02-10-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - మీరిప్పుడు పూజారుల నుండి పూజ్యులుగా, భికారుల నుండి రాజకుమారులుగా అవుతున్నారు. అందువలన మీరు సంతోషంగా చంకలెగుర వేయాలి (గంతులేయాలి), ఎప్పుడూ ఏడ్వరాదు ''

ప్రశ్న :-

అవినాశి జ్ఞాన రత్నాల వర్షముతో భారతదేశాన్ని ధనవంతముగా చేసేందుకు తండ్రి మిమ్ములను ఏ విషయములో తమ సమానంగా చేస్తారు?

జవాబు :-

తండ్రి చెప్తారు - పిల్లలారా! ఎలాగైతే నేను రూపబసంత్‌నో, అలాగే మిమ్ములను కూడా రూపబసంత్‌లుగా చేస్తాను. మీకు ఏవైతే అవినాశి జ్ఞానరత్నాలు లభించాయో వాటిని ధారణ చేసి నోటి ద్వారా దానము చేయండి. ఈ మహాదానము ద్వారానే భారతదేశము సంపన్నంగా అవుతుంది. మీరు తండ్రి నుండి వారసత్వాన్ని ఎలా తీసుకుంటున్నారో, అలాగే ఇతరులకు కూడా ఇవ్వండి. అందరికీ దారి చూపి సుఖమునిచ్చేవారిగా అవ్వడం మీ కర్తవ్యము.

పాట :-

న్యాయ మార్గములో,.....................(ఇన్సాఫ్‌ కీ డగర్‌ పర్‌..................)   

ఓంశాంతి.

