25-06-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - మీరు భగవంతుని పిల్లల నుండి రాకుమారులుగా (సాహెబ్జాదే సో శహజాదే) అవ్వనున్నారు. మీరు ఏ వస్తువు పయిన కోరిక ఉంచుకోరాదు, ఎవ్వరినీ ఏమీ యాచించరాదు ''
ప్రశ్న :-
ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకునేందుకు ఏ ఆధారము అవసరం లేదు?
జవాబు :-
వైభవాల ఆధారముతో ఆరోగ్యము బాగుంటుందని కొంతమంది పిల్లలు భావిస్తారు. కానీ బాబా అంటున్నారు - పిల్లలారా, ఇక్కడ మీరు వైభవాల పై కోరిక ఉంచుకోరాదు. వైభవాల వలన ఆరోగ్యము బాగుపడదు. ఆరోగ్యాన్ని బాగా ఉంచుకునేందుకు స్మృతియాత్ర అవసరము. సంతోషము వంటి ఔషధము(ఖుషీ జైసా ఖురాక్) లేదని అంటారు. మీరు సంతోషంగా ఉండండి, నషాలో ఉండండి, దధీచి ఋషి వలె యజ్ఞములో ఎముకలు అరిగిపోవునట్లు సేవ చేస్తే ఆరోగ్యము బాగుపడ్తుంది.
ఓంశాంతి.
తండ్రిని చేసి చేయించేవారు(కరన్ కరావన్హార్) అని అంటారు. మీరు భగవంతుని పిల్లలు. ఈ సృష్టిలో మీకు అత్యంత ఉన్నతమైన స్థానము లేక పొజిషన్ ఉంది. మేము భగవంతుని పిల్లలము, వారి మతమును అనుసరించి ఇప్పుడు మళ్లీ రాజ్య భాగ్యాన్ని స్థాపన చేస్తున్నామనే నషా పిల్లలైన మీకు ఉండాలి. ఇది కూడా కొంతమంది బుద్ధిలో ఉండదు. బాబా అన్ని సేవాకేంద్రాలలోని పిల్లలందరికీ చెప్త్తున్నారు. అనేక సేవాకేంద్రాలున్నాయి. అనేకమంది పిల్లలు వస్తారు. మనము బాబా శ్రీమతమును అనుసరిస్తూ మళ్లీ సుఖ-శాంతుల రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని ప్రతి ఒక్కరి బుద్ధిలో సదా గుర్తుండాలి. సుఖము, శాంతి ఈ రెండు పదాలే బాగా గుర్తుంచుకోవాలి. పిల్లలైన మీకు ఇప్పుడు ఎంత జ్ఞానము లభిస్తుంది. మీ బుద్ధి చాలా విశాలంగా ఉండాలి. ఇందులో సంకుచిత బుద్ధిగలవారు కొనసాగలేరు. స్వయాన్ని భగవంతుని పిల్లలమని(సాహెబ్జాదే) భావిస్తే పాపాలు సమాప్తమైపోతాయి. పూర్తి రోజంతా తండ్రి స్మృతి లేనివారు చాలామంది ఉన్నారు. మీ బుద్ధి ఎందుకు మొద్దుబారిపోతుంది? అని బాబా అడుగుతున్నారు. మనము శ్రీమతమును అనుసరించి విశ్వములో దైవీ రాజ్యస్థాపన చేస్తున్నామనే విషయం బుద్ధిలో లేనే లేని పిల్లలు సేవాకేంద్రాలకు వస్తూ ఉంటారు. ఆంతరికములో ఆ నషా, గర్వము ఉండాలి. మురళీ వింటున్నప్పుడు సంతోషములో రోమాంచితమవ్వాలి. కానీ పిల్లలలో సంతోషము ఇంకా పడిపోవడం బాబా గమనిస్తున్నారు. చాలామంది పిల్లల బుద్ధిలో మేము శ్రీమతమును అనుసరిస్తూ బాబా స్మృతిలో వికర్మలు వినాశనము చేసుకొని మా రాజధానిని స్థాపన చేస్తున్నామనే స్మృతే ఉండదు. బాబా ప్రతి రోజూ అర్థం చేయిస్తున్నారు - పిల్లలారా! మీరు యోధులు, రావణుని పై విజయము పొందేవారు. తండ్రి మిమ్ములను మందిరాలకు అర్హులుగా చేస్తారు. కానీ పిల్లలకు ఇంత నషా లేక ఖుషీ ఉండదు. ఏదైనా వస్తువు లభించకపోతే వెంటనే అలుగుతారు. పిల్లల స్థితికి బాబా ఆశ్చర్యపడ్తారు. మాయ సంకెళ్ళలో చిక్కుకుంటారు. మీ గౌరవము, కార్యవ్యవహారము, సంతోషము అద్భుతంగా ఉండాలి. బంధు-మిత్రులను మరచిపోలేని వారెప్పుడూ తండ్రిని స్మృతి చేయలేరు. అటువంటివారు ఏ పదవిని పొందుతారు! ఆశ్చర్యమనిపిస్తుంది.
