18-05-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - తండ్రి సర్వ సంబంధాల ప్ర్రేమకు శ్యాక్రిన్‌ (అతిమధురము). ఈ ఒక్క మధురమైన ప్రియతముడిని స్మృతి చేస్తే బుద్ధి అన్ని వైపుల నుండి తొలగిపోతుంది. ''

ప్రశ్న :-

కర్మాతీతులుగా అయ్యేందుకు సహజ పురుషార్థము లేక యుక్తి ఏది?

జవాబు :-

సోదర(భాయి-భాయి) దృష్టిని పక్కా చేసుకునే పురుషార్థము చేయండి. బుద్ధి ద్వారా ఒక్క తండ్రిని తప్ప మిగిలినవన్నీ మర్చిపోండి. ఏ దేహధారి సంబంధము గుర్తు రాకూడదు. అప్పుడు కర్మాతీతులుగా అవుతారు. ''స్వయాన్ని ఆత్మ భాయీ - భాయీ అని భావించాలి'' - ఇదే పురుషార్థపు గమ్యము. భాయి-భాయి(సోదరులుగా) అని భావించినందున దేహ దృష్టి, వికారి ఆలోచనలు సమాప్తమైపోతాయి.

ఓంశాంతి.

డబుల్‌ ఓంశాంతి. డబుల్‌ ఎలా అవుతుంది? డబుల్‌ ఎలా అవుతుందో పిల్లలైన మీ బుద్ధిలో మాత్రమే ఉంది. తండ్రి కూడా కూర్చుని పిల్లలకు మాత్రమే అర్థము చేయిస్తారు. మొట్టమొదట తండ్రి పై నిశ్చయముండాలి. వీరు తండ్రి, టీచరు, గురువు కూడా అయ్యారు. లౌకికంలో అయితే వేరు వేరుగా ఉంటారు. టీచరు వద్దకు యువ వయసులో వెళ్తారు. గురువు వద్దకు 60 సంవత్సరాల తర్వాత వెళ్తారు. వీరు వచ్చినప్పుడు ముగ్గురి సేవలను ఒక్కరే(వీరే) చెస్తారు. పిల్లలు-పెద్దలు అందరూ చదువుకోవచ్చని అంటారు. పిల్లల మెదడు చాలా చురుకుగా ఉంటుంది. చిన్న-పెద్ద అందరూ జీవాత్మలే అని అర్థము చేయిస్తున్నారు. ఆత్మ జీవములోకి(శరీరములోకి) ప్రవేశిస్తుంది. ఆత్మ మరియు జీవము రెండింటికి బేధముంది కదా. ఇక్కడ పిల్లలైన మీకు ఆత్మ-పరమాత్మల జ్ఞానమివ్వబడుతుంది. ఆత్మ ఏమో అవినాశి. శరీరము ఇక్కడ భ్రష్ఠాచారము ద్వారా జన్మిస్తుంది. అక్కడ భ్రష్ఠాచారమను పేరే ఉండదు. అది సంపూర్ణ నిర్వికారి ప్రపంచమని మహిమ చేయబడుతుంది. శ్రేష్ఠాచారము - భ్రష్ఠాచారము రెండు పదాలున్నాయి కదా. ఈ విషయాలన్నీ తండ్రియే అర్థము చేయిస్తున్నారు. ఆత్మలమైన మాకు తండ్రి చదివిస్తున్నారని పిల్లలకు పక్కాగా నిశ్చయముండాలి. తండ్రి వచ్చేదే పురుషోత్తమ సంగమ యుగములో. అందువలన కనిష్టము నుండి పురుషోత్తమునిగా తయారు చేస్తారని ఋజువౌతుంది. ఈ ప్రపంచమే కనిష్ఠంగా, తమోప్రధానంగా ఉంది. దీనిని రౌరవ నరకమని అంటారు. ఇప్పుడు మనము వాపస్‌ వెళ్లాలి. వాపస్‌ వెళ్లాలంటే స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రి తీసుకెళ్లేందుకు వచ్చారు. మనమంతా భాయి-భాయి. ఇది పక్కాగా నిశ్చయము చేసుకోండి. ఈ దేహము ఉండనే ఉండదు. ఆ తర్వాత వికారి దృష్టి సమాప్తమైపోతుంది. ఇది చాలా గొప్ప గమ్యము. ఈ గమ్యానికి చాలా కొద్దిమంది మాత్రమే చేరుకుంటారు. చాలా శ్రమతో కూడిన పని. చివరిలో ఏ వస్తువూ గుర్తు రాకూడదు. దీనినే కర్మాతీత అవస్థ అని అంటారు. ఈ దేహము కూడా వినాశి. దీని నుండి కూడా మమకారము తొలగిపోవాలి. పాత సంబంధాలలో మమకారముంచరాదు. ఇప్పుడు నూతన సంబంధములోకి వెళ్లాలి. పాత ఆసురీ సంబంధము, స్త్రీ-పురుషుల సంబంధము ఎంతో ఛీ-ఛీ సంబంధము! స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు వాపస్‌ వెళ్లాలి. ఆత్మ - ఆత్మ అని భావిస్తూ ఉంటే శరీర భావము ఉండదు. స్త్రీ-పురుషుల ఆకర్షణ తొలగిపోతుంది. అంత్య కాలములో స్త్రీని స్మరిస్తే, స్త్రీ చింతనలో మరణిస్తే..... అని వ్రాసి కూడా ఉన్నారు. అందుకే అంతిమ సమయములో నోటిలో గంగా జలముండాలి. కృష్ణుని తలంపు ఉండాలని అంటారు. భక్తిమార్గములో అయితే కృష్ణుని స్మృతి ఉంటుంది. కృష్ణ భగవానువాచ అని అంటారు. ఇక్కడైతే తండ్రి చెప్తున్నారు - మీ దేహమును కూడా గుర్తు చేసుకోరాదు. స్వయాన్ని ఆత్మగా భావించండి. మిగిలిన అన్ని వైపుల నుండి మనస్సును తొలగిస్తూ పోండి. సర్వ సంబంధాల ప్రేమ ఒక్కరిలోనే ఉంచండి. వారు శ్యాక్రిన్‌ వంటి వారు. అన్ని సంబంధాల మధురత, అందరి ప్రియుడు కూడా వారొక్కరే. కానీ భక్తిమార్గములో ఎన్నో పేర్లు పెట్టేశారు. భక్తి విస్తారము చాలా ఎక్కువగా ఉంది. యజ్ఞము, తపస్సు, దానము, తీర్థ స్థానము, వ్రతాలు చేయడం, శాస్త్రాలు చదవడం ఇవన్నీ భక్తి మార్గపు సామాగ్రి. జ్ఞాన మార్గములో ఏ సామాగ్రీ లేదు. ఇది కూడా ఇతరులకు అర్థము చేయించేందుకు మీరు నోట్‌ చేసుకుంటారు. మీరు వ్రాసిన కాగితాలు మొదలైనవేవీ ఉండవు. తండ్రి అర్థము చేయిస్తున్నారు - పిల్లలూ! మీరు శాంతిధామము నుండి వచ్చారు. శాంతిగానే ఉండేవారు. శాంతిసాగరుల ద్వారా మీరు శాంతి, పవిత్రతల వారసత్వము తీసుకుంటారు. ఇప్పుడు మీరు వారసత్వము తీసుకుంటున్నారు కదా. జ్ఞానము కూడా తీసుకుంటున్నారు. మీ హోదా(పదవి) మీ ముందే నిలబడి ఉంది. ఈ జ్ఞానమును తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. ఇది ఆత్మిక జ్ఞానము. ఆత్మిక తండ్రి ఆత్మిక జ్ఞానము ఇచ్చేందుకు ఒక్కసారి మాత్రమే వస్తారు. వారిని పతితపావనుడని అంటారు.

