29-11-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - జ్ఞానము వెన్న వంటిది, భక్తి మజ్జిగ వంటిది. తండ్రి మీకు జ్ఞానమనే వెన్ననిచ్చి విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. అందుకే కృష్ణుని నోటిలో వెన్న చూపిస్తారు.''

ప్రశ్న :-

నిశ్చయబుద్ధి గలవారి గుర్తులేవి ? నిశ్చయము ఆధారముతో లభించే ప్రాప్తి ఏది ?

జవాబు :-

1. నిశ్చయబుద్ధి గల పిల్లలు దీపము పై సమర్పణయ్యే సత్యమైన శలభాలుగా(దీపపు పురుగులుగా) ఉంటారు. కేవలం దీపము చుట్టూ తిరిగి వెళ్లే పురుగుల్లా ఉండరు. ఎవరైతే దీపము పై బలిహారమవుతారో, వారే రాజ కుటుంబములోకి వస్తారు. చుట్టూ తిరిగి వెళ్ళిపోయేవారు ప్రజలలోకి వెళ్ళిపోతారు. 2. భూమి బ్రద్ధలైనా ధర్మాన్ని వదలము( ధరత్‌ పరియే ధర్మ్‌ న ఛోడియే ) - ఇది నిశ్చయబుద్ధి పిల్లలు చేసే ప్రతిజ్ఞ. వారు సత్యమైన ప్రీతిబుద్ధి గలవారిగా అయ్యి దేహ సహితంగా దేహ సర్వ ధర్మాలను మరచి తండ్రి స్మృతిలో ఉంటారు.

పాట :-

ఆకాశ సింహానాన్ని వదిలి రా,................... ( ఛోడ్‌ భీ దే ఆకాశ్‌ సింహాసన్‌,...............)  

ఓంశాంతి.

భగవానువాచ - నిరాకార పరమపితనే భగవంతుడని అంటారు. భగవానువాచ అని ఎవరన్నారు? ఆ నిరాకార పరమపిత పరమాత్మ అన్నారు. నిరాకార తండ్రి కూర్చొని నిరాకార ఆత్మలకు అర్థము చేయిస్తారు. నిరాకార ఆత్మ ఈ శరీర రూపములోని కర్మేంద్రియాల ద్వారా వింటుంది. ఆత్మను పురుషుడని గాని, స్త్రీ అని గాని అనరు. దానిని ఆత్మ అనే అంటారు. నేను ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటానని ఆత్మే స్వయంగా ఈ కర్మేంద్రియాల ద్వారా చెప్తుంది. మానవ మాత్రులందరూ సోదరులే. అందరూ నిరాకార పరమాత్మ సంతానంగా ఉన్నప్పుడు అందరూ పరస్పరము సోదరులే కదా. ప్రజాపిత బ్రహ్మకు సంతానంగా అయినప్పుడు సోదరీ - సోదరులుగా అవుతారు. ఈ విషయాన్ని అందరికీ అర్థము చేయిస్తూ ఉండండి. భగవంతుడే రక్షకుడు. భక్తులకు భక్తి ఫలమును ఇచ్చువారు వారే.

