03-04-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - తండ్రి వద్దకు మీరు రిఫ్రెష్ (తాజా) అయ్యేందుకు వస్తారు. ఇక్కడ మీకు ప్రాపంచిక ప్రకంపనాల నుండి అతీతమైన సత్యమైన
ప్రశ్న :-
బాబా పిల్లల ఉన్నతి(ప్రగతి) కొరకు సదా ఏ సలహాను ఇస్తారు ?
జవాబు :-
మధురమైన పిల్లలారా ! పరస్పరములో ఎప్పుడూ ప్రాపంచిక వ్యర్థ విషయాలను గురించి మాట్లాడకండి. ఎవరైనా వినిపించినా విననట్లు ఉండిపోండి. మంచి పిల్లలు తమ సర్వీసు బాధ్యతను ముగించుకొని తండ్రి స్మృతిలో నిమగ్నమై ఉంటారు. కానీ చాలామంది పిల్లలు వ్యర్థ విషయాలను చాలా సంతోషంగా వింటారు మరియు వినిపిస్తారు కూడా. ఇందులో చాలా సమయము వ్యర్థమైపోతుంది, ఉన్నతి కూడా జరగదు.
ఓంశాంతి.
రెండు సార్లు ఓంశాంతి చెప్పినా అది రైటే(సరియే). పిల్లలకు ఓంశాంతి అర్థము ముందే అర్థము చేయబడింది. ''నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని'', నా స్వధర్మమే శాంతి అయినప్పుడు అడవులు మొదలైన స్థానాలలో వెతకడము వలన శాంతి లభించదు. అలాగే నేను కూడా శాంతి స్వరూపమునే అని తండ్రి చెప్తున్నారు. వాస్తవానికి ఇది చాలా సహజమే కానీ మధ్యలో మాయతో యుద్ధము జరుగుతుంది, కనుక కొద్దిగా కష్టము కలుగుతుంది. అనంతమైన తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఈ జ్ఞానమునివ్వలేరని పిల్లలకు తెలుసు. తండ్రి ఒక్కరే జ్ఞానసాగరులు. దేహధారులను ఎప్పుడూ జ్ఞానసాగరులని అనరు. రచయితయే రచన యొక్క ఆదిమధ్యాంత జ్ఞానమును ఇస్తారు, అది పిల్లలైన మీకు లభిస్తోంది. తండ్రి స్మృతి పాదరసము వంటిది కనుక మంచి మంచి అనన్యమైన పిల్లలు కూడా తండ్రి స్మృతిని మర్చిపోతారు. పాఠశాలలో అయితే తప్పకుండా నెంబరువారుగా ఉంటారు కదా. అంకెలను సదా స్కూలులోనే లెక్కిస్తారు. సత్యయుగములో ఎప్పుడూ అలా నంబరు లెక్కించరు. ఇది పాఠశాల. దీనిని అర్థము చేసుకునేందుకు కూడా గొప్ప బుద్ధి ఉండాలి. అర్ధకల్పము భక్తి నడచిన తర్వాత జ్ఞానమిచ్చేందుకు జ్ఞానసాగరులు వస్తారు. భక్తిమార్గములో అందరూ దేహధారులైన కారణముగా జ్ఞానమునివ్వలేరు. శివబాబా భక్తి చేస్తారని అనరు. వారెవరి భక్తి చేయాలి! దేహ రహితులు ఆ తండ్రి ఒక్కరే. వారు ఎవ్వరి భక్తినీ చేయరు. మిగిలిన దేహధారులందరూ రచన అయినందున భక్తి చేస్తారు. ఒక్క తండ్రి మాత్రమే రచయిత. ఈ కనుల ద్వారా ఏవైతే చిత్రాలు మొదలైనవి చూస్తున్నారో అవన్నీ రచనయే. ఈ విషయాలను క్షణక్షణము మర్చిపోతారు.
