22-07-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - సోదర - సోదరీ భావమును కూడా వదిలి, పరస్పరం సోదరులుగా భావిస్తే దృష్టి శుద్ధం(పవిత్రము)గా అవుతుంది. ఆత్మ పవిత్రమైనప్పుడే కర్మాతీతంగా అవ్వగలదు ''
ప్రశ్న :-
మీ లోపాలను తొలగించుకునేందుకు ఏ యుక్తిని రచించాలి ?
జవాబు :-
మీ నడవడికల రిజిష్టరును ఉంచుకోండి అందులో ప్రతి రోజూ మీ లెక్కాచారాన్ని వ్రాయండి. రిజిష్టరును పెట్టడం ద్వారా మీ లోపాలు మీకు తెలిసిపోతాయి. తర్వాత సహజంగానే వాటిని తొలగించుకోగలరు. లోపాలను తొలగించుకుంటూ తొలగించుకుంటూ ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ స్మృతిలోకి రాని స్థితి వరకు చేరుకోవాలి. ఎలాంటి పాత వస్తువులోనూ మమకారము ఉండరాదు. మీ లోపల దేనినీ అడగాలనే కోరిక ఉండరాదు.
ఓంశాంతి.
ఒకటి మానవ బుద్ధి, రెండవది ఈశ్వరీయ బుద్ధి, ఆ తర్వాత దైవీ బుద్ధి. మానవ బుద్ధి ఆసురీ బుద్ధిగా ఉంది. ఇది చెడు దృష్టిగా ఉంది కదా. ఒకటి - మంచి(శుద్ధమైన) దృష్టి, రెండవది చెడు దృష్టి. దేవతలు నిర్వికారులు, శుద్ధమైన దృష్టి గలవారు. ఇక్కడ కలియుగ మానవులు వికారీ చెడు దృష్టి గలవారు. వారి ఆలోచనలే వికారిగా ఉంటాయి. చెడు(క్రిమినల్) దృష్టి ఉన్న మానవులు రావణుని జైలులో పడిి ఉంటారు. రావణుని రాజ్యములో అందరూ చెడు దృష్టి గలవారిగా ఉన్నారు. ఒక్కరికి కూడా మంచి దృష్టి లేదు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారు. ఇప్పుడు బాబా మీ చెడు దృష్టిని పరివర్తన చేసి మంచి(సివిల్) దృష్టి గలవారిగా తయారు చేస్తున్నారు. చెడు దృష్టి కూడా అనేక విధాలుగా ఉంది. కొందరిలో కొద్దిగా, కొందరిలో మరోలా ఉంది. దృష్టి మంచిగా అయినప్పుడు కర్మాతీత స్థితి ఏర్పడ్తుంది. తర్వాత మళ్లీ సోదర - సోదర దృష్టి తయారవుతుంది. ఆత్మ ఆత్మను చూస్తుంది, శరీరాన్ని చూడదు. కనుక చెడు దృష్టి ఎలా ఉంటుంది. అందువలన స్వయంలో సోదర-సోదరీలమనే భావమును కూడా తొలగిస్తూ పోండి అని తండ్రి చెప్తున్నారు. అందరూ సోదరులమే(భాయీ-భాయీ) అని భావించండి. ఇది కూడా చాలా నిగూఢమైన రహస్యము. ఇది ఎవరి బుద్ధిలోకి రాజాలదు. శుద్ధమైన దృష్టి అంటే ఏమిటో ఎవరి బుద్ధిలోకి రాజాలదు. ఒకవేళ వస్తే ఉన్నత పదవి పొందుతారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. శరీరమును మర్చిపోవాలని తండ్రి చెప్తున్నారు. తండ్రి స్మృతిలోనే ఈ శరీరాన్ని వదిలేయాలి. నేను ఆత్మను, తండ్రి వద్దకు వెళ్తున్నాను. దేహాభిమానమును వదిలి పవిత్రంగా తయారు చేసే తండ్రి స్మృతిలోనే శరీరాన్ని వదలాలి. చెడు దృష్టి ఉంటే మనస్సు