18-02-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - '' స్వదర్శన చక్రధారీ భవ '' మీరు లైట్‌హౌస్‌గా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇందులో పొరపాటు చేయకండి.''

ప్రశ్న :-

మీరు అందరికన్నా అద్భుతమైన విద్యార్థులు - ఎలా ?

జవాబు :-

మీరు గృహస్థ వ్యవహారములో ఉన్నారు. శరీర నిర్వహణార్థము 8 గంటలు కర్మ కూడా చేస్తారు. జత జతలో భవిష్య 21 జన్మల కొరకు కూడా 8 గంటలు తండ్రి సమానంగా తయారుచేసే సేవ చేస్తారు. అన్నీ చేస్తూ తండ్రి మరియు ఇంటిని స్మృతి చేస్తారు. ఇదే మీ అద్భుతమైన విద్యార్థి జీవితము. జ్ఞానము చాలా సహజము. కేవలం పావనంగా అయ్యేందుకు కష్టపడ్తారు.

ఓంశాంతి.

తండ్రి పిల్లలను నంబరువారు పురుషార్థానుసారము అడుగుతారు. మూలవతనము కూడా తప్పకుండా నంబరువారుగా గుర్తొస్తూ ఉండవచ్చు. పిల్లలైన మీకు తప్పకుండా ఇది కూడా గుర్తొస్తూ ఉండవచ్చు - మేము మొదట శాంతిధామములో ఉండేవారము తర్వాత సుఖధామములోకి వస్తాము. ఈ విధంగా లోలోపల తప్పకుండా భావిస్తూ ఉండవచ్చు. మూలవతనము నుండి ప్రారంభించి ఈ సృష్టిచక్రము ఏ విధంగా తిరుగుతుందో, అది కూడా బుద్ధిలో ఉంది. ఈ సమయములో మనము బ్రాహ్మణులము. తర్వాత దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అవుతాము. ఈ విధంగా ఈ చక్రము బుద్ధిలో తిరగాలి కదా! పిల్లల బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉంది. తండ్రి అర్థం చేయించారు - ఇంతకుముందు మీకు తెలియదు. ఇప్పుడు మీకు మాత్రమే తెలుసు. రోజురోజుకు మీరు(బ్రాహ్మణులు) వృద్ధి అవుతూ ఉంటారు. చాలామందికి నేర్పిస్తూ ఉంటారు. తప్పకుండా మీరే ముందు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. ఇక్కడ మీరు కూర్చుని ఉన్నారు. బుద్ధి ద్వారా వారు మన తండ్రి అని మీకు తెలుసు. వారే నేర్పించే సుప్రీమ్‌ టీచర్‌. మనము 84 జన్మల చక్రములో ఎలా తిరుగుతామో వారే మనకు అర్థం చేయించారు. బుద్ధిలో తప్పకుండా స్మృతి ఉంటుంది కదా! దీనిని బుద్ధిలో ప్రతి క్షణము గుర్తు చేసుకోవాలి. ఈ పాఠము అంత పెద్దదేమీ కాదు. సెకండులోని పాఠమే. మనము ఎక్కడ నివసించేవారము. మళ్లీ ఇక్కడకు పాత్రనభినయించేందుకు ఎలా వస్తామో బుద్ధిలో ఉంటుంది. ఇది 84 జన్మల చక్రము, సత్యయుగములో ఇన్ని జన్మలు, త్రేతా యుగములో ఇన్ని జన్మలు - ఈ చక్రమునైతే గుర్తు చేసుకుంటారు కదా! మీకు ఏ హోదా(పొజిషన్‌) లభించిందో, ఏ పాత్రనైతే అభినయించారో అది కూడా తప్పకుండా బుద్ధిలో గుర్తు ఉంటుంది. మేము ఈ డబల్‌ కిరీటధారులుగా ఉండేవారము. తర్వాత మళ్లీ ఒకే కిరీటము గలవారిగా అయ్యాము. ఆ తర్వాత మళ్లీ పూర్తి రాజ్యమంతా వెళ్లిపోయింది. తమోప్రధానంగా అయిపోయాము. ఈ చక్రమైతే తిరగాలి కదా! అందుకే స్వదర్శన చక్రధారులనే పేరు ఉంచారు. ఆత్మకు జ్ఞానము లభించింది. ఆత్మకు దర్శనమయ్యింది. మనము ఇలా ఇలా చక్రము తిరుగుతామని ఆత్మకు తెలుసు. ఇప్పుడు మళ్లీ వాపస్‌ ఇంటికి వెళ్లాలి. నన్ను స్మృతి చేసినట్లయితే ఇంటికి చేరుకుంటారని తండ్రి చెప్పారు. ఈ సమయములో మీరు ఆ అవస్థలో కూర్చుండిపోతారని కాదు. బయటి విషయాలు ఎక్కువగా బుద్ధిలోకిి వచ్చేస్తాయి. ఎవరికి ఏమి గుర్తొస్తున్నాయో, ఎవరికి ఏమి గుర్తొస్తున్నాయో! ఇక్కడ ఇతర అన్ని విషయాలను వదిలి ఒక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. శ్రీమతము లభిస్తుంది. దాని అనుసారము నడచుకోవాలి. స్వదర్శన చక్రధారులుగా అయ్యి మీరు చివరి వరకు పురుషార్థము చేయాలి. మొదట ఏమీ గుర్తుండేది కాదు. ఇప్పుడు తండ్రి తెలుపుతున్నారు. వారిని స్మృతి చేయడం ద్వారా సర్వస్వమూ అందులోనే వచ్చేస్తాయి. రచయిత-రచనల ఆది-మధ్య-అంతముల రహస్యమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఇక్కడ పాఠము లభిస్తుంది. వారినైతే ఇంటిలో కూడా గుర్తు చేసుకోగలరు. ఇది బుద్ధి ద్వారా అర్థము చేసుకోవలసిన విషయము. మీరు అద్భుతమైన విద్యార్థులు. భలే 8 గంటలు విశ్రాంతి కూడా తీసుకోండి. 8 గంటలు శరీర నిర్వహణార్థము పనులు కూడా భలే చేయండి అని తండ్రి తెలియజేశారు. ఆ వ్యాపారాలు మొదలైనవి కూడా చేయాలి. జతలో తమ సమానంగా తయారు చేయమని తండ్రి ఏ వ్యాపారమునైతే ఇచ్చారో, ఇది కూడా శరీర నిర్వహణయే కదా! అది అల్పకాలము కొరకు, ఇది 21 జన్మల శరీర నిర్వహణ కొరకు. మీరు ఏ పాత్రను అభినయిస్తారో, అందులో దీనికి కూడా చాలా గొప్ప మహత్వముంది. ఎవరు ఎంతగా శ్రమ చేస్తారో, తర్వాత భక్తిలో వారికి అంత పూజ జరుగుతుంది. ఇదంతా పిల్లలైన మీరే ధారణ చేయాలి.

