31-07-19 ఉదయయు యుి ఓం௦ాంతి బాప్దాదా యధుఠయు
'' మధురమైన పిల్లలారా - రక్షాబంధన పండుగ
ప్రతిజ్ఞ చేసే పండుగ. ఇది సంగమ యుగము నుండే ప్రారంభమవుతుంది, మీరిప్పుడు పవిత్రంగా
తయారై ఇతరులను తయారు చేస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. ''
ప్రశ్న:-
మీ
కార్యాలన్నీ ఏ విషయము ఆధారము పై సఫలమవ్వగలవు? ఏ విధంగా పేరు ప్రసిద్ధి చెందుతుంది?
జవాబు:-
జ్ఞాన బలముతో
పాటు యోగబలము కూడా ఉండాలి. అప్పుడు అన్ని కార్యాలు వాటంతకవే అయిపోతాయి. యోగము చాలా
గుప్తమైనది. దీని ద్వారా మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. యోగ స్థితిలో ఉండి
అర్థం చేయిస్తే వార్తాపత్రికలవారు కూడా వారంతట వారే మీ సందేశమును ముద్రిస్తారు.
వార్తాపత్రికల ద్వారానే పేరు ప్రసిద్ధి చెందాలి, వీటి ద్వారానే చాలా మందికి సందేశము
లభిస్తుంది.
ఓంశాంతి.
ఈ రోజు పిల్లలకు రక్షాబంధనము గురించి అర్థం చేయిస్తారు ఎందుకంటే ఇప్పుడు ఆ పండుగ
త్వరలో రానున్నది. పిల్లలు రాఖీ కట్టేందుకు వెళ్తారు, జరిగిపోయిన దానిని పండుగగా
జరుపుకుంటారు. నేటి నుండి 5 వేల సంవత్సరాల క్రితము కూడా ప్రతిజ్ఞా పత్రము
వ్రాయించారు. దీనికి చాలా పేర్లు పెట్టారని మీకు తెలుసు, ఇది పవిత్రతకు చిహ్నము.
పవిత్రంగా తయారయ్యేందుకు రాఖిని కట్టుకోండని అందరికీ చెప్పవలసి ఉంటుంది. సత్యయుగ
ఆదిలోనే పవిత్రమైన ప్రపంచముంటుందని కూడా మీకు తెలుసు. ఈ పురుషోత్తమ సంగమయుగములో రాఖి
పండుగ ప్రారంభమవుతుంది, తర్వాత భక్తి ప్రారంభమైనప్పుడు దీనిని జరుపుకుంటారు. దీనిని
అనాది పండుగ అని అంటారు. అది కూడా ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది? భక్తిమార్గము నుండి
ప్రారంభమవుతుంది ఎందుకంటే సత్యయుగములో ఈ పండుగలు మొదలైనవేవీ ఉండవు. ఇవి ఇక్కడే
జరుగుతాయి. పండుగలు మొదలైనవి సంగమయుగములోనే జరుగుతాయి, అవే మళ్లీ భక్తిమార్గము నుండి
ప్రారంభమవుతాయి. సత్యయుగములో ఏ పండుగా జరుగదు. అక్కడ దీపావళి ఉంటుందని చెప్తారా?
లేదు. అది కూడా ఇక్కడే జరుపుకుంటారు, అక్కడ జరుపుకోరు. ఇక్కడ జరుపుకునే దానిని
అక్కడ ఆచరించరు. ఇవన్నీ కలియుగ పండుగలు. రాఖి పండుగ ఎందుకు జరుపుకుంటారు? ఇప్పుడు
ఎలా తెలుస్తుంది? మీరు అందరికీ రాఖీ కడ్తారు. పావనంగా తయారవ్వమని చెప్తారు ఎందుకంటే
ఇప్పుడు పావన ప్రపంచము స్థాపనవుతూ ఉంది. బ్రహ్మ ద్వారా పావన ప్రపంచము స్థాపన
అవుతుందని త్రిమూర్తి చిత్రములో కూడా లిఖింపబడి ఉంది. అందువలన పవిత్రంగా అయ్యేందుకు
రక్షాబంధన పండుగ జరుపుకోబడ్తుంది. ఇప్పుడిది జ్ఞానమార్గపు సమయం. భక్తిలోని విషయాలను
ఎవరైనా పిల్లలైన మీకు వినిపిస్తే వారికి మేము జ్ఞానమార్గములో ఉన్నామని అర్థం
చేయించాలి. భగవంతుడొక్కరే జ్ఞానసాగరుడు, వారు మొత్తం ప్రపంచమంతటిని
నిర్వికారిగా(వైస్లెస్గా) చేస్తారు. భారతదేశము నిర్వికారిగా ఉన్నప్పుడు ప్రపంచమంతా
నిర్వికారిగా ఉండేది. భారతదేశాన్ని నిర్వికారిగా తయారుచేస్తే ప్రపంచమంతా
నిర్వికారిగా అవుతుంది. భారతదేశాన్ని ''ప్రపంచము'' అని అనరు. ప్రపంచములో భారతదేశము
ఒక ఖండముగా ఉంది. క్రొత్త ప్రపంచములో కేవలం భారతదేశం మాత్రమే ఉంటుందని పిల్లలకు
తెలుసు. భారత ఖండములో తప్పకుండా మానవులే ఉంటారు. భారతదేశము సత్యఖండముగా ఉండేది.
సృష్టి ఆదిలో ఒక్క దేవతా ధర్మము మాత్రమే ఉండేది. దానినే నిర్వికారి పవిత్ర ధర్మము
అని అంటారు. అది 5 వేల సంవత్సరాల క్రితము ఉండేది. ఇప్పుడిక ఈ పాత ప్రపంచము కొద్ది
రోజులే ఉంటుంది. నిర్వికారిగా తయారు చేసేందుకు ఎన్ని రోజులు పడ్తుంది? సమయము
పడ్తుంది. ఇక్కడ కూడా పవిత్రంగా అయ్యే పురుషార్థము చేస్తారు. ఇది అన్నింటికంటే
గొప్ప ఉత్సవము. బాబా, మేము తప్పకుండా పవిత్రంగా అయ్యే పురుషార్థము చేస్తామని
ప్రతిజ్ఞ చేయాలి. ఇది అన్నింటికంటే గొప్పదని అర్థము చేసుకోవాలి. అందరూ ఓ పరమపిత
పరమాత్మా! అని వేడుకుంటున్నా బుద్ధిలోకి పరమపిత రారు. జీవాత్మలకు జ్ఞానమునిచ్చేందుకు
పరమపిత పరమాత్మ వస్తారని మీకు తెలుసు. ఆత్మ పరమాత్మ బహుకాలము వేరుగా ఉన్నారు.......
ఆత్మ-పరమాత్మల మిలనము సంగమ యుగములోనే జరుగుతుంది దీనిని కుంభమేళా అని కూడా అంటారు,
ఇది ప్రతి 5 వేల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. నీటిలో మునిగి
స్నానమాచరించే ఆ మేళా అనేకసార్లు చేస్తూ వచ్చారు. అది భక్తిమార్గము, ఇది
జ్ఞానమార్గము. సంగమానికి కూడా కుంభమని చెప్తారు. వాస్తవానికి మూడు నదులు లేవు.
నదిలోని నీరు ఎలా గుప్తంగా ఉండగలదు! మీరు నేర్చుకునే ఈ గీత (భగవద్గీత) గుప్తంగా ఉంది.
కావున మీరు యోగబలము ద్వారా విశ్వరాజ్యము పొందుతున్నారని అర్థం చేయించబడింది. ఇందులో
తమాషా ఏమీ లేదు. భక్తిమార్గము అర్ధకల్పము పూర్తిగా నడుస్తుంది. ఈ జ్ఞానము ఒక్క
జన్మలో మాత్రమే ఉంటుంది. తర్వాత జ్ఞానప్రాలబ్ధము రెండు యుగాలలో ఉంటుంది, జ్ఞానముండదు.