ఉదయమే కూర్చొని పిల్లలకు డ్రిల్లు చేయిస్తారు. వాస్తవానికి దీనిని డ్రిల్లు అని కూడా అనరాదు. తండ్రి కేవలం చెప్తున్నారు - పిల్లలూ! స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి. ఎంతో సులభమైనది. మీరు ఆత్మలు కదా. ఎక్కడ నుండి వచ్చారు? పరంధామము నుండి. ఈ విధంగా ఎవ్వరూ అడగరు. పారలౌకిక తండ్రే పిల్లలను అడుగుతున్నారు - పిల్లలూ! పరంధామము నుండి ఈ శరీరములోకి పాత్ర చేసేందుకు వచ్చారు కదా. పాత్ర చేస్తూ చేస్తూ ఇప్పుడు నాటకము పూర్తి అయ్యింది. ఆత్మ పతితమైనందున శరీరము కూడా పతితమయ్యింది. బంగారులోనే మిశ్రమము పడ్తుంది. తర్వాత దానిని కరిగిస్తారు. సన్యాసులు దీని అర్థమును ఎప్పుడూ చెప్పలేరు. వారికి ఈశ్వరుని గురించి తెలియనే తెలియదు. తండ్రితో యోగము జోడించండి అంటే వారు దానిని ఒప్పుకోనే ఒప్పుకోరు. తండ్రి ఏదైతే నేర్పిస్తారో దానిని ఇతరులెవ్వరూ నేర్పించలేరు. దీనిలో ప్రత్యక్షముగా(ప్రాక్టికల్‌/ ూతీaష్‌ఱషaశ్రీ)గా శ్రమ చేయవలసి ఉంటుంది. తండ్రి ఎంతో సులభము చేసి అర్థము చేయిస్తారు. పతితపావనుడని, సర్వశక్తివంతుడని వారినే శ్రీ శ్రీ అని అంటారని మహిమ కూడా చేస్తారు. దేవతలను శ్రీ(శ్రేష్ఠులు) అని అంటారు. ఈ పదము వారికే శోభిస్తుంది. వారి ఆత్మ, శరీరము రెండూ పవిత్రముగా ఉంటాయి. ఆత్మను ఎవ్వరూ నిర్లేపము అని అనజాలరు. ఆత్మయే 84 జన్మలు తీసుకుంటుంది. కానీ మనుష్యులకు తెలియని కారణంగా అధర్మస్థులు(అన్‌రైటియస్‌/ఖఅతీఱస్త్రష్ట్ర్‌వశీబర)గా అయ్యారు. ఒక్క తండ్రే వచ్చి ధర్మపరులు(=ఱస్త్రష్ట్ర్‌వశీబర)గా తయారు చేస్తారు. రావణుడు అధర్మస్తులుగా చేస్తాడు. చిత్రాలైతే మీ వద్ద ఉన్నాయి. అంతేకాని పది తలల రావణుడు ఎవ్వరూ ఉండరు. సత్యయుగములో అయితే రావణుడు ఉండనే ఉండడు. ఇది చాలా స్పష్టంగా ఉంది. కానీ ఎవరైతే వింటారో వారు మాత్రము ఇచ్చటి అంటు కట్టబడిన మొక్కలే అని బాబా చెప్తారు. కొంతమంది కొంచెమే వింటారు. కొంతమంది చాలా వింటారు. భక్తిమార్గములో ఎంత విస్తారముందో చూడండి. అనేక ప్రకారాల భక్తులుంటారు. అపహరించుకునిపోయారని ముందే విని ఉన్నారు. కృష్ణుని గురించి కూడా ఎత్తుకుపోయాడని అంటారు కదా. అటువంటి కృష్ణుని ఎందుకు ప్రేమిస్తారు? ఎందుకు పూజిస్తారు? అందుకే తండ్రి కూర్చుని అర్థము చేయిస్తున్నారు - కృష్ణుడు మొట్టమొదటి రాకుమారుడు. వారు ఎంతో బుద్ధివంతుడిగా ఉంటాడు. మొత్తం విశ్వానికంతటికి యజమాని. మరి అటువంటివారు తక్కువ బుద్ధి గలవారిగా ఉంటారా? అక్కడ వారికి మంత్రి మొదలైనవారు ఉండరు. వారికి సలహా తీసుకునే అవసరమే ఉండదు. సలహా తీసుకునే సంపూర్ణులుగా అయ్యారు. మళ్లీ సలహా ఏం తీసుకుంటారు? మీరు అర్ధకల్పము ఎవరి సలహా తీసుకునే అవసరము లేదు. స్వర్గము, నరకము అనే పేర్లు కూడా విన్నారు. ఇది స్వర్గమని భావించేవారు రాతిబుద్ధి గలవారు. ఇక్కడ మాకు ధనము, భవనాలు మొదలైనవి ఉన్నాయి కనుక ఇదే స్వర్గమని అనుకుంటారు. కానీ స్వర్గమంటే నూతన ప్రపంచమని మీకు తెలుసు. స్వర్గములో అందరూ సద్గతిలో ఉంటారు. స్వర్గము, నరకము రెండు కలిసి ఉండనే ఉండవు. స్వర్గమని దేనిని అంటారో, దాని ఆయువు ఎంతో...... మొదలగు విషయాలన్నీ తండ్రి