23-02-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - శివజయంతి సందర్భంగా మీరు చాలా వైభవంగా అందరికీ నిరాకార తండ్రి జీవితగాథ(బయోగ్రఫీ)ను వినిపించండి. ఈ శివజయంతియే వజ్ర తుల్యమైనది ''
ప్రశ్న :-
బ్రాహ్మణులైన మీకు సత్యమైన దీపావళి ఎప్పుడు మరియు ఏ విధంగా ?
జవాబు :-
వాస్తవానికి శివజయంతియే మీకు సత్య - సత్యమైన దీపావళి ఎందుకంటే శివబాబా వచ్చి మీ ఆత్మ రూపి దీపాన్ని వెలిగిస్తారు. ప్రతి ఒక్కరి ఇంటి దీపము వెలుగుతుంది అనగా ఆత్మ జ్యోతి వెలుగుతుంది. వారు స్థూలమైన దీపాలను వెలిగిస్తారు. కాని మీ సత్యమైన దీపము శివబాబా రావడం ద్వారానే వెలుగుతుంది. అందువల్ల మీరు పూర్తి వైభవముతో శివజయంతిని ఆచరించండి.
ఓంశాంతి.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు శివజయంతిని జరుపుకుంటారు. భారతదేశములో అయితే శివజయంతిని ఆచరిస్తూనే ఉంటారు. ఒక్కరి జయంతే జరుపుకోవడం జరుగుతుంది. అయితే వారిని సర్వవ్యాపి అనేస్తారు. ఇప్పుడు సర్వుల జయంతి అయితే జరగదు. జయంతి ఎప్పుడు జరుపబడుతుంది. గర్భము నుండి బయటకు వచ్చినప్పుడే జరుపుతారు. శివజయంతి అయితే తప్పకుండా జరుపుకుంటారు. ఆర్యసమాజము వారు కూడా జరుపుకుంటారు. ఇప్పుడు మీరు 78వ శివజయంతిని జరుపుకుంటారు. అనగా జయంతికి 78 సంవత్సరాలయ్యింది. ఫలానా రోజు వీరు గర్భము నుండి బయటకు వచ్చారని జన్మదినము అందరికీ గుర్తుంటుంది. ఇప్పుడు మీరు శివబాబాకు 83వ జయంతిని ఆచరిస్తారు. వారు నిరాకారులు. వారి జయంతి ఎలా జరుగుతుంది? ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులకు ఆహ్వానపత్రికలు వెళ్తాయి. జయంతిని ఎలా జరుపుతారు? వారు ఎప్పుడు ఏ విధంగా జన్మ తీసుకున్నారు? తర్వాత వారి శరీరానికి ఏ పేరు పెట్టారు? అని ఎవరినైనా అడగాలి. కాని రాతి బుద్ధి గలవారిగా ఉన్నారు కనుక ఎప్పుడూ ఎవ్వరూ ప్రశ్నించరు. వారు నిరాకారులు, వారి పేరు శివుడు అని మీరు వారికి తెలపవచ్చు. మీరు సాలిగ్రామ పిల్లలు. ఈ శరీరములో సాలిగ్రామముందని తెలుసు. శరీరానికే పేరు ఉంటుంది. వారు పరమాత్మ అయిన శివుడు. ఇప్పుడు మీరు ఎంత వైభవముతో కార్యక్రమాలను జరుపుకుంటారు. రోజు రోజుకు మీరు - శివబాబా వచ్చి బ్రహ్మ తనువులో వచ్చి ప్రవేశిస్తారని, అదే వారి జయంతి అని మహిమ చేయబడుతుందని వైభవం(ధూంధాం)గా అర్థం చేయిస్తూ ఉంటారు. వారికి తిథి, తారీఖులు ఏవీ ఉండవు. నేను సాధారణ తనువులో