తండ్రి అర్థము చేయిస్తున్నారు - సర్వుల సద్గతిదాత నేనొక్కరిని మాత్రమే. సర్వులకు శిక్షకుడనై శ్రీమతమునిస్తాను. అంతేకాక సర్వులకు సద్గురువును కూడా నేనే. వారికి(శివునికి) ఏ తండ్రి గాని, టీచరు గాని, గురువు గాని ఎవ్వరూ లేరు. ప్రాచీన భారతదేశ రాజయోగమును నేర్పేది కూడా ఆ తండ్రే. కృష్ణుడు కాదు. కృష్ణుని తండ్రి అని అనజాలరు. అతనిని దైవీగుణాల స్వర్గ రాకుమారుడని అంటారు. పతితపావనుడు, సద్గతిదాత అని ఆ ఒక్కరినే అంటారు. ఇప్పుడు అందరూ పాపాత్మలుగా, భ్రష్ఠాచారులుగా, దు:ఖితులుగా ఉన్నారు. భారతదేశమే సత్యయుగములో దైవీ శ్రేష్ఠాచారిగా ఉండేది. మళ్లీ అదే భ్రష్ఠాచారీ ఆసురీ రాజ్యంగా అవుతుంది. అందరూ ''ఓ పతితపావనా రండి'' మీరు వచ్చి రామరాజ్యాన్ని స్థాపన చేయండి అని పిలుస్తారు. కనుక ఇప్పుడిది రావణ రాజ్యము. రావణుని కాలుస్తారు కూడా. కాని రావణుని గురించి ఏ విద్వాంసులకు, పండితులకు, ఆచార్యులకు తెలియదు. సత్యయుగం నుండి త్రేతాయుగం వరకు రామరాజ్యము, ద్వాపర యుగం నుండి కలియుగం వరకు రావణరాజ్యము. బ్రహ్మకు పగలు అంటే బ్రహ్మకుమార-కుమారీలకు కూడా పగలే. బ్రహ్మకు రాత్రి అంటే బి.కెలకు కూడా రాత్రే. ఇప్పుడు రాత్రి సమాప్తమై పగలు వస్తుంది. వినాశ కాలములో విపరీతబుద్ధి అనే గాయనముంది. మూడు సైన్యాలు కూడా ఉన్నాయి. పరమపితను మోస్ట్‌ బిలవెడ్‌ (అత్యంత ప్రియమైన) గాడ్‌ఫాదర్‌, జ్ఞాన సాగరులు అని కూడా అంటారు. కావున జ్ఞానము తప్పకుండా ఇచ్చి ఉంటారు కదా. సృష్టికి చైతన్య బీజరూపుడు. సుప్రీమ్‌ సోల్‌(అత్యంత శ్రేష్ఠమైన ఆత్మ) అనగా వారు అత్యంత ఉన్నతమైన భగవంతుడు. అంతేకాని వారు సర్వవ్యాపి కాదు. సర్వవ్యాపి అని అనడం తండ్రిని అవమానపరచడం, తండ్రికి అపకీర్తి తీసుకు రావడం. తండ్రి చెప్తున్నారు - ఇలా నిందిస్తూ నిందిస్తూ ధర్మగ్లాని అయిపోయింది. భారతదేశము నిరుపేదగా, భ్రష్ఠాచారిగా అయిపోయింది. ఇటువంటి సమయములోనే నేను రావాల్సి వస్తుంది. భారతదేశమే నా జన్మ స్థానము. సోమనాథ మందిరము, శివుని మందిరాలు కూడా ఇక్కడే ఉన్నాయి. నేను నా జన్మ స్థానమునే స్వర్గంగా చేస్తాను. మళ్లీ రావణుడు నరకంగా చేస్తాడు. అనగా రావణుని మతమును అనుసరించి నరకవాసులుగా, ఆసురీ సంప్రదాయులుగా అయిపోతారు. నేను మళ్లీ వచ్చి వారిని దైవీ సంప్రదాయులుగా, శ్రేష్ఠాచారులుగా చేస్తాను. ఇది విషయ సాగరము, అది క్షీర సాగరము. అక్కడ నేతి నదులు ప్రవహిస్తూ ఉంటాయి. సత్య, త్రేతా యుగాలలో భారతదేశము సదా సుఖంగా, సంపన్నంగా ఉండేది. వజ్ర వైఢూర్యాల భవనాలు ఉండేవి. ఇప్పుడైతే భారతదేశము పూర్తిగా 100 శాతము దివాలా తీయబడి ఉంది. నేనే వచ్చి నూటికి నూరు పాళ్ళు(వంద శాతము) సంపన్నంగా, శ్రేష్ఠాచారిగా చేస్తాను. ఇప్పుడు తమ దైవీ ధర్మాన్ని మర్చిపోయి ఇటువంటి భ్రష్ఠాచారులుగా అయిపోయారు.

