07-05-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - స్మృతి యాత్రలో ఉంటే మీ పాపాలు నశిస్తాయి. ఎందుకంటే స్మృతి పదునైన ఖడ్గము వంటిది. ఇందులో మిమ్ములను మీరు మోసగించుకోరాదు. ''

ప్రశ్న :-

పిల్లలు తమ స్వభావాన్ని సరిదిద్దుకునేందుకు తండ్రి చూపే దారి ఏది ?

జవాబు :-

పిల్లలూ, మీరు సత్యమైన చార్టును ఉంచుకోండి. చార్టు ఉంచడం ద్వారానే మీ స్వభావము సరిదిద్దబడ్తుంది. మొత్తం రోజంతటిలో మా స్వభావము ఎలా ఉంది? ఎవ్వరికీ దు:ఖము ఇవ్వలేదు కదా? వ్యర్థంగా మాట్లాడలేదు కదా? ఆత్మగా భావిస్తూ తండ్రిని ఎంత సమయము స్మృతి చేశాను? ఎంతమందిని నా సమానంగా తయారుచేశాను? అని పరిశీలించుకోవాలి. ఈ విధంగా ఎవరైతే లెక్కాచారము ఉంచుకుంటారో వారి స్వభావము బాగుపడుతూ ఉంటుంది. ఎవరు చేస్తారో, వారు పొందుతారు(జో కరేగా, సో పాయేగా). చేయని వారు పశ్చాత్తాప పడ్తారు.

ఓంశాంతి.