ఈ పాట కాంగ్రెస్‌ వారికి కూడా అన్వయిస్తుంది. పిల్లలైన మీకు కూడా అన్వయిస్తుంది. ఎందుకంటే వారు కూడా ఎంతో సహనము చేసి క్రైస్తవుల నుండి భారతదేశాన్ని విడిపించారు. కావున ఇది వారు సంతోషములో పాడుకున్న పాట. సంతోషంగా వేడుకలు జరుపుకుంటూనే ఉంటారు. భలే ఎంత చేసినా పాత ప్రపంచము మాత్రము పరివర్తన అవ్వలేదు కదా! మొత్తానికి ఇది అదే పాత ప్రపంచము కదా! శ్రీమతానుసారము మనము ఈ ప్రపంచాన్ని పరివర్తన చేస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. వారు చెప్పే దానిని శ్రీమతమని అనరు. ఒక్క భగవంతునిది మాత్రమే శ్రీమతము. మీరిప్పుడు తండ్రి శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన శ్రీమతమును అనుసరిస్తున్నారు. వారు శ్రీ కృష్ణుని పేరు వేసేశారు. ఇది శ్రీ శివబాబా మతమని పిల్లలైన మీకు తెలుసు. కృష్ణుని తండ్రి అని అనడం శోభించదు. ఇది శ్రీ శివబాబా మతము. శ్రీ కృష్ణ బాబా మతమని అనరు. మీరు ఈ భారతదేశాన్ని మళ్లీ పవిత్రంగా చేస్తున్నారు. భారత ఖండమే ముఖ్యమైనది. ఎందుకంటే ఇది అనంతమైన తండ్రి జన్మ స్థానము. ఈ మొత్తం ప్రపంచములోని మనుష్య మాత్రులందరి తండ్రి ఎవరైతే ఉన్నారో అనగా సర్వుల సద్గతిదాత ఎవరో, వారి జన్మ స్థానము. దీనిని సర్వోత్తమ తీర్థ స్థానమని అంటారు. ఇటువంటి అత్యంత శ్రేష్ఠమైన తీర్థ స్థానము ఇంకేదీ లేదు. కాని గీతలో పేరు మార్చేశారు. స్వయం భారతవాసులకు కూడా ఈ భారతదేశము అనంతమైన తండ్రి జన్మ స్థానమని తెలియదు. భలే శివరాత్రిని ఆచరిస్తారు. అయితే శివుడు ఎవరు? ఎప్పుడు వచ్చారు? వారి నామ-రూపాలేమిటో వారికి తెలియదు. మీరిప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు శివలింగము చిత్రములో తెల్లని నక్షత్రాన్ని చూపిస్తారు. దాని వలన మనుష్యులు నక్షత్రము పరమాత్ముని రూపమని స్పష్టంగా అర్థము చేసుకోగలరు. కాని పూజ మొదలైనవి ఎలా చేయాలి? అందుకే పెద్ద రూపాన్ని తయారుచేశారు. వాస్తవానికి వారు ఒక నక్షత్రము వంటివారు. ఈ బాబా వజ్రాల వ్యాపారి కూడా. ఒక రాయి ఉంటుంది. స్టార్‌ రూబి, స్టార్‌ మాణిక్‌, స్టార్‌ నీలమ్‌ మొదలైనవి ఉంటాయని బాబాకు తెలుసు. అవి చాలా విలువైనవి. అన్నిటికంటే పెద్దస్టార్‌ ఫలానా ఖజానా నుండి దొంగిలించబడిందని వార్తాపత్రికలలో కూడా వచ్చింది. కావున ఈ శివలింగము ఎర్రగానే ఉంది. కాని దీని మధ్యలో తెల్లని నక్షత్రము, నక్షత్రపు లైటు ఉంది. అర్థము చేయించడం చాలా సులభంగా ఉంటుంది. నక్షత్రము తెల్లగా ఉంటుంది కదా. ఆత్మ సాక్షాత్కారము కూడా తెల్లగానే అవుతుంది. వస్తువేమో అదే. కేవలం నక్షత్రము అతికించాలి. ఇంకేమి వ్రాసే అవసరముండదు. అర్థము చేయించడం చాలా సహజమవుతుంది. ''స్వర్గ రాజధాని మీ జన్మ సిద్ధ అధికారము'' అని క్రింద ఇది వ్రాయబడే ఉంది. ఎందుకంటే తండ్రి స్వర్గ రచయిత కదా. కనుక నక్షత్రములాంటి ప్రకాశాన్ని వేయాలి. ఇప్పుడు బాబా ఆదేశిస్తున్నారు. వెంటనే ఆ పనిని చేయాలి. కొన్ని రాళ్లు మధ్యలో నక్షత్రము చాలా ఫస్ట్‌క్లాస్‌గా కనిపించే విధంగా కూడా ఉంటాయి. ఇక్కడ వాటికి చాలా విలువ ఉంటుంది. సత్యయుగములో అయితే ఈ వస్తువులకు, వజ్రాలకు విలువ ఉండదు. అక్కడ వజ్రాలను రాళ్ళలాగా చూస్తారు. మహళ్ళ గోడలకు పొదిగిస్తూ ఉంటారు. ఈ ప్రపంచమిప్పుడు మారుతూ ఉంది. మనము స్వర్గానికి అధిపతులుగా అయ్యేందుకు తండ్రి నుండి వారసత్వము తీసుకుంటున్నాము. అందుకొరకు చదువుకుంటున్నామని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. ఎవరు ఎంత బాగా చదువుకుంటారో అంత శ్రేష్ఠమైన పదవి పొందుతారు. మీరు చదవాలి, ఇతరులను చదివించాలి అనగా మీ సమానంగా తయారు చేయాలి, అప్పుడే శ్రేష్ఠమైన పదవిని పొందగలరు. మనము బ్రాహ్మణులము, సత్యమైన యాత్ర నేర్పించాలని పిల్లలు భావిస్తారు. ప్రతి ఒక్కరికి తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఏ మనుష్యమాత్రులకు తండ్రిని గురించి తెలియదు. అందరి తండ్రి ఒక్కరే. మిగిలినవారందరికీ వారి వారి పాత్రలు లభించాయి. ఒక ఆత్మ పాత్ర ఇంకొక ఆత్మ పాత్రతో సమానంగా ఉండదు. ఆత్మ అవినాశి. వాటి రూపాలలో ఏ వ్యత్యాసమూ లేదు. శరీరములో వ్యత్యాసముంటుంది. ప్రతి ఆత్మ పాత్రలో వ్యత్యాసముంటుంది. ప్రతి ఆత్మ ఒక నక్షత్రము వలె ఉంటుంది. అందులో అవినాశి పాత్ర నిండి ఉంది. అది అవినాశి పాత్ర. నెంబరువారు పురుషార్థమనుసారము ఈ విషయాల గురించి మీకు మాత్రమే తెలుసు. ఆత్మ భృకుటి మధ్యలో అద్భుతమైన నక్షత్రము ప్రకాశిస్తూ ఉంటుందని మహిమ కూడా ఉంది. పవిత్రమైనది కదా! ఎంత చిన్న నక్షత్రము! దానిలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఈ విషయాలు ఎప్పుడైతే వింటారో అప్పుడు వీరిని చదివించేవారు ఆ పరమాత్మ అని అంగీకరిస్తారు. మీరు అందరినీ చదివించాలి. భలే క్రైస్తవులకు ఇంగ్లీషు మాత్రమే తెలిసినా మీరు హిందీలో మాట్లాడండి. దానిని వివరించేవారు(ఇంటర్‌ప్రెటర్‌) ఆంగ్లములో అనువాదము చేసి వినిపిస్తూ ఉంటారు. వారి వద్ద అనువాదము చేసేవారు ఉంటారు. బాబా పరిచయాన్ని ఇవ్వాలి. ఎలాగైతే బాబా దు:ఖహర్త - సుఖకర్త అయ్యారో పిల్లలైన మీరు కూడా అలాగే తయారవ్వాలి. ప్రతి ఒక్కరికీ దారి చూపాలి. ఇతరులను కూడా సుఖదాయులుగా తయారు చేయడం పిల్లలైన మీ కర్తవ్యము. మీరు తండ్రి నుండి ఇంత గొప్ప వారసత్వము తీసుకుంటున్నారు. కనుక మీరు దానిని ఇతరులకు కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇదే మహాదానము. ఒక్కొక్క మహావాక్యము లక్షల రూపాయలతో సమానమైనది. ఒకవేళ శాస్త్రాల వాక్యాలు లక్షల రూపాయల విలువగలవి అయితే భారతదేశము ఇంత నిరుపేదగా ఎందుకు అవుతుంది?

