31-08-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - తండ్రి మీకు సంగమ యుగములో ఏ స్మృతులనైతే కలిగించారో వాటిని స్మరణ చేస్తే సదా హర్షితంగా ఉంటారు. ''
ప్రశ్న :-
సదా తేలికగా ఉండేందుకు యుక్తి ఏమిటి ? ఏ సాధనను ధారణ చేయడం ద్వారా సంతోషంగా ఉండగలరు ?
జవాబు :-
సదా తేలికగా ఉండేందుకు ఈ జన్మలో ఏ ఏ పాపాలు చేశారో వాటన్నింటిని అవినాశి సర్జన్ ముందు ఉంచండి. జన్మ-జన్మాంతరాల పాపాలేవైతే తల పై ఉన్నాయో వాటి కొరకు స్మృతి యాత్రలో ఉండండి. స్మృతి ద్వారానే పాపాలు సమాప్తమవుతాయి. తర్వాత సంతోషము ఉంటుంది. తండ్రి స్మృతి ద్వారా ఆత్మ సతోప్రధానంగా అయిపోతుంది.
ఓంశాంతి.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థము చేయిస్తున్నారు - మేము ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారము, మేము రాజ్యము చేసేవారము, మేము తప్పకుండా విశ్వాధిపతులుగా ఉండేవారము, ఆ సమయములో ఇతర ఏ ధర్మమూ లేదని మీకు స్మృతి కలిగింది. మనమే సత్యయుగము నుండి జన్మలు తీసుకుంటూ 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాము. మొత్తం వృక్షమంతా స్మృతిలోకి వచ్చేసింది. మనము దేవతలుగా ఉండేవారము. మళ్లీ రావణ రాజ్యంలోకి రావడంతో దేవీ దేవతలుగా పిలువబడే అర్హతను కోల్పోయాము. అందుకే ధర్మమే వేరుగా భావించాము. మరే ధర్మమూ ఇలా మారదు. ఉదాహరణానికి ఏసుక్రీస్తు స్థాపించిన క్రైస్తవ ధర్మము, బుద్ధుని బౌద్ధ ధర్మము అవే కొనసాగుతున్నాయి. అందరి బుద్ధిలో బుద్ధుడు ఫలానా సమయములో ధర్మస్థాపన చేశాడని ఉంటుంది. హిందువులకు తమ హిందూ ధర్మము ఎప్పటి నుండి ప్రారంభమయ్యిందో, దానిని ఎవరు స్థాపన చేశారో తమ ధర్మమును గురించే తెలియదు. లక్షల సంవత్సరాలని అనేస్తారు. పిల్లలైన మీకే మొత్తం సృష్టిచక్ర జ్ఞానమంతా ఉంది. దీనిని జ్ఞాన విజ్ఞానము అని అంటారు. వారు 'విజ్ఞాన భవనము' అనే పేరును భలే పెట్టారు కానీ తండ్రి దాని అర్థమును, జ్ఞానము-యోగము, రచయిత-రచనల ఆదిమధ్యాంతముల జ్ఞానమును వివరిస్తున్నారు. ఇంతకుముందు మాకు కూడా తెలియదు, మేమూ నాస్తికులుగా ఉండేవారమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సత్యయుగములో అయితే ఈ జ్ఞానము ఉండదు. ఇప్పుడు మిమ్ములను టీచరు చదివిస్తున్నారు, చదువుకున్న తర్వాత మీకు రాజ్య భాగ్యము లభిస్తుంది. ఎందుకంటే మీరు ఉండేందుకు కొత్త సృష్టి కావాలి. ఈ పాత సృష్టిలో అయితే పవిత్ర దేవీ దేవతలు కాలు మోపజాలరు. తండ్రి వచ్చి మీ కోసం పాత ప్రపంచాన్ని వినాశనము చేసి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. మన కొరకు వినాశనము తప్పకుండా జరగాలి. కల్ప-కల్పాంతరాలు మనము ఈ పాత్రను అభినయిస్తాము. ఇంతకు ముందు ఎప్పుడైనా కలుసుకున్నారా? అని బాబా అడుగుతారు. అప్పుడు మీరు బాబా - ' మీ నుండి రాజ్య భాగ్యాన్ని తీసుకునేందుకు ప్రతి కల్పము కలుసుంటాము' అని చెప్తారు. కల్పక్రితము కూడా అనంతమైన సుఖమునిచ్చే రాజ్య భాగ్యము లభించింది. ఇప్పుడీ విషయాలన్నీ ఏవైతే స్మృతిలోకి వచ్చాయో వాటి స్మరణ జరుగుతూ ఉండాలి. దానినే తండ్రి స్వదర్శన చక్రము అని అంటారు. మనము ఇంతకు ముందు సతోప్రధానంగా ఉండేవారము. ప్రతి ఆత్మకు తమ-తమ పాత్ర లభించిందని కూడా మీకు గుర్తుకొచ్చింది. ఆత్మలైన మనము చిన్నగా, అవినాశిగా ఉంటాము. అందులో పాత్ర కూడా అవినాశిగా ఉంటుంది. అది నడుస్తూనే ఉంటుంది. ఇది రచించి, రచించబడిన, రచింపబడుతూ ఉన్న............. ఇందులో కొత్త విషయాన్ని ఎవ్వరూ కలుపలేరు లేక తొలగించలేరు. ఎవ్వరూ మోక్షమును పొందలేరు. కొందరు ముక్తిని కోరుకుంటారు. ముక్తి వేరు, మోక్షము వేరు. ఇది కూడా గుర్తుంచుకోవాలి. స్మృతిలో ఉంటే ఇతరులకు కూడా స్మృతిని కలిగిస్తారు. ఇదే మీ వృత్తి. తండ్రి ఏదైతే స్మృతిలోకి తీసుకొచ్చారో ఆ స్మృతిని ఇతరులకు కూడా కలిగించండి, అప్పుడు ఉన్నత పదవిని పొందుతారు. ఉన్నత పదవిని పొందేందుకు చాలా కష్టపడాలి. యోగమే ముఖ్యమైన శ్రమ. ఇది అనంతమైన స్మృతియాత్ర. దీనిని తండ్రి తప్ప ఇతరులెవ్వరూ నేర్పించలేరు. ఇప్పుడు మీరు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే చదువును చదువుతారు. మనము మళ్లీ కొత్త ప్రపంచములోకి వెళ్తామని మీకు తెలుసు. దాని పేరే అమరలోకము. ఇది మృత్యులోకము. ఇక్కడైతే కూర్చుని ఉండగానే అకస్మాత్తుగా మృత్యువు వచ్చేస్తుంది. అక్కడైతే మృత్యువు నామ-రూపాలే ఉండవు. ఎందుకంటే నిజానికి ఆత్మను మృత్యువు కబళించలేదు. ఇది మిఠాయి వస్తువేమీ కాదు. డ్రామానుసారంగా ఎప్పుడైతే సమయము వస్తుందో అప్పుడు ఆత్మ వెళ్లిపోతుంది. ఏ సమయంలో ఎవరు వెళ్లవలసి ఉంటుందో వారు వెళ్లిపోతారు. మృత్యువేమీ పట్టుకోదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. అంతేకాని అక్కడ మృత్యువనేదే లేదు. ఇవన్నీ వ్యర్థమైన విషయాలు. వీటిని కూర్చుని కథలుగా తయారు చేశారు. అది అమరలోకము, అక్కడ శరీరము నిరోగిగా ఉంటుంది. సత్యయుగములో భారతవాసుల ఆయువు కూడా ఎక్కువగా ఉండేది. వారు యోగులుగా ఉండేవారు. యోగి, భోగికి ఉన్న తేడా కూడా ఇప్పుడు తెలుస్తుంది. మీ ఆయువు వృద్ధి చెందుతూ ఉంది. మీరు ఎంతగా యోగములో ఉంటారో, అంతగా పాపాలు భస్మమైపోతాయి. పదవి కూడా ఉన్నతమైనది లభిస్తుంది. ఆయువు కూడా పెరుగుతుంది. రాజా, రాణి ఆయువును పూర్తి చేసి శరీరాన్ని ఎలా వదిలేస్తారో అలాగే ప్రజలు కూడా, కాని పదవిలో తేడా ఉంటుంది(యథా రాజా - రాణి...........).
