31-12-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - ఒక్క తండ్రితో సత్యమైన ప్రేమ ఉంటే బాబా మిమ్ములను తన జతలో ఇంటికి తీసుకెళ్తారు, పాపాలన్నిటి నుండి ముక్తులుగా చేసేస్తారు, స్వర్గాధిపతులుగా చేస్తారు''
ప్రశ్న :-
తమను తాము సంతోషంగా ఉంచుకునేందుకు అవసరమైన ముఖ్యమైన ధారణ ఏది?
జవాబు :-
ఎప్పుడైతే మీతో మీరు ఆత్మీయంగా సంభాషించుకుంటారో అప్పుడే సంతోషంగా ఉండగలరు. ఏ వస్తువు పైనా ఆసక్తి ఉండరాదు. రెండు రొట్టెలు కడుపుకు లభిస్తే చాలు...... ఇటువంటి అనాసక్త వృత్తిని ధారణ చేసినప్పుడే హర్షితంగా ఉంటారు. జ్ఞాన మననము చేసి స్వయమును హర్షితముగా ఉంచుకోండి. మీరు కర్మయోగులు. కర్మ చేస్తూ, ఇంటి పని చేస్తూ భోజనము మొదలైనవి చేస్తూ కూడా తండ్రిని స్మృతి చేయాలి. స్వదర్శన చక్రమును బుద్ధిలో త్రిప్పుతూ ఉంటే అపారమైన ఖుషీ ఉంటుంది.
పాట :-
వారు మా నుండి వేరు కాలేరు.............. (నా వహ్ హమ్సే జుదా హోంగే ,.............) 
ఓంశాంతి.
మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు. ఇది పిల్లలకు లేక ఆత్మలకు తమ పరమపిత పరమాత్మునితో గల ఆత్మిక ప్రేమ. ఈ ఆత్మిక ప్రేమ కేవలం బ్రాహ్మణ పిల్లలైన మీకు మాత్రమే ఉంటుంది. మిమ్ములను మీరు ఆత్మ అని నిశ్చయము చేసుకుంటారు. అయితే ఆత్మయే పరమాత్మ అన్నప్పుడు ఆత్మ ఎవరి పై ప్రీతినుంచాలి? పిల్లలకు తండ్రి పై ప్రేమ, స్నేహము ఉంటుంది. తండ్రికి, తండ్రి పై ప్రేమ ఉండదు. ఆత్మలమైన మనము మన పరమపిత పరమాత్మునితో ప్రేమను జోడిస్తున్నామని మీకు తెలుసు. ఈ ప్రేమయే మిమ్ములను జతలో తీసుకెళ్తుంది. మీరు తండ్రి పై ఆత్మిక ప్రేమను ఉంచినప్పుడు కష్టాలను కూడా సహించాల్సి వస్తుంది. మొత్తం ప్రపంచములోని వారు, ఇంటి బంధు-మిత్రులు కూడా శత్రువులైపోతారు.
పతితపావని గంగ కాదని పిల్లలకు అర్థం చేయించబడింది. మనుష్యులు పావనంగా అవ్వాలని గంగ, యమునా నదీ తీరాలలో హరిద్వారము, కాశీలకు వెళ్లి కూర్చుంటారు. ఈ రెండే ముఖ్యస్థానాలు. ''ఓ పతిత పావని గంగా'' అని అంటారు. కాని ఇప్పుడు ఆ గంగ ఏమీ వినదు. వినేవారు ఒక్క పతితపావనుడైన తండ్రి మాత్రమే. మీరిప్పుడు ఆ తండ్రి సన్ముఖములో కూర్చుని ఉన్నారు. మీరు పావనంగా ఎలా అవుతారో తండ్రి తెలియజేస్తున్నారు. సదా నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయని నీటి గంగ చెప్పజాలదు. మీరు నన్ను స్మృతి చేస్తే మీ కర్మలు వినాశనమౌతాయని తండ్రి ప్రతిజ్ఞ చేస్తున్నారు, గ్యారంటీనిస్తున్నారు. గంగ ఇలా గ్యారంటీ ఇవ్వజాలదు, పావనంగా చేయలేదు. ఏ విధంగా మనుష్యులు ప్రతి సంవత్సరము రావణుని కాలుస్తున్నా మరణించడము లేదో, అలాగే జన్మ-జన్మల నుండి గంగా స్నానము చేస్తూ వచ్చినా పతితుల నుండి పావనంగా ఎవ్వరూ కాలేదు. మళ్ళీ మళ్ళీ స్నానము చేయడానికి వెళ్తారు. ఒక్కసారి పావనమైయుంటే తిరిగి స్నానము చేసేందుకు ఎందుకు వెళ్తారు? ఎన్ని మేళాలు జరుగుతాయి. వాటిని ఆత్మ-పరమాత్మల మిలనము అని అనరు. భక్తిమార్గములో మేళాలకు ఎంతోమంది వస్తారు. మీరిప్పుడు తండ్రితో బుద్ధియోగాన్ని జోడిస్తున్నారు. ఆత్మలైన మనము ప్రేయసులుగా అయ్యామని మీకు తెలుసు. ఆత్మయే శరీరము ద్వారా భగవంతుని స్మృతి చేస్తుంది. నేను కూడా ఈ శరీరము ద్వారా చదివిస్తున్నానని బాబా అంటారు. కనుక సదా తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. బాబా అని అంటూనే స్వర్గము మరియు ఇల్లైన ముక్తిధామము గుర్తుకు వస్తుంది. ముక్తిని నిర్వాణధామమని కూడా అంటారు.
