10.11.2018
Morning Telugu Murli Om Shanti BapDada Madhuban
“మధురమైన పిల్లలారా-
ఎప్పుడైతే మీ
హృదయంలో సత్యత మరియు స్వచ్ఛత ఉంటాయో, అప్పుడే మీ సత్యవైున మాటల బాణము తగులగలదు, మీకు
సత్యవైున తండ్రి సాంగత్యము లభించింది, కావున సత్యవైునవారిగా అవ్వండి.’’
ప్రశ్న:-
మీరందరూ
విద్యార్థులు , మీరు ఏ విషయంపై ధ్యానమును ఉంచడం అవసరము ?
జవాబు:-
ఎప్పుడైనా
ఏదైనా పొరపాటు జరిగితే సత్యము చెప్పాలి . సత్యము చెప్పడం ద్వారానే ఉన్నతి జరుగుతుంది
. మీరు ఇతరుల ద్వారా సేవ చేయించుకోకూడదు . ఇక్కడ సేవ చేయించుకున్నట్లయితే అక్కడ సేవ
చేయవలసి వస్తుంది . విద్యార్థులైన మీరు బాగా చదువుకుని ఇతరులను చదివించినట్లయితే
బాబా కూడా సంతోషిస్తారు . బాబా ప్రేమ సాగరుడు , వారు పిల్లలైన మిమ్మల్ని చదివించి
ఉన్నతవైున పదవిని ప్రాప్తింపజేస్తారు , ఇదే వారి ప్రేమ .
గీతము:-
ఈ ఆటనంతా ఎవరు
రచించారు...
ఓం శాంతి.
మేము గీతా
జయంతిని జరుపుకుంటున్నాము అని ఈ రోజుల్లో సమాచారాలు వస్తూ ఉంటాయి. గీతకు జన్మనెవరు
ఇచ్చారు అన్నది విషయము. జయంతి అని అన్నప్పుడు మరి తప్పకుండా జన్మ కూడా జరిగింది కదా!
దానిని శ్రీమత్ భగవత్ గీతా జయంతి అని అన్నప్పుడు మరి తప్పకుండా తనకు జన్మనిచ్చేవారు
కూడా కావాలి కదా! అందరూ శ్రీకృష్ణభగవానువాచ అని అంటారు, మరలాంటప్పుడు కృష్ణుడు మొదట
వచ్చి, గీత వెనుక అయిపోతుంది కదా! మరి గీతా రచయిత తప్పకుండా కావాలి. అదీ
శ్రీకృష్ణుడు అని అంటే ముందు శ్రీకృష్ణుడు రావాలి, ఆ తర్వాత గీత రావాలి. కాని
శ్రీకృష్ణుడు చిన్న పిల్లవాడు, తాను గీతను వినిపించలేడు. గీతకు జన్మనిచ్చేవారు ఎవరు
అన్నది నిరూపించి చెప్పాలి. ఇది గుహ్యవైున విషయము. కృష్ణుడైతే మాత గర్భం నుండి జన్మ
తీసుకుంటాడు, తాను సత్యయుగపు యువరాజు. తాను గీత ద్వారా రాజయోగాన్ని నేర్చుకుని స్వయం
యువరాజ పదవిని పొందాడు. ఇప్పుడు గీతకు జన్మనిచ్చేది ఎవరు? పరమపిత శివపరమాత్మయా లేక
శ్రీకృష్ణుడా? నిజానికి శ్రీకృష్ణుడ్ని త్రిలోకనాథుడు, త్రికాలదర్శి అని కూడా
అనజాలరు. త్రిలోకనాథుడు, త్రికాలదర్శి అని ఒక్కరినే అంటారు. త్రిలోకనాథుడు అనగా మూడు
లోకాలపై రాజ్యం చేసేవాడు. మూలవతనము, సూక్ష్మలోకము, స్థూలలోకము. ఈ మూడింటినీ కలిపి
త్రిలోకాలు అని అంటారు. వీటిని తెలిసినవారు త్రిలోకనాథుడు, త్రికాలదర్శి అయిన
పరమపిత శివ పరమాత్మ. ఈ మహిమ వారిదే కాని శ్రీకృష్ణునిది కాదు. 16 కళా సంపూర్ణుడు,
సర్వ గుణ సంపన్నుడు... అన్నది కృష్ణుని మహిమ. అతడిని చంద్రునితో పోలుస్తారు.
