13-02-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - సదా తండ్రిని స్మృతి చేయాలనే చింతన మరియు జ్ఞాన విచార సాగర మథనము చేసినట్లైతే, కొత్త కొత్త పాయింట్లు వెలువడుతూ ఉంటాయి, మీరు ఖుషీగా ఉంటారు''
ప్రశ్న :-
ఈ నాటకములో అన్నిటికంటే గొప్ప అద్భుతము ఎవరిది మరియు ఎందుకు ?
జవాబు :-
అందరికంటే గొప్ప అద్భుతము శివబాబాది, ఎందుకంటే వారు మిమ్ములను క్షణములో రాకుమార - రాకుమారీలు(దేవతలు, దేవకన్యలు)గా తయారుచేస్తారు. వారు మీకు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే చదువును చదివిస్తారు. ప్రపంచములో ఈ విధమైన చదువును తండ్రి తప్ప ఇంకెవ్వరూ చదివించలేరు. 2. జ్ఞాన మూడవ నేత్రమునిచ్చి అంధకారము నుండి ప్రకాశములోకి తీసుకు రావడం, మోసపోవుట నుండి రక్షించడం ఇది తండ్రి పనే. అందువల్ల వారి వలె అద్భుతమైన, ఆశ్చర్యకరమైన కార్యమును ఇంకెవ్వరూ చేయలేరు.
ఓంశాంతి.
ఆత్మిక తండ్రి ప్రతి రోజూ పిల్లలకు అర్థం చేయిస్తారు, పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి ద్వారా వింటారు. తండ్రి ఎలాగైతే గుప్తంగా ఉన్నారో, అలా వారి జ్ఞానము కూడా గుప్తమైనది. ఆత్మ అనగానేమి, పరమపిత పరమాత్మ అనగానేమో ఎవ్వరికి అర్థము కాదు. మేము ఆత్మలము అనేది పిల్లలైన మీకు పక్కాగా అలవాటైపోవాలి. ఆత్మలైన మనకు తండ్రి వినిపిస్తున్నారు. దీనిని బుద్ధి ద్వారా అర్థము చేసుకొని కర్తవ్యములోకి రావాలి. ఇక వ్యాపారాలు మొదలైనవి చేసుకోవలసిందే. ఎవరైనా పిలిచినట్లైతే తప్పకుండా పేరు పెట్టే పిలుస్తారు కదా. నామ-రూపాలు ఉన్నాయి కనుక మాట్లాడగలరు, ఏమైనా చేయగలరు. కేవలం నేను ఒక ఆత్మను అన్నది పక్కా చేసుకోవాలి. మహిమంతా ఆ నిరాకారునిదే. ఒకవేళ సాకారములో దేవతల మహిమ ఉన్నట్లైతే వారిని కూడా ఆ మహిమకు యోగ్యులుగా చేసింది ఆ తండ్రియే. మహిమకు యోగ్యులుగా ఉండేవారు ఇప్పుడు మళ్లీ తండ్రి మహిమా యోగ్యులుగా చేస్తున్నారు. అందువల్లనే నిరాకారునికే మహిమ ఉంది. తండ్రికి ఎంతటి మహిమ ఉంది! వారి సేవ ఎంతగా ఉంది! అని విచారము చేయబడ్తుంది. వారు సర్వ సమర్థులు. వారు అన్నీ చేయగలరు. మనము చాలా తక్కువగానే మహిమ చేస్తాము. కాని వారికి చాలా మహిమ ఉంది. ముసల్మానులు కూడా అల్లాహ్ మియానే ఐసే ఫర్మాయా(భగవంతుడు ఈ విధంగా ఆజ్ఞాపించారు) అని అంటారు. మరి ఇప్పుడు ఎవరిని ఆజ్ఞాపించారు? పిల్లలనే ఆజ్ఞాపిస్తారు. తద్వారా మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. అల్లాహ్ మియా ఎవరి ద్వారానో ఆజ్ఞాపించి ఉంటారు కదా. పిల్లలైన మీకే వారు అర్థము చేయిస్తారు. దానిని గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు. ఇప్పుడు