30-01-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - మీరు రాజఋషులు, మీరు రాజ్యాన్ని పొందేందుకు పురుషార్థము చేయాలి, దానితో పాటు దైవీ గుణాలను కూడా తప్పకుండా ధారణ చేయాలి ''

ప్రశ్న :-

ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు పురుషార్థము ఏమిటి? ఏ విషయము పై చాలా గమనము ఉంచాలి?

జవాబు :-

ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు చదువు పై ఎప్పుడూ అలగరాదు. చదువుకు పోట్లాటలు, గొడవలతో సంబంధము లేదు. బాగా చదువుకుంటే నవాబులుగా అవుతారు. కావున సదా మీ ఉన్నతిని గూర్చిన ఆలోచన ఉండాలి. నడవడిక పై ఎంతో గమనముండాలి. దేవతల వలె అయ్యేందుకు నడవడిక చాలా రాయల్‌గా ఉండాలి. చాలా చాలా మధురంగా అవ్వాలి. మీ నోటి నుండి అందరికీ మధురంగా అనిపించే మాటలే వెలువడాలి. ఎవ్వరికీ దు:ఖము కలుగరాదు.

ఓంశాంతి.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థము చేయిస్తారు మరియు మీ బుద్ధి ఎక్కడ నిలిచి ఉంది? అని అడుగుతారు. మనుష్యుల బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది. కాసేపు ఇటువైపు, కాసేపు అటువైపు భ్రమిస్తూ ఉంటుంది. మీ బుద్ధి భ్రమించడం ఆగిపోవాలి. బుద్ధిని ఒకే గమ్యము పై నిలపండి. అనంతమైన తండ్రినే స్మృతి చేయండి అని తండ్రి అర్థము చేయిస్తారు. ఇప్పుడు ప్రపంచమంతా తమోప్రధానంగా ఉందని ఆత్మిక పిల్లలకు తెలుసు. ఆత్మలే నెంబరువారు పురుషార్థానుసారముగా సతోప్రధానముగా ఉండేవి, ఇప్పుడు తమోప్రధానంగా అయ్యాయి. ఇప్పుడు మళ్లీ సతోప్రధానంగా అవ్వాలి. కావున మీ బుద్ధిని తండ్రితో జోడించండి. ఇప్పుడు వాపస్‌ వెళ్ళాలి. మనము వాపస్‌ ఇంటికి వెళ్లాలని ఇంకెవ్వరికీ తెలియదు. పిల్లలూ! మీరు నన్ను స్మృతి చేయండి అన్న ఆదేశాన్ని పొందేవారు కూడా మీ వలె ఇంకెవ్వరూ ఉండరు. తండ్రి ఎంత సహజంగా విషయాన్ని అర్థము చేయిస్తారు. కేవలం తండ్రిని స్మృతి చేసినట్లైతే మీ వికర్మలు వినాశనమైపోతాయి. ఈ విధంగా తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థము చేయించలేరు. ఎవరిలో ప్రవేశించారో వారు కూడా వింటారు. పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు, దాని అనుసారం నడిచేందుకు అన్నిటికంటే మంచి మతము తండ్రియే ఇస్తారు. పిల్లలూ! మీరే సతోప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు మళ్లీ అలా అవ్వాలని బాబా చెప్తున్నారు. మీరే ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉండేవారు. తర్వాత మళ్లీ 84 జన్మలు అనుభవించి గవ్వ సమానంగా అయిపోయారు. మీరు వజ్ర తుల్యంగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ అలా