కనుక పిల్లలైన మీరు బాగా అర్థము చేయించాలి, తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. వారు పరమాత్మ అని వారికి రూపము మరియు సుగంధము కూడా ఉందని(జ్ఞాన-యోగాలు ఉన్నాయని) పిల్లలైన మీరు అర్థము చేయించాలి. కాని అవినాశి జ్ఞానరత్నాల వర్షము ఎలా కురిపించాలి? తప్పకుండా శరీరము అవసరము. తండ్రి వచ్చి పిల్లలను అంటే ఆత్మలైన మిమ్ములను రూపబసంత్‌లుగా చేస్తారు. అవినాశి జ్ఞాన రత్నాలను ధారణ చేయాలి. తర్వాత నోటి ద్వారా ఈ జ్ఞానాన్ని దానమివ్వాలి. ఈ రత్నాలకు ఎవ్వరూ విలువ కట్టలేరు. దీని గురించి ఒక కథ కూడా ఉంది. కావున ఈ జ్ఞాన రత్నాలను ధారణ చేయాలి. శివబాబా భమ్‌ భమ్‌ భోళానాథ మా జోలెను నింపండి అని అంటారు కదా! ఈ అవినాశి జ్ఞాన రత్నాలతో జోలెను నింపుకోవాలి. అక్కడ మీ వజ్ర వైఢూర్యాల మహళ్ళు తయారవుతాయి. ఇది ప్రతి ఒక్కరికి అర్థము చేయించాలి. ఎక్కడ తండ్రి ఉంటారో దానిని నిర్వాణధామము లేక ముక్తిధామమని అంటారు. బుద్ధుడు మొదలైనవారు నిర్వాణధామానికి వెళ్ళారని అంటారు కదా! కనుక అది అందరి ఇల్లు అయినది కదా! తండ్రి ఇల్లు కూడా అదే. తండ్రి అందరిని తీసుకెళ్లేందుకు వచ్చారు. అపారమైన ధనాన్ని ఇస్తున్నారు. కనుక తండ్రి పరిచయాన్ని మీరు ఇవ్వలేదంటే ఇంకెవరు ఇస్తారు? నేను క్రిస్టియన్‌, నేను ఫలానా,.......... ఇవన్నీ దేహ ధర్మాలు,........... వీటన్నిటిని వదిలి నన్నొక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. మీరు భక్తిమార్గములో స్మృతి చేస్తూ వచ్చారు. అంతిమ సమయంలో ఎలాంటి స్మృతిలో శరీరాన్ని వదులుతారో అలాంటి జన్మయే తీసుకుంటారని గాయనముంది. అంతిమ సమయములో స్త్రీని తలంపు చేస్తే.......... వారు వేశ్య యోనిలో జన్మిస్తారని (గురుగ్రంథ్‌) కూడా ఉంది. ఇప్పుడు కూకర్‌గా, సూకర్‌గా(కుక్క, పంది) అవ్వరు. అయినా జన్మ అయితే లభిస్తుంది కదా! ఇక్కడ ఆత్మాభిమానులుగా అవ్వండి. నన్ను స్మృతి చేయండి అని బాబా అంటున్నారు. మీరు మీ తండ్రిని, ఇంటిని మర్చిపోయారు. ఇప్పుడు నాటకము పూర్తి అవుతుంది. మళ్లీ పునరావృతమవుతుంది. ఇస్లామ్‌ మతస్తులు, బౌద్ధులు, క్రైస్తవులు అందరూ తమ తమ పాత్రలను రిపీట్‌ చేస్తూ వచ్చారు. ఈ డ్రామా అనేకమార్లు రిపీట్‌ అవుతూ వచ్చింది. దానికి ఆది-అంత్యములు లేవు. డ్రామాకు ఆది-అంత్యాలు ఉన్నాయి. అది మళ్లీ మళ్లీ స్వత:గా రిపీట్‌ అవుతూ ఉంటుంది. ఈ మాటలు అర్థము చేసుకున్నవారు, ఇతరులకు మీరు వచ్చి తండ్రిని తెలుసుకోమని చెప్పి వారికి అర్థము చేయించవలసి ఉంటుంది. తండ్రిని తెలుసుకోని కారణంగా మనుష్యులు అనాథలైపోయారు. ఇప్పుడు పోపు యుద్ధము చేయవద్దని చెప్పినా, వారు అంగీకరించరు. క్రైస్తవులలో పోపు పెద్దవారు, అందరికీ గురువు. అయినా గురువు సలహా పైన ఎందుకు నడవరు? వారు ఎవరి మాటా వినరు. స్వయంగా తండ్రే వచ్చి అందరికీ అర్థం చేయించమని సలహా ఇస్తున్నారు. కనుక మీరు అందరికీ అర్థము చేయించండి. మెల్ల మెల్లగా అన్ని ధర్మాలవారు అర్థము చేసుకుంటారు. మొదట మీరు కేవలం కొంతమంది సింధీలు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు అందరూ వస్తున్నారు. క్రైస్తవులకు కూడా తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. దీని ద్వారా వారు కూడా తండ్రి నుండి వారసత్వము తీసుకునేందుకు హక్కుదారులుగా అవువుతారు. ఇందులో అలసిపోరాదు. ఈ ప్రదర్శిని చాలా తీవ్రంగా, జోరుగా నడుస్తుంది. సర్వీసు చేసే పిల్లల పైన సర్వీసు బాధ్యత పెద్దగా ఉంటుంది. అలాంటివారే తండ్రి హృదయము పై ఉంటారు. వారే మళ్లీ సింహాసనము పై కూర్చుంటారు. మహాదానులుగా అవ్వాలి, తండ్రిని స్మృతి చేయాలి. వారు మరొక జన్మ కొరకు భీమా(ఇన్‌ష్యూర్‌) చేస్తారు. ఈశ్వరార్థము, కృష్ణార్థము దానము చేస్తారు. వాస్తవానికి కృష్ణుడు చాలా ధనవంతుడు. అతడు దానము తీసుకున్నాడు. తండ్రి నుండి వారసత్వము తీసుకున్నాడు. స్వర్గానికి రాజకుమారునిగా అయ్యాడంటే స్వర్గాన్ని స్థాపన చేసేవారి నుండి ఆస్తిని తీసుకున్నాడు కదా. అయితే ఎలా తీసుకున్నాడో ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. తండ్రియే కృష్ణునికి కూడా వారసత్వమునిచ్చారు. వారసత్వమునే దానమని కూడా అంటారు. కన్యాదానము చేస్తారు కదా. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - నేను మీకు అవినాశి జ్ఞాన రత్నాలను దానము చేసేందుకు వచ్చాను, దీని కొరకు ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. భలే ఖర్చు అయినా పర్వాలేదు. ఇక్కడ పిల్లలు సాక్షాత్కారము పొందారు. ఇబ్రహీమ్‌, బుద్ధుడు, ఏసుక్రీస్తు వీరందరూ చివర్లో వస్తారు. వారు కూడా తప్పకుండా వింటారు. విన్నప్పుడే కదా పదవిని పొందుతారు! పిల్లలకు సంతోషముండాలి. క్రైస్తవులకు భారతదేశముతో చాలా సంబంధముంది. తీసుకున్నటువంటి రాజ్యాన్ని మళ్లీ వాపస్‌ ఇస్తున్నారు. వారు భారతదేశాన్ని చాలా సంభాళన చేయాల్సి ఉంటుంది. ఒకవేళ భారతదేశము పై ఎవరైనా దాడి చేస్తే వారి ధనమంతా సమాప్తమైపోౖతుంది. వారు చాలా ధనమును ఇచ్చారు. వారి ధనమంతా పూర్తిగా సమాప్తమైపోతుంది. కావున అన్ని విధములా భారతదేశాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తారు. వీరికి సహాయము తప్పకుండా కావాలి. అలాగే మళ్లీ వాపస్‌ కూడా ఇవ్వాలి. వారు తప్పకుండా సంభాళన చేసే తీరాలి. ఇప్పుడు భారతదేశము నిరుపేదదని తండ్రికి తెలుసు. అందుకే అక్కడి నుండి కూడా సహాయము చేయిస్తారు. అంతేకాక స్వయంగా వారే వచ్చి సహాయము చేస్తారు. ఇప్పుడు వారు సహాయము చేస్తున్నారు. భవిష్యత్తు కొరకు తండ్రి సహాయము చేస్తున్నారు. కనుక ఒక చాలా మంచి మండపాన్ని తయారుచేసి క్రైస్తవులందరికి నిమంత్రణనివ్వాలి. ఎన్నో మంచి - మంచి చిత్రాలున్నాయి. వాటిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. రోజురోజుకు బుద్ధి తాళము తెరుచుకుంటూ ఉంటుంది.

