29-03-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - మీరు మీ శరీర సహితము అన్నిటి నుండి మమకారాన్ని తొలగించాలి, ఆత్మలైన మీరు ఎప్పుడైతే పావనంగా, కర్మాతీతంగా అవుతారో అప్పడు ఇంటికి వెళ్ళగలరు.''
ప్రశ్న :-
ఆత్మ ఏ విషయములో చాలా భయపడ్తుంది? ఆ భయమెందుకు?
జవాబు :-
శరీరము వదలాలంటే ఆత్మకు చాలా భయమేస్తుంది ఎందుకంటే దానికి తన శరీరము పై మమకారము ఏర్పడింది. ఎవరైనా దు:ఖము కారణంగా శరీరము వదలాలని అనుకున్నా వారు చేసిన పాప కర్మల శిక్షను అనుభవించే తీరాలి. సంగమ యుగములో పిల్లలైన మీకు ఏ విధమైన భయమూ లేదు. మీకు ఇంకా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మేము పాత శరీరాన్ని వదిలి బాబా వద్దకు వెళ్లిపోతామని మీకు తెలుసు.
ఓంశాంతి.
ఒకటి జ్ఞానము, మరొకటి భక్తి అని మధురాతి మధురమైన పిల్లలకు అర్థము చేయించబడింది. ఇది డ్రామాలో రచింపబడింది. డ్రామా ఆదిమధ్యాంతాలు ఇతరులెవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు తెలుసు. సత్యయుగములో మరణ భయముండదు. ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకంటామని తెలుస్తుంది. దు:ఖించే, రోధించే విషయమేదీ ఉండదు. ఇక్కడ మరణమంటే భయముంటుంది. శరీరము వదలాలంటే ఆత్మకు దు:ఖము కలుగుతుంది. ఎందుకంటే మళ్లీ జన్మ తీసుకొని దు:ఖమే అనుభవించాలని భయపడ్తుంది. మీరు సంగమ యుగములో ఉన్నారు. ఇప్పుడు వాపస్ వెళ్లాలని పిల్లలైన మీకు తండ్రి అర్థము చేయించారు. ఎక్కడకు వెళ్లాలి? ఇంటికి. అది భగవంతుని ఇల్లు కదా. ఇది ఇల్లు కాదు. ఎక్కడైతే భగవంతుడు మరియు ఆత్మిక పిల్లలైన మీరు నివసిస్తారో దానినే ఇల్లు అని అంటారు. అక్కడ ఈ శరీరము ఉండదు. మేము భారతదేశములో ఉంటాము, ఇంట్లో ఉంటామని మనుష్యులు ఎలా అంటారో అలా మీరు ఆత్మలైన మేము అక్కడ మా ఇంట్లో ఉంటామని అంటారు. అది ఆత్మల ఇల్లు, ఇది జీవాత్మల ఇల్లు. దానిని ముక్తిధామమని అంటారు. మనుష్యులు అక్కడకు వెళ్లి భగవంతుని కలుసుకోవాలని పురుషార్థము చేస్తారు. భగవంతుని కలుసుకునేందుకు చాలా సంతోషముండాలి. ఇది ఆత్మ ఉండే శరీరము. దీని పై ఆత్మకు చాలా మోహము ఏర్పడింది. అందుకే కొద్దిగా జబ్బు మొదలైనవి వచ్చిన వెంటనే భయమేస్తుంది. ఈ శరీరము ఎక్కడ వదిలిపోతుందో అని భయమేస్తుంది. అజ్ఞాన కాలములో కూడా భయముంటుంది. ఇది సంగమ యుగము. ఇప్పుడు తండ్రి వద్దకు వాపస్ వెళ్లాలని మీకు తెలుసు. అందువలన భయపడే విషయమే లేదు. తండ్రి చాలా మంచి యుక్తి తెలిపించారు. పతిత మనుష్యులు నా వద్దకు అనగా ముక్తిధామానికి రాలేవు. అది పవిత్ర ఆత్మల ఇల్లు, ఇది మనుష్యులు ఉండే ఇల్లు. ఈ శరీరము