29-05-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - ఎవరి నామ-రూపాలలోనైనా చిక్కుకోవడమే అత్యంత కఠినమైన వ్యాధి. అంతర్ముఖులుగా అయ్యి ఈ వ్యాధిని పరిశీలించుకోండి, దీని నుండి ముక్తులుగా అవ్వండి.''

ప్రశ్న :-

నామ-రూపాల వ్యాధిని సమాప్తము చేసేందుకు ఉపాయమేది? దీని వలన కలిగే నష్టాలేవి?

జవాబు :-

నామ-రూపాల జబ్బును సమాప్తము చేసుకునేందుకు ఒక్క తండ్రితో సత్యమైన ప్రేమనుంచుకోండి. స్మృతి చేయు సమయములో బుద్ధి నలువైపులా పరిగెడ్తూ దేహధారుల స్మృతి వస్తూ ఉంటే తండ్రికి నిజం చెప్పండి. సత్యమును తెలుపుట వలన తండ్రి క్షమిస్తారు. సర్జన్‌ వద్ద జబ్బును దాచిపెట్టకండి. బాబాకు వినిపించినందున జాగ్రత్త వహిస్తారు. బుద్ధి ఎవరి నామ-రూపాలలోనైనా తగుల్కొని ఉంటే తండ్రితో బుద్ధి జోడింపబడదు. అటువంటివారు సేవ (సర్వీస్‌)కు బదులుగా డిస్‌సర్వీసు చేస్తారు. తండ్రిని నిందింపజేస్తారు. ఇటువంటి నిందకులు చాలా కఠినమైన శిక్షలకు పాత్రులవుతారు.

ఓంశాంతి.