స్వదర్శన చక్రధారి పిల్లలూ! - ఈ అలంకారాలు మీవేనని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ మీరు కమలపుష్ప సమానంగా ఉంటారు. మీరు తప్ప మరెవ్వరూ అలా ఉండలేరు. ఈ జన్మలో మనము ఎన్ని పాపాలు చేశామో అది కూడా స్మృతిలోకి వచ్చింది. కావున అవన్నీ అవినాశి సర్జన్ ముందు ఉంచినట్లయితే మీరు తేలికైపోతారని బాబా అంటున్నారు. పోతే జన్మ-జన్మాంతరాల పాపము ఏదైతే తల పై ఉందో అందుకొరకు యోగములో ఉండాలి. యోగము ద్వారానే పాపాలు అంతమవుతాయి. సంతోషము కూడా ఉంటుంది. తండ్రి స్మృతి ద్వారా సతోప్రధానంగా అవుతారు. స్మృతి ద్వారా ఈ విధంగా అవుతామని తెలిస్తే ఎవరు స్మృతి చేయరు? కాని ఇది యుద్ధ మైదానము. ఇంత ఉన్నత పదవిని పొందేందుకు కష్టపడవలసి ఉంటుంది. అనంతమైన తండ్రి ద్వారా మనము ఉన్నతమైన వారసత్వాన్ని తీసుకుంటామని కూడా పిల్లలకు స్మృతిలోకి వచ్చింది. కల్ప-కల్పము తీసుకుంటాము. మీ వద్దకు చాలామంది వచ్చి 'మన్మనాభవ' మహామంత్రాన్ని తీసుకుంటారు. మన్మనాభవకు అర్థము - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇది మహాన్ ఆత్మలుగా అయ్యేందుకు మహామంత్రము. వారు మాహాత్ములేమీ కారు. వాస్తవానికి శ్రీ కృష్ణుని మహాత్మ అని అంటారు. ఎందుకంటే అతడు పవిత్రుడు. దేవతలు సదా పవిత్రంగా ఉంటారు. దేవతలది ప్రవృత్తి మార్గము. సన్యాసులది నివృత్తి మార్గము. స్త్రీలైతే అలా మోసపోరు. ఇదంతా ఇప్పుడు కలియుగంలోనే చెడిపోయింది. స్త్రీలను కూడా సన్యాసిలుగా చేసి తీసుకెళ్తారు. అయినా వారి పవిత్రత పైనే భారతదేశము నిలిచి ఉంది. పాత ఇంటికి సున్నము మొదలైనవి వేస్తే కొత్తగా అయిపోతుందో అలా సన్యాసులు కూడా కొంత రక్షిస్తారు. కాని ఆ ధర్మమే వేరు, పవిత్రంగా ఉంటారని తండ్రి చెప్తున్నారు.
భారత ఖండములోనే ఇన్ని దేవీ దేవతల మందిరాలు, భక్తి మొదలైనవి ఉన్నాయి. ఇది కూడా ఆటనే. దీని వృత్తాంతాన్ని మీరు తెలియజేస్తారు. భక్తిమార్గము కొరకు ఇవన్నీ కావాలి కదా. ఒక్క శివునికే ఎన్నో పేర్లు పెట్టారు. ప్రతి పేరుతో ఒక మందిరము తయారవుతూ వచ్చింది. అనేక మందిరాలున్నాయి. ఎంతో ఖర్చు అవుతుంది. అయినా అల్పకాల సుఖము లభిస్తుంది. అంతే. ఎంతో ధనము వెచ్చిస్తారు. విగ్రహాలు విరిగిపోతాయి. అక్కడైతే మందిరాలు మొదలైనవాటి అవసరమే లేదు. అర్ధకల్పము భక్తి నడుస్తుందని, మళ్లీ అర్ధకల్పము భక్తి అను పేరే ఉండదని కూడా ఇప్పుడు మీకు స్మృతిలోకి వచ్చింది. ఈ వెరైటీ వృక్షము యొక్క స్మృతిని తండ్రి ఎంతగానో కలిగిస్తూ ఉంటారు. కేవలం కలియుగము ఆయువే 40 వేల సంవత్సరాలు ఉంటే మరి క్రైస్తవులు