26-01-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - ఇప్పుడు మీ విన్నపము వినడము (హియరింగ్, సున్వాయీ) జరుగుతుంది, తండ్రి మిమ్ములను దు:ఖము నుండి తొలగించి సుఖములోకి తీసుకెళ్తారు, ఇప్పుడిది మీ అందరి వానప్రస్థ అవస్థ, వాపస్ ఇంటికి వెళ్ళాలి.''
ప్రశ్న :-
సదా యోగయుక్తంగా ఉండాలని, శ్రీమతము పై నడవాలనే ఆజ్ఞ పిల్లలందరికి పదే పదే ఎందుకు లభిస్తుంది?
జవాబు :-
ఎందుకంటే ఇప్పుడు అంతిమ వినాశన దృశ్యము మీ ముందు(సమీపములో) ఉంది. కోట్లాదిమంది మనుష్యులు మరణిస్తారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. ఆ సమయంలో స్థితి ఏకరసంగా ఉండాలి. అప్పుడు అన్ని దృశ్యాలను చూస్తున్నా వేటగానికి వేట మరియు వేటకు మృత్యువు (పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణసంకటం, మిరువా మౌత్ మలూకా శికార్.......) అన్నట్లుగా అనుభవమవ్వాలి. దాని కొరకు యోగయుక్తులుగా అవ్వవలసి ఉంటుంది. శ్రీమతమును అనుసరించే యోగీ పిల్లలే ఈ విధంగా ఆనందంగా ఉండగలరు. మేము ఈ పురాతన శరీరాన్ని వదిలి మా మధురమైన ఇంటికి వెళ్తామని వారి బుద్ధిలో ఉంటుంది.
ఓంశాంతి.
ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలతో ఆత్మిక సంభాషణ జరుపుతారు అనగా వారు ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఎందుకంటే ఆత్మలు భక్తిమార్గములో చాలా స్మృతి చేశారు. ఆ ఒక్క ప్రియునికి అందరూ ప్రేయసులే. ఆ ప్రియుడైన శివబాబా చిత్రము తయారు చేయబడి ఉంది. కూర్చొని వారిని పూజిస్తారు. వారి నుండి ఏమి కోరాలో కూడా వారికి తెలియదు. పూజ అయితే అందరూ చేస్తారు. శంకరాచారి కూడా పూజిస్తాడు. శంకరాచారిని అందరూ చాలా గొప్పవాడని భావిస్తారు. భలే అతడు ధర్మస్థాపకుడైనా అతడు కూడా పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ క్రిందకు దిగుతాడు. ఇప్పుడు అందరూ తమ చివరి జన్మలోకి వచ్చి చేరుకున్నారు. మీరు చిన్నవారైనా, పెద్దవారైనా ఇది అందరి వానప్రస్థావస్థ. నేను మిమ్ములనందరినీ వాపస్ తీసుకెళ్తానని బాబా చెప్తారు. పతిత ప్రపంచములోనే నన్ను రమ్మని పిలుస్తారు. ఎంత గౌరవముంచుతారు! పతిత ప్రపంచములోకి, పరాయి రాజ్యములోకి రమ్మని పిలుస్తారు. తప్పకుండా దు:ఖితులుగా ఉంటారు అందుకే పిలుస్తారు! దు:ఖహర్త-సుఖకర్త అన్న గాయనము ఉన్నందరున తప్పకుండా ఛీ-ఛీ పురాతన ప్రపంచములో, పురాతన శరీరములోనే రావలసి వచ్చింది. అది కూడా తమోప్రధాన శరీరములోనే రావలసి ఉంటుంది. సతోప్రధాన ప్రపంచములో నన్నెవరూ స్మృతి కూడా చేయరు. డ్రామానుసారము నేను అందరినీ సుఖీలుగా తయారుచేస్తాను. సత్యయుగములో తప్పకుండా ఆదిసనాతన దేవీదేవతా ధర్మము ఉంటుందని బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. ఇతర సత్సంగాలలో అయితే కేవలం శాస్త్రాలను చదువుతూ చదువుతూ క్రిందకు దిగజారుతూ ఊబిలో చిక్కుకుని దు:ఖితులుగా అవుతారు. వాస్తవానికి ఇది దు:ఖధామము, అది సుఖధామము. తండ్రి ఎంతో సహజము చేసి అర్థం చేయిస్తారు, ఎందుకంటే పాపం అబలలకు ఏమీ తెలియదు. మళ్లీ వాపస్ ఇంటికి వెళ్తామా లేక ఎల్లప్పుడూ పునర్జన్మలు తీసుకుంటూ ఇక్కడే ఉంటామా? అన్న విషయము ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడైతే అన్ని ధర్మాలవారు ఉన్నారు. మొట్టమొదట స్వర్గము ఉండేది. అప్పుడు ఒకే ధర్మము ఉండేది. మొత్తం చక్రమంతా మీ బుద్ధిలో ఉంది. ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఈ విషయాలు ఉండజాలవు. వారు కల్పము ఆయువునే లక్షల సంవత్సరాలని చెప్తారు. దీనిని ఘోరాంధకారము అని అంటారు. జ్ఞానమనగా సంపూర్ణ ప్రకాశము. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ప్రకాశముంది. మీరు మందిరాలు మొదలైన వాటిలోకి వెళ్ళినప్పుడు - '' మేము శివబాబా వద్దకు వెళ్తున్నాము, ఈ లక్ష్మీనారాయణులుగా మేము తయారవుతామని మీరు వారితో అంటారు.'' ఈ విషయాలు ఏ ఇతర సత్సంగాలలో ఉండవు. అవన్నీ భక్తిమార్గపు విషయాలు. ఇప్పుడు మీకు రచయిత మరియు రచనల ఆది-మధ్య-అంత్యాలు తెలుసు. ఋషులు, మునులు మొదలైనవారు మాకు తెలియదు అని అనేవారు. ఇంతకుముందు మీకు కూడా తెలియదు. అదంతా భక్తిమార్గము. ఈ సమయములో విశ్వమంతటా భక్తి ఉంది. ఇది పాత ప్రపంచము, లెక్కలేనంత మంది మనుష్యులు ఉన్నారు. సత్యయుగ నూతన ప్రపంచములో కేవలం ఒక్క అద్వైత ధర్మమే ఉండేది. ఆ తర్వాత ద్వైత ధర్మము ఉంటుంది. అనేక ధర్మాలు ఉన్న కారణంగా చప్పట్లు మ్రోగుతాయి. అనగా ధర్మాలన్నింటిలో పరస్పరము అనేక కలహాలున్నాయి. డ్రామానుసారము వారి పాలసీ(విధానము)యే ఆ విధంగా ఉంది. ఎవరినైనా వేరు చేస్తే వెంటనే యుద్ధాలు జరుగుతాయి. విభజనలు జరుగుతాయి. మనుష్యులకు తండ్రిని గూర్చి తెలియని కారణంగా రాతిబుద్ధిగా అయిపోయారు. ఈ సమయంలో దేవీ దేవతా ధర్మము ప్రాయ: లోపమైపోయిందని తండ్రి అర్థం చేయిస్తున్నారు. దేవీ దేవతల రాజ్యము కూడా ఉండేదని తెలిసినవారు ఒక్కరు కూడా లేరు. మేము దేవీ దేవతలుగా అవుతున్నామని మీరు ఇప్పుడు భావిస్తారు. శివబాబా మన వినమ్రుడైన సేవకుడు. గొప్పవారు ఉత్తరం వ్రాసేటప్పుడు చివర్లో సదా ఒబీడియంట్ సర్వెంట్ అని వ్రాస్తారు. తండ్రి కూడా నేను మీ వినమ్రుడైన సేవకుడనని అంటారు. అలాగే దాదా కూడా నేను వినమ్రుడనైన సేవకుడనని అంటారు. నేను మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత ప్రతి కల్పము పురుషోత్తమ సంగమ యుగములో వస్తాను. నేను వచ్చి పిల్లలకు సేవ చేస్తాను. నన్ను దూరదేశ నివాసి........ అని అంటారు. కాని దీని అర్థము కూడా తెలియదు. ఇన్ని శాస్త్రాలు మొదలైనవి చదువుతారు కాని అర్థము తెలియదు. తండ్రి వచ్చి సర్వ వేదశాస్త్రాల సారమును అర్థం చేయిస్తారు.