పరమాత్మను చంద్రునితో పోల్చరు. వారి కర్తవ్యమే వేరు. తాను గీతకు జన్మనిచ్చే రచయిత.
గీతాజ్ఞానము లేక రాజయోగము ద్వారానే దేవతలు రచింపబడతారు. మనుష్యులను దేవతలుగా
తయారుచేసేందుకు తండ్రి వచ్చి జ్ఞానమును ఇవ్వవలసి ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం
చేయించేందుకు చాలా చురుకైన బ్రహ్మాకుమారీ కుమారులు కావాలి. అందరూ ఒకేలా అర్థం
చేయించలేరు. పిల్లలు కూడా అందరూ నెంబర్వారీగా ఉన్నారు. టాపిక్ను కూడా ఈ విధంగా- "శ్రీమత్
భగవత్ గీతకు ఎవరు జన్మనిచ్చారు’? అని ఉండాలి. దీనికొరకు ఇరువురి తేడానూ తెలియజేయాలి.
భగవంతుడు ఒక్కరే. తాను పరమపిత శివ పరమాత్మ. ఆ జ్ఞానసాగరుని ద్వారా జ్ఞానాన్ని విని
కృష్ణుడు ఈ పదవిని పొందాడు. సహజ రాజయోగము ద్వారా ఈ పదవిని ఎలా పొందారు అన్న వివరణను
ఇవ్వవలసి ఉంటుంది. బ్రహ్మా ద్వారానే మొదట బాబా బ్రాహ్మణులను రచిస్తారు. అన్ని
వేదశాస్త్రాల సారాంశమును వినిపిస్తారు. బ్రహ్మతోపాటు బ్రహ్మాముఖవంశావళులు కూడా
కావాలి. బ్రహ్మకే త్రికాలదర్శపు జ్ఞానము లభిస్తుంది. త్రిలోకి అనగా మూడు లోకాల
జ్ఞానము కూడా లభిస్తుంది. మూడు కాలాలు అని ఆదిమధ్యాంతాలను కలిపి అంటారు. అలాగే మూడు
లోకాలు అనగా మూల, సూక్ష్మ, స్థూల వతనాలు. ఈ పదాలను గుర్తుంచుకోవాలి. చాలామంది
పిల్లలు మర్చిపోతారు. దేహ అహంకారరూపీ మాయ మరపింపజేసింది. కావున గీతా రచయిత పరమపిత
శివపరమాత్మయే కాని శ్రీకృష్ణుడు కాదు. పరమపిత పరమాత్మయే త్రికాలదర్శి మరియు
త్రిలోకనాథుడు. కృష్ణునిలో లేక లక్ష్మీనారాయణునిలో ఈ జ్ఞానము లేదు. ఎవరైతే తండ్రి
నుండి ఈ జ్ఞానమును పొందారో వారు విశ్వాధిపతులుగా అయిపోయారు. ఎప్పుడైతే సద్గతి
లభిస్తుందో అప్పుడు ఇక ఈ జ్ఞానము బుద్ధినుండి తొలగిపోతుంది. సర్వుల సద్గతి దాత
తానొక్కరే. తాను పునర్జన్మలు తీసుకోరు. సత్యయుగ ఆది నుండి పునర్జన్మలు
ప్రారంభమయ్యాయి. కలియుగాంతం వరకు 84 జన్మలు తీసుకుంటారు. ఈ వివరణను ఇవ్వవలసి ఉంటుంది.
అందరూ 84 జన్మలూ తీసుకోరు కదా! ఎవరైతే ఈ గీతను వ్రాశారో వారిని త్రికాలదర్శులు అని
అనరు. మొదటే శ్రీకృష్ణ భగవానువాచ అని వ్రాశారు, ఇది పూర్తిగా తప్పు, ఇలా తప్పు జరగడం
కూడా తప్పకుండా అవుతుంది. ఎప్పుడైతే అన్ని శాస్త్రాలు తప్పవుతాయో అప్పుడే తండ్రి
వచ్చి సరైనది వినిపిస్తారు. తప్పకుండా బ్రహ్మా ద్వారా వేదశాస్త్రాల సత్యవైున సారమును
వినిపిస్తారు. కావుననే వారిని సత్యము అని అంటారు. ఇప్పుడు మీకు సత్యముతో సాంగత్యము
ఉంది. వారు మిమ్మల్ని సత్యముగా తయారుచేస్తారు.
