17-12-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - ఈ చదువు మనుష్యులను దేవతలుగా చేస్తుంది, ఇందులో కొద్దిగా కూడా పొరపాటు చేయరాదు. కేవలం తింటూ, నిదురిస్తూ చదువుకోకుండా ఉంటే చాలా పశ్చాత్తాప పడవలసి ఉంటుంది ''

ప్రశ్న :-

ఏ విషయములో బ్రహ్మాబాబాను అనుసరిస్తే ఉన్నతి జరుగుతూ ఉంటుంది ?

జవాబు :-

ఎలాగైతే బ్రహ్మాబాబా తన సర్వస్వాన్ని పూర్తిగా ఆహుతి చేస్తారో అనగా తన సర్వస్వాన్ని సమర్పించారో, అలా తండ్రిని అనుసరించండి. ఉన్నతికి సాధనము - తండ్రి ద్వారా రచింపబడిన ఈ రుద్ర యజ్ఞములో తమ ఆహుతినివ్వాలి అంటే తండ్రికి పూర్తి సహాయకారులుగా అవ్వాలి. కాని నేను ఇంత సహయోగము చేశాను. ఇంత ఇచ్చాను,............ ఇటువంటి ఆలోచనలు ఎప్పుడూ రాకూడదు. తండ్రి దాత. వారి నుండి మీరు తీసుకుంటారే కాని ఇవ్వరు.

పాట :-

నీవు నిదురించి రాత్రిని పోగొట్టుకున్నావు,............. ( తూనే రాత్‌ గవాయి సో కే..........)   

ఓంశాంతి.

పిల్లలు పాట విన్నారు. దీని పై కూడా పిల్లలకు అర్థం చేయించాలి, నేను పిల్లలతో మాట్లాడుతున్నానని, ఇంకెవ్వరూ చెప్పలేరు. సాధు, సత్పురుషులు, మహాత్ములు అనేకమంది ఉన్నారు. వీరిలో శక్తి ఉందని కొంతమంది అంటారు. వీరైతే అందరికీ తండ్రి, వారే కూర్చుని అర్థము చేయిస్తారు. చాలామంది పిల్లలు రోజంతా తింటూ, త్రాగుతూ, నిదురపోతూ,........... ఉంటారు. చాలా సమయము నిదురిస్తూ ఉంటారు. దీని వలన ఏమవుతుంది? వజ్ర తుల్య జన్మను పోగొట్టుకుంటారు. మాయ చాలా తప్పులు చేయిస్తుంది. కుంభకర్ణుని నిద్రలో నిద్రపుచ్చింది. ఇప్పుడు మేల్కొల్పేవారు వచ్చారు, అజ్ఞాన నిద్ర నుండి మేలుకోండి. పూర్తి సృష్టిలో, అందులో ముఖ్యంగా భారతదేశములో అజ్ఞానమే అజ్ఞానముంది. కనుక తండ్రి చెప్తున్నారు - ఇప్పుడు తప్పు చేస్తే చాలా చాలా పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. తర్వాత చింతించినా లాభమేమీ ఉండదు. ఇక్కడ మనుష్యులను దేవతలుగా తయారయ్యే చదువు ఉంది. ఈ విధంగా ఇతరులెవ్వరూ చెప్పలేరు. ఇక్కడ కూడా అదే జ్ఞానమని అనరాదు. ఇక్కడ ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన జరుగుతుంది. ఇక్కడ కూడా చాలామందిని '' దేవి '' అని పిలుస్తారు. స్త్రీ దేవి అయితే, పురుషుడు దేవుడవుతాడు కాని మనమిక్కడ సత్యయుగములో దేవీ దేవతా పదవిని పొందుకునే పురుషార్థము చేస్తున్నాము. కనుక తప్పకుండా సత్యయుగ స్థాపకుడే దీనిని ప్రాప్తి చేయించగలడు. అన్ని సత్సంగాల కంటే ఈ విషయం ప్రత్యేకమైనది. ఎవరైతే ఈశ్వరుడు సర్వవ్యాపి అని, అనేక అవతారాలు ధరిస్తారని చెప్తారో, వారినిలా ప్రశ్నించండి - ఒకవేళ ఈశ్వరుడు సర్వవ్యాపి అయితే అవతారమని చెప్పేవారు కూడా తప్పకుండా ఈశ్వరుని అవతారమే అవుతారు కదా. అచ్ఛా మరి రచన యొక్క ఆదిమధ్యాంత రహస్యాలను తెలియజేయండి? అని అడగండి. వారు ఏ సమాధానము చెప్పలేకపోతారు అనేక రకాల వారుంటారు. రిద్ధి-సిద్ధి(మంత్ర- తంత్రాలు) చేసేవారు కూడా ఉన్నారు. నూతన ఆత్మ సృష్టిలో ప్రవేశించగానే అది కూడా తన శక్తిని చూపిస్తుంది. ధర్మ స్థాపన చేసేందుకు ప్రవేశించే నూతన ఆత్మల పేరు చాలా ప్రసిద్ధమవుతుంది. ఇక్కడ శక్తి విషయమేదీ లేదు. శివబాబా, మేము మీ నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చామని మీరంటారు. దీనినే ఈశ్వరీయ జన్మ సిద్ధ అధికారమని అంటారు. మీరు ఈశ్వరీయ సంతానము. మేము బాప్‌దాదా పిల్లలమని ఏ సాధు, సన్యాసులు, మహాత్ములు అనరు.

