20-04-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - మీరు తండ్రి నుండి ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషాల వారసత్వము తీసుకునేందుకు వచ్చారు, ఈశ్వరీయ మతమును అనుసరించుట ద్వారానే తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది''

ప్రశ్న :-

తండ్రి తన పిల్లలందరికీ వికల్పాలను జయించేందుకు ఏ యుక్తిని తెలియజేశారు ?

జవాబు :-

వికల్పాలను జయించేందుకు స్వయాన్ని ఆత్మగా భావించి సోదర దృష్టితో చూడండి, శరీరాన్ని చూస్తే వికల్పాలు వస్తాయి. కనుక భృకుటిలో సోదర ఆత్మను చూడండి. పావనంగా అవ్వాలనుకుంటే ఈ దృష్టిని స్థిరంగా ఉంచుకోండి. నిరంతరము పతితపావనులైన తండ్రిని స్మృతి చేయండి. స్మృతి ద్వారానే తుప్పు(మురికి) వదులుతూ పోతుంది, ఖుషీ పాదరసము పైకెక్కుతుంది. అంతేకాక వికల్పాల పై విజయము ప్రాప్తి చేసుకుంటారు.

ఓంశాంతి.

తన సాలిగ్రామాలకు శివభగవానువాచ, శివభగవానువాచ అనగా శరీరము తప్పకుండా ఉంటుంది. అప్పుడే మాట్లాడగలరు. మాట్లాడేందుకు నోరు తప్పకుండా కావాలి. వినేవారికి కూడా చెవులు తప్పకుండా అవసరము. ఆత్మకు నోరు, చెవులు అవసరము. పిల్లలైన మీకు ఈశ్వరీయ మతము లభిస్తోంది. దీనిని రాముని మతమని అంటారు. ఇతరులు రావణుని మతములో ఉన్నారు. ఈశ్వరీయ మతము మరియు ఆసురీ మతము అని రెండు రకాలున్నాయి. ఈశ్వరీయ మతము అర్ధకల్పము నడుస్తుంది. బాబా ఈశ్వరీయ మతాన్ని ఇచ్చి మిమ్ములను దేవతలుగా తయారు చేస్తారు. తర్వాత సత్య-త్రేతా యుగాలలో అదే మతము నడుస్తుంది. యోగులైనందున అక్కడ జన్మలు కూడా తక్కువగా ఉంటాయి. ద్వాపర, కలియుగాలలో రావణుని మతముంటుంది. ఇక్కడ జన్మలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీరు భోగులు, కనుక ఆయువు కూడా తక్కువగా ఉంటుంది. చాలా సాంప్రదాయాలు ఏర్పడ్తాయి, చాలా దు:ఖితులుగా అవుతారు. రాముని మతమువారు రావణుని మతములో కలిసిపోతారు. అప్పుడు పూర్తి ప్రపంచమంతా రావణుని మతము అయిపోతుంది. మళ్లీ బాబా వచ్చి అందరికీ రాముని మతమునిస్తారు. సత్యయుగములో రాముని మతము, ఈశ్వరీయ మతము ఉంటుంది. దానిని స్వర్గమని అంటారు. ఈశ్వరీయ మతము లభించుట వలన అర్ధకల్పము కొరకు స్వర్గ స్థాపన జరుగుతుంది. అది ఎప్పుడు పూర్తి అవుతుందో అప్పుడు రావణ రాజ్యము వస్తుంది. దానిని ఆసురీ మతమని అంటారు. ఇప్పుడు స్వయాన్ని ప్రశ్నించుకోండి - మేము ఆసురీ మతము ద్వారా ఏమి చేశాము? ఈశ్వరీయ మతము ద్వారా ఏమి చేస్తున్నాము? మొదట నరకవాసులుగా ఉండేవారము మళ్లీ శివాలయములో స్వర్గవాసులుగా అవుతాము. సత్య-త్రేతా యుగాలను శివాలయమని అంటారు. ఏ పేరుతో స్థాపన జరుగుతుందో తప్పకుండా వారి పేరే పెడ్తారు. కనుక అది శివాలయము, అక్కడ దేవతలుంటారు. రచయిత అయిన తండ్రే మీకు ఈ విషయాలను అర్థం చేయిస్తున్నారు. వారు ఏమి రచిస్తారో అది కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మొత్తం రచన అంతా వారిని ఈ సమయములో హే పతితపావన! హే ముక్తిదాత! రావణ రాజ్యము నుండి లేక దు:ఖముల నుండి విడుదల చేయు తండ్రీ! మీరు రండి అని పిలుస్తున్నారు. ఇప్పుడు మీకు సుఖము గురించి తెలిసింది కనుక దీనిని దు:ఖమని భావిస్తున్నారు. లేకుంటే ఎవ్వరూ దీనిని దు:ఖమని భావించరు. తండ్రి ఎలాగైతే జ్ఞానసాగరులో, మనుష్య సృష్టికి బీజరూపులో అలా మీరు కూడా జ్ఞానపూర్ణులుగా అవుతారు. బీజములో పూర్తి వృక్ష జ్ఞానమంతా ఉంటుంది కదా. కానీ అది జడమైనది. ఒకవేళ చైతన్యమైతే తప్పకుండా చెప్పి ఉండేది. మీరు చైతన్య వృక్షానికి చెందినవారు, కనుక వృక్షము గురించి కూడా మీకు తెలుసు. తండ్రిని మనుష్యసృష్టికి బీజరూపులు, సత్‌-చిత్‌ ఆనంద స్వరూపులని అంటారు. ఈ వృక్షము ఉత్పత్తి మరియు పాలన ఎలా జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అలాగని కొత్త వృక్షము ఉత్పన్నమవుతుందని కాదు. పాత వృక్షములోని మనుష్యులు - ''ఈ సమయములో రావణ రాజ్యముంది, వచ్చి రావణుని నుండి విడుదల చేయండి'' అని పిలుస్తారని తండ్రి అర్థం చేయించారు. మనుష్యులకు రచయిత గురించి గాని, రచన గురించి గాని తెలియదు. స్వయం తండ్రే తెలుపుతున్నారు - నేను ఒకేసారి స్వర్గాన్ని స్థాపన చేస్తాను. స్వర్గము తర్వాత మళ్లీ నరకము తయారవుతుంది. రావణుడు రావడంతో మళ్లీ వామమార్గములోకి వెళ్ళిపోతారు. సత్యయుగములో ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషము అన్నీ ఉంటాయి. మీరు ఇక్కడకు తండ్రి నుండి ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందాల వారసత్వము తీసుకునేందుకు వచ్చారు. ఎందుకంటే స్వర్గములో ఎప్పుడూ దు:ఖముండదు. మేము కల్ప-కల్పము పురుషోత్తమ సంగమ యుగములో పురుషార్థము చేస్తామని ఇప్పుడు మీ హృదయములో ఉంది. పేరే ఎంత బాగుంది. ఇతర యుగాలను పురుషోత్తమ యుగమని అనరు. ఆ యుగాలలో మెట్లు(తాపలు) క్రిందకు దిగుతూ వస్తారు. తండ్రిని పిలుస్తూ కూడా ఉంటారు, సమర్పణ కూడా చేస్తూ ఉంటారు. కానీ తండ్రి ఎప్పుడు వస్తారో తెలియదు. ''ఓ గాడ్‌ఫాదర్‌ ముక్తినివ్వండి, మార్గదర్శులుగా అవ్వండి'' అని పిలుస్తారు. ముక్తిదాతగా అవుతారు కనుక తప్పకుండా రావలసి ఉంటుంది. మళ్లీ మార్గదర్శకులుగా అయ్యి తీసుకెళ్లవలసి ఉంటుంది. తండ్రి పిల్లలను చాలా రోజుల తర్వాత చూస్తారు కనుక చాలా సంతోషిస్తారు. అక్కడ అతను హద్దులోని తండ్రి, ఇక్కడ వీరు అనంతమైన తండ్రి. బాబా సృష్టికర్త, రచన చేసి మళ్లీ వారి పాలన కూడా చేస్తారు. పునర్జన్మలైతే తీసుకోవలసి ఉంటుంది. కొందరికి 10, కొందరికి 12 మంది పిల్లలుంటారు. కానీ అవన్నీ హద్దులోని సుఖాలు, కాకిరెట్టకు సమానమైనవి, తమోప్రధానంగా అవుతారు. తమోప్రధానతలో సుఖము చాలా తక్కువగా ఉంటుంది. మీరు సతోప్రధానంగా అవుతున్నారు కనుక చాలా సుఖము ఉంటుంది. సతోప్రధానంగా అయ్యేందుకు తండ్రి వచ్చి యుక్తి తెలుపుతున్నారు. తండ్రిని సర్వశక్తివంతులని అంటారు. భగవంతుడు సర్వశక్తివంతులు కనుక ఏమనుకుంటే అది చేయగలరు, మరణించినవారిని కూడా బ్రతికించగలరని భావిస్తారు. ఒకవేళ మీరు భగవంతులైతే చనిపోయిన ఈగను బ్రతికించి చూపండి అని ఒకసారి ఎవరో వ్రాశారు. ఇలా అనేకమంది అనేక ప్రశ్నలు ప్రశ్నిస్తూ ఉంటారు.