పిల్లలైన మీకు చాలా నషా ఉండాలి. స్వయాన్ని భగవంతుని సంతానమని భావిస్తే ఏదైనా అడగాలనే చింత కూడా ఉండదు. బాబా మనకు 21 జన్మల వరకు ఏమీ అడగవలసిన అవసరము లేనంతటి అపారమైన ఖజానాను ఇస్తున్నారు. ఇంతటి నషా ఉండాలి. కానీ పూర్తిగా మందబుద్ధి, సంకుచిత బుద్ధిగలవారిగా ఉన్నారు. పిల్లలైన మీ బుద్ధి 7 అడుగుల పొడవుండాలి. మనుష్యుల పొడవు ఎక్కువలో ఎక్కువ 6-7 అడుగులుంటుంది. బాబా పిల్లలను ఎంతో ఉత్సాహపరుస్తారు - మీరు భగవంతుని పిల్లలు, ప్రపంచములోని వారు కొంచెము కూడా అర్థము చేసుకోరు. మీరు వారికి ''మేము తండ్రి ముందు కూర్చుని ఉన్నామని భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే వికర్మలు వినాశనమవుతాయని తెలపండి.'' తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలారా, మాయ మీకు చాలా పెద్ద కఠినమైన శత్రువు. మీకు ఎంత పెద్ద శత్రువో, ఇతరులకు అంత పెద్ద శత్రువు కాదు. మనుష్యులు తుచ్ఛబుద్ధిగా ఉన్న కారణంగా మాయను శత్రువుగా తెలుసుకోలేరు. బాబా ప్రతి రోజూ పిల్లలైన మీతో చెప్తున్నారు - '' మీరు భగవంతుని పిల్లలు, తండ్రిని స్మృతి చేయండి. ఇతరులను మీ సమానంగా చేస్తూ ఉండండి.'' భగవంతుడు సత్యమైన సాహెబ్(ప్రభువు) అని, అందువలన మనము ఈశ్వరీయ సంతానమని మీరు అందరికీ అర్థం చేయించవచ్చు. మీరు నడుస్తూ, తిరుగుతూ బుద్ధిలో ఇదే గుర్తుండాలి. సేవలో దధీచి ఋషి వలె ఎముకలు సైతం ఇచ్చేయాలి. కానీ ఇక్కడ ఎముకలను ఇవ్వడం కాదు. ఇంకా అనేక సుఖాలు, వైభవాలు కావాలంటారు. వీటి ద్వారా ఆరోగ్యము బాగుపడదు. ఆరోగ్యము బాగుండాలంటే స్మృతియాత్ర చెయ్యాలి. మీలో ఆ సంతోషముండాలి. అరే! మనము కల్ప-కల్పము మాయతో ఓడిపోతూ వచ్చాము. ఇప్పుడు మాయ పై విజయము పొందుతాము. తండ్రి వచ్చి గెలిపిస్తారు. ఇప్పుడు భారతదేశములో ఎంతో దుఃఖముంది. అంతులేని దుఃఖమిచ్చేవాడు రావణుడు. విమానాలు, కార్లు, భవనాలు ఉన్నాయి కనుక ఇదే స్వర్గమని ప్రపంచములోని భావిస్తారు. ఇదంతా సమాప్తమైపోతుందని వారు భావించరు. లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి ఆనకట్టలు మొదలైనవి నిర్మిస్తారు. యుద్ధ సామగ్రి కూడా ఎంతో తీసుకుంటున్నారు. వాటితో ఒకరినొకరు సమాప్తము చేసుకుంటారు. అందరూ అనాథలుగా ఉన్నారు కదా. ఎన్ని యుద్ధాలు, జగడాలు