01-07-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - దేహాభిమానము 'ఆసురీ గు'ణము', దానిని మార్చుకొని దైవీ గుణాలను ధారణ చేస్తే రావణుని జైలు నుండి విడుదలైపోతారు ''

ప్రశ్న :-

ప్ర్రతి ఆత్మ తన పాపకర్మల శిక్షలను ఎలా అనుభవిస్తుంది, దాని నుండి రక్షించుకునే సాధనమేది?

జవాబు :-

ప్రతి ఒక్కరూ తమ పాపాలకు శిక్షలను ఒకటేమో గర్భజైలులో అనుభవిస్తారు, రెండవది రావణుని జైలులో అనేక విధాలుగా దు:ఖమును అనుభవిస్తారు. పిల్లలైన మిమ్ములను ఈ జైళ్ళ నుండి విడిపించేందుకు బాబా వచ్చారు. వీటి నుండి రక్షించుకునేందుకు పవిత్రంగా అవ్వండి.

ఓంశాంతి.

డ్రామా ప్లాను అనుసారంగా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. తండ్రియే వచ్చి రావణుని జైలు నుండి విడిపిస్తారు, ఎందుకంటే అందరూ చెడుగా(క్రిమినల్‌గా) పాపాత్మలుగా ఉన్నారు. ప్రపంచములోని మానవమాత్రులందరూ క్రిమినల్‌గా ఉన్నందున రావణుని జైలులో ఉన్నారు. మళ్లీ శరీరమును వదిలినప్పుడు కూడా గర్భజైలులోకి వెళ్తారు. తండ్రి వచ్చి రెండు జైళ్ల నుండి విడిపిస్తారు మళ్లీ మీరు అర్ధకల్పము వరకు రావణ జైలుకూ వెళ్లరు, గర్భ జైలుకూ వెళ్లరు. తండ్రి నెమ్మది నెమ్మదిగా పురుషార్థానుసారము మనలను రావణుని జైలు నుండి, గర్భజైలు నుండి విడిపిస్తూ ఉంటారని మీకు తెలుసు. రావణ రాజ్యములో మీరందరూ క్రిమినల్‌గా ఉన్నారు. మళ్లీ రామరాజ్యములో అందరూ సివిలైజ్‌గా(మంచివారిగా) అవుతారు. ఎలాంటి భూతాలు ప్రవేశించవు. దేహ అహంకారములోకి రావడం వల్లనే ఇతర భూతాలు ప్రవేశిస్తాయి. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థము చేసి ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఈ విధంగా(లక్ష్మినారాయణులుగా) అయినప్పుడు మిమ్ములను దేవతలని అంటారు. మీరిప్పుడు బ్రాహ్మణులని పిలువబడ్తున్నారు. రావణుని జైలు నుండి విడిపించేందుకు తండ్రి వచ్చి చదివిస్తున్నారు, అంతేకాక దిగజారి పాడైపోయిన వారి నడవడికలను చక్కదిద్దుతారు కూడా. అర్ధకల్పము నుండి నడవడిక దిగజారుతూ పాడవుతూ పూర్తిగా పాడైెపోయారు. ఈ సమయంలో తమోప్రధానమైన నడవడిక ఉంది. దైవీ గుణాలకు, ఆసురీ గుణాలకు రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. ఇప్పుడు పురుషార్థము చేసి తమ దైవీ గుణాలను తయారు చేసుకోవాలి, అప్పుడే ఆసురీ గుణాల నుండి విముక్తులవుతూ ఉంటారని తండ్రి అర్థం చేయిస్తారు. ఆసురీ గుణాలలో మొదటిది దేహాభిమానము. దేహీ-అభిమానుల గుణాలు ఎప్పటికీ చెడిపోవు. ఆధారమంతా గుణాల పైననే ఉంది. దేవతల గుణాలు(నడవడికలు) ఎలా చెడిపోతాయి? ఎప్పుడైతే వారు వామమార్గములో వెళ్తారో అనగా వికారులుగా అయినప్పుడు గుణాలు చెడిపోతాయి. వామమార్గపు చిత్రాలను జగన్నాథపురి మందిరములో చూపించారు. ఇది అనేక సంవత్సరాల పురాతన మందిరము. దుస్తులు మొదలైనవన్నీ దేవతలవే. దేవతలు వామమార్గములో ఎలా వెళ్తారో చూపిస్తారు. మొట్టమొదటి క్రిమినల్‌ గుణము ఇదే. కామచితి పై కూర్చుంటారు. తర్వాత రంగు మారుతూ మారుతూ పూర్తి నల్లగా అయిపోతారు. మొట్టమొదట బంగారు యుగములో సంపూర్ణ సుందరంగా ఉంటారు. తర్వాత రెండు కళలు తగ్గిపోతాయి. త్రేతాయుగాన్ని స్వర్గమని అనరు, అది సెమీ స్వర్గము. రావణుడు రావడంతోనే మీ పై త్రుప్పు పట్టడము ప్రారంభమయ్యింది. చివరికి పూర్తి క్రిమినల్‌గా తయారవుతుంది. ఇప్పుడు 100 శాతము క్రిమినల్‌గా ఉందని అంటారు. 100 శాతము నిర్వికారంగా ఉండేవారు, తర్వాత 100 శాతము వికారులుగా అయిపోయారు. ఇప్పుడు బాగుపడండి. పరివర్తన అవ్వండి. ఈ రావణుని డైలు చాలా పెద్దదని తండ్రి చెప్తున్నారు. అందరినీ చెడ్డవారనే(క్రిమినల్‌) అనే అంటారు, ఎందుకంటే రావణ రాజ్యములో ఉన్నారు కదా. రామ రాజ్యము మరియు రావణ రాజ్యము గురించి వారికి తెలియనే తెలియదు. రామ రాజ్యములోకి వెళ్లేందుకు మీరిప్పుడు పురుషార్థము చేస్తున్నారు. ఎవ్వరూ సంపూర్ణంగా అవ్వలేదు. కొందరు ఫస్ట్‌, కొందరు సెకండ్‌, కొందరు థర్డ్‌లో ఉన్నారు. తండ్రి ఇప్పుడు చదివిస్తారు, దైవీ గుణాలు ధారణ చేయిస్తారు. అందరూ దేహాభిమానములో ఉన్నారు. ఎంతెంత సర్వీసులో లగ్నమై ఉంటారో అంత దేహాభిమానము తగ్గుతూ వస్తుంది. సర్వీసు చేస్తూ ఉంటే దేహాభిమానము తగ్గుతుంది. ఆత్మాభిమానులు చాలా పెద్ద పెద్ద సర్వీసులు చేస్తారు. బాబా ఆత్మాభిమానులు కాబట్టి ఎంత బాగా సర్వీసు చేస్తున్నారు! అందరినీ క్రిమినల్‌ రావణుని జైలు నుండి విడిపించి సద్గతిని ప్రాప్తి చేయిస్తారు. అక్కడ రెండు రకాల జైళ్లూ ఉండవు. ఇక్కడ డబల్‌ జైళ్లు ఉన్నాయి. సత్యయుగములో కోర్టు లేదు, పాపాత్మలు లేరు, రావణుని జైలు కూడా లేదు. రావణునిది అనంతమైన జైలు. అందరూ 5 వికరాల వలలో బంధితులై ఉన్నారు, అపారమైన దు:ఖముంది. రోజురోజుకు దు:ఖము వృద్ధి చెందుతూ ఉంటుంది.

