29-04-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - తండ్రిని ప్రీతిగా స్మృతి చేస్తే మీరు పూర్తిగా తృప్తి (నిహాల్‌) చెందుతారు. దృష్టి ద్వారా తృప్తి చెందుట అనగా( నజర్‌ సే నిహాల్‌ ) విశ్వాధికారులుగా అగుట ''

ప్రశ్న :-

నజర్‌ సే నిహాల్‌ కీందా స్వామి సద్గురు,............ ( స్వామి, సద్గురువు అయిన పరమాత్ముని ఒక్క చల్లని చూపు మనకు ఎంతో తృస్తినిస్తుంది,.....) దీని వాస్తవిక అర్థమేమి ?

జవాబు :-

ఆత్మకు తండ్రి ద్వారా మూడవ నేత్రము లభించినప్పుడు, ఆ కంటి ద్వారా తండ్రిని గుర్తించినప్పుడు ఆత్మ సంపూర్ణ తృప్తి చెందుతుంది. అనగా సద్గతి లభిస్తుంది. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ! దేహీ-అభిమానులుగా అయ్యి మీరు నా పై దృష్టి నిలపండి అనగా నన్ను స్మృతి చేయండి. ఇతర సాంగత్యములన్నీ వదిలి ఒక్క నాతోనే జోడించండి. అప్పుడు బేహాల్‌(దిగులుగా ఉన్న స్థితి) అనగా కంగాల్‌(నిరుపేదల) నుండి తృప్తి అనగా శ్రీమంతులుగా తయారవుతారు.