మీకు అర్థము చేయించారు. ప్రపంచమేమో ఒక్కటే. కొత్తదానిని సత్యయుగమని, పాతదానిని కలియుగమని అంటారు. ఇప్పుడు భక్తిమార్గము సమాప్తమైపోతుంది. భక్తి తర్వాత జ్ఞానము రావాలి. జీవాత్మలన్నీ పాత్ర చేస్తూ చేస్తూ పతితమైపోయాయి. ఇది కూడా తండ్రి అర్థము చేయించారు - మీరు ఎక్కువ సుఖము పొందుతారు. మీకు 3/4 భాగము సుఖము, మిగిలిన 1/4 భాగము దు:ఖము. ఇందులో కూడా తమోప్రధానమైనప్పుడు దు:ఖము ఎక్కువగా ఉంటుంది. సగము-సగము ఉంటే అందులో మజా ఏముంది? స్వర్గములో దు:ఖమనే నామ-రూపములే ఉండవు. అప్పుడు అందులో మజా ఉంటుంది. అందుకే అందరూ స్వర్గమును గుర్తు చేసుకుంటారు. ఇది క్రొత్త మరియు పాత ప్రపంచముల బేహద్‌ నాటకము. దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి భారతవాసులకే అర్థము చేయిస్తారు. మిగిలినవారంతా అర్ధకల్పము తర్వాతనే వస్తారు. మొదటి అర్ధకల్పములో కేవలం సూర్యవంశీయులు, చంద్రవంశీయులైన మీరు మాత్రమే ఉంటారు. మీరు పవిత్రంగా ఉంటారు. అందుకే మీ ఆయువు ఎక్కువగా ఉంటుంది. అంతేకాక ప్రపంచము కూడా కొత్తదిగా ఉంటుంది. అక్కడ ప్రతి వస్తువు క్రొత్తదిగానే ఉంటుంది. ధాన్యము, నీరు, భూమి మొదలైనవన్నీ కొత్తగానే ఉంటాయి. పోను పోను పిల్లలైన మీకు ఇలా ఇలా జరుగుతుందని అన్నీ సాక్షాత్కారం చేయిస్తూ ఉంటారు. అవి ప్రారంభంలో జరిగాయి, చివరిలో మళ్లీ సాక్షాత్కారాలు జరుగుతాయి. సమీపించే కొలది సంతోషము కలుగుతుంది. మనుష్యులు విదేశాల నుండి స్వదేశములోకి వచ్చునప్పుడు సంతోషము కలుగుతుంది కదా. ఎవరైనా విదేశాలలో మరణిస్తే వారిని విమానములోనైనా స్వదేశానికి తీసుకొని వస్తారు. అన్నింటికంటే ఫస్ట్‌క్లాస్‌ అత్యంత పవిత్రమైన ధరణి భారతదేశము. ఈ దేశపు మహిమ పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ తెలియనే తెలియదు. ఇది ప్రపంచపు అద్భుతము కదా - దాని పేరే స్వర్గము. వారు చూపించే అద్భుతాలన్నీ నరకములోవే. నరకములోని అద్భుతాలెక్కడ, స్వర్గములోని అద్భుతాలెక్కడ! రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. నరకములోని అద్భుతాలను చూచేందుకు కూడా చాలామంది మనుష్యులు వెళ్తూ ఉంటారు. అనేక మందిరాలున్నాయి. అక్కడ మందిరాలే ఉండవు. సహజ సౌందర్యం ఉంటుంది. మనుష్యులు చాలా కొద్దిమందే ఉంటారు. సుగంధము మొదలైనవాటి అవసరముండదు. ప్రతి ఒక్కరికి తమ ఫస్ట్‌క్లాసైన స్వంత ఉద్యానవనాలు ఉంటాయి. అందులోని పూలు ఫస్ట్‌క్లాస్‌గా ఉంటాయి. అక్కడ గాలి కూడా ఫస్ట్‌క్లాస్‌గా ఉంటుంది. వేసవిలో ఉష్ణము మొదలైనవి ఎప్పుడూ విసిగించవు. సదా వసంత ఋతువే ఉంటుంది. అగరబత్తీల అవసరము కూడా ఉండదు. స్వర్గము పేరు వింటూనే నోటిలో నీరూరుతుంది. ఇటువంటి స్వర్గములోనికి వెంటనే వెళ్తామని మీరంటారు. ఎందుకంటే మీకు స్వర్గము గురించి తెలుసు. కానీ మళ్లీ ఇప్పుడు మనము అనంతమైన తండ్రి జతలో ఉన్నాము, తండ్రే చదివిస్తున్నారు, ఇటువంటి అవకాశము మళ్లీ లభించదని మనసు చెప్తుంది. ఇక్కడ మనుష్యులు మనుష్యులను చదివిస్తారు. అక్కడ దేవతలు దేవతలను చదివిస్తారు. ఇక్కడ తండ్రి స్వయంగా చదివిస్తారు. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఎంత సంతోషముండాలి!