ప్రజాపిత బ్రహ్మ మరియు వారి ముఖవంశావళి ఈ జగదాంబ సరస్వతి. ప్రజాపిత బ్రహ్మ
పిల్లలందరూ పరస్పరం సోదరీ సోదరులవుతారు. ఎక్కడికైనా మందిరాలలోకి వెళ్ళి భాషణ చేయాలి.
అలా విహరించేందుకు కూడా అక్కడకు ఎంతోమంది వస్తారు. ఒక్కరికి అర్థం చేయించడం
మొదలుపెడితే సత్సంగముగా అయిపోతుంది. స్మశానంలోకి కూడా వెళ్ళాలి. అక్కడ మనుష్యులకు
వైరాగ్యము ఉంటుంది. కాని నా భక్తులకు అర్థం చేయించడం ద్వారా వారు వెంటనే అర్థం
చేసుకుంటారు అని బాబా అంటారు. కావున శివబాబా మందిరాలకు, లక్ష్మీనారాయణుల మందిరాలకు
వెళ్ళాలి. లక్ష్మీనారాయణులను మమ్మా, బాబా అని అనరు. శివుడిని తండ్రి అని అంటారు. మరి
తల్లి కూడా ఉంటుంది కదా! తాను గుప్తము. రచయిత అయిన శివబాబాను మాతాపిత అని ఎలా అనగలరు?
ఈ గుప్తవైున విషయాన్ని ఎవరూ తెలుసుకోలేరు. లక్ష్మీనారాయణులకు తమ కొడుకు ఒక్కడే
ఉంటాడు. ఇతడి పేరు ప్రజాపిత బ్రహ్మ. విష్ణువుని మరియు శంకరులను ఉన్నతంగా ఉంచరు.
త్రిమూర్తి అయిన బ్రహ్మను ఉన్నతునిగ చూపుతారు. ఏ విధంగా రచయిత అని శివపరమాత్మను
అంటారో అలాగే బ్రహ్మను కూడా రచయిత అని అంటారు. తాను అవినాశియే. రచయిత అన్న పదము
వాడితే ఎలా రచించారు అని అడుగుతారు. తాను రచయిత. బ్రహ్మా ద్వారా రచన జరుగుతుంది.
బ్రహ్మా ద్వారా పరమాత్మ సర్వాత్మలకు సృష్టి ఆదిమధ్యాంతముల జ్ఞానమును ఇస్తారు.
వేదశాస్త్రాలు మొదలైనవన్నీ భక్తిమార్గపు సామాగ్రి. భక్తిమార్గము అర్థకల్పము
కొనసాగుతుంది. ఇది జ్ఞానకాండము. ఎప్పుడైతే భక్తిమార్గము పూర్తవుతుందో అప్పుడు అందరూ
పతితముగా, తమోప్రధానముగా అయిపోతారు. అప్పుడు తండ్రినైన నేను వస్తాను. మొదట
సతోప్రధానము నుండి సతో, రజో, తమోలలోకి వస్తారు. పైనుండి పవిత్ర ఆత్మలు ఎవరైతే
వస్తారో వారు దుఃఖాన్ని అనుభవించేందుకు అటువంటి పనులేవీ చేయలేదు. క్రీస్తును శిలువ
పైకి ఎక్కించారు అని అంటారు. కాని అది జరగజాలదు. కొత్త ఆత్మ ఏదైతే ధర్మస్థాపనకొరకు
వస్తుందో తనకు దుఃఖము లభించజాలదు. ఎందుకంటే కర్మాతీత స్థితిగల దూత సందేశమును
ఇచ్చేందుకు వస్తుంది. యుద్ధంలో కూడా ఎవరైనా దూతను పంపిస్తే వారు తెల్లజెండాను
తీసుకువస్తారు. తద్వారా వారు ఎవరో దూత వస్తున్నారు అని భావిస్తారు. వారికి ఎటువంటి
ఇబ్బందీ కలిగించరు. కావున ఇలా దూతలు ఎవరైతే వస్తారో వారినెవరు శిలువపైకి ఎక్కించలేరు.