ప్రవేశిస్తానని అంటారు. కాని ఎప్పుడు, ఏ ఘడియలో అనేది చెప్పలేరు. తిథి - తారీఖు, రోజు మొదలైనవి చెప్పినట్లయితే ఫలానా తారీఖు అని చెప్పవచ్చు. వీరికి జన్మపత్రి(జాతకము) మొదలైనవి ఉండవు. వాస్తవానికి అందరికంటే ఉన్నతమైన జాతకము వీరిదే. వీరి కర్తవ్యము కూడా అందరికంటే ఉన్నతమైనది. ప్రభూ! మీ మహిమ అపారమైనదని అంటారు. కనుక తప్పకుండా ఏమైనా చేసి ఉంటారు కదా. మహిమ అయితే చాలా మందిది గాయనము చేయబడ్తుంది. నెహ్రూ, గాంధీ మొదలైన వారందరి మహిమను గానం చేస్తారు. కాని వీరి మహిమను గురించి ఎవ్వరూ తెలియజేయలేరు. వారు జ్ఞానసాగరులు, శాంతిసాగరులు అని మీరు అందరికీ తెలియజేస్తారు. వారు ఒక్కరే కదా! మరి వారిని సర్వవ్యాపి అని ఎలా చెప్పగలరు? కాని ఏమీ అర్థం చేసుకోరు. అంతేకాకుండా మీరు ఆచరించినట్లయితే ఎందుకు? అని ఎవ్వరూ ప్రశ్నించే సాహసము కూడా చేయరు. అలా కానిచో శివజయంతిని జరుపుకుంటున్నారు. మహిమ గానము చేయబడ్తూ ఉంటే తప్పకుండా ఎవరో ఉండి వెళ్లారనే కదా అని అడగాలి. చాలామంది భక్తులున్నారు. ఒకవేళ ప్రభుత్వము వారు అంగీకరించకపోతే భక్తులు, సాధువులు, గురువుల స్టాంపులు కూడా తయారు చేయరు. ప్రభుత్వమెలా ఉందో, ప్రజలు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి జీవనగాథ కూడా బాగా తెలిసింది. మీకు ఎంతటి నషా ఉంటుందో అంత ఇంకెవ్వరికీ ఉండదు. శివజయంతి వజ్ర తుల్యమైనదని మిగిలిన జయంతులన్నీ గవ్వ తుల్యమైనవని మీరే అంటారు. తండ్రియే వచ్చి గవ్వలను వజ్ర తుల్యంగా చేస్తారు. శ్రీ కృష్ణుడు కూడా తండ్రి ద్వారా ఇంత ఉన్నతంగా అయ్యాడు. అందువల్లనే వారి జన్మ వజ్ర తుల్యంగా మహిమ చేయబడింది. మొదట గవ్వ తుల్యంగా ఉంటుంది. తర్వాత వజ్ర తుల్యంగా బాబానే తయారుచేశారు. ఈ విషయాలు మనుష్యులకు తెలియదు. వారిని ఈ విధంగా ప్రపంచ రాకుమారునిగా ఎవరు తయారు చేశారు? కనుక ఇది కూడా అర్థము చేయించాలి - కృష్ణ జన్మాష్టమిని జరుపుతారు. మరి పుత్రుడేమో గర్భము నుండే జన్మిస్తాడు కదా! అతడిని గంపలో పెట్టుకొని తీసుకుపోయారు. కృష్ణుడైతే విశ్వరాకుమారుడు. మరి అతనికి భయమెందుకు? అక్కడ కంసుడు మొదలైనవారు ఎక్కడి నుండి వచ్చారు? ఈ విషయాలన్నీ శాస్త్రాలలో వ్రాసేశారు. ఇప్పుడు మీరు బాగా అర్థం చేయించాలి. అర్థం చేయించేందుకు మంచి యుక్తులు కావాలి. అందరూ ఒకే విధంగా చదివించలేరు. యుక్తియుక్తంగా అర్థం చేయించకుంటే ఇంకా డిస్సర్వీస్ జరుగుతుంది.