ఇంత చిన్న ఆత్మలో ఎంత పెద్ద పాత్ర నిండి ఉందో మీకు తెలుసు. విజ్ఞానవేత్తలు కూడా ఈ విషయములో చాలా ఆశ్చర్యపడ్తారు. మమ్ములను ఏదో ప్రేరేపిస్తున్నదని విజ్ఞానులు కూడా భావిస్తారు. అయితే వినాశనమైతే తప్పకుండా అవ్వాలి. ఇది డ్రామాలో ఫిక్స్‌ అయ్యింది. శంకరుని మాటే లేదు. కేవలం నిమిత్తంగా పేరు పెట్టారు. ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. ఈ మాటలు వినడం వలన వారు చాలా సంతోషిస్తారు. మీకు చాలా ధన్యవాదాలు తెలుపుతారు. చాలా మంది విదేశీయులు కూడా వస్తారు. ఇంటిలో కూర్చున్నా వస్తారు. కావున ఖచ్చితంగా దానమివ్వాలి. మన దృష్టిలో ఇప్పుడందరూ నిరుపేదలుగా, అనాథలుగా ఉన్నారు. తల్లిదండ్రుల పరిచయము లేని కారణంగా పూర్తి ప్రపంచములోని వారందరూ అనాథలుగానే ఉన్నారు. మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు. పిల్లలకు సర్వీసు చేయు నషా కూడా ఉండాలి. ఆత్మలందరినీ తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు, వచ్చి తెలుసుకోండి అని టెలిగ్రాంలు కూడా ఇవ్వాలి. ఇప్పుడు నాటకము పూర్తి అవుతుంది. తండ్రి ఆత్మలను తీసుకెళ్లేందుకు వచ్చారని ఆత్మకు సంతోషము కలుగుతుంది. మళ్లీ మనము సుఖధామములోకి వస్తాము. అర్ధకల్పము పూజారులుగా అయ్యి తండ్రిని స్మృతి చేశాము. ఇప్పుడు మళ్లీ పూజ్యులుగా అవ్వాలి. కనుక ఖుషీలో గంతులేయాలి. ఖుషీ లేదంటే మళ్లీ ఏడుస్తూ ఉంటారు. ఎవరు ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు. అయితే ఇంత సుఖమునిచ్చే తండ్రి స్మృతిలో ప్రేమ కన్నీరు వస్తే అవి మాలలోని మణులు. తండ్రి శ్రీమతము ద్వారా శ్రేష్ఠంగా అవుతారు. అడుగడుగునా శివబాబా శ్రీమతము పై నడవాలని ఈ బాబా కూడా చెప్తారు. శ్రీమతమే శ్రేష్ఠమైనది. ఇది చాలా ఉన్నతమైన చదువు. మనుష్యులు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు చాలా కష్టాలు కలుగుతాయి. ఇంతకుముందు కాలి నడకతో వెళ్లేవారు. ఇప్పుడు గవర్నమెంటు సులభము చేసేశారు. అడుగడుగునా శ్రీమతము పై నడవాలని తండ్రి అర్థం చేయిస్తున్నారు. జాగ్రత్తగా ఎక్కినట్లయితే వైకుంఠ రసాన్ని గ్రోలుతారు. పడిపోయారంటే ముక్కలు ముక్కలుగా అవుతారు. అడుగడుగులో సలహా తీసుకోవాలి. శివబాబా కేర్‌ ఆఫ్‌ బ్రహ్మ లేదా బ్రహ్మకుమారీలని పత్రము(జాబు) వ్రాస్తే శివబాబా స్మృతి ఉంటుంది. కాని చాలామంది పిల్లలు వ్రాయడమే మర్చిపోతారు. ఒక రోజు అందరి బుద్ధి తాళము తప్పకుండా తెరుచుకుంటుంది. పిల్లలకు సర్వీసు పైన చాలా ఆసక్తి ఉండాలి. సర్వీసు చాలా చేయాలి. ఇది కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. ధనము తనంతకు తానే వస్తుంది. ప్రయత్నము చేయకనే అంతా జరుగుతూ పోతుంది. తండ్రి చెప్తున్నారు - మీకు మూడడుగుల స్థలము లభించడం కూడా కష్టంగా ఉంది. అయినా మీరు కల్పక్రితము భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే ఉన్నారు.