ఓంశాంతి.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఎవరి వద్దకు వస్తారు? ఆత్మిక తండ్రి వద్దకు. మేము శివబాబా వద్దకు వెళ్తున్నామని భావిస్తారు. శివబాబా సర్వాత్మల తండ్రి అని కూడా ఆత్మలకు తెలుసు. అంతేకాక వారు సుప్రీమ్‌ టీచరు, సుప్రీమ్‌ సద్గురువు కూడా అని పిల్లలకు నిశ్చయముండాలి. సుప్రీమ్‌ అనగా పరమ శ్రేష్ఠము. వారినొక్కరినే స్మృతి చేయాలి. దృష్టితో దృష్టి కలుపుతారు. నజర్‌ సే నిహాల్‌ కీందా స్వామి సద్గురు,........ అను గాయనము కూడా ఉంది. దాని అర్థము తెలుసుకోవాలి. దృష్టితో తృప్తి - ఎవరిని తృప్తి పరిచారు? ప్రపంచమంతటిని తృప్తిపరచారని తప్పకుండా అనాలి. ఎందుకంటే వారు సర్వుల సద్గతిదాత. అందరినీ ఈ పతిత ప్రపంచము నుండి తీసుకెళ్లేవారు. అయితే ఇప్పుడు దృష్టి ఎవరిది? ఈ కనులతో చూచే దృష్టా? కాదు. జ్ఞాన మూడవ నేత్రము లభిస్తుంది. దాని ద్వారా వీరు మన ఆత్మలందరి తండ్రి అని ఆత్మ తెలుసుకుంటుంది. తండ్రి ఆత్మలకు సలహానిస్తున్నారు - నన్ను స్మృతి చేయండి. తండ్రి ఆత్మలకు అర్థము చేయిస్తున్నారు - ఆత్మలే పతితంగా, తమోప్రధానంగా అయ్యాయి. ఇప్పుడిది మీ 84వ జన్మ. ఈ నాటకము ఇప్పుడు పూర్తవుతుంది. తప్పక పూర్తి అవ్వనే అవ్వాలి. కల్ప-కల్పము పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచము తయారౌతుంది. మళ్లీ కొత్త ప్రపంచము పాతదిగా అవుతుంది. పేర్లు కూడా వేరు వేరుగా ఉన్నాయి. కొత్త ప్రపంచము పేరు సత్యయుగము. మొదట మీరు సత్యయుగములో ఉండేవారు. తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ 84 జన్మలు గడిపారని తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు మీ ఆత్మ తమోప్రధానంగా అయిపోయింది. తండ్రిని స్మృతి చేస్తే పూర్తిగా తృప్తి చెందుతారు. తండ్రి సన్ముఖములో చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి. నేను ఎవరు? పరమపిత పరమాత్మను. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ! దేహీ - అభిమానులుగా అవ్వండి, దేహాభిమానులుగా అవ్వకండి. ఆత్మాభిమానులుగా అయ్యి మీరు నాతో దృష్టిని జోడిస్తే మీరు సంపూర్ణంగా తృప్తి చెందుతారు. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఇందులో ఏ కష్టమూ లేదు. చదివేది ఆత్మనే. పాత్రను అభినయించేది కూడా ఆత్మనే. ఆత్మ ఎంతో చిన్నది. మీరు ఇక్కడకు వచ్చినప్పుడు 84 జన్మల పాత్రను అభినయిస్తారు. మళ్లీ అదే పాత్రను రిపీట్‌ చేయాలి. 84 జన్మల పాత్ర అభినయిస్తూ ఆత్మ పతితమైపోయింది. ఇప్పుడు ఆత్మలో కొద్దిగా కూడా శక్తి లేదు. ఇప్పుడు ఆత్మ అసంతృప్తిగా ఉంది. అనగా ఏ మాత్రము తృప్తి లేదు. బేహాల్‌(దిగులు) అనగా కంగాల్‌(నిరుపేద)గా ఉన్నారు. ఇప్పుడు తృప్తిగా, సంతుష్టంగా ఎలా అవ్వాలి? ఈ పదము భక్తిమార్గములోనిది. దీనిని గురించి తండ్రి అర్థము చేయిస్తున్నారు. వేదాలు, శాస్త్రాలు, చిత్రాలు మొదలైన వాటి పై కూడా అర్థము చేయిస్తారు. మీరు ఈ చిత్రాలను శ్రీమతముననుసరించి తయారు చేశారు. ఆసురీ మతమును అనుసరించి అనేక చిత్రాలున్నాయి. అవన్నీ మట్టితో లేక రాతితో తయారు చేసినవి. ఆ చిత్రాలకు ఎలాంటి కర్తవ్యము లేదు. ఇచ్చటైతే తండ్రి వచ్చి పిల్లలను చదివిస్తారు. భగవానువాచ అనగా ఇది వారు ఇచ్చిన జ్ఞానము కదా. విద్యార్థులకు వీరు ఫలానా టీచరు అని తెలుసు. అనంతమైన తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి ఇటువంటి అద్భుతమైన చదువును చదివిస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఈ చదువుకు, ఆ చదువుకు పగలుకు రాత్రికి ఉన్నంత వ్యత్యాసముంది. ఆ చదువు చదువుతూ చదువుతూ రాత్రి(అంధకారము) అయిపోతుంది. ఈ చదువు ద్వారా పగలు(ప్రకాశము)లోకి వెళ్లిపోతారు. ఆ చదువు అయితే జన్మ-జన్మాంతరాలుగా చదువుతూ వచ్చారు. ఇందులో తండ్రి స్పష్టంగా తెలుపుతున్నారు - ఆత్మ ఎప్పుడు పవిత్రమౌతుందో అప్పుడు ధారణ జరుగుతుంది. పులి పాలు బంగారు గిన్నెలో మాత్రమే నిలుస్తాయని చెప్తారు. ఇప్పుడు మనము బంగారు పాత్రగా తయారవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఉండేది మనుష్యులే కానీ ఆత్మ సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి. 24 క్యారెట్ల బంగారు వలె ఉండేది. ఇప్పుడు 9 క్యారెట్లు బంగారం వలె తయారైపోయింది. ప్రకాశవంతంగా వెలుగుతున్న ఆత్మ జ్యోతి ఇప్పుడు కొడిగట్టిన దీపము వలె ప్రకాశము తగ్గిపోయింది. ఆత్మజ్యోతి వెలిగి ఉన్నవారికి, ఆరిపోయి ఉన్నవారికి చాలా వ్యతాసముంటుంది. అయితే జ్యోతి ఎలా వెలిగింది. పదవి ఎలా పొందుకుంది - ఈ విషయాలను తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి. నన్ను ఎవరైతే మంచి రీతిగా స్మృతి చేస్తారో నేను కూడా వారిని మంచిరీతిగా స్మృతి చేస్తాను. నజర్‌ సే నిహాల్‌ చేయువారు స్వామి అయిన మన తండ్రి ఒక్కరేనని కూడా పిల్లలకు తెలుసు. ఇతని ఆత్మ కూడా తృప్తి చెందుతుంది. మీరందరూ దీపపు పురుగులు. వారిని శమా(దీపము) అని అంటారు. కొన్ని దీపపు పురుగులు కేవలం ప్రదక్ష్షిణ చేసేందుకు వస్తాయి. కొన్ని మంచిరీతిగా గుర్తిస్తాయి. అప్పుడు జీవించి ఉండే మరణిస్తాయి. కొన్ని చుట్టూ తిరిగి వెళ్లిపోతాయి. మళ్లీ అప్పుడప్పుడు వస్తాయి, మళ్లీ వెళ్లిపోతాయి. ఈ గాయనమంతా ఈ సంగమ యుగముదే. ఈ సమయములో ఏమేమి జరుగుతున్నాయో అవే శాస్త్రాలుగా తయారౌతాయి. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి వారసత్వమిచ్చి వెళ్లిపోతారు. అనంతమైన తండ్రి తప్పకుండా అనంతమైన వారసత్వమును ఇస్తారు. 21 తరాలు అని గాయనము కూడా ఉంది. సత్యయుగములో వారసత్వము ఎవరిస్తారు? రచయిత అయిన భగవంతుడే అర్ధకల్పము కొరకు వారి రచనకు వారసత్వాన్ని ఈ సంగమ యుగములోనే ఇస్తారు. అందరూ వారినే స్మృతి చేస్తారు. వీరు తండ్రియే కాక టీచరు, స్వామి, సద్గురువు కూడా అయ్యారు. భలే మీరు ఇతరులెవరినైనా స్వామి, సద్గురువు అంటూ ఉండవచ్చు. కానీ సత్యమైనవారు ఒక్క తండ్రి మాత్రమే. ఎల్లప్పుడూ సత్యమైన వారు(ట్రూత్‌) అని ఆ తండ్రి మాత్రమే పిలువబడ్తారు. ఆ సత్యమైన తండ్రి(ట్రూత్‌) వచ్చి ఏం చేస్తారు? వారు పాత ప్రపంచాన్ని సత్యఖండముగా తయారు చేస్తారు. సత్యఖండము కొరకు మనము పురుషార్థము చేస్తున్నాము. సత్యమైన ఖండమున్నప్పుడు ఇతర ఖండాలేవీ లేవు. ఇవన్నీ తర్వాత వస్తాయి. సత్య ఖండము గురించి ఎవ్వరికీ తెలియదు. పోతే ఇప్పుడున్న ఖండాల గురించి అయితే అందరికీ తెలుసు. ప్రజలకు తమ-తమ ధర్మస్థాపకుల గురించి తెలుసు. అయితే సూర్యవంశము, చంద్రవంశము ఈ సంగమ యుగములోని బ్రాహ్మణ కులము గురించి ఎవ్వరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మను అంగీకరిస్తారు. బ్రాహ్మణులమైన మేము బ్రహ్మ సంతానమని అంటారు కానీ వారు గర్భజనితులు. మీరు ముఖవంశావళికి చెందినవారు. వారు అపవిత్రులు. మీరు పవిత్రమైన ముఖవంశావళి వారు. మీరు ముఖవంశావళిగా తయారై మళ్లీ ఛీ-ఛీ ప్రపంచమైన రావణ రాజ్యము నుండి వెళ్లిపోతారు. అక్కడ రావణ రాజ్యముండదు. ఇప్పుడు మీరు నూతన ప్రపంచములోకి వెళ్లిపోతారు. దానిని నిర్వికారి ప్రపంచమని అంటారు. ప్రపంచమే కొత్తదిగా, పాతదిగా అవుతుంది. అది ఎలా అవుతుందో కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇది ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేదు. లక్షల సంవత్సరాల విషయమైతే ఎవ్వరూ తెలుసుకోలేరు. ఇది కొద్ది సమయపు విషయమే. తండ్రి కూర్చొని ఇదంతా పిల్లలకు అర్థము చేయిస్తున్నారు.

