07-01-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - మనుష్యులు శారీరిక ఉన్నతి కొరకు ఏర్పాట్లు రచిస్తారు. ఆత్మ ఉన్నతికి లేక ఆత్మ వికాసానికి సాధనము ఒక్క తండ్రి మాత్రమే తెలియజేస్తారు. ఈ బాధ్యత తండ్రిదే.''

ప్రశ్న :-

సదా పిల్లలలో ఉన్నతి జరుగుతూ ఉండేందుకు తండ్రి ఏ ఏ శ్రీమతమును ఇస్తారు?

జవాబు :-

పిల్లలారా! మీ ఉన్నతి కొరకు 1. సదా స్మృతియాత్రలో ఉండండి. స్మృతి ద్వారానే ఆత్మలోని త్రుప్పు(మైల) వదిలిపోతుంది. 2. ఎప్పుడూ గడిచిపోయిన వాటిని గుర్తు చేసుకోకండి. భవిష్యత్తు కొరకు ఎటువంటి ఆశలు ఉంచుకోకండి. 3. శరీర నిర్వహణార్థము కర్మలు భలే చేయండి కాని ఎంత సమయము లభిస్తుందో దానిని వ్యర్థంగా గడపకండి. తండ్రి స్మృతిలో సమయాన్ని సఫలము చేయండి. 4. కనీసము 8 గంటలు ఈశ్వరీయ సేవ చేసినట్లైతే మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది.

ఓంశాంతి.

ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు లేదా ఆత్మలకు అర్థము చేయిస్తున్నారు. ఆత్మల బాధ్యత పరమాత్మదేనని మనుష్యులంటారు. వారే సర్వాత్మల ఉన్నతికి, మనశ్శాంతికి మార్గాన్ని తెలియజేయగలరు. ఆత్మ భృకుటి మధ్యలో అన్నింటికంటే అతీతంగా ఉంటుంది. తరచుగా రోగాల పాలయ్యేది శరీరమే. ఇక్కడ భృకుటిలో రోగము రాదు. భలే తల నొప్పి వస్తుంది కాని ఆత్మకు సింహాసనమైన భృకుటిలో ఏ కష్టమూ కలుగదు. ఎందుకంటే ఆ సింహాసనము పై ఆత్మ విరాజమానమై ఉంటుంది. ఆత్మకు ఉన్నతిని లేక శాంతినిచ్చే సర్జన్‌ ఒక్క పరమాత్మయే. ఆత్మ ఉన్నతి అయినప్పుడే ఆత్మకు ఆరోగ్య-ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి. శరీరము కొరకు ఎన్ని చేసినా దాని ద్వారా ఏ విధమైన ఉన్నతి జరగదు. శరీరములో ఏదో కొంత గడబిడ జరుగుతూనే ఉంటుంది. ఆత్మోన్నతిని తండ్రి తప్ప మరెవ్వరూ చేయలేరు. ప్రపంచములోని వారందరూ శరీర ఉన్నతి కొరకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. కాని ఆత్మ వికాసము గాని లేక ఆత్మోన్నతి గాని జరగదు. దానిని తండ్రియే నేర్పిస్తారు. ఆధారమంతా ఆత్మ పైనే ఉంది. ఆత్మనే 16 కళా సంపూర్ణంగా అవుతుంది మరలా పూర్తి కళాహీనముగా కూడా ఆత్మయే అవుతుంది. 16 కళలు కలిగినదిగా ఎలా అవుతుంది, మళ్లీ కళలు ఏ విధంగా తగ్గుతూ పోతాయనే విషయాన్ని కూడా ఒక్క తండ్రి మాత్రమే అర్థము చేయిస్తారు. తండ్రి చెప్తున్నారు - సత్యయుగములో మీకు చాలా సుఖముండేది. ఆత్మ ఎక్కేకళలో ఉండేది. ఇతర సత్సంగాలలో ఆత్మ ఉన్నతి ఎలా జరుగుతుందనే విషయము గురించి అర్థం చేయించడం జరగదు. వారు శారీరిక నషాలో ఉంటారు. దేహాభిమానములో ఉంటారు. తండ్రి మిమ్ములను దేహీ-అభిమానులుగా చేస్తారు. ఆత్మ ఏదైతే తమోప్రధానంగా అయ్యిందో దానిని సతోప్రధానంగా చేయాలి. ఇక్కడ అన్ని విషయాలు ఆత్మకు సంబంధించినవే. అక్కడ శరీరానికి సంబంధించిన విషయాలుంటాయి. సర్జన్‌ ఒక గుండెను తొలగించి మరొకదానిని పెడ్తారు. గుండెతో ఆత్మకు ఏ విధమైన సంబంధము లేదు. ఆత్మ భృకుటి మధ్యలో ఉంటుంది. దానికి ఆపరేషన్‌ మొదలైనవేవీ జరగవు.

