25-05-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - ఈ జన్మలో చేసిన పాప భారము నుండి తేలికగా అయ్యేందుకు తండ్రికి సత్య సత్యముగా అంతా వినిపించండి. వెనుకటి జన్మలలో చేసిన వికర్మలను యోగాగ్ని ద్వారా సమాప్తం చేసుకోండి.''
ప్రశ్న :-
ఈశ్వరీయ సేవాధారులుగా అయ్యేందుకు ఏ ఒక్క చింత ఉండాలి ?
జవాబు :-
స్మృతి యాత్ర చేస్తూ తప్పకుండా పావనంగా అవ్వాలి. పవిత్రంగా అవ్వాలనే చింత ఉండాలి. ఇదే ముఖ్యమైన విషయము(సబ్జెక్టు). పవిత్రంగా తయారైన పిల్లలే తండ్రికి సేవాధారులుగా అవ్వగలరు. తండ్రి ఒంటరిగా ఏం చేస్తారు? అందుకే పిల్లలు శ్రీమతమును అనుసరించి తమ యోగబలము ద్వారానే విశ్వాన్ని పావనంగా చేసి పావన రాజధానిని తయారుచేయాలి. మొదట స్వయాన్ని పావనంగా చేసుకోవాలి.
ఓంశాంతి.
బాబా వద్దకు రిఫ్రెష్(తాజాగా) అయ్యేందుకు వచ్చామని పిల్లలకు తెలుసు. అక్కడ సేవాకేంద్రాలకు వెళ్ళినప్పుడు ఈ విధంగా భావించలేరు. బాబా మధువనంలో ఉన్నారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తండ్రి మురళి వినిపించేదే పిల్లల కొరకు. మురళి వినేందుకు మధువనానికి వెళ్తామని పిల్లలు భావిస్తారు. ఇంతకు ముందు మురళి అను పదము కృష్ణునికి వర్తిస్తుందని భావించారు. మురళి అర్థము ఇంకేదో కాదు. పిల్లలైన మీకు ఇప్పుడు బాగా అర్థమయ్యింది కదా. తండ్రి అర్థం చేయించారు - మేము మరియు మీరు చాలా తెలివిహీనులుగా ఉండేవారమని ఇప్పుడు మీరు అనుభవం చేస్తున్నారు. ఈ విధంగా ఇతరులెవ్వరూ భావించరు. ఇక్కడకు వచ్చినప్పుడు మీరు నిశ్చయబుద్ధి గలవారిగా అవుతారు. నిజంగా మేము చాలా అవివేకులుగా ఉండేవారమని భావిస్తారు. మీరు సత్యయుగములో ఎంతో తెలివిగలవారిగా, విశ్వమంతటికి అధికారులుగా ఉండేవారు! మూర్ఖులుగా ఉండేవారెవ్వరూ విశ్వానికి అధికారులుగా అవ్వలేరు. ఈ లక్ష్మినారాయణులు విశ్వమంతటికి అధికారులుగా ఉండేవారు. చాలా వివేకవంతులైనందునే భక్తిమార్గములో పూజింపబడుతున్నారు. జడచిత్రాలు ఏవీ మాట్లాడలేవు. శివబాబాను పూజిస్తారు. వారేమైనా మాట్లాడ్తారా! శివబాబా వచ్చి మాట్లాడేది ఒక్కసారి మాత్రమే. ఈ జ్ఞానము వినిపించేవారు తండ్రేనని పూజించేవారికి కూడా తెలియదు. కృష్ణుడు మురళి మ్రోగించారని భావిస్తారు. ఎవరినైతే పూజిస్తారో, వారి కర్తవ్యమును గురించి ఏ మాత్రమూ తెలియదు. అందుకే బాబా వచ్చినంతవరకు ఈ పూజలు మొదలైనవి నిష్ఫలితంగా ఉంటాయి. పిల్లలైన మీలో చాలామంది వేదశాస్త్రాలు మొదలైనవేవీ చదవలేదు. ఇప్పుడు మిమ్ములను సత్యమైన తండ్రి ఒక్కరే చదివిస్తున్నారు. సత్యమును చదివించేవారు ఒక్క తండ్రేనని మీరు తెలుసుకున్నారు. తండ్రిని సత్యము(ట్రూత్) అని అంటారు. నరుని నుండి నారాయణునిగా చేసే సత్యమైన కథను వినిపిస్తారు. అర్థము సరిగ్గా ఉంది. సత్యమైన తండ్రి వచ్చారు, ఇప్పుడు నరుని నుండి నారాయణునిగా అవ్వాలి. కనుక తప్పకుండా సత్యయుగాన్ని స్థాపన చేస్తారు కదా. పాత ప్రపంచము అనగా కలియుగమైతే తయారవ్వదు కదా. కథ వినునప్పుడు మేము నరుని నుండి నారాయణునిగా అవుతామని ఎవ్వరి బుద్ధిలోనూ ఉండదు. ఇప్పుడు మీకు నరుని నుండి నారాయణునిగా తయారయ్యే రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇది కూడా క్రొత్త విషయమేమీ కాదు. కల్ప-కల్పము వచ్చి నేర్పిస్తానని తండ్రి చెప్తున్నారు. యుగయుగము ఎలా వస్తాను! బ్రహ్మ చిత్రమును చూపించి, ఇతను శివబాబా రథమని మీరు అర్థం చేయించవచ్చు. ఇది అనేక జన్మల అంతిమ పతిత జన్మ. ఇప్పుడు ఇతను కూడా పావనంగా అవుతారు. మనము కూడా అవుతాము. యోగబలము లేకుండా ఎవ్వరూ పావనంగా అవ్వలేరు. వికర్మలు వినాశనమవ్వవు. నీటిలో స్నానము చేసినందున ఎవ్వరూ పావనంగా అవ్వలేరు. ఇది యోగాగ్ని. నీరు అగ్నిని ఆర్పి వేస్తుంది. అగ్ని కాల్చేస్తుంది. వికర్మలు వినానమయ్యేందుకు నీరేమీ అగ్ని కాదు. అందరికంటే ఎక్కువ మంది గురువులను ఆశ్రయించింది ఇతనే. శాస్త్రాలు కూడా చాలానే చదివారు. ఈ జన్మలో ఒక పండితుని వలె ఉండేవారు. కానీ దాని వలన ఏ లాభము కలుగలేదు. పుణ్యాత్మగా అవ్వనే అవ్వలేదు. పాపమే చేస్తూ వచ్చాడు. స్వయాన్ని పిల్లలమని భావించువారు ఈ జన్మలో చేసిన పాపాలన్నిటిని తండ్రి సన్ముఖములో వచ్చారు కనుక వారికి తెలియజేయాలి. అలా తెలిపితే తేలికగా అవుతారు. ఈ జన్మలో తేలికైపోతారు. కానీ జన్మ జన్మాంతరాల పాపకర్మల భారము తల నుండి దించుకునేందుకు పురుషార్థము చేయాలి. తండ్రి యోగము చేయమని అర్థం చేయిస్తున్నారు. యోగము ద్వారానే వికర్మలు వినాశనమౌతాయి. ఈ విషయాలన్నీ మీరిప్పుడే వింటున్నారు. సత్యయుగములో ఈ విషయాలు ఎవ్వరూ వినిపించరు. ఇదంతా డ్రామాలో తయారయ్యే ఉంది. సెకండు సెకండు ఈ మొత్తము డ్రామా అంతా తిరుగుతూనే ఉంటుంది. ఒక్క సెకండు మరో సెకండుతో కలవదు. సెకండు సెకండు ఆయువు కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆయువు తగ్గిపోకుండా బ్రేక్ వేస్తారు. అంతేకాక యోగము ద్వారా మీ ఆయువును పెంచుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు యోగబలము ద్వారా మీ ఆయువును వృద్ధి చేసుకోవాలి. యోగము చేయమని బాబా చాలా తీవ్రంగా చెప్తున్నారు. అయితే ఎవ్వరూ అర్థము చేసుకోరు. బాబా, మేము మర్చిపోతామని అంటారు. యోగమంటే ఇంకేదో కాదు, స్మృతియాత్రేనే యోగమంటారని బాబా చెప్తున్నారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పాపాలు అంతమవుతూ ఉంటాయి. అంతమతి సో గతిగా అవుతారు. దీని పై ఒక ఉదాహరణ కూడా ఇస్తూ ఉంటారు - నీవు ఒక గేదెవు అని ఎవరో చెప్తే, అతను నేను గేదెను, గేదెను అని భావించసాగాడు. తర్వాత ఎవరో ఈ వాకిలి ద్వారా బయటకు రా అని అన్నప్పుడు - నేను గేదెను, ఈ వాకిలిలో నేను పట్టను, ఎలా రాగలను? అని అన్నాడట. నిజంగా గేదె వలె అయిపోయాడు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. అంతేకాని సత్యము కాదు. ఇది యథార్థమైన ఉదాహరణ కాదు. ఎల్లప్పుడూ నిజమైన విషయం పైనే ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది.