భక్తి అయితే ద్వాపర కలియుగాల నుండి కొనసాగుతూ ఉంది. జ్ఞానము కేవలం ఒక్కసారి మాత్రమే
లభిస్తుంది, తర్వాత దాని ప్రాలబ్ధము 21 జన్మల వరకు ఉంటుంది. మీ కనులు ఇప్పుడు
తెరుచుకున్నాయి. ఇంతకుముందు మీరు అజ్ఞానమనే నిద్రలో ఉండేవారు. ఇప్పుడు రక్షాబంధనము
పండుగరోజు బ్రాహ్మణులు రాఖీ కడ్తారు. మీరు కూడా బ్రాహ్మణులే. అయితే వారు కుఖవంశావళి,
మీరు ముఖవంశావళి బ్రాహ్మణులు. భక్తిమార్గములో ఎంత మూఢ నమ్మకాలున్నాయి! ఊబిలో
కూరుకొని ఉన్నారు. కాళ్లు ఊబిలో చిక్కుకుపోతాయి కదా. కావున భక్తి అనే ఊబిలో
మనుష్యులు చిక్కుకుపోతారు. పూర్తి మెడ వరకు కూరుకుపోతారు. అప్పుడు రక్షించేందుకు
మళ్లీ తండ్రి వస్తారు. ఎప్పుడైతే పిలక మాత్రమే మిగిలి ఉంటుందో అప్పుడు వస్తారు.
పట్టుకునేందుకు(శిఖ) కావాలి కదా. అర్థం చేయించేందుకు పిల్లలు చాలా కష్టపడ్తారు.
కోట్ల కొలది మనుష్యులున్నారు. ఒక్కొక్కరి వద్దకు వెళ్లేందుకు ఎంతో కష్టమవుతుంది.
వార్తాపత్రికల ద్వారా వీరు ఎత్తుకుపోతారు, ఇల్లూ-వాకిళ్లు విడిపిస్తారని,
సోదర-సోదరీలుగా చేస్తారని చెడ్డ పేరు వచ్చింది. ప్రారంభంలో విషయం ఎంతగా వ్యాపించింది!
వార్తపత్రికలలో మారు మ్రోగింది. ఇప్పుడు ఒక్కొక్కరికి అర్థం చేయించలేరు. మళ్లీ మీకు
వార్తాపత్రికలే ఉపయోగపడ్తాయి. వార్తాపత్రికల ద్వారానే మీ పేరు ప్రసిద్ధి చెందుతుంది.
అర్థం చేయించేందుకు ఏం చేయాలని ఇప్పుడు ఆలోచించాలి. రక్షాబంధన అంటే అర్థమేమి?
పావనంగా చేసేందుకు తండ్రి వచ్చినప్పుడు పిల్లల ద్వారా పవిత్రతా ప్రతిజ్ఞను తండ్రి
చేయిస్తారు. పతితులను పావనంగా చేయువారే రాఖీ కట్టారు.
కృష్ణజయంతిని జరుపుకుంటారు. కావున అతడు తప్పకుండా సింహాసనము పై కూర్చుని ఉంటారు.
పట్టాభిషేకాన్ని ఎప్పుడూ చూపించరు. సత్యయుగము ఆదిలో లక్ష్మీనారాయణులుండేవారు, వారి
పట్టాభిషేము జరిగి ఉంటుంది. యువరాజు జన్మదినాన్ని(కృష్ణ జయంతిని) జరుపుకుంటారు. మరి
పట్టాభిషేకము ఎక్కడ, ఎప్పుడు జరిగింది? దీపావళి రోజు పట్టాభిషేకము జరుగుతుంది. అది
సత్యయుగములోని విషయం. చాలా ఆడంబరంగా, వైభవంగా జరుగుతుంది. సంగమ యుగములోని విషయాలు
అక్కడ జరుగవు. ఇంటింటిలో వెలుగు ఇక్కడే కానున్నది. అక్కడ దీపావళి మొదలైన పండుగలు
జరుపుకోరు. అక్కడైతే ఆత్మ జ్యోతులు సదా వెలుగుతూనే ఉంటాయి. అక్కడ పట్టాభిషేకం
జరుపుకోబడ్తుంది, దీపావళి జరుపుకోరు. ఎంతవరకు ఆత్మ జ్యోతులు వెలగవో అంతవరకు వాపస్
వెళ్ళలేవు. ఇప్పుడు ఇక్కడ అందరూ పతితంగా ఉన్నారు, వీరిని పావనంగా చేసేందుకు