ప్రతి ఒక్కరికి తండ్రి ద్వారా వారసత్వము లభిస్తుందని పిల్లలకు తెలుసు. సోదరునికి సోదరుని ద్వారా ఎప్పుడూ కూడా వారసత్వము లభించదు. సోదరునికి గాని, సోదరికి గాని ప్రతి ఒక్కరి స్థితిని గూర్చి తెలియదు. అన్ని సమాచారాలు బాప్‌దాదా వద్దకు వస్తాయి. ఇది ప్రాక్టికల్‌గా జరిగే విషయము. నేను ఎంతవరకు స్మృతి చేస్తున్నాను? అని ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలి. ఇతరుల నామ-రూపాలలో ఎంతవరకు చిక్కుకొని ఉన్నాను? ఆత్మ వృత్తి ఎక్కడెక్కడకు వెళ్తూ ఉంది? అని ఎవరిని వారు పరిశీలించుకుంటూ ఉండాలి. వీటిని గురించి ఆత్మకు స్వయం తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావించవలసి వస్తుంది. నా వృత్తి ఒక్క శివబాబా వైపే వెళ్తోందా? లేక ఇతరుల నామ-రూపాల వైపు వెళ్తోందా? అని పరిశీలించుకోవాలి. ఎంత ఎక్కువగా వీలైతే అంత స్వయాన్ని ఆత్మగా భావించి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. మిగిలినవన్నీ మర్చిపోతూ ఉండాలి. నా మనస్సు ఒక్క తండ్రి వైపు తప్ప మరెక్కడా తిరగడం లేదు కదా? అని ప్రశ్నించుకోవాలి. వృత్తి వ్యాపారాలలో, గృహస్థ వ్యవహారాలలో, బంధు-మిత్రుల వైపు బుద్ధి వెళ్లడం లేదు కదా? అని అంతర్ముఖులుగా అయ్యి చెక్‌ చేసుకోవాలి. ఇక్కడ కూర్చున్నప్పుడు స్వయం చెక్‌ చేసుకుంటూ ఉండాలి. ఎవరో ఒకరు మీ ముందు యోగములో కూర్చుని ఉంటారు. వారు కూడా శివబాబాను స్మృతి చేస్తూ ఉంటారు. అంతేకాని వారి పిల్లలను గుర్తు చేసుకుంటూ ఉండరు కదా. ఒక్క శివబాబానే స్మృతి చేయాలి. ఇక్కడ శివబాబా స్మృతిలోనే కూర్చుంటారు. కొంతమంది కనులు తెరచుకుని కుర్చుంటారు. కొంతమంది కనులు మూసుకుని కుర్చుంటారు. ఇది బుద్ధి ద్వారా అర్థము చేసుకునే విషయము. బాబా ఏమి అర్థం చేయిస్తున్నారని మిమ్ములను మీరు ప్రశ్నించుకుంటూ ఉండాలి. మనము ఒక్క బాబాను మాత్రమే స్మృతి చేయాలి. ఇక్కడ కూర్చున్నవారంతా ఒక్క శివబాబా స్మృతిలోనే ఉంటారు. వారు మిమ్ములను చూడరు. ఎందుకంటే వారికి ఎవరి స్థితి ఎలా ఉందో తెలియదు. కానీ బాబాకు ప్రతి ఒక్కరి సమాచారము తెలుస్తుంది. ఏ ఏ పిల్లలు బాగున్నారో ఎవరి లైను స్పష్టంగా ఉందో అంతా వారికి తెలుసు. వారి బుద్ధి యోగము మరెక్కడకూ వెళ్ళదు. కొంతమంది బుద్ధి యోగము ఎక్కడెక్కడికో వెళ్తుంది. మళ్లీ మురళి వినడం ద్వారా వారిలో మార్పు జరుగుతుంది. తప్పు జరిగినట్లు అర్థం చేసుకుంటారు. దృష్టి, వృత్తి కూడా తప్పుడు మార్గములో ఉన్నట్లు అనుభవము చేస్తారు. ఇప్పుడు వాటిని సరి చేసుకోవాలి, చెడు వృత్తిని వదిలిపెట్టాలి అని భావిస్తారు. ఈ విధంగా సోదరుడు సోదరునికి అర్థం చేయించలేరని బాబా చెప్తున్నారు. వీరి వృత్తి, దృష్టి ఎలా ఉందని బాబా మాత్రమే తెలుసుకోగలరు. తండ్రి మాత్రమే మీ మానసిక పరిస్థితిని గురించి వినిపిస్తారు. శివబాబాకు తెలిపినప్పుడు ఈ దాదా కూడా అర్థము చేసుకుంటారు. వినుట, చూచుట ద్వారా ప్రతి ఒక్కరి గురించి తెలుసుకుంటారు. ఎంతవరకు వినలేదో అంతవరకు వారికి అతడు ఏమి చేస్తున్నాడో ఎలా తెలుస్తుంది? కర్మల ద్వారా, సేవ ద్వారా, వీరికి చాలా దేహాభిమానము ఉందని, ఫలానా వారికి తక్కువ దేహాభిమానము ఉందని, వీరి కర్మలు సరిలేవని అర్థం చేసుకుంటారు. ఎవరో ఒకరి నామ -రూపాలలో చిక్కుకొని ఉంటారు. ఎవరి వైపుకైనా బుద్ధి వెళ్లడం లేదు కదా? అని బాబా అడుగుతున్నారు. కొంతమంది ఉన్నది ఉన్నట్లు స్పష్టంగా తెలుపుతారు, మరి కొంతమంది ఎంతగా చిక్కుకొని ఉన్నారంటే బాబాకు తెలుపనే తెలపరు. తమకు తామే నష్టపరచుకుంటారు. తండ్రికి తెలిపినందున వారు క్షమించబడ్తారు. భవిష్యత్తుకు సంభాళన చేసుకుంటారు. చాలామంది తమ వృత్తి ఎలా ఉందో సత్యంగా తెలుపరు, సిగ్గుపడ్తారు. ఎవరైనా తప్పుడు పనులు చేసినప్పుడు సర్జన్‌కు చెప్పరు. దాచిపెట్టుట వలన జబ్బు ఇంకా పెరిగిపోతుంది. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. తండ్రికి తెలపడం ద్వారా తేలికైపోతారు. తెలపకుంటే లోలోపల చాలా భారమనిపిస్తుంది. తండ్రికి వినిపించినందున మళ్లీ అటువంటి పొరపాటు చేయరు. భవిష్యత్తులో స్వయం పై అప్రమత్తంగా కూడా ఉంటారు. తండ్రికి తెలపకుంటే ఆ తప్పు వారిలో వృద్ధి చెందుతూ ఉంటుంది. వీరు చాలా మంచి సేవాధారులని బాబాకు తెలుసు. అర్హత ఎలా ఉందో, సర్వీసులో కూడా ఎలా ఉంటారో బాబాకు తెలుసు. ఎవరిలోనూ తగుల్కొని లేరు కదా? అని ప్రతి ఒక్కరి జాతకమును చూస్తారు. మళ్లీ వారి పై ప్రేమ కూడా ఉంచుతారు, ఆకర్షిస్తారు. కొంతమంది చాలా మంచి సేవ చేస్తారు. వారి బుద్ధియోగము ఇతర వైపులకు వెళ్ళదు. ఇంతకు ముందు వెళ్ళేది. ఇప్పుడు