లోలోపల తప్పకుండా తింటూ ఉంటుంది. ఈ గమ్యము చాలా గొప్పది. మంచి మంచి పిల్లలలో కూడా తప్పకుండా ఏవో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మాయ ఉంది కదా. ఎవ్వరూ ఇంకా కర్మాతీతంగా అవ్వలేదు. కర్మాతీత స్థితిని చివర్లో పొందుతారు. అప్పుడు మంచి దృష్టి ఉండగలదు. తర్వాత ఆత్మిక సోదర ప్రేమ ఉంటుంది. ఆత్మిక సోదర ప్రేమ చాలా బాగుంటుంది, తర్వాత చెడు దృష్టి ఉండదు. అప్పుడే ఉన్నత పదవిని పొందగలరు. లక్ష్యమును కూడా బాబా పూర్తిగా తెలుపుతున్నారు. నాలో ఈ ఈ లోపాలున్నాయని పిల్లలు తెలుసుకుంటారు. రిజిష్టరు పెట్టినప్పుడు లోపాలు కూడా తెలుస్తాయి. రిజిష్టరు పెట్టకున్నా కొంతమంది బాగుపడవచ్చు. కానీ కచ్ఛాగా ఉన్నవారు తప్పకుండా రిజిష్టరు పెట్టాలి. చాలామంది కచ్ఛాగా ఉన్నారు. కొందరికి వ్రాయడం కూడా రాదు. ఇతరులెవ్వరి స్మృతి రాని విధంగా మీ స్థితి ఉండాలి. మనము ఆత్మలు శరీరము లేకుండా వచ్చాము, ఇప్పుడు అశరీరులుగా అయ్యి వెళ్లాలి. దీని గురించి ఒక కథ కూడా ఉంది. ఒక కర్రను(లాఠీ) కూడా తీసుకోవద్దని అందులో చెప్తారు, ఎందుకంటే అది కూడా చివర్లో గుర్తు వస్తుంది. ఏ వస్తువు పైనా మమకారము ఉంచుకోరాదు. చాలామందికి పాత వస్తువుల పై మమకారము ఉంటుంది. ఒక్క తండ్రి తప్ప మరేదీ గుర్తు రాకూడదు. ఇది ఎంత ఉన్నతమైన గమ్యము! పనికిరాని పెంకు మ్కులెక్కడ, శివబాబా స్మృతి ఎక్కడ! ఏదైనా కావాలని అడిగే కోరిక కూడా ఉండరాదు. ప్రతి ఒక్కరు కనీసము 6 గంటలు తప్పకుండా సర్వీసు చేయాలి. ప్రభుత్వ సర్వీసు 8 గంటలు ఉంటుంది. కానీ పాండవ ప్రభుత్వ సర్వీసు కనీసము 5 లేక 6 గంటలైనా తప్పకుండా చేయండి. వికారి మానవులు బాబాను ఎప్పుడూ స్మృతి చేయలేరు. సత్యయుగము నిర్వికారి ప్రపంచంగా ఉంటుంది. సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు,.............. అని దేవతలను మహిమ చేస్తారు. పిల్లలైన మీ అవస్థ ఎంతో అతీతంగా(ఉపరాంగా) ఉండాలి. ఎలాంటి ఛీ-ఛీ (అశుద్ధ) వస్తువు పైన మమత్వము ఉండరాదు. శరీరము పై కూడా మమత్వము లేని యోగులుగా అవ్వాలి. ఇటువంటి సత్య-సత్యమైన యోగులుగా అయినప్పుడు వారు తాజాగా ఉంటారు. మీరు ఎంత సతోప్రధానంగా అవుతూ ఉంటారో అంత ఖుషీ పాదరస మీటరు పైకి ఎక్కుతూ ఉంటుంది. 5 వేల సంవత్సరాల క్రితము కూడా ఇలాంటి ఖుషీ ఉండేది. సత్యయుగములో కూడా అదే సంతోషము ఉంటుంది. ఇక్కడ కూడా ఖుషీగా ఉంటారు మళ్లీ ఇదే సంతోషాన్ని మీ జతలో తీసుకెళ్తారు. అంతమతే సో గతి అని అంటారు కదా. ఇప్పటి అంత(చివరి) మతమే తర్వాత సత్యయుగములో గతిగా ఉంటుంది. దీనిని బాగా విచారసాగర మథనము చేయాలి.
