25-07-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - తండ్రి సమానంగా అపకారులకు కూడా ఉపకారము చేయడం నేర్చుకోండి, నిందించు వారిని కూడా తమ మిత్రులుగా చేసుకోండి ''

ప్రశ్న :-

తండ్రికి ఏ విధమైన దృష్టి పక్కాగా ఉంది? పిల్లలైన మీరు ఏ దృష్టిని పక్కా చేసుకోవాలి ?

జవాబు :-

సర్వాత్మలు నా పిల్లలు అను దృష్టి తండ్రికి పక్కాగా ఉంది. కాబట్టి పిల్లలూ! - పిల్లలూ! అని సంబోధిస్తూ ఉంటారు. మీరెప్పుడూ ఎవ్వరినీ పిల్లలూ - పిల్లలూ! అని సంబోధించలేరు. ఈ ఆత్మ నా సోదరుడు అను దృష్టి మీకు దృఢంగా ఉండాలి. ''సోదరుని చూడు, సోదరునితో మాట్లాడు,'' దీని ద్వారా ఆత్మిక ప్రేమ ఉంటుంది. వికారి ఆలోచనలు సమాప్తమైపోతాయి. నిందించువారు కూడా మిత్రులుగా అయిపోతారు.

ఓంశాంతి.

ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - ఆత్మిక తండ్రి పేరేమిటి? తప్పకుండా ''శివ'' అనే అంటారు. వారు సర్వుల ఆత్మిక తండ్రి. వారినే ''భగవంతుడు'' అని అంటారు. పిల్లలైన మీలో కూడా నంబరువారు పురుషార్థానుసారంగా తెలుసుకున్నారు. ఆకాశవాణి అని అంటారు కదా. ఇప్పుడు ఎవరి ఆకాశవాణి వినిపిస్తుంది? శివబాబాది. ఈ నోటిని ఆకాశతత్వమని అంటారు అంటే ఆకాశతత్వము నుండే సర్వాత్మల మాటలు వెలువడ్తాయి. ఇక్కడున్న ఆత్మలందరూ తమ తండ్రిని మర్చిపోయారు. అనేక విధాలుగా గాయనము(మహిమ)చేస్తూ ఉంటారు కానీ అర్థము ఏమీ తెలియదు. మహిమ ఇక్కడే చేస్తారు. సుఖంగా ఉన్నప్పుడు ఎవ్వరూ తండ్రిని స్మృతి చేయరు. కోరికలన్నీ అక్కడ పూర్తవుతాయి. ఇక్కడైతే కోరికలు చాలా ఉంటాయి. వర్షాలు పడకపోతే యజ్ఞాలు చేస్తారు. అలాగని సదా యజ్ఞాలు చేస్తూ ఉంటే చేస్తే వర్షాలు కురుస్తాయని కాదు. ఎక్కడైనా కరువు, కాటకాలు (ఫామిన్‌లఖీaఎఱఅవ) సంభవిస్తే భలే యజ్ఞాలు చేస్తారు. అయితే యజ్ఞము ద్వారా ఏమీ జరగదు. ఇది డ్రామా. ఆపదలు ఏవి రావాలో అవి వస్తూనే ఉంటాయి. ఎంతో మంది మనుష్యులు మరణిస్తారు, ఎన్నో జంతువులు మొదలైనవి మరణిస్తూ ఉంటాయి. మానవులు ఎంత దు:ఖితులౌతారు! వర్షాన్ని ఆపేందుకు కూడా ఏదైనా యజ్ఞముందా? పూర్తి కుంభవృష్టిగా(రోకలి లావంత) వర్షము కురిస్తే యజ్ఞము చేస్తారా? ఈ విషయాలన్నీ మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఇతరులకేం తెలుసు?
తండ్రి తానే స్వయంగా అర్థం చేయిస్తున్నారు. మానవులు తండ్రిని మహిమా చేస్తారు, మరియు నిందిస్తారు కూడా! విచిత్రంగా ఉంది కదా. తండ్రిని నిందించడం ఎప్పటి నుండి ప్రారంభమయ్యింది? రావణ రాజ్యము ప్రారంభమైనప్పటి నుండి, ఈశ్వరుని సర్వవ్యాపి అని అనడం అన్నింటికంటే ముఖ్యమైన గ్లాని. దీని వల్లనే దిగజారిపోయారు. నిందించేవారే మన మిత్రులనే గాయనముంది(నిందా హమారీ జో కరే మిత్ర్‌ హమారా సో). అందరికంటే ఎక్కువగా నిందించిందెవరు? పిల్లలైన మీరే. ఇప్పుడు మళ్లీ మిత్రులుగా కూడా పిల్లలైన మీరే అవుతున్నారు. మొత్తం ప్రపంచమంతా గ్లాని చేస్తుంది. అందులో కూడా నంబర్‌వన్‌ మీరే, మళ్లీ మీరే మిత్రులుగా అవుతారు. అందరికంటే సమీప మిత్రులు పిల్లలైన మీరే. మీరే నన్ను నిందించారని అనంతమైన తండ్రి అంటున్నారు. పిల్లలైన మీరే అపకారులుగా అవుతారు. డ్రామా ఎలా తయారు చేయబడి ఉంది? ఇవి విచార సాగర మథనము చేసే విషయాలు. విచార సాగర మథనము అంటే ఎంత మంచి అర్థము వస్తుంది! ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. పిల్లలైన మీరు చదువుకొని ఉపకారము చేస్తారు. యదా యదాహి....... అను గాయనము కూడా భారతదేశానికి సంబంధించిందే. ఆటను చూడండి ఎలా ఉందో! శివజయంతి లేదా శివరాత్రిని కూడా జరుపుకుంటారు. వాస్తవానికి అవతారము ఒక్కటే. రాళ్ళు-రప్పలలో కూడా అవతరించారని అనేశారని తండ్రి ఫిర్యాదు చేస్తున్నారు. గీతను పఠించువారు శ్లోకము చదువుతారు కానీ మాకు తెలియదని అంటారు.
ప్రియాతి ప్రియమైన పిల్లలు మీరే. బాబా ఎవరితో మాట్లాడుతున్నా పిల్లలూ! - పిల్లలూ! అనే అంటారు. తండ్రికి, సర్వాత్మలు నా పిల్లలు అనే దృష్టి పక్కా అయిపోయింది. పిల్లలూ! అను పదము నోటి నుండి వెలువడేవారు ఎవ్వరూ ఉండరు. ఎవరు ఏ పదవి వారో, ఏమిటో అని తెలుస్తుంది. అందరూ ఆత్మలే. ఇది కూడా తయారైన డ్రామా. కాబట్టి దు:ఖము కానీ, సంతోషము కానీ ఏ మాత్రము ఉండదు. అందరూ నా పిల్లలే. కొందరు పాకీ(మెహతర్‌) పని చేసేవారి శరీరాన్ని ధారణ చేశారు, కొందరు మరో శరీరాన్ని ధారణ చేశారు. పిల్లలూ! - పిల్లలూ! అని పిలిచే అలవాటైపోయింది. తండ్రి దృష్టిలో అందరూ ఆత్మలే. వారిలో కూడా పేదవారు చాలా ప్రియమనిపిస్తారు ఎందుకంటే డ్రామానుసారంగా వారు చాలా నిందించారు, ఇప్పుడు మళ్లీ నా వద్దకు వచ్చారు. కేవలం ఈ లక్ష్మీ నారాయణులను మాత్రము ఎవ్వరూ నిందించరు. కృష్ణుని కూడా చాలా నిందించారు. విచిత్రము కదా. కృష్ణుడే పెద్దవాడైన తర్వాత అతడిని నిందించరు. ఈ జ్ఞానము అర్థము చేసుకోవడం చాలా కష్టము(అటపటా). ఇలాంటి గుహ్యమైన విషయాలు ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. అర్థము చేసుకునేందుకు బుద్ధి బంగారు పాత్ర వలె కావాలి. అలా స్మృతియాత్ర ద్వారానే అవ్వగలదు. ఇక్కడ కూర్చున్నా యథార్థంగా స్మృతి చేయరు! మనము అతిచిన్న(సూక్ష్మమైన) ఆత్మలము, స్మృతి కూడా బుద్ధి ద్వారా చేయాలని అర్థము చేసుకోరు, ఇది బుద్ధిలోకి రాదు. ఇంత సూక్ష్మమైన చిన్న ఆత్మ మన తండ్రి కూడా అయ్యారు, టీచరు కూడా అయ్యారని బుద్ధిలోకి రావడము కూడా అసంభవమవుతుంది. బాబా - బాబా అనేమో అంటారు, ''దు:ఖములో అందరూ స్మృతి చేస్తారు, సుఖములో ఎవ్వరూ స్మృతి చేయరు'' అని భగవానువాచ కదా. స్మృతి చేయవలసిన అవసరమే ఉండదు. ఇక్కడైతే ఎంతో దు:ఖము, ఎన్నో ఆపదలు మొదలైనవి సంభవిస్తాయి. భగవంతుడా!, దయ చూపండి, కృప చూపండి అని స్మృతి చేస్తారు. ఇప్పుడు పిల్లలుగా అయిన తర్వాత కూడా దయ చూపండి, కరుణ చూపండి, శక్తిని ఇవ్వండి అని వ్రాస్తూ ఉంటారు. మీ అంతకు మీరే యోగబలము ద్వారా శక్తిని తీసుకోండని తండ్రి వ్రాస్తారు. మీ పై మీరే దయ, కరుణను చూపుకోండి. మీ అంతకు మీరే రాజ్యతిలకాన్ని దిద్దుకోండి. ఎలా దిద్దుకోవాలో యుక్తి తెలుపుతాను. చదువుకునే యుక్తిని టీచరు తెలుపుతారు. చదవడం విద్యార్థి కర్తవ్యము. తండ్రి చూపించిన మార్గములో నడవాలి, ఆదేశానుసారము నడవాలి. ఆశీర్వాదం చేసేందుకు, కృప చూపించేందుకు టీచరు, గురువేమీ కాదు. మంచి పిల్లలైన వారు పరుగు తీస్తారు. ప్రతి ఒక్కరూ స్వతంత్రులు. ఎంతగా పరుగు తీయాలంటే అంత పరుగు తీయవచ్చు. ఈ స్మృతియాత్రయే పరుగు.
