12-01-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - కళ్యాణకారీ తండ్రి పిల్లలైన మీ కర్తవ్యము అందరి కళ్యాణము చేయడం, అందరికి తండ్రి స్మృతిని ఇప్పించడం, జ్ఞానాన్ని దానమివ్వడం.''

ప్రశ్న :-

బాబా ఏ పిల్లలను మహారథులని అంటారు, వారి గుర్తులు ఏవి?

జవాబు :-

ఎవరైతే బాగా చదువుకొని, ఇతరులను చదివిస్తారో, ఎవరి పైన సదా బృహస్పతి దశ ఉందో, ఎవరైతే తమ ఉన్నతి మరియు సర్వుల ఉన్నతి పై సదా ధ్యాస ఉంచుతారో, ఎవరైతే యజ్ఞ సేవలో ఎముకలు అర్పిస్తారో, ఎవరైతే బాబా కార్యంలో సహాయకులుగా ఉంటారో - వారు మహారథులు. ఇటువంటి మహారథి పిల్లలను, వీరు నా సుపుత్రులు అని బాబా అంటారు.

ఓంశాంతి.

ఈ సమయంలో పిల్లలు శివజయంతి కొరకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్డులు మొదలైనవి కూడా అచ్చు వేయిస్తారు. శివబాబా అయితే చాలాసార్లు అర్థం చేయించారు. ముఖ్యమైన విషయం అంతా గీత గురించే. మనుష్యులచే వ్రాయబడిన గీతను చదివి-చదివి అర్ధకల్పము క్రిందికి దిగుతూ వచ్చారు. ఇది కూడా పిల్లలైన మీరు అర్థము చేసుకున్నారు - అర్ధకల్పము పగలు, అర్ధకల్పము రాత్రి. ఇప్పుడు బాబా ఒక టాపిక్‌ ఇస్తారు, ఆ టాపిక్‌ గురించి మథనం చేయాల్సి ఉంటుంది. సోదరీ సోదరులారా! - ఒక్క గీతా శాస్త్రము మాత్రమే జ్ఞానానికి చెందినది, మిగతా శాస్త్రాలన్నీ భక్తికి చెందినవి, వచ్చి అర్థం చేసుకోండి అని మీరు వ్రాయవచ్చు. పురుషోత్తమ సంగమ యుగములో అనంతమైన తండ్రి, పరమపిత పరమాత్మ త్రిమూర్తి శివుడు ఏదైతే వినిపిస్తున్నాడో అదొక్కటే జ్ఞాన శాస్త్రము. ఆ గీతను బ్రహ్మ ద్వారా వినిపిస్తున్నాడు, తద్వారా 21 జన్మలకు సద్గతి జరుగుతుంది అని వ్రాయాలి. జ్ఞాన గీత ద్వారా 21 జన్మలకు వారసత్వం లభిస్తుంది. తర్వాత 63 జన్మలు భక్తి యొక్క గీత ఏదైతే మనుష్యులచే వినిపించబడిందో అది నడుస్తుంది. తండ్రి రాజయోగం నేర్పించి సద్గతి కలుగజేస్తారు. మళ్లీ వినాల్సిన అవసరం ఉండదు. ఈ జ్ఞాన గీత ద్వారా పగలుగా అవుతుంది. 21 జన్మలకు గతి - సద్గతిని పొందే ఈ శాస్త్రాన్ని జ్ఞాన సాగరులైన తండ్రియే వినిపిస్తారు. అనగా నూరు శాతం పవిత్రత, సుఖము, శాంతి కలిగిన అచంచల, అఖండ సత్యయుగ దైవీ స్వరాజ్యము లభిస్తుంది. 21 జన్మలకు ఉన్నతమయ్యే కళ అవుతుంది. మనుష్యులు తయారు చేసిన గీత ద్వారా అవనత(దిగే) కళ అవుతుంది. భక్తి గీత మరియు జ్ఞాన గీతల గురించి చాలా బాగా విచార సాగర మథనం చేయాలి. ఇది మనుష్యులకు తెలియని ముఖ్యమైన విషయం. త్రిమూర్తి శివజయంతి సో శ్రీమత్‌ భగవత్‌ గీతా జయంతి సో సర్వుల సద్గతి భవంతి(సద్గతి జరుగుతుంది) అని మీరు వ్రాస్తారు. శివ జయంతి సో విశ్వంలో శాంతి భవంతి అని కూడా మీరు చెప్పవచ్చు. ఏ పదము పై మొత్తం ఆధారమంతా ఉందో ఆ ముఖ్యమైన పదము చాలా అవసరం. మనుష్యులు మనుష్యులకు సద్గతినివ్వలేరు అని మీరు అందరికీ తెలుపవచ్చు. భగవంతుడు సద్గతినిచ్చేందుకు సంగమయుగంలో వస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ 2-3 పాయింట్లు ముఖ్యమైనవి. శివుని గీతకు మరియు కృష్ణ గీతకు తేడా అయితే ఉండనే ఉంది. త్రిమూర్తి శివ భగవానుని ద్వారా సంగమ యుగంలో గీత వినుట వలన సద్గతి కలుగుతుంది. ఇటువంటి పాయింట్ల గురించి ఎవరైనా విచార సాగర మథనం చేస్తే అప్పుడు ఇతరుల పై కూడా ప్రభావం పడ్తుంది. మనుష్యులు మనుష్యులకు ఎప్పుడూ సద్గతిని కలిగించలేరు. కేవలం ఒక్క త్రిమూర్తి పరమపిత శివుడు, ఎవరైతే టీచరే కాక సద్గురువు కూడా అయ్యారో వారు ఈ పురుషోత్తమ సంగమ యుగంలో అందరి సద్గతి చేస్తున్నారు. కార్డులో కొద్దిగానే వ్రాసి ఉండాలి. కార్డు పైన కలియుగీ గవ్వలాంటి పతిత మనుష్యుల నుండి సత్యయుగీ వజ్రం లాంటి పావన దేవీ దేవతలుగా అయ్యేందుకు ఈశ్వరీయ ఆహ్వానము అని వ్రాయాలి. ఇలా వ్రాయడం ద్వారా మనుష్యులు సంతోషంతో అర్థం చేసుకునేందుకు వస్తారు. సద్గతిదాత అయిన తండ్రి జయంతియే శివ జయంతిగా జరుపబడ్తుంది. అక్షరాలు చాలా స్పష్టంగా ఉండాలి. మనుష్యులు భక్తిమార్గంలో అనేక శాస్త్రాలు చదువుతారు, తల బాదుకుంటారు. ఇక్కడ ఒక్క సెకండులో అనంతమైన తండ్రి ద్వారా ముక్తి- జీవన్ముక్తి లభిస్తుంది. ఎప్పుడైతే తండ్రికి చెందిన వారిగా అయ్యి, వారి నుండి జ్ఞానాన్ని తీసుకుంటారో అప్పుడు తప్పకుండా జీవన్ముక్తి లభిస్తుంది. మొదట ముక్తిలోకి వెళ్ళి, ఎటువంటి పురుషార్థము చేసి ఉంటారో అటువంటి జీవన్ముక్తిలోకి తప్పకుండా వస్తారు. ప్రారంభంలో వచ్చినా లేక చివర్లో వచ్చినా జీవన్ముక్తి తప్పకుండా లభిస్తుంది. మొదట జీవన్ముక్తిలోకి వస్తారు తర్వాత జీవన బంధనంలోకి వెళ్తారు. ఇటువంటి ముఖ్యమైన పాయింట్లు ధారణ చేస్తే కూడా చాలా సేవ చేయగలరు. ఒకవేళ తండ్రిని తెలుసుకుని ఉంటే ఇతరులకు కూడా తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. ఎవరికైనా పరిచయం ఇవ్వకపోతే జ్ఞానం లేనట్లే. అర్థం చేయించబడ్తుంది కాని అదృష్టంలో లేదు. కళ్యాణకారీ తండ్రి పిల్లలైన మీరు ఇతరుల కళ్యాణం చెయ్యాలి. లేకుంటే మేము శివబాబా పిల్లలము అని ఏదో మాట వరసకు మాత్రమే చెప్తారు కాని కళ్యాణం అయితే చేయనే చేయరు అని తండ్రి భావిస్తారు. ధనవంతులు గాని, పేదవారు గాని అందరి కళ్యాణం చేయాలి. మొదట పేదవారే జ్ఞానం తీసుకుంటారు. ఎందుకంటే వారికి తీరిక ఉంటుంది. డ్రామాలో ఇలాగే నిశ్చయింపబడింది. ఒకవేళ ఒక్క షావుకారు వస్తే అతని వెనుక అనేక మంది వచ్చేస్తారు. ఇప్పుడు మహిమ వెలువడితే గుంపులు గుంపులుగా వచ్చేస్తారు.

