29-10-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - ఆజ్ఞాకారులుగా అవ్వండి, మొట్టమొదటి తండ్రి ఆజ్ఞ - స్వయాన్ని ఆత్మగా భావించి, తండ్రిని స్మృతి చేయండి ''
ప్రశ్న :-
ఆత్మ రూపి పాత్ర అశుద్ధంగా ఎందుకు తయారయింది? దానిని శుద్ధంగా తయారు చేయు సాధనమేది?
జవాబు :-
వ్యర్థ మాటలు వింటూ, వినిపిస్తూ ఆత్మ రూపి పాత్ర అశుద్ధమైపోయింది. దీనిని శుద్ధంగా తయారు చేసేందుకు తండ్రిగారి ఆజ్ఞ - చెడు వినకు, చెడు చూడకు. ఒక్క తండ్రి ద్వారానే వినండి. ఆ తండ్రినే స్మృతి చేయండి. అలా చేస్తే ఆత్మ రూపి పాత్ర శుభ్రమౌతుంది. ఆత్మ మరియు శరీరము రెండూ పావనమైపోతాయి.
పాట :-
జో పియాకే సాథ్ హై ఉన్కే లియే బర్సాత్ హై,....... (ప్రియుని జతలో ఎవరైతే ఉన్నారో, వారి కొరకే ఈ వర్షము........) 
ఓంశాంతి.
ఓంశాంతి అర్థమును పిల్లలు తెలుసుకున్నారు. పిల్లలకు ప్రతి క్షణము పాయింట్లు ఇవ్వబడ్తాయి. క్షణ-క్షణము తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయండని చెప్తున్నాము కదా! ఇక్కడ ఏ మనుష్యుల స్మృతీ ఉండదు. మనుష్యులు మనుష్యుల స్మృతిని లేక దేవతల స్మృతిని ఇప్పిస్తారు. పారలౌకిక తండ్రి స్మృతిని ఎవ్వరూ ఇప్పించలేరు ఎందుకంటే ఆ తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు. ఇచ్చట మీకు క్షణ క్షణము స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయమని చెప్పడం జరుగుతుంది. ఏ తండ్రికైనా పుత్రుడు జన్మిస్తే తండ్రి నుండి వారసత్వము తీసుకునేందుకని అందరూ అర్థము చేసుకోగలరు. ఆ కుమారునికి తండ్రి మరియు వారసత్వము గుర్తుంటుంది. ఇక్కడ కూడా అంతే. అయితే పిల్లలకు తండ్రి ఎవరో తెలియదు. అందుకే ఆ తండ్రే రావలసి ఉంటుంది. ఎవరైతే తండ్రి జతలో ఉంటారో వారి కొరకు ఈ జ్ఞాన వర్షము కురుస్తుంది. వేదశాస్త్రాలలో ఉన్న జ్ఞానమంతా భక్తిమార్గపు సామాగ్రి. జపము, తపము, దానము, పుణ్యము, సంధ్య(సంధ్య వార్చుకోవడం), గాయిత్రి మంత్రము జపించడం మొదలైనవి ఏవైతే చేస్తున్నారో అవన్నీ భక్తిమార్గపు సామాగ్రి. సన్యాసులు కూడా భక్తులే. పవిత్రత లేకుంటే శాంతిధామానికి ఎవ్వరూ వెళ్ళలేరు. కావున వారు ఇల్లు-వాకిలి వదిలి వెళ్ళిపోతారు. అయితే ఈ ప్రపంచమంతా అలా చేయదు. వారి హఠయోగము కూడా ఈ డ్రామాలో రచింపబడింది. పిల్లలైన మీకు రాజయోగము నేర్పించేందుకు నేను కల్పానికి ఒక్కసారి మాత్రమే వస్తాను. నాకు వేరే అవతారాలు ఏవీ లేవు. రీ-ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్(మళ్ళీ అవతరించుట) అని అంటారు. వారు అత్యంత ఉన్నతులు. మరి జగదంబ, జగత్పితల రీ-ఇన్కార్నేషన్ కూడా తప్పకుండా జరగాలి కదా. వాస్తవానికి రీ-ఇన్కార్నేషన్ అనే పదము కేవలం తండ్రి ఒక్కరికే