84 జన్మలు కూడా మీరు మాత్రమే తీసుకున్నారు. మీకు మాత్రమే ప్రపంచ చరిత్ర-భూగోళములు గురించి తెలుసు. మనమే అనేకసార్లు ఈ రాజ్యమును తీసుకున్నాము. తర్వాత మళ్లీ రావణ రాజ్యములోనికి వచ్చాము. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మీరు ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వండి. 21 జన్మలు మీరు పవిత్రమవుతారు. అలా ఎందుకు తయారవ్వరు! కానీ మాయ ఎటువంటిదంటే, సోదర - సోదరీల పప్పులు కూడా ఉడవు. అనగా సంపూర్ణ పవిత్రులుగా అవ్వలేరు. అపరిపక్వముగా ఉండిపోతారు. స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడే ఈ పప్పులు ఉడుకుతాయి అనగా పవిత్రంగా అవుతారు. దేహ భావము తొలగిపోవాలి. ఇందులోనే శ్రమ ఉంది. చాలా సహజమైనది కూడా. ఎవరికైనా చాలా కష్టమని చెప్తే వారి మనస్సు దూరంగా తొలగిపోతుంది. అందుకే దీని పేరే సహజ స్మృతి. జ్ఞానము కూడా సహజమైనదే. 84 జన్మల చక్రమును తెలుసుకోవాలి. మొట్టమొదట తండ్రి పరిచయమివ్వాలి. తండ్రి స్మృతి ద్వారానే ఆత్మలోని మలినము తొలగిపోతుంది, పవిత్ర ప్రపంచపు వారసత్వము పొందుతారు. మొదట తండ్రిని స్మృతి చేయండి. భారతదేశపు ప్రాచీన యోగమని అంటారు. తద్వారా భారతదేశానికి విశ్వచక్రవర్తి పదవి లభిస్తుంది. ఎన్ని సంవత్సరాల ప్రాచీనము? అని అడిగితే లక్షల సంవత్సరాలని వారు అంటారు. అయితే 5 వేల సంవత్సరాల మాట అని మీకు తెలుసు. అదే రాజయోగాన్ని మళ్లీ తండ్రి నేర్పిస్తున్నారు. ఇందులో తికమకపడే అవసరమే లేదు. ఆత్మల నివాస స్థానమెక్కడ? అని అడుగుతారు. మా నివాస స్థానము భృకుటి మధ్య స్థానమని అంటారు. కావున ఆత్మనే చూడవలసి ఉంటుంది. ఈ జ్ఞానము మీకిప్పుడు మాత్రమే లభిస్తుంది. తర్వాత అక్కడ ఈ జ్ఞానము అవసరమే ఉండదు. ముక్తి-జీవన్ముక్తులను పొందగానే ఇది సమాప్తమైపోతుంది. ముక్తివారు కూడా తమ సమయములో జీవన్ముక్తిలోకి వచ్చి సుఖమును పొందుతారు. అందరూ ముక్తి ద్వారానే జీవన్ముక్తికి వస్తారు. ఇచ్చట నుండి శాంతిధామానికి వెళ్తారు. మరో ప్రపంచమేదీ లేదు. డ్రామా అనుసారము అందరూ వాపసు వెళ్లే తీరాలి. వినాశనానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఎంతో ఖర్చు చేసి బాంబులు తయారు చేస్తారు. కాబట్టి వాటిని ఊరకే ఉంచుకునేందుకు తయారు చేయరు కదా. ఫిరంగులు, బాంబులు వినాశనము కొరకే. సత్య, త్రేతా యుగములలో ఈ వస్తువులు ఉండనే ఉండవు. ఇప్పుడు 84 జన్మలు పూర్తి అయ్యాయి. మనము ఈ శరీరమును వదిలి ఇంటికి వెళ్లిపోతాము. దీపావళి పండుగనాడు అందరూ మంచి మంచి నూతన వస్త్రాలు ధరిస్తారు కదా. ఆత్మలైన మీరు కూడా క్రొత్తగా అవుతారు. ఇది అనంతమైన విషయము. ఆత్మ పవిత్రమైతే శరీరము కూడా ఫస్ట్‌క్లాస్‌ అయినది లభిస్తుంది. ఇప్పుడు ఉండేవన్నీ కృత్రిమ ఫ్యాషన్లు. పౌడర్‌ మొదలైనవి పూసుకొని అందంగా కనిపిస్తారు. అక్కడైతే సహజ సౌందర్యముంటుంది. ఆత్మ సదా సుందరంగా అరవుతుంది. దీనిని మీరు అర్థము చేసుకున్నారు. పాఠశాలలో అందరూ ఒకే విధంగా ఉండరు. ఇటువంటి లక్ష్మీనారాయణులుగా తయారవ్వాలని మీరు కూడా పురుషార్థము చేస్తారు.