పంచ తత్వాలతో తయారవుతుంది. అందువలన పంచ తత్వాలు ఇక్కడే ఉండమని ఆకర్షిస్తాయి, లాగుతాయి. ఆకాశము, వాయువు, జలము,.......... అక్కడ(మూలవతనములో) ఉండవు. ఇవి విచార సాగర మథనము చేసేందుకు యుక్తులు. ఆత్మ ఈ ఆస్తిని తీసుకున్నది. అందుకే శరీరము పై మమకారము ఏర్పడింది లేకుంటే ఆత్మలైన మనము అచ్చట ఉండేవారము. ఇప్పుడు మళ్లీ అక్కడకు వెళ్లేందుకు పురుషార్థము చేస్తున్నారు. ఎప్పుడైతే ఆత్మలైన మీరు పవిత్రంగా అవుతారో అప్పుడు మళ్లీ సుఖము లభిస్తుంది. దు:ఖమనే మాటే ఉండదు. ఇప్పుడు ఈ సమయములో ఇది దు:ఖధామము, అందువలన ఈ పంచ తత్వాలు కూడా పై నుండి క్రిందకు వచ్చి పాత్రను అభినయించేందుకు క్రిందకు లాగుతాయి. ప్రకృతి ఆధారమునైతే తప్పకుండా తీసుకోవలసి వస్తుంది లేకుంటే డ్రామా నడవదు. ఇది సుఖ- దు:ఖాలతో కూడిన నాటకము. మీరు సుఖములో ఉన్నప్పుడు పంచ తత్వాల శరీరము పై మమకారముండదు. అక్కడ పవిత్రంగా ఉంటారు. శరీరము పై ఇంత మమకారము ఉండదు. ఈ పంచ తత్వాల పై కూడా మమకారాన్ని వదిలేస్తారు. మనము పవిత్రమైతే అక్కడ శరీరము కూడా యోగబలము ద్వారా తయారవుతుంది. అందువలన అక్కడ మాయ ఆకర్షించదు. అచ్చటి మన శరీరము యోగబలముతో తయారై ఉంటుంది. అందుకే దు:ఖము ఉండదు. డ్రామా ఎంతో అద్భుతంగా తయారయ్యింది. ఇది కూడా చాలా సూక్ష్మంగా అర్థము చేసుకునే విషయము. ఎవరైతే మంచి బుద్ధివంతులుగా, సేవలో తత్పరులుగా ఉంటారో వారే బాగా అర్థము చేయించగలరు. ధనమిస్తే ధనము తరగదని తండ్రి అన్నారు. దానము చేస్తూ ఉంటే ధారణ కూడా జరుగుతుంది. లేకుంటే ధారణ అవ్వడం కష్టము. వ్రాయడం వలన ధారణ జరుగుతుందని భావించకండి. ఇతరుల కళ్యాణము కొరకు పాయింట్లు వ్రాసి పంపడం వేరే విషయము. అలా వ్రాయడం స్వయానికి ఉపయోగపడదు. కొంతమంది కాగితములో వ్రాసి చెత్తలో పడేస్తారు. ఇప్పుడు నేను వ్రాసే పాయింట్లు మళ్లీ నాకు పనికి వస్తాయని ఆంతరికములో భావించాలి. వ్రాసి పారేయడం ద్వారా లాభమేముంటుంది. ఇలా వ్రాయడం కూడా ఆత్మ స్వయాన్ని మోసము చేసుకోవడం. ఇది ధారణ చేయు విషయము. బాబా లిఖితములో ఉన్నదానిని కంఠస్థము చేయలేదు. తండ్రి ప్రతి రోజూ అర్థము చేయిస్తూ ఉంటారు. మొట్టమొదట మీ కనెక్షన్(సంబంధము) తండ్రితో ఉండాలి. తండ్రి స్మృతి ద్వారానే ఆత్మలైన మీరు పవిత్రమౌతారు. తర్వాత అక్కడ కూడా మీరు పవిత్రంగా ఉంటారు. ఆత్మ మరియు శరీరము రెండూ పవిత్రంగా ఉంటాయి. తర్వాత ఆ బలము మళ్లీ సమాప్తమౌతే పంచ తత్వాల బలము ఆత్మను ఆకర్షిస్తుంది. ఆత్మ తన ఇంటికి వెళ్లేందుకు శరీరమును వదలాల్సి ఉంటుంది. మీరు పావనమై వెన్న నుండి వెంట్రుక తీసినంత సులభంగా శరీరాన్ని వదిలేస్తారు.