మీకు అనంతమైన వారసత్వము తండ్రి లేకుండా లభించదని తండ్రి చెప్తున్నారు. వైకుంఠ సామ్రాజ్యము మీకు లభిస్తుంది. 5 వేల సంవత్సరాల క్రితము భారతదేశములో వీరి(లక్ష్మీనారాయణుల) రాజ్యముండేది. 2500 సంవత్సరాలు సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్యాలు నడిచాయి. ఇది నిన్నటి విషయమేనని పిల్లలైన మీకు తెలుసు. ఇది తండ్రి తప్ప ఇతరులెవ్వరూ తెలియచేయలేరు. ఆ తండ్రే పతితపావనులు, ఇది అర్థము చెయించేందుకు కూడా చాలా కష్టపడవలసి వస్తుంది. తండ్రి స్వయంగా చెప్తున్నారు - కోటిలో ఏ ఒక్కరో అర్థము చేసుకుంటారు. తండ్రి ఈ చక్రమును కూడా అర్థము చేయించారు, ఈ జ్ఞానము పూర్తి ప్రపంచము కొరకు ఇవ్వబడింది. మెట్లచిత్రము కూడా చాలా బాగుంది, అయినా కొందరు అసంతృప్తిగానే ఉంటారు. వివాహముల కొరకు కళ్యాణ మంటపాలు కట్టించినవారి వద్దకు వెళ్ళి అర్థము చేయించి దృష్టినివ్వండి. పోను పోను ఈ విషయాలు అందరికీ ఇష్టమౌతాయి. పిల్లలైన మీరు అర్థము చేయించాలి. తండ్రి ఎవరి వద్దకూ వెళ్ళరు. భగవానువాచ - '' పూజారులను ఎప్పుడూ పూజ్యులు అని అనరు.'' కలియుగములో పవిత్రులు ఒక్కరు కూడా ఉండజాలరు. పూజ్య దేవీదేవతా ధర్మ స్థాపనను కూడా అత్యంత పూజ్యులెవరో వారే చేస్తారు. అర్ధకల్పము పూజ్యులుగా, తర్వాత అర్ధకల్పము పూజారులుగా ఉంటారు. ఈ బాబా అనేకమంది గురువులను ఆశ్రయించారు, కానీ గురువులను ఆశ్రయించడం భక్తిమార్గమని ఇప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు పూజ్యులుగా తయారు చేసే సద్గురువే లభించారు. కేవలం ఒక్కరిని కాదు, అందరినీ తయారు చేస్తారు. సర్వుల అత్మలు పూజ్య సతోప్రధానంగా అయిపోతాయి. ఇప్పుడు తమోప్రధానంగా, పూజారులుగా ఉన్నారు. ఇవి అర్థము చేసుకోవలసిన పాయింట్లు. తండ్రి చెప్తున్నారు - కలియుగములో పవిత్ర పూజ్యులు ఒక్కరు కూడా ఉండరు. అందరూ వికారాల ద్వారానే జన్మిస్తారు. ఇది రావణరాజ్యము. ఈ లక్ష్మీనారాయణులు కూడా పునర్జన్మలు తీసుకుంటారు. కానీ వారు పూజ్యులు ఎందుకంటే అక్కడ రావణుడే ఉండడు. రామరాజ్యము అని అంటారు కానీ అది ఎప్పుడుండేదో, రావణరాజ్యంగా ఎప్పుడు అవుతుందో ఏ మాత్రము తెలియదు. ఈ సమయములో ఎన్ని సభలున్నాయో చూడండి. ఫలాని సభ, ఫలాని సభ అని అనేకమున్నాయి. ఎక్కడైనా కొద్దిగా ఏమైనా దొరుకుతుందంటే వారిని వదలి మరొక వైపుకు వెళ్ళిపోతారు. మీరు ఈ సమయములో పారసబుద్ధి గలవారిగా అవుతున్నారు. ఇందులో కూడా కొందరు 20 శాతము, కొందరు 50 శాతము అయ్యారు. ఇప్పుడు రాజధాని స్థాపనౌతూ ఉందని తండ్రి అర్థము చేయిస్తున్నారు. ఇప్పుడు పైన మిగిలిఉన్న ఆత్మలు కూడా వస్తున్నాయి. సర్కస్లో కూడా కొంతమంది మంచి మంచి