తండ్రి కూర్చొని భక్తిమార్గము కేవలం మజ్జిగ వంటిదని, జ్ఞాన మార్గము వెన్న వంటిదని అర్థం చేయిస్తున్నారు. కృష్ణుని నోటిలో వెన్న చూపిస్తారు. అనగా విశ్వ రాజ్యము ఉండేది. లక్ష్మినారాయణులు విశ్వానికి అధికారులుగా ఉండేవారు. తండ్రే స్వయంగా వచ్చి బేహద్‌ వారసత్వమును ఇస్తారు. అనగా విశ్వానికి యజమానులుగా చేస్తారు. తండ్రి చెప్తున్నారు - నేను విశ్వానికి యజమానిగా అవ్వను. ఒకవేళ అలా అయినట్లయితే మాయతో ఓడిపోవాల్సి వస్తుంది. మీరు మాయతో ఓడిపోతారు. మళ్లీ విజయము కూడా మీరే పొందాలి. మీరిప్పుడు పంచ వికారాలలో చిక్కుకొనిపోయారు. ఇప్పుడు నేను మిమ్ములను మందిరానికి యోగ్యులుగా తయారుచేస్తాను. సత్యయుగము చాలా పెద్ద మందిరము. దానిని శివాలయమని అంటారు. శివుని ద్వారా స్థాపించబడింది. కలియుగాన్ని వేశ్యాలయమని అంటారు. ఇందులో అందరూ వికారులుగానే ఉన్నారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - దేహ ధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయిన నన్ను స్మృతి చేయండి. ఇప్పుడు పిల్లలైన మీ ప్రేమ తండ్రి పై ఉంది. మీరు ఇతరులెవ్వరినీ స్మృతి చేయరు. మీరు వినాశ కాలములో ప్రీతిబుద్ధి గలవారు. శ్రీ శ్రీ 108 అని పరమపిత పరమాత్మనే అంటారని మీకు తెలుసు. 108 మాలను త్రిప్పుతూ ఉంటారు. పై భాగమున శివబాబా, ఆ తర్వాత మాతా-పితలైన బ్రహ్మ-సరస్వతులు, ఆ తర్వాత భారతదేశాన్ని పావనంగా తయారు చేసేవారి పిల్లలు. రుద్రాక్ష మాలకు మహత్వముంది. దీనిని రుద్ర యజ్ఞమని కూడా అంటారు. ఇది ఎంతో గొప్ప రాజసూయ(రాజస్వ) అశ్వమేధ అవినాశి జ్ఞాన యజ్ఞము. ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడున్న అనేక ధర్మాలు మొదలైనవన్నీ ఈ జ్ఞాన యజ్ఞములో సమాప్తమవ్వనున్నాయి. అప్పుడే ఈ యజ్ఞము సమాప్తమవుతుంది. ఇది అవినాశి తండ్రి యొక్క అవినాశి యజ్ఞము. సామాగ్రి అంతా ఇందులో స్వాహా అవ్వనున్నది. వినాశము ఎప్పుడవుతుంది అని అడుగుతారు. అరే! పిల్లలూ, స్థాపన చేయువారే పాలన చేయాల్సి ఉంటుంది. ఇతడు శివబాబా రథము. శివబాబా ఇందులో రథికునిగా ఉన్నారు. అంతేగాని ఏ గుర్రపుబండి మొదలైనవాటిలో కాదు. అదంతా భక్తిమార్గములో కూర్చుని తయారు చేసిన సామాగ్రి. బాబా చెప్తున్నారు - నేను ఈ ప్రకృతిని(దేహమును) ఆధారంగా తీసుకుంటాను.