ఆత్మిక పిల్లల పట్ల ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు సన్ముఖములో ఉన్నారు. పిల్లలందరూ తమ స్వధర్మములో ఉంటారని, తండ్రిని స్మృతి చేస్తున్నారని చెప్పలేము. బుద్ధి తప్పకుండా ఎక్కడెక్కడికో పరిగెడ్తూ ఉంటుంది. అందరూ తమలో తాము దీనిని గురించి అర్థము చేసుకోవచ్చు. ముఖ్యమైనది - సతోప్రధానంగా అవ్వడం. ఆ విధంగా (సతోప్రధానంగా) స్మృతియాత్ర ద్వారా తప్ప ఏ ఇతర విధంగా అవ్వలేరు. భలే బాబా అమృతవేళ యోగములో కూర్చుని పిల్లలను ఆకర్షిస్తారు. నంబరువారుగా ఆకర్షిస్తూ ఉంటారు. స్మృతిలో ఉన్నప్పుడు శాంతిగా ఉంటారు. ప్రపంచాన్ని కూడా మర్చిపోతారు. అయితే రోజంతా ఏమి చేస్తారు? అనేది ముఖ్యమైన ప్రశ్న. అమృతవేళ అర్ధగంటనో లేక గంటనో స్మృతి యాత్ర చేస్తారు. దీని ద్వారా ఆత్మ పవిత్రమౌతుంది, ఆయువు పెరుగుతుంది. అయితే మొత్తం రోజంతటిలో ఎంత సేపు స్మృతి చేస్తారు? స్వదర్శన చక్రధారులుగా ఎంత సమయము ఉండగలరు? బాబాకు అంతా తెలుసు అని అనుకోరాదు. రోజంతా ఏం చేశాము అని స్వయం మీ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. పిల్లలైన మీరు చార్టు వ్రాస్తారు. కొంతమంది సత్యంగా వ్రాస్తారు. కొంతమంది తప్పుగా వ్రాస్తారు. మేము శివబాబా జతలోనే ఉన్నామని భావిస్తారు. శివబాబానే స్మృతి చేస్తూ ఉన్నామని అంటారు. కానీ సత్యంగా స్మృతిలో ఉన్నారా? పూర్తిగా సైలెన్స్‌లో ఉంటే ఈ ప్రపంచాన్ని కూడా మర్చిపోతారు. మేము శివబాబా స్మృతిలో ఉన్నామంటూ మిమ్ములను మీరు మోసగించుకోరాదు. దేహ ధర్మాలన్నీ మర్చిపోవాలి. శివబాబా మనలను ఆకర్షించి ప్రపంచమంతటిని మరపింపజేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని ఆ తండ్రే చెప్తున్నారు. తండ్రి ఆకర్షిస్తారు. ఆత్మలందరూ తండ్రినే స్మృతి చేయాలి. ఇతరులెవ్వరూ గుర్తు రాకూడదు. కానీ సత్యంగా గుర్తు వస్తున్నారా లేదా? అని స్వంత లెక్కాచారాన్ని వ్రాసుకోవాలి. మేము బాబాను ఎంత సేపు స్మృతి చేస్తున్నాము? ప్రేయసీ-ప్రియుల ఉదాహరణముంది కదా? ఈ ప్రేయసీ-ప్రియులు ఆత్మిక సంబంధములో ఉన్నవారు. ఈ విషయాలే వేరుగా ఉంటాయి. అది దేహ సంబంధము, ఇది ఆత్మిక సంబంధము. మేము ఎంత సమయము దైవీగుణాలలో ఉన్నాము? తండ్రి సేవలో ఎంత సేపు గడిపాము? అని చూసుకోవాలి. అంతేకాక ఇతరులకు కూడా తండ్రి స్మృతిని ఇప్పించాలి. ఆత్మ పై ఏర్పడిన తుప్పును తొలగించుకునేందుకు స్మృతి తప్ప వేరే మార్గము లేదు. భక్తిమార్గములో అనేకమందిని స్మృతి చేస్తారు. ఇక్కడ ఒక్కరిని మాత్రమే స్మృతి చేయాలి. ఆత్మలమైన మనము చాలా చిన్న బిందువులము, బాబా కూడా చాలా చిన్న బిందువు. అత్యంత సూక్ష్మాతి సూక్ష్మము. జ్ఞానము చాలా గొప్పది. శ్రీలక్ష్మీ లేక శ్రీనారాయణునిగా అవ్వడం, విశ్వమంతటికీ యజమానిగా అవ్వడం పిన్నమ్మ ఇల్లేమీ కాదు(సులభము కాదు). స్వయాన్ని మియామిట్టూ (నాకే అంతా తెలుసు) అని భావించుకొని మోసగించుకోరాదని తండ్రి చెప్తున్నారు. రోజంతటిలో స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఎంత సేపు గడిపాము? అని ప్రశ్నించుకోండి. దీని ద్వారా తుప్పు తొలగిపోతుంది. ఎంతమందిని మీ సమానముగా తయారుచేశారు? ఈ లెక్కాచారము ప్రతి ఒక్కరు ఎవరిది వారు వ్రాసుకుంటూ ఉండాలి. ఎవరు చేస్తారో వారు పొందుతారు. చేయనివారు పశ్చాత్తాప పడతారు. రోజంతటిలో మా నడవడిక ఎలా ఉండినది? ఎవ్వరికీ దు:ఖమివ్వలేదు కదా? వ్యర్థ మాటలు మాట్లాడలేదు కదా? అని చూసుకుంటూ చార్టు వ్రాస్తూ ఉంటే నడవడిక(క్యారెక్టర్‌) సరిదిద్దబడ్తుంది. తండ్రి మార్గాన్ని చూపించారు.

