19-01-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - ముఖ్యమైనది స్మృతియాత్ర, స్మృతియాత్ర ద్వారానే ఆయువు వృద్ధి చెందుతుంది. వికర్మలు వినాశనమవుతాయి. స్మృతిలో ఉండువారి స్థితి, మాటా-మంతి చాలా ఫస్ట్‌క్లాస్‌గా ఉంటాయి''

ప్రశ్న :-

పిల్లలైన మీకు దేవతల కంటే ఎక్కువ సంతోషముండాలి - ఎందుకు ?

జవాబు :-

ఎందుకంటే మీకిప్పుడు చాలా పెద్ద లాటరీ లభించింది. భగవంతుడే మిమ్ములను చదివిస్తున్నారు. సత్యయుగములో దేవతలను దేవతలే చదివిస్తారు. ఇచ్చట మనుష్యులను మనుష్యులే చదివిస్తారు. కాని ఇప్పుడు ఆత్మలైన మిమ్ములను స్వయం పరమాత్మయే చదివిస్తున్నారు. మీరిప్పుడు స్వదర్శన చక్రధారులుగా అవుతూ ఉన్నారు. మీలో పూర్తి జ్ఞానమంతా ఉంది. దేవతలకు ఈ జ్ఞానము ఉండదు.

పాట :-

మేల్కోండి ప్రేయసులారా! మేల్కోండి,....................( జాగ్‌ సజనియా జాగ్‌,....................... )   

ఓంశాంతి.