పాత్రధారులుంటారు, కొందరు మామూలు పాత్రధారులు కూడా ఉంటారు. ఇది అనంతమైన విషయము. పిల్లలకు ఎంత బాగా అర్థము చేయించబడ్తుంది. పిల్లలైన మీరు ఇక్కడకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు, గాలి తినడానికి కాదు. కొందరు రాతిబుద్ధివారిని తీసుకొస్తారు, వారు ప్రాపంచిక ప్రకంపనాలతోనే ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి శ్రీమతము ద్వారా మాయ పై విజయమును ప్రాప్తి చేసుకుంటున్నారు. మాయ క్షణక్షణము మీ బుద్ధిని పరుగెత్తిస్తూ ఉంటుంది. ఇక్కడైతే బాబా ఆకర్షిస్తారు. తండ్రి ఎప్పుడూ ఉల్టా(వ్యతిరేక) మాటలు మాట్లాడరు. తండ్రి సత్యమైనవారు కదా. ఇక్కడ మీరు సత్యమైన సాంగత్యములో కూర్చుని ఉన్నారు. ఇతరులందరూ అసత్య సాంగత్యాలలో ఉన్నారు. వాటిని సత్సంగములని అనుట కూడా పెద్ద పొరపాటే. సత్యమైన వారు ఒక్క తండ్రేనని మీకు తెలుసు. మనుష్యులు సత్యమైన పరమాత్ముని పూజిస్తారు. కానీ ఎవరిని పూజిస్తున్నారో వారికి తెలియదు. కనుక దానిని అంధశ్రద్ధ అని అంటారు. ఆగాఖాన్ గారికి ఎంతమంది శిష్యులున్నారో చూడండి. వారెక్కడకు వెళ్ళినా మంచి బహుమతులు లభిస్తాయి. వజ్రాలతో తులాభారము చేస్తారు. నిజానికి ఎవ్వరూ వజ్రాలతో ఎప్పుడూ తూచలేరు. సత్యయుగములో వజ్రవైడూర్యాలు మీ కొరకు రాళ్ళతో సమానము. వాటిని భవనాలలో పొదిగిస్తారు. ఇచ్చట వజ్రాలు దానంగా గ్రహించగలిగినవారు ఎవ్వరూ లేరు. మనుష్యుల వద్ద ధనము చాలా ఎక్కువగా ఉండడం వలన దానము చేస్తారు. అయితే ఆ దానము పాపాత్మలకు చేయుట వలన దానము ఇచ్చేవారి పై కూడా పాపభారము పెరుగుతుంది. అజామిళుని వంటి పాపాత్ములుగా అవుతారు. ఇది భగవంతుడు కూర్చుని అర్థము చేస్తున్నారు, మనుష్యులు కాదు. కనుక తండ్రి చెప్తున్నారు - మీ చిత్రాల పై ఎల్లప్పుడూ 'భగవానువాచ!' అని వ్రాసి ఉండాలి. సదా 'త్రిమూర్తి శివభగవానువాచ!' అని వ్రాయండి. కేవలం భగవంతుడంటే కూడా మనుష్యులు తికమకపడ్తారు. భగవంతుడు నిరాకారులు, కనుక త్రిమూర్తి అని తప్పకుండా వ్రాయాలి. కేవలం శివబాబా అని కాదు. బ్రహ్మ, విష్ణు, శంకరులు ముగ్గురి పేర్లుండాలి. బ్రహ్మ దేవతాయ నమ: తర్వాత వారిని గురువు అని కూడా అంటారు. శివశంకరులు ఒక్కరే అని అనేస్తారు. ఇప్పుడు శంకరుడెలా జ్ఞానమును ఇవ్వగలడు? అమరకథ కూడా ఉంది, మీరందరూ పార్వతులే. తండ్రి పిల్లలైన మిమ్ములనందరినీ ఆత్మలుగా భావించి జ్ఞానమునిస్త్తారు. భక్తికి ఫలమును భగవంతుడే ఇస్తారు. ఉన్నవారు ఒక్క శివబాబాయే. ఈశ్వరుడు, భగవంతుడు మొదలైనవారు కూడా లేరు. శివబాబా అను పదము చాలా మధురమైనది. తండ్రి స్వయంగా మధురమైన పిల్లలారా! అని అంటారు. కావున వారు తండ్రి అయినారు కదా.