ప్రతి ఆత్మ స్వతంత్రమైనది. సహోదర-సహోదరి సంబంధాన్ని కూడా విడిపించేశారు. సోదరులు (భాయి - భాయి)గా భావించినా చెడు(అశుద్ధ) దృష్టి(క్రిమినల్‌ ఐ) వదలడం లేదు. అది తన పని తాను చేస్తూ ఉంటుంది. ఈ సమయంలో మనుష్యుల అవయవాలన్నీ వికారి(క్రిమినల్‌)గానే ఉన్నాయి. ఎవరినైనా కాలితో తన్నినా, ఘూసా(ముష్టిఘాతము) ఇచ్చినా క్రిమినల్‌ అవయవమౌతుంది కదా. అవయవాలన్నీ క్రిమినల్‌గా ఉన్నాయి. అక్కడ ఏ అవయవమూ చెడు(క్రిమినల్‌)గా ఉండదు. ఇక్కడ ప్రతి అవయవముతో చెడు(క్రిమినల్‌) పని చేస్తూ ఉంటారు. అన్నింటికంటే క్రిమినల్‌ అవయవము ఏది? కళ్ళు. వికారపు ఆశ పూర్తి కాకుంటే కొట్టడం ప్రారంభిస్తారు. మొట్టమొదట మోసం చేసేవి కనులు అందుకే సూరదాస్‌ కథ కూడా ఉంది. శివబాబా అయితే ఏ శాస్త్రాలను చదవలేదు. ఈ రథము(బ్రహ్మబాబా) చదివాడు. శివబాబాను జ్ఞానసాగరులని అంటారు. శివబాబా ఏ పుస్తకమును తీసుకోరని మీకు తెలుసు. నేను జ్ఞానసాగరుడను, బీజరూపుడను. ఇది సృష్టి రూపి వృక్షము, దీని రచయిత తండ్రి, బీజము. బాబా అర్థం చేయిస్తున్నారు - నా నివాస స్థానము మూలవతనములో ఉంది. ఇప్పుడు నేను ఈ శరీరములో విరాజమానమై ఉన్నాను. మరెవ్వరూ నేను ఈ మనుష్య సృష్టికి బీజరూపమని చెప్పలేరు. నేను పరమపిత పరమాత్మను అని ఎవ్వరూ చెప్పలేరు. బుద్ధివంతుల ఎదుట ఎవరైనా ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్తే, ఏమిటి మీరు కూడా ఈశ్వరుడా? అని వెంటనే అడుగుతారు. మీరు అల్లా-సాయినా? సాధ్యమే లేదు. కానీ ఈ సమయములో బుద్ధివంతులు ఎవ్వరూ లేరు. అల్లా గురించే తెలియదు, స్వయమే 'నేను అల్లాను' అని చెప్పుకుంటారు. వారు కూడా ఆంగ్లములో ఓమ్‌నీ ప్రెజెంట్‌ అని అంటారు. అర్థము చేసుకొని ఉంటే ఎప్పుడూ అలా అనరు. పిల్లలు ఇప్పుడు - శివబాబా జయంతి అంటే నూతన విశ్వపు జయంతి అని తెలుసుకున్నారు. అందులో పవిత్రత, సుఖ-శాంతులు అన్నీ వచ్చేస్తాయి. శివజయంతియే కృష్ణ జయంతి, అదే దశరా జయంతి. శివజయంతియే దీపావళి జయంతి, శివజయంతియే స్వర్గ జయంతి. ఇందులో అన్ని జయంతులు ఇమిడి ఉన్నాయి. ఈ కొత్త విషయాలన్నీ తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. శివజయంతి అంటే శివాలయ జయంతి, వేశ్యాలయ వర్ధంతి(మరణ దినము). ఈ కొత్త విషయాలన్నీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. శివజయంతియే నూతన విశ్వజయంతి. విశ్వములో శాంతి నెలకొనాలి అని కోరుకుంటారు. మీరు ఎంత బాగా అర్థం చేయించినా మేలుకోరు. అజ్ఞాన అంధకారములో నిద్రించి ఉన్నారు కదా. భక్తి చేస్తూ మెట్లు క్రిందకు దిగుతూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు - నేను వచ్చి అందరికి సద్గతినిస్తాను. స్వర్గ - నరకాల రహస్యాన్ని తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. మిమ్ములను నిందించే వార్తాపత్రికల వారికి వ్రాయండి - మమ్ములను నిందించేవారే మా మిత్రులు. మేము మీకు కూడా తప్పకుండా సద్గతిని కలుగచేస్తాము. మీరు ఎంత కావాలో అంతగా నిందించండి. స్వయం ఈశ్వరుడినే నిందిస్తారు. మమ్ములను నిందిస్తే ఏమయ్యింది? మేము తప్పకుండా