నూతన యుగములో దేవీ దేవతలుంటారు. వారు కూడా మనుష్యులే. కాని వారి గుణాలు దేవతల వలె ఉంటాయి. వారు డబల్‌ అహింసకులైన వైష్ణవులు. ఇప్పుడు మనుష్యులు డబల్‌ హింసకులుగా ఉన్నారు. చంపుకుంటూ, కొట్లాడుకుంటూ ఉంటారు. కామ ఖడ్గమును కూడా ఉపయోగిస్తారు. వికారీ మనుష్యులున్న ఈ లోకమును మృత్యులోకమని అంటారు. దేవీ దేవతలున్న ఆ లోకమును దేవలోకమని అంటారు. వారు డబుల్‌ అహింసకులుగా ఉండేవారు. ఒకప్పుడు వారి రాజ్యము కూడా ఉండేది. కల్పము ఆయువు లక్షల సంవత్సరాలైతే ఏ విషయమూ ఆలోచనలకు కూడా అందదు. ఈ రోజులలో కల్పము ఆయువును తక్కువ చేస్తూ పోతున్నారు. కొంతమంది 7 వేల సంవత్సరాలని, కొంతమంది 10 వేల సంవత్సరాలని అంటారు. అత్యంత ఉన్నతమైన భగవంతుడు మన తండ్రి అని, మనము వారి పిల్లలమని, శాంతిధామములో ఉండేవారమని కూడా పిల్లలకు తెలుసు. మనము దారి చూపే పండాలము(మార్గదర్శకులము). ఈ యాత్రను గురించిన వర్ణన ఎక్కడా లేదు. భలే గీతలో ''మన్మనాభవ'' అనే పదము ఉంది. అయితే దాని అర్థమేమి? స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి, ఈ అర్థము ఎవరి బుద్ధిలోకి రాదు. తండ్రి వచ్చి అర్థం చేయించినప్పుడే ఎవరి బుద్ధిలోకైనా వస్తుంది. ఈ సమయములో మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. ఇచ్చట మనుష్యులున్నారు, దేవతలు సత్యయుగములో ఉంటారు. మీరిప్పుడు తప్పకుండా మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. ఇది మీ ఈశ్వరీయ ప్రచార సంస్థ(మిషన్‌). నిరాకార పరమాత్మను ఏ మనుష్యులూ అర్థము చేసుకోలేరు. నిరాకారునికి చేతులు, కాళ్ళు ఎక్కడ నుండి వస్తాయి? కృష్ణునికి అయితే కాళ్ళు-చేతులు మొదలైన అవయవాలన్నీ ఉన్నాయి. భక్తి మార్గములో ఎన్నో శాస్త్రాలు తయారు చేశారు. ఇప్పుడు పిల్లలైన మీ వద్ద చిత్రాలు మొదలైనవి చాలా ఉన్నాయి. చిత్రాల ద్వారా ఫలానా చిత్రము నుండి ఫలానా విషయాలు అర్థము చేయించాలని గుర్తుంటుంది. ఇంకా చాలా చిత్రాలు తయారవుతూ ఉంటాయి. (చిత్రములో) అత్యంత పై భాగమున ఆత్మల లోకమును కూడా చూపాలి. ఆ లోకములో ఎక్కడ చూసినా ఆత్మలే కనిపిస్తాయి. దాని తర్వాత సూక్ష్మవతనము, దాని క్రింద మనుష్య లోకాన్ని కూడా చేస్తారు (చూపించాలి). మనుష్యులు చివరికి వచ్చి మళ్లీ పైకి ఎలా వెళ్తారో చిత్రములో చూపించాలి. రోజురోజుకు నూతన పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని చిత్రాలున్నాయో అంత సర్వీసు కూడా చేయాలి. పోను పోను మనుష్యులు త్వరగా అర్థము చేసుకునేందుకు కావలసిన చిత్రాలు కూడా తయారవుతాయి. వృక్షము చాలా త్వరగా వృద్ధి చెందుతూ పోతుంది. కల్పక్రితము ఎవరు ఏ పదవి పొందుకొని ఉంటారో, ఏ ఫలితము వెలువడిందో మళ్లీ అదే వెలువడ్తుంది. అంతేకాని చివరిలో వచ్చేవారు మాలలోని పూసలుగా తయారు కాలేరని కాదు. వారు కూడా మాలలోని మణిపూసలుగా అవుతారు. నవ విధాల(నౌధా, గాఢమైన) భక్తి చేయువారు రాత్రింబవళ్లు(నిరంతరము) భక్తిలో మునిగి ఉంటారు. అప్పుడు వారికి సాక్షాత్కారము