తయారవ్వాలి. బాబా స్వయాన్ని ఆత్మగా బావించండి అని చాలా సహజమైన విషయాన్ని వినిపిస్తారు. ఆత్మలే తిరిగి వెళ్లాలి. శరీరాలైతే వెళ్లవు కదా! తండ్రి వద్దకు సంతోషంగా వెళ్లాలి. తండ్రి ఇచ్చే శ్రీమతము ద్వారా మీరు శ్రేష్ఠంగా అవుతారు. పవిత్ర ఆత్మలు మూలవతనానికి వెళ్లి మళ్లీ ఇచ్చటకు వచ్చినప్పుడు నూతన శరీరము తీసుకుంటారు. ఈ నిశ్చయముంది కదా. కనుక అదే తపన ఉండాలి. దైవీ గుణాలు కూడా ధారణ చేస్తే చాలా లాభముంటుంది. బాగా చదువుకొను విద్యార్థులే ఉన్నత పదవి పొందుతారు. ఇది కూడా చదువే. మీరు కల్ప-కల్పము ఇదే విధంగా చదువుకుంటారు. తండ్రి కూడా కల్ప-కల్పమూ ఇదే విధంగా చదివిస్తారు. ఏ సమయమైతే గడచిపోయిందో అది డ్రామా. డ్రామానుసారమే తండ్రి పాత్ర మరియు పిల్లల పాత్ర నడిచింది. బాబా సలహా కరెక్టుగానే ఇస్తారు కదా. బాబా, మేము మిమ్ములను క్షణ-క్షణమూ మర్చిపోతాము అని పిల్లలు అంటారు. ఇవే కదా మాయా తుఫానులు. మాయ మీ దీపాన్ని ఆర్పి వేస్తుంది. తండ్రిని జ్యోతి(దీపము) అని కూడా అంటారు. అలాగే సర్వశక్తివంతుడైన అథారిటీ(ఆల్‌మైటీ అథారిటీ) అని కూడా అంటారు. వేద శాస్త్రాలు మొదలైనవేవైతే ఉన్నాయో వాటన్నిటి సారమును తండ్రి తెలియజేస్తారు. వారు జ్ఞాన సాగరులు. సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యమును అర్థము చేయిస్తారు. నేను పిల్లలకు అర్థము చేయిస్తానని ఈ బ్రహ్మ కూడా అంటారు. నేను పిల్లలైన మీకు అర్థము చేయిస్తానని తండ్రి అంటారు. అందులో ఈ బ్రహ్మ కూడా వచ్చేస్తాడు. ఇందులో తికమకపడే విషయమేదీ లేదు. ఇది చాలా సహజమైన రాజయోగము. మీరు రాజఋషులు. ఋషి అని పవిత్ర ఆత్మనే అనడం జరుగుతుంది. మీ వంటి ఋషులు ఇంకెవ్వరూ ఉండరు. ఆత్మనే ఋషి అని పిలవడం జరుగుతుంది. శరీరమును అలా పిలవరు. ఆత్మయే ఋషి, రాజఋషి. ఆత్మ రాజ్యమును ఎక్కడ నుండి తీసుకుంటుంది? తండ్రి నుండి. కావున పిల్లలైన మీకు ఎంత సంతోషముండాలి! మనము శివబాబా నుండి రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నాము. మీరు విశ్వాధిపతులుగా ఉండేవారనే స్మృతిని బాబా కలిగిస్తున్నారు. మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ క్రిందకు దిగజారుతూ వచ్చారు. దేవతల చిత్రాలు కూడా ఉన్నాయి. మనుష్యులు జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని భావిస్తారు. కాని ఒక్క మనిషి జ్యోతి కూడా జ్యోతిలో కలవదని తండ్రి అర్థము చేయించారు. ఎవరు కూడా ముక్తి-జీవన్ముక్తులను పొందలేరు. కావున రోజంతా పిల్లల బుద్ధిలో చింతన నడుస్తూ ఉండాలి. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా సంతోషము కలుగుతుంది. చదివించేవారు ఎవరో చూడండి.