చేస్తారంటే చెప్పనలవి కాదు. ఎంత మురికి పేరుకుపోయింది! దీనిని నరకమని అంటారు. స్వర్గానికి చాలా గొప్ప మహిమ ఉంది. బరోడా మహారాణిని, మహారాజు ఏమయ్యారని అడిగితే స్వర్గస్థులయ్యారని చెప్తుంది, కానీ స్వర్గమంటే ఏమిటో ఎవ్వరికీ తెలియదు. ఎంత గాఢాంధకారములో ఉన్నారు! మీరు కూడా గాఢాంధకారములో ఉండేవారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు - మీకు ఈశ్వరీయ బుద్ధిని ఇస్తున్నాను. స్వయాన్ని ఈశ్వరీయ సంతానమని, భగవంతుని సంతానమని భావించండి. రాకుమారులుగా తయారు చేసేందుకు సాహెబ్ చదివిస్తున్నారు. మేకలకు, గొఱ్ఱెలకు ఏమి అర్థమవుతుంది.......(రిఢ్ ఛా జానే..........) అని బాబా సామెత చెప్తున్నారు. మానవులందరూ మేకలు, గొఱ్ఱెల వలె ఉన్నారని, వారికి ఏమీ తెలియదని ఇప్పుడు మీకు తెలుసు. కూర్చుని ఏవేవో ఉదాహరణలు ఇస్తూ ఉంటారు. మీ బుద్ధిలో ఆదిమధ్యాంతాల రహస్యముంది. మనము విశ్వములో సుఖ-శాంతులను స్థాపన చేస్తున్నామని అనుకుంటూ మంచి రీతిగా స్మృతి చేయండి. ఎవరైతే సహాయకారులుగా అవుతారో వారే మంచి పదవిని పొందుతారు. ఎవరెవరు సహాయకులుగా అవుతారో కూడా మీరు చూస్తారు. మేము ఏమి చేస్తున్నామని, గొఱ్ఱెలు, మేకలుగా లేము కదా అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోండి. మనుష్యులలో ఎంత అహంకారముందో చూడండి. గుర్రు గుర్రుమంటూ ఉంటారు. మీకౖెెతే తండ్రి స్మృతి ఉండాలి. సర్వీసులో ఎముకలు సైతము ఇవ్వాలి. ఎవ్వరినీ విసుక్కోరాదు, స్వయం విసుగు చెందరాదు. అహంకారము కూడా ఉండరాదు. మేము ఇది చేస్తాము, మేము ఇంత తెలివైనవారమనే ఆలోచన రావడం కూడా దేహాభిమానమే. వారి నడవడికే సిగ్గుపడేలా అయిపోతుంది లేకుంటే మీలాంటి సుఖము ఇతరులెవ్వరికీ ఉండజాలదు. ఇది బుద్ధిలో గుర్తుంటే మీరు ప్రకాశిస్తూ ఉంటారు. సేవాకేంద్రములో కొంతమంది మహారథులు, కొంతమంది ఆశ్వారూఢులు, కొంతమంది నడిచేవారు కూడా ఉన్నారు. ఇందులో బుద్ధి చాలా విశాలంగా ఉండాలి. రకరకాల బ్రాహ్మణీలు కూడా ఉన్నారు. కొంతమంది చాలా మంచి సహాయకారులుగా ఉన్నారు. సేవలో ఎంత సంతోషముంటుంది! మీకు నషా పెరగాలి. సేవ చేయకుంటే ఏ పదవి పొందుతారు? మాతా-పితలకు పిల్లల పై గౌరవముంటుంది. అయితే పిల్లలు స్వయం తమను తాము గౌరవించుకోరు. దానికి బాబా ఏం చేస్తారు?