మొదలైనవారి ఆయువు కూడా ఎంతగానో పెరిగిపోవాలి. క్రైస్తవ ధర్మానికి ఇంతే పరిమితము(లిమిట్) ఉందని తండ్రి అర్థము చేయిస్తారు. ఏసుక్రీస్తు వచ్చి ఇంత సమయము అయ్యింది, ఫలానావారు వచ్చి ధర్మస్థాపన చేసి ఇంత సమయము అయ్యిందని తెలుసు. కాని మళ్లీ ఎప్పుడు వెళ్తారో తెలియదు. కల్పము ఆయువు కూడా ఎంతో పెద్దదిగా చేసేశారు. ఇక్కడైతే వినాశనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇప్పుడు మీకు తెలుసు. వారిది సైన్సు, మీది సైలెన్సు. మీరు ఎంత సైలెన్స్లోకి వెళ్తారో అంత వినాశనము కొరకు మంచి- మంచి వస్తువులను తయారుచేస్తూ ఉంటారు. రోజురోజుకు సూక్ష్మమైన వస్తువులను తయారుచేస్తూ ఉంటారు. బాబా మన కొరకు కొత్త ప్రపంచాన్ని తయారు చేసేందుకు వచ్చారని మీకు లోలోపల చాలా సంతోషము కలుగుతుంది. కావున మనమిప్పుడు పాత ప్రపంచంలో ఉండము. అద్భుతమంతా బాబాగారిదే. బాబా, మీరు స్వర్గ స్థాపన చేసే అద్భుతము చేస్తారు. ఇప్పుడు మీకు అంతా స్మృతిలోకి వచ్చేసింది. వారికైతే రచయిత, రచనల ఆదిమధ్యాంతాలను గూర్చి తెలియనే తెలియదు. మీకు తెలుసు. మీరు ఎంతో ప్రకాశములో ఉన్నారు. మనుష్యులైతే ఘోర అంధకారములో ఉన్నారు. తేడా ఉంది కదా. సద్గురువు జ్ఞాన అంజనాన్ని ఇచ్చారు, అజ్ఞానాంధకారము వినాశనమైపోయింది........ భక్తిలోని వారికి జ్ఞానమును గూర్చి తెలియదు. ఇప్పుడు మీరు భక్తినీ తెలుసుకున్నారు, జ్ఞానము కూడా తెలుసుకున్నారు. భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుందో, మళ్లీ ఎప్పుడు పూర్తవుతుందో అంతా స్మృతిలోకి వచ్చింది. తండ్రి ఎప్పుడు జ్ఞానమునిస్తారో, ఎప్పుడు పూర్తవుతుందో అంతా గుర్తుంది. నంబరువారుగా అయితే ఉన్నారు. కొందరికి ఎక్కువ స్మృతి ఉంది, కొందరికి తక్కువగా ఉంది. ఎవరికైతే ఎక్కువ స్మృతి ఉంటుందో వారు ఉన్నత పదవిని పొందుతారు. స్మృతిలో ఉంటేనే ఇతరులకు కూడా అర్థము చేయిస్తారు. ఇది అద్భుతమైన స్మృతి కదా. ఇంతకుముందు మీ బుద్ధిలో ఏముండేది? భక్తి, జప తపాదులు, తీర్థయాత్రలు చేయడం, తల వంచి నమస్కరించడం మొదలైన వాటిలో మీ నుదురంతా అరిగిపోయింది. భక్తిలో చేసే స్మృతికి, జ్ఞానానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మీకు భక్తి గురించి తెలుసు. ఎందుకంటే మొదటి నుండి భక్తి చేశారు. మనము మొట్టమొదట శివుని భక్తి చేశామని, ఆ తర్వాత దేవతల భక్తి చేశామని మీకు తెలుసు. ఇతరులెవ్వరికీ ఈ స్మృతి లేదు. మీకు రచన యొక్క ఆదిమధ్యాంతాలు, భక్తి మొదలైన వాటన్నింటి స్మృతి ఉంది. అర్ధకల్పము స్మృతి చేస్తూ చేస్తూ దిగజారుతూనే వచ్చారు.