కృష్ణుని లార్డ్‌ కృష్ణ అని కూడా అంటారు. భగవంతుని ఎప్పుడూ లార్డ్‌ అని అనరు. వారిని గాడ్‌ఫాదర్‌ అనే అంటారు. వారు హెవన్లీ గాడ్‌ ఫాదర్‌(స్వర్గ రచయిత). హెవెన్‌ అనగా దైవీ రాజధానిని స్థాపిస్తున్నారని, స్వర్గ రచయిత వారేనని ఇప్పుడు మీ హృదయాంతరాలలో అనిపిస్తుంది. సత్యయుగములో ఇంకే ధర్మమూ లేదు. చిత్రాలు కూడా దేవతలవే. వారినే ఆదిసనాతన దేవీ దేవతలని అంటారు. వారు విశ్వాధిపతులుగా ఉండేవారు. వారు సత్యయుగానికి చెందినవారని అంటారు. మీరు సంగమ యుగములోని వారు. బాబా మనలను ధర్మసమ్మతమైనవారిగా తయారుచేస్తారని మీకు తెలుసు. మీరు ధర్మబద్ధముగా అవుతూ ఉంటారు. వికారులను అధర్మస్థులు అని అంటారు. ఈ దేవతలు పవిత్రులు. వారిలో పవిత్రతా ప్రకాశమునే చూపించారు. అధర్మస్థులు అనగా ఒక్క అడుగు కూడా ధర్మ సమ్మతంగా ఉండదు. శివాలయము నుండి దిగజారి వేశ్యాలయములోకి వచ్చేస్తారు. ఈ విషయాలను క్రొత్తవారు ఎవరూ అర్థము చేసుకోలేరు. ఎప్పటివరకైతే మీరు వారికి తండ్రి స్వర్గస్థాపకుడు అని తండ్రి పరిచయమును పూర్తిగా ఇవ్వరో అప్పటివరకు అర్థము చేసుకోలేరు. స్వర్గ-నరకాలు, సుఖ-దు:ఖాలు అనే రెెండు పదాలున్నాయి. భారతదేశములో సుఖముండేదని ఇప్పుడు దు:ఖముందని మళ్లీ తండ్రి వచ్చి సుఖమునిస్తారని మీకు తెలుసు. ఇప్పుడు దు:ఖ సమయము సమాప్తమవ్వనున్నది. బాబా పిల్లల కొరకు సుఖమునిచ్చే కానుకను తీసుకు వస్తారు. వారు అందరికీ సుఖమునిస్తారు అందుకే వారికి అందరూ నమస్కరిస్తారు. సన్యాసులు, ఉదాసులు కూడా తపస్సు చేస్తారు. వారికి కూడా ఏదో ఒక ఆశ తప్పకుండా ఉంటుంది. సత్యయుగములో ఇటువంటి విషయాలేవీ ఉండవు. అక్కడ ఇతర ధర్మాలవారెవ్వరూ ఉండరు. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచములోకి వెళ్లేందుకు పురుషార్థము చేస్తున్నారు. అది సుఖధామమని, పైది శాంతిధామమని, ఇది దు:ఖధామమని మీకు తెలుసు. ఇప్పుడు మీరు సంగమ యుగములో ఉన్నారు. ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. పురుషార్థము చాలా బాగా చేయాలి. చదువు పై ఎప్పుడూ అలగరాదు. ఎవరితోనైనా సరిపోకపోతే చదువును వదిలేయరాదు. ఈ పోట్లాటలు, గొడవలతో చదువుకు ఏ సంబంధమూ లేదు. బాగా చదువుకుంటే నవాబులుగా అవుతారు. పోట్లాడుతూ, గొడవలు పడుతూ ఉంటే నవాబులుగా ఎలా అవుతారు? అలాంటప్పుడు నడవడికలు తమోప్రధానంగా అయిపోతాయి. ప్రతి ఒక్కరూ తమ ఉన్నతిని గూర్చి ఆలోచించాలి. హే ఆత్మలారా! తండ్రిని స్మృతి చేసినట్లైతే మీ వికర్మలు వినాశనమైపోతాయి అంతేకాక దైవీగుణాలు కూడా ధారణ అవుతాయని బాబా చెప్తారు. ఒకవేళ లక్ష్మీనారాయణుల వలె అవ్వాలంటే, బాబానే వారిని ఆ విధంగా తయారు చేశారు కావున వారినే స్మృతి చేయాలి. మీరే ఈ రాజ్యము చేస్తూ ఉండేవారని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు మళ్లీ మీరే తయారవ్వాలి. రాజయోగమును తండ్రి సంగమ యుగములోనే నేర్పిస్తారు. మీరు కల్ప-కల్పము ఇలా తయారవుతారు. అంతేగాని ఎల్లప్పుడూ కలియుగమే నడుస్తూ ఉంటుందని కాదు. కలియుగము తర్వాత సత్యయుగము........ ఇలా ఈ చక్రము తప్పకుండా తిరుగుతూనే ఉంటుంది. సత్యయుగములో మనుష్యులు తక్కువగా ఉండేవారు. ఇప్పుడు మళ్లీ తప్పకుండా తక్కువగా అవ్వాలి. ఇవి సహజంగా అర్థము చేసుకోవాల్సిన విషయాలు! గతించిన కథను వినిపిస్తారు. ఇది చిన్న కథ. నిజానికి ఇది పెద్దదే కానీ అర్థము చేసుకోవడంలో చిన్నది. ఇందులో 84 జన్మల రహస్యముంది. ఇంతకుముందు మీకు కూడా ఇది తెలియదు. ఇప్పుడు చదువుతున్నామని మీరు అర్థము చేసుకున్నారు. ఇది సంగమ యుగపు చదువు. ఇప్పుడు డ్రామా చక్రము చుట్టు తిరిగి వచ్చింది, మళ్లీ సత్యయుగము నుండి ప్రారంభమౌతుంది. ఈ పురాతన సృష్టి మారనున్నది. కలియుగ రూపి అడవి వినాశమౌతుంది. మళ్లీ సత్యయుగీ పూలతోట వస్తుంది. దైవీ గుణాలు కలిగినవారిని పుష్పాలని అంటారు. ఆసురీ గుణాలు కలిగిన వారిని ముళ్ళు అని అంటారు. నాలో ఏ అవగుణమూ లేదు కదా! అని మిమ్ములను మీరు పరిశీలించుకోవాలి. ఇప్పుడు మనము దేవతలుగా అయ్యేందుకు అర్హులుగా అవుతున్నాము కావున దైవీ గుణాలను తప్పకుండా ధారణ చేయవలసి ఉంటుంది. తండ్రి టీచర్‌గా, సద్గురువుగా అయ్యి వచ్చారంటే గుణాలు(క్యారెక్టర్‌) సరిదిద్దుకోవలసి ఉంటుంది. అందరి క్యారెక్టర్‌ పాడైపోయిందని మనుష్యులు అంటారు. కాని మంచి క్యారెక్టర్‌ అని దేనినంటారో కూడా వారికి తెలియదు. ఈ దేవతల క్యారెక్టర్‌ ఎంతో బాగుండేదని, వారెప్పుడూ ఎవరికీ దు:ఖమునిచ్చేవారు కాదని మీరు వారికి అర్థము చేయించవచ్చు. ఎవరి నడవడిక అయినా బాగుంటే వారు దేవత వంటి వారని, వారి మాటలు ఎంతో మధురంగా ఉన్నాయని అంటారు. తండ్రి చెప్తున్నారు - మిమ్ములను దేవతలుగా తయారు చేస్తాను కావున మీరు చాలా మధురంగా అవ్వవలసి ఉంటుంది, దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎవరు ఎలా ఉంటారో వారు ఇతరులను అలాగే తయారు చేస్తారు. మీరందరూ టీచర్లుగా అవ్వాలి. టీచర్‌ యొక్క పిల్లలు కూడా టీచర్లే. మీరు పాండవ సైన్యము కదా! అందరికీ మార్గాన్ని చూపడం మార్గదర్శకుల కర్తవ్యము. దైవీ గుణాలను ధారణ చేయాలి. గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి. ఇంట్లో కూడా సేవ చేయవచ్చు. ఎవరు వచ్చినా వారికి చెప్తూ(చదివిస్తూ) ఉంటారు. గీతా పాఠశాలలను తెరచి అనేమందికి సేవ చేసేవారు ఎందరో ఉన్నారు. అలాగని ఇక్కడకు వచ్చి కూర్చుండిపోవడం కాదు. కుమారీలకు ఇది చాలా సహజము. నెల, రెండు నెలలు తిరిగి వస్తారు. మళ్లీ ఇంటికి వెళ్తారు. ఇంటిని సన్యసించరాదు. మీకు ఇంటి నుండి పిలుపు వస్తే ఇంటికి వెళ్తారు, నిషేధమేమీ లేదు. ఇందులో నష్టపోయే మాటేమీ లేదు. ఇంకా ఉత్సాహము పెరుగుతుంది. మేము కూడా ఇప్పుడు వివేకవంతులుగా అయ్యామని మాతో పాటు మా ఇంటివారిని కూడా మా సమానంగా తయారు చేసి వెంట తీసుకు వెళ్తామని భావిస్తారు. ఇంట్లో ఉండి సర్వీసు చేసేవారు చాలా మంది ఉన్నారు. కనుక వారు తెలివైనవారుగా అయిపోతారు.

స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని తండ్రి ముఖ్యమైన విషయాన్ని తెలిపిస్తున్నారు. మీ ఉన్నతిని చేసుకోవాలి. ఇంట్లో ఉండేవారి ఉన్నతి, ఇక్కడ ఉండేవారి ఉన్నతి కంటే ఎక్కువగా అవ్వగలదు. మీరు ఇంటికి వెళ్ళవద్దని ఎప్పుడూ అనరు. వారి కళ్యాణము కూడా చేయాలి. ఎవరికైతే కళ్యాణము చేసే అలవాటైపోతుందో వారు కళ్యాణము చేయకుండా ఉండలేరు. జ్ఞాన-యోగాలు పూర్తిగా ఉన్నట్లైతే ఎవ్వరూ అవమానపరచలేరు. యోగము సరిగ్గా లేకపోతే మాయ కూడా చెంపదెబ్బ వేస్తుంది. కావున గృహస్థములో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. ఇంట్లో కూడా ఉండవచ్చని బాబా స్వేచ్ఛను ఇస్తారు. అందరూ ఇక్కడకు వచ్చి ఎలా ఉండగలరు? ఎంతమంది అయితే వస్తారో వారి కొరకు ఇళ్ళు మొదలైనవి తయారు చేయవలసి ఉంటుంది. కల్పపూర్వము ఏదైతే జరిగిందో అదంతా పునరావృతమౌతూ ఉంటుంది. పిల్లలు కూడా వృద్ధి చెందుతూ ఉంటారు. డ్రామాలో లేకుండా ఏమీ జరగదు. ఈ యుద్ధాలు మొదలైనవేవైతే జరుగుతాయో, ఇంతమంది మనుష్యులు ఎవరైతే మరణిస్తారో, అదంతా డ్రామాలో రచింపబడి ఉంది. ఏదైతే గతించిందో, అది మళ్ళీ పునరావృతమౌతుంది. ఏదైతే కల్ప-కల్పమూ అర్థము చేయించానో అదే మళ్ళీ ఇప్పుడు కూడా అర్థము చేయిస్తాను. మనుష్యులు ఏమి భావించినా డ్రామానుసారంగా కల్పక్రితము ఏ పాత్రను అభినయించానో అదే ఇప్పుడు మళ్లీ అభినయిస్తాను. డ్రామాలో ఎలాంటి మార్పులు ఉండవు. కల్పక్రితము ఎవరైతే చదివారో, వారే మళ్లీ చదువుతారు. ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా మీరు ఏమి చదువుతున్నారు మరియు ఏ పదవిని పొందుతారు అన్నది కూడా ప్రత్యక్షమౌతూ ఉంటుంది. మంచి సేవ చేస్తూ అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదము జరిగితే వారు వెళ్లి మంచి కులములో జన్మ తీసుకుంటారు. ఎంతో సుఖంగా ఉంటారు. ఎంతటి సుఖమును అనేమందికి ఇచ్చారో అంతటి సుఖము వారికి కూడా లభిస్తుంది. ఈ సంపాదన ఎప్పుడూ వృథాగా పోదు. సత్యయుగములో అయితే ఎక్కడ విజయము పొందితే అక్కడ జన్మిస్తారు. అనేమందికి సుఖమును ఇచ్చినట్లైతే నోట్లో బంగారు స్పూను లభిస్తుంది. అంతకంటే తక్కువ సుఖమును ఇచ్చి ఉంటే వెండి స్పూను లభిస్తుంది. దానికంటే