తండ్రి మీకు శక్తినిస్తారు, తద్వారా మీరు రావణుని పై విజయాన్ని పొందుతారు. కోతుల(బందర్‌) లాంటివారు మందిరానికి యోగ్యులుగా అవుతారు. వారు ఏమేమి చేసేశారో చూడండి. వాస్తవానికి మీరంతా భక్తులైన సీతలు. మీ అందరినీ రావణుని నుండి విడిపించారు. రావణుని ద్వారా మీకు ఎప్పుడూ సుఖము లభించదు. ఈ సమయములో అందరూ రావణుని జైలులో ఉన్నారు. రాముని జైలు అని అనరు. రాముడు వచ్చేదే రావణుని జైలు నుండి విడిపించేందుకు. 10 తలల రావణుని తయారు చేస్తారు కానీ 20 భుజాలు చూపించరు. పురుషునిలో 5 వికారాలు, స్త్రీలోని 5 వికారాలు ఉన్నాయని తండ్రి అర్థం చేయించారు. దానిని రావణ రాజ్యము లేక 5 వికారాల రూపీ మాయా రాజ్యము అని అంటారు. వీరి వద్ద చాలా మాయ ఉంది. మాయ నషా పెరిగి ఉందని అనరు. ధనాన్ని మాయ అని అనరు. ధనమును సంపద అని అంటారు. పిల్లలైన మీకు సంపద మొదలైనవి చాలా లభిస్తాయి. మీరు ఏమీ అడగవలసిన అవసరము ఉండదు. ఎందుకంటే ఇది చదువు. చదువులో అడుక్కోవడం ఉంటుందా! టీచర్‌ ఏమి చదివిస్తారో అది విద్యార్థి చదువుతాడు. ఎవరు ఎంత బాగా చదువుతారో అంత పొందుతారు. అడుక్కునే మాటే లేదు. ఇందులో పవిత్రత కూడా అవసరము. ఒక్క అక్షరానికి కూడా విలువ ఎంత ఉందో చూడండి. పదమాపదమంత(కోటానుకోట్ల) విలువ ఉంది. తండ్రిని గుర్తించండి, వారిని స్మృతి చేయండి. ఆత్మ ఎలాగైతే బిందువుగా ఉందో అలా ఆత్మనైన నేను కూడా బిందువునే అని తండ్రి తమ పరిచయమునిచ్చారు. వారు సదా పవిత్రులు, శాంతి, జ్ఞానము, పవిత్రతా సాగరులు. మహిమ వారిదొక్కరిదే. ప్రతి ఒక్కరికి వారిదే అయిన స్థానముంటుంది. కణకణములో భగవంతుడున్నారని నాటకాన్ని కూడా తయారు చేశారు. ఎవరు నాటకాన్ని చూసి ఉంటారో వారికి తెలిసి ఉంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కేవలం సాక్షిగా ఉంటూ చూడాలని బాబా మహావీర పిల్లలకు చెప్తారు.