ముఖ్యంగా భారతదేశములో ధర్మగ్లాని అయినప్పుడే నేను వస్తానని తండ్రి చెప్తున్నారు. నిరాకార పరమాత్ముడంటే ఎవరో ఇతర స్థానాలలోని వారెవ్వరికీ తెలియదు. పెద్ద పెద్ద లింగాకారాలను తయారు చేసి ఉంచేశారు. ఆత్మ సైజు ఎప్పుడూ చిన్నది-పెద్దదిగా అవ్వదని పిల్లలకు అర్థం చేయించబడింది. ఆత్మ ఎలాగైతే అవినాశియో, అలా తండ్రి కూడా అవినాశియే. వారు సుప్రీమ్‌ ఆత్మ. సుప్రీమ్‌ అనగా వారు సదా పవిత్రులు అంతేకాక నిర్వికారులు. ఆత్మలైన మీరు కూడా నిర్వికారులుగా ఉండేవారు. ప్రపంచము కూడా నిర్వికారిగా ఉండేది. దానిని సంపూర్ణ నిర్వికారి ప్రపంచమని, నూతన ప్రపంచమని అంటారు. అది మళ్లీ తప్పకుండా పాతదిగా అవుతుంది. కళలు తగ్గిపోతూ వస్తాయి. రెండు కళలు తగ్గిన చంద్ర వంశీయుల రాజ్యముండేది. తర్వాత ప్రపంచము పాతదైతూ పోతుంది. తర్వాత వేరు వేరు ఖండాలు వస్తూ ఉంటాయి. వాటిని బైప్లాట్‌(ఉపకథలు) అని అంటారు. అయితే అన్నీ కలసి(మిక్స్‌అప్‌) పోతాయి. డ్రామా ప్లాను అనుసారము ఏది జరుగుతుందో అది మళ్లీ రిపీట్‌ అవుతుంది. బౌద్ధుల ధర్మస్థాపకుడు వచ్చి ఎంతోమందిని బౌద్ధ ధర్మములోకి తీసుకు వెళ్లాడు. ధర్మమును మార్చేశాడు. హిందువులు తమ ధర్మమును తామే మార్చుకున్నారు. ఎందుకంటే కర్మ భ్రష్టమైనందున ధర్మ భ్రష్టముగా కూడా అయిపోయారు. వామమార్గములోకి వెళ్లిపోయారు. జగన్నాథ మందిరములోకి కూడా భలే వెళ్లి ఉంటారు. కాని విగ్రహాలు ఇలా ఎందుకున్నాయని ఎవ్వరికీ ఆలోచనలు కూడా నడచి ఉండవు. స్వయం వికారులైనందున వారిని కూడా వికారులుగా చూపించారు. అంతేగాని పవిత్రంగా ఉండిన దేవతలు వామమార్గములోకి వెళ్లినప్పుడు ఇలా అయ్యారని వారికి తెలియదు. మందిరములోని చిత్రాలన్నీ ఆ సమయములోనివే. దేవతలనే పేరు చాలా మంచి పేరు. హిందువులనేది హిందూ స్థానము యొక్క పేరు. స్వయాన్ని హిందువులని చెప్పుకున్నారు. చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అందుకే తండ్రి యదా యదాహి ధర్మస్య................ అని చెప్తున్నారు. తండ్రి భారతదేశములో వస్తారు అంతేగాని నేను హిందూ స్థానములో వస్తానని చెప్పరు. ఇది భారతదేశము. హిందూస్థానము గానీ, హిందూ ధర్మము గానీ లేనే లేవు. హిందూస్థానమనే పేరును ముసల్మానులు పెట్టారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. మంచిరీతిగా అర్థము చేసుకోవాలి. ఇది కూడా జ్ఞానమే. పునర్జన్మ తీసుకుంటూ తీసుకుంటూ, వామమార్గములోకి వస్తూ వస్తూ భ్రష్టాచారులుగా అయిపోతారు. దేవతల ముందుకు వెళ్లి మీరు సంపూర్ణ నిర్వికారులని, మేము వికారీ పాపులమని అంటారు. ఇతర ఖండములోని వారెవ్వరూ ఈ విధంగా చెప్పరు. మేము నీచులము, మాలో ఏ గుణాలు లేవని అనడం ఎప్పుడూ విని ఉండరు. సిక్కు మతస్థులు కూడా గ్రంథ్‌ సాహెబ్‌(సిక్కుల మతగ్రంథము) ముందు కూర్చుంటారు. ''ఓ నానక్‌! మీరు నిర్వికారులు మేము వికారులము'' అని ఎప్పుడూ అనరు. నానక్‌ పంక్తి(మార్గము) వారు కంకణము ధరిస్తారు. అది నిర్వికారతకు గుర్తు. అయితే వికారాలు లేకుండా ఉండలేరు. అసత్యపు గుర్తులు ఉంచుకున్నారు. ఎలాగైతే హిందువులు పవిత్రతకు గుర్తుగా జంధ్యమును ధరిస్తారో, అలా వారు కంకణాన్ని ధరిస్తారు. ఈ సమయములో ధర్మమును కూడా గౌరవించరు. ఇప్పుడు భక్తిమార్గము నడుస్తూ ఉంది. దీనిని భక్తి సంప్రదాయమని అంటారు. జ్ఞాన సంప్రదాయము సత్యయుగములో ఉంటుంది. సత్యయుగములోని దేవతలు సంపూర్ణ నిర్వికారులు. కలియుగములో ఒక్కరు కూడా సంపూర్ణ నిర్వికారులుగా ఉండరు. ప్రవృత్తి మార్గము వారిని తండ్రియే స్థాపన చేస్తారు, మిగిలిన గురువులందరూ నివృత్తి మార్గములోనివారు. వారి ఫోర్స్‌ ఎక్కువైపోయింది. తండ్రి చెప్తున్నారు - మీరు ఏదైతే ఇంతవరకు ఎవరి ద్వారా చదువుకున్నారో, వారందరినీ నేను కలవను. నేను వచ్చినప్పుడు అందరినీ నజర్‌ సే నిహాల్‌ చేస్తాను. నజర్‌ సే నిహాల్‌ కీందా స్వామి సద్గురువు......... అనే గాయనము కూడా ఉంది. ఇచ్చటికి మీరు ఎందుకు వచ్చారు? సంపూర్ణ తృప్తి చెందేందుకు. విశ్వాధికారులుగా అయ్యేందుకు వచ్చారు. తండ్రిని స్మృతి చేస్తే తృప్తి చెందుతారు. ఇలా చేసినందున మీరు ఇలా అవుతారని ఎవ్వరూ చెప్పరు. మీరు ఇలా తయారవ్వాలని తండ్రి మాత్రమే చెప్తారు. వీరు లక్ష్మీనారాయణులుగా ఎలా అయ్యారో ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. ఇతడే 84 జన్మలు తీసుకొని పతితమయ్యాడు. మళ్లీ మిమ్ములను ఇలా తయారు చేసేందుకు వచ్చాను.

