28-03-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - ముళ్ళ అడవిని సమాప్తము చేసి పుష్పాల తోటగా తయారు చేయడం తండ్రి కర్తవ్యము. దీని ద్వారానే నంబర్వన్ కుటుంబ నియంత్రణ (ఫ్యామిలీ ప్లానింగ్) జరుగుతుంది.''
ప్రశ్న :-
కుటుంబ నియంత్రణకు ఫస్ట్క్లాస్ శాస్త్రము ఏది ? ఎలా ?
జవాబు :-
కుటుంబ నియంత్రణకు ఫస్ట్క్లాస్ శాస్త్రము గీత. ఎందుకంటే గీత ద్వారానే తండ్రి అనేక ధర్మాలను వినాశనము చేసి ఒక్క ధర్మమునే స్థాపన చేశారు. గీతలోనే భగవంతుడు కామము మహాశత్రువనే మహావాక్యము ఉచ్ఛరించారు. ఎప్పుడైతే కామశత్రువు పై విజయము పొందుతారో అప్పుడు కుటుంబ నియంత్రణ స్వతహాగా జరిగిపోతుంది. ఈ కర్తవ్యము తండ్రి ఒక్కరిదే. ఈ కర్తవ్యము ఏ మనిషిదీ కాదు.
ఓంశాంతి.
భగవానువాచ! తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థము చేయిస్తున్నారు - ఈ ప్రపంచాన్ని తప్పకుండా ఆసురీ ప్రపంచమని అంటారు. నూతన ప్రపంచాన్ని దైవీ ప్రపంచమని అంటారు. దైవీ ప్రపంచములో మనుష్యులు చాలా కొద్దిమందే ఉంటారు. ఇప్పుడు ఈ రహస్యము కూడా అందరికీ అర్థం చేయించాలి. కుటుంబ నియంత్రణ మంత్రి ఎవరైతే ఉన్నారో, వారికి అర్థము చేయించాలి. గీత ప్రకారము ఈ కర్తవ్యము ఆ ఒక్క తండ్రిదేనని చెప్పండి. గీతనైతే అందరూ అంగీకరిస్తారు. గీత కుటుంబ నియంత్రణా శాస్త్రము. గీత ద్వారానే తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. డ్రామాలో వారికి ఈ పాత్ర స్వతహాగా నిర్ణయించబడి ఉంది. తండ్రియే వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు అనగా పవిత్రమైన జాతీయతను స్థాపన చేస్తారు. స్వయాన్ని దేవీదేవతా ధర్మానికి చెందిన వారమనే అంటారు. అనేక ధర్మములన్నిటినీ వినాశనము చేసేందుకు, ఒకే ధర్మాన్ని స్థాపన చేసేందుకు వస్తానని గీతలో భగవానుడు స్పష్టంగా తెలిపించారు. కనుక దీని ద్వారా కుటుంబ నియంత్రణ నంబర్వన్గా జరిగిపోతుంది. పూర్తి సృష్టి పై జయ జయ ధ్వనులు వెలువడ్తాయి. మళ్లీ ఒక్క దేవీ దేవతా ధర్మము స్థాపనవుతుంది. ఇప్పుడైతే మనుష్యుల సంఖ్య చాలా అధికంగా ఉన్నందున చాలా మురికిగా తయారయ్యింది. అక్కడ పశు-పక్ష్యాదులన్నీ ఫస్ట్క్లాస్గా ఉంటాయి. వాటిని చూస్తూనే హృదయము సంతోషంతో పొంగిపోతుంది. భయపడే మాటే ఉండదు. తండ్రి కూర్చుని అర్థము చేయిస్తున్నారు - మీరు నన్ను పిలిచిందే ఎందుకంటే కుటుంబ నియంత్రణ చేసి పతిత కుటుంబాలను వాపస్ తీసుకెళ్లి, పావన