మీకు సద్గతిని కలిగిస్తాము. మీకు ఇష్టం లేకపోయినా ముక్కుతో పట్టుకుని తీసుకెళ్తాము. ఇందులో భయపడే విషయమే లేదు, ఏది చేస్తారో కల్పక్రితము కూడా చేశారు. మేము బ్రహ్మకుమారీలము, అందరి సద్గతి చేస్తాము అని బాగా అర్థం చేయించాలి. అబలల పై అత్యాచారము కల్పక్రితము కూడా జరిగింది, కానీ ఇది పిల్లలు మర్చిపోతారు. తండ్రి చెప్తున్నారు - అనంతమైన పిల్లలందరూ నన్ను నిందిస్తారు అయినా అందరికంటే నాకు పిల్లలే ప్రియమైన మిత్రులు. పిల్లలు పుష్పాలుగా ఉంటారు. పిల్లలను తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుంటారు, తల పై కూర్చోబెట్టుకుంటారు, వారి సేవ చేస్తారు. బాబా కూడా పిల్లలైన మీకు సేవ చేస్తారు.
ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానము లభించింది, దీనిని మీరు జతలో తీసుకెళ్తారు. ఎవరైతే తీసుకోరో వారికి కూడా డ్రామాలో పాత్ర ఉంది. వారు అదే పాత్రను అభినయిస్తారు. లెక్కాచారాలను చుక్త చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు, స్వర్గమునైతే చూడలేరు. అందరూ స్వర్గాన్ని చూడలేరు. ఇది తయారు చేయబడిన డ్రామా. లెక్కలేనన్ని పాపాలు చేస్తారు. వచ్చేది కూడా ఆలస్యంగానే. తమోప్రధానమైన వారు చాలా ఆలస్యంగా వస్తారు, ఇది కూడా బాగా అర్థము చేసుకోవాల్సిన రహస్యము. మంచి మంచి మహారథుల పై కూడా గ్రహచారము కూర్చున్నప్పుడు వెంటనే వారికి కోపము వచ్చేస్తుంది తర్వాత జాబు కూడా వ్రాయరు. బాబా కూడా అటువంటి వారికి మురళి పంపడము ఆపేయండి అని చెప్తారు - అలాంటి వారికి తండ్రి ఖజానా ఇచ్చినా లాభమేముంది? మళ్లీ కళ్ళు తెరచుకుంటే తప్పు జరిగిపోయిందని చెప్తారు. కొందరైతే లెక్క చేయరు, ఇంత అజాగ్రత్తగా ఉండరాదు. చాలామంది తండ్రిని స్మృతి కూడా చేయరు. ఎవ్వరినీ తమ సమానంగా కూడా చేయరు, లేకుంటే '' బాబా అనుక్షణము మిమ్ములను స్మృతి చేస్తున్నాము '' అని తండ్రికి వ్రాయాలి. కొందరైతే ఫలానావారిని అడిగినట్లు చెప్పండని అందరి పేర్లు వ్రాస్తుంటారు. ఇది సత్యమైన స్మృతి కాదు, అసత్యము నడవదు. రోజురోజుకు బాబా గుహ్యమైన విషయాలు అర్థం చేయిస్తూ ఉంటారు. దు:ఖపు కొండలు విరిగి పడనున్నాయి. సత్యయుగములో దు:ఖము పేరు కూడా ఉండదు. ఇప్పుడిది రావణరాజ్యము. మైసూరు మహారాజు కూడా రావణుని దిష్ఠిబొమ్మను మొదలైనవి తయారు చేయించి దశరా చాలా వైభవంగా జరుపుతుంటారు. రాముని భగవంతుడని అంటారు, రాముని సీత దొంగలించబడింది. వారు సర్వశక్తివంతులైనప్పుడు సీతను ఎలా దొంగలించగలరు? ఇదంతా మూఢ నమ్మకము. ఈ సమయంలో ప్రతి ఒక్కరిలో 5 వికారాల మురికి ఉంది. భగవంతుని సర్వవ్యాపి అని అనడం చాలా పెద్ద అసత్యము. అందుకే తండ్రి యదా యదాహి......... అని చెప్తారు. నేను వచ్చి సత్య ఖండాన్ని, సత్య ధర్మాన్ని స్థాపన చేస్తాను. సత్యయుగమును సత్య ఖండమని, కలియుగమును అసత్య ఖండమని అంటారు. ఇప్పుడు తండ్రి అసత్య ఖండమును సత్య ఖండముగా తయారు చేస్తారు. మంచిది. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. ఈ గుహ్యమైన లేక కఠినమైన జ్ఞానమును అర్థము చేసుకునేందుకు బుద్ధిని స్మృతియాత్ర ద్వారా బంగారు పాత్రగా చేసుకోవాలి. స్మృతి పరుగు తీయాలి.