అప్రమత్తంగా ఉన్నారు. బాబా, నేను ఇప్పుడు అప్రమత్తంగా ఉన్నానని కూడా తెలుపుతారు. ఇంతకు ముందు చాలా తప్పులు చేసేవారమని చెప్తారు. దేహాభిమానము కారణంగా తప్పులు చేశామని అర్థము చేసుకుంటారు. మళ్లీ పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఎవ్వరికీ తెలియకపోయినా పదవి అయితే భ్రష్ఠమైపోతుంది. ఇందులో హృదయ స్వచ్ఛత చాలా అవసరము. అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు. ఈ లక్ష్మీనారాయణుల వలె ఎవరి హృదయము శుద్ధంగా ఉంటుందో వారే ఉన్నత పదవిని పొందుతారు. కొంతమంది వృత్తి నామ-రూపాల వైపు ఉందని, ఆత్మాభిమానులై ఉండరని అందువలన పదవి కూడా తగ్గిపోతూ వచ్చిందని భావించబడ్తుంది. రాజుల నుండి పేదల వరకు పదవులు నెంబరువారుగా ఉంటాయి కదా. ఇలా ఎందుకు జరుగుతుంది? దీనిని గురించి కూడా అర్థము చేసుకోవాలి. నెంబరువారుగా అయితే తప్పకుండా అవుతారు. కళలు తగ్గిపోతూనే ఉంటాయి. 16 కళా సంపూర్ణంగా ఉండేవారు మళ్లీ 14 కళలలోకి వస్తారు. ఈ విధంగా కొద్ది కొద్దిగా తగ్గిపోతూ కళలు తప్పకుండా దిగజారిపోతాయి. 14 కళలున్నా మంచిదే. ఆ తర్వాత వామమార్గములో క్రిందకు దిగిపోవడం వలన వికారులుగా అయిపోతారు. ఆయువు కూడా తగ్గిపోతుంది. ఆ తర్వాత రజో, తమోగుణము గలవారిగా అవుతారు. తగ్గిపోతూ తగ్గిపోతూ పాతబడిపోతారు. ఆత్మ శరీరముతో పురాతనమౌతూ ఉంటుంది. ఆ జ్ఞానమంతా పిల్లలైన మీకు ఇప్పుడే లభించింది. 16 కళల నుండి క్రిందకు దిగుతూ దిగుతూ మళ్లీ మనుష్యులుగా ఎలా అవుతారో మీకు తెలుసు. దేవతల మతమైతే ఉండదు. తండ్రి శ్రీమతము లభించింది తర్వాత 21 జన్మల వరకు మతము లభించే అవసరమే ఉండదు. మీరనుసరించే ఈశ్వరీయ మతము 21 జన్మల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత రావణరాజ్యము వచ్చినప్పుడు మీకు రావణుని మతము లభిస్తుంది. దేవతలు వామమార్గములోకి వెళ్లినట్లు చూపిస్తారు కూడా. ఇతర ధర్మాలవారికి ఇలాంటి విషయాలు ఉండవు. దేవతలు వామమార్గములోకి వెళ్ళినప్పుడు ఇతర ధర్మాలవారు వస్తారు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ! మీరిప్పుడు వాపస్‌ ఇంటికి వెళ్ళాలి. ఇది పాత ప్రపంచము. డ్రామాలో నాకు కూడా ఈ పాత్ర ఉంది. పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేయడం నా పాత్ర అని మీరు అర్థం చేసుకున్నారు. ప్రపంచములోని మనుష్యులకు ఏమీ తెలియదు. మీరు ఎంతో అర్థము చేయిస్తారు. అయినా కొంతమంది మంచి అభిరుచి చూపిస్తారు, మరి కొంతమంది వారి మతమునే ఇస్తూ ఉంటారు. ఈ లక్ష్మీనారాయణులు ఉన్నప్పుడు పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉండేవి. ముఖ్యమైనది పవిత్రతయే. సత్యయుగములోని దేవీదేవతలు పవిత్రంగా ఉండేవారని మనుష్యులకు తెలియదు. దేవతలకు కూడా పిల్లలు మొదలైనవారు ఉన్నారు కదా అని వారు భావిస్తారు. కానీ అక్కడ యోగబలము ద్వారా జన్మిస్తారని ఎవ్వరికీ తెలియదు. జీవిత కాలమంతా పవిత్రంగా ఉంటే పిల్లలు మొదలైనవారు ఎలా పుడ్తారు అని అంటారు. ఇప్పుడు పవిత్రంగా ఉన్నందున తర్వాత 21 జన్మలు పవిత్రంగా ఉంటారని వారికి అర్థం చేయించాలి అనగా శ్రీమతమననుసరించి మేము నిర్వికారి ప్రపంచాన్ని స్థాపిస్తున్నామని వారికి అర్థం చేయించాలి. శ్రీమతమనగా తండ్రి తెలిపినదే. మానవుల నుండి దేవతలుగా........ అనే మహిమ కూడా ఉంది. ఇప్పుడున్న వారంతా మనుష్యులే. వీరే మళ్లీ దేవతలుగా అవుతారు. శ్రీమతముననుసరించి మనము దైవీ ప్రభుత్వాన్ని స్థాపన చేస్తున్నాము. ఇందులో చాలా ముఖ్యమైనది పవిత్రత. పవిత్రంగా అవ్వాల్సింది ఆత్మయే. ఆత్మయే రాతిబుద్ధిగా అయ్యింది. ఈ విషయాలు పూర్తిగా స్పష్టంగా తెలపండి. సత్యయుగ దైవీ ప్రభుత్వాన్ని స్థాపన చేసింది తండ్రే అని తెలపండి. దానినే స్వర్గమని అంటారు. మానవులను దేవతలుగా తండ్రియే తయారు చేశారు. మనుష్యులు పతితులుగా ఉండేవారు. వారిని పతితుల నుండి పావనంగా ఎలా తయారుచేశారు? నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారని పిల్లలకు తెలియజేశారు. ఇది ఎవరికైనా అర్థం చేయిస్తే వారి హృదయానికి హత్తుకుంటుంది. ఇప్పుడు పతితుల నుండి పావనంగా ఎలా అవుతారు? తప్పకుండా తండ్రినే స్మృతి చేయవలసి ఉంటుంది. ఇతరులతో బుద్ధి యోగమును తొలగించి ఒక్కరితోనే సాంగత్యమును జోడించాలి. అప్పుడే మానవుల నుండి దేవతలుగా అవ్వగలరు. ఈ విధంగా మీరు అందరికీ అర్థం చేయించాలి. మీరు అర్థం చేయించేదంతా డ్రామానుసారము పూర్తి ఖచ్ఛితమైనది. వారు అర్థము చేసుకుంటారు. అయినా ప్రతిరోజు ఇతరులకు అర్థము చేయించేందుకు పాయింట్లు లభిస్తూ ఉంటాయి. పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలి అన్నదే ముఖ్యమైన విషయము. దేహ ధర్మాలన్నీ వదిలి నన్ను ఒక్కరినే స్మృతి చేయండని తండ్రి చెప్తున్నారు. ఈ పురుషోత్తమ సంగమ యుగము గురించి కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మనము ప్రజాపిత బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణులుగా అయ్యాము, తండ్రి మనలను చదివిస్తున్నారు. బ్రాహ్మణులుగా అవ్వకుంటే మనము దేవతలుగా ఎలా అవుతాము? ఈ బ్రహ్మ కూడా పూర్తి 84 జన్మలు తీసుకుంటాడు. మళ్లీ అతడే మొదటి నెంబరు తీసుకోవలసి ఉంటుంది. తండ్రి వచ్చి ప్రవేశిస్తారు. కావున ముఖ్యమైన మాట - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. దేహాభిమానం కారణంగా ఎక్కడో ఒక చోట తగుల్కొని ఉంటారు. దేహీ-అభిమానులుగా అయితే అందరూ అవ్వలేరు. నేను దేహాభిమానములోకి రావడం లేదు కదా? అని మిమ్ములను మీరు చెక్‌ చేసుకోవాలి. నా ద్వారా ఏ వికర్మలు జరగడం లేదు కదా? నియమాలకు విరుద్ధంగా నడవడం లేదు కదా? అని మిమ్ములను మీరు పరిశీలించుకోవాలి. చాలామంది ఈ పొరపాట్లు చేస్తుంటారు. అటువంటివారు చివరిలో చాలా శిక్షలకు పాత్రులౌతారు. ఇప్పుడింకా కర్మాతీత అవస్థకు చేరుకోలేదు. కర్మాతీత అవస్థ పొందినవారికి అన్ని దు:ఖాలు దూరమైపోతాయి. శిక్షల నుండి విడుదల పొందుతారు. రాజులు నెంబరువారుగా ఎందుకు అవుతారో ఆలోచించాలి. తప్పకుండా కొందరి పురుషార్థము తక్కువగా ఉంటుంది. అందువలన శిక్షలు అనుభవించవలసి వస్తుంది. ఆత్మయే గర్భజైలులో శిక్షలు అనుభవిస్తుంది. ఆత్మ గర్భములో ఉన్నప్పుడు మమ్ములను బయటకు తీస్తే ఇక మీదట పాపకర్మలు చేయమని వేడుకుంటారు. ఆత్మయే శిక్షలు అనుభవిస్తుంది. ఆత్మయే కర్మలు చేస్తుంది. ఈ శరీరము దేనికీ పనికిరాదు. కావున ముఖ్యమైన విషయము స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మయే అన్ని పనులు చేస్తుందని బాగా అర్థము చేసుకోవాలి. ఇప్పుడు ఆత్మలైన మీరంతా వాపస్‌ వెళ్ళాలి. ఇటువంటి సమయములోనే మీకు ఈ జ్ఞానము లభిస్తుంది. ఆ తర్వాత మరెప్పుడూ ఈ జ్ఞానము లభించదు. ఆత్మాభిమానులుగా ఉన్నవారు అందరినీ సోదరులుగానే చూస్తారు. శరీర విషయమే ఉండదు. ఆత్మగా తయారైతే శరీరము పై ఆకర్షణ ఉండదు. అందుకే ఇది చాలా ఉన్నతమైన స్థితి అని తండ్రి చెప్తున్నారు. సోదరి సోదరునిలో చిక్కుకునిపోతే చాలా డిస్‌సర్వీసు జరుగుతుంది. ఆత్మాభిమాని భవ - ఇలా అవ్వడంలోనే శ్రమ ఉంది. చదువులో కూడా సబ్జెక్టులు ఉంటాయి. ఇందులో ఫెయిల్‌ అవుతామని భావిస్తారు. ఫెయిలయ్యే కారణంగా ఇతర సబ్జెక్టులలో కూడా ఢీలా పడిపోతారు. ఇప్పుడు బుద్ధి యోగబలము ద్వారా మీ ఆత్మ బంగారు పాత్రగా అవుతూ ఉంటుంది. యోగము లేకుంటే జ్ఞానము కూడా తక్కువైపోతుంది. శక్తి ఉండదు. యోగపదును అర్థం చేయించారు. ఆత్మలమైన మేము రోజంతటిలో నియమాలకు విరుద్ధమైన పని చేయడం లేదు కదా? అని పరిశీలించుకోవాలి. ఏవైనా అటువంటి అలవాట్లు ఉంటే వెంటనే వదిలేయాలి. కానీ మాయ మళ్లీ రెండవ రోజు, మూడవ రోజూ తప్పు చేయిస్తుంది. ఇటువంటి సూక్ష్మ విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదంతా గుప్తంగా ఉన్న జ్ఞానము. మనుష్యులకు ఈ విషయాలు ఏ మాత్రము తెలియదు. మేము మా ఖర్చుతోనే మా కొరకే ఇదంతా చేస్తున్నామని మీరు తెలుపుతారు. ఇతరుల ఖర్చుతో ఎలా తయారు చేస్తాము? అని మీరంటారు. అందుకే బాబా యాచించుట కంటే మరణించుట మేలని ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు. సులభంగా లభించింది పాలకు సమానము, అడిగి తీసుకుంటే నీటికి సమానము అని అంటారు. ఇతరుల నుండి అడిగి తీసుకుంటే వారు విధిలేక తప్పదన్నట్లు ఇస్తారు. కావున అది నీరైపోతుంది. లాక్కుంటే అది రక్తము వంటిది......... కొంతమంది చాలా విసిగిస్తారు. అప్పు తీసుకుంటే అది రక్తానికి సమానమైపోతుంది. అప్పు తీసుకునే అవసరమే లేదు. దానమిచ్చి వాపస్‌ తీసుకోరాదు. దీనిని గురించే హరిశ్చంద్రుని ఉదాహరణముంది. అలా కూడా చేయకండి. ఒక భాగము పెట్టండి. అది మీ అవసరానికి కూడా పనికొస్తుంది. పిల్లలు ఎంత పురుషార్థం చేయాలంటే చివర్లో తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. స్వదర్శన చక్రము కూడా స్మృతి ఉండాలి. అలా చేస్తూ చేస్తూ ప్రాణము శరీరము నుండి వెడలిపోవాలి. అప్పుడే చక్రవర్తి రాజులుగా అవ్వగలరు. అంతేకాని చివరిలో స్మృతి చేస్తాములే అనుకోరాదు. అప్పుడు ఇటువంటి స్థితి వస్తుందని పొరపాటు పడరాదు. ఇప్పటి నుండే పురుషార్థము చేస్తూ చేస్తూ ఆ స్థితిని అంతిమ కాలానికి సరి చేసుకోవాలి. చివరి సమయములో వృత్తి ఇతర వైపు వెళ్ళరాదు. స్మృతి చేసినందునే పాపాలు సమాప్తమవుతూ ఉంటాయి.