తక్కువైతే రాగిది(ఇత్తడిది) లభిస్తుంది. మా యోగము ఎంత ఉంది అన్న విషయము అర్థమౌతుంది కదా! రాజు-రాణి, ప్రజలు అందరూ తయారవ్వనున్నారు. బాగా చదవకపోతే, దివ్యగుణాలను ధారణ చేయకపోతే పదవి తగ్గిపోతుంది. మంచి లేక చెడు కర్మల ఫలితము తప్పకుండా ముందుకు వస్తుంది. నేను ఎంతవరకు సేవ చేస్తున్నాను? అన్నది ఆత్మకు తెలుసు. ఇప్పుడు శరీరము వదిలిపోతే ఏ పదవిని పొందుతాము! ఇప్పుడు మీరు చదువుకొని బాగుపడుతున్నారు. కొందరు పాడైపోతారు కూడా! అప్పుడు వారి భాగ్యములో లేదు అని అంటారు. బాబా ఎంత ఉన్నతంగా తయారుచేస్తారు! సాయి(ఈశ్వరుని) ఇంటి నుండి ఎవ్వరూ ఖాళీగా వెళ్ళరాదు. ఇప్పుడు సాయి మీ సన్ముఖములో ఉన్నారు. ఎవరికైనా మీరు రెండు మాటలు వినిపించినా వారు కూడా తప్పకుండా ప్రజలలోకి వస్తారు. దేవీ దేవతా ధర్మమువారు ఇప్పటివరకు వస్తూ ఉంటారు. కాని ఇప్పుడు పతితులుగా ఉన్న కారణంగా స్వయాన్ని హిందువులుగా పిలిపించుకుంటారు. బాబా వద్ద ఎలా జ్ఞానము ఉందో అలా మీ బుద్ధిలోనూ ఉంది. బాబా జ్ఞాన సాగరులు. ఈ చరిత్ర-భూగోళము ఎలా పునరావృతమౌతుందో వారు తెలియజేస్తారు. టీచర్లు కూడా విద్యార్థుల చదువు ద్వారా వారు ఇన్ని మార్కులతో పాస్‌ అవుతారో తెలుసుకోగలరు. ప్రతి ఒక్కరూ స్వయమే గ్రహించగలరు. కొందరు దైవీగుణాలలో కచ్ఛాగా ఉన్నారు. కొందరు యోగములో కచ్ఛాగా ఉన్నారు. కొందరు జ్ఞానములో కచ్ఛాగా ఉన్నారు. కచ్ఛాగా ఉన్నందున పాస్‌ అవ్వలేరు. ఈ రోజు అపరిపక్వంగా ఉన్నాము. రేపు పక్కా(పరిపక్వము)గా అవ్వలేమని కాదు. గ్యాలప్‌(గుర్రము వలె వేగంగా పరిగెత్తడము) చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ ఫెయిల్‌ అవుతామో స్వయం కూడా ఫీల్‌(అనుభవము) చేయగలరు. ఫలానావారు మా కంటే చురుకుగా ఉన్నారని వారు స్వయం కూడా అనుభవము చేసుకుంటారు. నేర్చుకొని స్వయంగా మీరు కూడా చురుకైనవారిగా అవ్వవచ్చు. దేహాభమానము ఉంటే వారేమి నేర్చుకోగలరు? నేను ఆత్మను అన్నది పూర్తిగా పక్కా చేసుకోండి. తండ్రి స్మృతిని కలిగించారు. నన్ను స్మృతి చేసినట్లైతే వికర్మలు వినాశనమౌతాయి. మళ్లీ దైవీగుణాలు ధారణ అవుతాయని బాబా అంటారు. నేను ఎంతవరకు అర్హునిగా అయ్యాను? అని మీ నాడిని మీరు పరిశీలించుకోవాలి.