2. తండ్రి ఇచ్చే సూచనల పై నడుచుకొని, చదువును శ్రద్ధగా చదువుకుని తమ పై తాము దయ లేక ఆశీర్వాదాలను చూపుకోవాలి, తమకు తామే రాజ్యతిలకమును దిద్దుకోవాలి. నిందించువారిని తమ మిత్రులని భావించి వారికి కూడా సద్గతినివ్వాలి.

వరదానము :-

'' రాయల్‌ మరియు సింపుల్‌ (సాధారణము) - రెండిటి బ్యాలన్స్‌ ద్వారా కార్యము చేసే బ్రహ్మాబాబా సమాన్‌ భవ ''

బ్రహ్మాబాబా చాలా ఉన్నతంగానూ, చాలా తక్కువగానూ లేక సాధారణంగా ఉన్నారు. ఆది నుండి ఇంతవరకు కేవలం సాధారణంగా గానీ, చాలా రాయల్‌గా గానీ ఉండడం నియమం కాదు. రెండిటి మధ్యలో ఉండాలి. ఇప్పుడు సాధనాలు చాలా ఉన్నాయి, సాధనాలు ఇచ్చేవారు కూడా ఉన్నారు. అయినా ఏ కార్యము చేసినా మధ్యస్తంగా చేయండి. ఇక్కడ రాజుల ఆడంబరముందని ఎవ్వరూ అనరాదు. ఎంత సింపుల్‌గా ఉంటుందో అంత రాయల్‌గా ఉండాలి. రెండిటి బ్యాలన్స్‌ ఉండాలి.

స్లోగన్‌ :-

'' ఇతరులను చూచేందుకు బదులు స్వయాన్ని చూడండి - ''నేను ఏ కర్మ చేస్తానో, నన్ను చూసి ఇతరులు చేస్తారు'' అని గుర్తుంచుకోండి. ''