20-06-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - అంతర్ముఖులుగా అవ్వండి అనగా మౌనంగా ఉండండి. నోటితో ఏమీ మాట్లాడకండి, అన్ని పనులు శాంతిగా చేయండి, ఎప్పుడూ అశాంతి వ్యాపింపజేయకండి. ''

ప్రశ్న :-

పిల్లలైన మిమ్ములను దరిద్రులు(నిరుపేదలు)గా తయారు చేసే పెద్ద శత్రువు ఎవరు?

జవాబు :-

''క్రోధము''. ఎక్కడ క్రోధము ఉంటుందో, అక్కడ నీటి కుండ కూడా ఎండిపోతుందని చెప్తారు. వజ్ర వైడూర్యాలతో నిండుగా ఉండిన భారతదేశపు కుండ ఈ భూతము కారణంగా ఖాళీ అయిపోయింది. ఈ భూతాలే మిమ్ములను నిరుపేదలుగా చేసేశాయి. క్రోధముతో ఉన్న మానవుడు స్వయం కాలిపోయి ఇతరులను కూడా కాల్చేస్తాడు. అందువలన ఇప్పుడు అంతర్ముఖులుగా అయ్యి ఈ భూతమును తొలగించండి.

ఓంశాంతి.

తండ్రి పిల్లలకు తెలుపుతున్నారు - మధురమైన పిల్లలూ! అంతర్ముఖులుగా అవ్వండి. అంతర్ముఖత అనగా ఏమీ మాట్లాడకండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండిన్రి స్మృతి చేయండి. తండ్రి కూర్చుని పిల్లలకు ఈ శిక్షణను ఇస్తారు. ఇందులో ఇక ఏమీ మాట్లాడే పని లేదు. కేవలం అర్థము చేయిస్తారు. గృహస్థ వ్యవహారములో ఈ విధంగా ఉండాలి. ''ఇదే మన్మనాభవ.'' నన్ను స్మృతి చేయండి. ఇదే మొట్టమొదటి ముఖ్యమైన విషయము. పిల్లలైన మీరు మీ ఇంట్లో కూడా కోపపడరాదు. క్రోధము వలన నీటి కుండ కూడా ఎండిపోతుంది. క్రోధముతో ఉన్న మానవులు అశాంతిని వ్యాపింపజేస్తారు. అందువలన గృహస్థ వ్యవహారములో ఉంటూ శాంతిగా ఉండాలి. భోజనం చేసి మీ వృత్తి వ్యాపారాదులకు లేక ఆఫీసులకు వెళ్లిపోవాలి. అక్కడ కూడా మౌనంగా ఉండడం చాలా మంచిది. అందరూ మాకు శాంతి కావాలని అంటారు. శాంతి సాగరులు తండ్రి ఒక్కరే అని పిల్లలకు తెలియజేయడం జరిగింది. ఆ తండ్రే ఇప్పుడు ఆదేశమిస్తున్నారు - ''నన్ను స్మృతి చేయండి.'' ఇందులో మాట్లాడేదేమీ లేదు. అంతర్ముఖులై ఉండాలి. ఆఫీసు మొదలైన వాటిలో మీ పని చేసుకోవాలంటే ఎక్కువగా మాట్లాడరాదు. చాలా మధురంగా తయారవ్వాలి. ఎవ్వరికీ దుఃఖమునివ్వరాదు. కొట్లాటలు మొదలైనవాటిని క్రోధము అని అంటారు. అన్నింటికన్నా పెద్ద శత్రువు కామము. రెండవది క్రోధము. ఒకరికొకరు దుఃఖము కలిగించుకుంటారు. క్రోధము వలన ఎన్నో కొట్లాటలు జరుగుతాయి. సత్యయుగములో కొట్లాటలుండవని పిల్లలకు తెలుసు. ఇవి రావణత్వపు గుర్తులు. కోధ్రమున్న వారిని కూడా ఆసురీ సంపద్రాయస్థులు అని అంటారు. ఇది భూత ప్రవేశమగుటే కదా. ఇందులో మాట్లాడే పనే లేదు ఎందుకంటే ఆ మనుష్యులకు జ్ఞానము లేనే లేదు. వారు క్రోధము చేసుకుంటారు. క్రోధముతో ఉన్నవారితో క్రోధము చేసుకుంటే పోట్లాట మొదలవుతుంది. తండ్రి తెలుపుతున్నారు - '' ఇది చాలా పెద్ద భూతము, దీనిని యుక్తిగా పారద్రోలాలి. '' నోటి ద్వారా ఎటువంటి కఠిన శబ్ధాలు కూడా రాకూడదు. ఇవి చాలా నష్టకారకము. వినాశనము కూడా కోధ్రము ద్వారానే జరుగుతుంది కదా. కోధ్రము ఉన్న ఇంటిలో చాలా అశాంతి ఉంటుంది. మీరు కోపపడితే తండిక్రి అపకీర్తి తెస్తారు. ఈ భూతాలను పారద్రోలాలి. ఒక్కసారి పారద్రోలితే మళ్లీ అర్ధకల్పము వరకు ఈ భూతాలు ఉండనే ఉండవు. ఈ 5 వికారాలు ఇప్పుడు పూర్తి ఫోర్సులో ఉన్నాయి. ఇటువంటి సమయములోనే, వికారాలు పూర్తి ఫోర్సులో ఉన్నప్పుడే తండ్రి వస్తారు. ఈ కనులు చాలా పెద్ద నేరము చేస్తాయి. నోరు కూడా నేరము చేస్తుంది. జోరుగా మాట్లాడినందున మనుష్యులు తపించిపోతారు. ఇంటిని కూడా తపింపచేస్తారు. కామము, క్రోధము ఈ రెండూ చాలా పెద్ద శత్రువులు. కోధ్రీ మానవులు స్మృతి చేయలేరు. స్మృతి చేయువారు సదా శాంతిగా ఉంటారు. మాలో ఏ భూతము లేదు కదా? అని మీకు మీరే ప్రశ్నించుకోవాలి. మోహ భూతము, లోభ భూతము కూడా ఉంటుంది. లోభ భూతము కూడా తక్కువైనది కాదు. ఇవన్నీ భూతాలే. ఎందుకంటే ఇది రావణుని సైన్యము.