పిల్లలైన మీరు శరీర సహితము అన్ని వస్తువుల నుండి మమకారాన్ని తొలగించి వేయాలి. ఆత్మలమైన మనము శరీరము లేకుండా ఇక్కడకు వచ్చాము, పవిత్రంగా ఉండేవారము. ఈ ప్రపంచము పై మనకు అప్పుడు మమకారము లేదు. అక్కడ శరీరమును వదిలినా ఎవ్వరూ విలపించరు. ఏ కష్టమూ ఉండదు. జబ్బులు కూడా ఉండవు. శరీరము పై మమకారము కూడా ఉండదు. ఒక శరీరము ముసలిదైతే పాత్రను అభినయించేందుకు ఆత్మ మరో శరీరాన్ని తీసుకుంటుంది. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. అందుకే బాబా వద్దకు వెళ్లాలని ఇప్పుడు మనసు కోరుకుంటుంది. నన్ను స్మృతి చేయండని బాబా చెప్తున్నారు. ఈ జ్ఞానమంతా ఇప్పుడు బుద్ధిలో ఉంది. తండ్రి చెప్తున్నారు - పవిత్రంగా తయారై నా వద్దకు రావాలి. ఇప్పుడైతే అందరూ పతితులుగా ఉన్నారు. అందువలన ఈ పంచ తత్వాల మట్టి బొమ్మ పై మోహము ఏర్పడింది. దీనిని వదిలేందుకు మనసు రాదు. లేకుంటే శరీరాన్ని వదిలి బాబా వద్దకు వెళ్లిపోవాలని వివేకము చెప్తుంది. మనము పవిత్రమై బాబా వద్దకు వెళ్లేందుకు పురుషార్థము చేస్తున్నాము. బాబా చెప్తున్నారు - మీరు నావారిగా ఉండేవారు, ఇప్పుడు మళ్లీ నన్ను స్మృతి చేస్తే ఆత్మ పవిత్రమైపోతుంది. తర్వాత మళ్లీ ఈ శరీరాన్ని ధారణ చేయడంలో ఏ కష్టమూ ఉండదు. ఇప్పుడు శరీరము పై మోహమున్నందున డాక్టర్లను మొదలైనవారిని పిలుస్తారు. మేము బాబా వద్దకు వెళ్తున్నామనే ఖుషీ మీకుండాలి. ఇప్పుడు ఈ శరీరముతో మనకు ఏ సంబంధమూ లేదు. ఈ శరీరము కేవలం పాత్రను అభినయించేందుకు లభించింది. అక్కడ ఆత్మ మరియు శరీరము రెండూ చాలా ఆరోగ్యంగా ఉంటాయి. దు:ఖమనే పేరు కూడా ఉండదు. కావున పిల్లలు ఎంత పురుషార్థము చేయాలి! ఇప్పుడు మనము బాబా వద్దకు వెళ్తాము. కావున ఈ శరీరాన్ని వదిలి ఎందుకు వెళ్లరాదు. కానీ ఎంతవరకు యోగము జోడించి పవిత్రంగా అవ్వరో, కర్మాతీత అవస్థ తయారవ్వదో అంతవరకు బాబా వద్దకు వెళ్లలేరు. అజ్ఞాన మనుష్యులకు ఈ ఆలోచనలు రావు. పిల్లలైన మీకు ఈ ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు మనము ఇంటికి వెళ్లాలి. మొదట ఆత్మలో శక్తి వస్తుంది. ఖుషీ ఉంటుంది, ఎప్పుడూ భయముండదు. ఇక్కడ దు:ఖముంది. అందువలన మనుష్యులు భక్తి మొదలైనవి చేస్తూ ఉంటారు. కానీ వాపస్ వెళ్లే దారి వారికి తెలియదు. ఇంటికి పోయే మార్గము ఒక్క తండ్రి మాత్రమే తెలుపుతారు. మేము బాబా వద్దకు వెళ్లాలనే ఖుషీ ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇక్కడ మీకు శరీరము పై మోహముంది. ఆ మోహమును తొలగించండి. ఇది 5 తత్వాల శరీరము. ఇదంతా మాయయే. ఈ కనులతో ఆత్మ చూసేదంతా మాయయే మాయ. ఇక్కడ ప్రతి వస్తువులోనూ దు:ఖమే ఉంది. ఎంతో మురికిగా ఉంది. స్వర్గములో అయితే శరీరము కూడా ఫస్ట్క్లాస్గా ఉంటుంది. మహలు కూడా ఫస్ట్క్లాస్దే లభిస్తుంది. దు:ఖించు విషయమే ఉండదు. ఈ నాటకము ఎలా తయారయ్యిందని చింతన జరుగుతూ ఉండాలి కదా. బాబా చెప్తున్నారు - ఇంకేమీ అర్థము కాకపోయినా మంచిగా మాట్లాడండి, తండ్రిని స్మృతి చేయండి. అప్పుడు వికర్మలు వినాశనమవుతాయి. స్వర్గములోకి వెళ్తారు. మనమంతా ఆత్మలము, ఈ శరీర రూపి తోక తర్వాత లభించింది. ఇందులో మనము ఎందుకు చిక్కుకున్నాము? దీనిని రావణ రాజ్యమని అంటారని తండ్రి అర్థం చేయించారు. రావణ రాజ్యములో దు:ఖమే దు:ఖముంది. సత్యయుగములో దు:ఖమనే మాటే ఉండదు. ఇప్పుడు బాబా స్మృతి ద్వారా మనము శక్తి తీసుకుంటాము ఎందుకంటే బలహీనంగా అయిపోయాము. దేహాభిమానము అన్నిటికంటే ఎక్కువగా బలహీనపరుస్తుంది. ఇది తయారైన డ్రామా అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది ఎప్పుడూ పూర్తిగా నిలిచిపోదు. మోక్షము మొదలైన మాటే లేదు. ఇది తయారైన డ్రామా చింత ఎందుకు చేయాలి? అని కూడా అంటారు. ఏది జరిగిపోయిందో అది మళ్లీ జరిగే తీరాలి. చింతించే మాటే లేదు. సత్యయుగములో చెడు అనేదే ఉండదు. ఇక్కడ చింత తగుల్కొనే ఉంది. ఇది డ్రామా అని తండ్రి చెప్తున్నారు. తండ్రి మనకు మార్గమును తెలిపే ఉన్నారు - మీరు ఈ మార్గములో నా వద్దకు చేరుకుంటారు. వెన్న నుండి వెంట్రుక తీసినంత సులభమైపోతుంది. కేవలం మీరు నన్ను స్మృతి చేస్తే మీ ఆత్మ పవిత్రమైపోతుంది. పావనంగా అయ్యేందుకు ఏ ఇతర యుక్తీ లేదు. ఇప్పుడు మనము రావణ రాజ్యములో కూర్చుని ఉన్నామని మీరు అర్థం చేసుకున్నారు. ఇది ఈశ్వరీయ రాజ్యము. ఇది ఈశ్వరీయ రాజ్యము మరియు ఆసురీ రాజ్యముల నాటకము. ఈశ్వరుడు వచ్చి ఎలా స్థాపన చేస్తారో ఎవ్వరికీ తెలియదు. జ్ఞానసాగరుడని తండ్రినే అంటారు. వారే వచ్చి అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు జ్ఞానమంతా అర్థము చేసుకుంటున్నారు. మళ్లీ మొత్తము జ్ఞానమంతా మర్చిపోతారు. ఏ చదువు ద్వారా మనము ఈ పదవి పొందుకున్నామో ఆ జ్ఞానమంతా మర్చిపోతారు. స్వర్గములోకి పోతూనే ఈ జ్ఞానము అదృశ్యమైపోతుంది. భగవంతుడు డబల్ కిరీటాలను ఎలా ఇచ్చారో కొద్దిగా కూడా తెలియదు. ఈ బ్రహ్మకు కూడా తెలియకుంటే శాస్త్రాలను మొదలైనవి చదివే ఇతరులకు ఎలా తెలుస్తుంది. వారికి ఈ విషయాలు బుద్ధికి కూడా తోచవు. మీరు వచ్చి విన్నప్పుడు వెంటనే మీకు టచ్ అవుతాయి. ఇవన్నీ గుప్తమైన విషయాలు. తండ్రి వినిపిస్తున్నారు - వారేమైనా కనిపిస్తున్నారా? అర్థమవుతుంది కానీ ఆత్మనేమైనా చూశారా? ఆత్మ అని భావిస్తారు. దివ్యదృష్టితో చూడవచ్చు. కేవలం చూచినందున ఏమర్థమవుతుందని బాబా చెప్తున్నారు. ఆత్మ ఏమో చాలా చిన్న బిందువు. ఆత్మలు అనేకమున్నాయి. 10-20 ఆత్మలను కూడా మీరు సాక్షాత్కారములో చూస్తారు. ఒకటి కనిపిస్తే ఏమీ అర్థము కాదు. చాలా మందికి సాక్షాత్కారము జరుగుతుంది. అది ఆత్మనా, పరమాత్మనా? అని ఎలా తెలుసుకోవాలి? వ్యత్యాసము తెలియదు. అలా కూర్చొని ఉంటే చిన్న చిన్న ఆత్మలు కనిపిస్తాయి. ఆత్మనా లేక పరమాత్మనా? అని తెలియదు.