ఇప్పుడు శివజయంతిని జరుపుతారంటే తప్పకుండా శివుని మహిమనే చేస్తారు. గాంధీ జయంతి నాడు గాంధీగారినే మహిమ చేస్తారు. ఇంకేదీ మనసుకు తోచదు. ఇప్పుడు శివజయంతిని మీరు ఆచరిస్తారు కనుక తప్పకుండా వారి మహిమ, వారి జీవనగాథ లేక జీవనచరిత్ర కూడా ఉంటుంది. మీరు ఆ రోజు వారి జీవనచరిత్రనే కూర్చుని వినిపించండి. తండ్రి చెప్తున్నారు - మనుష్యులు శివజయంతి ఎలా ప్రారంభమయ్యిందని కూడా ప్రశ్నించరు. దాని వర్ణన ఏమాత్రం లేదు. వారి మహిమ అయితే అపారంగా చేయబడ్తుంది. శివబాబాను భోళానాథుడు అని చాలా మహిమ చేస్తారు. వారు భోళా భండారీ. వారు శివ-శంరులని అంటారు. శంకరుడినే భోలానాథుడని భావిస్తారు. వాస్తవానికి భోళానాథుడు శంకరుడు కాదు. శంరుడు కనులు తెరవగానే వినాశనము జరిగిందని చెప్తారు. ఉమ్మెత్త(ధత్తూరా) తినేవారు, వారినెలా భోళానాథుడని అనగలరు? మహిమ అయితే ఒక్కరిదే జరుగుతుంది. మీరు శివుని మందిరములోకి వెళ్లి అర్థము చేయించాలి. అక్కడికి చాలామంది వస్తారు. కనుక శివుని జీవన చరిత్రను వినిపించాలి. భోళాభండారీ శివబాబా అని అంటారు. ఇప్పుడు శివుడు మరియు శంకరుల భేదమును కూడా మీరే తెలిపించారు. శివుని మందిరములో శివుని పూజ జరుగుతుంది. కనుక అక్కడికి వెళ్లి మీరు శివుని జీవనకథను తెలియజేయాలి. జీవనకథ అను పదమును వింటూనే శివుని జీవన కథనెలా వినిపిస్తారని ఎవరికైనా ఒక్కసారిగా తల తిరిగిపోతుంది. కనుక మనుష్యులు ఆశ్చర్యకరమైన విషయాలని భావించి చాలామంది వస్తారు. ఆహ్వానాన్ని అందుకొని వచ్చిన వారికి మేము నిరాకార పరమపిత పరమాత్మ జీవనకథను తెలియజేస్తామని చెప్పండి. గాంధీ మొదలైనవారి జీవనగాథను కూడా వింటారు కదా. ఇప్పుడు మీరు శివుని మహిమ చేస్తారు. దాని వలన మనుష్యుల బుద్ధి నుండి సర్వవ్యాపి విషయమే ఎగిరిపోతుంది. ఒకరి మహిమ మరొకరితో కలవదు. ఈ మండపాలు మొదలైనవేవైతే తయారుచేస్తారో లేక ప్రదర్శనీ జరుపుతారో, అవేమీ శివుని మందిరాలైతే కాదు. సత్య-సత్యమైన శివుని మందిరము వాస్తవానికి ఇదే అని మీకు తెలుసు. ఇక్కడ రచయిత కూర్చొని స్వయం రచయిత రచనల ఆది-మధ్య-అంత్యముల రహస్యము తెలియజేస్తారని మీరు వ్రాయవచ్చు. రచయిత జీవనకథను, రచన ఆది-మధ్య-అంత్యముల రహస్యమును లేదా చరిత్రను వినిపిస్తామని హిందీ-ఇంగ్లీషులలో కూడా వ్రాయండి. గొప్ప-గొప్పవారి వద్దకు వెళ్ళినట్లయితే