దుఃఖమును ఆత్మయే అనుభవిస్తుంది. ఆత్మ నిర్లేపి కాదు. ఈ విషయాన్ని వ్రాయాలి. ఆత్మను
నిర్లేపి అనడం తప్పు. ఇలా ఎవరు అన్నారు? శివ భగవానువాచ. ఈ పాయింటును మీరు నోట్
చేసుకోవాలి. వ్రాసేందుకు చాలా విశాలవైున బుద్ధి కావాలి. క్రైస్తవులు వస్తే వారికి,
క్రీస్తు ఆత్మను శిలువ పైకి ఎక్కించలేదు, తాను ఎవరి శరీరములోకైతే ప్రవేశించారో ఆ
ఆత్మకే దుఃఖము కలిగింది అని తెలియజేయాలి. వారు ఈ విషయాలను విని ఆశ్చర్యపోతారు. ఆ
పవిత్ర ఆత్మ వచ్చి గాడ్ ఫాదర్ ఆజ్ఞానుసారంగా ధర్మస్థాపన చేసింది. ఇది కూడా డ్రామాయే.
డ్రామాను కూడా చాలామంది అర్థం చేసుకుంటారు కాని దాని ఆదిమధ్యాంతాలను తెలుసుకోరు.
ఇటువంటి విషయాలు విని వారు ఎంతోకొంత అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. కృష్ణుడిని
కూడా ఎవరూ నిందింపజాలరు. తప్పకుండా నిందలన్నీ ఇప్పుడే లభిస్తున్నాయి. ఎవరికి?
శివబాబాకు కాదు, ఈ సాకారునికి లభిస్తున్నాయి. టీచరైతే బాబాయే, తాను పవిత్ర ఆత్మ
మరియు ఇతడు అపవిత్రుడు, పవిత్రముగా అవుతున్నాడు. ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి
భయపడరు. లేకపోతే ఇది వీరికి నేర్పించబడింది అని వారు భావిస్తారు. ఇప్పుడు ఆ విషయం
ఎవరికీ హత్తుకోదు. బాణం తగులదు. సత్యత మరియు స్వచ్ఛత ఎంతో కావాలి. ఎవరైతే స్వయం
వికారాలలోకి వెళుతూ, ఇతరులతో కామం మహాశత్రువు అని చెబితే ఆ బాణము తగులజాలదు. రామా,
రామా అంటూ సాగరాన్ని దాటి వేయవచ్చు అని చెప్పే పండితుని ఉదాహరణ ఒకటి ఉంది కదా! అది
ఈ సమయపు విషయమే. నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు ఈ విషయ సాగరాన్ని దాటివేయగలరు అని
శివబాబా చెబుతారు. అది ఏ సాగరమో ఆ పండితులకు తెలియదు. వేశ్యాలయం నుండి శివాలయంలోకి
వెళ్ళిపోతారు. శ్రీమతంపై చాలా బాగా నడుచుకోవాలి. బాబా మీరు ప్రేమించండి లేక
తిరస్కరించండి అని అంటారు కదా... ఇక్కడైతే కేవలం అర్థం చేయించడం జరుగుతుంది. అయినా
కొందరు వుతులుగా అయిపోతారు. పిల్లలైతే వ్రాయవలసి ఉంటుంది, చదవవలసి ఉంటుంది. బాబా
ప్రేమసాగరుడు అనగా చదివించి ఉన్నతవైున పదవిని ప్రాప్తింపజేస్తారు. ఇదే ప్రేమ. బాబా
చదివించినప్పుడు చదువుకుని ఇతరులను కూడా చదివించాలి. బాబాను సంతోషపరచాలి. బాబా సేవలో
తత్పరులై ఉండాలి. తమ తనువు, మనస్సు, ధనములతో భారతదేశపు సత్యవైున సేవను చేయడమే బాబా
సేవ. మీరు బిగ్గరగా అర్థం చేయించాలి. అందరూ నెంబర్వారీగా ఉన్నారు. రాజధానిలో కూడా
నెంబర్వారీగా ఉంటారు. వీరు దైవీ రాజధానిలో ఏ నెంబర్ను తీసుకుంటారో టీచర్ అర్థం
చేసుకోగలరు. ఎవరెవరు ముఖ్యులుగా అవుతారో సేవ ద్వారా అర్థం చేసుకోగలరు. మేము
మమ్మాబాబాల వలే సేవ చేయడం లేదు కావున దాసదాసీలుగా అవ్వవలసి ఉంటుంది అని స్వయమూ అర్థం
చేసుకుంటారు. ముందు ముందు అందరికీ అన్నీ తెలుస్తాయి. మేము శ్రీమతంపై నడవలేదు, అన్నీ
క్లియరైపోతాయి. పరీక్షలలో పాసవ్వకపోతే సిగ్గుపడతారు కూడా.
