03-06-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - ఇప్పుడు మీరు సంపూర్ణమవ్వాలి, ఎందుకంటే వాపస్‌ ఇంటికి వెళ్లి మళ్లీ పావన ప్రపంచములోకి రావాలి ''

ప్రశ్న :-

సంపూర్ణ పావనంగా అయ్యేందుకు యుక్తి ఏది?

జవాబు :-

సంపూర్ణ పావనంగా అవ్వాలంటే పూర్తి భికారులుగా అవ్వండి, దేహ సహితము సర్వ సంబంధాలను మరచి నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు. ఇప్పుడు మీరు ఈ కళ్లతో చూస్తున్నదంతా వినాశనమవ్వనున్నది. కావున ధనము, సంపద, వైభవాలు మొదలైన వాటన్నిటిని మరచి భికారులుగా అవ్వండి. ఇలాంటి భికారులే రాకుమారులుగా అవుతారు.

ఓంశాంతి.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ! ప్రారంభములో ఆత్మలంతా పవిత్రంగా ఉంటారని మీకు బాగా తెలుసు. మనమే పావనంగా ఉండేవారము. పతితము, పావనము అని ఆత్మలకే చెప్పబడుతుంది(శరీరాలకు కాదు). ఆత్మ పావనంగా ఉంటే సుఖముంటుంది. పావనంగా అయితే పావన ప్రపంచానికి అధికారులుగా అవుతామని బుద్ధికి తోస్తుంది. దీని కొరకే పురుషార్థము చేస్తారు. 5 వేల సంవత్సరాల క్రితము పావన ప్రపంచము ఉండేది. అందులో అర్ధకల్పము మీరు పావనంగా ఉండేవారు. పోతే అర్ధకల్పము మిగిలి ఉంటుంది. ఈ విషయాలు ఇతరులెవ్వరూ అర్థము చేసుకోలేరు. పతితము-పావనము, సుఖము-దుఃఖము, పగలు-రాత్రి సగం-సగం ఉంటాయని మీకు తెలుసు. ఎవరైతే చాలా భక్తి చేశారో, వారే మంచి తెలివి గలవారుగా ఉంటారు, వారే వీటిని బాగా అర్థము చేసుకుంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలారా! మీరు పావనంగా ఉండేవారు. నూతన ప్రంచములో కేవలం మీరు మాత్రమే ఉండేవారు. మిగిలినవారంతా శాంతిధామములో ఉండేవారు. మనము మొట్టమొదట పావనంగా ఉండేవారము. చాలా కొద్దిమంది మాత్రమే ఉండేవారము. ఆ తర్వాత నంబరువారుగా మానవ సృష్టి వృద్ధి చెందుతుంది. ఇప్పుడు మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నది ఎవరు? తండ్రి. ఆత్మలకు తండ్రి అయిన పరమాత్మ అర్థం చేయిస్తున్నారు - దీనిని సంగమము అని అంటారు. దీనినే కుంభమేళా అని కూడా అంటారు. మానవులు ఈ సంగమ యుగమును మర్చిపోయారు. నాలుగు యుగాలుంటాయని, 5 వది ఈ చిన్న లీపు సంగమ యుగమని, దీని ఆయువు చిన్నదని బాబా అర్థం చేయించారు. నేను ఇతని చాలా జన్మల చివరి అంతిమ జన్మలో, వానప్రస్థ స్థితిలో ప్రవేశిస్తానని తండ్రి అర్థం చేయించారు. పిల్లలకు దీని పై చాలా గమనముంది కదా. తండ్రి ఇతని శరీరములో ప్రవేశించారు, ఇతని బయోగ్రఫి(జీవితచరిత్ర) కూడా వినిపించారు. నేను