పరమపిత పరమాత్మ జీవనకథను తెలియజేస్తున్న వీరెవరు అని వారు ఆశ్చర్యపడ్తారు. కేవలం రచన కొరకు మాత్రమే తెలియజేసినట్లయితే ప్రళయము జరిగిందని తర్వాత నూతన రచన రచింపబడిందని వారు అర్థం చేసుకుంటారు. కానీ అలా కాదు. తండ్రి వచ్చి పతితులను పావనంగా చేస్తారని మీరు అర్థం చేయించినట్లయితే మనుష్యులు ఆశ్చర్యపడ్తారు. శివుని మందిరాలకు కూడా చాలామంది వస్తారు. హాలు గాని లేక మండపము గాని పెద్దదిగా ఉండాలి. భలే మీరు ప్రభాత సమయంలో తిరిగేందుకు(ప్రభాత్ ఫేరీ) వెళ్ళినా అందులో కూడా వారికి ఈ లక్ష్మీనారాయణుల రాజ్యమును ఎవరు స్థాపన చేశారో అర్థం చేయించాలి. నిరాకార శివబాబా ఎవరైతే సర్వాత్మల తండ్రి అయినారో వారే వచ్చి రాజయోగమును నేర్పిస్తారని చెప్పాలి. ఎలా శివుని మందిరాలలోనికి వెళ్లి ఎలా సర్వీసు చెయ్యాలో విచార సాగర మథనము చేయాలి. శివుని మందిరాలలో ఉదయాన్నే పూజ చేస్తారు. గంటలు మొదలైనవి కూడా ఉదయాన్నే మ్రోగుతాయి. శివబాబా కూడా ప్రభాత సమయములోనే వస్తారు. అర్ధరాత్రి అని అనరు. ఆ సమయములో మీరు జ్ఞానమును కూడా వినిపించలేరు. ఎందుకంటే మనుష్యులు నిదురిస్తూ ఉంటారు. రాత్రి సమయములో మనుష్యులకు తీరిక ఉంటుంది. లైట్లు మొదలైనవి కూడా వెలుగుతాయి. ప్రకాశము కూడా బాగుండునట్లు చేయాలి. శివబాబా వచ్చి ఆత్మలైన మిమ్ములను మేల్కొల్పుతారు. ఇదే సత్యమైన దీపావళి. ప్రతి ఒక్కరి ఇంటి దీపాలు వెలుగుతాయి అనగా ఆత్మ జ్యోతి వెలుగుతుంది. వారైతే ఇంటిలో స్థూల దీపాలు వెలిగిస్తారు. కానీ వాస్తవానికి నిజమైన దీపావళి అర్థము ఇదే. కొందరి కొందరి దీపాలు వెలగనే వెలగవు. మీ దీపాలు ఎలా వెలుగుతున్నాయో మీకు తెలుసు. ఎవరైనా చనిపోతే అంధకారము కారాదని దీపాలు వెలిగిస్తారు. కాని మొదట ఆత్మ దీపమును వెలిగించినప్పుడే కదా అంధకారము కాకుండా ఉండేది. లేకుంటే మనుష్యులు గాడాంధకారములో ఉన్నారు. ఆత్మ అయితే ఒక సెకండులో ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఇందులో అంధకారము మొదలైనవాటి విషయమేదీ లేదు. ఇది భక్తిమార్గపు పద్ధతి. నెయ్యి సమాప్తమైతే దీపము ఆరిపోతుంది. అంధకారము అంటే ఏమిటో కూడా అర్థము చేసుకోరు. పిత్రు భోజనాలు మొదలైనవి తినిపించుటకు అర్థమేమిటో కూడా తెలియదు. ఇంతకుముందు ఆత్మలను పిలిచేవారు. ఏమైనా అడిగేవారు. ఈ విధానము ఇప్పుడంతగా నడవడం