ఈ సమయంలో ఇది రావణరాజ్యమని పిల్లలైన మీకు తెలుసు. మనుష్యులు పతితులుగా అవుతూ ఉంటారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. పిల్లలైన మిమ్ములను నరకము నుండి వెలికి తీసి స్వర్గములోకి తీసుకెెళ్తారు. దానినే అల్లా పూలతోట అని అంటారు. ఇది ముళ్ల అడవి. సంగమ యుగము పూలతోట. అక్కడ(సత్యయుగములో) మీరు సదా సుఖంగా ఉంటారు, సదా ఆరోగ్యవంతముగా, సదా సంపన్నంగా అవుతారు. అర్ధకల్పము సుఖము, మళ్లీ అర్ధకల్పము దు:ఖము, ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడూ అంతమవ్వదు. అందరికన్నా ఉన్నతుడైన తండ్రి వచ్చి అందరినీ శాంతిధామము, సుఖధామములోకి తీసుకెళ్తారు. మీరందరూ సుఖధామములోకి వెళ్ళినప్పుడు మిగిలిన వారంతా శాంతిధామములో ఉంటారు. అర్ధకల్పం సుఖం ఉంటుంది, అర్ధకల్పం ధు:ఖముంటుంది. అందులోనూ సుఖము ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ సుఖ-దు:ఖాలు రెండూ సగం-సగం ఉన్నట్లైతే అందులో ఇక ఆనందము ఏముంటుంది! భక్తిమార్గములో కూడా మీరు గొప్ప ధనవంతులుగా ఉండేవారు. మేము ఎంత ధనవంతులుగా ఉండేవారమని మీకు ఇప్పుడు గుర్తొస్తుంది. గొప్ప ధనవంతులుగా ఉండినవారు దివాలా తీస్తే మా వద్ద ఏమేమో ఉండేవి! ఎంతో ధనము ఉండేది! అని వారికి గుర్తొస్తూ ఉంటుంది. భారతదేశము షావుకారుగా, స్వర్గముగా ఉండేదో తండ్రి అర్థము చేయిస్తారు. ఇప్పుడు ఎంత నిరుపేదగా ఉందో చూడండి! పేదల పట్లనే దయ కలుగుతుంది. ఇప్పుడు పూర్తి నిరుపేదలుగా అయిపోయారు. అడుక్కొని తింటున్నారు. సంపన్నులుగా ఉండినవారే ఇప్పుడు పూర్తిగా దివాలాకోరులుగా అయిపోయారు. ఇది కూడా నాటకమే. ఇతర ధర్మాలేవైతే వస్తాయో అవన్నీ కేవలం నాటకములోని అంతర్భాగాలు(బైప్లాట్స్) మాత్రమే. ఇతర ధర్మాలకు చెందిన మనుష్యులు ఎంతగానో వృద్ధి చెందుతూ ఉంటారు! భారతవాసులే 84 జన్మలు తీసుకుంటారు. ఒక పుత్రుడు ఇతర ధర్మాలవారి జన్మల లెక్కను లెక్కవేసి పంపించాడు. కాని ఈ విషయాలలోకి ఎక్కువగా వెళ్ళడం వల్ల లాభమేమీ లేదు. ఇది కూడా సమయాన్ని వ్యర్థం చేసుకోవడమే అవుతుంది. ఒకవేళ ఆ సమయాన్ని తండ్రి స్మృతిలో గడిపి ఉండినట్లయితే ఎంతో సంపాదన జరిగి ఉండేది. పూర్తి పురుషార్థము చేసి విశ్వాధిపతులుగా అవ్వడమే మన ముఖ్యమైన పని. మీరే సతోప్రధానంగా ఉండేవారు. మళ్లీ మీరే తమోప్రధానంగా అయిపోయారని తండ్రి చెప్తారు. 84 జన్మలు కూడా మీరే తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ వాపస్ వెళ్ళాలి. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. మీరు అర్ధకల్పం తండ్రిని స్మృతి చేశారు. ఇప్పుడు తండ్రి వచ్చారు. మీ విన్నపాలు వినడం జరుగుతుంది. తండ్రి ఇప్పుడు మళ్లీ మిమ్ములను సుఖధామమంలోకి తీసుకెళ్తారు. భారతదేశ ఉత్థానము మరియు పతనము, ఇది కూడా ఒక కథ వంటిది. ఇప్పుడిది పతిత ప్రపంచము. సంబంధాలు కూడా పురాతనమైనవే. ఇప్పుడు మళ్లీ కొత్త సంబంధములోకి వెళ్లాలి. ఈ సమయములో నటులందరూ ఉపస్థితులై ఉన్నారు. ఇందులో ఏ వ్యత్యాసము ఉండజాలదు. ఆత్మ అయితే అవినాశి, ఎన్నో లెక్కలేనన్ని ఆత్మలు ఉంటాయి! అవి ఎప్పుడూ వినాశనమవ్వవు. ఈ కోట్ల కొలది ఆత్మలు మొదట వాపస్ వెళ్ళవలసి ఉంటుంది. పోతే అందరి శరీరాలైతే అంతమవుతాయి అందుకే హోలికాను(మహరాష్ట్రలో హోలి సందర్భములో చివరి రోజున జరుపు ముగింపు కార్యక్రమము) కూడా జరుపుతారు.