పవిత్రత విషయములోనే శ్రమ ఉందని పిల్లలకు తెలుసు. చదువులో ఇంత శ్రమ లేదు. దీని పై పిల్లలు చాలా గమనమివ్వాలి. ప్రతి రోజూ మేము ఏదైనా నియమ విరుద్ధమైన పని చేయలేదు కదా? అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. నామ-రూపాలలో చిక్కుకోవడం లేదు కదా? అని పరిశీలించుకోవాలి. ఎవరినైనా చూసి వారి పై ఆకర్షితము అవ్వలేదు కదా? కర్మేంద్రియాల ద్వారా నియమ విరుద్ధమైన పని చేయడం లేదు కదా? అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. పాత పతిత శరీరము పై ఏ మాత్రము ప్రేమ ఉండరాదు. అది కూడా దేహాభిమానమే. అనాసక్తులై ఉండాలి. సత్యమైన ప్రేమ ఒక్కరితోనే ఉండాలి. మిగిలిన వారందరి పై అనాసక్త ప్రేమ ఉండాలి. పిల్లలు మొదలైన వారుంటారు. అయితే ఎవరిలోనూ ఆసక్తి ఉండరాదు. ఈ కనులతో చూచేదంతా సమాప్తమైపోతుందని మీకు తెలుసు. ఇది గుర్తుంటే వారి పై ప్రేమ తొలగిపోతుంది. ఒక్కరి పైననేే ప్రేమ ఉండాలి. మిగిలినవారి పై నామమాత్రపు అనాసక్త ప్రేమ ఉండాలి. అచ్చా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. మీ వృత్తిని చాలా శుద్ధంగా, పవిత్రంగా చేసుకోవాలి. నియమ విరుద్ధమైన తప్పు పనులేవీ చేయరాదు. చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. బుద్ధి ఎక్కడా తగుల్కోరాదు.