లేదు. ఇక్కడకు కూడా వస్తాయి. కొన్ని కొన్ని సమయాలలో ఏమైనా మాట్లాడ్తాయి. మీరు సుఖంగా ఉన్నారా? అని ప్రశ్నిస్తే, అవును అని అంటారు. ఇక్కడ నుండి ఎవరు వెళ్తారో వారు మంచి ఇంటిలోనే జన్మ తీసుకుంటారు. తప్పకుండా అజ్ఞానుల ఇంటిలోనే జన్మ తీసుకుంటారు. జ్ఞానుల ఇంటిలో అయితే జన్మ తీసుకోరు కదా. ఎందుకంటే జ్ఞానీ అనగా బ్రాహ్మణులు. వికారాలలోకి వెళ్లలేరు. వారు పవిత్రంగా ఉంటారు. అయితే వెళ్లి మంచి సుఖంగా ఉండే ఇళ్ళలోనే జన్మ తీసుకుంటారు. ఎలాంటి అవస్థ ఉంటుందో అలాంటి జన్మనే పొందుతారని వివేకము కూడా తెలియజేస్తుంది. ఆ తర్వాత అక్కడ తమ ప్రభావాన్ని చూపిస్తారు. భలే శరీరము చిన్నదిగా ఉంటుంది. కనుక ఏమీ మాట్లాడలేరు. కొంచెం పెద్దగా అవుతూనే జ్ఞాన ప్రభావాన్ని తప్పకుండా చూపిస్తారు. అదెలా అంటే ఎవరైనా శాస్త్రాల సంస్కారాన్ని తీసుకెళ్లినట్లయితే వారు బాల్యావస్థలోనే అదే వ్యాపారములో(శాస్త్రాధ్యయనము) నిమగ్నమైపోతారు. ఇక్కడ నుండి కూడా జ్ఞానమును తీసుకు వెళ్ళినట్లయితే తప్పకుండా వారి మహిమ వెలువడుతుంది.
మీరు శివజయంతిని జరుపుకుంటారు. వారు ఏ మాత్రము అర్థం చేసుకోలేరు. ఒకవేళ వారు సర్వవ్యాపి అయితే జయంతి ఎలా జరుపుతారు? అని ప్రశ్నించాలి. ఇప్పుడు పిల్లలైన మీరు చదువుకుంటున్నారు. వారు తండ్రి, టీచరు, సద్గురువు కూడా అని మీకు తెలుసు. బాబా అర్థం చేయించారు - సిక్కులు కూడా సత్ శ్రీ అకాల్ అని అంటారు. ఇప్పుడు వాస్తవానికి ఆత్మలన్నీ అకాలమూర్తులే. అయితే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు. అందుకే జనన-మరణాలు అని అంటారు. ఆత్మ అయితే అదే. ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది. కల్పము ఎప్పుడు పూర్తవుతుందో అప్పుడు వారే స్వయంగా వచ్చి తానెవరో, ఏ విధంగా ఇతనిలో ప్రవేశిస్తారో తెలియజేస్తారు. తద్వారా మీరే అర్థం చేసుకుంటారు. ఇంతకు ముందు మీకు తెలియదు. పరమాత్మ ప్రవేశత జరుగుతుంది. అయితే అది ఏ విధంగా, ఎప్పుడు జరుగుతుంది? కొంచెం కూడా తెలియదు. రోజురోజుకు ఈ విషయాలు మీ బుద్ధిలోకి వస్తుంటాయి. కొత్త కొత్త విషయాలు మీరు వింటూ ఉంటారు. ఇంతకుముందు ఇద్దరు తండ్రుల రహస్యము అర్థం చేయించేవారు కాదు. ఎందుకంటే మీరు చిన్న పిల్లల వలె ఉండేవారు. ఇప్పుడు కూడా బాబా! మేము మీకు రెండు రోజుల బిడ్డను అని లేదా