వర్తిస్తుంది. సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. నిజానికి ప్రతి వస్తువు మళ్ళీ రీ-ఇన్కార్నేట్ అవుతుంది. ఇప్పుడున్న భ్రష్ఠాచారాన్ని కూడా రీ-ఇన్కార్నేట్ అనగా పునరావృతమయ్యిందని అంటారు. అనగా మళ్ళీ భ్రష్ఠాచారముగా అయ్యిందని అర్థము. అలాగే మళ్ళీ శ్రేష్ఠాచారము వస్తుంది. ప్రతి వస్తువు ఈ విధంగా రీ-ఇన్కార్నేట్(పునరావృతం) అవుతుంది. ఇప్పుడిది పాత ప్రపంచము. నూతన ప్రపంచము మళ్ళీ వస్తుంది. నూతన ప్రపంచము తర్వాత మళ్ళీ పాత ప్రపంచము వస్తుంది. ఈ విషయాలన్నీ తండ్రియే కూర్చొని అర్థము చేయిస్తున్నారు. ఇక్కడ కూర్చున్నప్పుడు సదా ఇది గుర్తుంచుకోండి - నేను ఆత్మను నాకు తండ్రి నుండి - నన్ను స్మృతి చేయండనే ఆజ్ఞ లభించిందని భావించండి. పిల్లలకు తప్ప మరెవ్వరికీ తండ్రి ఆజ్ఞ లభించదు. అయితే పిల్లలలో కొంతమంది ఆజ్ఞాకారులుగా ఉంటారు. కొంతమంది ఆజ్ఞలను పాటించని వారు కూడా ఉంటారు. తండ్రి చెప్తున్నారు - ఓ ఆత్మలారా! మీరు నాతో బుద్ధియోగాన్ని జోడించండి. తండ్రి ఆత్మలతో మాట్లాడ్తున్నారు. ఏ ఇతర విద్వాంసులు, పండితులు మొదలైనవారెవ్వరూ నేను ఆత్మతో మాట్లాడ్తున్నానని అనరు. వారు ఆత్మయే పరమాత్మ అని భావిస్తారు. అది శుద్ధ తప్పు. శివబాబా ఈ శరీరము ద్వారా మనకు అర్థము చేయిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. శరీరము లేకుండా కర్తవ్యము జరగదు కదా! మొట్టమొదట ఈ నిశ్చయముండాలి. నిశ్చయము లేకుంటే బుద్ధిలో ఏమీ నిలువదు. ఆత్మల తండ్రి నిరాకార పరమపిత పరమాత్మ అని, సాకారములోని తండ్రి ప్రజాపిత బ్రహ్మ అని మొదట నిశ్చయముండాలి. మనము బి.కెలము. సర్వాత్మలు శివుని సంతానమే. అందుకే మీరంతా శివకుమారులని అంటారు, శివకుమారీలు అని అనరు. ఈ విషయాలన్నీ ధారణ చేయాలి. నిరంతరము స్మృతి చేస్తూ ఉన్నప్పుడే ధారణ జరుగుతుంది. స్మృతి చేయడం ద్వారానే బుద్ధి రూపి పాత్ర శుద్ధమౌతుంది. వ్యర్థ మాటలు వింటూ వింటూ బుద్ధి రూపి పాత్ర అశుద్ధమైపోయింది. దానిని శుద్ధము చేయాలి. నన్ను స్మృతి చేస్తే మీ బుద్ధి పవిత్రమౌతుందని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. ఆత్మలైన మీలో మలినము ఏర్పడిపోయింది. ఇప్పుడు పవిత్రులుగా అవ్వాలి. సన్యాసులు ఆత్మ నిర్లేపమని అంటారు. కాని ఆత్మలోనే మలినాలు ఏర్పడ్తాయని తండ్రి చెప్తున్నారు. శ్రీ కృష్ణుని ఆత్మ, శరీరము రెండూ పవిత్రంగా ఉంటాయి. ఆత్మ-శరీరము రెండూ పవిత్రంగా కేవలం సత్యయుగములోనే ఉంటాయి. ఇక్కడ అలా ఉండవు. ఆత్మలైన మీరు నెంబరువారుగా పవిత్రంగా అవుతూ ఉన్నారు. ఇప్పుడింకా పవిత్రంగా అవ్వలేదు. ఒక్కరు కూడా పవిత్రంగా లేరు. అందరూ పురుషార్థము చేస్తున్నారు. అంత్యములో నెంబరువారుగా అందరి ఫలితము వెలువడ్తుంది.