సత్యయుగాన్ని బంగారు యుగమని, త్రేతా యుగాన్ని వెండి యుగమని అంటారు. సత్యయుగములో ఉన్న సుఖము త్రేతాయుగములో ఉండదు. ఎందుకంటే ఆత్మలో రెండు కళలు తగ్గిపోతాయి. ఆత్మలో కళలు తగ్గుట వలన శరీరము కూడా అలాగే అవుతుంది. కనుక రావణ రాజ్యములో మనము దేహాభిమానులుగా అయిపోయామని అర్థము చేసుకోవాలి. ఇప్పుడు రావణుని జైలు నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు. అర్ధకల్పము వరకు ఉన్న దేహాభిమానము తొలగిపోయేందుకు సమయమైతే పడ్తుంది కదా. చాలా కష్టపడవలసి ఉంటుంది. ఎవరైనా త్వరగా మరణించి మళ్లీ జన్మించి పెద్దవారిగా అయ్యి వచ్చి కొంత జ్ఞానము తీసుకోగలరు. ఎంతగా ఆలస్యం అవుతుందో అంత పురుషార్థము చేయలేరు. ఎవరైనా మరణిస్తే మళ్లీ వచ్చి పురుషార్థము చేయాలంటే అవయవాలు పెద్దవై వివేకవంతులైనప్పుడే ఏదో కొంత చేయగలరు. ఆలస్యంగా వెళ్లేవారు ఏమీ నేర్చుకోలేరు. ఎంత నేర్చుకున్నారో అంతే ఉంటుంది. కాబట్టి మరణించేందుకు ముందే పురుషార్థము చేయాలి. వారు వీలైనంత ఇటువైపు వచ్చేందుకు ప్రయత్నము తప్పకుండా చేస్తారు. ఈ పరిస్థితిలో చాలామంది వస్తారు. వృక్షము వృద్ధి చెందుతుంది. చాలా సహజంగా అర్థం చేయించవచ్చు. బొంబయిలో తండ్రి పరిచయమిచ్చేందుకు చాలా మంచి అవకాశముంది - వీరు మనందరికీ తండ్రి, తండ్రి వారసత్వమైతే తప్పకుండా స్వర్గ వారసత్వముదే కావాలి. ఎంత సహజమైనది! వీరు మనలను చదివించేవారని మనస్సు లోలోపల పులకరించి పోవాలి. ఇది మన లక్ష్యము. మనము మొదట సద్గతిలో ఉండేవారము, తర్వాత దుర్గతిపాలయ్యాము. ఇప్పుడు మళ్లీ దుర్గతి నుండి సద్గతిలోకి వెళ్లాలి. నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ జన్మ-జన్మల పాపాలు సమాప్తమవుతాయని శివబాబా చెప్తున్నారు.