పిల్లలైన మీరు పాత్రధారులు. బాబా అయితే కేవలం జ్ఞానమునిచ్చే పాత్రను అభినయిస్తారు. ఇక శరీర నిర్వహణార్థము కొరకు పురుషార్థము మీరు చేస్తారు. తండ్రి అయితే చేయరు కదా. ప్రపంచ చరిత్ర-భౌగోళాలు ఏ విధంగా పునరావృతమవుతాయో, చక్రము ఏ విధంగా తిరుగుతుందో పిల్లలకు అర్థం చేయించేందుకే తండ్రి వస్తారు. ఈ విషయాలు అర్థము చేయించేందుకే వస్తారు. యుక్తిగా అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలూ! పొరపాట్లు చేయకండి అని తండ్రి తెలిపిస్తారు. స్వదర్శన చక్రధారి లేక లైట్‌హౌస్‌గా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. శరీరము లేకుండా ఆత్మ పాత్రను అభినయించలేదని తెలుసు. మనుష్యులకు ఏమీ తెలియదు. భలే మీ వద్దకు వస్తారు. బాగుంది- బాగుంది అని అంటారు. కాని స్వదర్శన చక్రధారులుగా అవ్వలేరు. ఇందులో చాలా అభ్యాసము చేయవలసి వస్తుంది. అప్పుడు ఎక్కడికి వెళ్లినా జ్ఞానసాగరుల వలె అవుతారు. ఉదాహరణకు విద్యార్థి చదివి టీచరుగా అవుతారు కదా. ఆ తర్వాత కాలేజీలో చదివిస్తారు. వ్యాపారాలలో నిమగ్నమవుతారు. మీ వ్యాపారమే టీచరుగా అవ్వడం. అందరినీ స్వదర్శన చక్రధారులుగా తయారు చేయండి. ద్వికిరీటధారులైన రాజులుగా, ఏకకిరీటధారులైన రాజులుగా ఎలా అవుతారో పిల్లలు చిత్రమును తయారు చేశారు. ఇది బాగానే ఉంది అయితే ఎప్పటి నుండి ఎప్పటివరకు డబల్‌ కిరీటధారులుగా ఉండేవారు? ఎప్పటి నుండి ఎప్పటివరకు సింగల్‌ కిరీటధారులుగా అయ్యారు? మళ్లీ ఏ విధంగా ఎప్పుడు రాజ్యము దోచుకోబడింది? ఆ తేదీలన్నీ వ్రాయాలి. ఇది అనంతమైన పెద్ద డ్రామా. మనము మళ్లీ దేవతలుగా అవుతామనేది నిశ్చితము. ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నాము. బ్రాహ్మణులే సంగమ యుగానికి చెందినవారు. మీరు తెలిపినంత వరకు ఈ విషయాలు ఇతరులకు తెలియదు. ఇది మీ అలౌకిక జన్మ. లౌకిక మరియు పారలౌకిక తండ్రుల నుండి వారసత్వము లభిస్తుంది. అలౌకికము నుండి వారసత్వము లభించదు. ఇతని ద్వారా తండ్రి మీకు వారసత్వమును ఇస్తారు. ఓ ప్రభూ! అని పాడ్తారు కూడా. ఓ ప్రజాపిత బ్రహ్మ! అని ఎప్పుడూ అనరు. లౌకిక మరియు పారలౌకిక తండ్రులను స్మృతి చేస్తారు. ఈ విషయాలు ఇంకెవ్వరికీ తెలియవు. మీకు మాత్రమే తెలుసు. పారలౌకిక తండ్రిది అవినాశి ఆస్తి. లౌకిక తండ్రిది వినాశీ వారసత్వము. ఎవరైనా రాజు కొడుకు ఉన్నాడునుకోండి, 5 కోట్ల వారసత్వము లభిస్తుందనుకోండి అతడు అనంతమైన తండ్రి ఆస్తిని తన ముందు చూస్తే - దానితో పోలిస్తే ఇది అవినాశి ఆస్తి, అది అంతమైపోయే వారసత్వము అని అంటాడు. ఈనాటి కోటీశ్వరులను మాయ ఆవహించి ఉంది. ఇక్కడకు వారు రారు. తండ్రి పేదలపెన్నిధి. భారతదేశము చాలా పేదదేశము. భారతదేశములో చాలామంది మనుష్యులు కూడా పేదవారిగా ఉన్నారు. ఇప్పుడు మీరు అనేకమందికి కళ్యాణము చేయు పురుషార్థము చేస్తున్నారు. తరచుగా (సాధారణంగా) రోగులకు వైరాగ్యము వస్తుంది. ఎందుకు జీవించాలి? అని అనుకుంటారు. ముక్తిధామానికి వెళ్లే మార్గము లభించాలని కోరుకుంటారు. దు:ఖము నుండి ముక్తులుగా అయ్యేందుకు ముక్తిని కోరుకుంటారు. సత్యయుగములో అలా కోరరు. ఎందుకంటే అక్కడ దు:ఖము లేదు. ఈ విషయాలను ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బాబా పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. ఎవరైతే సూర్యవంశీ చంద్రవంశీ దేవతలుగా అయ్యేవారుగా ఉంటారో వారే నంబరువారు పురుషార్థానుసారము వచ్చి జ్ఞానము తీసుకుంటారు. ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు మీరు బేహద్‌ తండ్రిని వదిలి ఎక్కడికీ వెళ్లరు. ఎవరికైతే తండ్రి పై ప్రేమ ఉందో వారు - జ్ఞానము చాలా సహజంగా అర్థము చేసుకోగలరు. కాని పావనంగా అవ్వడంలో మాయ విఘ్నాలు వేస్తుంది. ఏ విషయములోనైనా పొరపాటు చేశారంటే ఆ పొరపాటు వల్లనే ఓడిపోతారు. బాక్సింగ్‌(మల్లయుద్ధము)తో దీనిని పోల్చుట సరిగ్గా ఉంటుంది. బాక్సింగ్‌లో ఒకరు మరొకరి పై విజయము పొందుతారు. మాయ మిమ్ములను ఓడిస్తుందని పిల్లలకు తెలుసు.