తండ్రి అర్థము చేయిస్తున్నారు - మొదట అవ్యభిచారి భక్తి ఉండేది. ఆ తర్వాత కలియుగాంతములో పూర్తి వ్యభిచారి భక్తిగా అయిపోతుంది. తండ్రి మళ్లీ వచ్చి భారతదేశానికి వెన్ననిస్తారు. మీరు విశ్వానికి అధిపతులుగా అయ్యేందుకు చదువుతున్నారు. తండ్రి వచ్చి వెన్న తినిపిస్తారు. రావణ రాజ్యములో మజ్జిగగా అవ్వడం ప్రారంభమవుతుంది. ఇవన్నీ అర్థము చేసుకునే విషయాలు. కొత్త పిల్లలైతే ఈ విషయాలను అర్థము చేసుకోలేరు. పరమపిత పరమాత్మనే జ్ఞానసాగరులని అంటారు. ఈ భక్తిమార్గము ద్వారా నేనెవ్వరికీ లభించనని తండ్రి చెప్తున్నారు. నేను వచ్చినప్పుడు మాత్రమే భక్తులకు భక్తికి ఫలితమునిస్తాను. నేను ముక్తిదాతగా అవుతాను. దు:ఖముల నుండి విడిపించి అందరినీ శాంతిధామము, సుఖధామాలకు తీసుకెళ్తాను. నిశ్చయబుద్ధి విజయంతి, సంశయబుద్ధి వినశ్యంతి.

తండ్రి దీపము(జ్యోతి). ఆ దీపము పై కొన్ని దీపపు పురుగులు రాగానే ఒక్కసారిగా సమర్పణైపోతాయి. మరి కొన్ని దీపము చుట్టూ తిరిగి దూరంగా వెళ్లిపోతాయి. అటువంటివారు అర్థమే చేసుకోరు. సమర్పణమయ్యే పిల్లలకు తప్పకుండా బేహద్‌ తండ్రి ద్వారా తమకు బేహద్‌ వారసత్వము లభిస్తుందని తెలుసు. కేవలం చుట్టూ తిరిగి వెళ్లిపోయేవారు నెంబరువారీగా ప్రజలలోకి వస్తారు. సమర్పణమయ్యేవారు నెంబరువారుగా పురుషార్థానుసారము వారసత్వము తీసుకుంటారు. పురుషార్థము ద్వారానే ప్రాలబ్ధము లభిస్తుంది. జ్ఞానసాగరులు ఒక్క తండ్రి మాత్రమే. తర్వాత జ్ఞానము ప్రాయ: లోపమైపోతుంది. మీరు సద్గతిని పొందుతారు. సత్య, త్రేతా యుగాలలో గురువులు, సాధువులు మొదలైనవారెవ్వరూ ఉండరు. ఇప్పుడు అందరూ ఆ తండ్రినే స్మృతి చేస్తారు. ఎందుకంటే వారు జ్ఞాన సాగరులు. అందరికీ సద్గతినిస్తారు. తర్వాత హాహాకారాలు సమాప్తమై జయ జయ ధ్వనులు వినిపిస్తాయి. మీకు ఈ సృష్టి ఆదిమధ్యాంతాలు తెలుసు. మీరిప్పుడు త్రికాలదర్శులు, త్రినేత్రులుగా అయ్యారు. మీకు రచయిత, రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము లభిస్త్తోంది. ఇవి కట్టుకథలు కావు. గీత భగవంతునిచే గానము చేయబడింది. కాని కృష్ణుని పేరు వేసినందున అది ఖండితము చేయబడింది. ఇప్పుడు పిల్లలైన మీరు అందరికీ కళ్యాణము చేయాలి. మీరు శివశక్తి సైన్యము. వందేమాతరమ్‌ అని మహిమ చేయబడింది. పవిత్రులకే వందనము చేస్తారు. కన్య పవిత్రంగా ఉంటుంది. అందుకే అందరూ వారికి నమస్కరిస్తారు. అత్తగారింటికి వెళ్లి వికారాలకు లోబడినందున అందరికీ తల వంచి నమస్కరిస్తూ ఉంటుంది. అంతా పవిత్రత పైనే ఆధారపడి ఉంది. భారతదేశములో పవిత్ర గృహస్థ ధర్మముండేది. ఇప్పుడు అపవిత్ర గృహస్థ ధర్మముంది. ఎక్కడ చూసినా దు:ఖమే దు:ఖముంది. సత్యయుగములో అయితే అలా ఉండదు. తండ్రి పిల్లల కొరకు అరచేతిలో వైకుంఠాన్ని తీసుకొస్తారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ తండ్రి ద్వారా జీవన్ముక్తి వారసత్వాన్ని తీసుకోవచ్చు. ఇల్లు-వాకిలి వదిలిపెట్టే అవసరమే లేదు. సన్యాసుల నివృత్తి మార్గము వేరే. ఇప్పుడు తండ్రితో ప్రతిజ్ఞ చేస్తున్నారు - ''బాబా మేము పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి రాజులుగా తప్పకుండా అవుతాము.'' కనుక భూమి బ్రద్ధలైనా ధర్మమును వదలకండి. 5 వికారాలు దానమిస్తే మాయా గ్రహణము వదిలిపోతుంది. అప్పుడు 16 కళా సంపూర్ణులుగా అవుతారు. సత్యయుగములో 16 కళా సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు. ఇప్పుడు శ్రీమతమును అనుసరించి మళ్లీ అదే విధంగా అవ్వాలి.