ఇప్పుడు తండ్రి మీకు ఏదైతే అర్థం చేయించారో దానినంతా భక్తిమార్గములో పండుగల రూపములో జరుపుకుంటారు. ఎన్నో ఉత్సవాలు, జాతర్లు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జరిగేదంతా వారికి పండుగలుగా అవుతాయి. మీరిచ్చట ఎంత స్వచ్ఛంగా అవుతారు! జాతర్లు, ఉత్సవాలలో ఎంతో మురికి ఉంటుంది, శరీరానికి మట్టి పూసుకుంటారు, పాపాలు నశిస్తాయని భావిస్తారు. ఈ బాబా ఇవన్నీ స్వయంగా చేశారు. నాసిక్లో నీరు చాలా మురికిగా ఉంటుంది. అక్కడకు వెళ్ళి మట్టి పూసుకుంటారు. పాపాలు వినాశమౌతాయని భావిస్తారు. ఆ మట్టిని శుభ్రపరచేందుకు నీరు తీసుకొస్తారు. విదేశాలకు వెళ్లునప్పుడు గొప్ప మహారాజులు మొదలైనవారు గంగా జలాన్ని కుండలలో నింపుకొని తమ వెంట తీసుకెళ్ళేవారు. స్టీమర్లలో ప్రయాణించునప్పుడు ఆ నీరే త్రాగేవారు. పూర్వము విమానాలు, మోటర్లు మొదలైనవి ఉండేవి కావు. 100-150 సంవత్సరాల నుండి ఏమేమో తయారయ్యాయి. సత్యయుగం ఆదిలో ఈ విజ్ఞానము మొదలైనవన్నీ ఉపయోగపడ్తాయి. అక్కడ మహళ్ళు మొదలైనవి తయారయ్యేందుకు ఆలస్యమే ఉండదు. ఇప్పుడు మీరు బంగారుబుద్ధి గలవారిగా అవుతారు. అందువలన అన్ని పనులు సులభంగా చేసుకుంటారు. ఇక్కడ ఎలాగైతే మట్టి ఇటుకలు తయారౌతాయో అలా అచ్చట బంగారు ఇటుకలు తయారౌతాయి. దీనిని గురించే మాయా మశ్చింద్ర నాటకము కూడా చూపిస్తారు. వారు దీనిని చూపించేందుకు కూర్చుని ఒక నాటకాన్ని తయారు చేశారు. స్వర్గములో సత్యమైన బంగారు ఇటుకలు నిజంగా ఉంటాయి. దాని పేరే బంగారు యుగము(గోల్డెన్ ఏజ్). దీనిని ఇనుప యుగమని(ఐరన్ ఏజ్) అని అంటారు. స్వర్గమును అందరూ గుర్తు చేసుకుంటారు. దాని చిత్రాలు కూడా ఇప్పటికీ స్థిరంగా ఉన్నాయి. ఆది సనాతన ధర్మమని కూడా అంటారు. మళ్లీ హిందూ ధర్మమని పిలుస్తారు. దేవతలకు బదులు హిందువులని అనేస్తారు. ఎందుకంటే వికారులుగా ఉన్నారు కనుక దేవతలని ఎలా అంటారు? మీరు ఎక్కడకు వెళ్ళినా దీనిని అందరికీ అర్థం చేయిస్తారు. ఎందుకంటే మీరు సందేశకులు. సందేశకులు తండ్రి పరిచయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. మీరు సత్యమే చెప్తున్నారని కొందరు వెంటనే అర్థము చేసుకుంటారు. ఇద్దరు తండ్రులున్నారు, ఇది సత్యమే అని వారికి అర్థమవ్వాలి. కొంతమంది పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు. ఒక(లౌకిక) తండ్రి ద్వారా పరిమిత వారసత్వము లభిస్తుందని, పారలౌకిక తండ్రి ద్వారా 21 జన్మలకు అపరిమిత వారసత్వము లభిస్తుందని మీకు తెలుసు. ఈ జ్ఞానమంతా మీకు ఇప్పుడు మాత్రమే తెలుసు. అక్కడ ఈ జ్ఞానముండదు. వారసత్వము సంగమ యుగములోనే లభిస్తుంది. ఇది 21 తరాల వరకు ఉంటుంది. జన్మ తర్వాత జన్మ మీరు రాజ్యము చేస్తారు. మీరు