మీది ఈశ్వరీయ పదవి. మీరు మీ కళ్యాణము, ఇతరుల కళ్యాణము కూడా చేస్తారు. ఎవరైతే తమ కళ్యాణమే చేసుకోరో, వారు ఇతరుల కళ్యాణము కూడా చేయలేరు. తండ్రి అయితే కళ్యాణకారి, సర్వుల సద్గతిదాత. మీరు కూడా సహాయకారులు కదా! అది భక్తిమార్గ దశ అని మీకు తెలుసు. సద్గతి మార్గములోని దశ ఒక్కటే ఉంది. ఎవరైతే బాగా చదువుకొని ఇతరులను చదివిస్తారో వారి పై బృహస్పతి దశ ఉంటుంది. వారిని మహారథులని అంటారు. నేను మహారథినేనా అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. ఫలానా-ఫలానా మాదిరిగా సర్వీస్‌ చేస్తారు. కాలినడక వారు ఎన్నడూ ఎవ్వరికీ జ్ఞానాన్ని వినిపించలేరు. ఎవరి కళ్యాణమైనా చేయకపోతే తమను కళ్యాణకారీ తండ్రికి పిల్లలని ఎందుకు పిలిపించుకోవాలి? తండ్రి పురుషార్థమైతే చేయిస్తారు. ఈ యజ్ఞ సేవలో ఎముకలు కూడా ఇవ్వాలి. పోతే కేవలం తినడం, త్రాగడం, నిద్రించడం - ఇదేమైనా సేవ అవుతుందా? ఇటువంటివారు వెళ్లి ప్రజలలో దాస-దాసీలుగా అవుతారు. తండ్రి అయితే పురుషార్థం చేసి నరుని నుండి నారాయణునిగా అవ్వండి అని చెప్తారు. సుపుత్రులను చూసి తండ్రి కూడా సంతోషిస్తారు. లౌకిక తండ్రి కూడా, తన పుత్రుడు చాలా మంచి పదవి పొందేవాడైతే చూసి సంతోషిస్తాడు. పారలౌకిక తండ్రి కూడా అలాగే అంటాడు. అనంతమైన తండ్రి కూడా మేము మిమ్ములను విశ్వానికి అధిపతులుగా చేసేందుకు వచ్చాము, ఇప్పుడు మీరు ఇతరులను కూడా అలా చేయండి అని అంటారు. పోతే కేవలం పొట్టను పూజించుకుంటూ ఉంటే ఏం లాభము? శివబాబాను స్మృతి చేయండి అని అందరికీ తెలిపితే చాలు. భోజన సమయంలో కూడా పరస్పరము తండ్రి స్మృతిని ఇప్పించుకుంటే అప్పుడు వీరికి శివబాబా పై చాలా ప్రేమ ఉందని అందరూ అంటారు. ఇదైతే సులభమే కదా! ఇందులో నష్టం ఏముంది? అలవాటైతే తింటూ కూడా బాబాను గుర్తు చేసుకుంటూ ఉంటారు. దైవీ గుణాలు కూడా తప్పకుండా ధారణ చేయాలి. ఇప్పుడైతే అందరూ ఓ పతితపావనా! రండి అని పిలుస్తున్నారు, అంటే తప్పకుండా పతితంగా ఉన్నారు. శంకరాచార్యుడు కూడా శివుని గుర్తు చేసుకుంటాడు ఎందుకంటే వారే పతితపావనులు. అర్ధకల్పము భక్తి చేస్తారు మళ్లీ భగవంతుడు వస్తాడు. ఎవ్వరికీ ఈ లెక్క గురించి తెలియదు. యజ్ఞ, తప, దానాదులతో నేను లభించనని తండ్రి అర్థం చేయిస్తారు. ఇందులో గీతా శాస్త్రం కూడా వచ్చేస్తుంది. ఈ శాస్త్రాలు మొదలైనవి చదవడం ద్వారా ఎవ్వరికీ సద్గతి కలుగదు. గీత, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవి. తండ్రి ఏమో పిల్లలకు రాజ్య పదవిని ప్రాప్తి చేయించే రాజయోగము, జ్ఞానము నేర్పిస్తారు. దీని పేరే రాజయోగము. ఇందులో పుస్తకాల విషయమేదీ లేదు. టీచరు స్టడీ చేయిస్తారు - పదవి ప్రాప్తి చేసుకోవాలంటే ఫాలో చెయ్యాల్సి ఉంటుంది.