ఇంత చిన్న ఆత్మలో ఎంత శక్తి ఉందో ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మ అధికారి, ఒక శరీరము వదలి మరొక దానిలో పాత్ర చేసేందుకు ప్రవేశిస్తుంది. ఇది ఎంతో సహజము. శరీరము జబ్బుపడినా లేక ఎవరైనా దివాలా తీసినా దీని కంటే శరీరము వదిలేస్తే బాగుంటుందని భావిస్తారు. ఆత్మ వెళ్లిపోతే దు:ఖము నుండి విడుదల అవుతామని అనుకుంటారు. కానీ తల పైనున్న పాప భారము ఎలా వదలిపోతుంది? స్మృతి ద్వారా పాపము వినాశనమయ్యేందుకే మీరు పురుషార్థము చేస్తారు. రావణుని కారణంగా చాలా పాపాలు జరిగిపోయాయి. ఆ పాపాల నుండి ముక్తులుగా అయ్యేందుకు తండ్రి మార్గమును చూపుతున్నారు. కేవలం నన్ను స్మృతి చేస్తూ ఉండండి అని చెప్తున్నారు. స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేయాలి. మీ పాపాలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. స్మృతి చేయడం కూడా పిన్నమ్మ ఇల్లు(సులభము) కాదు. నన్ను స్మృతి చేయడంలో మాయ మిమ్ములను చాలా విసిగిస్తుంది. క్షణ-క్షణము మరిపింపజేస్తుంది. ఈ బాబా తన అనుభవమును కూడా వినిపిస్తారు. నేను చాలా ప్రయత్నిస్తాను. కానీ మాయ ఆటంకము కలిగిస్తుంది. ఇద్దరమూ(నేను, బాబా) కలిసే ఉన్నాము, కలిసి ఉంటూ పదే పదే మర్చిపోతాను. మాయ చాలా కఠినమైనది. క్షణ-క్షణము వీరు గుర్తు వస్తారు, ఫలానావారు గుర్తు వస్తారు. మీరు చాలా మంచి పురుషార్థము చేస్తారు. కొంతమంది అసత్యాలు కూడా మాట్లాడ్తారు. 10-15 రోజులు చార్టు వ్రాసి వదిలేస్తారు. ఇందులో చాలా హెచ్చరికగా ఉండవలసి వస్తుంది. పవిత్రమై కర్మాతీతావస్థకు చేరుకున్నప్పుడు గెలుపొందుతామని కూడా తెలుసు. ఇది ఈశ్వరీయ లాటరీ కదా. బాబాను స్మృతి చేయడమే స్మృతికి ఆధారము. ఇది బుద్ధి ద్వారా అర్థము చేసుకునే విషయము. మేము బాబాను స్మృతి చేస్తున్నామని అంటారు. కానీ స్మృతి చేయుట రానే రాదని బాబా చెప్తున్నారు. పదవిలో కూడా వ్యత్యాసముంటుంది కదా. రాజ్యస్థాపన ఎలా జరిగింది. మీరు అనేకసార్లు రాజ్యపాలన చేశారు మళ్లీ పోగొట్టుకున్నారు. బాబా ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత చదివిస్తారు. మళ్లీ రావణ రాజ్యములో మీరు వామమార్గములోకి వెళ్లిపోతారు. ఎవరైతే దేవతలుగా ఉండేవారో, వారే వామమార్గములో ప్రవేశించి క్రింద పడిపోతారు. కావున స్మృతి చేయుటకు తండ్రి చాలా గుప్తమైన విషయాలు తెలిపిస్తున్నారు. అర్థము చేసుకోవడం చాలా సులభము. శరీరాలు వదిలి తండ్రి వద్దకు వెళ్లిపోతారు. నన్ను తెలుసుకున్నప్పుడే యోగబలము ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. అయితే ఇది చివరి సమయములోనే జరుగుతుంది. కానీ అంతవరకు వాపస్ ఎవ్వరూ వెళ్లలేరు. ఎవరు ఏమి చెప్పినా, చేసినా యదార్థ యోగము