తండ్రి వచ్చి ఆత్మలందరినీ ఆజ్ఞాపిస్తున్నారు - ''నన్ను స్మృతి చేయండి, స్వయాన్ని అశరీరిగా భావించండి, ఆత్మాభిమానులుగా అవ్వండి.'' ముఖ్యమైన ఈ విషయాలు తండ్రి తప్ప మరెవ్వరూ అర్థము చేయించలేరు. మొదట ఈ విషయములో నిశ్చయముంటే తప్పకుండా విజయము పొందుతారు. నిశ్చయము లేకుంటే విజయము పొందలేరు. నిశ్చయబుద్ధిగలవారు విజయము పొందుతారు.(నిశ్చయబుద్ధి విజయంతి) సంశయ బుద్ధిగలవారు వినాశమౌతారు(సంశయబుద్ధి వినశ్యంతి). గీతలో కూడా ఇటువంటి కొన్ని వాక్యాలు చాలా బాగున్నాయి, సత్యంగా ఉన్నాయి. దీనినే పిండిలో ఉప్పు వేసినంత(ఆటే మే నమక్) అని అంటారు. తండ్రి చెప్తున్నారు - నేను అన్ని వేద శాస్త్రాలలో ఉన్న విషయాల సారాన్ని అర్థము చేయిస్తాను. ఇవన్నీ భక్తి మార్గములోని దారులు ఇవి కూడా డ్రామాలో రచింపబడినవి. అయితే ఈ భక్తిమార్గము ఎందుకు తయారు చేయబడింది - అనే ప్రశ్న ఉత్పన్నమవ్వజాలదు. ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా. మీరు కూడా ఈ డ్రామాలో తండ్రి ద్వారా స్వర్గానికి అధిపతులుగా అయ్యే వారసత్వాన్ని అనేకసార్లు తీసుకున్నారు. ఇక పై కూడా తీసుకుంటూనే ఉంటారు. ఇది ఎప్పుడూ ముగిసేది, అంతమయ్యేది కాదు. ఈ చక్రము అనాదిగా తిరుగుతూనే ఉంటుంది. పిల్లలైన మీరిప్పుడు దు:ఖధామములో ఉన్నారు. తర్వాత మళ్ళీ శాంతిధామానికి వెళ్తారు. శాంతిధామము నుండి సుఖధామానికెళ్తారు. మళ్ళీ దు:ఖధామానికి వస్తారు. ఈ అనాది చక్రము తిరుగుతూనే ఉంటుంది. సుఖధామము నుండి దు:ఖధామానికి వచ్చేందుకు పిల్లలైన మీకు 5 వేల సంవత్సరాలు పడ్తుంది. ఈ కాలములో మీరు 84 జన్మలు తీసుకుంటారు. కేవలం పిల్లలైన మీరు మాత్రమే 84 జన్మలు తీసుకుంటారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. ఈ బేహద్ తండ్రి మీకు సన్ముఖములో ఈ విషయాలు అర్థము చేయిస్తున్నారు. తర్వాత పిల్లలు మురళి వింటారు లేక చదువుతారు. అది లేకుంటే టేపులో వింటారు. టేపు కూడా అందరూ వినలేరు. పిల్లలైన మీరు లేస్తూ-కూర్చుంటూ ఈ స్మృతిలో ఉండాలి. మనుష్యులు మాల తిప్పుతూ రామ-రామ అని జపిస్తూ ఉంటారు. రుద్రాక్ష మాల అని అంటారు కదా! ఇప్పుడు రుద్రుడనగా భగవంతుడు. ఆ తర్వాత ఈ మాలలో పెద్ద రుద్రాక్ష(మేరువు (జంట)) ఉంటుంది. ఇది విష్ణువు యుగల్ స్వరూపము. అయితే ఆ జంట ఎవరు? అది మాతా-పితలది. ఈ మాతా-పితల జంట విష్ణువు యొక్క రెండు రూపాలైన లక్ష్మీ నారాయణులుగా అవుతారు. అందుకే దానిని మేరువు(పెద్ద) అని అంటారు. పైనున్న పుష్పము శివబాబా ఆ తర్వాత మేరువు. అది మమ్మా-బాబాల జంట వారినే మీరు మాతా-పితలని అంటారు. విష్ణువును మాతా - పితలని అనరు. లక్ష్మీనారాయణులను వారి