శివబాబాను స్మృతి చేయండిి అని అందరికి చెప్పండి. వారు ఆత్మలైన మనందరి తండ్రి. శివబాబాను స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. ఒకరినొకరు అప్రమత్తం చేసుకుంటూ ఉన్నతి పొందాలి. ఎంతగా స్మృతి చేస్తే అంత తమ కళ్యాణమే ఉంటుంది. స్మృతి యాత్ర ద్వారా మొత్తం విశ్వాన్ని పవిత్రంగా చేస్తాము. స్మృతిలో ఉండి భోజనం తయారు చేస్తే భోజనంలో కూడా శక్తి నిండుతుంది. అందువలన మీ బ్రహ్మభోజనానికి చాలా మహిమ ఉంది. ఆ భక్త జనులు కూడా భోగ్‌ పెడ్తారు అయినా కూడా రామ-రామ అని అంటూ ఉంటారు. రామ నామాన్ని దానం ఇస్తారు. మీకౖెెతే ఘడియ-ఘడియకు బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి. రోజంతా బుద్ధిలో జ్ఞానం ఉండాలి. తండ్రి వద్ద మొత్తం రచన యొక్క ఆది-మధ్య-అంత్యముల జ్ఞానం ఉంది కదా! ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడు. మీరు వారిని స్మృతి చేస్తే ఉన్నతమైన పదవి పొందుతారు. మరి ఇతరులనెందుకు స్మృతి చేయాలి? కేవలం నన్నొక్కరినే స్మృతి చేయందని తండ్రి చెప్తారు. కనుక మిగిలినవన్నీ వదిలేయాల్సి ఉంటుంది. ఇది అవ్యభిచారి స్మృతి. ఒకవేళ గుర్తు రాకుంటే(కొంగు) ముడి వేసుకోండి. తమ ఉన్నతి కొరకు, ఉన్నత పదవి పొందేందుకు తప్పకుండా పురుషార్థము చెయ్యాలి. మమ్ములను కూడా టీచరుగా చేసే శివబాబా మాకు టీచరుగా ఉన్నారు. మీరందరు మార్గదర్శకులు కదా! మార్గదర్శకుల పని మార్గాన్ని చూపించడం(చెప్పడం). ఇంతకుముందు మీలో ఇంత జ్ఞానము లేదు. ఇంతకుముందు చాలా తక్కువ విలువైన చదువు ఉండేదని అందరూ అంటారు. అదైతే తప్పకుండా ఉంటుంది. డ్రామానుసారం కల్పక్రితము వలె చదువుతూ ఉంటారు. మళ్ళీ కల్పం తర్వాత కూడా అలాగే చదువుతారు. చివర్లో మీకు అన్నీ సాక్షాత్కారమవుతాయి. మీకు సాక్షాత్కారం అవ్వడంలో ఆలస్యం అవ్వదు. బాబాకు త్వర త్వరగా సాక్షాత్కారాలు అయ్యాయి. ఫలానా-ఫలానా వారు రాజులుగా అవుతారు, వారికి ఈ డ్రెస్‌ ఉంటుంది అని సాక్షాత్కారమయ్యేది. ప్రారంభంలో పిల్లలకు చాలా సాక్షాత్కారాలు జరిగేవి. మళ్లీ అంతిమంలో జరుగుతాయి. మళ్ళీ స్మృతి చేస్తారు. అచ్ఛా -
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. భోజనం చేయునప్పుడు పరస్పరము తండ్రి స్మృతిని ఇప్పించుకోండి స్మృతిలో ఉండి భోంచేయండి. ఒక్క శివబాబాతోనే సత్యమైన ప్రీతి ఉంచుకోండి.