ప్రేయసీ-ప్రియులు ఒకరినొకరు గుర్తు చేసుకుంటారు. స్మృతి చేస్తూనే వారు ముందు నిలుస్తారు. ఇరువురూ స్త్రీలే అయినా సాక్షాత్కారమవ్వగలదు. ఇరువురూ పురుషులైనా సాక్షాత్కారమవ్వగలదు. కొంతమంది మిత్రులు అన్నదమ్ముల కంటే చాలా అన్యోన్యంగా, ప్రీతిగా ఉంటారు. మిత్రుల మధ్య పరస్పరములో అన్నదమ్ముల కంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఒకరినొకరు మంచి ప్రేమతో పైకెత్తుకుంటారు. బాబా మంచి అనుభవము గలవారు కదా. అమృతవేళలో తండ్రి ఎక్కువగా ఆకర్షిస్తారు. వారు అయస్కాంతము, సదా పవిత్రులు. అందువలన బాగా ఆకర్షిస్తారు. తండ్రి అనంతమైనవారు కదా. వీరు చాలా మంచి ప్రేమయుక్త(లవ్‌లీ) పిల్లలని భావిస్తారు. అటువంటివారిని చాలా తీవ్రంగా ఆకర్షిస్తారు. కానీ ఈ స్మృతియాత్ర చాలా అవసరము. ఎక్కడకు వెళ్లినా ప్రయాణము చేస్తున్నా, లేస్తూ, కూర్చుంటూ, తింటూ, తాగుతూ స్మృతి చెయ్యవచ్చు. ప్రేయసీ- ప్రియులు ఎక్కడ ఉన్నా గుర్తు చేసుకుంటారు కదా. ఇది కూడా అలాగే చేయాలి. తండ్రిని తప్పకుండా స్మృతి చెయ్యాల్సిందే. చేయకుంటే వికర్మలు ఎలా వినాశమౌతాయి. వేరే ఏ ఉపాయమూ లేదు. ఇది చాలా సూక్ష్మమైనది. కత్తి పై నడవడం వంటిది. స్మృతి కత్తి పదును వంటిది. క్షణ క్షణము స్మృతిని మర్చిపోతామని అంటారు. స్మృతిని ఖడ్గము అని ఎందుకంటారు? ఎందుకంటే దీని ద్వారా పాపాలు నశిస్తాయి. మీరు పావనంగా అవుతారు. ఇది చాలా సున్నితమైనది. వారు ఎలాగైతే అగ్నిని దాటి వెళ్తారో, అలా మీ బుద్ధియోగము తండ్రి వద్దకు వెళ్లిపోతుంది. ఆ తండ్రి మనకు వారసత్వము ఇచ్చేందుకు వచ్చారు. వారు ఇప్పుడు పైన లేరు. ఇక్కడకు వచ్చారు. సాధారణ శరీరములో వస్తానని అంటారు. తండ్రి పై నుండి కిందికి వచ్చారని మీకు తెలుసు. చైతన్య వజ్రము ఈ డబ్బీలో కూర్చుని ఉన్నారు. మనము బాబా జతలో కూర్చుని ఉన్నామని సంతోషించరాదు. ఇంత మాత్రముతోనే తృప్తి పడరాదు. బాబా చాలా ఆకర్షిస్తారు కానీ కేవలం అర్ధగంటనో, ముప్పావు గంటనో యోగము చేస్తారు. మిగిలిన రోజంతా వృథాగా పోగొట్టుకుంటే లాభమేముంది? పిల్లలకు తమ చార్టు గురించి చింత ఉండాలి. అంతేకాని మేము ఉపన్యసించగలమని, మాకు చార్టు ఉంచే అవసరమేముంది అని భావించరాదు. ఈ తప్పు చేయరాదు. మహారథులు కూడా చార్టు వ్రాయాలి. మహారథులు చాలామంది లేరు. వేళ్ల పై లెక్కించవచ్చు. చాలామంది నామ-రూపాలు మొదలైన వాటిలో చాలా సమయాన్ని వృథా చేసుకుంటారు. గమ్యము చాలా ఉన్నతమైనది. తండ్రి అన్ని విషయాలు ఎంతగా అర్థము చేయిస్తారంటే బాబా ఫలానా పాయింటు చెప్పలేదని విద్యార్థి అనుకోరాదు. ముఖ్యమైనది స్మృతి మరియు సృష్టి చక్ర జ్ఞానము. ఈ సృష్టి చక్రములోని 84 జన్మల గురించి ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. వైరాగ్యము కూడా మీకే వస్తుంది. ఇప్పుడు ఈ మృత్యులోకములో ఉండబోమని మీకు తెలుసు. ఇక్కడ నుండి వెళ్లేందుకు ముందు పవిత్రంగా అవ్వాలి. దైవీగుణాలు కూడా తప్పకుండా కావాలి. నంబరువారుగా మాలలో కూర్చబడాలి. మళ్లీ నంబరువారుగా రాజధానిలోకి వస్తారు. ఆ తర్వాత మళ్లీ నంబరువారుగా మీకు కూడా పూజలు జరుగుతాయి. అనేకమంది దేవతలు పూజింపబడ్తారు. ఏమేమో పేర్లు రకరకాలుగా ఉంచుతారు. ఛండికా దేవికి కూడా జాతర జరుగుతుంది. రిజిష్టరు ఎవరు పెట్టరో వారు బాగుపడరు. అటువంటివారిని ఛండికాదేవి అని అంటారు. విననే వినరు, చేయనే చేయరు. ఇవన్నీ అనంతమైన విషయాలు. పురుషార్థము చేయకపోతే తండ్రి మాట కూడా విననివారు అని బాబా అంటారు. పదవి తగ్గిపోతుంది. అందుకే స్వయం పై చాలా గమనముంచాలని తండ్రి చెప్తున్నారు. బాబా అమృతవేళలో వచ్చి స్మృతియాత్రలో ఎంతగానో శ్రమ చేయిస్తారు. ఇది చాలా గొప్ప గమ్యము. జ్ఞానము చాలా చౌక(సులభంగా లభ్యమగు) సబ్జెక్టు. 84 జన్మల చక్రము స్మృతి చేయడం పెద్ద విషయమేమీ కాదు. పోతే స్మృతియాత్ర ఒక్కటే చాలా గొప్ప సంపద. ఇందులోనే చాలామంది ఫెయిల్‌ కూడా అవుతారు. మీరు కూడా ఇందులోనే యుద్ధము చేస్తారు. మీరు స్మృతి చేస్తారు, మాయ మరపింపజేస్తుంది. జ్ఞానములో యుద్ధము మాటే ఉండదు. అది సంపాదనకు మూలము. ఇది పవిత్రంగా చేస్తుంది. అందుకే పతితులను పావనంగా చేయమని తండ్రిని అందరూ పిలుస్తారు. అంతేకాని ''ఓ తండ్రీ! వచ్చి చదివించు'' అని పిలువరు. పవిత్రంగా చేయమని అంటారు. ఈ పాయింట్లన్నీ బుద్ధిలో ఉంచుకోవాలి. సంపూర్ణ రాజయోగులుగా అవ్వాలి.