మనము స్వర్గ వారసత్వము తీసుకుంటున్నామని మీకు తెలుసు. సంపూర్ణ వారసత్వము తీసుకోవాలంటే తండ్రి స్మృతిలో ఉండమని బాబా చెప్తారు. తండ్రి ఇక్కడే చదివిస్తారు. రాజ్య స్థాపన అవ్వగానే ఈ చదువు, చదివించేవారు అదృశ్యమైపోతారు. ఈ బ్రాహ్మణ కులము ఇప్పుడే ఉంది. మేము బ్రహ్మ సంతానమని అంటారు. మరి బ్రహ్మ ఎప్పుడు వచ్చాడు? బ్రహ్మ అయితే సంగమ యుగములోనే వస్తారు కదా, ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచింపబడే బ్రాహ్మణులే దేవతలుగా అయిపోతారు. తర్వాత బ్రాహ్మణులే ఉండరు. తర్వాత మనము మళ్లీ దేవతా కులములోకి వెళ్లిపోతాము. తర్వాత కర్మ క్రియలు చేయించేందుకు ఉన్న బ్రాహ్మణులను, ఋషులు, మునులు ప్రారంభించి ఉంటారు. పూజారులుగా మారి ఉంటారు. ద్వాపర యుగములోశివుని మందిరాలు నిర్మించి పూజించడం మొదలు పెట్టినప్పుడు పూజ్య దేవీ దేవతలుగా ఉన్నవారే పూజారులుగా అయిపోతారు. ఆ సమయములో మందిరాలలో బ్రాహ్మణులు కావాలి. కనుక అచ్చట నుండే బ్రాహ్మణులు(లౌకిక) కూడా ప్రారంభమై ఉంటారు. ఎవరైతే పూజ్యుల నుండి పూజారులుగా అయ్యారో వారిని బ్రాహ్మణులని అనరు. మందిరాలలో విగ్రహముల ముందు బ్రాహ్మణులు తప్పకుండా ఉంటారు కనుక ఆ సమయములో ఆ బ్రాహ్మణులు కూడా వెలువడి ఉంటారు. ఇది సంపూర్ణ వివరణ. వాస్తవానికి దీనితో కూడా జ్ఞానానికి సంబంధము లేదు. జ్ఞానము కేవలం 'మన్మనాభవ' అని చెప్తుంది. శివబాబాను స్మృతి చేయమని పిల్లలైన మీకు చెప్పబడుతుంది. కేవలం స్మృతి చేసినంత మాత్రాన లక్ష్మీనారాయణులుగా అవుతారా? అవ్వరు. మళ్లీ చదువు కూడా ఉంది. ఎంత ఎక్కువగా సర్వీసు చేస్తారో, అంత ఎక్కువ ఉన్నత పదవిని పొందుతారు, అంత నోటిలో బంగారు స్పూను(గోల్డెన్‌ స్పూన్‌ ఇన్‌ ద మౌత్‌) ఉంటుంది. నూతన ప్రపంచంగా అయ్యేందుకు మార్పులు, చేర్పులు అవ్వడానికి సమయమైతే పడ్తుంది కదా. వినాశనము తర్వాత స్థాపన అవుతుంది. కలియుగము తర్వాత సత్యయుగము వస్తుంది. భలే భూకంపాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి కాని అనేక ధర్మాలు వినాశనమవ్వాలి. డ్రామా పూర్తి అవుతుంది. మనమిప్పుడు బాబా వద్దకు వెళ్లి మళ్లీ నూతన ప్రపంచములోకి వస్తాము. మనము ఈ సమయములో ఈ యజ్ఞ బ్రాహ్మణులుగా అయ్యాము. 5 వేల సంవత్సరాల క్రితము వలె శివబాబా ఈ రుద్ర యజ్ఞాన్ని రచించారు. ఇది చాలా పెద్ద యజ్ఞము. సత్యమైన బ్రాహ్మణులైన మీరే ఈ యజ్ఞాన్ని సంభాళన చేస్తారు. ఆ బ్రాహ్మణులైతే స్థూలమైన యజ్ఞాలను రచిస్తారు. ఏవైనా ఆపదలు మొదలైనవి సంభవించినప్పుడు ఆ యజ్ఞాలను రచిస్తారు. సత్యయుగములో గురువులు మొదలైనవారి అవసరముండదు. సద్గతి అవసరమైనప్పుడేే గురువు కావాలి. ఇప్పుడిక్కడైతే లెక్కలేనంతమంది గురువులున్నారు. ఇన్ని వేద శాస్త్రాలు మొదలైనవి ఉండి కూడా భారతదేశపు గతి ఇలా ఎందుకు అయ్యింది?