పిల్లలైన మీరు అందరికీ క్లుప్తంగా తండ్రి సందేశమును ఇవ్వాలి. తండ్రి ''మన్మనాభ '' అని అంటున్నారని అందరికీ చెప్పండి. గీతలో పిండిలో ఉప్పు వలె కొన్ని వాక్యాలు మాత్రము ఉన్నాయి. ఈ ప్రపంచము ఎంత పెద్దదిగా ఉందో బుద్ధిలోకి రావాలి. ఇది ఎంత పెద్ద ప్రపంచము! ఎంతమంది మనుష్యులు ఉన్నారు, తర్వాత ఇవేమీ ఉండవు. ఏ ఖండానికి నామ-రూపాలు కూడా ఉండవు. మనము స్వర్గానికి అధికారులుగా అవుతాము. రాత్రింబవళ్లు ఇదే సంతోషముండాలి. జ్ఞానమైతే చాలా సులభము. అర్థం చేయించువారు చాలా తెలివిగలవారుగా, రమణీకంగా ఉండాలి. అనేక రకాల యుక్తులున్నాయి. నేను మిమ్ములను చాలా హుందాగా(డిప్లోమాట్) తయారు చేస్తాను. వారు రాయబారులను డిప్లామాట్లు(దౌత్యప్రతినిధి) అని అంటారు. అహో! అనంతమైన తండ్రి మాకు ఆదేశమిస్తున్నారని పిల్లలైన మీ బుద్ధిలో గుర్తుంచుకోవాలి. మీరు ధారణ చేసి ఇతరులకు కూడా తండ్రి పరిచయమునిస్తారు. మీరు తప్ప మిగిలిన ప్రపంచమంతా నాస్తికులుగా ఉన్నారు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. కొంతమంది నాస్తికులు కూడా ఉన్నారు కదా. తండ్రిని స్మృతే చేయరు. వారే స్వయంగా '' బాబా మేము మీ స్మృతిని మర్చిపోతాము '' అని అంటారు. కనుక వారు నాస్తికులే కదా. ఏ తండ్రి అయితే ఈశ్వరీయ సంతానంగా చేస్తారో ఆ తండ్రే గుర్తుకు రారు! ఇది అర్థము చేసుకునేందుకు కూడా బుద్ధి చాలా విశాలంగా ఉండాలి. నేను ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వస్తానని తండ్రి తెలిపిస్తున్నారు. మీ ద్వారానే కార్యము చేయిస్తాను. మీరు ఎంతో మంచి యోధులు(వారియర్స్ ). మిమ్ములను వందేమాతరమ్ అని మహిమ చేస్తారు. మీరే పూజ్యులుగా ఉండి మళ్లీ పూజారులుగా అయ్యారు. ఇప్పుడు శ్రీమతము ద్వారా మళ్లీ పూజ్యులుగా అవుతున్నారు. అందువలన పిల్లలైన మీరు చాలా శాంతిగా సేవ చేయాలి. మీరు ఎప్పుడూ అశాంతి చెందరాదు. నరనరాలలో భూతము నిండి ఉండేవారు ఏ పదవి పొందుతారు? లోభము కూడా చాలా పెద్ద భూతమే. ప్రతి ఒక్కరి నడవడిక ఎలా ఉందో బాబా గమనమిస్తూ ఉంటారు. బాబా ఎంతో నషా ఎక్కిస్తూ ఉంటారు. కొంతమంది సేవ చేయరు. కేవలం తింటూ, తిరుగుతూ ఉంటారు. తర్వాత వారు 21 జన్మలు సేవ చేయవలసి వస్తుంది. దాస-దాసీలుగా కూడా అవుతారు కదా. చివరిలో అందరికీ సాక్షాత్కారమవుతుంది. సేవాధారీ పిల్లలే బాబా హృదయమును అధిరోహిస్తారు. ఇతరులను అమరలోకవాసులుగా చేయడమే మీ సర్వీసు. బాబా చాలా ధైర్యమునిప్పిస్తారు, ధారణ చేయండి అని అంటారు. కానీ దేహాభిమానములో ఉన్నవారు ధారణ చేయలేరు. తండ్రిని స్మృతి చేసి మనము వేశ్యాలయము నుండి శివాలయానికి వెళ్తామని మీకు తెలుసు. అందువలన మనము అలా తయారై చూపించాలి.