ఆలోచించాలి. గొప్ప గొప్ప వ్యక్తుల వద్దకు పిల్లలు ఆలోచించి వెళ్తారు. వార్తాపత్రికల
ద్వారా పిల్లలకు చెడ్డ పేరు వచ్చింది, మళ్లీ వాటి ద్వారానే పేరు ప్రసిద్ధి
చెందుతుంది. కొద్దిగా ధనమిస్తే బాగా వ్రాస్తారు అలాగని మిరిప్పుడు ధనమును ఎంతవరకు
ఇవ్వగలరు? ధనము ఇవ్వడము లంచమే. అది నియమ విరుద్ధమవుతుంది. ఈ రోజులలో లంచము లేకుండా
పనులే జరుగవు. మీరు కూడా లంచాలు ఇచ్చి, వారు కూడా లంచాలు ఇస్తే మరి ఇద్దరూ ఒక్కటే
అయిపోతారు కదా. మీది యోగబలానికి సంబంధించిన విషయము. ఎవరి ద్వారానైనా పని
చేయించుకోగలిగేంతటి యోగబలముండాలి. భూ-భూ చేస్తూనే ఉండాలి. జ్ఞాన బలమైతే మీలో కూడా
ఉంది. ఈ చిత్రాలన్నిటిలో జ్ఞానముంది. కానీ యోగము గుప్తంగా ఉంది. బేహద్ వారసత్వాన్ని
తీసుకునేందుకు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. వారు గుప్తమైనవారు.
వారి మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. ఎక్కడ కూర్చుని అయినా మీరు స్మృతి
చేయగలరు. స్మృతి గుప్తము. కేవలం ఇక్కడే కూర్చుని యోగము చేయనవసరము లేదు. జ్ఞానము
మరియు స్మృతి రెండూ సహజమే. కేవలం 7 రోజుల కోర్సు తీసుకుంటే చాలు, ఎక్కువేమీ అవసరము
లేదు. తర్వాత మీరు వెళ్ళి ఇతరులను తమ సమానంగా తయారు చేయండి. తండ్రి జ్ఞానసాగరులు,
శాంతిసాగరులు. ఈ రెండు విషయాలు ముఖ్యమైనవి. వీరి ద్వారా మీరు శాంతిని వారసత్వంగా
తీసుకుంటున్నారు. స్మృతి కూడా చాలా సూక్ష్మమైనది.
పిల్లలైన మీరు బయట సేవ కొరకు తిరగండి, తండ్రిని స్మృతి చేయండి. పవిత్రంగా అవ్వాలి.
దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి, ఏ అవగుణమూ ఉండరాదు. కామము కూడా చాలా పెద్ద అవగుణము.
మీరిప్పుడిక పతితము అవ్వకండి అని తండ్రి చెప్తున్నారు. భలే స్త్రీ ఎదురుగా ఉన్నా
మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. చూస్తున్నా చూడకండి.
మనమిప్పుడు మన తండ్రిని స్మృతి చేస్తున్నాము. వారు జ్ఞానసాగరులు, మిమ్ములను తమ
సమానంగా తయారు చేస్తారు. కనుక మీరు కూడా జ్ఞానసాగరులుగా అవుతారు. ఇందులో తికమక
పడరాదు. వారు పరమ ఆత్మ. పరంధామములో ఉంటారు కావున పరమ అని అంటారు. అక్కడ మీరు కూడా
ఉంటారు. ఇప్పుడు నంబరువారు పురుషార్థానుసారము మీరు జ్ఞానమును తీసుకుంటున్నారు.
గౌరవపూర్వకంగా పాసైన వారిని పూర్తి జ్ఞానసాగరులుగా అయ్యారని అంటారు. తండ్రి కూడా
జ్ఞానసాగరులు, మీరు కూడా జ్ఞానసాగరులే. ఆత్మలు చిన్నవి - పెద్దవి ఉండవు. పరమాత్మ
కూడా పరిమాణములో పెద్దగా ఉండరు. వేయి సూర్యుల కంటే తేజోమయంగా ఉన్నారని చెప్తారు.