కుటుంబాలను స్థాపన చేసేందుకే. మీరందరూ - ''బాబా! మీరు వచ్చి పతిత ప్రపంచాన్ని సమాప్తము చేసి నూతన పావన ప్రపంచాన్ని తయారు చేయమని నన్ను పిలుస్తూ వచ్చారు. ఈ ప్లానింగ్(ప్రణాళిక) అంతా తండ్రిదే. చూస్తూనే హృదయము సంతోషిస్తుంది. లక్ష్మీనారాయణులను చూస్తే మీ హృదయము సంతోషిస్తుంది కదా. అచ్చట యథా రాజా - రాణి, తథా ప్రజలు అందరూ ఫస్ట్క్లాస్గా ఉంటారు. ఈ కుంటుంబ నియంత్రణ యుక్తి కూడా డ్రామాలో రచింపబడి ఉంది. పారలౌకిక తండ్రి సత్యయుగ ప్లాన్ ఫస్ట్క్లాస్గా చేస్తారని ముళ్ల అడవిని సమాప్తము చేస్తారని పిల్లలైన మీరు అందరికీ తెలపండి. ఈ ఎండిపోయిన వెదురు అడవి(భంబోర్)కి అగ్ని తగులుకుంటుంది. ఈ పని తండ్రిదే. మీరు ఏమీ చేయలేరు, ఎంత శ్రమ చేసినా విజయవంతము అవ్వలేరు అని కూడా చెప్పండి. తండ్రి చెప్తున్నారు - ఏ కామ వికారమునైతే, మీరు మీ మిత్రునిగా భావిస్తారో, అది మీకు చాలా గొప్ప శత్రువు. దానికి మిత్రులయ్యేవారు చాలామంది ఉన్నారు. తండ్రి దీని పై విజయము పొందమని ఆర్డినెన్స్ (అత్యవసర సమయములో రాష్ట్రపతి జారీ చేయు ప్రత్యేకమైన ఆజ్ఞ) జారీ చేస్తున్నారు. కామము మహాశత్రువని తండ్రి చెప్తున్నారని మీరు అందరికీ అర్థము చేయించండి. కుటుంబ నియంత్రణ ఎలా జరుగుతూ ఉందో పాపం వారికి తెలియనే తెలియదు. కల్ప-కల్పము డ్రామానుసారము ఈ కర్తవ్యాన్ని తండ్రి చేస్తారు. ఇప్పుడు మళ్లీ అది జరిగే తీరుతుంది. సత్యయుగములో మనుష్యులు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఇందులో చింతించే మాటే లేదు. తండ్రి ప్రాక్టికల్గా ఈ పని చేస్తున్నారు. ప్రపంచములోని వారు ఎంతగానో తల బాదుకుంటారు(కష్టపడ్తారు). విద్యామంత్రికి కూడా ఇది అర్థము చేయించండి. ఇప్పటి మనుష్యుల నడవడిక(క్యారెక్టర్) చాలా చెడిపోయింది. దేవతల క్యారెక్టర్ చాలా బాగుండేది. ఇది మీ మినిష్టర్లు చేసే పని కాదని, ఇది ఉన్నతోన్నతమైన తండ్రి కర్తవ్యమని మీరు భయపడకుండా గట్టిగా చెప్పండి. ఈ దేవతల రాజ్యములో ఒకే ధర్మము, ఒకే రాజ్యము, ఒకే భాష ఉండేది. చాలా కొద్దిమంది మాత్రమే మనుష్యులుండేవారు కానీ ఈ విషయాలను చాలా యుక్తిగా తెలపడం కొద్దిమందికి మాత్రమే వస్తుంది. అలా చెప్పాలని ఆత్మిక నషా అందరికీ ఉండదు. వారికి ఈ లక్ష్మీనారాయణుల చిత్రము చూపించాలి. ఇటువంటి కుటుంబ నియంత్రణ ఇంతకు ముందు తండ్రియే వచ్చి చేశారు. ఇప్పుడు మళ్లీ చేస్తున్నారు. వీరి రాజ్యము స్థాపన అవుతూ ఉంది.