పిల్లలు మాత్రమే వారిని తల్లి-తండ్రి అని అంటారు. ఈ రోజులలో అందరి ముందుకు వెళ్లి త్వమేవ మాతాశ్చ పితా,........... అని అంటున్నారు. ఎవరో ఒకరు ఈ విధంగా ఎవరిని మహిమ చేసినా వారి వెనుక అందరూ, వారిని మాతా-పిత అని అనడం ప్రారంభిస్తారు. ఇది అధర్మ ప్రపంచము. కలియుగాన్ని అధర్మయుక్త, అసత్య ప్రపంచమని అంటారు. సత్యయుగాన్ని ధార్మిక సత్య ప్రపంచమని అంటారు. అచ్చట ఆత్మ మరియు శరీరము రెండూ పవిత్రంగా ఉంటాయి. సత్యయుగములో కృష్ణుడు సుందరంగా ఉంటాడు. అంతిమ జన్మలో ఆ కృష్ణుని ఆత్మ మళ్ళీ నల్లగా అయ్యింది. ఈ బ్రహ్మ-సరస్వతి ఇరువురూ ఇప్పుడు నల్లగా ఉన్నారు కదా! ఆత్మ నల్లగా అయిపోయింది. కావున వారి శరీరాలు కూడా నల్లగా అయిపోయాయి. బంగారములోనే మలినము ఏర్పడ్తుంది. దాని వలన ఆ బంగారుతో నగ కూడా అలాంటిదే తయారవుతుంది. సత్యయుగములో దేవీదేవతల ప్రభుత్వమున్నప్పుడు ఈ మలినము ఉండదు. అక్కడ బంగారు మహళ్ళు తయారవుతాయి. భారతదేశము బంగారు పక్షిగా(పిచ్చుకగా) ఉండేది. ఇప్పుడంతా మిశ్రమమైపోయింది, గిల్టుదైపోయింది. ఇటువంటి భారతదేశాన్ని మళ్ళీ తండ్రియే వచ్చి స్వర్గంగా చేయగలరు.
తండ్రి అర్థము చేయిస్తున్నారు - శ్రీమద్భగవానువాచ కదా! కృష్ణుడైతే దైవీ గుణాలు కలిగిన రెండు భుజాలు, రెండు కాళ్ళు ఉన్న మానవుడు. చిత్రాలలో అయితే అక్కడక్కడ నారాయణకు, అక్కడక్కడ లక్ష్మికి 4 భుజాలు చూపిస్తారు. కొద్దిగా కూడా అర్థము చేసుకోరు. ఓం అనే పదమును కూడా అంటారు. వారు ఓం అనగా నా గాడ్(భగవంతుడు) అని, ఎక్కడ చూసినా భగవంతుడే, భగవంతుడని అంటారు. అయితే ఇది శుద్ధ తప్పు. ఓం అనగా నేను ఆత్మను. తండ్రి కూడా అంటున్నారు - నేను(అహం) కూడా ఆత్మనే అయితే నేను ఉన్నతోన్నతుడను(సుప్రీం). అందుకే నన్ను పరమాత్మ అని అంటారు. నేను పరంధామ నివాసిని. అత్యంత ఉన్నతులు భగవంతుడు. ఆ తర్వాత సూక్ష్మవతనములో బ్రహ్మ-విష్ణు-శంకరుల ఆత్మలుంటాయి. ఆ తర్వాత క్రిందకు వస్తే ఈ సాకారి మనుష్యుల లోకముంది. అది దైవీ లోకము. పై నుండేది ఆత్మల లోకము. దానిని మూలవతనమని అంటారు. ఇవన్నీ అర్థము చేసుకోవలసిన విషయాలు. పిల్లలైన మీకు ఈ అవినాశి జ్ఞాన రత్నాలు దానంగా లభిస్తాయి. వీటి వలన మీరు భవిష్యత్తులో సంపన్నంగా డబుల్ కిరీటధారులుగా అవుతారు. చూడండి - శ్రీ కృష్ణునికి రెండు కిరీటాలున్నాయి కదా! మళ్ళీ ఆ బాలుడే చంద్ర వంశములోకి వచ్చినప్పుడు రెండు కళలు తగ్గిపోతాయి. ఆ తర్వాత వైశ్య వంశములోకి వచ్చినప్పుడు. ఇంకా 4 కళలు తగ్గిపోతాయి. అప్పుడు ప్రకాశ కిరీటము ఎగిరిపోతుంది. రత్న జడితమైన కిరీటము మాత్రమే ఉంటుంది. తర్వాతి కాలములో ఎవరైతే దాన-పుణ్యాదులు బాగా చేస్తారో