ఆత్మలతోనే మాట్లాడ్తానని తండ్రి అంటున్నారు. ఆత్మ మరియు శరీరము రెండు కలిసి పాత్ర చేస్తాయి. దీనిని జీవాత్మ అని అంటారు. పవిత్ర జీవాత్మ, అపవిత్ర జీవాత్మ అని అంటారు. సత్యయుగములో చాలా కొద్దిమంది మాత్రమే దేవీ దేవతలుంటారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. జీవాత్మలైన మనమే ఎవరైతే సత్యయుగములో పావనంగా ఉండేవారమో, మళ్లీ 84 జన్మల తర్వాత పతితంగా అయ్యామని స్వయాన్ని గురించి కూడా తెలుసుకున్నారు. పతితుల నుండి పావనంగా, పావనము నుండి పతితంగా - ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. స్మృతి కూడా పతితపావనుడైన ఆ తండ్రినే చేస్తారు. కావున ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత ఒక్కసారి మాత్రమే బాబా వస్తారు, స్వర్గస్థాపన చేస్తారు. భగవంతుడు ఒక్కరే. తప్పకుండా వారే పురాతన ప్రపంచాన్ని నూతనంగా చేస్తారు. మళ్లీ కొత్త ప్రపంచాన్ని పాతదిగా ఎవరు చేస్తారు? రావణుడు. ఎందుకంటే రావణుడే దేహాభిమానులుగా చేస్తారు. శత్రువును కాలుస్తారు కాని మిత్రుడిని ఎవ్వరూ తగులబెట్టరు. అందరికీ మిత్రుడు ఒక్క తండ్రి మాత్రమే. వారే సర్వులకు సద్గతినిస్తారు. వారినే అందరూ స్మృతి చేస్తారు ఎందుకంటే వారు అందరికీ సుఖమునిచ్చేవారు. కనుక దుఃఖమిచ్చేవారు కూడా ఎవరో తప్పకుండా ఉంటారు. దుఃఖమిచ్చేది పంచ వికారాల రూపి రావణుడు. అర్ధకల్పము రామరాజ్యము, అర్ధకల్పము రావణరాజ్యము. స్వస్తిక్‌ గుర్తు వేస్తారు కదా. ఇందులో నాలుగు సమాన భాగాలు ఉంటాయని దీని అర్థాన్ని కూడా తండ్రి అర్థం చేయిస్తారు. కొంచెము కూడా హెచ్చు-తగ్గులు ఉండవు. ఈ డ్రామా చాలా ఖచ్ఛితమైనది. కొంతమంది ఈ డ్రామా చాలా దుఃఖకరమైనదని, దీని నుండి తొలగిపోవాలని అనుకుంటారు, దీనికి బదులు జ్యోతిలో జ్యోతిగా లీనమవ్వాలి లేక బ్రహ్మలో లీనమైపోవాలని అనుకుంటారు కానీ ఎవ్వరూ అలా వెళ్లలేరు. రకరకాల ఆలోచనలు చేస్తుంటారు. భక్తిమార్గములో విభిన్న ప్రకారాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సన్యాసులు శరీరాన్ని వదిలితే స్వర్గానికి లేక వైకుంఠానికి వెళ్లారని అనరు. ప్రవృత్తి మార్గములోని వారైతే ఫలానివారు స్వర్గస్థులు అయ్యారని అంటారు. ఆత్మలకు స్వర్గము గుర్తుంది కదా. మీకు అందరికంటే ఎక్కువగా గుర్తుంటుంది. పిల్లలైన మీకు రెండింటి చరిత్ర - భూగోళము గురించి పూర్తిగా తెలుసు. ఇతరులెవ్వరికీ తెలియదు. మీకు కూడా ఇంతకు ముందు తెలియదు. తండ్రి కూర్చొని పిల్లలకు అన్ని రహస్యాలు అర్థం చేయిస్తారు.