తండ్రి తన పిల్లలకు స్మృతియాత్ర నేర్పిస్తారు. కానీ పిల్లలు ఇందులో చాలా తికమకపడ్తారు. చాలా భక్తి చేసినందున అర్థమే చేసుకోరు. భక్తిని దేహాభిమానము అని అంటారు. అర్ధకల్పము దేహాభిమానం ఉంది. బాహ్యముఖతలో ఉన్న కారణంగా స్వయాన్ని ఆత్మగా భావించలేరు. తండ్రి చాలా తీవ్రంగా చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. కానీ పిల్లలకు ఇది రానే రాదు. ఇతర విషయాలన్నీ ఒప్పుకుంటారు కూడా. ఏ వస్తువు కనపడదు కదా స్మృతి ఎలా చేయాలి అని అంటారు. వారికి తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారు. వారు అనంతమైన తండ్రి అని కూడా తెలుసుకున్నారు. నోటితో శివ - శివ అని అనరాదు. ఆంతరికములో నేను ఆత్మ అని మీకు తెలుసు కదా. మనుష్యులు శాంతిని వేడుకుంటారు, శాంతిసాగరులు ఆ పరమాత్మ ఒక్కరే, వారసత్వము ఇచ్చేది కూడా వారే. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - '' నన్ను స్మృతి చేస్తే శాంతి ఏర్పడ్తుంది. జన్మ-జన్మాంతరాల వికర్మలు కూడా వినాశనమవుతాయి.'' అంతే తప్ప ఇక్కడ ఇంకేమీ లేదు. ఇంత పెద్ద లింగము కూడా లేదు. ఆత్మ చాలా చిన్నది. తండ్రి కూడా చాలా చిన్నవారే. అందరూ ఓ భగవంతుడా! ఓ గాడ్‌! అని స్మృతి చేస్తారు. ఈ మాటలు అనేది ఎవరు? ఆత్మ అంటుంది, తన తండ్రిని స్మృతి చేస్తుంది. అందువలన తండ్రి తన పిల్లలకు చెప్తున్నారు - ''మన్మనాభవ.'' మధురాతి మధురమైన పిల్లలారా! - అంతర్ముఖులుగా ఉండండి. ఇప్పుడు చూచేదంతా సమాప్తము కానున్నది. ఆత్మ మాత్రము శాంతిలో ఉంటుంది. ఆత్మ శాంతిధామానికే వెళ్లాలి. ఎంతవరకు ఆత్మ పవిత్రంగా అవ్వదో అంతవరకు శాంతిధామములోకి వెళ్లలేదు. ఋషులు, మునులు మొదలైనవారంతా శాంతి ఎలా లభిస్తుంది? అని అంటారు. తండ్రి చాలా సులభమైన యుక్తిని తెలుపుతున్నారు. అయితే చాలామంది పిల్లలు శాంతిగా ఉండరు. గృహస్థములో ఉంటారు, కొంచెము కూడా శాంతిగా ఉండరు అని బాబాకు తెలుసు. కొంత సమయము సేవాకేంద్రాలకు వెళ్లి ఆంతరికములో శాంతిగా ఉంటూ తండ్రిని స్మృతి చేయాలని అనుకుంటారు కానీ ఉండలేరు ఎందుకంటే రోజంతా ఇంటిలో హంగామా(గలాటా) చేస్తుంటారు. అందువలన సేవాకేంద్రానికి వచ్చాక కూడా శాంతిగా ఉండలేరు. ఎవరి దేహము పైన అయినా ప్రేమ ఏర్పడితే వారి మనసు ఎప్పుడూ శాంతిగా ఉండదు. వారి స్మృతే వస్తూ ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మానవులలో ఇప్పుడు 5 భూతాలున్నాయి. వీరిలో భూతము ప్రవేశమయ్యిందని అంటారు కదా. ఈ భూతాలే మిమ్ములను భికారులుగా చేసేశాయి. అక్కడైతే కేవలం ఏదో ఒక్క భూతము(స్థూల భూతప్రేతము) ఉంటుంది, అది కూడా ఎప్పుడో ఒక్కసారి ప్రవేశిస్తుంది. తండ్రి చెప్తున్నారు - ఈ 5 భూతాలు ప్రతి ఒక్కరిలో ప్రవేశమై ఉన్నాయి. వీటిని పారద్రోలేందుకే ''బాబా! మీరు వచ్చి శాంతిని ఇవ్వండి, ఈ భూతాలను పారద్రోలే యుక్తిని తెలపండి'' అని నన్ను పిలుస్తారు. ఈ భూతాలైతే అందరిలో ప్రవేశమై ఉన్నాయి. ఇది రావణ రాజ్యము కదా. అన్నిటికంటే కఠినమైన భూతాలు కామము, క్రోధము. తండ్రి వచ్చి భూతాలను పారద్రోలుతారు. కావున దానికి బదులుగా ఏదైనా లభించాలి కదా. వారు భూత ప్రేతాలను పారద్రోలుతారు కానీ ఏమీ లభించదు. ఇక్కడ మొత్తం విశ్వము నుండి భూతాలన్నిటిని పారద్రోలేందుకు తండ్రి వచ్చారని మీకు తెలుసు. ఇప్పుడు విశ్వమంతటా అందరిలో భూతాలు ప్రవేశమై ఉన్నాయి. దేవతలలో ఏ భూతమూ ఉండదు. దేహాభిమాన భూతము, కామ భూతము, క్రోధ, లోభ, మోహ........ భూతాలేవీ ఉండవు. లోభ భూతము కూడా తక్కువైనదేమీ కాదు. ఈ గుడ్డు తినాలి, అది తినాలి........... చాలా మందిలో ఈ భూతముంటుంది. మాలో కామ భూతముంది, క్రోధ భూతముంది అని మీ హృదయాలకు తెలుసు. ఈ భూతాలను వెలికి తీసేందుకు తండ్రి ఎంతగానో కష్టపడ్తారు. దేహాభిమానములోకి వచ్చినందున కౌగలించుకోవాలి, ఇది చేయాలి, అది చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. దీని వలన సంపాదన అంతా సమాప్తమైపోతుంది. క్రోధీ మనుష్యులది కూడా ఇదే పరిస్థితి. క్రోధములోకి వచ్చి తండ్రి పిల్లలను చంపేస్తాడు, పిల్లలు తండ్రిని చంపుతారు, స్త్రీ తన భర్తను చంపుతుంది. జైలుకు వెళ్లి చూస్తే మీకు రకరకాలవారు కనిపిస్తారు. ఎలాంటివారు ఉంటారో తెలుస్తుంది. ఈ భూత ప్రవేశము వలన భారతదేశము ఏ గతికి వచ్చిందో చూడండి. భారతదేశపు బంగారు వజ్రాలతో నిండిన పెద్ద కుండ ఇప్పుడు ఖాళీ అయిపోయింది. నీటి కుండ కూడా క్రోధ కారణంగా ఎండిపోతుందని అంటారు కదా. ఇప్పుడు భారతదేశపు స్థితి కూడా అలాగే అయ్యింది. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. భూతాలను తొలగించేందుకు తండ్రియే స్వయంగా వస్తారు. వాటిని ఏ ఇతర మనుష్యులూ తొలగించలేరు. ఈ పంచ భూతాలు చాలా శక్తివంతమైనవి. అర్ధకల్పము నుండి ఇవి ప్రవేశమై ఉన్నాయి. ఈ సమయములో అయితే అడిగే పనే లేదు. భలే కొంతమంది పవిత్రంగా ఉంటారు కానీ వారి జన్మ వికారాల ద్వారానే లభించింది కదా. భూతాలున్నాయి కదా. ఈ 5 భూతాలు భారతదేశాన్ని పూర్తిగా నిరుపేదగా చేసేశాయి. డ్రామా ఎలా తయారై ఉందో తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. భారతదేశము నిరుపేదగా అయిపోయింది. అందుకే బయట నుండి అప్పులు తీసుకుంటూ ఉంటారు. భారతవాసులకే తండ్రి అర్థం చేయిస్తున్నారు - '' పిల్లలూ! ఈ చదువు ద్వారా మీకు అపారమైన ధనము లభిస్తుంది. ఇది అవినాశి చదువు, దీనిని అవినాశి తండ్రి చదివిస్తున్నారు.'' భక్తిమార్గములో ఎంతో సామాగ్రి ఉంది. బాబా బాల్యము నుండి గీత చదివేవారు, నారాయణుని పూజించేవారు. జ్ఞానము ఏ మాత్రమూ లేదు. నేను ఆత్మను, వారు మా తండ్రి అనే జ్ఞానము కూడా లేదు. అందుకే ఎలా స్మృతి చేయాలి? అని అడుగుతారు. అరే! మీరు భక్తిమార్గములో స్మృతి చేస్తూ - ఓ భగవంతుడా! రండి, మాకు మార్గదర్శకులై ముక్తినివ్వండి అని వేడుకున్నారు. ముక్తి - జీవన్ముక్తి కొరకు ఆ గైడు (మార్గదర్శకుడు) లభిస్తారు. తండ్రి ఈ పాత ప్రపంచము నుండి ఏవగింపు(అసహ్యము) కలిగిస్తారు. ఇప్పుడు ఆత్మలన్నీ నల్లగా(అపవిత్రంగా) ఉన్నాయి. కనుక వాటికి ఇలాంటి తెల్ల(పవిత్ర) శరీరాలు ఎలా లభిస్తాయి? భలే చర్మము ఎంత తెల్లగా ఉన్నా ఆత్మ నల్లగానే ఉంది కదా. తెల్లని అందమైన శరీరము గలవారికి చాలా నషా ఉంటుంది. ఆత్మ తెల్లగా ఎలా అవుతుందో మానవులకు తెలియదు. అందుకే వారిని నాస్తికులు అని అంటారు. వారికి రచయిత అయిన తండ్రి గురించి గానీ, వారి రచన గురించి గానీ తెలియదు. అందుకే వారు నాస్తికులు. తెలిసినవారిని ఆస్తికులని అంటారు. తండ్రి కూర్చొని పిల్లలైన మీకు ఎంతో మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు. ప్రతి ఒక్కరు మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి - ''నాలో శుద్ధత ఎంతవరకు ఉంది? ఎంతవరకు నేను స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తున్నాను?'' స్మృతి బలము ద్వారానే రావణుని పై విజయము పొందాలి. ఇందులో శరీరముతో శక్తివంతులుగా అయ్యే విషయమేదీ లేదు. ఈ సమయములో అన్నింటికంటే శక్తివంతమైనది అమెరికా. ఎందుకంటే వారి వద్ద ధనము, సంపద, ఫిరంగులు మొదలైనవి చాలా ఉన్నాయి. అది దేహ సంబంధమైన శక్తి, హతమార్చేది. ఇవన్నీ చంపేందుకు ఉపయోగపడు మారణాయుధాలు. మనము విజయులుగా అవుతామని బుద్ధిలో ఉంది. మీది ఆత్మిక శక్తి. మీరు రావణని పై ఆత్మిక శక్తి ద్వారా విజయము పొందుతారు. దాని వలన మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. మీ పై విజయము ఎవరూ పొందలేరు. అర్ధకల్పము మీ నుండి రాజ్యము ఎవ్వరూ లాక్కోలేరు. ఇతరులెవ్వరికి తండ్రి నుండి వారసత్వము లభించదు. మీరు ఏమవుతారో ఒకసారి కొద్దిగా ఆలోచించండి. తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. స్వదర్శన చక్రముతో విష్ణువు అందరి తలలు ఖండించారని వారు భావిస్తారు. కానీ ఇందులో హింస అనే మాటే లేదు.

మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి చెప్తున్నారు - మధురమైన పిల్లలారా! మీరు ఎలా ఉండినారో ఇప్పుడు మీ స్థితి ఎలా ఉందో చూసుకోండి! మీరు ఎంత భక్తి మొదలైనవి చేస్తూ ఉండినా భూతాలు మీ నుండి బయటికి పోలేదు. ఇప్పుడు అంతర్ముఖులై మాలో ఏ భూతము లేదు కదా? అని పరిశీలించుకోండి. ఎవరితో అయినా మనసు లగ్నమై కౌగలించుకున్నారంటే ఖాతా అంతా నష్టపోయినట్లు అర్థం చేసుకోండి. అటువంటి వారి ముఖము చూడడం కూడా మంచిది కాదు. వారు అంటరానివారు, స్వచ్ఛమైనవారు కాదు. ''నేను అంటరానివాడినని మనసు తింటూ ఉంటుంది.'' తండ్రి అంటున్నారు - దేహ సహితంగా అన్నీ మర్చిపోండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ స్థితి కలిగి ఉంటే మీరు దేవతలుగా అవుతారు. కనుక ఏ భూతమూ రాకూడదు. స్వయాన్ని పరిశీలించుకోండని బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. చాలామందిలో క్రోధముంది. వారు తిట్టకుండా ఉండలేరు. దాని వలన కొట్లాట ప్రారంభమవుతుంది. క్రోధము చాలా చెడ్డది. భూతాలను పారద్రోలి పూర్తిగా పరిశుభ్రమైపోవాలి. శరీరము గుర్తుకు కూడా రాకూడదు. అప్పుడు ఉన్నత పదవిని పొందగలరు. అందువల్లనే అష్టరత్నాలు మహిమ చేయబడ్తరు. రత్నాలుగా అయ్యేందుకు మీకు జ్ఞానరత్నాలు లభిస్తాయి. భారతదేశములో 33 కోట్ల దేవతలు ఉండేవారని అంటారు. కానీ అందులో కూడా అష్టరత్నాలు గౌరవప్రదంగా ఉత్తీర్ణులవుతారు. వారికి మాత్రమే బహుమతి లభిస్తుంది. లౌకికములో స్కాలర్షిప్‌ (ఉపకారవేతనము/ ూషష్ట్రశీశ్రీaతీరష్ట్రఱజూ) లభిస్తుంది కదా. గమ్యము చాలా గొప్పదని మీకు తెలుసు. నడుస్తూ నడుస్తూ క్రింద పడ్తారు. భూత ప్రవేశము జరుగుతుంది. అక్కడ వికారాలే ఉండవు. పిల్లలైన మీ బుద్ధిలో డ్రామా చక్రమంతా తిరుగూతూ ఉండాలి.