2. యజ్ఞ సేవలో ఎముకలు ఇవ్వాలి. తండ్రికి పూర్తిగా సహాయకారులుగా అవ్వాలి.

వరదానము :-

''నిశ్చయ బుద్ధి గలవారై బలహీన సంకల్పాల వలను సమాప్తం చేసే సఫలతా సంపన్న భవ.''

ఇప్పటి వరకు మెజారిటీ పిల్లలు బలహీన సంకల్పాలను స్వయమే ఎమర్జ్‌ చేసుకుంటున్నారు - అవుతుందో, అవ్వదో, ఏమవుతుందో....... తెలియదు అని ఆలోచిస్తారు. ఈ బలహీన సంకల్పాలే గోడ వలె తయారవుతాయి. సఫలత ఈ గోడలో దాగిపోతుంది. మాయ బలహీన సంకల్పాల వలను పరిచేస్తుంది. ఆ వలలో చిక్కుకుపోతారు. కనుక ''నేను నిశ్చయబుద్ధి విజయీ అత్మను, సఫలత నా జన్మ సిద్ధ అధికారం'' - ఈ స్మృతితో బలహీన సంకల్పాలను సమాప్తం చేయండి.

స్లోగన్‌ :-

''మూడవ జ్వాలాముఖీ నేత్రం తెరవబడి ఉంటే, మాయ శక్తిహీనంగా అయిపోతుంది.''

