25-03-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - మీరు రాయల్ ( శ్రేష్ఠ ) కులపు రాయల్ విద్యార్థులు, మీ నడవడిక చాలా రాయల్గా ఉండాలి. అప్పుడే మీరు తండ్రిని ప్రత్యక్షము చేయగలరు''
ప్రశ్న :-
వినాశ సమయములో అంతిమ పరీక్షలో ఎవరు పాస్ అవుతారు? పాస్ అయ్యేందుకు పురుషార్థమేది?
జవాబు :-
ఎవరికైతే అంతిమ సమయంలో తండ్రి తప్ప పాత ప్రపంచములోని వస్తువులేవీ గుర్తు రావో వారే అంతిమ పరీక్షలో పాసవుతారు. అవి గుర్తుకొస్తే ఫెయిల్(ఉత్తీర్ణులు) అవుతారు. అందువలన ఈ బేహద్ ప్రపంచమంతటి పై మమకారమును తొలగించుకోవాలి. భాయి-భాయి(సోదరత్వ) స్థితి పక్కాగా ఉండాలి. దేహాభిమానము తొలగిపోయి ఉండాలి.
ఓంశాంతి.
మేము ఎంతో గొప్ప రాయల్ విద్యార్థులము, అనంతమైన(బేహద్) యజమాని మమ్ములను చదివిస్తున్నారనే నషా ఉండాలి. మీరు ఎంతో ఉన్నతమైన కులానికి చెందిన రాయల్ విద్యార్థులు. అందువలన రాయల్ విద్యార్థుల నడవడిక కూడా రాయల్గా ఉండాలి. అప్పుడే తండ్రిని ప్రత్యక్షము చేయగలరు. మీరు విశ్వములో శ్రీమతముననుసరించి శాంతి స్థాపన చేసేందుకు నిమిత్తులుగా అయ్యారు. మీకు శాంతి బహుమతి లభిస్తుంది. అది కూడా ఒక్క జన్మకు మాత్రమే కాదు. జన్మ-జన్మాంతరాలకు లభిస్తుంది. ఇంత గొప్ప బహుమతికి పిల్లలు తండ్రికి ఏ విధంగా ధన్యవాదాలు తెలియజేస్తారు? తండ్రి వారంతకు వారే వచ్చి అరచేతిలో స్వర్గమునిస్తారు. తండ్రి వచ్చి స్వర్గమిస్తారని పిల్లలకేమైనా తెలుసా? ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మధురమైన పిల్లలూ! నన్ను స్మృతి చేయండి. స్మృతి చేయమని ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఈ స్మృతి ద్వారానే వికర్మలు వినాశమౌతాయి. అనంతమైన తండ్రి పరిచయము లభించింది. నిశ్చయము కూడా కలిగింది. కష్టపడే విషయమేదీ లేదు. భక్తిమార్గములో బాబా-బాబా(తండ్రీ - తండ్రీ) అంటూ ఉంటారు. ఆ తండ్రి నుండి తప్పకుండా ఏదో కొంత వారసత్వము లభిస్తుంది. మీకు పురుషార్థము చేసే అవకాశము కూడా ఉంది. శ్రీమతముననుసరించి ఎంత పురుషార్థము చేస్తారో అంత ఉన్నతమైన పదవి లభిస్తుంది. తండ్రి, టీచరు, సద్గురువు ముగ్గురి శ్రీమతము లభిస్తుంది. దాని అనుసారము నడుచుకోవాలి. మీ ఇంటిలోనే ఉండాలి. శ్రీమతముననుసరించుటలోనే విఘ్నాలు ఏర్పడ్తాయి. మాయ కల్పించు మొదటి విఘ్నము దేహాభిమానము. తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇంత చెప్తున్నా శ్రీమతమును ఎందుకు అనుసరించరు? పిల్లలు అంటారు - మేము ప్రయత్నమేమో చేస్తున్నాము కానీ మాయ స్మృతి చేయనివ్వదు. ఈ చదువులో ముఖ్యంగా పురుషార్థము తప్పకుండా చేయాలని పిల్లలకు తెలుసు. మంచి పిల్లలైనవారు శ్రీమతమును అనుసరించాలి. మేము తండ్రి ద్వారా ఉన్నతమైన వారసత్వము తీసుకోవాలని అందరూ పురుషార్థము చేస్తున్నారు. ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యేందుకు స్మృతి చాలా అవసరము. పంచ వికారాల ముళ్ళు తొలగిపోతే పుష్పాలుగా అవుతారు. అయితే ఆ ముళ్ళు యోగబలము ద్వారానే తొలగిపోతాయి. చాలామంది పిల్లలు ఫలానావారు ఈ విధంగా వెళ్లిపోయారు. బహుశా మేము కూడా అలా వెళ్లిపోతామేమోనని అనుకుంటారు. కానీ అలా వెళ్లిపోయే వారిని చూసి పురుషార్థము ఇంకా బాగా చేయాలి కదా. శరీరము వదిలేటప్పుడు తండ్రి స్మృతి ఉండాలి. వశీకరణ మంత్రము గుర్తుండాలి. ఒక్క తండ్రి తప్ప ఇంకేదీ గుర్తు రాకూడదు. అప్పుడు ఈ శరీరము నుండి ప్రాణము వదలిపోవాలి. బాబా మేము మీ వద్దకు రానే వస్తాము. ఇలాంటి తండ్రిని స్మృతి చేసినందున ఆత్మలో నిండి ఉన్న మలినాలన్నీ భస్మమైపోతాయి. ఆత్మలో ఉంటే శరీరములో కూడా ఉన్నాయని అంటారు. జన్మ-జన్మాంతరాల మలినాలున్నాయి. అవన్నీ కాలిపోవాలి. మీలోని మలినాలన్నీ కాలిపోయినప్పుడు ప్రపంచము కూడా శుభ్రమైపోతుంది. మీ కొరకు ఈ ప్రపంచము నుండి మలినాలన్నీ తొలగిపోవాలి. మీరు కేవలము మీలోని మురికిని మాత్రమే శుభ్రము చేయడం కాదు. అందరిలోని మురికిని శుభ్రము చేయాలి. బాబా మీరు వచ్చి ఈ ప్రపంచములోని మలినాలన్నీ శుభ్రము చేయండి, మొత్తం విశ్వమంతటిని పవిత్రంగా చేయండి అని బాబాను పిలుస్తారు. ఇలా ఎందుకు పిలుస్తారు? ఆ పవిత్ర ప్రపంచములో పిల్లలైన మీరే మొట్టమొదట రాజ్యపాలన చేసేందుకు వస్తారు. కావున తండ్రి మీ కొరకు మీ దేశములోకి వచ్చారు.
భక్తికి, జ్ఞానానికి చాలా వ్యత్యాసముంది. భక్తిమార్గములో ఎంతో మంచి-మంచి పాటలు పాడుతూ ఉంటారు. అయితే వీటి ద్వారా ఎవరి కళ్యాణము కూడా జరగదు. స్వధర్మములో స్థితమై తండ్రిని స్మృతి చేయడంలోనే కళ్యాణముంది. లైట్హౌస్ ఎలా అన్ని వైపులా తిరుగుతుందో అలా మీ స్మృతి కూడా అలా దూర-దూరాలకు వ్యాపిస్తూ ఉండాలి. స్వదర్శనాన్నే లైట్హౌస్ అని అంటారు. బాప్దాదా ద్వారా స్వర్గ వారసత్వము లభిస్తుందని పిల్లల హృదయాలకు తెలుసు. ఇదే సత్యనారాయణ కథ. నరుని నుండి నారాయణునిగా అయ్యే కథ. తమోప్రధానంగా అయిన ఆత్మలైన మీరే సతోప్రధానంగా అవ్వాలని తండ్రి చెప్తున్నారు. సత్యయుగములో సతోప్రధానముగా ఉండేవారు. ఇప్పుడు మళ్లీ సతోప్రధానంగా చేసేందుకు తండ్రి వచ్చారు. తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేసినందునే మీరు సతోప్రధానంగా అవుతారు. తండ్రియే గీతను వినిపించారు. ఇప్పుడైతే మనుష్యులు వినిపిస్తున్నారు. ఎంత తేడా ఉంది! భగవంతుడు భగవంతుడే, వారే మనుష్యులను దేవతలుగా చేస్తారు. నూతన ప్రపంచములో ఉండేదే పవిత్ర దేవతలు. అనంతమైన తండ్రి నూతన ప్రపంచ వారసత్వాన్ని ఇచ్చేవారు. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే అంతమతి సో గతి(చివరి స్మృతి అనుసారముగా జన్మిస్తారు) అయిపోతుంది. తండ్రి పురుషోత్తములుగా తయారు చేసేందుకు సంగమ యుగములో వస్తారని మీకు తెలుసు. ఇప్పుడు ఈ 84 జన్మల చక్రము పూర్తి అవుతుంది. మళ్లీ ప్రారంభమవుతుంది. ఇది కూడా చాలా సంతోషించే విషయము. ప్రదర్శనీలో ఎవరైతే వస్తారో వారిని కూడా మొదట శివబాబా చిత్రము ముందుకు తీసుకొచ్చి నిలబెట్టండి. తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేసినందున మీరు ఇలా(లక్ష్మీనారాయణుల వలె) అవుతారు. తండ్రి నుండి సత్యయుగము వారసత్వంగా లభిస్తుంది. భారతదేశము సత్యయుగముగా ఉండేది. ఇప్పుడు అలా లేదు. మళ్లీ తయారవ్వాలి. అందువలన తండ్రిని, చక్రవర్తి పదవిని స్మృతి చేస్తే అంతిమతి సో గతి అయిపోతుంది. వీరు సత్యమైన తండ్రి వీరికి పిల్లలుగా అయినందున మీరు సత్య ఖండానికి యజమానులుగా అవుతారు. మొట్టమొదట అల్ఫ్(పరమాత్మ)ను పక్కా చేయించండి. అల్ఫ్ అనగా బాబా మరియు బే అనగా చక్రవర్తి పదవి. తండ్రిని స్మృతి చేస్తే ఆ స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమౌతాయి. మీరు స్వర్గములోకి వెళ్లిపోతారు. ఎంత సులభము! జన్మ-జన్మాంతరాలు భక్తి విషయాలు వింటూ-వింటూ బుద్ధికి మాయ తాళము వేసేసింది. తండ్రి వచ్చి తాళం చెవితో తాళము తెరుస్తారు. ఇప్పుడు అందరి చెవులు మూతపడినట్లున్నాయి. రాతిబుద్ధి గలవారుగా ఉన్నారు. శివబాబా స్మృతి ఉందా? స్వర్గ వారసత్వము గుర్తుందా? అని మీరు వ్రాయను కూడా వ్రాస్తారు. చక్రవర్తి పదవి గుర్తు వస్తూనే నోరు తీయగా అవుతుంది కదా. తండ్రి అంటున్నారు - నేను పిల్లలైన మీకు ఎంతో గొప్ప ఉపకారము చేస్తున్నాను. మీరు నాకు అపకారమే చేస్తూ వచ్చారు. అయితే అది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఇందులో ఎవరి దోషమూ లేదు. రాతిబుద్ధి గలవారిని బంగారు బుద్ధిగా లేక ముళ్ళను పుష్పాలుగా తయారు చేయడమే పిల్లలైన మీ కర్తవ్యము. మీరు చేయు ఈ మిషన్(సేవ, కర్తవ్యము) నడుస్తూనే ఉంది. మీరంతా ఒక్కొక్కరిని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తున్నారు. వారిని కూడా ఈ విధంగా తయారు చేయువారు తప్పకుండా పుష్పరాజు(కింగ్ ఫ్లవర్) అయ్యి ఉంటారు. స్వర్గ స్థాపన చేయువారు అనగా పుష్పాల తోటను తయారు చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. మీరు ఈశ్వరీయ సేవాధారులు. తమోప్రధానము నుండి సతోప్రధానంగా చేయడమే మీ సేవ. ఇక మీకు ఏ ఇతర కష్టమూ ఇవ్వరు. అర్థము చేయించడం కూడా చాలా సులభము. కలియుగములో ఉండేదే తమోప్రధానత, ఒకవేళ కలియుగపు ఆయువును పెంచితే అది ఇంకా ఎక్కువ తమోప్రధానంగా అవుతుంది.