తండ్రి తమ పరిచయము కూడా ఇస్తారు, దృష్టితో తృప్తి కూడా పరుస్తారు. ఇలా ఎవరి గురించి చెప్తారు? ఒక్క సద్గురువు గురించి మాత్రమే చెప్తారు. ఆ గురువులు అనేకమంది ఉన్నారు. మాతలు, అబలలు, చాలా అమాయకులు. మీరందరూ భోలానాథుని పిల్లలు. శంకరుడు మూడవ కన్ను తెరుస్తూనే వినాశనమైపోయిందని చెప్తారు. ఇది కూడా పాపమే కదా. తండ్రి ఎప్పుడూ ఇటువంటి పని చేయమని ఆదేశమునివ్వరు. వినాశనము ఇతర వస్తువుల ద్వారా అవుతుంది కదా. తండ్రి ఇటువంటి ఆదేశమునివ్వరు. అవన్నీ సైన్సువారు తయారు చేస్తారు. వారికి మా కులమును మేమే నాశనము చేసుకుంటామని కూడా తెలుసు. వారు కూడా డ్రామాలో బంధింపబడి ఉన్నారు, వదిలి పెట్టలేరు. ఎంతో పేరు ప్రతిష్ఠలు తెచ్చుకుంటారు. చంద్రుని పైకి వెళ్తారు. కానీ లాభమేమీ లేదు.