మీకు అంతా తెలిసింది. తర్వాత ఈ జ్ఞానము ప్రాయ: లోపమైపోతుంది. బౌద్ధ మతము వారు, క్రైస్తవులు కూడా ఇలాగే చెప్తారు. కాని ఏమని ఆజ్ఞాపించారో అది ఎవ్వరికీ తెలియదు. తండ్రి పిల్లలైన మీకు అల్ఫ్ మరియు బే(తండ్రి మరియు తండ్రి ఇచ్చే ఆస్తి)లను గురించి అర్థం చేయిస్తున్నారు. ఆత్మ తండ్రి స్మృతిని మర్చిపోలేదు. ఆత్మ అవినాశి కనుక స్మృతి కూడా అవినాశిగా ఉంటుంది. తండ్రి కూడా అవినాశియే. అల్లాహ్ మియా ఈ విధంగా అన్నారని పాట పాడ్తారు అయితే వారెవరు, వారు ఏమి చెప్పారు? ఇది ఏ మాత్రము తెలియదు. అల్లాహ్ మియాను రాళ్ళు-రప్పలలో ఉన్నాడని చెప్తారు. మరి అలాంటప్పుడు ఇక వారిని గురించి ఏమి తెలుసుకోగలరు? భక్తిమార్గములో ప్రార్థిస్తారు. ఈ సృష్టిలోకి వచ్చినవారందరూ సతో, రజో, తమోలలోకి రావలసిందేనని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఏసుక్రీస్తు, బుద్ధుడు మొదలైనవారు ఎవరైతే వస్తారో వారి వెనుక వారి ధర్మము వారు కూడా క్రిందకు దిగాల్సిందే. పైకి ఎక్కే మాటే లేదు. తండ్రియే వచ్చి అందరినీ పైకి ఎత్తుతారు. సర్వుల సద్గతిదాత ఒక్కరే. ఇంకెవ్వరూ సద్గతిని కలుగజేసేందుకు రారు. క్రీస్తు వచ్చాడనుకోండి. కూర్చుని ఎవరికి అర్థము చేయుస్తాడు? ఈ విషయాలను అర్థము చేసుకునేందుకు మంచి బుద్ధి కావాలి. కొత్త కొత్త యుక్తులు వెలికి తీయాలి. శ్రమ చేసి రత్నాలను వెలికి తీయాలి. అందుకే బాబా విచార సాగర మథనము చేసి వ్రాయండి, తర్వాత మీరు వ్రాసిన దానిలో ఏ ఏ అంశాలు వదిలి వేయబడినవో చదివి చూడండి. తండ్రి పాత్ర ఏదైతే ఉందో అది నడుస్తూనే ఉంటుంది. తండ్రి కల్పము క్రిందటి జ్ఞానాన్ని వినిపిస్తారు. ధర్మ స్థాపన చేసేందుకు వచ్చినవారి వెనుక వారి ధర్మము వారు కూడా క్రిందకు దిగాలని మీకు తెలుసు. వారు ఎవరినైనా పైకి ఎలా తీసుకెళ్లగలరు? మెట్లు క్రిందకు దిగవలసిందే. మొదట సుఖము తర్వాత దు:ఖము ఉంటుంది. ఈ నాటకము చాలా ఫైన్గా(బాగా) తయారు చేయబడింది. విచార సాగర మథనము చేయవలసిన అవసరముంది. వారు(ధర్మ స్థాపకులు) ఎవ్వరికీ సద్గతిని కలుగచేసేందుకు రారు. వారు కేవలం ధర్మస్థాపన చేసేందుకే వస్తారు. జ్ఞాన సాగరుడు ఒక్కరే. ఇంకెవ్వరిలోనూ జ్ఞానము లేదు. డ్రామాలో సుఖ-దు:ఖాల ఆట అయితే అందరి కొరకు ఉంది. దు:ఖము కంటే సుఖము ఎక్కువగా ఉంటుంది. నాటకములో పాత్రను అభినయిస్తున్నారంటే తప్పకుండా సుఖము ఉండాలి కదా! తండ్రి ఎక్కడైనా దు:ఖమును స్థాపన చేస్తారా? తండ్రి అయితే అందరికీ సుఖాన్నిస్తారు. అప్పుడు విశ్వములో శాంతి స్థాపన జరుగుతుంది. దు:ఖధామములో శాంతి ఉండజాలదు. వాపస్ శాంతిధామములోకి వెళ్లినప్పుడే శాంతి లభిస్తుంది.