అవుతుంది. ఇచ్చట కూడా అటువంటివారు వస్తారు. రాత్రింబవళ్లు శ్రమ చేసి పతితుల నుండి పావనంగా అవుతారు. అవకాశము అందరికీ ఉంది. చివరిలో ఎవ్వరూ మిగిలిపోరు. ఎవ్వరూ మిగిలిపోనట్లుగా డ్రామా తయారై ఉంది. అన్ని వైపులా సందేశమునివ్వాలి. ఒక్కరు మిగిలినా(ఆ ఒక్కరు) ఫిర్యాదు చేసినట్లు శాస్త్రాలలో ఉంది. ఈ చిత్రాలు, వార్తాపత్రికలు మొదలైన వాటిలో కూడా ప్రచురింపబడ్తాయి. మీకు కూడా ఆహ్వానము లభిస్తూ ఉంటుంది. తండ్రి వచ్చారని అందరికీ తెలిసిపోతుంది. పూర్తిగా నిశ్చయము కలిగినప్పుడు పరుగెత్తుకొని వస్తారు. పేరు ప్రసిద్ధమౌతూనే ఉంటుంది. నవయుగమని సత్యయుగమునే అంటారు. నవయుగమనే వార్తాపత్రిక కూడా వెలువడ్తుంది. క్రొత్త ఢిల్లి అని అంటారు కాని క్రొత్త ఢిల్లీలో ఈ పాత కోట, చెత్తా-చెదారము మొదలైనవి ఉండవు. ఇప్పుడైతే ప్రతి వస్తువు అస్తవ్యస్థమైపోయింది. సత్యయుగములో అన్ని తత్వాలు కూడా సక్రమంగా ఉంటాయి. ఇచ్చట అయితే పంచ తత్వాలు కూడా తమోప్రధానంగా ఉన్నాయి. అచ్చట అన్నీ సతోప్రధానంగా ఉంటాయి. అందువలన అన్ని తత్వాల ద్వారా సుఖమే లభిస్తుంది. దు:ఖము అను పేరు కూడా ఉండదు. దాని పేరే స్వర్గము. వాస్తవానికి ఇప్పుడు మనము పూర్తి తమోప్రధానమైపోయాము. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీరు అర్థము చేసుకున్నారు. సతోప్రధానంగా అయ్యేందుకు పురుషార్థము చేసి గమ్యానికి చేరుకుంటున్నాము. మిగిలిన వారందరూ అంధకారములో ఉన్నారు. మనము ప్రకాశములో ఉన్నాము. మనము పైకి వెళ్తున్నాము. మిగిలిన వారందరూ క్రింద పడుతూ ఉన్నారు. ఈ విచార సాగర మథనమంతా పిల్లలైన మీరు చేయాలి. శివబాబా నేర్పించేవారు. వారు(శివబాబా) విచార సాగర మథనము చేయరు, బ్రహ్మ మథనము చేయవలసి ఉంటుంది. మీరందరూ విచార సాగర మథనము చేసి అందరికి తెలిపిస్తారు. కొందరికి ఏ మాత్రము మథనము జరగదు. పాత ప్రపంచమే గుర్తుకు వస్తుంది. పాత ప్రపంచాన్ని పూర్తిగా మరచిపొమ్మని బాబా చెప్తున్నారు. అయితే నంబరువారు పురుషార్థమనుసారము రాజధాని అవుతూ ఉందని బాబాకు తెలుసు. తండ్రి చెప్తున్నారు - నేను వచ్చి రాజధాని స్థాపన చేసి మిగిలిన వారందరినీ వాపస్‌ తీసుకెళ్తాను. వారైతే కేవలము తమ-తమ ధర్మాలను మాత్రమే స్థాపన చేస్తారు. వారి వెనుక ఆ ధర్మానికి చెందినవారు వస్తూ ఉంటారు. వారి మహిమ ఏముంది? మహిమ అంతా మీదే. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారినే హీరో-హీరోయిన్‌ అని అంటారు. వజ్ర సమానమైన జన్మ, గవ్వ సమానమైన జన్మ అనే గాయనము మీ కొరకే ఉంది. మళ్లీ మీరు ఒక్కసారిగా శిఖరము నుండి దిగజారి పూర్తిగా క్రిందికి వచ్చేస్తారు. కావున ఈ సంగమ యుగములో పిల్లలైన మీకు లాటరీ లభించింది. కనుక మీకు దేవతల కంటే ఎక్కువ సంతోషముండాలి. ఇప్పుడు మిమ్ములను భగవంతుడు చదివిస్తున్నారు. అక్కడైతే దేవతలను దేవతలే చదివిస్తారు. ఇక్కడ మనుష్యులను మనుష్యులే చదివిస్తారు. కాని ఆత్మలైన మిమ్ములను పరమపిత పరమాత్మ చదివిస్తున్నారు. వ్యత్యాసముంది కదా!