ఇది మీ ఈశ్వరీయ కులము. తర్వాత మళ్లీ సూర్య వంశీయులు, చంద్ర వంశీయులుంటారు. బ్రాహ్మణులైన మీకు రాజ్యము లేదు. ఇప్పుడు మీరు సంగమ యుగములో ఉన్నారు. కలియుగములో ఇప్పుడు రాజ్యమే లేదు. ఏవో కొన్ని రాజ్యాలు మిగిలి ఉన్నాయి. పూర్తిగా లేకుండా ఎప్పుడూ ఉండదు. ఇప్పుడు మీరిలా తయారయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. ఆత్మలైన మనమంతా భాయి-భాయి. వారు మన తండ్రి. తండ్రి చెప్తున్నారు - ఒకరినొకరు భాయి-భాయిగా చూడండి. మూడవ జ్ఞాన నేత్రము లభించింది. ఆత్మలైన మీరు ఎక్కడ నివసిస్తారు? సోదరుడైన ఆత్మ అడుగుతుంది. ''ఆత్మ ఎచ్చట ఉంటుంది? '' భృకుటిలో ఉంటుందని చెప్తారు. ఇది సాధారణ విషయమే. ఒక్క తండ్రి తప్ప ఏమీ గుర్తు రాకూడదు. చివరి సమయములో ఇటువంటి తండ్రి స్మృతిలోనే శరీరమును వదలాలి. ఈ అభ్యాసము పక్కాగా చేసుకోవాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. సత్యయుగములో ఫస్ట్‌క్లాస్‌ అయిన సుందర శరీరమును ప్రాప్తి చేసుకునేందుకు ఇప్పుడే ఆత్మను పావనంగా చేసుకోవాలి. తుప్పును వదిలించేయాలి. కృత్రిమ ఫ్యాషన్లు చేసుకోరాదు.

