22-08-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - ఇప్పుడు వికర్మలు చేయడం మానేయండి, ఎందుకంటే మీరిప్పుడు వికర్మాజీత్ శకమును ప్రారంభించాలి. ''
ప్రశ్న :-
బ్రాహ్మణ పిల్లలైన మీరు ప్రతి ఒక్కరు ఏ విషయములో తండ్రిని తప్పకుండా అనుసరించాలి?
జవాబు :-
ఎలాగైతే తండ్రి స్వయం టీచరుగా అయ్యి మిమ్ములను చదివిస్తున్నారో, అలాగే మీరు ప్రతి ఒక్కరు తండ్రి సమానంగా టీచరుగా అవ్వాలి. మీరు చదువుకున్నదానిని ఇతరులకు చదవించాలి. టీచర్ పిల్లలైన మీరు కూడా టీచర్లే, సద్గురువు పిల్లలైన మీరు కూడా సద్గురువులే, మీరు సత్య ఖండమును స్థాపన చేయాలి. మీరు సత్యమైన నావలో ఉన్నారు, మీ నావ చలిస్తుంది కాని మునగదు.
ఓంశాంతి.
ఆత్మిక తండ్రి వచ్చి కూర్చొని పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. ఆత్మలను ప్రశ్నిస్తారు ఎందుకంటే ఇది నూతన జ్ఞానము కదా! ఇది మానవుల నుండి దేవతలుగా అయ్యే నూతన జ్ఞానము లేక చదువు. ఈ చదువును మీకు ఎవరు చదివిస్తున్నారు? ఆత్మిక తండ్రి పిల్లలైన మనకు బ్రహ్మ ద్వారా చదివిస్తున్నారని మీకు తెలుసు. దీనిని మర్చిపోరాదు. వారు తండ్రి, చదివిస్తున్నారు కనుక టీచరు కూడా అయ్యారు. మనము కొత్త ప్రపంచము కొరకు చదువుతున్నామని మీకు తెలుసు. ప్రతి విషయములో నిశ్చయముండాలి. కొత్త ప్రపంచము కొరకు చదివించేవారు ఒక్క తండ్రి మాత్రమే. ముఖ్యమైన విషయము తండ్రిని గురించే. మనకు తండ్రి బ్రహ్మ ద్వారా ఈ శిక్షణను ఇస్తున్నారు. ఎవరో ఒకరి ద్వారా ఇస్తారు కదా. భగవంతుడు బ్రహ్మ ద్వారా రాజయోగమును నేర్పిస్తారని గాయనము కూడా ఉంది. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఆ దేవీ దేవతా ధర్మము ఇప్పుడు లేదు. ఇప్పుడిది కలియుగము. కావున స్వర్గ స్థాపన జరుగుతూ ఉందని ఋజువవుతుంది. స్వర్గములో కేవలం దేవీ దేవతా ధర్మమువారు ఉంటారు. మిగిలిన ధర్మాల వారు ఎవ్వరూ ఉండరు అనగా వినాశనమౌతారు ఎందుకంటే సత్యయుగములో మరే ఇతర ధర్మము లేనే లేదు. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నాయి. ఇప్పుడైతే అనేక ధర్మాలున్నాయి. మళ్లీ తండ్రి ఇప్పుడు మనలను మనుష్యుల నుండి దేవతలుగా చేస్తారు ఎందుకంటే ఇది సంగమ యుగము. ఇది అర్థం చేయించేందుకు చాలా సహజమైన విషయము. బ్రహ్మ ద్వారా స్థాపన అని త్రిమూర్తి చిత్రములో కూడా చూపిస్తారు. దేనిని