ఇవన్నీ వ్యర్థ మాటలు, బుద్ధి ద్వారా ఏ రూపాన్ని స్మృతి చేస్తారో ఆ రూపమే
సాక్షాత్కారమవుతుంది. ఇందులో వివేకము కావాలి. ఆత్మ సాక్షాత్కారము లేక పరమాత్మ
సాక్షాత్కారము, రెండూ ఒక్కటిగానే ఉంటాయి. ''నేనే పతితపావనుడను, జ్ఞానసాగరుడనని''
తండ్రి అవగాహన చేయించారు. సమయానుసారంగా వచ్చి అందరికి సద్గతినిస్తాను. అందరికంటే
ఎక్కువగా భక్తిని మీరు చేశారు. మళ్లీ తండ్రి మిమ్ములనే చదివిస్తారు. రక్షాబంధనము
తర్వాత కృష్ణ జన్మాష్టమి జరుగుతుంది, తర్వాత దశరా వస్తుంది. వాస్తవంగా దశరాకు
ముందుగా కృష్ణుడు రాలేడు. ముందు దశరా పండుగ జరగాలి. తర్వాత కృష్ణుడు రావాలి. ఈ
లెక్కను కూడా మీరే తీస్తారు. మొదట అయితే మీరు కూడా ఏమీ అర్థము చేసుకునేవారు కాదు.
తండ్రి ఇప్పుడు ఎంత వివేకవంతులుగా తయారు చేస్తున్నారు! టీచరు వివేకవంతులుగా చేస్తారు
కదా. భగవంతుడు బిందు స్వరూపుడని మీకిప్పుడు తెలుసు. వృక్షము ఎంత పెద్దదిగా ఉంది!
ఆత్మలు పైన బిందు రూపములో ఉంటాయి. వాస్తవానికి ఒక్క సెకండులో వివేకవంతులుగా అవ్వాలని
మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. కానీ ఎంత రాతి బుద్ధి గలవారిగా
ఉన్నారంటే అర్థమే చేసుకోరు. లేకుంటే ఇది ఒక సెకండు విషయమే. హద్దు తండ్రి అయితే ప్రతి
జన్మలో క్రొత్తవారు ఉంటారు. ఈ బేహద్ తండ్రి అయితే ఒక్కసారే వచ్చి 21 జన్మలకు
వారసత్వమునిస్తారు. మీరిపుడు బేహద్ తండ్రి ద్వారా బేహద్ వారసత్వమును తీసుకుంటున్నారు.
మీ ఆయువు కూడా పెరుగుతుంది. అలాగని 21 జన్మలకు ఒకే తండ్రి ఉండరు. మీ ఆయువు
పెరుగుతుంది. ఎప్పటికీ మీరు దు:ఖము చూడరు, చివర్లో మీ బుద్ధిలో ఈ జ్ఞానం ఉండిపోతుంది.
తండ్రిని స్మృతి చేయాలి మరియు వారసత్వమును తీసుకోవాలి. అంతే పుత్రుడు జన్మిస్తూనే
వారసునిగా అవుతాడు. తండ్రిని తెలుసుకుంటే చాలు. తండ్రిని మరియు వారసత్వమును స్మృతి
చేయండి. పవిత్రంగా అవ్వండి. దైవీగుణాలు ధారణ చేయండి. తండ్రి మరియు వారసత్వము ఎంత
సహజంగా ఉంది. లక్ష ్యము కూడా ఎదురుగా ఉంది.
మనము వార్తాపత్రికల ద్వారా ఎలా అర్థం చేయించాలి అని ఇప్పుడు పిల్లలు ఆలోచించాలి.
బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుందని అర్థం చేయిస్తారు కనుక త్రిమూర్తి చిత్రము కూడా
కావాలి. బ్రాహ్మణులను పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు. అందువలన రాఖీని కట్టిస్తారు.
పతితపావనుడు భారతదేశాన్ని పావనంగా తయారు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు పావనంగా అవ్వాలి.
ఎందుకంటే ఇపుడు పావన ప్రపంచము స్థాపనవుతుంది. ఇప్పుడు మీకు 84 జన్మలు పూర్తి అయ్యాయి.
ఎవరైతే చాలా జన్మలు తీసుకుని ఉంటారో వారు బాగా అర్థము చేసుకుంటారు.