తండ్రి అర్థము చేయిస్తున్నారు - ఆత్మలలోనే సంస్కారాలు నింపబడ్తాయి. ఆత్మ నిర్లేపి కాదు, నిర్లేపి అయితే పతితంగా ఎందుకు అవుతుంది? లేప-చేపములు తప్పకుండా అంటుకుంటాయి. అరదుతే పతితంగా అవుతుంది. భ్రష్ఠాచారి అని కూడా అంటారు. దేవతలు శ్రేష్ఠాచారులు. మీరు సర్వగుణ సంపన్నులు. మేము నీచులము, పాపులము అని మనుష్యులు దేవతలను మహిమ చేస్తారు. అందువలన స్వయాన్ని దేవతలమని చెప్పుకోరు. ఇప్పుడు తండ్రి కూర్చుని మనుష్యులను దేవతలుగా చేస్తారు. గురునానక్ గ్రంథములో కూడా వారి మహిమ ఉంది. సిక్కులు సత్ శ్రీ అకాల్ అని అంటారు. అకాలమూర్తి అయినవారే సత్యమైన సద్గురువు. కావున వారినొక్కరినే గౌరవించాలి, అంగీకరించాలి. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. అర్థము కొంచెము కూడా తెలియదు. ఇప్పుడు సద్గురువు అకాలుడైన తండ్రే స్వయంగా కూర్చుని అర్థము చేయిస్తున్నారు. మీలో కూడా నెంబరువారుగా ఉన్నారు. సన్ముఖములో కూర్చుని ఉన్నా ఏమీ అర్థము చేసుకోరు. కొందరు ఇక్కడ నుండి వెళ్ళగానే వదిలేస్తారు. పిల్లలారా! ఎప్పుడూ ప్రాపంచిక వ్యర్థ మాటలను వినకండి అని బాబా చెప్తున్నారు. చాలా మంది అటువంటి మాటలను చాలా సంతోషంగా వింటారు, వినిపిస్తారు. తండ్రి మహావాక్యాలను మర్చిపోతారు. వాస్తవానికి మంచి పిల్లలు తమ సర్వీసు బాధ్యతను నిర్వహించి మళ్లీ తమ మస్తీలో (నషాలో) ఉండిపోతారు. కృష్ణుడు మరియు క్రైస్తవులకు చాలా మంచి సంబంధముందని తండ్రి అర్థము చేయించారు. కృష్ణునికి రాజధాని ఉంటుంది కదా. లక్ష్మీనారాయణులనే పేరు తర్వాత వస్తుంది. వైకుంఠమనగానే వెంటనే కృష్ణుడు గుర్తుకు వస్తాడు. లక్ష్మీనారాయణులు కూడా గుర్తుకు రారు ఎందుకంటే కృష్ణుడు చిన్న బాలుడు. చిన్న పిల్లలు పవిత్రంగా ఉంటారు. పిల్లలు ఎలా జన్మ తీసుకుంటారో కూడా మీరు సాక్షాత్కారములో చూశారు. నర్స్ నిలిచి ఉంటుంది(తల్లి వద్ద), వెంటనే చేతిలోకి తీసుకొని సంభాళిస్తుంది..... ఇవన్నీ మీరు సాక్షాత్కారము చేసుకున్నారు. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము..... వేరు వేరుగా పాత్రను అభినయిస్తుంది. ఏమి జరుగుతుందో అదంతా డ్రామాయే. అందులో ఎలాంటి సంకల్పాలు రావు. ఇది తయారైన డ్రామా కదా. డ్రామా ప్లాను అనుసారము మన పాత్ర కూడా నడుస్తూ ఉంది. మాయ కూడా ప్రవేశిస్తుంది, తండ్రి కూడా ప్రవేశిస్తారు. కొందరు తండ్రి మతమును అనుసరిస్తారు, కొందరు రావణుని మతమును అనుసరిస్తారు. రావణుడు ఎవరు? అతడిని ఎప్పుడైనా చూశారా? కేవలం చిత్రాన్ని చూస్తారు. శివబాబాకైతే