మంచిది. తండ్రి అర్థము చేయిస్తున్నారు - ఆత్మ ఉన్నతి కేవలం ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఆత్మ తమోప్రధానమైనప్పుడు ఆత్మలను ఉన్నతంగా చేసే తండ్రి వస్తారు. వారు లేకుండా ఏ ఆత్మకూ ఎక్కే కళ జరగదు. తండ్రి చెప్తున్నారు - ఈ ఛీ-ఛీ తమోప్రధాన ఆత్మలు నా వద్దకు(పరంధామానికి) రాలేవు. మీ వద్దకు ఎవరైనా వచ్చినప్పుడు - శాంతి ఎలా లభిస్తుంది? లేదా ఆత్మ ఉన్నతి ఏ విధంగా జరుగుతుంది? అని అడుగుతారు. కాని ఆత్మ ఉన్నతి జరిగిన తర్వాత మనము ఎక్కడకు వెళ్తాము. ఏమి జరుగుతుంది? అనే విషయాలు వారికి తెలియవు. పతితుల నుండి పావనంగా తయారు చేయండి, జీవన్ముక్తి ధామములోకి తీసుకెళ్ళండి అని పిలుస్తూ ఉంటారు. మరి ఆత్మలనే తీసుకు వెళ్తారు కదా! శరీరమైతే ఇక్కడే సమాప్తమైపోతుంది కాని ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. ఇది ఈశ్వరీయ మతము. మిగిలినవన్నీ మానవ మతములు. ఈశ్వరీయ మతము ద్వారా ఒక్కసారిగా ఆకాశములోకి ఎక్కిపోతారు(ఉన్నతిని పొందుతారు) - అనగా శా౦తిధామము, సుఖధామములోకి వెళ్తారు. మళ్లీ డ్రామానుసారము క్రిందికి కూడా దిగాల్సిందే. ఆత్మ ఉన్నతిని కలుగజేసేందుకు తండ్రి తప్ప ఏ ఇతర సర్జన్‌ లేడు. ఈ సర్జన్‌ మిమ్ములను మళ్లీ తమ సమానంగా చేస్తారు. కొందరైతే అనేకమందికి ఉన్నతిని బాగా చేస్తారు. కొందరు మధ్య శ్రేణిలోను, కొందరు తృతీయ శ్రేణిలోను ఇతరుల ఉన్నతిని చేస్తారు. ఆత్మల ఉన్నతి కొరకు బాధ్యుడు ఒక్క తండ్రి మాత్రమే. ప్రపంచములో ఇది ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు - ఈ సాధువులు మొదలైన వారిని కూడా ఉద్ధరించేందుకు నేను వస్తాను. మొట్టమొదట ఆత్మ వచ్చినప్పుడు పవిత్రంగానే వస్తుంది. ఇప్పుడు తండ్రి సర్వుల ఉన్నతి కొరకు వచ్చారు. నెంబరువారు పురుషార్థానుసారము మీకు ఎంత ఉన్నతి అవుతోందో చూసుకోండి. అక్కడ మీకు శరీరము కూడా ఫస్ట్‌క్లాస్‌ది లభిస్తుంది. తండ్రి అవినాశి సర్జన్‌. వారే వచ్చి మీకు ఉన్నతిని కలుగజేస్తారు. అప్పుడు మీరు సర్వోన్నతమైన మీ మధురమైన ఇంటిలోకి వెళ్లిపోతారు. వారు చంద్రుని పైకి వెళ్తారు. అవినాశి సర్జన్‌ మీకు ఉన్నతిని ప్రాప్తింపజేసేందుకు చెప్తున్నారు - ''నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లైతే వికర్మలు వినాశనమౌతాయి.'' తండ్రి విశ్వములోని పిల్లలందరినీ ముక్తులుగా చేస్తారు. మీరు స్వర్గములోకి వెళ్లినప్పుడు మిగిలినవారంతా శాంతిధామములో ఉంటారు. తండ్రి ఎటువంటి అద్భుతమైన కార్యమును చేస్తున్నారు! అద్భుతము తండ్రిదే! అందుకే - మీ గతి, మతి మీకే తెలుసు(తుమ్హారీ గత్‌ మత్‌ తుమ్‌ హీ జానో) అని అంటారు. మతము ఆత్మలోనే ఉంటుంది. ఆత్మ (శరీరము నుండి) వేరైనట్లైతే మతము లభించదు. ఈశ్వరీయ మతము ద్వారా ఉన్నతమయ్యే కళ, మానవ మతము ద్వారా దిగే కళ - ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇప్పుడే స్వర్గము తయారైపోయిందని వారనుకుంటారు. ఇది నరకమా లేక స్వర్గమా? అనేది పోను పోను తెలుస్తుంది. భాషను గురించి ఎన్నో గొడవలు జరుగుతాయి. దు:ఖితులుగా ఉన్నారు కదా! స్వర్గములో దు:ఖము ఉండదు. భూకంపాలు కూడా సంభవించవు. ఇప్పుడు పురాతన ప్రపంచ వినాశనము జరగాలి. తర్వాత స్వర్గము తయారైపోతుంది. తర్వాత అర్ధకల్పము పాటు వారు(తండ్రి) కూడా గుప్తమైపోతారు. ద్వారక సముద్ర గర్భములోకి వెళ్ళిపోయిందని అంటారు. బంగారు వస్తువులన్నీ క్రిందకు వెళ్లిపోయాని అంటారు. కనుక తప్పకుండా భూకంపాల ద్వారానే క్రిందికి వెళ్తాయి. సముద్రాన్నేమీ త్రవ్వి వెలికి తీయరు కదా! భూమినైతే తవ్వుతారు. అలా తవ్వినప్పుడు సంపద లభిస్తుంది.