ద్వాపర యుగములో రావణ రాజ్యమున్నప్పుడు పంచ వికారాల రూపీ రావణుడు సర్వవ్యాపి అవుతాడని పిల్లలైన మీకు తెలుసు. ఎక్కడైతే వికారాలు సర్వవ్యాపిగా ఉంటాయో అక్కడ తండ్రి సర్వవ్యాపిగా ఎలా అవుతాడు? మానవులందరూ పాపాత్ములే కదా. తండ్రి సన్ముఖములో ఉన్నారు. ''అసలు నేను అలా చెప్పనే లేదు, ఉల్టాగా అర్థము చేసుకున్నారని'' తండ్రి చెప్తున్నారు. ఉల్టాగా అర్థము చేసుకుంటూ, వికారాలలో పడుతూ పడుతూ నన్ను నిందిస్తూ నిందిస్తూ భారతదేశ పరిస్థితి ఇలా తయారయ్యింది. 5 వేల సంవత్సరాల క్రితము భారతదేశము స్వర్గముగా ఉండేది, అందరూ సతోప్రధానంగా ఉండేవారని క్రైస్తవులకు కూడా తెలుసు. కానీ భారతీయులైతే లక్షల సంవత్సరాలని అనేస్త్తారు. ఎందుకంటే తమోప్రధాన బుద్ధి గలవారిగా అయిపోయారు. వారు(క్రైస్తవులు) అంత ఉన్నతంగా కూడా అవ్వరు, అంత నీచంగా కూడా అవ్వరు. తప్పకుండా స్వర్గము ఉండేదని భావిస్తారు. వీరు సరిగ్గా చెప్తున్నారు - 5 వేల సంవత్సరాల క్రితము పిల్లలైన మిమ్ములను రావణ జైలు నుండి విడిపించేందుకు నేను వచ్చాను, ఇప్పుడు మళ్లీ విడిపించేందుకు వచ్చానని తండ్రి చెప్తున్నారు. అర్ధ కల్పము రామ రాజ్యము, అర్ధ కల్పము రావణ రాజ్యము. అవకాశము లభిస్తే పిల్లలు ఇతరులకు అర్థం చేయించాలి.