భగవంతుడు పేదలపెన్నిధి. ధనవంతులు ఈ జ్ఞానాన్ని తీసుకోలేరు. ఎందుకంటే మా వద్ద ధనము మొదలైవవి ఎన్నో ఉన్నాయి, కనుక స్వర్గములోనే ఉన్నామని భావిస్తారు. అందువలన అబలలు, అహల్యలే జ్ఞానము తీసుకుంటారు. భారతదేశము చాలా పేదదైపోయింది. అందులో కూడా పేదవారిని, సాధారణంగా ఉన్నవారినే తండ్రి తమవారిగా చేసుకుంటారు. వారి భాగ్యములోనే ఉంది. సుదాముని (కుచేలుని) ఉదాహరణ మహిమ చేయబడింది కదా. ధనవంతులకు అర్థము చేసుకునే తీరిక ఉండదు. రాజేంద్రప్రసాద్‌(భారతదేశపు ప్రథమ రాష్ట్రపతి) వద్దకు పిల్లలు వెళ్లి అనంతమైన తండ్రిని గురించి తెలుసుకుంటే మీరు వజ్ర సమానంగా తయారవుతారు, 7 రోజుల కోర్సు తీసుకోండి అని చెప్పేవారు. అప్పుడు ఆయన మీరు వినిపించే విషయాలు చాలా బాగున్నాయి, కాని రిటైర్‌ అయిన తర్వాత కోర్సు తీసుకుంటానని అనేవాడు. రిటైర్‌ అయిన తర్వాత మళ్లీ పిల్లలు వెళ్ళారు. అప్పుడు ఆయన నా ఆరోగ్యం బాగాలేదు అని అన్నాడు. కావున గొప్ప-గొప్ప వారికి తీరిక లభించదు. 7 రోజుల కోర్సు పూర్తి చేసినప్పుడు నారాయణీ నషా(నేను నారాయణునిగా అవుతాననే నషా) ఉంటుంది. ఊరకే ఆ రంగు అంటుకోదు. 7 రోజుల తర్వాత వీరు అర్హులా కాదా? అనేది తెలుస్తుంది. అర్హులైతే చదువుకునే పురుషార్థములో లగ్నమైపోతారు. ఎంతవరకు భట్టీలో పక్కా రంగు అంటుకోదో అంతవరకు బయటకు వెళ్తూనే అంటుకున్న రంగంతా ఎగిరిపోతుంది. కనుక మొదట పక్కా రంగు అంటించాలి. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
 