5 వేల సంవత్సరాల క్రితము వలె మనుష్యులందరూ కుంభకర్ణుని వలె గాఢ నిద్రలో మునిగి ఉన్నారని మీరు వ్రాయవచ్చు. అందరూ నిదురిస్తారు కాని ఇది అజ్ఞాన నిద్ర. సద్గతినిచ్చే గురువులెవ్వరూ లేరు. మరిప్పుడు వెలుగునిచ్చేవారెవరున్నారు? పరమపిత పరమాత్మ లేకుండా వెలుగు రాజాలదని పిల్లలైన మీకు అర్థము చేయించబడింది. ఇప్పుడైతే ఇంతమంది గురువులున్నారు. అయినా అంధకార రాత్రిగా దు:ఖము ఎందుకుంది? సత్యయుగములో అయితే అనంతమైన సుఖముండేది. ఇప్పుడు భగవంతుని శ్రీమతము లభించినప్పుడే సుఖము లభిస్తుంది. రావణుడే భారతదేశాన్ని పతితంగా, దు:ఖితంగా తయారుచేశాడు. ఈ కామ మహాశత్రువును జయించమని తండ్రి చెప్తున్నారు. పవిత్రతా ప్రతిజ్ఞ చేసినప్పుడే నూతన ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. పవిత్రంగా అవ్వండి అని గురువులెప్పుడూ చెప్పరు. సంపూర్ణ ప్రకాశాన్ని పొందుకున్న మీరు వెళ్లి వారిని - అనంత సుఖములో ఉన్న భారతదేశము ఇప్పుడెందుకు ఇంత దు:ఖితంగా అయ్యింది? అని ప్రశ్నించండి. మనమే దేవతలుగా అవుతామని పిల్లలైన మీకు తెలుసు. సన్యాసులైతే వెంటనే ఇల్లు-వాకిలి వదిలి పారిపోతారు. ఆ సన్యాసులు పావనమైన వారని అంటారు. పావనంగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నామని వారు చెప్పరు. మీ విషయమే ప్రత్యేకమైనది. సన్యాసులందరూ పవిత్రంగా ఉంటారని అనుకోకండి. స్థితి గట్టిపడునంత వరకు బంధు-మిత్రుల పైకి బుద్ధియోగము వెళ్తూ ఉంటుంది. దేహ సహితంగా, దేహ సర్వ సంబంధాలను మర్చిపోండి అని మీకు చెప్పబడింది. అది ఎంత కష్టమనిపిస్తుంది. సన్యాసులను మీరెప్పుడు సన్యసించారు? మీ లౌకిక పేరేమిటి? అని అడిగితే, ఇటువంటి విషయాలు అడగకండి. వాటిని గుర్తెందుకు చేయిస్తారని అంటారు. కాని కొంతమంది కారణం చెప్తారు కూడా. అటువంటి వారిని - మీరు వెంటనే అందరినీ మర్చిపోయారా లేక గుర్తుకు వస్తున్నారా అని అడగండి. మీరు ఎవరు? అన్నీ ఎలా వదిలేశారు? ఒంటరిగా ఉండేవారా? లేక పిల్లా పాపలు కూడా ఉండేవారా? వారు మీకు గుర్తుకు వస్తూ ఉంటారా? అని అడిగితే అవును చాలా సమయము వరకు గుర్తు వచ్చేవారు, చాలా కష్టముతో మరవాల్సి వచ్చిందని అంటారు. తమ జీవితమైతే గుర్తుంటుంది కదా. భలే మనము శివబాబాను స్మృతి చేస్తాము కాని మన స్వంత జీవితాన్ని మరియు ఏవైతే శాస్త్రాలను చదివామో వాటిని మర్చిపోము కదా. జీవించి ఉండి మర్చిపోండి, దీనిని ధారణ చేయండని తండ్రి చెప్తారు. లౌకిక సంబంధీకులను గుర్తు చేసుకుంటే అక్కడే బుద్ధి వ్రేలాడుతూ ఉంటుంది. మొదట ఈ విషయాలన్నీ విన్న తర్వాత నిర్ణయించండి. జీవించి ఉండి మరజీవులుగా అవ్వండి. ఇతరులెవ్వరి మాటా వినకండి. మనము మన పూర్తి జీవితాన్ని గురించి చెప్పగలము. ఈ ప్రపంచము సమాప్తమవ్వనున్నదని మనకు తెలుసు. సేవాకేంద్రాలు వృద్ధి అవుతూ ఉంటాయి. ఎవరైతే మమ్మా-బాబా అని అంటారో వారు బ్రాహ్మణులుగా అవుతారు. ఇప్పుడు హే ఆత్మలారా! అని తండ్రి చెప్తున్నారు. ఆత్మనే మాట్లాడ్తుంది. మీరు ఎవరు? అని మిమ్ములను ప్రశ్నిస్తే - నేను ఆత్మను, చదువుతున్నానని వెంటనే చెప్తారు. ఈ జ్ఞానము ఇప్పుడు మీకు లభించింది. మీ ఆత్మ, ఈ కర్మేంద్రియాలతో చదువుతుంది. ఆత్మ మరియు శరీరము రెండు ఉన్నాయి. ఆత్మయే శరీరాన్ని తీసుకొని వదులుతుంది సంస్కారాలను ధారణ చేస్తుందని మీకిప్పుడు తెలుసు. సత్యయుగములో ఆత్మలమైన మనము పుణ్యాత్మలము, ఇప్పుడు పాపాత్మలుగా ఉన్నాము. ఇది చివరి జన్మ. పరమాత్మలో ఏ జ్ఞానమైతే ఉందో దానిని ఇప్పుడు ఆత్మలమైన మనకు చదివిస్తున్నారు. మిగిలిన మనుష్యులంతా ఘోర అంధకారములో ఉన్నారు. శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తిమార్గానికి చెందినవి. వాటిని జ్ఞానమని అనరు. జ్ఞానము పగలు, భక్తి రాత్రి. గీతా రచయిత ఎవరు? వారు ఎప్పుడు వచ్చారు? గీత ఎప్పుడు లభించబడింది? అని మీరు ప్రశ్నించవచ్చు. బాబా కూడా వ్రాస్తుంటారు. దానిని గురించి మీరు మననము చేయాల్సి ఉంటుంది. ఇలా ఇలా మీ బుద్ధిలో ధారణ చేస్తూ ఉంటే మీ ఉన్నతి అవుతూ ఉంటుంది. నన్ను స్మృతి చేయండని బాబా చెప్తున్నారు. పిల్లలకు మాల రహస్యము కూడా అర్థము చేయించారు. పరమపిత పరమాత్మ బేహద్‌ పుష్పము. తర్వాత బ్రహ్మ-సరస్వతి జంట పూసలు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచన రచింపబడింది. వీరు ఆదిదేవుడు, ఆది దేవి. ఈ బ్రాహ్మణులు స్వర్గాన్ని తయారుచేశారు. అందుకే వారిని పూజిస్తున్నారు. మధ్యలో ఆ 8 మణులు చాలా సహయోగము చేసిన సూర్య వంశము వారు. జ్ఞానము బుద్ధిలో ఉండాలి. యజ్ఞములో ఆహుతి ఇవ్వబడుతుందని కూడా మీకు తెలుసు. మాతల ఉన్నతికై బాబా యుక్తిని రచించారు. బలిహారమయ్యారు కదా. కనుక తండ్రిని అనుసరించండి. గాంధీకి సహకరించినవారికి కూడా అల్పకాల సుఖము లభించింది. వారు హద్దులోని తండ్రి. వీరు అనంతమైన తండ్రి.