బాబాకు రాత్రి ఆలోచన కలిగింది, మనుష్యులు 21 జన్మలు అంటారు, గాయనం కూడా చేస్తారు.
ఇప్పుడు ఈశ్వరీయ జన్మ వేరుగా ఉంది, 8 జన్మలు సత్యయుగంలో, 12 జన్మలు త్రేతాయుగంలో,
21 జన్మలు ద్వాపరయుగంలో, 42 జన్మలు కలియుగంలో. మీ ఈ ఈశ్వరీయ జన్మ అన్నింటికన్నా
ఉన్నతవైున జన్మ, ఇప్పుడు దత్తత తీసుకోబడ్డారు. బ్రాహ్మణులైన మీదే ఈ సౌభాగ్యశాలీ
జన్మ. అచ్ఛా!
మధురాతి మధురవైున ఆత్మిక పిల్లలకు మాత పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు
గుడ్మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు
ముఖ్య సారము:-
1. ప్రేమసాగరుడైన బాబా ప్రేమకు రిటర్న్ ఇవ్వాలి , బాగా చదువుకుని మళ్ళీ చదివించాలి
, శ్రీమతంపై నడవాలి .
2. సత్యతతో మరియు స్వచ్ఛతతో ముందు స్వయంలో ధారణ చేసి ఆ తర్వాత ఇతరులతో ధారణ
చేయించాలి . ఒక్క బాబా సాంగత్యంలో ఉండాలి .
వరదానము:-
హద్దుల నుండి
అతీతంగా అయి అందరికీ తమవారు అన్న అనుభూతిని కలిగించే అనుభవీమూర్త భవ.
ఏ విధంగా
ప్రతిఒక్కరి మనస్సు నుండి వీరు మా బాబా అని వెలువడుతుందో అలాగే అందరి మనస్సు నుండి
వీరు మావారు, బేహద్ అన్నయ్య లేక అక్కయ్య, దీదీ లేక దాదీ అని వెలువడాలి. మీరు ఎక్కడ
ఉన్నా కాని బేహద్ సేవకు నిమిత్తులు. హద్దుల నుండి అతీతంగా అయి బేహద్ భావనను, బేహద్
శ్రేష్ఠ కామనను ఉంచడమే బాబాను అనుసరించడం. ఇప్పుడు దీనిని ప్రత్యక్షంగా అనుభవం
చేసుకోండి మరియు చేయించండి. ఏవిధంగా అనుభవజ్ఞులైన వృద్ధులను తాతగారు, బాబాయిగారు
అని అంటారో అలా బేహద్ అనుభవజ్ఞులు అనగా అందరికీ 'వీరు మావారు' అని అనుభవమవ్వాలి.
స్లోగన్:-
అతీతమైన
స్థితి ద్వారా ఎగిరే కళలో ఎగురుతూ ఉన్నట్లయితే కర్మరూపీ కొమ్మల బంధనలో
చిక్కుకుపోరు.
మాతేశ్వరిగారి మధుర మహా”వాక్యాలు.