బాబా చెప్తున్నారు! - ఈ లక్ష్మీనారాయణుల చిత్రాన్ని ఎల్లప్పుడూ ఎదురుగా ఉంచుకోండి. లైట్లు మొదలైనవి బాగా వెలిగించండి. అమృతవేళ ప్రదక్షిణలో ఈ ట్రాన్స్లైట్ చిత్రముండాలి. ఎవరైనా స్పష్టంగా చూడగలగాలి. మేము కుటుంబ నియంత్రణ చేస్తున్నామని చెప్పండి. యథా రాజా-రాణి తథా ప్రజా(రాజా-రాణి ఎలా ఉంటారో, ప్రజలు కూడా అలాగే ఉంటారు) దేవతా వంశ స్థాపన జరుగుతోంది. మిగిలినవన్నీ వినాశనమైపోతాయి. ఓ పతితపావనా! మీరు వచ్చి మమ్ములను పావంగా చేయమని మీరు పిలువను కూడా పిలుస్తారు. ఆ విధంగా పావనంగా చేయగలిగిన వారు తండ్రి ఒక్కరే. ఒక్క దేవీ దేవతా ధర్మము మాత్రమే పావనంగా ఉంటుంది. మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి. ఈ ప్లానింగ్ అంతా ఒక్క శివబాబా చేతిలో మాత్రమే ఉందని చెప్పండి. సత్యయుగములో ఈ ప్లానింగ్ అమలులో ఉంటుంది. అచ్చట ఉండేదే దేవతా వంశము, శూద్రులు ఉండరు. ఇది చాలా ఫస్ట్క్లాస్ ప్లానింగ్. మిగిలిన ధర్మాలన్నీ వినాశనమైపోతాయి. అందరూ వచ్చి ఈ తండ్రి ప్రణాళికను అర్థం చేసుకోండి. మీరు చెప్పే ఈ మాటలు విని మీకు చాలా మంది సమర్పణమైపోతారు. ఈ మినిస్టరు మొదలైనవారు నిర్వికారుల ప్లానింగును ఎలా తయారు చేయగలరు? ఈ ప్లాన్ చేసేందుకు అత్యంత ఉన్నతమైన భగవంతుడే స్వయంగా వస్తారు. మిగిలిన అనేక ధర్మాలన్నీ సమాప్తం చేసేస్తారు. ఇదంతా అనంతమైన తండ్రి చేతిలో ఉంది. పురాతన వస్తువులను కొత్తవిగా చేసేస్తారు. తండ్రి నూతన ప్రపంచ స్థాపన చేసి పాత ప్రపంచాన్ని వినాశనము చేసేస్తారు. ఇది డ్రామాలో రచింపబడింది. ఓ సోదరీ-సోదరులారా! ఈ సృష్టి చక్ర ఆది-మధ్య-అంత్యములు మీకు తెలియవు. ఇది తండ్రి తెలియజేస్తున్నారు, వచ్చి తెలుసుకోండి అని అందరికీ తెలపాలి. సత్యయుగము ఆదిలో ఇంతమంది మనుష్యులు ఉండరు. ఫ్యామిలి ప్లానింగ్ మొదలైన మాటలు కూడా ఉండవు. మొదట మీరు వచ్చి సృష్టి ఆది-మధ్య-అంత్యములను అర్థము చేసుకోండి. సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. సద్గతి అనగా సత్యయుగీ మనుష్యులు మొట్టమొదట ఈ దేవీ దేతలు చాలా కొద్దిమంది మాత్రమే ఉండేవారు. ఫస్ట్క్లాస్ ధర్మముండేది. బాబా పుష్పాల ఫస్ట్క్లాస్ ప్లానింగ్ తయారు చేస్తారు. కామము మహాశత్రువు, ఈ రోజుల్లో ఈ కామము కొరకు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. ఎవరైనా, ఎవరినైనా ప్రేమిస్తే, మనస్సు పడితే, తల్లిదండ్రులు వారితో వివాహము జరిపించకుంటే ఇంటిలో పెద్ద హంగామా (గలాటా) చేసేస్తారు. ఇది చాలా మురికి ప్రపంచము, అందరూ ఒకరికొకరు(పరస్పరము) ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు. సత్యయుగములో అయితే పుష్పాల వర్షము కురుస్తుంది. ఈ విధంగా విచార సాగర మథనము చేయండి. బాబా మనకు ఆదేశాలిస్తూ ఉంటారు. మీరు వాటిని ఇంకా రిఫైన్(విశుద్ధము) చేసి సులభము చేయండి. చిత్రాలు కూడా రకరకాలుగా తయారు చేస్తారు. డ్రామానుసారము జరిగేదంతా మంచిదే. ఇతరులకు అర్థం చేయించడం కూడా చాలా సులభము. అందరి దృష్టిని తండ్రి వైపుకు ఆకర్షింపజేయాలి. ఈ కర్తవ్యము