ఇప్పుడు దు:ఖ పర్వతాలు పడనున్నాయి. పిల్లలైన మీరు అవి పడకముందే స్మృతియాత్ర ద్వారా వికర్మలను వినాశనము చేసుకునే పురుషార్థము చేయాలి. మీరు అందరికీ దీనినే అర్థము చేయిస్తారు. మీ వద్దకు వేలాది మంది వస్తారు. సోదరీ-సోదరులకు మార్గమును చూపించేందుకు మీరు కష్టపడ్తారు. మీకు జ్ఞానము, భక్తి రెండింటి స్మృతి వచ్చింది. అనగా మీరు పూర్తి డ్రామాను నంబరువార్ పురుషార్థానుసారము తెలుసుకున్నారు. ఎవరు ఎంత బాగా తెలుసుకుంటారో వారు అంత బాగా అర్థము కూడా చేయించగలరు. పిల్లలే దానిని అర్థము చేయించాలి. ''సన్ షోజ్ ఫాదర్'' అన్న గాయనము కూడా ఉంది. తండ్రి పిల్లలకు అర్థము చేయిస్తారు, పిల్లలు మళ్లీ ఇతర సోదరులకు అర్థము చేయిస్తారు. మీరు ఆత్మలకు అర్థము చేయిస్తారు కదా. ఈ జ్ఞానము భక్తికి పూర్తిగా భిన్నమైనది. ఒక్క భగవంతుడు వచ్చి భక్తులందరికి ఫలమునిస్తారనే మహిమ కూడా ఉంది కదా. అందరూ ఆ ఒక్క తండ్రి పిల్లలే. నేను పిల్లలందరినీ శాంతిధామము, సుఖధామాలకు తీసుకెళ్తానని తండ్రి చెప్తున్నారు. కల్ప-కల్పపు ఈ జ్ఞానమంతా ఇప్పుడు మీ వద్ద ఉంది, అక్కడ ఉండదు. మీరు పతితులుగా అవుతారు. కావున మిమ్ములను పావనంగా చేసేందుకు తండ్రి ఎంతో కష్టపడ్తారు. అందుకే బలిహారి అవుతాము, అర్పణ అవుతాము...... అని గాయనము ఉంది. ఎవరి పై ? తండ్రి పై. తండ్రి, ఈ బ్రహ్మాబాబా ఎలా బలిహారి అయ్యాడో ఉదాహరణ చూపుతున్నారు. ఈ ఉదాహరణను అనుసరించండి. ఇతడే మళ్లీ లక్ష్మినారాయణగా అవుతాడు. ఒకవేళ ఇంత ఉన్నత పదవిని పొందాలంటే ఈ విధంగా బలిహారమవ్వాలి. షాహుకార్లు ఎప్పుడూ బలిహారి అవ్వలేరు. ఇక్కడైతే స్వాహా చేయవలసి వస్తుంది. షాహుకార్లకు తప్పకుండా ఏమేమో గుర్తుకొస్తాయి. అంత్యకాలములో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో............ అన్న గాయనము కూడా ఉంది కదా. ఈ ధనమునంతా ఏం చేస్తారు? ఎవ్వరూ తీసుకోరు. ఎందుకంటే అందరూ అంతమైపోనున్నారు. నేను కూడా తీసుకొని ఏం చేస్తాను? శరీర సహితంగా అంతా సమాప్తమైపోతుంది. మీరు మరణిస్తే మీ కొరకు ప్రపంచమంతా మరణించినట్లే. ఈ ధనము మొదలైనవేవీ ఉండవు. పోతే గరుడ పురాణము మొదలైన వాటిలో అయితే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను భయపెట్టేందుకు వ్రాసేశారు.