మంచిది. ఎంతగానో అర్థము చేయిస్తున్నారు. ధారణ కూడా చేయాలి. చాలా భారీ పదార్థాలను తింటే అవి జీర్ణమవ్వవు. ప్రదర్శినీకి భలే చాలామంది వస్తారు. కాని వీరిని చదివించేవారు, రాజయోగాన్ని నేర్పించేవారు తండ్రి అని ఒక్కరికి కూడా నిశ్చయము కూర్చోదు. మొట్టమొదట ఈ నిశ్చయాన్ని కూర్చోబెట్టాలి. వీరు ప్రజాపిత బ్రహ్మకుమార - కుమారీలని అర్థము చేయించగలరు. రచయిత అయితే ఒక్క పరమపిత పరమాత్మయే. తండ్రి నుండే వారసత్వము లభించాలి. తండ్రికి ఎంతవరకు పిల్లలుగా అవ్వరో, అంతవరకు వారసత్వము లభించదు. భక్తులకు ఫలితాన్ని ఇచ్చేవారు కూడా తండ్రియే. వీరంతా బ్రహ్మకుమార-కుమారీలు. ప్రజాపిత బ్రహ్మను కూడా రచయిత అని అంటారు. ఇప్పుడు నూతన ప్రపంచ రచన జరుగుతుంది. నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నానని భగవానువాచ.