స్థాపిస్తారు? స్థాపన చేసేది క్రొత్త ప్రపంచమునే, పాతది స్థాపన చేయరు. కొత్త ప్రపంచములో దైవీగుణాలు కలిగిన దేవతలే ఉంటారని పిల్లలకు నిశ్చయముంది. కావున ఇప్పుడు మనము కూడా గృహస్థ వ్యవహారములో ఉంటూ దైవీ గుణాలను ధారణ చేయాలి. మొట్టమొదట కామ వికారము పై విజయము పొంది నిర్వికారులుగా అవ్వాలి. నిన్నటి వరకు ఈ దేవీ దేవతల ముందుకు వెళ్లి మీరు సంపూర్ణ నిర్వికారులు, మేము వికారులము అని చెప్తూ వచ్చారు కదా. స్వయాన్ని వికారులుగా ఫీల్ చేసేవారు ఎందుకంటే వికారాలలోకి వెళ్లేవారు. ఇప్పుడు మీరు కూడా ఇటువంటి నిర్వికారులుగా అవ్వాలని, దైవీ గుణాలు ధారణ చేయాలని తండ్రి చెప్తున్నారు. కామ-క్రోధాది వికారాలు ఏవైనా ఉంటే వాటిని దైవీ గుణాలని అనరు. వికారాలలోకి వెళ్లడం, క్రోధము చేసుకోవడం ఆసురీ గుణాలు. దేవతలలో లోభము ఏమైనా ఉంటుందా? అక్కడ పంచ వికారాలు ఉండవు. ఇది రావణ ప్రపంచము. త్రేతా మరియు ద్వాపర యుగాల సంగమ సమయములో రావణుడు జన్మిస్తాడు. ఈ పాత ప్రపంచానికి మరియు కొత్త ప్రపంచానికి ఎలాగైతే సంగమముందో, అలా అక్కడ కూడా సంగమము ఉంటుంది. రావణ రాజ్యములో ఇప్పుడు చాలా దు:ఖము, రోగాలు ఉన్నాయి, దీనిని రావణ రాజ్యమని అంటారు. రావణుని ప్రతి సంవత్సరము తగులబెట్తారు. వామమార్గములో (వేద విరుద్ధమైన మంత్ర తంత్రాలతో కూడి మద్యము, మాంసము, మైథునాలకు తావిచ్చెడి విధానములో) వెళ్లడం ద్వారా వికారులుగా అవుతారు. మీరిప్పుడు నిర్వికారులుగా అవ్వాలి. దైవీగుణాలు ఇక్కడే ధారణ చేయాలి. ఎవరు ఎటువంటి కర్మలు చేస్తారో అటువంటి ఫలితమునే పొందుతారు. పిల్లల ద్వారా ఇప్పుడు ఏ వికర్మలూ జరగరాదు.
ఒకరు రాజా వికర్మాజీత్, మరొకరు రాజా విక్రముడు(వికర్ముడు). ఇది విక్రమ శకము అనగా రావణుని వికారాల శకము. ఇది ఎవ్వరూ అర్థము చేసుకోరు. కల్పాయువు కూడా ఎవ్వరికీ తెలియదు. వాస్తవంగా దేవతలు వికర్మాజీతులుగా ఉంటారు. 5 వేల సంవత్సరాలలో 2500 సంవత్సరాలు రాజా విక్రమునివి, 2500 సంవత్సరాలు రాజా వికర్మాజీతునివి. అర్ధము(సగము) విక్రమునిది. వారు భలే అంటారు కాని అర్థము ఏమీ తెలియదు. వికర్మాజీత్ శకము మొదటి సంవత్సరము నుండి ప్రారంభమవుతుంది, మళ్లీ 2500 సంవత్సరాల తర్వాత విక్రమ శకము ప్రారంభమవుతుందని మీరు చెప్తారు. ఇప్పుడు విక్రమ శకము పూర్తి అయిన తర్వాత మీరు మళ్లీ వికర్మాజీతులైన మహారాజ మహారాణిగా