ఇప్పుడు మనలను పుష్పాలుగా తయారు చేయు తండ్రి వచ్చారని మీకు తెలుసు. ముళ్ళుగా చేయడం రావణుని పని. తండ్రి పుష్పాలుగా చేస్తారు. ఎవరికి శివబాబా స్మృతి ఉందో వారికి తప్పకుండా స్వర్గము కూడా గుర్తుంటుంది. ప్రభాతవేళలో ప్రదక్షణ(ప్రభాత ఫేరీ) చేయునప్పుడు మేము ప్రజాపిత బ్రహ్మకుమార - కుమారీలము. భారతదేశములో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యము స్థాపన చేస్తున్నామని చూపించండి. మేము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. దేవతల నుండి మళ్లీ క్షత్రియ, వైశ్యులు,........ గా అవుతాము. ఇది పల్టీల ఆట. ఎవరికైనా అర్థం చేయించడం చాలా సులభము. మనము బ్రాహ్మణులము. బ్రాహ్మణులకు శిఖ(జుట్టు) ఉంటుంది. మనము 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశామని మీకు కూడా తెలుసు. పిల్లలకు ఎంతో మంచి జ్ఞానము లభిస్తుంది. మిగిలినదంతా భక్తిమార్గము, జ్ఞానము ఒక్క తండ్రి మాత్రమే వినిపిస్తారు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. పురుషోత్తమ సంగమ యుగము కూడా ఒక్కటే. ఈ సమయములో పిల్లలైన మిమ్ములను తండ్రి చదివిస్తున్నారు. ఈ విషయాలన్నీ భక్తిలో స్మృతిచిహ్నాలుగా కొనసాగుతాయి. తండ్రి పిల్లలైన మీకు ఈ పురుషార్థము ద్వారా మీరు ఈ వారసత్వము తీసుకోగలరని పిల్లలకు దారి చూపించారు. ఈ చదువు చాలా సులభము. ఇది నరుని నుండి నారాయణునిగా తయారయ్యే చదువు. దీనిని కథ అని అనరాదు. ఎందుకంటే కథలో ఏ లక్ష్యమూ ఉండదు. చదువులో లక్ష్యముంటుంది. చదివించేవారు ఎవరు? జ్ఞానసాగరులు. తండ్రి అంటున్నారు - నేను వచ్చి మీ జోలెను రత్నాలతో నింపుతాను. అనంతమైన తండ్రిని మీరు ఏ ప్రశ్న అడుగుతారు? ఈ సమయములో అందరూ రాతి బుద్ధివారుగా ఉన్నారు. రావణుడంటేనే తెలియదు. ఇప్పుడు ప్రశ్నించుటకు మీకు తెలివి లభించింది. అసలు రావణుడెవరో చెప్పమని మనుష్యులను అడగండి. రావణుడు ఎప్పుడు జన్మించాడు? ఎప్పటి నుండి తగులబెడ్తున్నారు? అని అడిగితే వారు అనాది నుండి అని అంటారు. మీరు అనేక ప్రకారాల ప్రశ్నలు అడగగలరు. అది కూడా సమయము వచ్చినప్పుడు అడుగుతారు. ఎవ్వరూ సమాధానము చెప్పలేరు. మీ ఆత్మలన్నీ స్మృతియాత్రలో తత్పరమైపోతాయి. ఇప్పుడు మిమ్ములను మీరు ప్రశ్నించుకోండి - మేము సతోప్రధానంగా అయినామా? మీ మన: స్సాక్షిగా చెప్తున్నారా? (మీ హృదయము సాక్ష్యమునిస్తుందా?) ఇప్పుడు మీరు ఇంకా కర్మాతీత స్థితికి రాలేదు. వచ్చే తీరాలి. ఇప్పుడు మీరు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అందుకే మీ మాటలు ఎవ్వరూ వినరు. అంతేకాక మీరు చెప్పే విషయాలు చాలా భిన్నంగా ఉంటాయి. మొట్టమొదట తండ్రి సంగమ యుగములో మాత్రమే వస్తారని తెలపండి. ఒక్కొక్క విషయము అర్థము చేసుకున్న తర్వాతనే ముందుకు తీసుకెళ్ళండి. చాలా ఓపికతో, ప్రీతితో - మీకు ఇద్దరు తండ్రులు, లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి అని అర్థము చేయించండి. పారలౌకిక తండ్రి ద్వారా సతోప్రధానంగా అయినప్పుడు అనంతమైన వారసత్వము లభిస్తుంది. తండ్రి గుర్తుకు వస్తే సంతోషపు పాదరస మీటరు పెరిగిపోతుంది. పిల్లలైన మీలో అనేక గుణాలు నింపబడ్తాయి. పిల్లలైన మిమ్ములను తండ్రి వచ్చి అర్హులుగా చేస్తారు. ఆరోగ్యము, ఐశ్వర్యము కూడా ఇస్తారు. మీ గుణాలను కూడా చక్కబరుస్తారు. విద్య కూడా నేర్పిస్తారు. జైలు శిక్షల నుండి కూడా విడిపిస్తారు.