వారికి ఒక్క జన్మకు మాత్రమే రాజ్యభాగ్యము లభిస్తుంది. ఆ తర్వాత జన్మలో కూడా మంచి దాన-పుణ్యాలు చేస్తే మళ్ళీ రాజ్యము లభించగలదు. ఇక్కడైతే మీరు 21 జన్మలకు రాజ్యపదవిని పొందగలరు. బాగా శ్రమ చేయాల్సి వస్తుంది. కావున తండ్రి తన పరిచయమునిస్తున్నారు - '' నేను సుప్రీమ్ సోల్(పరమాత్మ)ను''. అందుకే వారిని పరమపిత పరమాత్మ అనగా పరమాత్మ అని అంటారు. పిల్లలైన మీరు ఆ సుప్రీమ్నే స్మృతి చేస్తారు. మీరు సాలిగ్రామాలు. వారు శివుడు. శివునిది పెద్ద లింగాకారంగా, సాలిగ్రామాలను మట్టితో చిన్నవిగా తయారు చేస్తారు. ఏ ఆత్మల స్మృతిచిహ్నాలను తయారుచేస్తారో కూడా ఎవ్వరికీ తెలియదు. శివబాబా పిల్లలైన మీరు భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు. అందుకే మిమ్ములను పూజిస్తారు, తర్వాత మరలా మీరు దేవతలుగా అవుతారు. అప్పుడు కూడా మిమ్ములను పూజిస్తారు. శివబాబా జతలో మీరు ఇంత సేవ చేసినందున మిమ్ములను సాలిగ్రామ రూపములో పూజిస్తారు. ఎవరైతే అత్యంత ఉత్తమ కర్తవ్యము చేస్తారో, వారిని పూజిస్తారు. కలియుగములో ఎవరైతే మంచి పనులు చేస్తారో వారి స్మృతి చిహ్నాలను తయారుచేస్తారు. కల్ప-కల్పము పిల్లలైన మీకు సృష్టి చక్ర రహస్యమంతా అర్థము చేయిస్తారు అనగా బాబా మిమ్ములను స్వదర్శన చక్రధారులుగా చేస్తారు. స్వదర్శన చక్రము విష్ణువుకు ఉండజాలదు. అతడు దేవతగా అయిపోతాడు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అయితే ఈ జ్ఞానముండదు. అక్కడైతే అందరూ సద్గతిలో ఉంటారు. పిల్లలైన మీరిప్పుడు ఈ జ్ఞానాన్ని ఇప్పుడే వింటారు. తర్వాత భవిష్యత్తులో రాజ్యము పొందుతారు. స్వర్గ స్థాపన అయిన తర్వాత ఈ జ్ఞానము అవసరముండదు.
తండ్రియే స్వయంగా వచ్చి వారి పరిచయాన్ని మరియు వారి రచన పరిచయాన్ని ఇస్తారు. సన్యాసులు మాతలను నిందించారు. కాని తండ్రి వచ్చి మాతలను ఉద్ధరిస్తారు. తండ్రి ఇలా కూడా అర్థము చేయిస్తున్నారు - ఈ సన్యాసులు లేకపోతే భారతదేశము కామచితి పై కూర్చొని కాలి పూర్తిగా బూడిదైపోయేది. దేవీ దేవతలు వామ(వేద విరుద్ధమైన, నియమాలకు వ్యతిరేకమైన మధు, మధ్య, మాంస, మైధునములలో మునిగి ఉండేవారు) మార్గములోకి పడిపోతారు. అప్పుడు భూమి చాలా జోరుగా కంపిస్తుంది. అంతా క్రిందికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇతర ఖండములేవీ ఉండవు. భారతదేశము మాత్రమే ఉంటుంది. ఇస్లామ్ మొదలైన ధర్మాలు తర్వాత వస్తాయి. సత్యయుగపు వస్తువులేవీ ఇక్కడ ఉండవు. మీరు చూచే సోమనాథ మందిరము వైకుంఠములోది కాదు. ఇది భక్తిమార్గములో తయారయ్యింది. దానిని ఘోరి, గజనీ మహమ్మద్ మొదలైనవారు దోచుకున్నారు. దేవతల మహళ్ళు