తయారవుతున్నారు, అలా తయారైనప్పుడు వికర్మాజీత్ శకము ప్రారంభమవుతుంది. ఇవన్నీ మీకు మాత్రమే తెలుసు. బ్రహ్మను ఎందుకు కూర్చోబెట్టారని మిమ్ములను అడుగుతారు? అరే! వీటిని గురించి మీకు ఏమి అవసరము? మమ్ములను చదివించేవారు ఈ బ్రహ్మ కాదు, మేము శివబాబా ద్వారా చదువుకుంటున్నాము. ఇతడు కూడా వారి ద్వారానే చదువుకుంటాడు. చదివించేవారు జ్ఞానసాగురులు. వారు విచిత్రులు, వారికి చిత్రము అనగా శరీరము లేదు, విచిత్రంగా ఉన్నారు, వారిని నిరాకారుడని అంటారు. నిరాకార ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి. మళ్లీ ఇక్కడకు వచ్చి సాకారులుగా అవుతాయి. పరమపిత పరమాత్మనైతే అందరూ స్మృతి చేస్తారు, వారు ఆత్మలందరికీ తండ్రి. లౌకిక తండ్రికి పరమ అనే పదము చెప్పరు. ఇది అర్థము చేసుకోవలసిన విషయము కదా. పాఠశాలలోని విద్యార్థులు చదువు పై గమనమిస్తారు. ఎవరైనా న్యాయవాది మొదలైన వారిగా అయిన తర్వాత ఆ చదువు సమాప్తమైపోతుంది. న్యాయవాది అయిన తర్వాత కూడా చదువుకుంటారా? లేదు, చదువు పూర్తి అవుతుంది. మీరు కూడా దేవతలైన తర్వాత మీకు చదువుకునే అవసరముండదు. 2500 సంవత్సరాలు దేవతల రాజ్యము నడుస్తుంది. ఈ విషయాలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మళ్లీ మీరు ఇతరులకు అర్థం చేయించాల్సి ఉంటుంది. దీని పై కూడా గమనముంచాలి. అలా చదివించకపోతే టీచరుగా ఎలా అవుతారు! ఇప్పుడు మీరందరూ టీచర్లే. టీచరు సంతానము కనుక మీరు కూడా టీచరుగా అవ్వాలి. ఇప్పుడు చదివించేందుకు ఎంతమంది టీచర్లు కావాలి? ఎలాగైతే మన తండ్రి టీచరు, సద్గురువుగా ఉన్నారో అలా మీరు కూడా టీచరుగా ఉన్నారు. సద్గురువుకు పిల్లలైన మీరు సద్గురువులు. వారెవ్వరూ సద్గురువు కారు. వారు గురువుకు పిల్లలైన గురువులు. సత్ అనగా సత్యము. భారతదేశము సత్య ఖండమని కూడా అనబడేది. ఇది అసత్య ఖండము. సత్య ఖండమును తండ్రే స్థాపిస్తారు. వారే సత్యమైన సాయిబాబా. సత్యమైన తండ్రి వచ్చినప్పుడు అసత్యమైనవారు కూడా చాలా మంది వెలువడ్తారు. సత్యమైన నావ అటు-ఇటు ఊగుతుంది, తుఫానులు వస్తాయి కాని మునగదు అనే గాయనముంది కదా. మాయావి తుఫానులు చాలా వస్తాయి, వాటిని చూసి భయపడరాదు అని పిల్లలకు తెలియజేయబడుతుంది. మాయ తుఫానులు వస్తాయని సన్యాసులు ఎప్పుడూ మీకు చెప్పరు. నావను తీరానికి ఎలా తీసుకెళ్తారో వారికి తెలియనే తెలియదు.