తండ్రి అయితే దు:ఖహర్త-సుఖకర్త. మేము ఆ తండ్రి పిల్లలమని మీరు అంటారు. కనుక మీరు ఎవ్వరికీ దు:ఖము ఇవ్వరాదు. అందరికీి సుఖమునిచ్చే మార్గమును తెలపాలి. ఒకవేళ సుఖమును ఇవ్వకపోతే తప్పకుండా దు:ఖమును ఇస్తారు. ఇది పురుషోత్తమ సంగమ యుగము. ఇప్పుడు సతోప్రధానంగా అయ్యేందుకు మీరు పురుషార్థము చేస్తారు. పురుషార్థులు కూడా నంబరువారుగా ఉంటారు. సర్వీసు బాగా చేసిన పిల్లలను వీరు మంచి యోగి పిల్లలని తండ్రి వారిని మహిమ చేస్తారు. సర్వీసు చేసే పిల్లలు నిర్వికారి జీవితాన్ని గడుపుతారు. ఎవరికైతే ఏ మాత్రము అలాంటి ఇలాంటి(వికారి) ఆలోచనలు రావో, చివరిలో వారే కర్మాతీత స్థితిని పొందుతాారు. బ్రాహ్మణులైన మీరే మంచి(పవిత్ర) దృష్టి గలవారిగా అవుతున్నారు. మనుష్యులను ఎప్పటికీ దేవతలని అనజాలరు. ఎవరైతే చెడు దృష్టి గలవారుగా ఉంటారో వారు తప్పకుండా పాపము చేస్తారు. సత్యయుగీ ప్రపంచము పవిత్రమైన ప్రపంచము. ఇది పతిత ప్రపంచము. దీని అర్థమును కూడా తెలుసుకోరు. ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడు అర్థం చేసుకుంటారు. జ్ఞానమైతే చాలా బాగుంది, తీరిక ఉన్నప్పుడు వస్తామని అంటారు. అలాంటివారు ఎప్పటికీ రారని బాబా అర్థం చేసుకుంటారు. ఇది తండ్రికి అవమానము జరిగినట్లవుతుంది. మానవుల నుండి దేవతలుగా అవుతారని అంటే వెంటనే చేయాలి కదా. రేపటికి వదిలేస్తే మాయ ముక్కు పట్టుకొని మురికి కాలువలో పడేస్తుంది. రేపు రేపు అని చెప్తూ మృత్యువు తినేస్తుంది. శుభ కార్యంలో ఆలస్యము చేయరాదు. మృత్యువు తల పైనే నిల్చొని ఉంది. అకస్మాత్తుగా ఎంతమంది మానవులు మరణిస్తున్నారు! ఇప్పుడు బాంబులు పడితే ఎంతమంది మానవులు మరణిస్తారు. భూకంపము జరుగుతుంది కదా. భూకంపము వస్తుందని ముందుగా తెలియదు. డ్రామానుసారంగా ప్రకృతి ప్రకోపాలు కూడా జరగాలి. దానిని గురించి ఎవ్వరూ తెలుసుకోలేరు. చాలా నష్టము జరుగుతుంది. తర్వాత ప్రభుత్వము రైలు చార్జి మొదలైనవి కూడా పెంచేస్తుంది. మానవులేమో తప్పకుండా ప్రయాణము చేయవలసి వస్తుంది కదా. మానవులు పెంచిన చార్జీలు ఇవ్వగలిగే విధంగా ఆదాయము ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ధాన్యము ధర ఎంతగా పెరిగిపోయింది! మీరిప్పుడు మంచి(పవిత్ర) దృష్టి గలవారిని పవిత్ర ఆత్మలని అంటారు. ఇప్పుడు ఈ ప్రపంచమే చెడు దృష్టిగలదిగా ఉంది. మీరిప్పుడు మంచి దృష్టి(పవిత్ర) గలవారిగా అవుతారు. ఉన్నత పదవిని పొందుకోవాలంటే శ్రమ పడాలి. పిన్నమ్మగారిల్లు కాదు(సులభం కాదు). ఎవరైతే చాలా మంచిదృష్టి గలవారిగా ఉంటారో వారే ఉన్నత పదవిని పొందుతారు. నరుల నుండి నారాయణునిగా అయ్యేందుకు మీరిక్కడకు వచ్చారు. కానీ ఎవరైతే మంచి దృష్టి గలవారిగా అవ్వకపోతే, జ్ఞానము తీసుకోలేకపోతే, వారు పదవిని కూడా తక్కువదే పొందుతారు. ఈ సమయములో మానవులందరి దృష్టి చెడుగా(క్రిమినల్) ఉంది. సత్యయుగములో మంచి(సివిల్) దృష్టి ఉంటుంది.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలారా! మీరు స్వర్గానికి అధిపతులైన దేవీ దేవతలుగా అవ్వాలనుకుంటే చాలా చాలా మంచి దృష్టి గలవారిగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. అప్పుడు 100 శాతము ఆత్మ-అభిమానిగా అవ్వగలరు. ఎవరికైనా దీని అర్థమును వివరించాలి. సత్యయుగములో పాపమనే మాటే ఉండదు. వారు సర్వగుణ సంపన్నులుగా, సంపూర్ణ సివిల్ దృష్టి గలవారిగా ఉంటారు. చంద్ర వంశములో కూడా రెండు కళలు తగ్గిపోతాయి. చంద్రుడు కూడా చివర్లో కేవలం ఒక గీతగా ఉండిపోతాడు. పూరి లేకుండా(నిల్) అయిపోడు. ప్రాయ: లోపము అయినాడని అంటారు. మేఘాలలో కనిపించడు. అలా మీ జ్యోతి కూడా పూర్తిగా ఆరిపోదు. ఎంతో కొంత ప్రకాశము ఉంటుంది అని తండ్రి చెప్తున్నారు. అతిగొప్ప (సుప్రీం) బ్యాటరీతో మీరు శక్తిని తీసుకుంటారు. స్వయంగా వారే వచ్చి మీరు ఎలా యోగము చేయాలో నేర్పిస్తారు. టీచరు చదివిస్తూ ఉంటే బుద్ధి యోగము టీచరుతో ఉంటుంది కదా. టీచరు ఇచ్చే మతము(సలహా)ను చదువుతారు. మనము కూడా చదువుకొని టీచరు లేక న్యాయవాదిగా అవుతామని భావిస్తారు. ఇందులో కృప లేక ఆశీర్వాదాలు మొదలైన వాటి మాటే ఉండదు. తల వంచి నమస్కరించే అవసరము కూడా లేదు. కొందరు హరి ఓం అనో లేక రాం-రాం అని అంటూ ఉంటారు, వారికి బదులు ఇవ్వవలసి ఉంటుంది. ఇది కూడా గౌరవాన్ని ఇవ్వడమే. అహంకారమును చూపించరాదు. మనము తండ్రి ఒక్కరినే స్మృతి చేయాలని మీకు తెలుసు. ఎవరైనా భక్తిని వదిలేసినా హంగామా అవుతుంది. భక్తి వదిలేస్తే వారిని నాస్తికులుగా భావిస్తారు. వారు చెప్పే నాస్తికులనే పదానికి, మీరు చెప్పే నాస్తికులనే పదానికి ఎంతో తేడా ఉంది. వారు తండ్రిని తెలుసుకోలేదు కావున నాస్తికులని, అనాథలని మీరు అంటారు. అందువలన అందరూ పోట్లాడుకుంటూ, జగడాలాడుకుంటూ ఉంటారు. ప్రతి ఇంటిలో కొట్లాటలు, అశాంతి ఉంది. క్రోధానికి చిహ్నము అశాంతి. అక్కడ ఎంత అపారమైన శాంతి ఉంటుంది! భక్తిలో చాలా శాంతి లభిస్తుందని మనుష్యులు అంటారు. కానీ అది అల్పకాలికంగా ఉంటుంది. శాంతి సదా కాలానికి కావాలి కదా. మీరు సనాథుల నుండి అనాథులుగా తయారైనప్పుడు శాంతి నుండి మళ్లీ అశాంతిలోకి వస్తారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖ వారసత్వమును ఇస్తారు. హద్దు తండ్రి ద్వారా హద్దు సుఖమునిచ్చే వారసత్వము లభిస్తుంది. వాస్తవంగా అది దు:ఖపూరితమైనది. కామ ఖడ్గము ఇచ్చే వారసత్వము, అందులో దు:ఖమే దు:ఖముంది. అందువలన మీరు ఆది-మధ్య-అంత్యము దు:ఖమును పొందుతారని తండ్రి చెప్తున్నారు.