జ్ఞానము చాలా సులభము. కేవలం యుక్తిగా అర్థము చేయించాల్సి ఉంటుంది. మాటలు మధురంగా కూడా ఉండాలి. మీకు ఇప్పుడు ఈ జ్ఞానము లభిస్తుంది. అది కూడా కర్మలనుసారమే జరుగుతుంది. ఇతడు ప్రారంభము నుండి భక్తి చేశాడు. మంచి కర్మలు చేశాడు. అందుకే శివబాబా కూడా బాగా కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఎంత ఎక్కువగా భక్తి చేసి ఉంటారో, శివబాబా రాజీ అయ్యి ఉంటారో అంత వేగంగా ఇప్పుడు కూడా జ్ఞానము తీసుకుంటారు. మహారథుల బుద్ధిలో పాయింట్లు ఉంటాయి. వారు వ్రాస్తూ ఉంటే మంచి మంచి పాయింట్లు ఏరుతూ ఉంటారు. పాయింట్లు తూకము వేయాలి. కానీ ఇటువంటి శ్రమ ఎవ్వరూ చేయరు. ఏ ఒక్కరో కష్టంగా నోట్స్‌ వ్రాసుకుంటారు. మంచి పాయింట్లు ఏరి వేరుపరుస్తారు. ఉపన్యసించేందుకు ముందు వ్రాసుకోమని బాబా సదా చెప్తూ ఉంటారు. వ్రాసుకుని చెక్‌ చేసుకోవాలి. ఇలాంటి శ్రమ ఎవ్వరూ చేయడం లేదు. అన్ని పాయింట్లు ఎవ్వరికీ గుర్తు ఉండవు. వకీళ్లు కూడా డైరీలో పాయింట్లు వ్రాసుకుంటారు. వ్రాసుకోవడం మీకు చాలా అవసరము. విషయాలు(టాపిక్స్‌) వ్రాసుకొని మళ్లీ చదువుకోవాలి. తప్పులు సరిదిద్దుకోవాలి. ఇంత శ్రమ చేయకుంటే ఉత్సాహము రాదు. మీ బుద్ధియోగము ఇతర వైపులకు తిరుగుతూ ఉంటుంది. సరళంగా నడిచేవారు చాలా కొంతమందే ఉన్నారు. సేవ తప్ప ఇతరమేదీ బుద్ధిలో ఉండదు. మాలలో రావాలంటే కష్టపడాలి. తండ్రి సలహా ఇస్తారు. అది హృదయానికి హత్తుకుంటుంది. గుర్తు ఉండకపోతే వారు స్వయమే చూసుకోవాలి. వృత్తి వ్యాపారాదులు చేయండి కానీ నోట్‌ చేసుకునేందుకు డైరీ సదా ప్యాకెట్‌లో ఉండాలి. అందరికంటే ఎక్కువగా మీరే నోట్‌ చేసుకోవాలి. నిర్లక్ష్యంగా ఉంటూ నాకంతా తెలుసని భావిస్తే మాయ కూడా తక్కువదేమీ కాదు. ముష్టిఘాతము తగిలిస్తూ ఉంటుంది. లక్ష్మినారాయణులుగా అవ్వడం పిన్నమ్మ ఇల్లేమీ కాదు. చాలా గొప్ప రాజధాని స్థాపనౌతూ ఉంది. కోట్లలో ఏ ఒక్కరో వెలువడ్తారు. బాబా కూడా అమృతవేళ 2 గంటలకే లేచి వ్రాసేవారు మళ్లీ చదివేవారు. పాయింట్లు మర్చిపోతే మళ్లీ కూర్చుని చూచుకునేవారు. ఆ తర్వాత మీకు అర్థం చేయించేవారు. కావున స్మృతియాత్ర ఎక్కడ ఉందో అర్థము చేసుకోగలరు. కర్మాతీత స్థితి ఎక్కడుంది? ఊరకే ఎవ్వరినీ పొగడరాదు. ఇందులో ఎంతో శ్రమ ఉంది. కర్మభోగము కూడా ఉంటుంది. స్మృతి చేయాల్సి వస్తుంది. అచ్ఛా, మురళి నడిపేది బ్ర్రహ్మబాబా కాదు, శివబాబాయే నడుపుతారని భావించండి. శివబాబాయే మీకు మురళి వినిపిస్తారు. కానీ మధ్యలో ఈ పుత్రుడు కూడా మాట్లాడ్తాడు. తండ్రి ఎప్పుడూ ఖచ్ఛితంగా సత్యమే చెప్తారు. ఇతడైతే రోజంతా చాలా ఆలోచించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇతనికి చాలామంది పిల్లల బాధ్యత ఉంది. పిల్లలు నామ-రూపాలలో