ఇప్పుడు మీరు రామరాజ్యాన్ని స్థాపన చేసి రావణ రాజ్యాన్ని సమాప్తము చేస్తారు. ఇది అనంతమైన విషయము. వారు హద్దులోని కథలను తయారు చేశారు. మీరు శివశక్తి సైన్యము. శివుడు సర్వశక్తివంతులు కదా. మీరు శివుని శక్తిని తీసుకునే శివుని సైన్యము. వారు శివసేన అని పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు మీకు ఏమని పేరు పెట్టాలి, మీ పేరు ప్రజాపిత బ్రహ్మాకుమారి-కుమారులని పెట్టబడింది. అందరూ శివుని సంతానమే. పూర్తి ప్రపంచములోని ఆత్మలందరూ వారి సంతానమే. శివుని ద్వారా మీకు శక్తి లభిస్తుంది. శివబాబా మీకు జ్ఞానాన్ని నేర్పిస్తారు. దాని ద్వారా మీకు అర్ధకల్పము విశ్వము పై రాజ్యము చేసే శక్తి లభిస్తుంది. ఇది మీ యోగబలపు శక్తి. వారిది బాహుబల శక్తి. భారతదేశపు ప్రాచీన రాజయోగానికి చాలా మహిమ ఉంది. దేని ద్వారా స్వర్గస్థాపన జరిగిందో ఆ భారతదేశపు ప్రాచీన యోగాన్ని నేర్చుకోవాలనుకుంటారు. క్రీస్తుకు ఇన్ని సంవత్సరాల క్రితము స్వర్గముండేదని అంటారు. అది ఎలా తయారయ్యింది? యోగము ద్వారా. మీరు ప్రవృత్తి మార్గములోని సన్యాసులు, వారు ఇల్లు-వాకిలి వదిలి అడవికి వెళ్లిపోతారు, డ్రామానుసారము ప్రతి ఒక్కరికి పాత్ర లభించింది. ఇంత చిన్న బిందువులో ఎంత పాత్ర ఉంది! ఇది ప్రాకృతికము అని అంటారు. తండ్రి సదా సర్వ శక్తివంతులు. స్వర్ణిమ యుగమువారు, ఇప్పుడు మీరు వారి నుండి శక్తి తీసుకుంటారు. ఇది కూడా తయారైన డ్రామా. కోటి సూర్యులకన్నా తేజోమయులు కాదు. ఎవరిలో ఏ భావన కూర్చుంటుందో వారు ఆ భావనతో చూస్తారు. కళ్ళు ఎర్రగా అయిపోతాయి, చాలించండి, నేను సహనము చేయలేను అని అంటారు. అవన్నీ భక్తిమార్గము సంస్కారాలని తండ్రి అంటారు. ఇది జ్ఞానము, ఇందులో చదవవలసి ఉంటుంది. వీరు తండ్రి, టీచరు కూడా. వారు ఇప్పుడు చదివిస్తున్నారు, మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలని మనకు చెప్తున్నారు. చెడును వినకండి,.......... అని వారు చెప్తారు. ఈ మాటలు ఎవరు అన్నారో మనుష్యులకు తెలియదు, మొదట కోతుల చిత్రాలను తయారు చేసేవారు. ఇప్పుడు మనుష్యుల చిత్రాలను తయారు చేస్తున్నారు. బాబా కూడా నళిని బచ్చీ ద్వారా తయారు చేయించారు. మనుష్యులకు ఎంత భక్తి నషా ఉంది! ఇది భక్తి రాజ్యము కదా. ఇప్పుడు జ్ఞాన రాజ్యము వస్తుంది. చాలా వ్యత్యాసముంటుంది. జ్ఞానము ద్వారా చాలా సుఖముంటుందని పిల్లలకు తెలుసు. మళ్లీ భక్తిలో మెట్లు క్రిందకు దిగుతారు. మొదట మనము సత్యయుగంలోకి వెళ్తాము మళ్లీ పేను వలె క్రిందకు దిగుతాము. 1250 సంవత్సరాలలో రెండు కళలు తగ్గిపోతాయి. చంద్రుని ఉదాహరణ ఉంది. చంద్రునికి గ్రహణము పడ్తుంది. కళలు తగ్గుతూ పోతాయి. మళ్లీ నెమ్మది నెమ్మదిగా కళలు వృద్ధి అవుతాయి. 