విశ్వమంతటికీ అధికారులుగా అవుతారు. ఇదంతా మీకు ఇప్పుడే తెలిసింది. పక్కా నిశ్చయబుద్ధి గలవారికి ఎలాంటి సంశయమూ రాదు. అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వము లభిస్తుంది. శివబాబా వచ్చారంటే వారు ఎంతో కొంత వారసత్వమును ఇవ్వనే ఇస్తారు. అందుకే బ్యాడ్జి చాలా బాగుంటుందని బాబా చెప్తున్నారు. ఇది తప్పకుండా మీ వద్ద ఉండాలి. ఇంటింటికి సందేశమివ్వాలి. వారు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మీరేమో సందేశమునివ్వండి. వినాశనము వచ్చినప్పుడు భగవంతుడు వచ్చారని తెలుసుకుంటారు. మీరు ఎవరెవరికి సందేశము ఇచ్చారో వారు చివరి సమయములో, ఆ రోజు తెల్ల వస్త్ర్రాలు ధరించిన ఫరిస్తాలు(దేవతలు) ఎవరా అని గుర్తు చేసుకుంటారు. సూక్ష్మవతనములో కూడా మీరు ఫరిస్తాలను చూస్తారు కదా. మమ్మా-బాబా యోగబలము ద్వారా ఇటువంటి ఫరిస్తాలుగా అవుతారు కనుక మేము కూడా అలా అవుతామని మీకు తెలుసు. తండ్రి ఇతనిలో ప్రవేశించి ఈ విషయాలన్నీ మీకు అర్థం చేయిస్తారు. నేరుగా జ్ఞానము ఇస్తున్నారు. బాబాలో ఉన్న జ్ఞానమంతా పిల్లలైన మీలో కూడా ఉంది. పైకి వెళ్ళినప్పుడు జ్ఞాన పాత్ర సమాప్తమైపోతుంది. తర్వాత లభించే పాత్ర చాలా సుఖప్రదమైనది. అప్పుడు ఈ జ్ఞానము పూర్తిగా మర్చిపోతారు.
పిల్లలైన మీరు ఎక్కడకు వెళ్లినా సందేశకుల గుర్తైన ఈ బ్యాడ్జిని ఎప్పుడూ ధరించే ఉండాలి. ఎవరు ఎగతాళి చేసినా ఈ బ్యాడ్జి మీ వెంటనే ఉండాలి. దీనిని చూసి ఎందుకు నవ్వుతారు? మీరు సత్యమైన విషయాలే వినిపిస్తారు. వీరు అనంతమైన తండ్రి, వీరి పేరు శివబాబా, వీరు కళ్యాణకారి, వీరు వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు, ఇది పురుషోత్తమ సంగమ యుగము మొదలైన జ్ఞానమంతా పిల్లలైన మీకు లభించింది. ఈ జ్ఞానాన్ని మీరు ఎందుకు మర్చిపోవాలి? ఇది చాలా సులభమైన విషయం. నడుస్తూ తిరుగుతూ తండ్రిని, వారసత్వమును స్మృతి చేయాలి. శాంతిధామము, సుఖధామమును గుర్తు చేసుకోవాలి. ఇక్కడకు వచ్చి మురళి విని వెళ్ళిన తర్వాత మీరు ఇతరులకు వినిపించాలి. ఒక బ్రాహ్మణీ మాత్రమే మురళి చదవాలి అని అనుకోరాదు, బ్రాహ్మణి తన సమానంగా తయారు చేయాలి అప్పుడు మీరు చాలా మందికి కళ్యాణము చేయగలరు. ఒక బ్రాహ్మణి ఎక్కడకైనా వెళ్తే మరొకరు సేవాకేంద్రాన్ని ఎందుకు నడపరాదు! ధారణ చేయలేదా? విద్యార్థులకు చదివి చదివించే ఆసక్తి ఉండాలి. మురళి చాలా సులభము. ఎవరైనా ధారణ చేసి క్లాసు చేయవచ్చు. ఇక్కడ తండ్రి కూర్చుని ఉన్నారు. తండ్రి ఏ విషయములోనూ సంశయము ఉంచుకోకండని పిల్లలకు చెప్తున్నారు. అన్నీ తెలిసినవారు ఒక్క తండ్రి మాత్రమే. లక్ష్యము అందరికీ ఒక్కటే. ఇందులో ఎలాంటి ప్రశ్నలు అడిగే అవసరమే ఉండదు. ఉదయము కూడా