చిక్కుకొని చంచలమౌతారు. చాలామందికి పిల్లల కొరకు ఇల్లు కట్టాలని, ఫలానా ఏర్పాట్లు చేయాలని మనసులో ఉంటుంది. నిజానికి ఇదంతా ఒక డ్రామాయే, బాబాది డ్రామాయే, ఈ బ్రహ్మది డ్రామాయే, మీది కూడా డ్రామాయే. డ్రామాలో లేకుండా ఏదీ ఉండుటకు వీలు లేదు. సెకండు సెకండు డ్రామా నడుస్తూనే ఉంటుంది. డ్రామాను గుర్తు చేసుకుంటే చలించకుండా ఉంటారు. నిశ్చలంగా, అచలంగా, స్థిరంగా ఉంటారు. తుఫాన్లు అయితే చాలా వస్తాయి. చాలామంది పిల్లలు సత్యము తెలుపరు. స్వప్నాలు కూడా చాలా వస్తూ ఉంటాయి. ఇది మాయ కదా. జ్ఞానానికి రాకముందు రాని స్వప్నాలు కూడా చాలా వస్తూ ఉంటాయి. పిల్లలు వారసత్వము పొందేందుకు స్మృతిలో శ్రమ చేయాల్సి వస్తుందని తండ్రి అర్థం చేసుకుంటారు. కొంతమంది శ్రమ చేస్తూ చేస్తూ అలసిపోతారు. గమ్యము చాలా గొప్పది. 21 తరాలు విశ్వానికి అధికారులుగా చేస్తారు. కావున శ్రమ కూడా చేయాల్సి ఉంటుంది కదా. అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేయాల్సి వస్తుంది. బాబా మమ్ములను విశ్వానికి యజమానులుగా చేస్తున్నారని హృదయములో ఉంటుంది. అటువంటి తండ్రిని అనుక్షణము స్మృతి చేయాల్సి ఉంటుంది. వారు అందరికంటే ప్రియమైన తండ్రి. ఈ బాబా అయితే అద్భుతము చేస్తారు. విశ్వ జ్ఞానమును ఇస్తారు. బాబా, బాబా, బాబా అంటూ లోలోపల వారి మహిమను గానము చేయాలి. ఎవరు స్మృతి చేస్తూ ఉంటారో వారికి తండ్రి ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. తండ్రి ద్వారా రిఫ్రెష్‌ అయ్యేందుకు ఇక్కడకు వస్తారు. అందుకే మధురమైన పిల్లలారా, ఎలాంటి తప్పులు చేయరాదని తండ్రి అర్థం చేయిస్తారు. అన్ని సేవాకేంద్రాల నుండి ఇక్కడకు వస్తారు. అందరినీ చూసి ఎంత సంతోషమవుతుంది? అని ప్రశ్నిస్తాను. తండ్రి పరిశీలిస్తారు కదా. ముఖము చూస్తూనే తండ్రి పై ఎంత ప్రేమ ఉందో తెలుసుకుంటారు. తండ్రి ముందుకు వస్తే తండ్రి ఆకర్షిస్తారు కూడా. ఇక్కడ కూర్చుని కూర్చుని సర్వమూ మర్చిపోతారు. బాబా తప్ప ఇంకేదీ ఉండదు. మొత్తం ప్రపంచమంతటిని మర్చిపోవాల్సిందే. ఆ స్థితి చాలా మధురంగా, అలౌకికంగా ఉంటుంది. తండ్రి స్మృతిలో కూర్చుని ఉంటే ప్రేమ బాష్పాలు కూడా ప్రవహిస్తాయి. భక్తిమార్గములో కూడా కన్నీరు వస్తుంది. కానీ భక్తిమార్గము వేరే, జ్ఞానమార్గము వేరే. ఇది సత్యమైన తండ్రితో సత్యమైన ప్రేమ. ఇక్కడి విషయాలే భిన్నమైనవి. మీరిక్కడకు శివబాబా వద్దకు వచ్చారు. వారు ఈ రథము పై తప్పకుండా సవారి అయ్యి ఉంటారు. శరీరము లేకుండా ఆత్మలు అక్కడ లుసుకోగలవు. ఇచ్చటేమో అందరూ శరీరధారులే. వీరు బాప్‌దాదా అని మీకు తెలుసు. కావున తండ్రిని స్మృతి చేయవలసే వస్తుంది. చాలా ప్రేమగా మహిమ చేయాల్సి ఉంటుంది. బాబా మనకు ఏమేమి ఇస్తున్నారు!