మనమే పూజ్యులుగా ఉండేవారము, మళ్లీ పూజారులుగా అయినాము. ఇప్పుడు తిరిగి పూజ్యులుగా అవుతామని మీకు తెలుసు. అక్కడ ఈ జ్ఞానము ఉండదు. అలాగే ఈ శాస్త్రాలు మొదలైనవి కూడా ఉండవు. అన్నీ అంతమైపోతాయి. ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో శ్రీమతము పై నడుస్తూ ఉంటారో వారు ఇవన్నీ చూస్తారు - భూకంపాలలో అంతా ఏ విధంగా అంతమవుతుందో చూస్తారు. ఏ విధంగా గ్రామ-గ్రామాలే సమూలంగా అంతమౌతాయో వార్తాపత్రికల్లో కూడా వేస్తారు. మొదట బొంబాయి ఇంత పెద్దగా ఉండేది కాదు. సముద్రాన్ని ఎండబెట్టారు. మళ్లీ అది సముద్రంగా అయిపోతుంది. ఈ భవనాలు మొదలైనవేవీ ఉండవు. సత్యయుగములో తీయని నదీ తీరాలలో మహళ్ళు ఉంటాయి. ఉప్పు నీటి తీరాలలో ఉండవు. కావున ఇవేవీ ఉండవు. సముద్రము ఒక్కసారిగా ఉప్పొంగిందటే అన్నీ సమాప్తమైపోతాయి. ఎన్నో ఉపద్రవాలు సంభవిస్తాయి. కోట్లాది మానవులు మరణిస్తారు. ధాన్యం ఎక్కడి నుండి వస్తుంది? ఆపదలు రానున్నాయని వారు కూడా అర్థము చేసుకుంటారు. మనుష్యులు మరణించినప్పుడు యోగయుక్తంగా ఎవరైతే ఉంటారో వారు ఆ సమయంలో ఆనందంగా ఉంటారు. వేటగానికి వేట మరియు వేటకు మృత్యువు (పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణసంకటం/మిరువా మౌత్ మలూకా షికార్...) వడగళ్ళవాన పడడంతో లెక్క లేనంతమంది మనుష్యులు మరణిస్తారు. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. వీరందరూ అంతమైపోతారు. వీటిని ప్రాకృతిక వైపరీత్యాలు (న్యాచురల్ కెలామటీస్)అని అంటారు. ఈశ్వరీయ వైపరీత్యాలు(గాడ్లీ కెలామిటీస్) అని అనరు. భగవంతుని పై దోషమును ఎలా మోపగలరు? శంకరుడు కళ్ళు తెరవగానే వినాశనం జరిగిందని కూడా కాదు. ఇవన్నీ భక్తిమార్గపు విషయాలు. ముసలమును(రోకలిని) గూర్చి కూడా శాస్త్రాలలో వ్రాయబడి ఉంది. ఈ మిసైళ్ళ (మిస్సైల్స్/దూరము నుండే విసరబడే మరణాయుధాలు) ద్వారా ఎలా వినాశనం చేస్తారో మీకు తెలుసు. నిప్పు, గ్యాస్, విషం....... మొదలైనవన్నీ అందులో వినియోగిస్తారు. చివరిలో అందరూ తక్షణమే మరణించేందుకు, పిల్లలు మొదలైన వారెవ్వరూ దు:ఖితులుగా అవ్వకుండా ఉండేందుకు ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి. వాటి ద్వారా వెంటనే మరణిస్తారని బాబా అర్థం చేయిస్తారు. ఇదంతా రచింపబడి ఉన్న డ్రామా. ఆత్మ వినాశనం లేనిది. అది ఎప్పుడూ వినాశనమవ్వదు. అది చిన్నగా, పెద్దగా అవ్వదు. శరీరాలన్నీ ఇక్కడ అంతమవుతాయి. మిగిలిన ఆత్మలన్నీ మధురమైన ఇంటికి