మొదలైనవన్నీ భూకంపములో అంతమైపోతాయి. అలాగని మహళ్ళు భూమిలోకి క్రిందికి దిగిపోతాయని మళ్ళీ అవే పైకి వస్తాయని కాదు. అలా జరగదు. అవి భూమిలో ముక్కలు ముక్కలై శిథిలమైపోతాయి. అయితే త్రవ్వకాలలో అదే స్థానములో అదే సమయములో త్రవ్వితే ఏవో కొన్ని ముక్కలు గుర్తులుగా లభిస్తాయి. ఇప్పుడైతే ఏమీ లభించవు. శాస్త్రాలలో ఈ విషయాలేవీ లేవు. సద్గతిదాత ఆ ఒక్క తండ్రి మాత్రమే అని నిశ్చయము మొట్టమొదట ఉండాలి. ఈ నిశ్చయములోనే మాయ విఘ్నాలు కల్పిస్తుంది. భగవంతుడెలా వస్తారని అంటారు? అరే! శివజయంతి చేస్తున్నారంటే వారు తప్పకుండా వచ్చే ఉంటారు. లేకుంటే ఎందుకు చేస్తారు. తండ్రి చెప్తున్నారు - నేను అనంతమైన పగలు, అనంతమైన రాత్రుల సంగమయుగ సమయములోనే వస్తాను. అయితే నేనెప్పుడొస్తానో ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. మన తండ్రి మనకు మాత్రమే ఈ జ్ఞానమిచ్చారు. దివ్యదృష్టితో ఈ చిత్రాలు మొదలైనవి తయారు చేయించారు. గీతలో కూడా కల్పవృక్షము గురించి కొద్దిగా వర్ణన ఉంది. పిల్లలకు చెప్తున్నారు - ఇప్పుడు మీరు నేను ఇప్పుడిక్కడ ఉన్నాము. కల్పక్రితము కూడా అలాగే ఉండినాము. కల్ప-కల్పము మీకు ఈ జ్ఞానమిస్తాను. కావున చక్రము కూడా నిరూపించబడ్తుంది. అయితే మీరు తప్ప ఇతరులెవ్వరూ అర్థము చేసుకోలేరు. ఈ చిత్రాలన్నీ సృష్టి చక్రపు చిత్రాలు. ఎవరో ఒకరు తప్పకుండా చేయించి ఉంటారు. వాటిని గురించి తండ్రి అర్థము చేయిస్తారు. పిల్లలు కూడా ఈ చిత్రము పై అర్థము చేయిస్తారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఏ విషయములోనైనా విజయానికి ఆధారము నిశ్చయము. అందుకే నిశ్చయబుద్ధిగా తప్పకుండా అవ్వాలి. సద్గతిదాత అయిన తండ్రియందు సంశయమెప్పుడూ ఉండరాదు.
2. బుద్ధిని పవిత్రంగా, శుద్ధంగా చేసుకునేందుకు అశరీరులుగా అయ్యే అభ్యాసము చేయాలి. వ్యర్థము వినరాదు, వినిపించరాదు.
వరదానము :-
'' మీ శక్తి స్వరూపం ద్వారా అలౌకికతను అనుభవం చేయించే జ్వాలారూప్ భవ ''
ఇంతవరకు దీపమైన తండ్రి ఆకర్షణ పని చేస్తోంది. తండ్రి కర్తవ్యము నడుస్తోంది, పిల్లల కర్తవ్యము గుప్తంగా ఉంది. కాని ఎప్పుడైతే మీరు మీ శక్తిస్వరూపంలో స్థితమవుతారో అప్పుడు మీ సంపర్కములోకి వచ్చే ఆత్మలు అలౌకికతను అనుభవం చేస్తాయి. బాగుంది, బాగుంది అనేవారికి బాగుపడాలనే ప్రేరణ, మీరు సంఘటిత రూపంలో జ్వాలా స్వరూపంగా, లైట్హౌస్గా అయినపుడు లభిస్తుంది. మాస్టర్ సర్వశక్తివంతుల స్థితి, స్టేజిపైకి వస్తే అందరూ మీ చుట్టూ దీపపు పురుగుల సమానంగా తిరగడం ప్రారంభిస్తారు.
స్లోగన్ :-
''తమ కర్మేంద్రియాలను యోగాగ్నిలో తపింపజేయువారే సంపూర్ణ పావనంగా అవుతారు ''