భక్తి చేయడం ద్వారా సద్గతి లభించదని మీకు తెలుసు. క్రిందికే దిగుతూ ఉంటారు. భగవంతుడు వచ్చి భక్తులకు ఫలితమిస్తారని అంటారు. భక్తి అయితే తప్పకుండా చేయాలి. మంచిది, భగవంతుడు వచ్చి భక్తికి ఫలితంగా ఏమిస్తారు? తప్పకుండా సద్గతిని ఇస్తారని అంటారు కాని ఎప్పుడు, ఎలా ఇస్తారో తెలియదు. మీరు ఎవరినైనా అడిగితే, భక్తి అనాదిగా వస్తూ ఉందని చెప్తారు. రావణుని తగులబెట్టడం ఎప్పటి నుండి ప్రారంభించారు? అని అడిగితే, దీనికి కూడా పరంపర నుండి అని చెప్తారు. మీరు అర్థం చేయిస్తే ఇదేదో క్రొత్త జ్ఞానమని అంటారు. కల్పక్రితము అర్థం చేసుకున్నవారు వెంటనే అర్థము చేసుకుంటారు. బ్రహ్మ గురించిన విషయాన్ని వదిలేయండి. శివబాబా జన్మించారు కదా, దానిని శివరాత్రి అని కూడా అంటారు. నాది దివ్యమైన, అలౌకిక జన్మ అని తండ్రి అర్థం చేయిస్తారు. ప్రాకృతికమైన మానవుల వలె జన్మించరు ఎందుకంటే వారందరు గర్భము ద్వారా జన్మ తీసుకుంటారు, శరీరధారులుగా అవుతారు. నేనైతే గర్భములో ప్రవేశించను. ఈ జ్ఞానాన్ని పరమపిత పరమాత్ముడు, జ్ఞానసాగరుడు తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు. జ్ఞానసాగరుడని ఏ మనిషిని అనరు. ఈ పోలిక నిరాకారునిదే. నిరాకారుడైన తండ్రి ఆత్మలను చదివిస్తారు, ఆత్మలకే అర్థము చేయిస్తారు. పిల్లలైన మీరు ఈ రావణ రాజ్యములో పాత్ర చేస్తూ - చేస్తూ దేహాభిమానులుగా అయ్యారు. అన్ని పనులు చేసేది ఆత్మనే. ఈ జ్ఞానము ఎగిరిపోయింది. ఇవి అవయవాలు కదా. నేను ఆత్మను. ఈ అవయవాల ద్వారా కర్మ చేయించవచ్చు, చేయించకపోవచ్చు. నిరాకార ప్రపంచములో అయితే ఆత్మలు శరీరము లేకుండా కూర్చొని ఉంటాయి. మీరిప్పుడు ఇంటిని కూడా తెలుసుకున్నారు. వారు ఇంటినే ఈశ్వరుడని భావిస్తారు. బ్రహ్మ జ్ఞానులు, తత్వ జ్ఞానులు ఉన్నారు కదా. వారు బ్రహ్మలో లీనమౌతామని అంటారు. ఒకవేళ బ్రహ్మములో నివసిస్తామని చెప్తే ఈశ్వరుడు వేరుగా అవుతాడు. వారు బ్రహ్మమునే ఈశ్వరుడు అని అంటారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. తండ్రిని కూడా మర్చిపోతారు. విశ్వాధికారులుగా తయారు చేసే తండ్రిని స్మృతి చేయాలి కదా ? ఎందుకంటే స్వర్గమును తయారు చేయువారు వారే. మీరిప్పుడు పురుషోత్తమ సంగమయుగ బ్రాహ్మణులు. మీరు ఉత్తమ పురుషులుగా అవుతారు. కనిష్ట పురుషులు ఉత్తమ పురుషుల ఎదుటకు వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు. దేవతల మందిరానికి వెళ్ళి వారి మహిమ ఎంతగానో గానము చేస్తారు. మనమే దేవతలుగా అవుతామని మీకిప్పుడు తెలుసు. ఇది చాలా సాధారణమైన విషయము. విరాట రూపమును గురించి