చివర్లో వచ్చేవారికి అంత ఖుషీ ఉండదు, ఎందుకంటే భక్తి తక్కువగా చేశారు. భక్తికి
ఫలితము ఇచ్చేందుకు తండ్రి వస్తారు. భక్తిని ఎక్కువగా ఎవరు చేశారో కూడా ఇప్పుడు మీకు
తెలుసు. మొట్టమొదట మీరే వచ్చారు, అవ్యభిచారి భక్తిని మీరే చేశారు. మనము ఎక్కువ భక్తి
చేశామా లేక ఇతడు చేశాడా అని మిమ్ములను మీరే ప్రశ్నించుకోండి. అందరికంటే తీవ్రంగా
సర్వీసు చేసేవారు తప్పకుండా ఎక్కువ భక్తి చేసి ఉంటారు. బాబా పేర్లను కూడా వ్రాస్తారు.
కుమారికా(ప్రకాశమణి దాది), జానకి, మనోహర్, గుల్జార్ వీరందరూ ఉన్నారు, నంబరువారుగా
అయితే ఉంటారు. ఇక్కడ నంబరువారుగా కూర్చోబెట్టలేరు. కనుక రక్షాబంధనము గురించి
వార్తాపత్రికలలో ఎలా వేయించాలి ! అని ఆలోచించాలి. మినిస్టరు వద్దకు రాఖి కట్టేందుకు
వెళ్తారు. అది బాగానే ఉంది కానీ వారు పవిత్రంగా అవ్వరు. పవిత్రంగా అయితే పవిత్ర
ప్రపంచము స్థాపన అవుతుందని మీరు అంటారు. 63 జన్మలు వికారులుగా అయ్యారు. ఈ అంతిమ
జన్మలో పవిత్రంగా అవ్వమని తండ్రి చెప్తున్నారు. ఖుదాను స్మృతి చేస్తే మీ తల పై ఉన్న
పాపాలు దిగిపోతాయి. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు
గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు
ముఖ్య సారము:-
1.
గౌరవపూర్వకంగా పాస్ అయ్యేందుకు తండ్రి సమానము జ్ఞాన సాగరులుగా అవ్వాలి. లోపల ఏదైనా
అవగుణముంటే దానిని పరిశీలించుకొని తొలగించి వేయాలి. శరీరాన్ని చూస్తున్నా చూడకండి.
ఆత్మగా నిశ్చయము చేసుకుని ఆత్మతోనే మాట్లాడాలి.
2. మీ ప్రతి పని సహజంగా జరిగిపోయేటంతగా యోగబలము జమ చేసుకోవాలి. వార్తాపత్రికల ద్వారా
ప్రతి ఒక్కరికి పావనంగా అయ్యే సందేశమును ఇవ్వాలి. మీ సమానంగా తయారు చేసే సేవ చేయాలి.
వరదానము:-
'' శ్రేష్ఠ
కర్మల ద్వారా దివ్య గుణాలనే ప్రభువు ప్రసాదాన్ని పంచే ఫరిస్తా నుండి దేవతా భవ ''
వర్తమాన
సమయంలో అజ్ఞాని ఆత్మలకు గాని, బ్రాహ్మణ ఆత్మలకు గాని ఇరువురికి గుణదానము అవసరము.
కనుక ఇప్పుడీ విధిని స్వయంలో లేక బ్రాహ్మణ పరివారంలో తీవ్రము(వేగవంతము) చేయండి. ఈ
దివ్యగుణాలు అన్నిటికంటే శ్రేష్ఠమైన ప్రభు ప్రసాదము. ఈ ప్రసాదాన్ని బాగా పంచండి.
ఎలాగైతే స్నేహానికి(ప్రేమకు) గుర్తుగా ఒకరికొకరు టోలీని తినిపిస్తారో అలా
దివ్యగుణాల టోలీని తినిపిస్తే, ఈ విధి ద్వారా ఫరిస్తాల నుండి దేవతలుగా అయ్యే
లక్ష్యము సహజంగా అందరిలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది.
స్లోగన్:-
'' యోగమనే
కవచాన్ని ధరించి ఉంటే మాయ రూపీ శత్రువు దాడి చెయ్యలేదు. ''