2. సదా పవిత్రంగా అయ్యేందుకు ఒక్క తండ్రి తప్ప ఇతరమేదీ స్మృతి రాకుండా ఉండేందుకు అభ్యాసము చేయాలి. ఈ దేహమును కూడా మర్చిపోవాలి. భాయి-భాయి(సోదర) దృష్టి పక్కాగా ఉండాలి.

వరదానము :-

'' దృఢ సంకల్పమనే వ్రతము ద్వారా వృత్తులను పరివర్తన చేసుకొను మహాన్‌ ఆత్మా భవ ''

మహాన్‌గా(ఉన్నతంగా) అయ్యేందుకు ఆధారము పవిత్రత. ఈ పవిత్రత వ్రతాన్ని ప్రతిజ్ఞ రూపంలో ధారణ చేయడమంటే మహాన్‌ ఆత్మగా అవ్వడం. ఏదైనా దృఢ సంకల్పమనే వ్రతము వృత్తిని మార్చేస్తుంది. పవిత్రతా వ్రతము తీసుకోవడం అనగా మీ వృత్తిని శ్రేష్ఠంగా చేసుకోవడం. వ్రతముంచుకోవడం అనగా స్థూలంగా పథ్యముండుట, మనసులో గట్టి సంకల్పము తీసుకొనుట. ఇప్పుడు పవిత్రంగా అయ్యే వ్రతము తీసుకున్నారు. తద్వారా మనమంతా సోదర ఆత్మలము అనే వృత్తిని తయారు చేసుకున్నారు. ఈ వృత్తి ద్వారా బ్రాహ్మణులైన మీరు మహాన్‌ ఆత్మలుగా అయ్యారు.

స్లోగన్‌ :-

'' వ్యర్థము నుండి రక్షించుకోవాలంటే నోటి పై దృఢ సంకల్పమనే బటన్‌ ధరించండి ''