మధురాతి మధురమైన పిల్లలూ! మీరు కూడా తండ్రితో దృష్టి జోడించండి లేక ఓ ఆత్మలారా! మీరు తండ్రిని స్మృతి చేస్తే తృప్తి చెందుతారు. బాబా చెప్తున్నారు - ఎవరైతే నన్ను స్మృతి చేస్తారో నేను కూడా వారిని స్మృతి చేస్తాను. ఎవరైతే నా కొరకు సేవ చేస్తారో, నేను కూడా వారిని స్మృతి చేస్తాను. అందువలన వారికి శక్తి లభిస్తుంది. మీరందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఎవరు నిహాల్‌ అయిపోతారో వారే రాజులుగా అవుతారు. ఇతర సాంగత్యాలను వదిలి ఒక్కరితోనే జోడించమనే గాయనము కూడా ఉంది. ఆ ఒక్కరు నిరాకారులు. ఆత్మ కూడా నిరాకారమే. తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి. మీరు స్వయంగా ఓ పతితపావనా!.............. అని పిలుస్తారు. అయితే ఎవరిని పిలిచారు? బ్రహ్మనా, విష్ణువునా, శంకరుడినా? వీరెవ్వరినీ కాదు. పతితపావనులు వారొక్కరు మాత్రమే. వారు సదా పవిత్రంగానే ఉంటారు. వారిని సర్వశక్తివంతులని అంటారు. ఆ తండ్రి మాత్రమే సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానమును వినిపిస్తారు. వారికి సర్వ శాస్త్రాలు తెలుసు. ఆ సన్యాసులు శాస్త్రాలు మొదలైనవాటిని చదివి బిరులు(టైటిల్స్‌) తీసుకుంటారు. తండ్రికైతే ఇంతకుముందే బిరుదులు ఉన్నాయి. వారు చదివి బిరుదులు తీసుకోరు. మంచిది!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. శమా(దీపము) పై జీవించి ఉండే మరణించే దీపపు పురుగులుగా అవ్వాలి. కేవలం ప్రదక్షిణ చేసేవిగా కాదు. ఈశ్వరీయ చదువును ధారణ చేసేందుకు బుద్ధిని సంపూర్ణ పావనంగా చేసుకోవాలి.