5 వేల సంవత్సరాలకు ఎన్ని నెలలో, ఎన్ని గంటలో, ఎన్ని సెకండ్లో మీకు తెలుసు. ఎవరైనా లెక్కిస్తే తెలిసిపోతుంది. లెక్కించిన తర్వాత ఈ వృక్షములో, కల్పములో ఇన్ని సంవత్సరాలు, ఇన్ని మాసాలు, ఇన్ని రోజులు, ఇన్ని గంటలు, ఇన్ని సెకండ్లు ఉంటాయని వ్రాయవచ్చు. అప్పుడు మానవులు వీరు చాలా ఖచ్ఛితంగా తెలుపుతున్నారని అంటారు. 84 జన్మల లెక్కాచారము తెలుపుతారు. అటువంటప్పుడు కల్పం ఆయువును ఎందుకు తెలుపలేరు. పిల్లలకు ముఖ్యమైన విషయం తెలుపుతున్నారు - ఎలాగైనా భూతాలను పారద్రోలాలి. ఈ భూతాలు మిమ్ములను పూర్తిగా సర్వ నాశనము చేసేశాయి. మనుష్యమాత్రులందరిలో భూతాలు ఉండనే ఉన్నాయి. భ్రష్ఠాచారముతోనే జన్మిస్తారు. అక్కడ భ్రష్ఠాచారము ఉండదు. రావణుడే ఉండడు. రావణుడు అంటే ఎవరో ఎవ్వరికీ తెలియదు. మీరు రావణుని పై విజయము పొందుతారు. తర్వాత రావణుడు ఉండనే ఉండడు. ఇప్పుడు పురుషార్థము చేయండి. తండ్రి వచ్చారు కనుక వారి నుండి వారసత్వము తప్పకుండా లభించాలి. మీరు ఎన్నిసార్లు దేవతలుగా అవుతారో, ఎన్నిసార్లు అసురులుగా అవుతారో లెక్కపెట్టలేరు. లెక్కించలేనన్ని సార్లు అయ్యి ఉంటారు. మంచిది - పిల్లలూ! శాంతిగా ఉంటే కోపము ఎప్పుడూ రాదు. తండ్రి ఇచ్చే శిక్షణలు అమలుపరచాలి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. మాలో ఏ భూతమూ లేదు కదా? కనులు వికారపూరితంగా(అశుద్ధంగా) అవ్వడం లేదు కదా? గట్టిగా, జోరుగా మాట్లాడడం లేక అశాంతిని వ్యాపింపజేసే సంస్కారము లేదు కదా? లోభ, మోహ వికారాలు సతాయించడం లేదు కదా? అని మిమ్ములను మీరు ప్రశ్నించుకోవాలి.