ఇది మానవ సృష్టి వృక్షము. వృక్షానికి బీజము తప్పకుండా ఉండాలి. పావన ప్రపంచము పతిత ప్రపంచంగా ఎలా అవుతుందో, మళ్లీ నేను పావనంగా చేస్తాను అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. పావన ప్రపంచాన్ని స్వర్గమని అంటారు. స్వర్గము గడిచిపోయింది. అది మళ్లీ తప్పకుండా రిపీట్‌ అవుతుంది. అందుకే ప్రపంచ చరిత్ర మళ్లీ పునరావృతమౌతుందని అంటారు అనగా ఈ ప్రపంచమే పాత నుండి కొత్తదిగా, కొత్త నుండి పాతదిగా అవుతుంది. పునరావృతము(రిపీట్‌) అంటేనే డ్రామా అని అర్థము. డ్రామా అనే పదము చాలా బాగా శోభిస్తుంది. చక్రము ఉన్నది ఉన్నట్లు తిరుగుతూనే ఉంటుంది. నాటకాన్ని ఉన్నది ఉన్నట్లుగా అని అనరు. ఎవరైనా జబ్బు పడితే శెలవు తీసుకుంటారు. మనము పూజ్య దేవీ దేవతలుగా ఉండేవారమని, మళ్లీ మనమే పూజారులుగా అయ్యామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తండ్రి వచ్చి పతితము నుండి పావనంగా అయ్యే యుక్తులు తెలుపుతున్నారు. ఇవే యుక్తులు 5 వేల సంవత్సరాల క్రితము కూడా తెలిపించారు. వారు అంటున్నారు - '' పిల్లలారా! నన్ను స్మృతి చేయండి. తండ్రి మొట్టమొదట మిమ్ములను ఆత్మాభిమానులుగా చేస్తారు''. మొట్టమొదటి పాఠము - '' పిల్లలారా! స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి.'' నేను ఇంతగా స్మృతి చేయించినా మీరు మళ్లీ మర్చిపోతారు! డ్రామా అంత్యము వచ్చునంత వరకు మీరు మర్చిపోతూనే ఉంటారు. చివర్లో వినాశన సమయము వచ్చినప్పుడు మీ చదువు పూర్తి అవుతుంది, అప్పుడు మీరు శరీరాలను వదిలేస్తారు. ఉదాహరణానికి సర్పము కూడా తన పాత శరీరాన్ని వదిలేస్తుంది కదా. మీరు కూర్చున్నా, నడుస్తూ, తిరుగుతూ ఉన్నా ఆత్మాభిమానులై ఉండండి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇంతకుముందు మీకు దేహాభిమానము ఉండేది. ఇప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. దేహాభిమానము వలన మిమ్ములను 5 వికారాలు పట్టుకుంటాయి. ఆత్మాభిమానులుగా ఉంటే ఏ వికారము మిమ్ములను పట్టుకోదు. ఆత్మాభిమానులుగా అయ్యి తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేయాలి. ఆత్మలకు తండ్రి అయిన పరమాత్మ ప్రేమ ఈ సంగమ యుగములోనే లభిస్తుంది. దీనిని కళ్యాణకారి సంగమ యుగమని అంటారు. ఈ సమయములోనే తండ్రి మరియు పిల్లలు కలుస్తారు. ఆత్మలైన మీరు కూడా శరీరములో ఉన్నారు. తండ్రి కూడా శరీరములో వచ్చి మీరందరూ ఆత్మలు అనే నిశ్చయము చేయిస్తారు. తండ్రి ఒక్కసారి మాత్రమే అందరినీ వాపస్‌ తీసుకెళ్లవలసినప్పుడు వస్తారు. వారు వాపస్‌ ఎలా తీసుకెళ్తారో కూడా అర్థం చేయిస్తారు. మేమంతా పతితులము, మీరు పావనులు, మీరు వచ్చి మమ్ములను పావనంగా చేయమని అంటూనే ఉన్నారు. బాబా పావనంగా ఎలా చేస్తారో పిల్లలైన మీకు తెలియదు. ఎంతవరకు పావనంగా తయారు చేయలేదో అంతవరకు ఎలా తెలుస్తుంది? ఆత్మ చిన్న నక్షత్రమని కూడా ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి కూడా చిన్న నక్షత్రముగానే ఉన్నారు. కానీ వారు జ్ఞాన సాగరులు, శాంతి సాగరులు. మిమ్ములను కూడా తన సమానంగా చేస్తారు. ఈ జ్ఞానమంతా పిల్లలైన మీకు తెలుసు. మళ్లీ మీరు ఈ జ్ఞానమును అందరికీ తెలుపుతారు. సత్యయుగములోకి వెళ్లినప్పుడు ఈ జ్ఞానము ఎవరికైనా తెలిపిస్తారా? వినిపించరు. జ్ఞానసాగరులైన తండ్రి ఒక్కరు మాత్రమే, వారు ఇప్పుడు మిమ్ములను చదివిస్తున్నారు. అందరికీి జీవితచరిత్ర(బయోగ్రఫీ) ఉంటుంది కదా. ఆ చరిత్రను తండ్రి వినిపిస్తూనే ఉంటారు. కానీ మీరు క్షణ-క్షణము మర్చిపోతున్నామని మీకు తెలుసు. మీరు మాయతో యుద్ధము చేస్తారు. మేము బాబాను స్మృతి చేస్తామని, కానీ మళ్లీ మర్చిపోతామని మీరు అనుభవము చేస్తారు. తండ్రి చెప్తున్నారు - మాయనే మీ శత్రువు. అది మిమ్ములను మరపింపజేస్తుంది అనగా తండ్రి నుండి విముఖము చేస్తుంది. కల్పములో ఒక్కసారి మాత్రమే పిల్లలైన మీరు సన్ముఖములో ఉంటారు. తండ్రి ఒక్కసారి మాత్రమే వారసత్వమును ఇస్తారు. ఆ తర్వాత తండ్రి సన్ముఖములో వచ్చే అవసరమే లేదు. పాపాత్మల నుండి పుణ్యాత్మలుగా, స్వర్గానికి అధికారులుగా చేశారు. అంతటితో సమాప్తము. ఆ తర్వాత వచ్చి వారేం చేస్తారు? మీరు నన్ను పిలిచారు, నేను ఖచ్ఛితంగా సమయానికి వచ్చాను. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత నా సమయానికి నేను వస్తాను. ఇది ఎవ్వరికీి తెలియదు. శివరాత్రి పండుగను ఎందుకు జరుపుతారో, వారేమి చేశారో ఎవ్వరికీ తెలియదు. అందుకే శివరాత్రి పండుగకు శెలవు(హాలీడే) కూడా ఇవ్వరు. మిగిలిన అన్నిటికి శెలవు ఇస్తారు. కానీ శివబాబా వచ్చి ఇంత గొప్ప పాత్ర చేస్తున్నారు, కానీ దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. అర్థమే తెలియదు! భారతదేశములో ఎంతటి అజ్ఞానముంది.