కూడా తెలిపించారు. విరాట చక్రముంది కదా. బ్రాహ్మణులు, దేవతలు, క్షత్రియులు, .............. అని వారు కేవలం పాడ్తారు. లక్ష్మీనారాయణులు మొదలైన వారి చిత్రములైతే ఉన్నాయి కదా. తండ్రి వచ్చి అన్నింటినీ సరి చేస్తారు. మిమ్ములను కూడా సరి చేస్తున్నారు ఎందుకంటే జన్మ-జన్మాంతరాల నుండి భక్తిమార్గములో మీరు చేసినవన్నీ తప్పులే. అందువలన మీరు తమోప్రధానంగా అయ్యారు. ఇప్పుడిది అధర్మయుక్తమైన ప్రపంచము. ఇందులో దు:ఖమే దు:ఖముంది ఎందుకంటే ఈ రావణరాజ్యములో అందరూ వికారులుగానే ఉన్నారు. రావణరాజ్యము అధార్మికమైనది, రామరాజ్యము ధర్మసమ్మతమైనది, న్యాయవంతమైనది. ఇది కలియుగము, అది సత్యయుగము. ఇది అర్థము చేసుకోవలసిన విషయము కదా. వీరు శాస్త్ర్రాలు చదవడం ఎప్పుడైనా చూశారా? తమ జ్ఞానమునే కాక తమ రచనను గురించిన జ్ఞానము కూడా ఇచ్చారు. చదువుకుని ఇతరులకు వినిపించు వారి బుద్ధిలో శాస్త్రాలే ఉంటాయి. కావున అందరి సుఖదాత శివబాబా ఒక్కరే. వారే ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి, వారిని పరమపిత పరమాత్మ అని అంటారు. అనంతమైన తండ్రి తప్పకుండా బేహద్(అనంతమైన) వారసత్వమును ఇస్తారు. 5 వేల సంవత్సరాల క్రితము మీరు స్వర్గవాసులుగా ఉండేవారు, ఇప్పుడు మీరు నరకవాసులుగా ఉన్నారు. తండ్రిని రాముడు అని అంటారు కాని అపహరించబడిన సీతకు భర్తయైన రాముడు కాదు. అతడు సద్గతిదాత కాదు. ఆ రాముడు రాజుగా ఉండేవాడు. మహారాజు కూడా కాదు. మహారాజు, రాజుల గురించిన రహస్యము కూడా అర్థం చేయించారు - వారు 16 కళలవారు, వీరు14 కళలు గలవారు. రావణరాజ్యములో కూడా రాజులు, మహారాజులు ఉంటారు. కొంతమంది చాలా షాహుకార్లు, కొంతమంది తక్కువ షాహుకార్లుగా ఉంటారు. రావణరాజ్యములో ఉన్నవారిని సూర్యవంశీయులు, చంద్రవంశీయులు అని అనరు. అక్కడ షాహుకార్లకు మహారాజ అనే బిరుదు, తక్కువ షాహుకార్లకు రాజా అనే బిరుదు లభిస్తుంది. ఇప్పుడు ప్రజల పై ప్రజారాజ్యముంది. దిక్కూ- మొక్కూ(నాథులు) ఎవ్వరూ లేరు. ప్రజలు రాజులను అన్నదాత అని భావించేవారు. ఇప్పుడైతే వారు కూడా పోయారు, ఇక ప్రజల పరిస్థితి ఎలా ఉందో చూడండి! ఎన్ని రకాలైన కొట్లాటలు, జగడాలు జరుగుతున్నాయి. ఆది నుండి అంత్యము వరకు జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. రచయిత అయిన తండ్రి ఇప్పుడు ప్రాక్టికల్గా(సమక్షము/వాస్తవికంగా) ఉన్నారు. ఇదే భక్తిమార్గములో కథగా తయారవుతుంది. ఇప్పుడు మీరు కూడా ప్రాక్టికల్గా ఉన్నారు. అర్ధకల్పము మీరు రాజ్యము చేస్తారు, ఇది తర్వాత కథగా మారుతుంది. చిత్రములైతే ఉంటాయి. వీరు రాజ్యమును