2. ఏ దేహాధారి పైనా మీ మనస్సు లగ్నమవ్వరాదు. దేహ సహితంగా అన్నీ మరచి స్మృతియాత్ర ద్వారా స్వయంలో ఆత్మిక బలమును నింపుకోవాలి. ఒక్కసారి భూతాలను పారదోలి అర్ధకల్పము వరకు వాటి నుండి విడుదల పొందాలి.

వరదానము :-

2. ఏ దేహాధారి పైనా మీ మనస్సు లగ్నమవ్వరాదు. దేహ సహితంగా అన్నీ మరచి స్మృతియాత్ర ద్వారా స్వయంలో ఆత్మిక బలమును నింపుకోవాలి. ఒక్కసారి భూతాలను పారదోలి అర్ధకల్పము వరకు వాటి నుండి విడుదల పొందాలి.

మహాన్‌ ఆత్మలైన మీ గుర్తు నిర్మాణత. ఎంత నిర్మాణంగా అవుతారో, అంత అందరి ద్వారా గౌరవం ప్రాప్తి అవుతుంది. ఎవరైతే నిర్మాణంగా ఉంటారో, వారు అందరికీ సుఖమునిస్తారు. వారు ఎక్కడికెళ్లినా, ఏమి చేసినా సుఖదాయులుగా(సుఖమునిచ్చేవారిగా) ఉంటారు. కనుక వారి సంబంధ - సంపర్కములోకి ఎవరు వచ్చినా వారు సుఖాన్ని అనుభవం చేస్తారు. అందుకే బ్రాహ్మణాత్మలైన మీకు - '' సుఖసాగరుని పిల్లలు సుఖ స్వరూపులు, సుఖదేవులు'' అనే గాయనం ఉంది. కనుక అందరికీ సుఖమునిస్తూ, సుఖము తీసుకుంటూ ఉండండి. ఎవరైనా మీకు దు:ఖమిస్తే మీరు తీసుకోరాదు.

స్లోగన్‌ :-

'' ఆత్మాభిమానులుగా ఉండువారే, అందరి కంటే గొప్ప జ్ఞానులు ''