పిల్లలారా, ఇలా ఇలా అర్థం చేయించండని తండ్రి కూడా పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. ఇంత అపారమైన దు:ఖము ఎందుకుంది? అపారమైన సుఖము లక్ష్మీనారాయణుల రాజ్యమున్నప్పుడు ఉండేది. వీరు సర్వ గుణ సంపన్నంగా ఉండేవారు. ఈ జ్ఞానము ఉండేదే నరుల నుండి నారాయణునిగా అయ్యేందుకు. ఈ చదువు ద్వారా దైవీ గుణాలు, దైవీ నడవడికలు అలవడుతాయి. ఈ సమయంలో రావణ రాజ్యములో అందరి గుణాలు చెడిపోయాయి. అందరి క్యారెక్టర్‌ సరిదిద్దేవారు రాముడొక్కరే. ''ఈ సమయములో ఎన్ని ధర్మాలున్నాయి, మానవుల వృద్ధి ఎంత జరుగుతున్నది! ఇలా వృద్ధి అవుతూ ఉంటే తర్వాత తినేందుకు ఆహారము కూడా ఎక్కడ నుండి లభిస్తుంది! సత్యయుగములో అయితే ఇలాంటి విషయాలుండవు. అక్కడ దు:ఖమను మాటే లేదు. ఈ కలియుగము దు:ఖధామము, అందరూ వికారులుగా ఉన్నారు. అది సుఖధామము, అందరూ సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు. క్షణక్షణము వారికి ఇది చెప్తూ ఉంటే కాస్త అర్థమవుతుంది. తండ్రి చెప్తున్నారు - నేను పతిత పావనుడను, నన్ను స్మృతి చేస్తే మీ జన్మ-జన్మల పాపము సమాప్తమవుతుంది. అశరీరి తండ్రి ఎలా చెప్పగలరు? - తప్పకుండా శరీరాన్ని ధారణ చేసి మాట్లాడ్తారు కదా. పతితపావనులు, సర్వుల సద్గతిదాత తండ్రి ఒక్కరే, వారు తప్పకుండా ఎవరి రథములోనో వచ్చి ఉంటారు. తమ జన్మల గురించి తెలియని రథములో వస్తానని తండ్రి చెప్తున్నారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇది 84 జన్మల ఆట. మొట్ట మొదట ఎవరు వచ్చారో వారే వస్తారు, వారికే చాలా జన్మలుంటాయి. తర్వాత తగ్గుతూ ఉంటాయి. అందరికంటే ముందు దేవతలు వచ్చారు. బాబా పిల్లలకు ఉపన్యసించడం నేర్పిస్తారు. ఇలా ఇలా అర్థం చేయించాలని బాబా పిల్లలకు నేర్పిస్తారు. స్మృతి బాగా చేస్తూ, దేహాభిమానము లేకుంటే భాషణము బాగా చేస్తారు. శివబాబా దేహీ-అభిమాని కదా. తండ్రి - పిల్లలారా, ''ఆత్మాభిమాని భవ'' అని చెప్తూ ఉంటారు. ఏ వికారమూ ఉండరాదు, లోపల ఏ భూతమూ ఉండరాదు. మీరు ఎవ్వరికీ దు:ఖము ఇవ్వరాదు, ఎవ్వరినీ నిందించరాదు. పిల్లలైన మీరు ఎప్పుడూ విని వినిపించే(చెప్పుడు) మాటల పై విశ్వాసముంచరాదు. వీరు ఇలా చెప్తున్నారు - ఇది సత్యమేనా? అని తండ్రిని అడగండి. అప్పుడు బాబా తెలుపుతారు. లేకుంటే చాలామంది అసత్యపు మాటలు చేయడంలో ఆలస్యము చేయరు, ఫలానావారు మిమ్ములను గూర్చి ఇలా ఇలా అన్నారని వినిపించి వారినే బూడిద చేసేస్తారు. ఇలాంటి వారు చాలామంది ఉన్నారని బాబాకు తెలుసు. ఉల్టా - సుల్టా మాటలు వినిపించి మనస్సును పాడు చేస్తారు. కాబట్టి ఎప్పుడూ అసత్యమైన మాటలు విని లోలోపలే కాలిపోరాదు. ఫలానావారు నన్నిలా అన్నారా? అని స్పష్టంగా అడగండి. లోపల స్వచ్ఛంగా ఉండాలి. చాలామంది పిల్లలు ఇలాంటి చెప్పుడు మాటలు విని పరస్పరములో శత్రుత్వమును ఉంచుకుంటారు. తండ్రి లభించారు కనుక వారిని అడగాలి కదా. చాలామందికి బ్రహ్మాబాబా పై కూడా విశ్వాసముండదు. శివబాబాను కూడా మర్చిపోతారు. అందరినీ ఉన్నతంగా తయారు చేసేందుకే తండ్రి వచ్చారు. ప్రేమగా పైకెత్తుతూ (శ్రేష్ఠంగా చేస్తారు) ఉంటారు. ఈశ్వరీయ మతమును తీసుకోవాలి. నిశ్చయమే లేకుంటే, ఏమీ అడగకపోతే జవాబు కూడా లభించదు. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని ధారణ చేయాలి.

పిల్లలైన మీరు శ్రీమతమును అనుసరించి విశ్వములో శాంతి స్థాపన చేసేందుకు నిమిత్తంగా అయ్యారు. తండ్రి శ్రీమతము తప్ప మరెవ్వరి మతమూ అత్యంత ఉన్నతము అవ్వజాలదు. ఉన్నతోన్నతమైన మతము ఒక్క భగవంతునిదే. ఈ మతము ద్వారా పదవి కూడా ఎంతో ఉన్నతమైనది లభిస్తుంది. తమ కళ్యాణము చేసుకొని ఉన్నత పదవిని పొందండి. మహారథులుగా తయారవ్వండి అని తండ్రి చెప్తున్నారు. చదవకనే పోతే ఏ పదవి పొందుతారు? ఇది కల్ప-కల్పాంతరాల మాట. సత్యయుగములో దాస-దాసీలకు కూడా నంబర్‌వారుగా ఉంటారు. తండ్రి ఉన్నతంగా తయారు చేసేందుకే వచ్చారు కానీ చదవకనే పోతే ఏ పదవి పొందుతారు? ప్రజలలో కూడా ఉన్నత, కనిష్ట పదవులు ఉంటాయి కదా. ఇది బుద్ధి ద్వారా అర్థము చేసుకోవాలి. మనము ఉన్నతంగా తయారవుతున్నామా, నీచంగా తయారవుతున్నామా, ఎక్కడికి వెళ్తున్నామా అనేది మానవులకు తెలియదు. పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ! మీరు బంగారు, వెండి యుగాలలో ఎక్కడ ఉండేవారు, ఇప్పుడు ఇనుప యుగములో ఎక్కడకు వచ్చేశారు! ఈ సమయములో అయితే మనుష్యులు మనుష్యులనే తింటున్నారు. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ అర్థము చేసుకుంటారో అప్పుడు జ్ఞానమని దేనిని అంటారో చెప్తారు. చాలామంది పిల్లలు ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తారు. మంచి మంచి సేవాకేంద్రాలలోని మంచి మంచి పిల్లలలో కూడా చెడు దృష్టి ఉంటుంది. లాభము, నష్టము, పరువులను గురించి లెక్కనే చేయరు. ముఖ్యమైనది క్రిమినల్‌ దృష్టి. కామము మహాశత్రువు, దీనిని జయించేందుకు ఎంతగా తలకొట్టుకుంటారు(కష్టపడ్తారు). ముఖ్యమైన విషయము - పవిత్రత. దీనిని గురించి ఎన్నో గొడవలు జరుగుతాయి. కామము మహాశత్రువు, దీనిని జయిస్తే జగత్‌జీతులుగా అవుతారని తండ్రి చెప్తున్నారు. దేవతలు సంపూర్ణ నిర్వికారులు కదా. మున్ముందు వారే అర్థం చేసుకుంటారు. స్థాపన జరిగే తీరుతుంది. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. ఎప్పటికీ విన్న(చెప్పుడు) మాటల పై విశ్వాసముంచి తమ స్థితిని పాడు చేసుకోరాదు. ఆంతరికాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలి. అసత్య విషయాలు విని లోలోపల కాలిపోరాదు. ఈశ్వరీయ మతమును తీసుకోవాలి.

2. దేహీ-అభిమానులుగా అయ్యేందుకు పురుషార్థము పూర్తిగా చేయాలి. ఎవ్వరినీ నిందించరాదు. లాభ-నష్టాలు, గౌరవ మర్యాదలను దృష్టిలో ఉంచుకొని వికారి దృష్టిని సమాప్తము చేసుకోవాలి. తండ్రి ఏదైతే వినిపిస్తున్నారో దానిని ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయరాదు.

వరదానము :-

'' నిశ్చయము నరియు నశాల ఆధారంతో ప్రతి పరిస్థితి పై విజయము ప్రాప్తి చేసుకునే సిద్ధిస్వరూప భవ ''

యోగము ద్వారా ఇప్పుడు ఎలాంటి సిద్ధిని ప్రాప్తి చేసుకోవాలంటే, అప్రాప్తి కూడా ప్రాప్తిని అనుభవం చేయించాలి. ప్రతి పరిస్థితిలో నిశ్చయము మరియు నశా విజయీగా చేసేస్తుంది. పోను పోను ఎండిపోయిన రొట్టెలు కూడా తినాల్సిన పరిస్థితులు వస్తాయి. కానీ నిశ్చయము, నశా మరియు యోగ సిద్ధి యొక్క స్థితి ఆ రొట్టెను కూడా మెత్తగా, రుచిగా చేసేస్తుంది. వ్యాకులపడనీయదు. మీరు సిద్ధి స్వరూపులునే నశాలో(శాన్‌లో) ఉంటే మిమ్ములను ఎవ్వరూ పరేశాన్‌ చేయలేరు. ఏదైనా సాధనముంటే బాగా ఉపయోగించండి కాని అది సమయానికి మోసము చేయరాదు - ఇది చెక్‌ చేసుకోండి.

స్లోగన్‌ :-

'' నిమిత్తంగా అయ్యి యధార్థంగా పాత్రను అభినయిస్తే సర్వుల సహయోగము లభిస్తూ ఉంటుంది. ''