తండ్రి కూర్చుని అర్థము చేయిస్తున్నారు. మనము బాబా జతలో ఉన్నాము. అసురుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు బాబా వచ్చారని ఎప్పుడూ మర్చిపోరాదు. ఈ దేవతలు సద్గతిలో ఉన్నప్పుడు మిగిలిన ఆత్మలందరూ మూలవతనములో ఉంటారు. నాటకములో అందరికంటే గొప్ప అద్భుతము బేహద్ తండ్రిది. వారు మిమ్ములను రాకుమార-రాకుమారీలుగా తయారుచేస్తారు. చదువు ద్వారా మీరు దేవకన్యలుగా(పరీలుగా) అవుతారు. భక్తిమార్గములో ఏమీ అర్థము చేసుకోరు. కేవలం మాలను తిప్పుతూ ఉంటారు. కొందరు హనుమంతుని స్మృతి చేస్తే, ఇంకొందరు మరొకరిని స్మృతి చేస్తారు. మరి వారిని స్మృతి చేసినందున లాభమేముంది? బాబా మహారథి అని అన్నారు. వారు ఏనుగు పై సవారీ చేస్తున్నట్లు చూపించారు. ఈ విషయాలన్నీ తండ్రియే అర్థం చేయిస్తారు. గొప్ప గొప్ప వ్యక్తులు ఎక్కడికైనా వెళ్ళినట్లైతే వారికి ఎంతగానో స్వాగత సత్కారాలు(శోభాయాత్రలు) మొదలైనవి చేస్తారు. మీరు ఆ విధంగా ఎవ్వరికీ జరపరు. ఈ సమయములో వృక్షమంతా శిథిలావస్థలో ఉందని మీకు తెలుసు. విషము నుండి జన్మిస్తున్నారు. సత్యయుగములో విషము మాటే ఉండదని మీకు ఫీలింగ్ రావాలి. నేను మిమ్ములను పదమాపదమ్ పతులుగా చేస్తానని తండ్రి చెప్తున్నారు. సుదాముడు పదమాపదమ్పతిగా అయ్యాడు కదా. అందరూ తమ కొరకే చేసుకుంటారు. ఈ చదువు నుండి మీరు ఎంతో ఉన్నతంగా తయారవుతారని తండ్రి చెప్తున్నారు. ఆ గీతను అందరూ వింటారు, చదువుతారు. ఇతడు కూడా చదివేవాడు కాని తండ్రి కూర్చుని వినిపించగానే ఆశ్చర్యపోయాడు. తండ్రి వినిపించిన గీత ద్వారా సద్గతి లభించింది. ఈ మనుష్యులు కూర్చుని ఏమేమో తయారుచేశారు. అల్లాహ్ మియా ఇలా అన్నాడని అంటారు కాని అల్లాహ్ ఎవరు? అనేది ఏ మాత్రము అర్థము చేసుకోరు. దేవీ దేవతా ధర్మము వారికే భగవంతుని గురించి తెలియదంటే ఇక వెనుక వచ్చిన వారికేం తెలుస్తుంది? సర్వశాస్త్ర శిరోమణి భగవద్గీతలోనే పొరపాటు చేసేశారంటే ఇక మిగిలిన శాస్త్రాలలో ఇంకేముంటుంది? తండ్రి పిల్లలైన మనకు ఏది వినిపించారో అది ప్రాయ: లోపమైపోయింది. ఇప్పుడు మీరు తండ్రి నుండి విని దేవతలుగా అవుతున్నారు. పాత ప్రపంచ లెక్కాచారమునైతే అందరూ సమాప్తము చేసుకోవాల్సిందే. తర్వాత ఆత్మ పవిత్రంగా తయారైపోతుంది. వారికి కూడా కొంత లెక్కాచారము మిగిలి ఉంటే అది సమాప్తమైపోతుంది. మనమే మొట్టమొదట వెళ్తాము. మళ్లీ మొట్టమొదట మనమే వస్తాము. మిగిలిన వారందరూ శిక్షలు అనుభవించి లెక్కాచారాన్ని సమాప్తము చేసుకుంటారు. ఈ విషయాలలోకి ఎక్కువగా వెళ్లకండి. మొదట సర్వుల సద్గతిదాత తండ్రి అని నిశ్చయం చేయించండి. టీచరు, గురువు కూడా ఆ తండ్రి ఒక్కరే. వారు