మధురాతి మధురమైన లక్కీ సితారాలకు జ్ఞాన సూర్యుడు మరియు జ్ఞాన చంద్రుల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. తండ్రి హృదయ సింహాసనము పై కూర్చునేందుకు సర్వీసు బాధ్యతను తీసుకోవాలి. తప్పకుండా మహాదానులుగా అవ్వాలి. జ్ఞాన దానము చేయడంలో కొంత ఖర్చు అయినా ఫర్వాలేదు.

2. గమ్య స్థానము చాలా ఉన్నతమైనది. కావున చాలా జాగ్రత్తగా నడవాలి. అడుగడుగునా శ్రీమతాన్ని తీసుకుంటూ ఉండాలి.

వరదానము :-

'' భృకుటి కుటీరంలో కూర్చొని అంతర్ముఖత రసాన్నితీసుకునే సత్యమైన తపస్వీమూర్త్‌ భవ ''

ఏ పిల్లలైతే తమ మాటలను అదుపు చేసుకొని శక్తిని, సమయాన్ని జమ చేసుకుంటారో వారికి స్వతహాగా అంతుర్ముఖతా రసము అనుభవమవుతుంది. అంతర్ముఖతా రసానికి, మాటలు లేక శబ్ధ రసానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. అంతర్ముఖులు సదా భృకుటి కుటీరంలో తపస్వీ మూర్తులుగా అనుభవం చేస్తారు. వారు వ్యర్థ సంకల్పాల నుండి మానసిక మౌనము, వ్యర్థ మాటలు మాట్లడకుండా నోటి మౌనాన్ని పాటిస్తారు. అందువలన అంతర్ముఖతా రసము ద్వారా అలౌకిక అనుభూతి కలుగుతుంది.

స్లోగన్‌ :-

'' రాజయుక్తంగా అయ్యి ప్రతి పరిస్థితిలో రాజీ(సంతోషం)గా ఉండేవారే జ్ఞానయుక్త ఆత్మలు ''