ఇక్కడ బాబా సర్వస్వమును మాతల పాదాల వద్ద ఉంచారు. కనుకనే వీరు మొదటి నంబరులోకి వెళ్లారు. పిల్లలైన మీరు పురుషార్థము చేయాలి. ఎవరైతే సహాయం చేస్తారో వారే స్వర్గానికి అధిపతులుగా అవుతారు. శివబాబాకు మేము సహయోగమిస్తున్నామని భావించకండి, వాస్తవానికి శివబాబాయే మీకు సహాయము చేస్తారు. అరే! వారు దాత. మీరు మీ కొరకే చేసుకుంటున్నారు. మీరు స్మృతిలో ఉంటే వికర్మలు వినాశనమవుతాయి. స్వర్గాన్ని స్మృతి చేస్తే స్వర్గములోకి వెళ్లిపోతారు. బాబా స్వయంగా చెప్తున్నారు - 'మన్మనాభవ.' అలా లేకుంటే శ్రేష్ఠమైన పదవి ఎలా లభిస్తుంది? లెక్క చూసుకోవడం మీ పని. నేను ఇస్తున్నానని ఎవ్వరూ భావించకండి. ఇది శివబాబా యజ్ఞము. నడుస్త్తోంది, నడుస్తూనే ఉంటుంది.