ఆశరీరి. ఆ ఆత్మలో ఎంతటి జ్ఞానముంది! వారు జ్ఞానసాగరులు, సుఖసాగరులు. వారికి ఎంత మహిమ ఉంది! వారు కూడా ఆత్మయే. ఆత్మయే వచ్చి శరీరములోకి ప్రవేశిస్తుంది. పరమపిత పరమాత్మను తప్ప ఇక ఏ ఆత్మనూ మహిమ చేయరాదు. మిగిలినవారందరూ శరీరధారులను మహిమ చేస్తారు. వీరు సుప్రీమ్ ఆత్మ(పరమ ఆత్మ) శరీరము లేకుండా ఆత్మకు మాత్రమే మహిమ జరుగడం కేవలం ఒక్క నిరాకార తండ్రికి తప్ప ఇంకెవ్వరికీ జరగదు. ఆత్మలోనే జ్ఞాన సంస్కారముంది. తండ్రిలో ఎంతటి జ్ఞాన సంస్కారముంది! ప్రేమసాగరులు, జ్ఞానసాగరులు.......... ఇది ఆత్మ మహిమనా? ఏ మనుష్యులకు ఈ మహిమ ఉండజాలదు. కృష్ణుని మహిమ కాజాలదు. అతడు మొదటి నంబరు రాకుమారుడు. తండ్రిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. వారు వచ్చి పిల్లలకు వారసత్వమును ఇస్తారు. అందుకే వారి మహిమ చేయబడ్తుంది. శివజయంతి వజ్ర తుల్యమైనది. ధర్మస్థాపకులు వస్తారు. మరి వారేం చేస్తారు? క్రీస్తు వచ్చిన సమయములో క్రిస్టియనులైతే ఉండరు కదా. ఎవరికి ఏ జ్ఞానమును ఇస్తారు? మహా అంటే మంచిగా నడుచుకోండి(మంచి ప్రవర్తనను కలిగి ఉండండి) అని చెప్పవచ్చు. ఇలా చాలా మంది మనుష్యులు చెప్తూనే ఉంటారు. సద్గతినిచ్చే జ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. ధర్మ స్థాపకులకు వారి వారి పాత్రలు లభించాయి. సతో, రజో, తమోలలోకి రావలసిందే. వారు రావటంతోటే క్రిస్టియన్ల చర్చి ఎలా నిర్మించబడ్తుంది? చాలామంది అయినప్పుడు, భక్తి ప్రారంభమైనప్పుడు చర్చిలు నిర్మిస్తారు. వాటి నిర్మాణము కొరకు చాలా ధనము కావాలి. యుద్ధానికి కూడా చాలా ధనము అవసరము. ఇది మనుష్యసృష్టి వృక్షమని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఎప్పుడైనా లక్షల సంవత్సరాల వృక్షము ఉంటుందా? లెక్క కుదరదు. తండ్రి చెప్తున్నారు - ఓ పిల్లలారా! మీరు ఎంత తెలివిహీనులుగా అయిపోయారు! ఇప్పుడు మీరు వివేకవంతులుగా అవుతున్నారు. మొదటే రాజ్యము చేసేందుకు తయారై వస్తారు. వారు(ధర్మస్థాపకులు) ఒంటరిగా వస్తారు. ఆ తర్వాత వృద్ధి జరుగుతుంది. వృక్షానికి పునాది దేవీ దేవతా ధర్మము. దాని నుండి 3 శాఖలు వెలువడ్తాయి. తర్వాత చిన్న-చిన్న మఠాలు - మార్గాలు వస్తాయి. వృద్ధి చెందుతుంది. తర్వాత వారికి కొంత మహిమ జరుగుతుంది. కాని దాని వల్ల లాభమేమీ లేదు. అందరూ క్రిందికి రావాల్సిందే. మీకు ఇప్పుడు సంపూర్ణ జ్ఞానము లభిస్తూ ఉంది. గాడ్ ఈజ్ నాలెడ్జ్ఫుల్ అని అంటారు. కాని జ్ఞానమంటే ఏమిటో ఎవ్వరికీ తెలియదు. మీకు ఇప్పుడు జ్ఞానము లభిస్తూ ఉంది. భాగ్యశాలీ రథమైతే తప్పకుండా కావాలి. తండ్రి సాధారణ తనువులో వస్తారు. అప్పుడు ఇతడు