తండ్రి చెప్తున్నారు - నేను అందరికీ ఉపకారము చేస్తాను. నాకు అందరూ అపకారము చేస్తారు, నిందిస్తారు. నేనైతే అపకారులకు కూడా ఉపకారమే చేస్తాను. మరి నాకు తప్పకుండా మహిమ జరగాలి కదా. భక్తిమార్గములో నాకు ఎంత గౌరవముందో చూడండి! పిల్లలైన మీరు కూడా తండ్రిని ఎంతో మహిమ చేస్తారు. (శివబాబా) చిత్రములో 32 గుణాలు చూపించారు. ఇప్పుడు మీరు కూడా తండ్రి సమానముగా గుణవంతులుగా అవుచున్నారు. మరి అందుకు ఎంతగా పురుషార్థము చేయాలి. సమయాన్ని వృథా చేయరాదు. అత్యంత ఉన్నతమైన తండ్రి చదివిస్తున్నారు కనుక తప్పకుండా ప్రతి రోజూ చదవాలి. వీరు అవినాశి తండ్రి, టీచరు కూడా అయినారు. చివర్లో వచ్చేవారు పురాతనమైన వారి కంటే తీక్షణంగా వెళ్తున్నారు. ఇప్పుడు ప్రపంచమంతటికీ తండ్రి ద్వారా ఉన్నతి జరుగుతోంది. శ్రీకృష్ణుని కూడా గుణవంతునిగా చేసేవారు తండ్రియే. వారు అందరికీ ఇచ్చేవారు. మిగిలిన వారంతా తీసుకునేవారు. ఇప్పుడు రాజ్య పరివారము నంబరువారు పురుషార్థానుసారంగా తయారవుతోంది. అనంతమైన తండ్రి ఎంత మధురమైనవారో, ఎంత ప్రియమైనవారో చూడండి! సర్వోన్నతమైన తండ్రి ద్వారా ఇప్పుడు అందరికి ఉన్నతి జరుగుతోంది. మిగిలినవారంతా మెట్లు దిగవలసిందే. తండ్రిదే అద్భుతము! భలే తినండి - త్రాగండి అన్నీ చేయండి. కేవలం తండ్రి గుణగానము చేయండి. బాబా స్మృతిలో ఉండడం ద్వారా భోజనము తినలేమని కాదు. రాత్రిపూట చాలా తీరిక సమయం లభిస్తుంది. 8 గంటల సమయమైతే లభిస్తుంది. తండ్రి చెప్తున్నారు - కనీసం 8 గంటలైనా ఈ గవర్నమెంటు(ఈశ్వరీయ ప్రభుత్వపు) సేవ చేయండి. ఎవరు వచ్చినా వారికి ఆత్మోన్నతి కొరకు మార్గాన్ని తెలియజేయండి. జీవన్ముక్తి అనగా విశ్వానికి అధిపతులు, ముక్తి అనగా బ్రహ్మాండానికి అధిపతులు. ఇది అర్థము చేయించడం సులభము కదా! కాని అదృష్టములో లేకుంటే పురుషార్థము ఏమి చేయగలరు?