శివబాబాయే అత్యంత ఉన్నతమైనవారని పిల్లలైన మీకు తెలుసు. కనుక వారు మానవులను శ్రేష్ఠాతి శ్రేష్ఠంగా చేస్తారు. తండ్రి తెలియచేస్తున్నారు - నేను ఇతనికి జ్ఞానమిచ్చాను, యోగము నేర్పించాను. దాని వలన ఇతడు మళ్లీ నరుని నుండి నారాయణునిగా అయ్యాడు. అతడు ఈ జ్ఞానమును విన్నాడు. ఈ జ్ఞానము మీ కొరకే. ఇతరులెవ్వరికీ ఈ జ్ఞానము శోభించదు. మీరు మళ్లీ అలా తయారవ్వాలి. ఇతరులెవ్వరూ అవ్వరు. ఇది నరుని నుండి నారాయణునిగా అయ్యే కథ. ఇతర ధర్మములను స్థాపన చేయువారందరూ పునర్జన్మలు తీసుకురటూ తీసుకుంటూ తమోప్రధానంగా అయ్యారు. వారంతా మళ్లీ సతోప్రధానంగా అవ్వాలి. ఆ పదవి అనుసారము మళ్లీ పునరావృతము (రిపీట్‌) కావాలి. ఉన్నత పాత్రధారులుగా అయ్యేందుకు మీరెంతో పురుషార్థము చేస్తున్నారు. పురుషార్థము చేయించేదెవరు? బాబా. మీరు శ్రేష్ఠంగా అవుతారు. ఆ తర్వాత ఎప్పుడూ నన్ను స్మృతి కూడా చేయరు. స్వర్గములో స్మృతి చేయనే చేయరు. అత్యంత ఉన్నతమైన వారు తండ్రి, వారు ఉన్నతంగా కూడా తయారుచేస్తారు. నారాయణుని కంటే ముందు శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా! అలాంటప్పుడు మీరు నరుని నుండి నారాయణునిగా అవ్వాలని ఎందుకంటారు? నరుని నుండి శ్రీ కృష్ణుడని ఎందుకు అనరు? మొదటే నారాయణునిగా అవ్వడు. మొదట రాకుమారుడైన కృష్ణునిగా అవుతాడు కదా. పిల్లలు పుష్పాలుగా ఉంటారు. తర్వాత వారు జంటగా అవుతారు. బ్రహ్మచారికే మహిమ ఉంటుంది. చిన్న పిల్లలను సతోప్రధానమని అంటారు. మనము మొట్టమొదట రాకుమారులుగా అవుతామని పిల్లలైన మీకు గుర్తుండాలి. భికారి నుండి రాకుమారుడు(బెగర్‌ టూ ప్రిన్స్‌) అనే గాయనము కూడా ఉంది. భికారి అని ఎవరినంటారు? శరీరముతో పాటు ఉన్న ఆత్మనే భికారి అని లేక ధనవంతులని అంటారు. ఈ సమయములో అందరూ భికారులుగా అవుతారని మీకు తెలుసు. అందరూ సమాప్తమైపోతారు. ఇప్పుడు మీరు శరీర సహితంగా భికారిగా అవ్వాలి. మీ వద్ద మిగిలినదంతా సమాప్తమైపోతుంది. ఆత్మ భికారిగా అవ్వాలి, సర్వమూ వదిలేయాలి. మళ్లీ రాకుమారులుగా అవ్వాలి. ధనము, సంపద మొదలైనవన్నీ వదిలి భికారులుగా అయ్యి మనము ఇంటికి వెళ్తామని మీకు తెలుసు. మళ్లీ నూతన ప్రపంచములో రాకుమారులుగా అయ్యి వస్తాము. ఉన్నదంతా తప్పకుండా వదిలిపెట్టాలి. ఈ పాత వస్తువులేవీ పనికిరావు. ఆత్మ పవిత్రమైపోతుంది. మళ్లీ ఇక్కడకు పాత్ర చేసేందుకు వస్తుంది. కల్పక్రితము వలె మళ్లీ జరుగుతుంది. మీరు ఎంతెంత ధారణ చేస్తారో అంత ఉన్నత పదవి లభిస్తుంది. ఈ సమయములో ఎవరి వద్దనైనా 5 కోట్లు ఉన్నా అదంతా తప్పకుండా సమాప్తమైపోతుంది. మనము మళ్లీ మన నూతన ప్రపంచములోకి వెళ్తాము. ఇప్పుడు మీరు నూతన ప్రపంచములోకి వెళ్లేందుకు ఇచ్చటకు వచ్చారు. నూతన ప్రపంచములోకి వెళ్లేందుకు చదువుతున్నామని ఇతర ఏ సత్సంగములోనూ భావించరు. బాబా మనలను మొదట భికారులుగా చేసి తర్వాత రాకుమారులుగా చేస్తారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. దేహ సంబంధాలన్నీ వదిలితే భికారులుగా అయినట్లే కదా. అసలు ఏమీ లేదు. ఇప్పుడు భారతదేశములో ఏమీ లేదు. భారతదేశమిప్పుడు భికారిగా, దివాలా(ఇన్‌సాల్వెంట్‌) తీసి ఉంది. మళ్లీ సంపన్నంగా అవుతుంది. సంపన్నంగా అయ్యేదెవరు? ఆత్మ శరీరము ద్వారా అవుతుంది. ఇప్పుడు రాజా-రాణులు కూడా లేరు. వారు కూడా దివాలా తీశారు. వారికి కిరీటాలు కూడా లేవు. ఆ కిరీటమూ లేదు, రత్నజడిత కిరీటము కూడా లేదు. ఇది అంధకార నగరంగా ఉంది. సర్వవ్యాపి అని అనేస్తారు. అనగా అందరిలో భగవంతుడున్నాడు, అందరూ సమానమే, కుక్క-పిల్లి అన్నింటిలోనూ ఉన్నారని అంటారు. దీనినే అంధకార నగరము,........... అని అంటారు. అది బ్రాహ్మణులైన మీ రాత్రి. జ్ఞానమనే పగలు వస్తూ ఉందని ఇప్పుడు మీకు తెలుసు. సత్యయుగములో అందరూ వెలిగే జ్యోతులుగా అవుతారు. ఇప్పుడు దీపాలు పూర్తి ప్రకాశహీనమై కొడిగట్టి ఉన్నాయి. భారతదేశములోనే దీపాలు వెలిగించే ఆచారముంది. ఇతరులెవ్వరూ దీపమును వెలిగించరు. మీ జ్యోతి ఆరిపోతూ ఉంది. సతోప్రధాన విశ్వానికి అధికారులుగా ఉండేవారు, ఆ శక్తి తగ్గుతూ-తగ్గుతూ ఇప్పుడు ఏ మాత్రము శక్తి లేకుండా ఉంది. తండ్రి వచ్చి మళ్లీ మీకు శక్తినిస్తున్నారు. బ్యాటరీ ఛార్జ్‌ నిండుతుంది. ఆత్మకు తండ్రి అయిన పరమాత్మ స్మృతి ఉన్నందున ఛార్జ్‌ నిండుతుంది. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. ఇప్పుడు నాటము పూర్తి అవుతూ ఉంది. మనము వాపస్‌ వెళ్లాలి, అందువలన ఆత్మను తండ్రి స్మృతి ద్వారా సతోప్రధానంగా, పావనంగా తప్పకుండా చేయాలి. తండ్రి సమానంగా జ్ఞానసాగరులు, శాంతిసాగరులుగా ఇప్పుడే అవ్వాలి.