తండ్రిది మాత్రమే. ఇప్పుడు తండ్రి పైన కూర్చొని ఉన్నారు. ఈ పని చేయరు. ఎప్పుడెప్పుడు ధర్మగ్లాని జరుగుతుందో ఆసురీ రాజ్యముంటుందో అప్పుడు నేను వచ్చి ఇవన్నీ సమాప్తము చేసి దైవీరాజ్య స్థాపన చేస్తానని కూడా చెప్తున్నారు. మనుష్యులైతే అజ్ఞాన నిద్రలో నిదురిస్తున్నారు. ఇదంతా వినాశనమైపోతుంది. ఎవరైతే నిర్వికారులుగా అవుతారో వారి కుటుంబమే వచ్చి రాజ్యపాలన చేస్తుంది. బ్రహ్మ ద్వారా స్థాపన అను గాయనము(మహిమ) కూడా ఉంది. దేని స్థాపన? ఈ కుటుంబ స్థాపన(లక్ష్మినారాయణ). ఈ ప్లానింగ్ జరుగుతోంది. బ్రహ్మకుమార-కుమారీలు పవిత్రంగా అవుతున్నారంటే వారి కొరకు నూతన పవిత్ర ప్రపంచము తప్పకుండా కావాలి. ఈ పురుషోత్తమ సంగమ యుగము చాలా చిన్నది. ఇంత కొద్ది సమయములో ఎంత మంచి ప్లానింగ్ చేస్తారు! అందరి లెక్కాచారాలు చుక్తా చేయించి తండ్రి తమ ఇంటికి తీసుకెళ్తారు. ఈ మురికినంతటినీ తీసుకుపోరు. ఛీ-ఛీ ఆత్మలు వెళ్లలేరు. అందువలన తండ్రి వచ్చి సుగంధ పుష్పాలుగా చేసి తీసుకెళ్తారు. ఇటువంటి విషయాల పై విచార సాగర మథనము చేయండి. మీరు రియలైజ్ అనగా స్పష్టంగా తెలుసుకొని అనుభవము చేస్తూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు - నేను ఏకధర్మ స్థాపన చేయడం ఎలాగో మీతో రిహార్సల్ చేయిస్తున్నాను. ఈ కుటుంబ నియంత్రణ ఎవరు చేశారు? తండ్రి చెప్తున్నారు - కల్పక్రితము వలె నేను నా కర్తవ్యాన్ని చేస్తున్నాను. పతిత కుటుంబాలను పరివర్తన చేసి పావన కుటుంబ స్థాపన చేయమని అందరూ పిలుస్తారు. ఈ సమయములో అందరూ పతితులుగానే ఉన్నారు. వివాహాలకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. ఎంతో ఆనందంగా చేస్తారు. ఇంకా పావనము నుండి పతితులుగా అయిపోతారు.
ఇప్పుడు పిల్లలైన మీరు ఇదే ఈశ్వరీయ వ్యాపారము చేయాలి. అందరికీ అర్థం చేయించాలి, అందరూ ఆసురీ నిద్రలో నిదురపోతున్నారు. వారిని మేల్కొల్పాలి, పవిత్రముగా తయారై ఇతరులను కూడా పవిత్రంగా తయారు చేయాలి. అలా చేస్తే తండ్రి కూడా ప్రేమిస్తారు. సేవనే చేయకుంటే ఏం లభిస్తుంది? ఎవరైనా చక్రవర్తులుగా అయినారంటే తప్పకుండా మంచి కర్మలు చేసి ఉంటారు. ఇది ఎవరైనా అర్థము చేసుకుంటారు. వీరు రాజా - రాణి, మనము దాస-దాసులైతే పూర్వ జన్మలో అటువంటి కర్మలే చేసి ఉంటాము. చెడు కర్మలు చేస్తే చెడు జన్మలు లభిస్తాయి. కర్మల రహస్యము, ఫలితము గుప్తముగా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు తండ్రి మీకు శ్రేష్ఠ కర్మలు చేయడం నేర్పిస్తారు. ప్రపంచములోని వారు కూడా పూర్వ జన్మల కర్మానుసారమే ఇలా అయ్యారని భావిస్తారు. పోతే ఏ కర్మలు చేశారో వారు తెలుసుకోరు. కర్మలు గాయనం చేయబడ్తాయి. ఎవరు ఎంత శ్రేష్ఠ కర్మలు ఆచరిస్తారో వారు అంత ఉన్నత పదవిని పొందుతారు. శ్రేష్ఠ కర్మల ద్వారానే శ్రేష్ఠంగా తయారవుతారు. మంచి కర్మలు చేయకపోతే కసువు ఊడుస్తారు, బరువులు మోస్తారు. కర్మల ఫలమని అంటారు కదా. కర్మల సిద్ధాంతము నడుస్తూ ఉంటుంది. శ్రీమతము ద్వారా మంచి కర్మలు జరుగుతాయి. చక్రవర్తి ఎక్కడ, దాస-దాసీలు