బ్రాహ్మణులైన మీరు రామరాజ్యము, రావణరాజ్యమును కూడా అర్థము చేసుకున్నారు. ఇప్పుడు మీరు శ్రీమతమును ఎంతగా అనుసరిస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. అజ్ఞాన కాలములో ఏ పని చేసినా అది వ్యతిరేకంగానే అవుతుంది. చిన్నతనములో ఇతరుల పై ఆధారపడే బుద్ధి ఉంటుంది. తర్వాత యుక్త వయస్సుకు చెందిన బుద్ధి ఉంటుంది. 16-17 సంవత్సరాల తర్వాత వివాహమవుతుంది. ఈ రోజులలో అయితే చాలా మురికి ఉంది, ఒడిలో పెరిగే పిల్లలకు కూడా నిశ్చితార్థము చేస్తారు. తర్వాత ఇచ్చి పుచ్చుకోవడం ప్రారంభమవుతుంది. అక్కడ వివాహాలు ఎంతో రాయల్‌(శ్రేష్ఠము, వైభవము)గా ఉంటాయి. మీరు ఇవన్నీ సాక్షాత్కారాలలో చూశారు. ముందుకు వెళ్లే కొలది మీకు అన్ని సాక్షాత్కారాలు అవుతాయి. మంచి ఫస్ట్‌క్లాసు యోగి పిల్లల ఆయువు పెరుగుతూ ఉంటుంది. యోగము ద్వారా మీ ఆయువును పెంచుకోమని తండ్రి చెప్తున్నారు. ''యోగములో మేము బలహీనంగా ఉన్నాము'' అని పిల్లలకు తెలుసు. స్మృతిలో ఉండేందుకు చాలా కష్టపడ్తారు. కాని ఉండలేరు. క్షణ-క్షణము మర్చిపోతారు. వాస్తవానికి ఇక్కడుండేవారి చార్టు చాలా బాగుండాలి. వెలుపల అయితే చాలా చిక్కు సమస్యలలో మునిగి ఉంటారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మీరు ఇచ్చటనే సతోప్రధానంగా అవ్వాలి. కనీసము భోజనము తయారు చేస్తూ పనులు చేసుకుంటూ 8 గంటలు నన్ను స్మృతి చేస్తే అంత్యములో కర్మాతీత స్థితి వస్తుంది. ఎవరైనా నేను 6-8 గంటలు యోగములో ఉంటున్నాను అంటే బాబా అంగీకరించరు(నమ్మరు). చాలామంది సిగ్గుపడి చార్టు వ్రాయరు. అర్ధగంట కూడా యోగములో ఉండలేరు. మురళి వినడం యోగము కాదు. మురళి వినడం ద్వారా ధనము(జ్ఞానము)ను సంపాదిస్తారు. స్మృతిలో వినడం సమాప్తమైపోతుంది. చాలామంది పిల్లలు స్మృతిలో ఉండి మురళి విన్నామని వ్రాస్తారు. అయితే ఇది స్మృతి కాదు. నేను క్షణ-క్షణము మర్చిపోతానని ఈ బాబా స్వయంగా చెప్తున్నారు. స్మృతిలో భోజనము చేస్తామని కూర్చుంటాను. బాబా మీరు అభోక్త కావున నేను తింటాను. మీరు కూడా తినండి అని ఎలా చెప్పను? కొన్ని విషయాలలో బాబా కూడా జతలో ఉన్నారని అంటారు. ముఖ్యమైనది స్మృతియాత్ర. మురళి సబ్జెక్టు పూర్తి వేరుగా ఉంది. స్మృతి ద్వారా పవిత్రంగా అవుతారు. ఆయువు వృద్ధి చెందుతుంది. అంతేగాని మురళి వింటే బాబా అందులో ఉన్నారని అనుకోరాదు. మురళి విన్నందున వికర్మలు వినాశనము అవ్వవు. అందుకు శ్రమపడాలి. చాలా మంది పిల్లలు పూర్తిగా స్మృతి చేయలేకపోతున్నారని బాబాకు తెలుసు. స్మృతిలో ఉన్నవారి స్థితి, మాట తీరు పూర్తిగా వేరుగా ఉంటాయి. స్మృతి ద్వారానే సతోప్రధానంగా అవుతారు. అయితే మాయ ఎటువంటిదంటే ఒక్కసారిగా తెలివిహీనులుగా చేసేస్తుంది. చాలా మందిలో జబ్బు(వికారాలు) తిరగబడ్తుంది. ఎప్పుడూ లేని మోహము కూడా ఉత్పన్నమౌతుంది. అందులో చిక్కుకొని మరణిస్తారు. చాలా కష్టముతో కూడిన పని మురళి వినడం అనేది వేరే సబ్జెక్టు. మురళి ధనము సంపాదించే విషయము. ఇందులో ఆయువు పెరగదు. పవిత్రంగా అవ్వరు. వికర్మలు వినాశనమవ్వవు. మురళిని చాలానే వింటూ ఉంటారు. విని కూడా మళ్లీ వికారాలలో పడిపోతూ ఉంటారు. సత్యము చెప్పరు. తండ్రి చెప్తున్నారు - ''పవిత్రంగా ఉండలేకుంటే ఇక్కడికి ఎందుకు వస్తారు? - బాబా! నేను అజామిలుడను, ఇక్కడకు వస్తేనే నేను పావనమవుతాను, ఇక్కడకు వచ్చినందున కొంచెమైనా బాగుపడ్తాను లేకుంటే మరి ఎక్కడకు వెళ్ళాలి, దారి అయితే ఇదే కదా'' అని అంటారు. ఇటువంటివారు కూడా వస్తారు. ఏదో ఒక సమయములో బాణము తగులుతుంది. ఇక్కడి కొరకు (మధువనము) అపవిత్రులు ఎవ్వరూ రాకూడదని కూడా బాబా చెప్తారు. ఇది ఇంద్రసభ. ఇప్పటి వరకు అటువంటివారు కూడా వస్తున్నారు. పోను పోను పక్కా గ్యారంటీ ఇచ్చినంత వరకు లోపలకు అనుమతించబడని రోజులు కూడా రానున్నవి. అటువంటి ఆర్డినెన్సు(అత్యవసర పరిస్థితులలో వెలువడే చట్టము) కూడా వెలువడ్తుంది. అపవిత్రులెవ్వరినీ లోపలకు రానివ్వని సంస్థ అని అర్థము చేసుకుంటారు. ఇది ఎవరి సభనో పిల్లలైన మీరు అర్థము