మనలను ఈ అడవి నుండి తీసుకు వెళ్లేందుకు బాబా వచ్చారు. మంగళమ్‌ భగవాన్‌ విష్ణు.......... అని అంటారు కదా. వీరు అందరికి మంగళ కార్యము చేయువారు. అందరికి కళ్యాణము జరుగుతుంది. తండ్రి ఒక్కరే కావున వారిని స్మృతి చేయాలి. మనము ఇతరుల కళ్యాణము ఎందుకు చేయరాదు! ఏదో లోపము తప్పకుండా ఉంటుంది. స్మృతి ద్వారా ఏర్పడు పదును లేదని బాబా చెప్తున్నారు. అందుకే శబ్ధములో కూడా అకర్షణ ఉండదు. ఇది కూడా డ్రామాయే. ఇప్పుడు మళ్లీ పదునును బాగా ధారణ చేయండి. స్మృతి యాత్రయే కష్టమైనది. మనము సోదరులకు జ్ఞానమిస్తాము. తండ్ర్రి పరిచయమునిస్తాము. తండ్రి నుండి వారసత్వము పొందుకోవాలి. క్షణ-క్షణము మర్చిపోతూ ఉంటారని తండ్రికి తెలుసు. తండ్రి అయితే అందరినీ పిల్లలే అని భావిస్తారు. అందుకే పిల్లలూ, పిల్లలూ! అని అంటారు. వీరు అందరికి తండ్రి అయ్యారు. వీరిది అద్భుతమైన పాత్ర కదా. ఈ పదాలు ఎవ్వరివో చాలా కొద్దిమంది మాత్రమే అర్థము చేసుకోగలరు. తండ్రి ఏమో పిల్లలూ, పిల్లలూ! అని అంటూ ఉంటారు. నేను వచ్చిందే పిల్లలకు వారసత్వము ఇచ్చేందుకు అని తండ్రి అంటున్నారు. బాబా అంతా వినిపిస్తారు. పిల్లల ద్వారా నేను పని తీసుకోవాలి కదా. ఇది చాలా అద్భుతమైన, ఆసక్తికరమైన జ్ఞానము. ఈ జ్ఞానము కొంచెం కఠినమైనది కూడా. వైకుంఠాధికారులుగా అయ్యేందుకు జ్ఞానము కూడా అటువంటిదే కావాలి కదా. మంచిది.