మధురమైన పిల్లలూ! స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి చెప్తున్నారు. ఇందులో శ్రమ ఉందని తండ్రి స్వయంగా చెప్తున్నారు. తండ్రి చాలా సహజమైన యుక్తిని తెలియజేస్తున్నారు. మనము ఆత్మలము. ఒక శరీరము వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటాము. పాత్రను అభినయిస్తాము. మేము బేహద్‌ తండ్రి పిల్లలము అని బాగా పక్కా చేసుకోవాలి. మాయ వీరి బుద్ధియోగమును త్రెంచి వేస్తూ ఉందని బాబా ఫీల్‌ చేస్తారు. నంబరువారుగా అయితే ఉండనే ఉన్నారు. ఈ లెక్కతోనే రాజధాని తయారవుతుంది. అందరూ ఏకరసంగా ఉన్నట్లయితే రాజ్యము స్థాపన అవ్వదు. రాజా, రాణి, ప్రజా, షాహుకార్లు అందరూ తయారవ్వాలి. ఈ విషయాలు మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మనము మన రాజధానిని స్థాపన చేస్తున్నాము. ఈ విషయాలు మీలో కూడా అన్యనమైన పిల్లలకే గుర్తుంటాయి. ఈ విషయాలను ఎప్పుడూ మర్చిపోరాదు కాని తాము మర్చిపోతున్నామని పిల్లలకు తెలుసు. అలా కానిచో మేము విశ్వానికి యజమానులుగా తయారవుతున్నామని చాలా సంతోషముండాలి. కేవలం చెప్పడం ద్వారా మాత్రమే అవ్వరు, పురుషార్థము ద్వారానేే అలా తయారవుతారు. బాబా వస్తూనే పిల్లలూ! సావధాన్‌, స్వదర్శన చక్రధారులై కూర్చుని ఉన్నారా? అని అడుగుతారు. ఇతనిలో ప్రవేశించే తండ్రి కూడా స్వదర్శన చక్రధారియే కదా. మనుష్యులు విష్ణువును స్వదర్శన చక్రధారి అని భావిస్తారు. విష్ణువు అనగా లక్ష్మీనారాయణులని వారికి తెలియదు. లక్ష్మినారాయణుల పదవిని పొందే జ్ఞానాన్ని వీరికి ఎవరు ఇచ్చారు? ఏ జ్ఞానము ద్వారా వీరు ఈ లక్ష్మినారాయణుల పదవిని పొందారు? స్వదర్శన చక్రము ద్వారా సంహరించినట్లు చూపిస్తారు. ఈ చిత్రాలను తయారు చేసినవారి పై మీకు చాలా నవ్వు వస్తుంది. విష్ణువు సంయుక్త గృహస్థ ఆశ్రమానికి గుర్తు. ఈ చిత్రము శోభిస్తుందే కాని ఇదేమీ సరైన చిత్రము కాదు. మొదట మీకు కూడా తెలియదు. 4 భుజాలు గలవాడు ఇక్కడకు ఎక్కడ నుండి వస్తాడు? ఈ విషయాలన్నీ మీలో కూడా నంబరువారుగా తెలుసు. మొత్తం ఆధారమంతా మీ పురుషార్థము పైనే ఉందని తండ్రి అంటారు. తండ్రి స్మృతి ద్వారానే పాపము తెగిపోతుంది. అన్నిటికంటే ఎక్కువగా ఈ పురుషార్థమే నడవాలి. తండ్రి సమయమిచ్చారు. మీరు గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి. అలా కానిచో పిల్లలను మొదలైనవారిని ఎవరు సంభాళన చేస్తారు? అవన్నీ చేస్తూ కూడా అభ్యాసము చేయాలి. ఇంతకు మించి ఇంకే విషయము లేదు. అకాసురుడు, బకాసురుడు............ మొదలైన వారిని స్వదర్శన చక్రముతో కృష్ణుడు సంహరించినట్లు చూపించారు. చక్రము మొదలైన వాటి విషయాలే లేవని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఎంత వ్యతాసముంది. ఈ విషయాలను తండ్రియే అర్థం చేయిస్తారు. మనుష్యులు మనుష్యులకు అర్థం చేయించలేరు. మనుష్యులు మనుష్యులకు సద్గతిని కలుగజేయలేరు. రచయిత - రచనల ఆది-మధ్య-అంత్యముల రహస్యాన్ని ఎవ్వరూ అర్థం చేయించలేరు. స్వదర్శన చక్రము అర్థమేమిటి? అది కూడా ఇప్పుడు తండ్రియే అర్థం చేయించారు. శాస్త్రాలలో కథలను ఎలా తయారు చేశారంటే ఇక అడగనే అడగకండి. కృష్ణుని కూడా హింసకునిగా చేసేశారు. ఇందులో ఏకాంతముగా విచార సాగర మథనం చేయవలసి ఉంటుంది. రాత్రి పహరా చేయు పిల్లలకు చాలా సమయము లభిస్తుంది. వారు చాలా స్మృతి చేయవచ్చు. తండ్రిని స్మృతి చేస్తూ స్వదర్శన చక్రమును కూడా తిప్పుతూ ఉండండి. స్మృతి చేసినట్లయితే ఆ ఖుషీలో నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఎవరికి ధనము లభిస్తుందో వారు చాలా సంతోషంగా ఉంటారు. ఎప్పుడూ తూగరు. మనము సదా ఆరోగ్యవంతులుగా, సదా సంపన్నులుగా అవుతున్నామని మీకు తెలుసు. కనుక ఇందులో మీరు బాగా నిమగ్నమైపోవాలి. డ్రామానుసారము జరిగేవన్నీ మంచివే అని కూడా ఇప్పుడు తండ్రికి తెలుసు. అయినా పురుషార్థము చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి శిక్షణనిస్తారు. జ్ఞానము, యోగము లేనివారు కూడా చాలామంది ఉన్నారు. బుద్ధివంతులు, విద్వాంసులు మొదలైనవారు వచ్చినట్లయితే వారితో మాట్లాడలేరు. తమ వద్ద బాగా అర్థం చేయించేవారు ఎవరెవరు ఉన్నారో సర్వీసెబుల్‌(సేవాధారి) పిల్లలకు తెలుసు. బుద్ధివంతులు బాగా చదువుకున్నవారు మంచి వ్యక్తులుగా ఉండి వారికి అర్థము చేయించేవారు ఒకవేళ వివేకహీనులుగా ఉన్నట్లయితే తండ్రి గమనించి వారిలో స్వయంగా ప్రవేశించి వారిని పైకెత్తగలరు(అనగా వారికి అర్థము చేయించే వివేకమును ఇస్తారు). నిజాయితీ గల పిల్లలు - మాలో ఇంత జ్ఞానము లేదు. తండ్రే మాలో కూర్చొని వీరికి అర్థం చేయించారని చెప్తారు. కొందరికైతే అహంకారము వచ్చేస్తుంది. తండ్రి రావడం, సహయోగము చేయడం కూడా నాటకములో పాత్రగా నిశ్చితమై ఉంది. నాటకము చాలా విచిత్రమైనది. ఇవి అర్థము చేసుకునేందుకు చాలా విశాలమైన బుద్ధి అవసరము.