ఇన్ని రోజుల బిడ్డను అని చాలామంది చెప్తూ ఉంటారు. ఏమేమి జరుగుతుందో అది కల్పక్రితము వలె జరుగుతుంది అని భావిస్తారు. ఇందులో గొప్ప జ్ఞానముంది. దీనిని అర్థం చేసుకోవడంలో కూడా సమయము పడ్తుంది. జన్మ తీసుకొని మళ్లీ మరణిస్తారు కూడా (జ్ఞాన మార్గము నుండి వెళ్ళిపోతారు). రెండు లేదా 8 మాసాల వారిగా అయ్యి మళ్లీ మరణిస్తారు. మీ వద్దకు వస్తారు. ఇది రైటు అని చెప్తారు. వారు మన తండ్రి. మనము వారి సంతానమని చెప్తే అవును-అవును అని అంటూ ఉంటారు. చాలా ప్రభావితులైనారని పిల్లలు వ్రాస్తారు కూడా. మళ్లీ బయటకు వెళ్తూనే సమాప్తము, మరణిస్తారు. తర్వాత రానే రారు. అప్పుడేమవుతుంది? చివర్లో వచ్చి రిఫ్రెష్ అయినా అవుతారు లేక ప్రజలలోకి అయినా వెళ్లిపోతారు. ఈ విషయాలన్నీ అర్థం చేయించాలి. శివజయంతిని మనము ఎలా జరుపుకుంటాము? శివబాబా సద్గతినెలా ఇస్తారు? శివబాబా స్వర్గ కానుకను తీసుకొస్తారు. నేను మీకు రాజయోగమును నేర్పిస్తానని స్వయంగా చెప్తారు. విశ్వాధికారులుగా తయారుచేస్తాను. తండ్ర్రి స్వర్గ రచయిత. కనుక తప్పకుండా స్వర్గానికే యజమానులుగా తయారుచేస్తారు. మేము వారి జీవనగాథను తెలియజేస్తాము. వారు స్వర్గస్థాపన ఎలా చేస్తారో, రాజయోగమును ఎలా నేర్పిస్తారో వచ్చి నేర్చుకోండి. తండ్రి ఎలా అర్థం చేయిస్తారో అలా పిల్లలు అర్థము చేయించలేరా? ఇందులో చాలా బాగా అర్థము చేయించేవారు కావాలి. శివుని మందిరాలలో శివరాత్రి చాలా బాగా జరుపుతూ ఉంటారు. అక్కడకు వెళ్లి అర్థం చేయించాలి. లక్ష్మీనారాయణుల మందిరాలలో ఒకవేళ శివుని జీవనగాథను వినిపించినట్లయితే కొంతమందికి ఇష్టముండదు. వారి ఆలోచనకు తట్టదు. తర్వాత వారికి మంచిగా బుద్ధిలో కూర్చోబెట్టాల్సి వస్తుంది. లక్ష్మీనారాయణుల మందిరాలకు చాలామంది వస్తారు. వారికి లక్ష్మీనారాయణుల, రాధా-కృష్ణుల రహస్యాలను అర్థము చేయించవచ్చు. వారికి వేరు - వేరు మందిరాలు ఉండరాదు. కృష్ణజయంతి నాడు మీరు కృష్ణుని మందిరాలలోకి వెళ్లి అర్థము చేయిస్తారు. కృష్ణుడే సుందరంగా, కృష్ణుడే నల్లగా అవుతాడని ఎందుకు మహిమ చేస్తారు? గ్రామములోని చిన్నబాలునిగా ఉండేవాడని అంటారు. గ్రామములో అయితే గోవులను, మేకలను మేపుకుంటూ ఉంటాడు కదా. నేను కూడా గ్రామములోని వానిగా ఉండేవాడినని ఈ బాబా కూడా అనుభవము చేస్తాడు. టోపి ఉండేది కాదు. చెప్పులు