ప్రతి ఒక్కరు తండ్రిని స్మృతి చెయ్యాలి. దైవీగుణాలు ధారణ చేయాలి. నోటి ద్వారా ఉల్టా-సుల్టా (తప్పుడు) మాటలు ఎప్పుడూ మాట్లాడరాదు. ప్ర్రేమతో పనిని చేయించుకోవాలి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. అమృతవేళ ఉదయము ఉదయమే ఏకాంతములో కూర్చొని ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి. మొత్తం ప్రపంచమంతటిని మర్చిపోవాలి.

2. తండ్రి సమానంగా సర్వుల కళ్యాణకారిగా అవ్వాలి. లోపాలను తొలగించుకోవాలి. స్వయం పై చాలా గమనముంచాలి. మీ రిజిస్టరు మీరే పరిశీలించుకోవాలి.

వరదానము :-

'' మూడు స్మృతుల తిలకం ద్వారా శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకునే అచల్‌ అడోల్‌ భవ ''

బాప్‌దాదా పిల్లలందరికి మూడు స్మృతుల తిలకమునిచ్చారు. ఒకటి స్వంత స్మృతి, తర్వాత తండ్రి స్మృతి, మూడవది శ్రేష్ఠ కర్మలు చేసేందుకు డ్రామా స్మృతి. ఎవరికైతే సదా ఈ మూడు స్మృతులు ఉంటాయో వారి స్థితి కూడా శ్రేష్ఠంగా ఉంటుంది. ఆత్మ స్మృతితో పాటు తండ్రి స్మృతి, తండ్రి స్మృతితో పాటు డ్రామా స్మృతి చాలా అవసరము. ఎందుకంటే కర్మలు చేయునప్పుడు డ్రామా జ్ఞానముంటే హెచ్చు-తగ్గులుగా అవ్వరు. రకరకాల పరిస్థితులు ఎన్ని వచ్చినా తడబడకుండా అచల్‌-అడోల్‌గా (స్థిరంగా, అచంచలంగా) ఉంటారు.

స్లోగన్‌ :-

'' దృష్టిని అలౌకికంగా, మనసును శీతలంగా, బుద్ధిని దయా భరితంగా చేసుకోండి ''