలలోకి బదిలీ అయినారో వారు మళ్లీ తమ తమ సెక్షన్లలోకి చేరుకుంటారు. అందువలన నిరాకార వృక్షమును కూడా చూపించారు. ఈ విషయాలు పిల్లలైన మీరు మాత్రమే అర్థము చేసుకుంటారు. మిగిలినవారు అర్థము చేసుకోవడం చాలా కష్టము. 7-8 మందికి తెలిపితే ఈ జ్ఞానము బాగుందని భావించేవారు ఒకరో ఇద్దరో వెలువడ్తారు. ఇక్కడి వారికి తుఫాన్లు తక్కువగా వస్తాయి. మళ్లీ వెళ్లి వినాలని వారికి మనసులో అనిపిస్తుంది. చాలామంది సాంగత్య దోషములోకి కూడా వచ్చేస్తారు. అందువలన మళ్లీ రారు. పార్టీలు జరుగుతున్నప్పుడు అక్కడకు వెళ్లి అక్కడే తగుల్కొనిపోతారు. చాలా శ్రమ చేయాల్సి వస్తుంది. చాలా శ్రమతో కూడిన పని. ఎంతో శ్రమ చేయాల్సి వస్తుంది. క్షణ-క్షణము మేము మర్చిపోతామని అంటారు. నేను ఆత్మను, శరీరము కాదు అనే విషయాన్ని క్షణ-క్షణము మర్చిపోతారు. పిల్లలు కామచితి పై కూర్చుని నల్లగా మాడిపోయారని తండ్రికి కూడా తెలుసు. శ్మశానగ్రస్థులై పడి ఉన్నారు. అందుకే నల్లగా తయారయ్యారు. వారిని గురించే తండ్రి నా పిల్లలందరూ కాలి మరణించారని అంటారు. ఇవన్నీ అనంతమైన విషయాలు. అనేక కోట్ల మంది ఆత్మలు నా ఇంటిలో ఉండేవారని తండ్రి అంటున్నారు అనగా బ్రహ్మలోకములో ఉండేవారు. తండ్రి అయితే అనంతములో ఉన్నారు కదా. మీరు కూడా అనంతములోనే నిల్చుంటారు. బాబా స్థాపన చేసి వెళ్లిపోతారని మీకు తెలుసు. ఆ తర్వాత మీరు రాజ్యపాలన చేస్తారు. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామానికి వెళ్లిపోతారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఏ పాత్రధారినైనా రావణుడు ఈర్ష్య చెందితే, విఘ్నాలు కల్పిస్తే, తుఫాన్లలోకి తీసుకొస్తే అటువంటి వారిని చూడక మీ పురుషార్థములో మీరు తత్పరులై ఉండాలి. ఎందుకంటే ఈ డ్రామాలో ఎవరి పాత్ర వారిదే. ఇది అనాదిగా తయారైన డ్రామా.
2. రావణుని మతముననుసరించి ఈశ్వరుని తాకట్టులో దొంగతనము, మోసము(అమానత్ మే ఖ్యానత్) చేయరాదు. అందరి పై మమకారాన్ని తొలగించి సంపూర్ణ ట్రస్టీలుగా ఉండాలి.
వరదానము :-
'' చెడులో కూడా మంచిని అనుభవం చేసే నిశ్చయబుద్ధి గల నిశ్చింత చక్రవర్తి భవ ''
సదా ''ఇంతవరకు మంచే జరిగింది, ఇప్పుడూ మంచే జరుగుతోంది, ఇకమీదట కూడా మంచే జరుగుతుంది'' అనే స్లోగన్ గుర్తుండాలి. చెడును చెడు రూపంలో చూడకండి. చెడులో కూడా మంచిని అనుభవం చేయండి. చెడు నుండి కూడా పాఠము నేర్చుకోండి. ఏ విషయం వచ్చినా ఏం జరిగినా '' ఏం జరుగుతుందో '' అనే సంకల్పము రాకూడదు. వెంటనే ''మంచే జరుగుతుంది'' అనే సంకల్పము రావాలి. జరిగినదంతా మంచే జరిగింది. ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ సదా నిశ్చింత చక్రవర్తిగా ఉంటారు. నిశ్చయబుద్ధికి అర్థమే నిశ్చింత చక్రవర్తి.
స్లోగన్ :-
'' ఎవరైతే స్వయానికి, ఇతరులకు గౌరవమునిస్తారో (రిగార్డునిస్తారో) వారి రికార్డు సరిగ్గా ఉంటుంది ''