భాగ్యశాలిగా అవుతాడు. సత్యయుగములో అందరూ పదమాపదమ్ భాగ్యశాలురుగా ఉంటారు. ఇప్పుడు మీకు జ్ఞాన మూడవ నేత్రము లభిస్తుంది. వీటి ద్వారా మీరు లక్ష్మీ నారాయణుల వలె అవుతారు. జ్ఞానము ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. భక్తిలో అయితే మోసపోతూ ఉంటారు. అంతా అంధకారమే. జ్ఞానము పగలు. పగటిపూట మోసపోరు. ఇంట్లో భలే గీతాపాఠశాలను తెరవండని తండ్రి చెప్తున్నారు. మేము ఈ జ్ఞానాన్ని తీసుకోము కాని ఇతరుల కొరకు స్థానము కల్పిస్తామని అనేవారు చాలామంది ఉన్నారు. ఇది కూడా మంచిదే.
ఇక్కడ చాలా సైలెన్స్గా ఉండాలి. ఇది అత్యంత పవిత్రమైన తరగతి(హోలియెస్ట్ ఆఫ్ హోలీ క్లాస్). ఇక్కడ మీరు శాంతిగా తండ్రిని స్మృతి చేస్తారు. ఇప్పుడు మనము శాంతిధామానికి వెళ్లాలి. అందువలన తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయాలి. సత్యయుగములో 21 జన్మలకు మీరు సుఖ-శాంతులు రెండింటిని పొందుతారు. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేవారు, కనుక ఆ విధమైన తండ్రిని అనుసరించాలి. అహంకారములోకి రాకూడదు. అది క్రింద పడేస్తుంది. చాలా ఓర్పుతో కూడిన స్థితి ఉండాలి. హఠము చేయరాదు. దేహ అభిమానాన్ని హఠము అని అంటారు. చాలా మధురంగా తయారవ్వాలి. దేవతలు ఎంత మధురమైనవారు! వారిలో ఎంత ఆకర్షణ ఉంటుంది! తండ్రి మిమ్ములను ఆ విధంగా తయారుచేస్తారు. మరి అటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి! పిల్లలు ఈ విషయాలను పలుమార్లు స్మరణ చేసుకుంటూ హర్షితంగా ఉండాలి. ఇతనికైతే తాను శరీరాన్ని వదిలి వెళ్లి ఇలా(లక్ష్మీనారాయణ) తయారౌతానని నిశ్చయముంది. లక్ష్యము-ఉద్ధేశ్యము గల చిత్రమును మొట్టమొదట చూడాలి. అక్కడ చదివించేవారు దేహధారి టీచర్లు. ఇక్కడ చదివించేవారు నిరాకార తండ్రి. వారు ఆత్మలనే చదివిస్తారు. ఇలా చింతన చేసిన వెంటనే ఖుషీ కలుగుతుంది. ఇతనికి బ్రహ్మా సో విష్ణు, విష్ణు సో బ్రహ్మాగా తయారవుతాననే నషా ఉండి ఉండవచ్చు. ఈ అద్భుతమైన విషయాలను మీరే విని ధారణ చేసి తర్వాత ఇతరులకు వినిపిస్తారు. తండ్రి అయితే అందరినీ విశ్వానికి అధిపతులుగా చేస్తారు. కాని ఎవరెవరు రాజ్యపదవికి యోగ్యులుగా అవుతారో తెలుసుకోవచ్చు. పిల్లలను ఉన్నతంగా తయారుచేయడం తండ్రి కర్తవ్యము. తండ్రి అందరినీ విశ్వాధిపతులుగా చేస్తారు. నేను విశ్వాధికారిగా అవ్వనని తండ్రి అంటారు. తండ్రియే(శివబాబాయే) కూర్చుని ఈ నోటి ద్వారా జ్ఞానము వినిపిస్తున్నారు. ఆకాశవాణి అని అంటారే కాని దాని అర్థము తెలియదు. తండ్రి పై నుండి వచ్చి ఈ గోముఖము ద్వారా వినిపిస్తారు. ఇదే సత్యమైన ఆకాశవాణి. ఈ నోటి ద్వారా వాణి వెలువడ్తుంది.