ఎక్కడ? తండ్రి చెప్తున్నారు - ఇప్పుడు తండ్రిని అనుసరించండి(ఫాలో ఫాదర్). నా శ్రీమతమును అనుసరిస్తే ఉన్నత పదవి పొందుతారు. తండ్రి సాక్షాత్కారాలు కూడా చేయిస్తారు. ఈ మమ్మా-బాబా, పిల్లలు ఇంత ఉన్నతమవుతున్నారంటే అది కూడా కర్మలననుసరించే కదా. చాలామంది పిల్లలు కర్మలను అర్థము చేసుకోరు. చివరిలో అందరికీ సాక్షాత్కారమవుతుంది. బాగా చదువుకొని, వ్రాసుకుంటే నవాబులుగా అవుతారు. జల్సాగా తిరిగితే, చదువుకోకుంటే చెడిపోతారు. ఆ లౌకిక చదువులో కూడా ఇలాగే జరుగుతుంది. భగవానువాచ - ఈ సమయములో మొత్తం ప్రపంచమంతా కామచితి పై కాలిపోయి మరణించి ఉంది. స్త్రీని చూస్తేనే స్థితి చెడిపోతుందని అంటారు. కానీ అక్కడ ఈ విధంగా స్థితి చెడిపోదు. తండ్రి చెప్తున్నారు - నామ-రూపాలను చూడనే చూడండి. భాయి-భాయి(సోదర) దృష్టితో చూడండి. ఇది చాలా గొప్ప గమ్యము. విశ్వమంతటికీ యజమానులుగా అవ్వాలి. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి యజమానులుగా ఎలా అయ్యారో ఎవరి బుద్ధిలోనూ లేదు. నేను మిమ్ములను స్వర్గానికి అధికారులుగా చేస్తానని తండ్రి చెప్తున్నారు. ఈ లక్ష్మీనారాయణులు సర్వ గుణ సంపన్నులుగా ఉండేవారు. ఈ సమయంలో మీరు ఎవరిదైతే క్రొత్త రక్తమని భావిస్తున్నారో వారేమి చేస్తున్నారో చూడండి! గాంధీజీ ఇలా చేయమని నేర్పించిపోయారా? రామరాజ్యము తయారు చేసేందుకు కూడా యుక్తి కావాలి. ఈ కర్తవ్యము తండ్రిదే. తండ్రి అయితే సదా పవిత్రులు కానీ మీరు 21 జన్మలు పవిత్రంగా ఉండి మళ్లీ 63 జన్మలు పతితులుగా అయిపోతారు. ఇతరులకు అర్థము చేయించేందుకు ఎంతో నషా ఉండాలి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు - పిల్లలూ! పవిత్రంగా అవ్వండి. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మీ స్థితిని సదా ఏకరసంగా, స్థిరంగా ఉంచుకునేందుకు ఎవరి నామ-రూపాలనూ చూడరాదు. భాయి-భాయి అనగా సోదరాత్మనే చూడండి. దృష్టిని పావనంగా చేసుకోండి. ఇతరులకు అర్థం చేయించునప్పుడు ఆత్మిక నషాను ధారణ చేయండి.
2. తండ్రి ప్రేమను పొందేందుకు తండ్రి సమానమైన కర్తవ్యాన్ని చేయండి, ఆసురీ నిద్రలో నిదురించు వారిని మేల్కొల్పండి. పవిత్రంగా అయ్యి ఇతరులను పవిత్రంగా చేయాలి.
వరదానము :-
''బాలకుని నుండి మాలికుని స్మృతి ద్వారా సర్వ ఖజానాలను స్వంతంగా చేసుకునే స్వరాజ్య అధికారీ భవ''
ఈ సమయంలో పిల్లలైన మీరు కేవలం బాలకులు కాదు, బాలకుల నుండి మాలికులు. ఒకటేమో స్వరాజ్య అధికారి మాలికులు, రెండవది తండ్రి వారసత్వానికి మాలికులు. స్వరాజ్య అధికారులైనప్పుడు మీ సర్వ కర్మేంద్రియాలు ఆజ్ఞానుసారం ఉండాలి. కానీ సమయ ప్రతి సమయం మాలికుడను(యజమానిని) అనే స్మృతిని మరపింపజేసి వశపరచుకునేది ఈ మనసు. అందువలన తండ్రి ఇచ్చిన మంత్రము మన్మనాభవ. 'మన్మనాభవ' గా ఉన్నందున ఎలాంటి వ్యర్థ విషయాల ప్రభావము పడదు. అంతేకాక అన్ని ఖజానాలు 'నా స్వంతము' అని అనుభవమవుతుంది.
స్లోగన్ :-
''పరమాత్మ ప్రేమ అనే ఊయలలో ఎగిరే కళ ఆనందాన్ని జరుపుకోవడమే అన్నింటికంటే శ్రేష్ఠ భాగ్యము''