రూపము ఉంది. రావణుని రూపమేది? పంచ వికారాలనే భూతము ప్రవేశమైనప్పుడు రావణుడని అంటారు. ఇది భూతాల ప్రపంచము. అసురుల ప్రపంచము. ఇప్పుడు మన ఆత్మ బాగుపడ్తూ పరివర్తన చెందుతూ ఉందని మీకు తెలుసు. ఇక్కడ శరీరము కూడా వికారిదే(అసురీ). ఆత్మ బాగుపడ్తూ, బాగుపడ్తూ పావనమైపోతుంది, తర్వాత ఈ శరీరాన్ని వదిలేస్తుంది. తర్వాత మీకు సతోప్రధానమైన శరీరము లభిస్తుంది. కంచన కాయము లభిస్తుంది అంటే ఆత్మ కూడా కంచనముగా ఉంటుంది. బంగారు మేలిమిగా ఉంటే ఆభరణాలు కూడా మేలిమిగానే తయారవుతాయి. బంగారులో కల్తీ కూడా చేస్తారు. ఇప్పుడు పిల్లల బుద్ధిలో ఆదిమధ్యాంతల జ్ఞానము తిరుగుతూ ఉంటుంది. మనుష్యులకు కొంచెము కూడా తెలియదు. ఋషులు, మునులందరూ నేతి-నేతి అంటూ వెళ్ళిపోయారని అంటారు. లక్ష్మీనారాయణులను అడిగితే వారు కూడా నేతి నేతి అంటారని మనము అంటాము. కానీ వారిని అడగనే అడగము. ఎవరిని అడుగుతారు? గురువులను అడుగుతారు. మీరు వారిని ఈ ప్రశ్నలు అడగవచ్చు. మీరు అర్థము చేయించేందుకు ఎంత కష్టపడ్తారు. గొంతు పూడుకుపోతుంది. తండ్రిని అర్థము చేసుకున్న పిల్లలకే తెలియజేస్తారు కదా. మిగిలినవారితో అనవసరంగా మెదడును (తలను) పాడు చేసుకోరు. అచ్ఛా! (మంచిది!) మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. సర్వీసు బాధ్యతను పూర్తి చేసి మీ మస్తీలో(నషాలో) ఉండిపోవాలి. వ్యర్థ విషయాలను వినరాదు, వినిపించరాదు. ఒక్క తండ్రి మహావాక్యాలనే స్మృతిలో ఉంచుకోవాలి. వాటిని మర్చిపోరాదు.
2. సదా సంతోషంగా ఉండేందుకు రచయిత మరియు రచనల జ్ఞానము బుద్ధిలో తిరుగుతూ ఉండాలి అంటే దాని స్మరణే నడుస్తూ ఉండాలి. ఏ విషయంలో కూడా సంకల్పము నడవరాదు. దాని కొరకు డ్రామాను బాగా అర్థము చేసుకొని పాత్రను అభినయించాలి.
వరదానము :-
''దాత ఇచ్చినదానిని స్మృతిలో ఉంచుకొని సర్వ ఆకర్షణల నుండి ముక్తముగా ఉండే అకర్షణా ముక్త్ భవ''
చాలామంది పిల్లలు వీరి పై నాకు ఏ ఆకర్షణా లేదు కానీ వీరి గుణాలు చాలా బాగున్నాయని, లేక వీరిలో సేవ చేసే గుణము చాలా బాగుంది అని అంటారు. కానీ ఎవరైనా వ్యక్తి లేక వైభవము మాటిమాటికి సంకల్పములో రావడం కూడా ఆకర్షణే. ఎవరి విశేషతను చూస్తున్నా, గుణాలను లేక సేవను చూస్తున్నా వాటిని ఇచ్చిన దాతను మర్చిపోకండి. ఇది దాత ఇచ్చిన దానము అనే స్మృతి ఆకర్షణల నుండి ముక్తులుగా చేసి ఆకర్షణముక్తులుగా చేస్తుంది. ఎవరి పైనా ప్రభావితులుగా అవ్వరు.
స్లోగన్ :-
'' వెతుకుచున్న ఆత్మలకు స్థిరమైన స్థానము ఇచ్చి, భగవంతునితో కలిపే ఆత్మిక సమాజ సేవకులు కండి.''