నేను కూర్చుని స్మృతియాత్రలో పిల్లలకు సహాయము చేస్తాను. అనేకమంది పిల్లలు స్మృతి చేస్తారు. పిల్లలైన మీరంతా ఈ స్మృతి సహాయంతో విశ్వమంతటిని పావనంగా తయారు చేయాలి. ఇందులోనే మీరు సహయోగ రూపి వేేలునిస్తారు. ప్రపంచమంతటిని పవిత్రంగా చేయాలి కదా. కావున అందరూ శాంతిధామానికి వెళ్ళిపోవాలని తండ్రి అందరి పై తమ దృష్టిని ఉంచుతారు. అందరి ధ్యాసను అటువైపు లాగుతారు. తండ్రి అనంతములోనే ఉంటారు. ప్రపంచమంతటినీ పవిత్రంగా చేసేందుకు నేను వచ్చాను. మొత్తం ప్రపంచమంతటినీ పవిత్రంగా చేసేందుకు కరెంటు(శక్తిని)నిస్తున్నాను. యోగబలము పూర్తిగా ఉన్నవారు ఇప్పుడు బాబా కూర్చుని స్మృతి యాత్ర చేస్తున్నారని, దాని ద్వారా విశ్వములో శాంతి నెలకొల్పబడుతుందని అర్థము చేసుకుంటారు. పిల్లలు కూడా స్మృతి చేస్తూ ఉంటారు కనుక సహాయము లభిస్తుంది. సహాయకారులైన పిల్లలు కూడా కావాలి కదా. ఈశ్వరీయ సేవాధారులు, నిశ్చయబుద్ధి గలవారు స్మృతి చేస్తారు. మొట్టమొదటి సబ్జక్టు(విషయము) పావనంగా అవ్వడం అనగా పిల్లలైన మీరు తండ్రితో పాటు నిమిత్తంగా అవుతారు. ''ఓ పతితపావనా! రండి'' అని తండ్రినే పిలుస్తారు. వారు ఒంటరిగా వచ్చి ఏం చేస్తారు? సేవాధారులు కావాలి కదా. మనము విశ్వాన్ని పవిత్రంగా చేసి మళ్లీ విశ్వమంతటి పై రాజ్యపాలన చేస్తామని మీకు తెలుసు. ఇటువంటి నిశ్చయము బుద్ధిలో ఉంటే నషా పెరుగుతుంది. తండ్రి శ్రీమతము ద్వారా, మన యోగబలము ద్వారా మన కొరకు మనము రాజధానిని స్థాపన చేస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఈ నషా ఎప్పుడూ ఎక్కి ఉండాలి. ఇవన్నీ ఆత్మిక విషయాలు. ప్రతి కల్పము బాబా ఆత్మిక బలము ద్వారా మనలను విశ్వానికి అధికారులుగా చేస్తారని మీకు తెలుసు. శివబాబా వచ్చి స్వర్గ స్థాపన చేస్తున్నారని కూడా మీకు తెలుసు. ఇప్పుడు తలలో స్మృతి యాత్రయే ఉంది. పురుషార్థము చేయాలి. వ్యాపారము మొదలైనవి చేస్తూ కూడా స్మృతియాత్రలో ఉండాలి. సదా ఆరోగ్యవంతులుగా అయ్యేందుకు తండ్రి చాలా గొప్ప సంపాదన చేయిస్తారు. ఇప్పుడు అన్నీ మర్చిపోవలసి వస్తుంది. ఆత్మలైన మనము అక్కడకు వెళ్ళిపోతున్నాము. ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసము చేయించడం జరుగుతుంది. తింటూ, త్రాగుతూ, నడుస్తూ, తిరుగుతూ తండ్రిని స్మృతి చేయలేరా? బట్టలు మిషను పై కుడ్తున్నా బుద్ధియోగము తండ్రి జతలోనే ఉండాలి. చాలా సులభము. 