చేసుకున్నారు. మనము భగవంతుడు, ఈశ్వరుడు, సోమనాథుడు, బబుల్‌నాథుని వద్ద కూర్చొని ఉన్నాము. పావనంగా తయారు చేసేవారు వారే. ఇప్పుడు చివరి సమయములో చాలామంది వచ్చేస్తారు. తర్వాత ఎవ్వరూ గలాటాలు మొదలైనవి చేయలేరు. ఈ ధర్మానికి చెందినవారు మళ్లీ వచ్చేస్తారు. ఆర్యసమాజము వారు కూడా హిందువులే. కేవలం మఠాలు, మార్గాలు వేరైపోయాయి. దేవతలు సత్యయుగములో ఉంటారు. ఇక్కడ అందరూ హిందువులే ఉన్నారు. వాస్తవానికి హిందూ ధర్మమనేదే లేదు. హిందుస్థానము అనునది దేశము పేరు, పిల్లలైన మీరు లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. విద్యార్థులకు చదువు గుర్తుండాలి కదా. పూర్తి చక్రమంతా బుద్ధిలో ఉంది. దేవతలకు మరియు మీకు కొద్దిగా మాత్రమే తేడా మిగిలి ఉంది. పక్కా స్వదర్శన చక్రధారులుగా అయితే మళ్లీ విష్ణు కులము వారిగా అయిపోతారు. మేము ఇలా(విష్ణు) తయారవుతున్నామని మీరు భావిస్తారు. ఫైనల్‌లో దేవతలుగా అవుతారు. కర్మాతీత స్థితి వచ్చినప్పుడు మీరు ఫైనల్‌గా అవుతారు. శివబాబా మిమ్ములను స్వదర్శన చక్రధారులుగా తయారు చేస్తారు. వారిలో జ్ఞానముంది కదా. వారు మిమ్ములను తయారు చేయువారు, మీరు తయారయ్యేవారు. బ్రాహ్మణులుగా తయారైన తర్వాత దేవతలుగా అవుతారు. ఇప్పుడు ఈ అలంకారాలను మీకు ఎలా ఇవ్వాలి? ఇప్పుడు మీరు పురుషార్థము చేస్తారు. తర్వాత మీరు విష్ణు కులానికి చెందినవారిగా అవుతారు. సత్యయుగము అనగా వైష్ణవ కులము కదా. కావున ఇలా తయారవ్వాలి. మీరు మధురంగా తయారవ్వాలి. ఇలాంటి - అలాంటి మాటలు మాట్లాడుట కంటే మాట్లాడకుండా ఉండుట మంచిది. దీనికి ఒక దృష్టాంతము కూడా ఉంది - '' ఇద్దరు వ్యక్తులు వాదులాడుకుంటూ ఉండేవారు, ఒక సన్యాసి వచ్చి నోటిలో గులకరాయి వేసుకోండి, దానిని ఎప్పుడూ బయటకు తీయకు అని చెప్పి వెళ్ళిపోయాడు. దాని వలన వారి వాదులాట సమాప్తమైపోయింది''. 5 వికారాలను జయించడం సులభము(మాసీ కా ఘర్‌, పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులభమేమీ) కాదు. కొంతమంది వారి అనుభవము కూడా ఇలా తెలుపుతారు - ''నాలో చాలా కోపముండేది ఇప్పుడు చాలా తగ్గిపోయింది.'' చాలా మధురంగా తయారవ్వాలి. నిన్నటివరకు మీరు ఈ దేవతల గుణగానము చేస్తూ ఉండేవారు. నేడు మేము ఇలాంటి దేవతలుగా తయారవుతూ ఉన్నామని భావిస్తున్నారు. నెంబరువారుగానే తయారవుతారు. ఎవరైతే సర్వీసు చేస్తారో బాబా కూడా వారి పేరును తప్పకుండా తీసుకుంటారు. ఇతరులకు దారి తెలపాలి. మనకు కూడా ఇంతకు ముందు ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు ఎంత జ్ఞానము లభించింది! ఎవరు బాగా ధారణ చేయడం లేదో వారిని గురించి బాబా! వీరిలో చాలా క్రోధముంది - అనే రిపోర్టు(ఫిర్యాదు) వస్తుంది. అటువంటివారు ఆత్మిక సేవ చేయలేకపోతే స్థూల సేవైనా చేయవచ్చు అని బాబా భావిస్తారు. బాబా స్మృతిలో ఉంటూ సేవ చేస్తే అహో(ఎంతో) సౌభాగ్యము! ఒకరికొకరు పరస్పరము స్మృతి ఇప్పించుకుంటూ ఉండండి. స్మృతి ద్వారా చాలా శక్తి లభిస్తుంది. స్మృతి చేసేవారు చార్టు కూడా పెట్టాలి. చార్టు చూస్తే తెలిసిపోతుంది. బాబా ప్రతి ఒక్కరినీ అప్రమత్తము చేస్తూ ఉంటారు. విశ్వములో శాంతి కావాలని చాలామంది అడుగుతూ ఉంటారు అనగా విశ్వములో ఎప్పుడో ఒకప్పుడు శాంతి తప్పకుండా ఉండేదని అర్థమవుతుంది. సత్యయుగములో అశాంతికి సంబంధించిన విషయమేదీ ఉండదు. మధురమైన తండ్రి, మధురమైన పిల్లలు మొత్తం విశ్వమంతటిని మధురంగా తయారు చేస్తారు. ఇప్పుడు మధురత(స్వీట్‌) ఎక్కడ ఉంది? ఎక్కడ చూసినా మృత్యువే మృత్యువు తాండవిస్తూ ఉంది. ఈ ఆట అనేకసార్లు జరుగుతుంది. ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పటికీ సమాప్తము కాదు. చక్రము తిరుగుతూనే ఉంటుంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. వికర్మలు వినాశనము చేసుకునేందుకు లేక ఆయువును వృద్ధి చేసుకునేందుకు తప్పకుండా స్మృతియాత్రలో ఉండాలి. స్మృతి ద్వారా మాత్రమే పవిత్రంగా అవుతారు. అందువలన కనీసము 8 గంటల స్మృతి చార్టును తయారు చేసుకోవాలి.