ఎక్కడైతే అందరూ అత్యంత సుందరంగా ఉంటారో, ఆ రాజధానిని మేము స్థాపన చేస్తున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అక్కడ నల్లగా ఉండేవారు(కళావిహీనులు, వికారాలు గలవారు) ఉండనే ఉండరు. మీరు ఈ విధంగా సుందరంగా మరియు నల్లగా ఉండే చిత్రాలను తయారు చేసి వ్రాయండి. 63 జన్మలు కామచితి పై కూర్చుని ఇలా నల్లగా అయిపోయారు. ఆత్మయే ఇలా తయారయ్యింది కదా! లక్ష్మీనారాయణులవి కూడా నల్లని చిత్రాలు తయారు చేశారు. ఆత్మ నల్లగా అవుతుందని అర్థం చేసుకోరు. వీరు సత్యయుగానికి యజమానులుగా, సుందరంగా ఉండేవారు తర్వాత కామచితి పై కూర్చుని నల్లగా అయ్యారు. ఆత్మ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తమోప్రధానముగా అవుతుంది. తద్వారా ఆత్మ కూడా నల్లదిగా మరియు శరీరము కూడా నల్లగా అవుతుంది. కనుక నవ్వుతూ నవ్వుతూ లక్ష్మీనారాయణలను కొన్నిచోట్ల నల్లగా, కొన్నిచోట్ల సుందరముగా చూపించారు. కారణమేమిటని మీరు వారిని ప్రశ్నించవచ్చు. వారిలో జ్ఞానమైతే లేదు. కృష్ణుడినే సుందరంగా, కృష్ణుడినే నల్లగా ఎందుకు తయారుచేస్తారో మీరు ఇప్పుడే తెలుసుకున్నారు. మీకు ఇప్పుడు జ్ఞాన మూడవ నేత్రము లభించింది. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. సంతోషంతో నిండుగా ఉండేందుకు ఏకాంతములో కూర్చొని లభించిన జ్ఞాన ధనాన్ని స్మరణ చెయ్యాలి. పావనంగా లేక సదా నిరోగిగా అయ్యేందుకు స్మృతిలో ఉండే కృషి చెయ్యాలి.