మినిష్టర్లు మొదలైనవారికి కూడా మీరు మంచిరీతిగా అర్థం చేయించగలరు. వారు ద్రవీభవించునట్లు (నీరు వలె కరిగిపోవునట్లు) అర్థం చేయించాలి. మీ జ్ఞానము చాలా మధురమైనది. ప్రీతిగా కూర్చొని వింటే ప్రేమ బాష్పాలు రావాలి. మేము ఈ సోదరులకు దారి చూపిస్తున్నామనే దృష్టి ఉంచుకోండి. మేము శ్రీమతముననుసరించి భారతదేశానికి సత్యమైన సేవ చేస్తున్నామని చెప్పండి. భారతదేశపు సేవలోనే మా ధనము వినియోగిస్తామని కూడా తెలపండి. బాబా చెప్తున్నారు - ఢిల్లీని సేవ ద్వారా ఘెరావ్(చుట్టుముట్టండి) చేయండి. సేవను విస్తారము చేయండి కానీ ఇంతవరకు ఎవ్వరినీ సేవతో గాయపరచలేదు. గాయపరచేందుకు యోగబలము కావాలి. యోగబలము ద్వారా మీరు ఈ విశ్వానికిి యజమానులుగా అవుతారు. యోగముతో పాటు జ్ఞానము కూడా ఉంది. యోగము ద్వారానే మీరు ఎవరినైనా ఆకర్షించగలరు. ఇప్పుడు పిల్లలైన మీరు భలే చాలా బాగా ఉపన్యసిస్తారు. కానీ యోగ ఆకర్షణ తక్కువగా ఉంది. ముఖ్యమైనది యోగము. పిల్లలైన మీరు యోగము ద్వారా స్వయాన్ని పవిత్రంగా చేసుకుంటారు. కనుక యోగబలము చాలా అవసరము. అది చాలా తక్కువగా ఉంది. ఆంతరికంగా సంతోషముతో నాట్యము చేయాలి. ఇది సంతోషపు నృత్యము. ఈ జ్ఞాన-యోగాల ద్వారా మీరు లోలోపల నృత్యము చేస్తారు. తండ్రి స్మృతిలో ఉంటూ ఉంటూ మీరు అశరీరులుగా అవుతారు. జ్ఞానము ద్వారా అశరీరులుగా అవ్వాలి. అంతేకాని ఇందులో అదృశ్యమయ్యే మాటే లేదు. బుద్ధిలో జ్ఞానముండాలి. ఇప్పుడు ఇంటికి వెళ్లాలి. మళ్లీ రాజ్యములోకి వస్తారు. తండ్రి వినాశనము, స్థాపనలను సాక్షాత్కారము కూడా చేయించారు. ఈ ప్రపంచమంతా కాలి భస్మమై ఉంది. మనము నూతన ప్రపంచానికి అర్హులుగా అవుతున్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్లాలి. కావున శరీరము పై కూడా ఎలాంటి మమకారము ఉండరాదు. ఈ శరీరము నుండి, ఈ ప్రపంచము నుండి అతీతంగా ఉండాలి. కేవలం మీ ఇంటిని మరియు రాజధానిని స్మృతి చెయ్యాలి. ఏ వస్తువులోనూ ఆసక్తి ఉండరాదు. వినాశనము కూడా చాలా కఠినంగా ఉంటుంది. వినాశనము ప్రారంభమైనప్పుడు మీకు ఖుషీ ఉంటుంది - ''ఓహో! ఇక మేము బదిలీ కానే అవుతాము.'' పాత ప్రపంచములోని ఏ వస్తువైనా గుర్తుకు వస్తే ఫెయిల్ అవుతారు. పిల్లల వద్ద ఏమీ లేకుంటే స్మృతిలోకి ఏమొస్తుంది? అనంతమైన ఈ ప్రపంచమంతటి పై మమకారము నశించాలి. ఇందులో శ్రమ ఉంది. భాయి-భాయి స్థితి పక్కాగా ఎప్పుడు ఉంటుందంటే దేహాభిమానము నశించినప్పుడు. దేహాభిమానములోకి వచ్చినందున ఏదో ఒక నష్టము జరుగుతుంది. ఆత్మాభిమానులుగా ఉంటే ఏ నష్టమూ జరగదు. మనము మన సోదరులను చదివిస్తున్నాము. సోదరునితోనే మాట్లాడుతున్నామనే అభ్యాసము పక్కా అయిపోవాలి. స్కాలర్షిప్ తీసుకోవాలనుకుంటే ఇంత పురుషార్థము చేయాలి. ఇతరులకు అర్థము చేయించునప్పుడు కూడా మనమంతా భాయి-భాయి అని (సోదరులమని) గుర్తుండాలి. ఆత్మలందరు ఒక్క తండ్రి పిల్లలే. సోదరులందరికీ తండ్రి వారసత్వము పై హక్కు ఉంది. సోదరీ అను భావము కూడా ఉండరాదు. దీనిని ఆత్మాభిమానము అని అంటారు. ఆత్మకు ఈ శరీరము లభించింది. ఇందులో కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు, వాటి ప్రకారము శరీరముల పై పేర్లు ఉంచుకున్నారు. ఆత్మ వీటన్నిటికి అతీతంగా ఉంది. బాబా ఏ దారి చూపుతున్నారో అది చాలా సరైన దారి, దీనిని గురించి ఆలోచిస్తూ ఉండాలి. దీనిని అభ్యాసము చేయుటకే పిల్లలు ఇచ్చటకు వస్తారు. రైలులో ఎవరికైనా బ్యాడ్జిని చూపించి అర్థము చేయించవచ్చు. వారి దగ్గర కూర్చొని మీకు తండ్రులెంతమంది? అని ప్రశ్నించండి. తర్వాత దానికి జవాబు కూడా మీరే ఇవ్వండి. ఇది ఇతరుల దృష్టిని, ధ్యాసను ఆకర్షించే యుక్తి. తర్వాత మీకు ఇద్దరు తండ్రులు, మాకు ముగ్గురు తండ్రులు అని చెప్పండి. ఈ అలౌకిక తండ్రి(బ్రహ్మ) ద్వారా మాకు వారసత్వము లభిస్తుందని చెప్పండి. మీ వద్ద ఫస్ట్క్లాస్ వస్తువులున్నాయి. దీని వలన లాభమేమి? అని ఎవరైనా అడుగుతారు. అంధుల ఊతకర్రలై అందరికీ మార్గము చూపడమే మా కర్తవ్యమని చెప్పండి. క్రైస్తవ కన్యలు(నన్స్) సేవ ఎలా చేస్తారో మీరు కూడా అలా చేయండి. మీరు చాలామంది ప్రజలను తయారు చేసుకోవాలి. ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థము చేయాలి. మీరు ఉన్నతము చెందే కళకు అందరికీ దారి చూపిస్తారు. ఒక్క తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నా చాలా ఖుషీ ఉంటుంది. వికర్మలు కూడా వినాశనమౌతాయి. తండ్రి నుండి వారసత్వము తీసుకోవడం చాలా సులభము. కాని చాలామంది పిల్లలు పొరపాట్లు చేస్తూ ఉంటారు. అజాగ్రత్తగా ఉంటారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. అంతిమ సమయములో ఉత్తీర్ణులయ్యేందుకు(పాస్) ఈ శరీరము నుండి, ప్రపంచము నుండి అతీతంగా అవ్వాలి. ఏ వస్తువులోనూ ఆసక్తి ఉంచుకోరాదు. ఇప్పుడు మనము బదిలీ అవ్వనే అవుతాము అని బుద్ధిలో ఉండాలి.
2. చాలా ఓర్పుతో, ప్రీతితో అందరికీ ఇద్దరు తండ్రుల పరిచయమునివ్వండి. జ్ఞాన రత్నాలతో బుద్ధి రూపి జోలెను నింపుకొని దానము చేయండి. ముళ్ళను పుష్పాలుగా చేసే సేవ తప్పకుండా చేయాలి.
వరదానము :-
''సేవ చేసే ఉమంగ-ఉత్సాహము ద్వారా రక్షణను అనుభవం చేసే మాయాజీత్ భవ''
ఏ పిల్లలైతే స్థూల సేవతో పాటు ఆత్మిక సేవ కొరకు పరుగు తీస్తారో, ఎవర్రెడీగా ఉంటారో వారికి సేవలో ఉమంగ-ఉత్సాహము కూడా రక్షక సాధనంగా అవుతుంది. ఎవరైతే సేవలో లగ్నమై ఉంటారో వారు మాయ నుండి రక్షింపబడి ఉంటారు. మాయ కూడా వీరికి ఫుర్సత్తు (తీరిక) లేదని గమనించి అది కూడా వాపసు వెళ్లిపోతుంది. ఏ పిల్లలకైతే తండ్రి మరియు సేవ పై ప్రేమ ఉంటుందో వారికి అదనపు ధైర్యము సహాయంగా లభిస్తుంది. దీని ద్వారా సహజంగానే మాయాజీతులుగా అవుతారు.
స్లోగన్ :-
''జ్ఞాన - యోగాలము మీ జీవితంలో స్వభావంగా చేసుకుంటే పాత నేచర్ మారిపోతుంది.''