వెళ్లిపోతాయి. తండ్రి కల్ప-కల్పము సంగమ యుగములో వస్తారు. మీరు కూడా ఈ పురుషోత్తమ సంగమ యుగములోనే ఉన్నతోన్నతులుగా అవుతారు. నిజానికి శ్రీ శ్రీ అని శివబాబాను, శ్రీ అని ఈ దేవతలను అంటారు. ఈ రోజుల్లో గమనించినట్లైతే అందరినీ శ్రీ శ్రీ అని అంటారు. శ్రీమతి, శ్రీ ఫలానా అని అంటారు. శ్రీమతాన్ని ఒక్క తండ్రియే ఇస్తారు. వికారాలలోకి వెళ్ళడమేమైనా శ్రీమతమా? ఇదంతా భ్రష్టాచార ప్రపంచము.
మీరు నన్ను స్మృతి చేస్తే మలినాలు తొలగిపోతాయని ఇప్పుడు మధురాతి మధురమైన బాబా పిల్లలకు చెప్తున్నారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. స్వయానికి ఇప్పుడు విశ్వము ఆదిమధ్యాంతాల చక్ర జ్ఞానము తెలిసింది కాని ఈ అలంకారాలను ఇప్పుడు మీకు ఇచ్చేందుకు వీల్లేదు. ఈ రోజు మీరు స్వయాన్ని స్వదర్శన చక్రధారులుగా భావిస్తారు. మళ్లీ రేపు మాయ దెబ్బ తీస్తే జ్ఞానమే ఎగిరిపోతుంది! కావున బ్రాహ్మణులైన మీ మాల కూడా తయారవ్వజాలదు. మాయ చెంపదెబ్బ వేసి చాలా మందిని క్రింద పడేస్తుంది. కావున వారి మాల ఎలా తయారవుతుంది? దశలు మారుతూ ఉంటాయి. రుద్రమాలేమో సరిగ్గా ఉంది. విష్ణుమాల కూడా ఉంది. కాని బ్రాహ్మణుల మాల మాత్రము తయారవ్వజాలదు. పిల్లలైన మీకు దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి అని ఆదేశిస్తాను. తండ్రి అయితే నిరాకారుడు. వారికి తమ శరీరమైతే లేనే లేదు. వీరి వానప్రస్థ అవస్థలో అది కూడా 60 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు వచ్చారు. వానప్రస్థ అవస్థలోనే గురువును ఆశ్రయించడం జరుగుతుంది. నేను సద్గురువునే కాని గుప్త వేషములో ఉన్నాను. వారంతా భక్తిమార్గములోని గురువులు. నేను జ్ఞానమార్గ గురువును. ప్రజాపిత బ్రహ్మకు ఎంతమంది పిల్లలున్నారో గమనించండి! బుద్ధి హద్దు నుండి తొలగి అనంతములోకి వెళ్ళిపోయింది. ముక్తిలోకి వెళ్ళి మళ్లీ జీవన్ముక్తిలోకి వస్తారు. మొట్టమొదట మీరు వస్తారు, ఇతరులు మీ వెనుక వస్తారు. ప్రతి ఒక్కరూ మొదట సుఖాన్ని, ఆ తర్వాత దు:ఖాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఇది వరల్డ్ డ్రామా(సృష్టి నాటకము). అందుకే ''అహో ప్రభూ! మీ లీల ......'' అని అంటారు. మీ బుద్ధి పై నుండి క్రింది వరకు పూర్తిగా చక్రము వలె తిరుగుతూ ఉంటుంది. మీరు మార్గమును చూపించే లైట్హౌస్ వంటివారు. మీరు తండ్రి పిల్లలు కదా! నన్ను స్మృతి చేసినట్లైతే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయిపోతారని తండ్రి చెప్తున్నారు. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత అని, భారతదేశములో స్వర్గము ఉండేదని మీరు రైలులో కూడా అర్థం చేయించవచ్చు. తండ్రి భారతదేశములోనే వస్తారు. శివజయంతి కూడా భారతదేశములోనే జరుపబడుతుంది. కాని అది ఎప్పుడు జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. తిథి-తారీఖు రెండూ లేవు ఎందుకంటే వారు గర్భము ద్వారా జన్మ తీసుకోరు. స్వయాన్ని ఆత్మగా భావించండి, మీరు అశరీరులుగా వచ్చారు, పవిత్రంగా ఉండేవారు. మళ్లీ అశరీరులుగా అయ్యే వెళతారు. నన్నొక్కడినే స్మృతి చేస్తూ ఉంటే పాపాలు సమాప్తమైపోతాయని తండ్రి చెప్తున్నారు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. లైట్హౌస్గా(ఓడరేవు వద్ద ఓడలకు మార్గాన్ని చూపించే దీపస్తంభంగా) తయారై అందరికీ మార్గాన్ని చూపించాలి. బుద్ధిని హద్దు నుండి తొలగించి అనంతములో ఉంచాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి.
2. ఇప్పుడు ఇంటికి వాపస్ వెళ్లాలి కనుక ఈ వానప్రస్థ అవస్థలో సతోప్రధానంగా అయ్యే పురుషార్థము చేయాలి. మీ సమయాన్ని వ్యర్థం చేయరాదు.
వరదానము :-
''ఆలోచించి, అర్థము చేసుకొని ప్రతి కర్మను చేసి పశ్చాత్తాపము నుండి ముక్తులుగా ఉండే జ్ఞానయుక్త ఆత్మా భవ''
ప్రపంచంలో కూడా ముందు ఆలోచించి, తర్వాత చేయండి అని చెప్తారు. ఏదైతే ఆలోచించకుండా చేస్తారో లేక చేసిన తర్వాత ఆలోచిస్తారో అది పశ్చాత్తాప రూపంగా అవుతుంది. చేసిన తర్వాత ఆలోచించడం పశ్చాత్తాప రూపము. ముందు ఆలోచించడం జ్ఞానయుక్త ఆత్మల గుణము. ద్వాపర. కలియుగాలలో అయితే పశ్చాత్తాపపడే అనేక రాకల పనులు చేస్తూ వచ్చారు. కాని ఇప్పుడు సంగమ యుగంలో సంకల్పము గాని, కర్మ గాని ఎలా ఆలోచించి, అర్థము చేసుకొని చేయాలంటే ఎప్పుడూ మనసులో కూడా ఒక సెకండు కూడా పశ్చాత్తాప పడరాదు. అప్పుడు వారిని జ్ఞానయుక్త ఆత్మలని అంటారు.
స్లోగన్ :-
''దయాహృదయం గలవారై సర్వ గుణాలను, శక్తులను దానం ఇచ్చేవారే మాస్టర్ దాతలు''
బ్రహ్మబాబా సమానంగా
అయ్యేందుకు విశేషమైన పురుషార్థము
బ్రహ్మాబాబా సమానంగా అయ్యేందుకు విశేషంగా అమృతవేళలో శక్తిశాలి స్థితిలో అనగా తండ్రి
సమానం బీజరూప స్థితిలో స్థితమై ఉండేందుకు అభ్యాసము చేయండి. ఎలాగైతే సమయం
శ్రేష్ఠమైనదో, అలా స్థితి కూడా శ్రేష్ఠంగా ఉండాలి. ఇది విశేషంగా వరదానాలు పొందే
సమయము, ఈ సమయాన్ని యథార్థ రీతిగా ఉపయోగిస్తే దాని ప్రభావము మొత్తం రోజంతటి స్మృతి,
స్థితి పై ఉంటుంది.