ఎప్పుడు పరిపాలించారు అని ఎవరినైనా అడిగితే లక్షల సంవత్సరాలని చెప్తారు. సన్యాసులు నివృత్తి మార్గములోని వారు, మీరు పవిత్ర గృహస్థ ఆశ్రమములోని వారు. మళ్లీ అపవిత్ర గృహస్థ ఆశ్రమములోకి వెళ్తారు. స్వర్గ సుఖాల గురించి ఎవ్వరికీ తెలియదు. నివృత్తి మార్గములోని వారు ఎప్పుడూ ప్రవృత్తి మార్గమును నేర్పించలేరు. ఇంతకు ముందైతే అడవుల్లో ఉండేవారు, వారిలో శక్తి ఉండేది. వారికి అడవిలోకే భోజనాన్ని పంపేవారు. ఇప్పుడు ఆ శక్తి లేదు. మీకు కూడా అక్కడ రాజ్యమును పరిపాలించే శక్తి ఉండేది, ఇప్పుడు ఆ శక్తి ఎక్కడుంది? కాని వారు మీరు కదా. ఇప్పుడు ఆ శక్తి లేదు. భారతవాసుల అసలైన ధర్మము ఇప్పుడు లేదు. అధర్మమైపోయింది. తండ్రి చెప్తున్నారు - నేను వచ్చి ధర్మమును స్థాపించి, అధర్మమును వినాశనము చేస్తాను. అధర్మస్థులను ధర్మములోకి తీసుకొస్తాను. మిగిలిన వారందరూ వినాశమైపోతారు. అయినా అందరికీ తండ్రి పరిచయమివ్వమని పిల్లలకు తండ్రి తెలిపిస్తున్నారు. తండ్రినే దు:ఖహర్త-సుఖకర్త అని అంటారు. చాలా దు:ఖీలుగా ఉన్నప్పుడే తండ్రి వచ్చి సుఖవంతులుగా తయారు చేస్తారు. ఇది కూడా అనాదిగా తయారు చేయబడిన ఆట. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఈ పురుషోత్తమ సంగమ యుగములో ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థము చేయాలి. సత్యమైన తండ్రి లభించారు కావున ఎలాంటి అసత్యమైన, అధార్మిక (తప్పుడు) పనులు చేయరాదు.
2. మాయా తుఫానులకు భయపడరాదు. సత్యమైన నావ కదులుతుంది కానీ మునిగిపోదు, (సచ్ కీ నావ్ హిలేగి, డులేగి లేకిన్ డూబేగి నహీ) ఈ విషయాన్ని సదా గుర్తంచుకోవాలి. సద్గురువు పిల్లలైన మీరు సద్గురువుగా అయ్యి అందరి నావను తీరానికి చేర్చాలి.
వరదానము :-
'' సమయ ప్రమాణంగా తమ భాగ్యాన్ని స్మరణ చేసి సంతోషంతో, ప్రాప్తులతో నిండుగా(భర్పూర్గా) అయ్యే స్మృతిస్వరూప భవ ''
భక్తిలో స్మృతిస్వరూప ఆత్మలైన మీ స్మృతిచిహ్న రూపములో భక్తులు ఇప్పటి వరకు మీ ప్రతి కర్మలోని విశేషతను స్మరిస్తూ అలౌకిక అనుభవాలలో మునిగి పోతారు. కనుక మీరు మీ ప్రాక్టికల్ జీవితంలో ఎన్ని అనుభవాలను ప్రాప్తి చేసుకొని ఉంటారు! కేవలం ఎటువంటి సమయమో, ఎటువంటి కర్మలో అటువంటి స్వరూప స్మృతిని ఎమర్జ్ రూపంలో అనుభవం చేయండి. తద్వారా చాలా విచిత్రమైన సంతోషము, విచిత్రమైన ప్రాప్తుల భండారము తయారవుతుంది అంతేకాక మనసు ద్వారా ''పొందుకోవాల్సిందంతా పొందుకున్నాను'' అనే పాట నిరంతరము వెలువడ్తూ ఉంటుంది.
స్లోగన్ :-
'' నంబరువన్లో రావాలంటే కేవలం బ్రహ్మబాబా అడుగు పై అడుగు వేస్తూ నడవండి. ''