పిల్లలు చాలా మధురంగా ఉంటారు. బాబా ఈ రోజు టోలి తినిపించండి అని అడుగుతారు. చాలా మధురమైన పిల్లలు కదా. మంచి పిల్లలు - మేము పిల్లలమే కాక సేవకులు(సర్వెంట్స్) కూడా అని అంటారు. పిల్లలను చూసి బాబాకు చాలా ఖుషీ కలుగుతుంది. సమయము చాలా తక్కువగా ఉందని పిల్లలకు తెలుసు. ఇన్ని రకాల బాంబులు ఏవైతే తయారుచేశారో వాటిని అలాగే పారేస్తారా? కల్పము ముందు ఏమి జరిగిందో అదే మళ్లీ జరుగుతుంది. విశ్వములో శాంతి నెలకొనాలని భావిస్తారు. కాని అది సాధ్యము కాదు. మీరు విశ్వములో శాంతిస్థాపన చేస్తున్నారు. మీకే విశ్వ రాజ్యభాగ్య బహుమతి లభిస్తుంది. ఈ బహుమతిని ఇచ్చేవారు తండ్రి. యోగబలము ద్వారా మీరు విశ్వ రాజ్యభాగ్యమును తీసుకుంటారు. శారీరిక బలముతో విశ్వము వినాశనమవుతుంది. సైలెన్స్ ద్వారా మీరు విజయము పొందుతారు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మీ అవస్థను చాలా ధైర్యముతో కూడినదిగా(స్థిరంగా) తయారు చేసుకోవాలి. తండ్రిని అనుసరించాలి. ఏ విషయములోనూ అహంకారము చూపరాదు. దేవతల వలె మధురంగా అవ్వాలి.
2. సదా హర్షితంగా ఉండేందుకు జ్ఞాన స్మరణ చేస్తూ ఉండండి. విచార సాగర మథనము చేయండి. మనము భగవంతుని పిల్లలమూ, సేవకులము కూడా. ఈ స్మృతితో సేవలో తత్పరులై ఉండండి.
వరదానము :-
''ప్రతి ఘడియను అంతిమ ఘడియగా భావించి సదా ఆనందంగా ఉండే విశేష ఆత్మా భవ''
సంగమ యుగము ఆత్మిక మజాలలో(ఆనందాలలో) ఉండే యుగము. అందువలన ప్రతి ఘడియ ఆత్మిక ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉండండి. ఎప్పుడూ ఎటువంటి పరిస్థితిలో గాని, పరీక్షలో గాని కన్ఫ్యూజ్ అవ్వకండి(తికమక పడకండి). ఎందుకంటే ఇది అకాల మృత్యువుల సమయము. ఒకవేళ కొద్ది సమయము ఆనందంగా ఉండేందుకు బదులు తికమక పడినప్పుడు అదే సమయంలో అంతిమ ఘడియ వచ్చేసిందంటే అంతమతి సో గతి ఏమవుతుంది? అందువలన ఎవర్రెడీగా ఉండే పాఠము చదివించబడ్తుంది. ఒక సెకండు కూడా మోసము చేసే సమయంగా అవ్వవచ్చు. అందువలన స్వయాన్ని విశేష ఆత్మగా భావించి ప్రతి సంకల్పము, మాట, కర్మలు చేయండి, సదా ఆత్మిక ఆనందంలో ఉండండి.
స్లోగన్ :-
''స్థిరంగా అవ్వాలంటే వ్యర్థాన్ని, అశుభాన్ని సమాప్తం చేయండి.''