గోప గోపికలందరికి మాతేశ్వరి గారి హస్తాలతో వ్రాసిన స్మృతి పత్రం (1961)
గోప-గోపికలందరికి అతి ప్రియస్మృతులు.
తర్వాతి సమాచారం - మీరందరూ గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా మీ జీవితంలో సఫలతను పొందుకుంటున్నారు కదా! గారాబు గోపులైతే ఇప్పుడు సేవను మంచి రీతిగా చేపట్టే పురుషార్థంలో ఉన్నారు, చాలా మంచిది. చివరికి మన పరమ పూజ్యులైన తండ్రి పరిచయం అందరికీ లభించవలసిందే. ఈ ఉన్నతమైన ప్రాప్తిని కోట్లలో కొందరే పొందగలరని మీకు తెలుసు. అయితే ఇటవంటి పుష్పాలు తప్పకుండా వెలువడ్తాయి కదా. మంచిది, తీవ్రమైన తరగనిది(అఖుట్‌), అది తండ్రి ద్వారా పిల్లలందరికీ లభిస్తూనే ఉంటుంది. ఎవరైనా దీనిని ప్రాప్తి చేసుకుంటే జన్మ-జన్మాంతరాలకు సంపన్నంగా అయిపోతారు. ఈ వస్తువే అలాంటిది. ప్రియమైన గోప-గోపికలారా! ఇది నిజమే కదా! చెప్పండి.
గోప-గోపికలైన మీరందరూ అతీంద్రియ సుఖమయ జీవితాన్ని అనుభవిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉండండి. ప్రియమైన గోప-గోపికలారా, ఇప్పుడు ఈ బ్రాహ్మణ కులం వృద్ధి అవ్వడంలోనే అందరి కళ్యాణముంది, దీనిని గమనించండి. మళ్లీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా తప్పకుండా అవుతారు. ఉదాహరణానికి చాలామంది గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా బ్రాహ్మణ కుల వంశీయులుగా అయ్యి నడుస్తున్నారు అనగా గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉంటారు. పతి, పత్ని ఇరువురు ఒకే తండ్రి పిల్లలమని భావిస్తూ పవిత్రతను ధారణ చేస్తూ ఉంటారు. అందరూ తండ్రి అయిన పరమపిత ఆజ్ఞానుసారమే నడవాలి. దీనినే శ్రీమతాన్ని అనుసరించుట అని అంటారు. ఇటువంటి ధారణతో నడిచేవారినే బ్రాహ్మణ కుల వంశీయులు అని అంటారు. ఇప్పుడు వారే తండ్రి, టీచరు, సద్గురువుగా అయ్యారు. ధర్మరాజు కూడా వారే. కనుక వారి ఒడిలోని పుత్రునిగా అయ్యి తమ సంపూర్ణ పవిత్రతా అధికారాన్ని ఎందుకు తీసుకోరాదు! దీని ద్వారానే భవిష్యత్తులో సుఖ - శాంతుల సంపూర్ణ అధికారము ప్రాలబ్ధ రూపంలో ప్రాప్తి అనుతుంది.
చెప్పండి, ప్రియమైన గోప-గోపికలూ ఇటువంటి సులభమైన రహస్యాన్ని అర్థం చేసుకున్నారు కదా! జీవించి ఉండే మరణించుట అనగా మరజీవాగా అవ్వడంలో భయపడడం లేదు కదా! ఈ రోజు ఈ ఉత్తరం ప్రతి ఒక్కరు తమ-తమ పేరుతో అర్థం చేసుకోండి, తమకు వ్రాసిన ఉత్తరమే అని భావించి చదవండి లేక వినండి, తల్లి ప్రేమను ప్రతి ఒక్కరు తమ పేరుతో పొందండి. ప్రతి గోప-గోపి పట్ల పేరు సహితంగా తల్లి యొక్క అత్యంత ప్రియమైన ప్రేమ. మంచిది. తమ సౌభాగ్యాన్ని ఉన్నతంగా చేసుకునే పురుషార్థంలో తీవ్ర వేగంతో ఉండడమే కళ్యాణకారిగా అవ్వడం. స్వయం పరమపితయే ఉన్నతమైన వారసత్వం ఇచ్చేందుకు వచ్చారు కనుక తప్పకుండా తీసుకోవాలని ఇప్పుడే తెలిసింది. మంచిది. శెలవు తీసుకుంటాను. ఓంశాంతి.
బ్రహ్మబాబా సమానంగా అయ్యేందుకు విశేషమైన పురుషార్థము
ఎలాగైతే బ్రహ్మబాబా అనేక 'నాది నాది' లను ఒక్క 'నాది' లోకి ఇమిడ్చి వేశారో, నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరని అన్నారో, అలా తండ్రిని అనుసరించండి. దీనితో ఏకాగ్రతా శక్తి పెరుగుతుంది. ఎక్కడ కావాలంటే, ఎలా కావాలంటే, ఎంత సమయం కావాలంటే అంత మనసు ఏకాగ్రం అవుతుంది. ఈ ఏకాగ్రతా శక్తితో స్వత:గానే ఏకరస ఫరిస్తా స్వరూప అనుభూతి కలుగుతుంది.