2. తండ్రి సమానం మాస్టర్‌ జ్ఞానసాగురులుగా అందరినీ స్వదర్శన చక్రధారులుగా చెయ్యాలి. లైట్‌హౌస్‌గా అవ్వాలి. భవిష్య 21 జన్మల శరీర నిర్వహణ కొరకు తప్పకుండా ఆత్మిక టీచర్లుగా అవ్వాలి.

వరదానము :-

''అవినాశి ఉల్లాస - ఉత్సాహాల ద్వారా తుఫానును తోఫాగా(కానుకగా) చేసుకునే శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మా భవ''

ఉల్లాస - ఉత్సాహాలే బ్రాహ్మణులను ఎగిరేకళలోకి తీసుకెళ్లే రెక్కలు. ఆ రెక్కలతో సదా ఎగురుతూ ఉండండి. ఈ ఉల్లాస - ఉత్సాహాలు బ్రాహ్మణులైన మీకు అత్యంత గొప్ప శక్తి. మీది నీరస జీవితం కాదు. సదా ఉల్లాస - ఉత్సాహాల రసముంటుంది. ఉల్లాస - ఉత్సాహాలు కష్టాన్ని కూడా సులభంగా చేస్తాయి. వారు ఎప్పుడూ వ్యాకులపడరు. ఉత్సాహము తుఫానును కూడా తోఫాగా చేస్తుంది. ఉత్సాహము ఏ పరీక్షనైనా, సమస్యనైనా మనోరంజనంగా అనుభవం చేయిస్తుంది. ఇటువంటి ఉల్లాస - ఉత్సాహాలలో ఉండువారే శ్రేష్ఠమైన బ్రాహ్మణులు.

స్లోగన్‌ :-

''శాంతి అనే సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటే, అశాంతి అనే దుర్గంధము సమాప్తమైపోతుంది''