ఉండేవి కావు. నేను ఎలా ఉండేవాడిని! అయితే బాబా వచ్చి నాలో ప్రవేశించారని ఇప్పుడు స్మృతి కలిగింది. శివబాబాను స్మృతి చేయమని, వారే సద్గతిదాత అనే ఈ తండ్రి లక్ష్యము అందరికీ లభించాలి. మీరు రామచంద్రుని జీవనకథను కూడా అర్థం చేయించగలరు. ఎప్పటి నుండి వారి రాజ్యము ప్రారంభమయ్యింది? ఎన్ని సంవత్సరములు గడిచింది? ఇలాంటి ఆలోచనలు నడవాలి. శివుని మందిరాలలో శివుని జీవనగాథను వినిపించాల్సి ఉంటుంది. లక్ష్మీనారాయణుల మందిరాలలో లక్ష్మీనారాయణులను మహిమ చేయాల్సి ఉంటుంది. రాముని మందిరములోకి వెళ్తే రాముని జీవనగాథను వినిపించాలి. ఇప్పుడు మీరు దేవీ దేవతా ధర్మస్థాపన చేయు పురుషార్థము చేస్తున్నారు. హిందూ ధర్మమునైతే ఎవ్వరూ స్థాపన చేయలేదు. అయితే హిందూ అనేది ఏ ధర్మమూ కాదు - ఈ విషయము నేరుగా చెప్పినట్లయితే వారు కొట్లాటకు వస్తారు. వీరు క్రైస్తవులని భావిస్తారు. మేము ఆది సనాతన దేవీ దేవతా ధర్మమునకు చెందినవారమని దానినే ఈ రోజుల్లో హిందూ ధర్మమని అంటున్నారని మీరు వారికి చెప్పండి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. శివజయంతిని చాలా వైభవంగా జరపండి. శివబాబా మందిరాలలో శివుని మరియు లక్ష్మీనారాయణుల మందిరాలలో లక్ష్మీనారాయణుల మరియు రాధా-కృష్ణుల బయోగ్రఫీ(జీవనగాథ) లను వినిపించండి. సర్వులకు యుక్తియుక్తంగా తెలియజేయండి.
2. అజ్ఞాన అంధకారము నుండి రక్షించబడేందుకు ఆత్మ రూపి దీపమును జ్ఞానమనే నేతితో సదా ప్రజ్వలితము చేసి ఉంచుకోవాలి. ఇతరులను కూడా అజ్ఞాన అంధకారము నుండి వెలికి తీయాలి.
వరదానము :-
'' శ్రేష్ఠ స్మృతి ద్వారా శ్రేష్ఠ స్థితి మరియు శ్రేష్ఠ వాయుమండలాన్ని తయారుచేసే సర్వుల సహయోగీ భవ ''
యోగమంటే శ్రేష్ఠ స్మృతిలో ఉండుట. నేను శ్రేష్ఠమైన ఆత్మను, శ్రేష్ఠమైన తండ్రి సంతానాన్ని - ఇటువంటి స్మృతి ఉంటే స్థితి శ్రేష్ఠంగా అయిపోతుంది. శ్రేష్ఠ స్థితి ద్వారా స్వతహాగా శ్రేష్ఠ వాయుమండలం తయారవుతుంది. అది అనేక ఆత్మలను మీ వైపు ఆకర్షిస్తుంది. ఎక్కడైతే ఆత్మలైన మీరు యోగములో ఉండి కర్మలు చేస్తారో అక్కడి వాతావరణము, వాయుమండలము ఇతరులకు కూడా సహయోగమిస్తాయి. ఇటువంటి సహయోగి ఆత్మలు తండ్రికి మరియు విశ్వానికి ప్రియంగా అవుతారు.
స్లోగన్ :-
'' అచల స్థితి అను ఆసనం పై కూర్చుంటేనే రాజ్య సింహాసనం లభిస్తుంది ''