2. ఈ దేహ సహితము పూర్తి భికారిగా అయ్యేందుకు ఈ కనుల ద్వారా చూస్తున్నదంతా సమాప్తమైపోతుందని బుద్ధిలో ఉండాలి. మనము భికారి నుండి రాకుమారునిగా అవ్వాలి, మన చదువే నూతన ప్రపంచము కొరకు.

వరదానము :-

'' ఒక్క తండ్రి ప్రేమలో లవలీనమై గమ్యానికి చేరుకునే సర్వ ఆకర్షణ మూక్త్‌ భవ ''

బాప్‌దాదా, పిల్లలను తన స్నేహము మరియు సహయోగమనే ఒడిలో కూర్చోబెట్టి గమ్యానికి తీసుకెళ్తున్నారు. ఇది కష్టమైన మార్గము కాదు. కాని మీరు హైవేకి బదులు సందులలోకి వెళ్తారు లేక గమ్యము కంటే ఇంకా ముందుకు వెళ్లిపోతారు. కనుక వెనుకకు వచ్చేందుకు కష్టపడాల్సి వస్తుంది. కష్టము నుండి రక్షించుకునే సాధనం - ఒక్కరి ప్రేమలోనే ఉండండి. ఒక్క తండ్రి ప్రేమలో లీనమై ఏ పని చేసినా, ఇతరమేదీ కనిపించదు. అన్ని ఆకర్షణల నుండి ముక్తమవుతారు.

స్లోగన్‌ :-

'' మీ గొప్ప అదృష్టాన్ని మీ ముఖము ద్వారా, నడవడిక ద్వారా అనుభవం చేయించండి ''