మీరు ఇప్పుడు సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. ఈ రాజయోగ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు. పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. మన కులానికి చెందిన బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు? అని పిల్లలు అడుగుతూ ఉంటారు. అది పూర్తిగా ఎలా తెలియగలదు? వస్తూ, వెళ్తూ ఉంటారు. కొత్త కొత్తవారు కూడా వెలువడ్తూ ఉంటారు. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. మీ నడవడికను దివ్యముగా తయారు చేసుకోవాలి. దైవీగుణాలను ధారణ చేసి స్వ కళ్యాణమును మరియు సర్వుల కళ్యాణము చేయాలి. అందరికీ సుఖమును ఇవ్వాలి.

2. సతోప్రధానమగుటకు బుద్ధిని ఒక్క తండ్రితోనే జోడించాలి. బుద్ధిని భ్రమింపజేయరాదు. తండ్రి సమానముగా శిక్షకునిగా అయ్యి అందరికీ సరైన దారిని చూపించాలి.

వరదానము :-

'' సంతోషాల ఖజానాలతో సంపన్నమై దు:ఖములో ఉన్న ఆత్మలకు సంతోషాన్ని దానము చేసే పుణ్య ఆత్మా భవ ''

ఇప్పుడు ప్రపంచంలో ప్రతి సమయంలో దు:ఖముంది. కాని మీ వద్ద ప్రతి సమయంలో సంతోషముంది. కనుక దు:ఖములో ఉన్న ఆత్మలకు సంతోషమివ్వడం అన్నిటికంటే గొప్ప పుణ్యము. ప్రపంచంలోని వారు సంతోషం కొరకు ఎంతో సమయాన్ని, సంపదను ఖర్చు చేస్తారు. కాని మీకు సులభంగా అవినాశి సంతోషాల ఖజానా లభించింది. ఇప్పుడు మీకు ఏదైతే లభించిందో దానిని కేవలం పంచుతూ ఉండండి. పంచడం అనగా పెంచడం. మీ సంబంధంలోకి ఎవరు వచ్చినా, వీరికి ఏదో శ్రేష్ఠమైన ప్రాప్తి లభించిందని అందుకే సంతోషంగా ఉన్నారని అనుభవం చేయాలి.

స్లోగన్‌ :-

'' అనుభవీ ఆత్మలు ఏ విషయంలోనూ మోసపోరు. వారు సదా విజయులుగా ఉంటారు. ''

బ్రహ్మబాబా సమానంగా అయ్యేందుకు విశేషమైన పురుషార్థము
బ్రహ్మబాబా సమానం మీ స్థితిని అచల్‌-అడోల్‌గా(స్థిరంగా) చేసుకునేందుకు ఏ వాతావరణంలో లేక వాయుమండలంలో ఉంటున్నా ప్రతి ఒక్కరి సలహాకు గౌరవం ఇవ్వండి. ఎప్పుడూ ఎవరి సలహానైనా విని కన్ఫ్యూస్‌ అవ్వకండి. ఎందుకంటే ఎవరైతే నిమిత్తంగా అయ్యారో వారు అనుభవీలుగా ఉంటారు. ఒకవేళ వారి ఏ ఆదేశమైనా స్పష్టంగా లేకుంటే ఆందోళన పడకండి. ధైర్యంగా ''ఇది అర్థము చేసుకునేందుకు ప్రయత్నిస్తాను'' అని చెప్పండి. అప్పుడు స్థితి ఏకరసంగా అచల్‌-అడోల్‌గా ఉంటుంది.