''మనుష్యులకు
84 జన్మలు ఉన్నాయి, అంతేగానీ 84 లక్షల యోనులు లేవు''
ప్రభూ, మమ్మల్ని ఆవలితీరానికి తీసుకువెళ్ళు అని మనము ఏదైతే అంటామో, దాని అర్థం
ఏమిటి? ఆవలితీరము అంటే జన్మ-మరణ చక్రములోకి రాకూడదు అనగా ముక్తి కలగాలి అని
మనుష్యులు అనుకుటాంరంటే. ఇవి మనుష్యులు అనుకునే మాటలు. కానీ వారు ఏమాంరంటే, పిల్లలూ,
నిజంగా ఎక్కడైతే సుఖశాంతులు ఉంటాయో, దుఃఖ-అశాంతులు ఉండవో దానిని ప్రపంచము అని ఏమీ
అనరు. మనుష్యులు సుఖాన్ని కోరుకుంటున్నట్లయితే వారు కూడా ఈ జీవితములో ఉండాలి,
అక్కడైతే సత్యయుగ వైకుంఠ దేవతల ప్రపంచము ఉండేది, అక్కడ ఎల్లప్పుడూ సుఖమైన జీవితము
ఉండేది, ఆ దేవతలను అమరులు అని అంటారు. ఇప్పుడు అమరులు అన్నదానికికూడా ఎటువంటి అర్థము
లేదు, దేవతల ఆయుష్షు ఎంత పెద్దదంటే వారు అసలు మరణించరు, ఇలా చెప్పటము వారి తప్పు
ఎందుకంటే అలా ఉండనే ఉండరు. వారి ఆయుష్షు సత్యయుగము, త్రేతాయుగముల వరకు నడవదు, కానీ
దేవీ దేవతల జన్మలు సత్య త్రేతాయుగాలలో చాలా ఉన్నాయి, 21 జన్మలైతే వారు చాలా మంచిగా
రాజ్యమును నడిపించారు, మళ్ళీ తరువాత 63 జన్మలు ద్వాపరయుగము నుండి కలియుగము అంతిమము
వరకు ఉంటాయి. టోటల్గా వారి 21 జన్మలు ఎక్కే కళవిగా ఉంటాయి. 63 కళలు దిగే కళవిగా
ఉంటాయి. మొత్తంగా మనుష్యులు 84 జన్మలు తీసుకుంటారు. మనుష్యులు 84 లక్షల యోనులలో
ప్రవేశిస్తారు అని వీరు అనుకునేది తప్పు. ఒకవేళ మనుష్యులు ఈ జన్మలోనే సుఖ దుఃఖాలు
రెండూ అనుభవించగలిగినప్పుడు ఇక జంతువుల యోనులలోకి వెళ్ళి అనుభవించవలసిన అవసరము
ఏముంది! ఇప్పుడు మనుష్యులకు ఈ జ్ఞానమే లేదు, మనుష్యులైతే 84 జన్మలు తీసుకుంటారు,
ఇకపోతే మిగిలిన మొత్తము సృష్టిలో జంతువులు, పశువులు, పక్షులు మొదలైనవన్నీ తప్పకుండా
84 లక్షలు ఉంటాయి. అనేకరకాలైన జన్మలు ఉన్నాయి. వాటిలోకూడా మనుష్యులు మనుష్యుల
యోనిలోనే పాపపుణ్యాలను అనుభవిస్తున్నారు. జంతువులు వాటి యోనులలో అనుభవిస్తున్నాయి.
మనుష్యులు జంతువుల యోనిని తీసుకోరు, జంతువులు మనుష్యుల యోనిని తీసుకోవు. మనుష్యులు
తమ యోనిలో (జన్మలో)నే అనుభవించవలసి ఉంటుంది కనుక సుఖదుఃఖాల అనుభూతి కలుగుతుంది.
అలాగే జంతువులు కూడా తమ యోనిలోనే సుఖదుఃఖాలను అనుభవించాలి. కానీ ఇలా అనుభవించటము
అనేది ఏ కర్మవలన కలిగింది అన్న బుద్ధి వారికి ఉండదు. కానీ మనుష్యులు వాటిని ఫీల్
చేస్తారు ఎందుకంటే మనుష్యులు వివేకవంతులు, అంతేగానీ మనుష్యులు 84 లక్షల జన్మలు
తీసుకుటాంరని కాదు. జడమైన చెట్టుకూడా యోనిని తీసుకుంటుంది, జడ వృక్షము ఏ
కర్మ-అకర్మ చేసిందని దాని లెక్క తయారైంది -ఇదైతే సహజమైనది మరియు వివేకమునకు
సంబంధించిన విషయము. అంతిమ సమయములో ఎవరైతే పుత్రుని స్మరిస్తారో, ఆ చింతలోనే
మరణిస్తారో వారు పంది యోనిలో ప్రవేశిస్తారు...... అని గురునానక్ ఈ మహావాక్యాన్ని
ఉచ్ఛరించారు, ఇలా చెప్పారు అంటే మనుష్యులు పంది యోనిలో ప్తుటారు అని అర్థం కాదు కానీ
పంది అని అనటం అంటే మనష్యులు చేసే పనులు జంతువుల పనులలా ఉంటాయి అని. అంతేగానీ
మనష్యులు జంతువులుగా అవుతారని కాదు. మనష్యులలో భయం కలిగించేందుకు ఇలా శిక్షణనిస్తారు.
కనుక మిమ్మల్ని మీరు మీ జీవితాన్ని ఈ సంగమయుగములో మార్చుకుని పాపాత్మనుండి
పుణ్యాత్మగా అవ్వాలి. అచ్ఛా - ఓం శాంతి.