మాతేశ్వరి గారి మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు

కేవలం ' ఓం ' శబ్ధాన్ని ఉచ్ఛరించుట వలన ఏ లాభమూ లేదు

ఓం శబ్ధాన్ని పదే పదే పలకండి అనగా 'ఓం' ను జపించండి. ఏ సమయంలో మనము ఓం శబ్ధాన్ని పలుకుతామో దాని అర్థము ఓం శబ్ధాన్ని ఉచ్ఛరించమని కాదు. కేవలం ఓం అన్నందున జీవితంలో ఏ లాభమూ లేదు. కాని ఓం యొక్క అర్థ స్వరూపంలో స్థితమవ్వడం, ఓం అర్థాన్ని తెలుసుకున్నందున మనుష్యులకు ఆ శాంతి ప్రాప్తిస్తుంది. ఇప్పుడు మనుష్యులు మాకు శాంతి ప్రాప్తించాలని తప్పకుండా కోరుకుంటారు. ఆ శాంతి స్థాపన కొరకు అనేక సమ్మేళనాలు చేస్తూ ఉంటారు. కాని ఫలితము ఎలా ఉందంటే ఇవన్నీ ఇంకా అశాంతి, దు:ఖానికి కారణమవుతూ ఉన్నట్లు కనిపిస్తుంది. ముఖ్యమైన కారణమేమంటే ఎంతవరకు మనుష్యాత్మలు 5 వికారాలను నష్టపరచలేదో అంతవరకు ప్రపంచంలో శాంతి ఏర్పడజాలదు. కనుక మొదట ప్రతి మనిషి తన 5 వికారాలను వశపర్చుకోవాలి మరియు ఆత్మ తన సంబంధాన్ని పరమాత్మతో జోడించాలి అప్పుడే శాంతి స్థాపన జరుగుతుంది. కనుక మనుష్యులు తమను తాము - ''మేము మాలోని 5 వికారాలను పోగొట్టుకున్నామా ? వాటిని జయించేందుకు ప్రయత్నించామా? అని ప్రశ్నించుకోవాలి. ఒకవేళ ఎవరైనా మేము 5 వికారాలను ఎలా వశపరచుకోవాలి? అని అడిగితే వారికి ఈ పద్ధతి తెలుపబడ్తుంది - మొదట జ్ఞాన-యోగాల సాంబ్రాణి పొగ వేసుకోవాలి, తర్వాత పరమపిత పరమాత్మ మహావాక్యము - నాతో బుద్ధియోగాన్ని జోడించి నా నుండి శక్తిని తీసుకోండి. సర్వశక్తివంతుడనైన నన్ను స్మృతి చేస్తూ ఉంటే వికారాలు దూరమవుతూ ఉంటాయి. ఇప్పుడు ఎంతో సాధన చేయాలి. స్వయం పరమాత్మ వచ్చి మనకు నేర్పిస్తున్నారు. అచ్ఛా. ఓంశాంతి.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. శివశక్తులుగా అయ్యి విశ్వకళ్యాణము చేయాలి. పవిత్రత ఆధారంగా గవ్వ సమానంగా ఉన్న మనుష్యులను వజ్ర సమానంగా చేయాలి.

2. శ్రీమతముననుసరించి వికారాలను దానమిచ్చి, సంపూర్ణ నిర్వికారులుగా, 16 కళా సంపూర్ణులుగా అవ్వాలి. దీపము(బాబా) పై సమర్పణమయ్యే దీపపు పురుగులుగా అవ్వాలి.

వరదానము :-

''సదా స్వయాన్ని సారథి మరియు సాక్షిగా భావించి దేహ భావము నుండి అతీతంగా ఉండే యోగయుక్త భవ ''

యోగయుక్తంగా ఉండేందుకు సరళ విధానము - సదా స్వయాన్ని సారథి మరియు సాక్షిగా భావించి నడుచుకోవాలి. ఈ రథాన్ని నడిపించే ఆత్మ అయిన నేను సారథిని - ఈ స్మృతి స్వతహాగా ఈ రథము లేక దేహము నుండి లేక ఏ విధమైన దేహ భావము నుండి అతీతంగా(సాక్షిగా) చేసేస్తుంది. దేహ భావము లేకుంటే సహజంగా యోగయుక్తంగా అయిపోతారు. అంతేకాక ప్రతి కర్మ యోగయుక్తంగా అవుతుంది. స్వయాన్ని సారథిగా భావించుట ద్వారా అన్ని కర్మేంద్రియాలు అదుపులో ఉంటాయి. వారు ఏ కర్మేంద్రియాలకు వశమవ్వజాలరు.

స్లోగన్‌ :-

''విజయీ ఆత్మగా అవ్వాలంటే అటెన్షన్‌ మరియు అభ్యాసాలను నిజ సంస్కారంగా చేసుకోండి ''