16 కళలు వస్తాయి. అది అల్పకాలపు మాట. ఇది అనంతమైన విషయము. ఈ సమయములో అందరి పై రాహు గ్రహణముంది. బృహస్పతి దశ అత్యంత ఉన్నతమైనది. రాహుదశ అత్యంత నీచమైనది(కనిష్ఠమైనది). ఒక్కసారిగా దివాలా తీస్తారు. బృహస్పతి దశ ద్వారా మనము ఉన్నతి చెందుతాము. వారికి అనంతమైన తండ్రిని గురించి తెలియదు. ఇప్పుడు రాహుదశ తప్పకుండా అందరి పై ఉంది. ఇది మీకు తెలుసు. వేరెవ్వరికీ తెలియదు. రాహు దశయే మనలను దివాలా తీయిస్తుంది. బృహస్పతి దశ ద్వారా సంపన్నంగా అవుతారు. భారతదేశము ఎంతో సంపన్నంగా ఉండేది. ఒక్క భారతదేశము మాత్రమే ఉండేది. సత్యయుగములో రామరాజ్యము, పవిత్ర రాజ్యముంటుంది దానికే మహిమ జరుగుతుంది. నేను గుణహీనుడను, నాలో ఏ గుణాలు లేవు....... అని అపవిత్ర రాజ్యమువారు గానము చేస్తారు. నిర్గుణ సంస్థ అని ఒక సంస్థను కూడా తయారు చేశారు. అరే! ఇప్పుడు పూర్తి ప్రపంచమంతా నిర్గుణ సంస్థయే. ఒక్కరి మాటే కాదు. పిల్లలను సదా మహాత్ములని అంటారు. మీరే మళ్లీ ఏ గుణాలు లేవని అంటారు. పూర్తి ప్రపంచమంతా వారిలో ఏ గుణాలూ లేని కారణంగా వారి పై రాహు దశ ఉంది. దానమిస్తే గ్రహణము విడుస్తుందని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు అందరూ వెళ్లాల్సిందే కదా. దేహ సహితంగా దేహ సర్వ ధర్మాలన్నీ వదిలేయండి. స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి. మీరంతా ఇప్పుడు వాపస్‌ వెళ్లాలి. పవిత్రంగా లేని కారణంగా వాపస్‌ ఎవ్వరూ వెళ్లలేరు. ఇప్పుడు తండ్రి పవిత్రంగా అయ్యేందుకు యుక్తిని తెలియచేస్తున్నారు. అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. బాబా మేము మర్చిపోతామని చాలామంది పిల్లలంటారు. మధురమైన పిల్లలారా, పతితపావనులైన తండ్రిని మర్చిపోతే మీరు పావనంగా ఎలా అవుతారు? మీరు ఏమి అంటున్నారో ఆలోచించండి అని బాబా అంటారు. నేను నా తండ్రిని మర్చిపోతానని పశువులు కూడా ఎప్పుడూ అనవు. మీరు ఏమంటున్నారు! నేను మీ అనంతమైన తండ్రిని. మీరు అనంతమైన వారసత్వమును తీసుకునేందుకు వచ్చారు. నిరాకార తండ్రి సాకారములో వచ్చినప్పుడే కదా చదివించేది. ఇప్పుడు తండ్రి ఇతనిలో ప్రవేశించారు. వీరు బాప్‌దాదా. ఇరువురి ఆత్మలు ఈ భృకుటి మధ్యలో ఉన్నాయి. మీరు బాప్‌దాదా అని అంటారు అనగా తప్పకుండా రెండు ఆత్మలు ఉంటాయి. శివబాబా మరియు బ్రహ్మ ఆత్మ రెండూ ఉంటాయి. మీరంతా ప్రజాపిత బ్రహ్మాకుమార-కుమారీలుగా అయ్యారు. మీకు జ్ఞానము లభించినందున మేమంతా సోదరులము అని తెలుసుకున్నారు. మళ్లీ ప్రజాపిత బ్రహ్మ ద్వారా సోదరీ-సోదరులుగా అవుతారు. ఈ స్మృతి పక్కాగా ఉండాలి. కానీ సోదరీ-సోదరులలో కూడా నామ-రూపాల ఆకర్షణ కలగడాన్ని బాబా గమనించారు. చాలామందికి వికల్పాలు వస్తాయి. మంచి(సుందరమైన) శరీరాన్ని చూసినప్పుడు వికల్పాలు వస్తాయి. స్వయాన్ని ఆత్మగా భావించి సోదర దృష్టితో చూడండని ఇప్పుడు బాబా చెప్తున్నారు. ఆత్మలంతా సోదరులు. సోదరులు ఉన్నారంటే తండ్రి తప్పకుండా ఉండాలి. అందరికీ ఒకే తండ్రి ఉన్నారు. అందరూ తండ్రిని స్మృతి చేస్తారు. ఇప్పుడు సతోప్రధానంగా అవ్వాలంటే నన్నొక్కరినే స్మృతి చేయండని తండ్రి చెప్తారు. ఎంత స్మృతి చేస్తారో, అంత త్రుప్పు వదులుతూ ఉంటుంది. ఖుషీ పాదరస మీటరు పెరుగుతుంది. నెంబరువారు పురుషార్థానుసారము ఆకర్షణ అవుతూ ఉంటుంది. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. చదువు పై పూర్తి గమనమిచ్చి స్వయాన్ని సంపన్నంగా చేసుకోవాలి. ఏమీ వేడుకోరాదు (అడుక్కోరాదు). ఒక్క తండ్రి స్మృతి మరియు పవిత్రతల ధారణ ద్వారా పదమాపదమ్‌ పతులుగా అవ్వాలి.