పతితపావనుడైన నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. దీనిని సహజమైన స్మృతి, సహజమైన సృష్టిచక్ర జ్ఞానమని అంటారు. మీరు స్వయాన్ని ఆదిసనాతన దేవీదేవతా ధర్మము వారిగా తెలుసుకుంటే తప్పకుండా స్వర్గములోకిి వస్తారు. స్వర్గములో అందరూ మంచి దృష్టి గలవారిగా ఉండేవారు. దేహాభిమానమును చెడు దృష్టి అని అంటారు. మంచి దృష్టిలో ఏ వికారమూ ఉండదు. తండ్రి ఎంత సహజం చేసి అర్థం చేయిస్తారు! కానీ పిల్లలకు అది కూడా గుర్తుండదు. ఎందుకంటే దృష్టి క్రిమినల్గా ఉంది. కావున ఛీ-ఛీ ప్రపంచమే వారికి గుర్తుకొస్తుంది. ఈ ప్రపంచాన్ని మర్చిపొమ్మని తండ్రి చెప్తున్నారు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. శరీరము పై ఏ మాత్రము మమత్వము లేని యోగులుగా అవ్వాలి. ఎలాంటి ఛీ-ఛీ (అశుద్ధ) వస్తువు పై ఆసక్తి ఉండరాదు. అలాంటి ఉపరామ స్థితి ఉండాలి. ఖుషీ పాదరస మట్టము పైకి ఎక్కి ఉండాలి.
2. మృత్యువు తల పై నిల్చొని ఉంది. అందువలన శుభ కార్యములో ఆలస్యము చేయరాదు. రేపటి పై వదలరాదు.
వరదానము :-
'' జబ్బు కాన్షస్కు బదులు ఖుషీ ఖుషీగా లెక్కాచారాన్ని చుక్త చేసుకునే సోల్కాన్షస్ (ఆత్మాభిమాని) భవ ''
తనువులైతే అందరివీ పురాతనమైనవే. ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న పెద్ద జబ్బు ఉండనే ఉంది. కానీ శారీరిక ప్రభావము మనసు పైకి పడ్తే డబల్ వ్యాధిగ్రస్థులై జబ్బు కాన్షస్గా అవుతారు. అందువలన మనసులో ఎప్పుడూ జబ్బును గురించిన ఆలోచనలు, సంకల్పాలు రాకూడదు. అప్పుడు సోల్కాన్షస్ అని అంటారు. జబ్బును గురించి ఎప్పుడూ భయపడకండి. కొద్దిగా మందులనే ఫలాలను తిని, జబ్బుకు వీడ్కోలునివ్వండి. సంతోషంగా(ఖుషీ ఖుషీగా) లెక్కాచారము సమాప్తము చేయండి.
స్లోగన్ :-
'' ప్రతి గుణమును, ప్రతి శక్తిని అనుభవం చేయడమనగా అనుభవీముర్తిగా అవ్వడం ''