నేనే వచ్చి నేర్పిస్తాను. ఈ యోగబలము అర్ధకల్పము నడుస్తుంది. అక్కడ అపారమైన సుఖము అనుభవిస్తారు. భక్తిమార్గములో మానవులు ఏమేమో చేస్తూ ఉంటారు. తండ్రి ఎప్పుడైతే వచ్చి జ్ఞానమిస్తారో అప్పుడిక భక్తి ఉండదు. జ్ఞానము ద్వారా పగలు వచ్చిన తర్వాత ఏ కష్టమూ ఉండదు. భక్తిమార్గము అంధకారమైన రాత్రి. అందులో ఎదురుదెబ్బలు తింటారు. అక్కడ దు:ఖమనే మాటే ఉండదు. ఎవరైతే ఇచ్చటి శ్యాప్లింగ్(అంటు కట్టడము)గా ఉంటారో వారి బుద్ధిలో ఈ విషయాలన్నీ నిలుస్తాయి. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఈ అద్భుతమైన జ్ఞానమును అర్థం చేయించలేరు. అర్థము చేసుకునేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. అలా డ్రామాలో నిశ్చయింపబడింది. అందులో ఏ మాత్రము తేడా ఉండేందుకు వీలు లేదు. పరమాత్మ ఏ పనిని చేయలేరు! అన్నీ చేయగలరని మనుష్యులు భావిస్తారు. కానీ వారు వచ్చేది ఒకే ఒక్కసారి. వారు వచ్చి మీకు స్వర్గానికి మార్గమును తెలుపుతారు.
ఇప్పుడు పిల్లలైన మీరు ఎంతో విశాలబుద్ధి గలవారిగా అయ్యారు. ఇక్కడ ఇద్దరూ కలిసే ఉన్నారు. ఈ బ్రహ్మ కూడా ఎవరినైనా చూస్తే, వారికి శాంతిని దానము చేయాలని భావిస్తారు. చూస్తూనే వీరు మన వంశానికి చెందినవారా లేదా! అని తెలిసిపోతుంది. సేవాధారి పిల్లల పని కూడా వచ్చినవారి నాడిని గమనించడం, మన కులానికి చెందినవారైతే శాంతమైపోతారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. పవిత్రంగా అయ్యి తండ్రి జతలో ఇంటికి వెళ్లేందుకు ఈ పంచ తత్వాల బొమ్మ(శరీరము) పై మమకారము ఉండరాదు. శరీరాన్ని వదిలేస్తామనే భయము తీసేయాలి.
2. స్మృతియాత్రను తెలిపే చార్టును చాలా గమనముతో పెంచుకుంటూ ఉండాలి. యోగబలము ద్వారా ఆత్మను పావనంగా చేసుకుని కర్మాతీతులుగా అయ్యి ఈశ్వరీయ లాటరీని గెలుచుకోవాలి.
వరదానము :-
''మనసు మరియు బుద్ధిని వ్యర్థము నుండి ముక్తముగా ఉంచి బ్రాహ్మణ సంస్కారాన్ని తయారు చేసుకునే రూలర్ భవ''
ఏ విధమైన చిన్న వ్యర్థ విషయము గాని, వ్యర్థ వాతావరణము గాని లేక వ్యర్థ దృశ్యము యొక్క ప్రభావము మొదట మనసు పై పడ్తుంది తర్వాత బుద్ధి దానికి సహయోగము చేస్తుంది. ఒకవేళ మనసు, బుద్ధి అదే విధంగా నడుస్తూ ఉంటే అది సంస్కారంగా అవుతుంది. తర్వాత బ్రాహ్మణ సంస్కారాలు కాకుండా రకరకాల సంస్కారాలు కనిపిస్తాయి. ఏదైనా వ్యర్థ సంస్కారానికి వశమవ్వడం, స్వయంతో యుద్ధము చేయడం, మాటిమాటికి సంతోషము మాయమవ్వడం - ఇది క్షత్రియ సంస్కారము. బ్రాహ్మణులనగా రూలర్లు(స్వయానికి రాజులు). వారు వ్యర్థ సంస్కారాల నుండి ముక్తులుగా ఉంటారు, పరవశులుగా ఉండరు.
స్లోగన్ :-
''దృఢ ప్రతిజ్ఞ ద్వారా అన్ని సమస్యలను సహజంగా దాటుకునే వారే మాస్టర్ సర్వశక్తివంతులు.''