తండ్రి అర్థము చేయిస్తున్నారు - తండ్రిని స్మృతి చేయకుండా ఆత్మలోని త్రుప్పు తొలగిపోదు. భలే జ్ఞానాన్ని రోజంతా వినిపించినా, ఆత్మ ఉన్నతి కొరకు స్మృతి చేయడం తప్ప వేరే ఉపాయమేదీ లేదు. తండ్రి పిల్లలకు చాలా ప్రేమతో ప్రతిరోజూ అర్థము చేయిస్తారు. కాని తమ ఉన్నతిని చేసుకుంటున్నారా, లేదా? అని ప్రతి ఒక్కరూ స్వయమే అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం మీరు మాత్రమే కాదు, అన్ని సేవాకేంద్రాల పిల్లలు వింటారు. ఇక్కడ టేప్‌రికార్డు పెడ్తారు. ఇది సేవ చేసేందుకు తనలో శబ్ధాన్ని నింపుకొని వెళ్తుంది. ఇది చాలా సేవ చేస్తుంది. శివబాబా మురళిని మేము వింటున్నామని పిల్లలు భావిస్తారు. మీ ద్వారా వినడం పరోక్షంగా అవుతుంది. తర్వాత వారు ఇక్కడికి ప్రత్యక్షంగా వినేందుకు వస్తారు. తర్వాత శివబాబా బ్రహ్మ నోటి ద్వారా వినిపిస్తారు లేదా అతని నోటి ద్వారా జ్ఞానామృతమునిస్తారు. ఈ సమయములో ప్రపంచమంతా తమోప్రధానముగా అయిపోయింది. కనుక ప్రపంచము పై ఇప్పుడు జ్ఞాన వర్షము కురవాలి. నీటి వర్షము అయితే చాలా కురుస్తుంది. ఆ నీటి ద్వారా ఎవ్వరూ పావనంగా అవ్వలేరు. ఇదంతా జ్ఞానానికి సంబంధించిన విషయము.

తండ్రి చెప్తున్నారు - ఇప్పుడు మేల్కోండి. నేను మిమ్ములను శాంతిధామానికి తీసుకెళ్తాను. ఇందులోనే ఆత్మ ఉన్నతి కూడా ఉంది. మిగిలినవన్నీ శారీరిక విషయాలు. ఆత్మిక విషయాలను కేవలం మీరు మాత్రమే వింటారు. మీరు మాత్రమే పదమాపతులుగా, భాగ్యశాలురుగా అవుతారు. తండ్రి పేదలపెన్నిధి. పేదలే వింటారు. అందుకే తండ్రి చెప్తున్నారు - అహల్యలు, వేశ్యలకు కూడా జ్ఞానాన్ని అర్థం చేయించండి. సత్యయుగంలో ఇటువంటి విషయాలే ఉండవు. అది అనంతమైన శివాలయము. ఇప్పుడిది అనంతమైన వేశ్యాలయము. పూర్తి తమోప్రధానంగా ఉన్నారు. దీనిలో ఇక ఎక్కువ మార్జిన్‌ (సమయము) లేదు. ఇప్పుడు ఈ పతిత ప్రపంచము పరివర్తన చెందాలి. భారతదేశములో రామరాజ్యము మరియు రావణ రాజ్యము రెండూ ఉంటాయి. అనేక ధర్మాలుగా అయినప్పుడు అశాంతి కలుగుతుంది. యుద్ధాలైతే జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడైతే ఇంకా తీక్షణంగా యుద్ధము జరుగుతుంది. చాలా పెద్ద యుద్ధము జరిగి తర్వాత ఆగిపోతుంది. ఎందుకంటే రాజ్యస్థాపన కూడా జరగాలి, కర్మాతీత అవస్థ కూడా రావాలి. ఇప్పుడైతే ఎవ్వరూ ఆ విధంగా(కర్మాతీత స్థితిని పొందినామని) చెప్పలేరు. ఆ అవస్థ వచ్చినట్లైతే చదువు పూర్తి అయిపోతుంది. తర్వాత మళ్లీ ట్రాన్స్‌ఫర్‌(బదిలీ) అవుతారు. అయితే ఇది తమ పురుషార్థమనుసారంగానే జరుగుతుంది. ఈ ఎండిపోయిన వెదురు అడవికి మంటలు అంటుకోనున్నాయి. త్వరత్వరగా వినాశనం జరిగిపోతుంది. దానినే అనవసరమైన రక్తపాతపు ఆట (ఖూనీ నాహేక్‌ ఖేల్‌) అని అంటారు. అకారణంగా అందరూ మరణిస్తారు. రక్తపు నదులు ప్రవహిస్తాయి. తర్వాత నేతి నదులు, క్షీర(పాల) నదులు ప్రవహిస్తాయి. హాహాకారాల తర్వాత జయ జయ ధ్వనులు జరుగుతాయి. మిగిలినవారంతా అజ్ఞాన నిద్రలో నిదురిస్తూ-నిదురిస్తూ అంతమైపోతారు. చాలా యుక్తిగా స్థాపన జరుగుతుంది. విఘ్నాలు కూడా వస్తాయి. అత్యాచారాలు కూడా జరుగుతాయి. ఇప్పుడు మాతల ద్వారానే స్వర్గ ద్వారము తెరచుకుంటుంది. పురుషులు కూడా చాలామంది ఉన్నారు. కాని మాతలు జన్మనిస్తారు కనుక వారికి పురుషుల కంటే అధిక ఫలము లభిస్తుంది. స్వర్గములోనికైతే నంబరువారుగా అందరూ వెళ్తారు - కొందరు వరుసగా రెండు జన్మలు పురుషునిగా కూడా అవ్వవచ్చు. లెక్కాచారమంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. అదే జరుగుతూ ఉంటుంది. ఆత్మ ఉన్నతి జరగడం ద్వారా ఎంతో తేడా ఏర్పడ్తుంది. కొందరైతే ఒక్కసారిగా అత్యంత ఉన్నతంగా అయిపోతారు. కొందరైతే పూర్తి క్రింది స్థాయికి వెళ్లిపోతారు. రాజులెక్కడ! ప్రజలెక్కడ!