2. సత్యమైన ప్రేమ ఒక్క తండ్రితోనే ఉండాలి. మిగిలిన వారందరితో అనాసక్త నామమాత్రపు ప్రేమ ఉండాలి. స్వంత శరీరములో కూడా ఆకర్షణ లేనంతగా ఆత్మాభిమాని స్థితిని తయారు చేసుకోవాలి.

వరదానము :-

'' కర్మబంధనాన్ని సేవాబంధనంలోకి పరివర్తన చేసుకునే అందరికి అతీతంగా(న్యారాగా) పరమాత్మకు ప్యారే భవ ''

బ్రాహ్మణ జీవితానికి ఆధారము పరమాత్మ ప్రేమ కానీ న్యారాగా అయినప్పుడే ఆ ప్రేమ లభిస్తుంది. ప్రవృత్తిలో ఉన్నారంటే సేవ కొరకు ఉన్నారు. ఎప్పుడూ లెక్కాచారముంది, కర్మ బంధనముంది అని భావించకండి, సేవ అని భావించండి. ఎక్కడ కర్మ బంధనముంటుందో అక్కడ దు:ఖపుటల ఉంటుంది. సేవాబంధనంలో సంతోషముంది. అందువలన కర్మ బంధనాన్ని, సేవా బంధనములోకి పరివర్తన చేసి న్యారా-ప్యారాగా ఉంటే పరమాత్మకు ప్రియంగా అవుతారు.

స్లోగన్‌ :-

'' స్వ స్థితి ద్వారా పరిస్థితిని దాటుకునేవారే శ్రేష్ఠమైన ఆత్మలు ''