తండ్రి చెప్తారు - ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తిమార్గానికి చెందినవి. రావణ రాజ్యము ఉన్నపుడు భక్తి మార్గము అర్ధ కల్పము నడుస్తుంది. రావణుని ఎప్పటి నుండిి తగులబెట్తున్నారు? అని ఎవరినైనా అడగండి. అప్పుడు వారు పరంపరగా అని అంటారు. అరే! పరంపరగా రావణుడు ఉండనే ఉండడు. వారికి తెలియదు కనుక పరంపర నుండి అని చెప్పేస్తారు. రావణరాజ్యము ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతిలోకి వచ్చింది. రచయిత-రచనల రహస్యాన్ని కూడా మీరు అర్థము చేసుకున్నారు. పిల్లలూ!(మామేకం యాద్ కరో), నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే పాపాలు సమాప్తమైపోతాయని ఇప్పుడు తండ్రి చెప్తారు. పరస్పరము ఒకరినొకరు ఈ విషయములో అప్రమత్తము చేసుకోండి. తిరిగేందుకు వెళ్లినప్పుడు కూడా పరస్పరము ఇవే విషయాలు మాట్లాడుకోండి. మీ సమూహములోని వారందరూ ఇదే స్మృతిలోనే, ఇదే స్థితిలోనే తిరుగుతూ ఉంటే మీ శాంతి ప్రభావము చాలా పడ్తుంది. ఫాదరీలు కూడా చాలా సైలెన్స్లో క్రీస్తు స్మృతిలో వెళ్తారు. వారు ఎవరివైపూ చూడను కూడా చూడరు. ఇక్కడైతే మీరు ఎంతగానో స్మృతిలో ఉండవచ్చు. ఇక్కడ మీకు ఏ చిక్కు సమస్యలూ, వ్యాపారాలు లేవు. చాలా మంచి వాయుమండలము ఉంది. బయట అయితే చాలా ఛీ-ఛీ వాయుమండలము ఉంటుంది. అందుకే సన్యాసుల ఆశ్రమాలు కూడా ఎంతో దూరంగా ఉంటాయి. మీది అనంతమైన సన్యాసము. ఇప్పుడిక ఈ పురాతన ప్రపంచము పోనే పోతుంది. ఇప్పుడిది శ్మశాన వాటిక, మళ్లీ ఇదే ఫరిస్తాన్గా(స్వర్గముగా) అవ్వనున్నది. అక్కడ వజ్ర వైఢూర్యాల మహళ్లు తయారవుతాయి. ఈ లక్ష్మినారాయణులు ఫరిస్తాన్కు అధిపతులుగా ఉండేవారు కదా. ఇప్పుడు లేరు. నేను కల్ప-కల్పము సంగమ యుగములోనే వస్తానని బాబా అంటారు. ఈ చక్రమంతా పునరావృతము అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే తండ్రి స్మృతినిప్పించారో అప్పుడు మీకు పూర్తిగా గుర్తుకు వచ్చింది. ఇంతకు ముందు బుద్ధిలో ఏమీ లేదు. ఈ స్మృతి నషాలో ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఇతరులకు కూడా అంతే సంతోషముతో అర్థము చేయిస్తారు. స్మృతిలో ఉంటూ మీరు ఇళ్లు-వాకిళ్లను సంభాళించాలి. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. డ్రామా ఆదిమధ్యాంతాలను బాగా అర్థము చేసుకొని స్మృతిలో ఉండి ఇతరులకు కూడా స్మృతిని కలిగించాలి. జ్ఞాన అంజనాన్ని ఇచ్చి అజ్ఞానాంధకారమును దూరము చేయాలి.
2. బ్రహ్మాబాబా సమానంగా బలిహారి అవ్వడంలో పూర్తిగా అనుసరించాలి. శరీర సహితంగా అన్నీ అంతమవ్వనున్నాయి. కావున అంతకుముందే జీవిస్తూనే మరణించాలి. తద్వారా అంతిమ సమయములో ఏమీ గుర్తు రాకూడదు.
వరదానము :-
'' మీ సంపర్కం (సాహచర్యం) ద్వారా అనేక ఆత్మల చింతలను నాశనము చేసే సర్వుల ప్రియ భవ ''
వర్తమాన సమయంలో వ్యక్తులలో స్వార్థ భావమున్నందున, వైభవాల ద్వారా అల్పకాలిక ప్రాప్తులు లభిస్తున్నందున ఆత్మలు ఏదో ఒక చింతలో దు:ఖితులుగా ఉన్నారు. శుభ చింతక ఆత్మల కొంత సమయపు సంపర్కము కూడా ఆ ఆత్మల చింతలను నాశనము చేసేందుకు ఆధారంగా అవుతుంది. ఈ రోజు విశ్వానికి మీ వంటి శుభ చింతక ఆత్మల ఆవశ్యకత ఉంది. అందువలన మీరు విశ్వానికి అతిప్రియమైనవారు.
స్లోగన్ :-
'' వజ్ర సమానమైన (ఆత్మలైన) మీ మాటలు కూడా రత్నాల సమానం మూల్యవంతంగా ఉండాలి.''