2. ఇతర సాంగత్యములన్నీ తెంచి ఒక్క తండ్రి సాంగత్యములో ఉండాలి. ఒక్కరి స్మృతి ద్వారా స్వయాన్ని నిహాల్‌(పరివర్తన) చేసుకోవాలి.

వరదానము :-

'' ''మన్మనాభవ '' మంత్రము ద్వారా మానసిక బంధనాల నుండి విడుదల అయ్యే నిర్బంధన ట్రస్టీ భవ ''

ఏ బంధనమైనా పంజరమే. పంజరములోని మైనా పక్షి ఇప్పుడు నిర్బంధన ఎగిరే పక్షిగా అయ్యింది. ఒకవేళ ఏదైనా శారీరిక బంధనమున్నా మనసు ఎగిరేపక్షిగా ఉంది. ఎందుకంటే మన్మనాభవగా అయినందున మానసిక బంధనలు తెగిపోతాయి. ప్రవృత్తిని సంభాళించే బంధన కూడా లేదు. నిమిత్తంగా(ట్రస్టీగా) ఉండి సంభాళించేవారు నిర్బంధనులుగా ఉంటారు. గృహస్థులని అనుకుంటే భారము. బరువుగా ఉండేవారు ఎగరలేరు. కానీ ట్రస్టీలుగా ఉండేవారు నిర్బంధనులు. వారు ఎగిరేకళ ద్వారా ఒక సెకండులో మధురమైన ఇంటిని (స్వీట్‌హోమ్‌ను) చేరుకోగలరు.

స్లోగన్‌ :-

'' ఉదాసీనతను మీ దాసిగా చేసుకోండి, దానిని మీ ముఖము పైకి రానివ్వకండి. ''