మేము కేవలం భారతదేశాన్ని మాత్రమే కాదు, పూర్తి విశ్వమంతటా తండ్రి సహయోగముతో మా రాజధానిని స్థాపన చేసుకుంటున్నామని బ్రాహ్మణ పిల్లలైన మీ హృదయములో ఉంటుంది. మేము మళ్లీ పవిత్రంగా అయ్యి భారతదేశాన్ని స్వర్గంగా చేసి రాజ్యము చేస్తాము. శివబాబా మతమును అనుసరిస్తేనే భారతదేశము స్వర్గముగా అవుతుంది. కనుక శివబాబా చదివిస్తున్నారని గుర్తు పెట్టుకోండి. ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడే దేవతా సంప్రదాయములోకి వస్తారని బాబా చెప్తున్నారు. వికారాలలో పడిపోవడం వలన ఒక్కసారిగా సర్వ నాశనం అయిపోతారు. తమ పై తామే కృప చూపకుండా, అకృప చూపిస్తే శాపగ్రస్థులైపోతారు. నేను వరదానాన్ని ఇచ్చేందుకు వచ్చాను. కాని శ్రీమతమును అనుసరించకుంటే మిమ్ములను మీరే శాపించుకుంటారు, పదభ్రష్టులైపోతారు. అచ్ఛా.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. బుద్ధి ద్వారా సర్వస్వమూ మర్చిపోయేందుకు జీవించి ఉండి మరణించాలి. ఒక్క తండ్రి చెప్పినదే వినాలి. తమ ఉన్నతి కొరకు పూర్తిగా బలిహారమవ్వాలి.

2. శ్రీమతమును అనుసరిస్తూ స్వయం పై కృప చూపుకోవాలి. సత్యమైన బ్రాహ్మణులుగా అయ్యి యజ్ఞాన్ని సంభాళన చేయాలి. చదువును బాగా చదివి శ్రేష్ఠమైన పదవిని తీసుకోవాలి.

వరదానము :-

''స్మృతి స్వరూపులుగా అయ్యి విస్మృతిలో ఉన్నవారికి స్మృతినిప్పించే సత్యమైన సేవాధారీ భవ ''

మీ స్మృతి స్వరూప రూపురేఖల ద్వారా(ఫీచర్స్‌ ద్వారా) ఇతరులను స్మృతి స్వరూపులుగా చేయడమే సత్యమైన సేవ. మీ రూపురేఖలు ఇతరులకు 'నేను ఆత్మను' అనే స్మృతిని కలిగించి, మస్తకంలో ప్రకాశిస్తున్న ఆత్మను లేక మణిని చూడాలి. ఎలాగైతే సర్పము మస్తకములో గల మణిని చూచి సర్పము వైపు ధ్యానము వెళ్లదో, అలా అవినాశిగా ప్రకాశిస్తున్న మణిని చూచి దేహ భావాన్ని మర్చిపోయి, స్వతహాగా ఆత్మ వైపు వెళ్లాలి. విస్మృతిలో ఉన్నవారికి స్మృతి కలగాలి. అప్పుడు వారిని సత్యమైన సేవాధారులని అంటారు.

స్లోగన్‌ :-

''అవగుణాలను ధారణ చేసే బుద్ధిని నాశనము చేసి సతోప్రధానమైన, దివ్యమైన బుద్ధిని ధారణ చేయండి''