బాబా అప్పుడప్పుడు జాబులలో వ్రాస్తారు - '' ప్రియమైన ఆత్మిక భగవంతుని పిల్లలారా, ఇప్పుడు శ్రీమతమును అనుసరిస్తే మహారథులుగా అవుతారు.'' దాని వలన తప్పకుండా రాకుమారులుగా అవుతారు. మీ లక్ష్యము కూడా ఇదే. ఒక్క సత్యమైన తండ్రి మాత్రమే మీకు అన్ని విషయాలు బాగా అర్థం చేయిస్తున్నారు - సేవ చేసి ఇతరుల కళ్యాణము కూడా చేస్తూ ఉండండి. యోగబలము లేకుంటే ఇది కావాలి, అది కావాలి అనే కోరికలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. అంత సంతోషముండదు. సంతోషము వంటి మంచి ఔషధము లేదని అంటారు కదా. భగవంతుని పిల్లలకు చాలా సంతోషముండాలి. అది లేకుంటే అనేక రకాల విషయాలు వస్తాయి. అరే! తండ్రి విశ్వ చక్రవర్తి పదవిని ఇస్తున్నారు. మీకు ఇంకేం కావాలి. ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ఇంత మధురమైన బాబాకు మేము ఎంత సేవ చేస్తున్నాము? అని ప్రశ్నించుకోండి. తండ్రి చెప్తున్నారు - సాహెబ్ (ప్రభువు) వచ్చి ఉన్నారని అందరికీ సందేశమిస్తూ ఉండండి. వాస్తవానికి మీరందరూ సోదరులే. భలే మేమంతా సోదరులము(భాయి - భాయి), సోదరులు ఒకరికొకరు సహాయము చేసుకోవాలి అని అంటారు. ఈ భావనతో సోదరులమని అంటారు. ఇక్కడ బాబా చెప్తున్నారు - మీరంతా ఒకే తండ్రి పిల్లలు, సోదరులు. తండ్రి స్వర్గస్థాపన చేసేవారు. పిల్లల ద్వారా స్వర్గమును తయారు చేస్తారు. సేవ కొరకు యుక్తులైతే చాలా తెలిపిస్తారు. బంధు-మిత్రులకు కూడా అర్థం చేయించాలి. విదేశాలలో ఉన్న పిల్లలు కూడా సేవ చేస్తున్నారు. రోజురోజుకు వచ్చే ఆపదలను చూసి జనులు మరణించేందుకు ముందే వారసత్వము తీసుకోవాలని భావిస్తారు. పిల్లలు తమ బంధు-మిత్రులను కూడా ఉన్నతము చేస్తున్నారు. పవిత్రంగా కూడా ఉంటారు. పోతే నిరంతరము సోదర స్థితిలో ఉండడం కష్టంగా ఉంది. తండ్రి అయితే పిల్లలకు ఈశ్వరీయ సంతానమనే(సాహెబ్జాదే) ఎంతో మంచి బిరుదును ఇచ్చేశారు. సేవ చేయకుంటే నాకు ఏ పదవి లభిస్తుంది? అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. సేవ చేయకుంటే నేను ఏమవుతాను అని ప్రశ్నించుకోండి. ఒకవేళ ఏదైనా జమ చేసుకొని ఉంటే అది తింటూ-తింటూ సమాప్తమైపోయింది. అంతేకాక ఇంకా నా ఖాతాలో బరువెక్కుతుంది. సేవ చేయువారికి నేను ఇంత ఇచ్చాననే ఆలోచన కూడా రాకూడదు. దాని ద్వారా అందరి పోషణ జరుగుతుంది. అందుకే సహాయము చేసేవారికి గౌరవము కూడా ఇవ్వబడ్తుంది. వారు తినిపించేవారని అర్థం చేయించాలి. ఆత్మిక పిల్లలు మీకు తినిపిస్తారు. మీరు వారి సేవ చేస్తారు. ఇది చాలా పెద్ద లెక్కాచారము. మనసా, వాచా, కర్మణా వారి సేవ చేయకుంటే అంత సంతోషమెలా ఉంటుంది. శివబాబా స్మృతి చేసి భోజనము