2. దేవతల సమానము మధురంగా తయారవ్వానలి. ఇలాంటి-అలాంటి(పనికిరాని) మాటలు మాట్లాడడం కంటే మాట్లాడకుండా ఉండడం మంచిది. ఆత్మిక సేవ లేక స్థూల సేవ చేస్తూ తండ్రి స్మృతిలో ఉంటే ఆహో సౌభాగ్యము.

వరదానము :-

''ఈశ్వరీయ రసాన్ని అనుభవం చేసి ఏకరస స్థితిలో స్థితమై ఉండే శ్రేష్ఠ ఆత్మా భవ''

ఏ పిల్లలైతే ఈశ్వరీయ రసాన్ని అనుభవం చేసుకుంటారో వారికి ప్రపంచములోని అన్ని రసాలు నిస్సారంగా అనిపిస్తాయి. ఒక రసము తియ్యగా ఉంటే, అటెన్షన్‌ ఆ ఒక్క వైపుకే పోతుంది కదా. సహజంగానే ఒకే వైపు మనసు లగ్నమైపోతుంది, కష్టముండదు. తండ్రి స్నేహము, తండ్రి సహాయము, తండ్రి తోడు, తండ్రి ద్వారా సర్వ ప్రాప్తులు సహజంగా ఏకరస స్థితిని తయారు చేస్తాయి. ఇటువంటి ఏకరస స్థితిలో స్థితమై ఉండే ఆత్మలే శ్రేష్ఠమైన ఆత్మలు.

స్లోగన్‌ :-

''చెత్తను ఇముడ్చుకొని రత్నాలను ఇవ్వడమే మాస్టర్‌ సాగరంగా అవ్వడం.''

బ్రహ్మబాబా సమానంగా అయ్యేందుకు విశేషమైన పురుషార్థము
ఎలాగైతే బ్రహ్మాబాబా తన సుఖ సాధనాలను గాని, విశ్రాంతిని గాని, దేనినైనా ఆధారంగా ఉంచుకోలేదో, వారు అన్ని ప్రకారాల దేహ స్మృతి నుండి దూరమై నిరంతరం దీపం(శమా) ప్రేమలో లీనమై ఉండేవారో, అలా తండ్రిని అనుసరించండి. ఎలాగైతే దీపం జ్యోతి స్వరూపమైన లైట్‌ - మైట్‌ రూపంలో ఉందో అలా దీపం సమానంగా స్వయం మీరు కూడా లైట్‌ - మైట్‌ రూపంగా అవ్వండి.