2. రాహు గ్రహణము నుండి ముక్తులుగా అయ్యేందుకు వికారాలను దానము చేయాలి. చెడు వినకండి......... ఏ విషయాల ద్వారా మెట్లు(తాపలు, సీఢీ) క్రిందకు దిగారో, గుణహీనులుగా అయ్యారో వాటిని బుద్ధి ద్వారా మర్చిపోవాలి.

వరదానము :-

'' స్నేహమనే ఉడాన్‌ ద్వారా సదా సమీపతను అనుభవం చేసే స్నేహీమూర్త్‌ భవ ''

పిల్లలందరిలో బాప్‌దాదా స్నేహము ఇమిడి ఉంది. స్నేహశక్తి ద్వారా అందరూ ముందుకు ఎగురుతూ పోతున్నారు. ఈ స్నేహ ఉడాన్‌ శరీరము, మనసు, హృదయము ద్వారా తండ్రి సమీపానికి తీసుకొస్తుంది. భలే జ్ఞానము, యోగము, ధారణలో అందరూ యథాశక్తి నంబరువారుగా ఉన్నారు కానీ స్నేహంలో ప్రతి ఒక్కరూ నంబరువన్‌గా ఉన్నారు. ఈ స్నేహమే బ్రాహ్మణ జీవితాన్ని ఇచ్చేందుకు మూలాధారము. స్నేహానికి అర్థము దగ్గరగా(పాస్‌) ఉండడం, ఉత్తీర్ణులవ్వడం(పాస్‌ అవ్వడం), ప్రతి పరిస్థితిని చాలా సులభంగా దాటుకోవడం(పాస్‌ కర్‌నా).

స్లోగన్‌ :-

''మీ కనులలో (దృష్టిలో) తండ్రిని ఇముడ్చుకుంటే మాయ దృష్టి నుండి రక్షింపబడ్తారు.''