అత్యంత మధురమైన పిల్లలకు తండ్రి ఇప్పుడు పురుషార్థము చేయండి అని అర్థము చేయిస్తున్నారు. యోగము ద్వారా పవిత్రమైనప్పుడే ధారణ జరుగుతుంది. లక్ష్యము చాలా ఉన్నతమైనది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేయాలి. ఆత్మకు పరమాత్మతో ప్రేమ ఉంది కదా. ఇది ఆత్మిక ప్రేమ. దీని ద్వారా ఆత్మోన్నతి జరుగుతుంది. శారీరిక ప్రేమ ద్వారా క్రింద పడిపోతారు. అదృష్టములో లేకుంటే పారిపోతారు. యజ్ఞాన్ని చాలా సంభాళన చేయాలి. మాతల ఒక్కొక్క పైసా ద్వారానే యజ్ఞ సేవ జరుగుతోంది. ఇక్కడ పేదలే అక్కడ ధనవంతులుగా అవుతారు. పూర్తి ఆధారమంతా చదువు పైనే ఉంది. ఇప్పుడు మీరు సదా సౌభాగ్యవంతులుగా అవుతారు. ఇది అందరికీ అనుభూతి అవుతుంది. మాలలోని మణిగా అయ్యేవారికి ఎంతో మంచి ఫీలింగ్‌ ఉండాలి. శివబాబాను స్మృతి చేస్తూ, సేవ చేస్తూ ఉంటే చాలా ఉన్నతి జరుగుతుంది. శివబాబా సేవలో శరీరమును కూడా అర్పణ చేయాలి. రోజంతా నషా ఉండడం పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులభము కాదు. మేము ఎంతగా మా ఉన్నతి చేసుకున్నామని స్వయాన్ని చూసుకోవాలి. బాబా చెప్తున్నారు - గడిచిపోయిన వాటిని గుర్తు చేసుకోకండి. భవిష్యత్తు కొరకు ఎలాంటి ఆశలు ఉంచుకోకండి. శరీర నిర్వహణార్థము కర్మలైతే చేయాల్సిందే. ఎంత సమయము లభిస్తుందో, అందులో తండ్రిని స్మృతి చేసినట్లైతే వికర్మలు వినాశనమౌతాయి. బాబా బంధనములో ఉన్న మాతలకు కూడా ఇలా అర్థం చేయిస్తారు - మీరు మీ పతికి చాలా నమ్రతగా, ప్రేమతో అర్థం చేయించాలి. ఎవరైనా కొట్టినారంటే, వారి పై మీరు పుష్పాల వర్షము కురిపించండి. స్వయాన్ని రక్షించుకునేందుకు చాలా యుక్తి కావాలి. కనులు చాలా శీతలంగా ఉండాలి, ఎప్పుడూ చంచలము అవ్వరాదు. దీనిని గురించి అంగదుని ఉదాహరణ కూడా ఉంది. అతడు పూర్తి స్థిరంగా ఉండేవాడు. మీరంతా మహావీరులు. ఏదైతే గడిచిపోయిందో దానిని స్మృతి చేయరాదు. సదా హర్షితంగా ఉండాలి. డ్రామా పై స్థిరంగా ఉండాలి. తండ్రి స్వయంగా చెప్తున్నారు - నేను కూడా డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నాను. అంతేకాని ఇంకే విషయమూ లేదు. కృష్ణుడు స్వదర్శన చక్రముతో సంహరించారని వ్రాశారు. ఇవన్నీ కథలు. తండ్రి హింస చేయలేరు. వీరు తండ్రి మరియు టీచరు కూడా అయినారు. హతమార్చే విషయమే లేదు. ఈ విషయాలన్నీ ఈ సమయానికి చెందినవే. ఒకవైపు లెక్కలేనంత మంది మనుష్యులున్నారు. మరోవైపు మీరున్నారు. ఎవరైతే రావలసి ఉందో వారు వస్తూ ఉంటారు. కల్పక్రితము వలె పదవి పొందుకుంటూ ఉంటారు. ఇందులో చమత్కారము విషయమే లేదు. తండ్రి దయాసాగరులు. దు:ఖహర్త-సుఖకర్త మరి వారు దు:ఖమునెలా ఇస్తారు? అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. కనీసము 8 గంటలు ఈశ్వరీయ ప్రభుత్వ సేవను చేసి తమ సమయాన్ని సఫలము చేసుకోవాలి. తండ్రి వలె గుణవంతులుగా అవ్వాలి.