84 జన్మల చక్రము పూర్తి అయ్యిందని మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు తండ్రి ఆత్మలైన మనకు రాజయోగమును నేర్పించేందుకు వచ్చారు. ఈ ప్రపంచ చరిత్ర - భూగోళము రిపీట్ అవుతూ(పునరావృతమౌతూ) ఉంటుంది. కల్పక్రితము కూడా ఇలాగే జరిగింది. అదే ఇప్పుడు మళ్లీ రిపీట్ అవుతూ ఉంది. ఈ పునరావృత రహస్యము కూడా తండ్రే మనకు అర్థం చేయిస్తారు. ప్రతి ఒక్కరికి డ్రామాలో పాత్ర లభించింది. ఆ పాత్ర చేస్తూ ఉంటారు. తండ్రిని స్మృతి చేస్తే సతోప్రధానంగా అవుతారని పిల్లలకు సలహా ఇస్తున్నారు. తర్వాత ఈ శరీరము కూడా వదిలిపోతుంది. ఆత్మలమైన మనము సతోప్రధానంగా అవ్వాలని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఎందుకంటే వాపస్ ఇంటికి వెళ్ళాలి. సత్యయుగములో ఇలా అనరు. అక్కడ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటామని అంటారు. అక్కడ దు:ఖమనే మాటే లేదు. ఇప్పుడిది దు:ఖధామము. ఇది పాత శరీరము. కనుక దీనిని వదిలి వాపస్ ఇంటికి వెళ్ళాలని అర్థం చేసుకున్నారు. తండ్రిని నిరంతరము స్మృతి చేయాలి. ఆ నిరాకార తండ్రి ఒక్కరే జ్ఞానసాగరులు. వారే వచ్చి అందరికి సద్గతినిస్తారు. సాధువులను కూడా ఉద్ధరిస్తానని తండ్రి చెప్తున్నారు. మీరిప్పుడు ఒక్క తండ్రితోనే యోగము జోడించండి. ఆత్మలైన మీకందరికి తండ్రి నుండి వారసత్వము తీసుకునే హక్కు ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించి దేహీ - అభిమానులుగా అవ్వండి. అంతేకాక తండ్రిని నిరంతరము స్మృతి చేస్తే పాపాలు నశిస్తూ ఉంటాయి. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మురళి విని మళ్లీ ఇతరులకు వినిపించాలి. చదువుటే కాదు, దానితో పాటు చదివించాలి కూడా. కళ్యాణకారులుగా అవ్వాలి. బ్యాడ్జి సందేశకులకు గుర్తు, దానిని సదా తప్పకుండా ధరించి ఉండండి.
2. విశ్వములో శాంతి స్థాపన చేసేందుకు స్మృతియాత్రలో ఉండాలి. తండ్రి దృష్టి ఎలాగైతే ఎప్పుడూ అనంతములో ఉంటుందో, మొత్తం ప్రపంచమునంతా పవిత్రంగా చేసేందుకు కరెంటును ఇస్తారో, అదే విధంగా తండ్రిని అనుసరించి వారికి సహాయకారులుగా అవ్వాలి.
వరదానము :-
'' ప్రతి ఆత్మతో సంబంధ సంపర్కములోకి వస్తూ అందరికి దానమిచ్చే మహాదానీ, వరదానీ భవ ''
మొత్తం రోజంతటిలో మీ సంబంధ సంపర్కములోకి ఎవరు వచ్చినా వారికి ఏదో ఒక శక్తిని గాని, జ్ఞానరత్నాన్ని గాని, గుణాన్ని గాని దానం ఇవ్వండి. మీ వద్ద జ్ఞాన ఖజానా ఉంది, అలాగే శక్తుల ఖజనా, గుణాల ఖజానా కూడా ఉంది. కనుక ఏ రోజు కూడా దానమివ్వకుండా ఖాళీగా ఉండరాదు. అప్పుడు మిమ్ములను మహాదానులని అంటారు. 2) దానానికి ఆధ్యాత్మిక అర్థము - సహయోగమివ్వడం. కనుక మీ శ్రేష్ఠ స్థితిలోని వాయుమండలం ద్వారా, మీ వృత్తి ద్వారా వెలువడే వైబ్రేషన్ల ద్వారా ప్రతి ఆత్మకు సహయోగమివ్వండి. అప్పుడు మిమ్ములను వరదాని అని అంటారు.
స్లోగన్ :-
'' ఎవరైతే బాప్దాదాకు, పరివారానికి సమీపంగా ఉంటారో వారి మొఖము పై సంతుష్టత, ఆత్మీయత మరియు ప్రసన్నతల చిరునవ్వు ఉంటుంది.