తయారు చేస్తే వారికి శక్తి లభిస్తుంది. నేను అందరినీ సంతోషపరుస్తున్నానా? అని హృదయపూర్వకంగా ప్రశ్నించుకోవాలి. మహారథులైన పిల్లలు ఎంత గొప్ప సేవ చేస్తున్నారు! బాబా రెక్సిన్(ప్లాస్టిక్ షీటు) పై చిత్రాలు తయారు చేయిస్తారు. ఈ చిత్రాలు ఎప్పుడూ చిరిగిపోవు, తునిగిపోవు. బాబా పిల్లలు ఉన్నారు, తమంతకు తామే ధనము పంపిస్తారు. తండ్రి ధనము ఎక్కడ నుండి తెస్తారు? ఈ సేవాకేంద్రాలన్నీ ఎలా నడుస్తాయి? పిల్లలే నడుపుతారు కదా. నా వద్ద ఒక్క చిల్లిగవ్వ కూడా లేదని శివబాబా చెప్తున్నారు. పోను పోను వారంతకు వారే వచ్చి మా ఇంటిని సేవకు ఉపయోగించమని చెప్తారు. ఇప్పుడు చాలా ఆలస్యమైపోయిందని మీరంటారు. తరడ్రి పేదలపెన్నిధి. పేదల వద్ద ధనము ఎలా వస్తుంది? కొంతమంది కోటీశ్వరులు, పదమాపతులు కూడా ఉన్నారు. వారికి స్వర్గము ఇక్కడే ఉంది. ఇది మాయ చూపే ఆడంబరము(పాంప్). వారి ఆడంబరము పడిపోతూ ఉంది. తండ్రి అంటున్నారు - మీరు మొదట భగవంతుని పిల్లలుగా అయ్యారు. తర్వాత అక్కడకు వెళ్లి రాకుమారులుగా అవుతారు. అయితే అంత సేవ కూడా చేసి చూపించాలి కదా. చాలా సంతోషంగా ఉండాలి. మనము ఈశ్వరీయ సంతానమైన తర్వాత రాకుమారులుగా అవుతాము. అనేకమందికి సేవ చేసినప్పుడు రాకుమారులుగా అవుతాము. సంతోషపు పాదరస మీటరు ఎంతో పైకి ఎక్కిపోవాలి. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఎప్పుడూ ఎవ్వరినీ విసిగించరాదు, మీరు విసుక్కోరాదు. మీ చురుకుతనానికి, మీ సేవకు మురిసిపోయి ఎలాంటి అహంకారము చూపించరాదు. తండ్రి పిల్లలను ఎలా గౌరవిస్తారో అలా మిమ్ములను మీరు గౌరవించుకోవాలి.
2. యోగబలము ద్వారా మీ కోరికలన్నీ సమాప్తము చేసుకోవాలి. మేము భగవంతుని పిల్లలము, రాకుమారులుగా(సాహెబ్జాదే సో షహజాదే) అయ్యేవారము అనే నషాలో సదా ఖుషీగా ఉండాలి. సదా శాంతిగా ఉంటూ సేవ చేయాలి. నరనరాలలో నిండి ఉన్న భూతాలను పారదోలాలి.
వరదానము :-
'' హద్దు రాయల్ కోరికల నుండి ముక్తులుగా ఉండి సేవ చేసే నిస్వార్థ సేవాధారీ భవ ''
బ్రహ్మబాబా కర్మబంధనాల నుండి ముక్తులుగా ఉండి న్యారాగా అయ్యి నిరూపించారు. సేవ మరియు స్నేహము తప్ప ఏ ఇతర బంధనమూ లేదు. సేవలో ఏవైతే హద్దు రాయల్ కోరికలుంటాయో అవి కూడా లెక్కాచారాల బంధనములో బంధిస్తాయి. సత్యమైన సేవాధారులు ఈ లెక్కాచారముతో కూడా ముక్తులుగా ఉంటారు. ఉదాహరణానికి దేహ బంధనాలు, దేహ సంబంధాల బంధనాలున్నాయో అలా సేవలో స్వార్థము కూడా ఒక బంధనమే. ఈ బంధనము నుండి లేక రాయల్ లెక్కాచారముతో కూడా ముక్తులుగా అయ్యి నిస్వార్థ సేవాధారులుగా అవ్వండి.
స్లోగన్ :-
'' ప్రతిజ్ఞలను ఫైలులో ఉంచకండి, ఫైనల్గా అయ్యి చూపించండి ''