2. గడచినవాటిని గుర్తు చేసుకోరాదు. గడచిన వాటిని వదిలేసి సదా హర్షితంగా ఉండాలి. డ్రామా పై స్థిరంగా ఉండాలి.

వరదానము :-

'' ''నా విజయం నిశ్చయం'' అను నశాలో ఉండి తండ్రి నుండి పదమారెట్లు సహాయాన్ని ప్రాప్తి చేసుకునే మాయాజీత్‌ భవ ''

తండ్రి నుండి పదమారెట్ల సహాయానికి పాత్రులైన పిల్లలు మాయను - ''నీ పని రావడం (దాడి చేయడం), నా పని నీ పై విజయం ప్రాప్తి చేసుకోవడం'' అని సవాలు(ఛాలెంజ్‌) చేస్తారు. వారు పులి రూపంలో వచ్చే మాయను చీమగా భావిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మాయ రాజ్యము సమాప్తమౌతుందని, అనేకసార్లు విజయం పొందిన ఆత్మలమైన మా విజయం 100 శాతం నిశ్చితమని వారికి తెలుసు. ఈ నిశ్చింత నశా తండ్రి నుండి పదమారెట్లు సహాయం పొందేందుకు అధికారాన్ని ప్రాప్తి చేయిస్తుంది. ఈ నశాతో సులభంగా మాయాజీతులుగా అవుతారు.

స్లోగన్‌ :-

''సంకల్పశక్తిని జమ చేసుకొని స్వయం పట్ల లేక విశ్వం పట్ల ఆ శక్తిని ప్రయోగించండి.''

బ్రహ్మబాబా సమానంగా అయ్యేందుకు విశేషమైన పురుషార్థము
బ్రహ్మబాబా సమానంగా మీ కనులు ఆత్మీయతను అనుభవం చేయించాలి, మీ నడవడిక తండ్రి చరిత్రలను (గుణాలను) సాక్షాత్కారము చేయించాలి, మస్తకము, మస్తకమణిని సాక్షాత్కారం చేయించాలి, ఈ అవ్యక్త ముఖము దివ్య అలౌకిక స్థితిలోని ప్రత్యక్ష రూపాన్ని చూపించాలి. అందుకు మీ ఆంతర్ముఖి, అలౌకిక లేక ఆత్మిక స్థితిలో సదాకాలం ఉండే అభ్యాసము చేయండి.