ఇది సాకార ప్రపంచము. ఎంతవరకు ఆత్మలు ఇక్కడకు రావో అంతవరకు సాకార ప్రపంచము ఎలా వృద్ధి అవుతుంది? ఆత్మలు నిరాకార ప్రపంచము నుండి వస్తాయి. మనుష్య సృష్టి పెరుగుతూ ఉంటుంది. సహజంగానే పెరుగుతూ ఉంటుందని కొందరు భావిస్తారు. ఆత్మలు ఇక్కడకు వస్తుంటాయి. వృద్ధి అవుతూ ఉంటుందని మీకు తెలుసు. మధురమైన ఇల్లు శాంతిధామమని పిల్లలకు తెలుసు. శాంతిని చాలామంది ఇష్టపడ్తారు. శాంతిధామం మన మధురమైన గాడ్ఫాదర్ ఇల్లని మీకు తెలుసు. భారతీయులు విదేశాల నుండి వాపస్ వచ్చినప్పుడు, మేము మా స్వీట్హోం అయిన భారతదేశానికి వెళ్తామని అంటారు. ఎక్కడ జన్మ తీసుకుంటారో ఆ దేశము చాలా ప్రియమనిపిస్తుంది. మమ్ములను మా స్వీట్హోమ్కు(మధురమైన ఇల్లు, భారతదేశానికి) తీసుకెళ్ళండని అంటారు. మరణించారనుకోండి, ఆత్మ వెళ్ళిపోతుంది. శరీరాన్ని ఇక్కడకు తీసుకొచ్చి సమాప్తం చేస్తారు. భారతదేశపు మన్ను భారతదేశములోనే కలిసిపోవాలని భావిస్తారు. నెహ్రూ మరణించినప్పుడు వారి బూడిదను ఎక్కడెక్కడికో తీసుకెళ్ళారు! పొలాలలో కూడా వేసారు. దీని ద్వారా మంచి ఫలితము లభిస్తుందని భావించారు. ఎవరెంత గౌరవమిచ్చినా ప్రతీ వస్తువు పాతది అవ్వనే అవ్వాలి. ఎన్ని కష్టాలు సహించవలసి వస్తుంది. బాబా పరిచయమే లేదు. మీరు తండ్రిని తెలుసుకొని తండ్రి నుండి వారసత్వము పొందుతున్నారు. బంధు-మిత్రులను కూడా స్వర్గవాసులుగా చేయాలనిపిస్తుంది. మీరు స్వర్గవాసులవ్వండని ఎవరికైనా చెప్తే మమ్ములను చంపాలనుకుంటున్నారా! అని అంటారు. శ్రీమతానుసారము మనము స్వర్గవాసులౌతున్నామని పిల్లలకు తెలుసు. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు చాలా శ్రమించాలి. పదే పదే దేహాభిమానానికి వశులై తండ్రిని మర్చిపోతారు. ఇప్పుడు మీరు సన్ముఖములో కూర్చుని ఉన్నారు. మనము మన పరమపిత పరమాత్మ వద్దకు వచ్చామని మీకు తెలుసు. ఇంతక్రితము ఎప్పుడైనా నన్ను కలిశారా? అని బాబా అడుగుతారు. వెంటనే, అవును 5 వేల సంవత్సరాల క్రితము వచ్చామని అంటారు. ఇది మీ గుప్తమైన పదము. దీనిని ఇంకెవ్వరూ కాపీ చేయలేరు. భలే వారు కృష్ణుని దేహమును ధరించి స్వర్గ స్థాపన చేసేందుకు వచ్చామని అంటారు. కాని 5 వేల సంవత్సరాల క్రితము కూడా స్వర్గ స్థాపన చేశామని అనలేరు. మీరు మాత్రమే - ''బాబా, 5 వేల సంవత్సరాల క్రితము మేము మీ నుండి వారసత్వము తీసుకునేందుకు వచ్చామని అనలేరు. మీరు రాజయోగమును నేర్పించారని మీరు మాత్రమే అంటారు. ఈ మాటలు ఆత్మ శరీరము ద్వారా చెప్తుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకొని తండ్రిని స్మృతి చేయాలి. ఇందులో సర్వవ్యాపి మాటే లేదు. బ్రహ్మ తప్పకుండా సాకారములో ఉండాలని వారి ద్వారానే పరమపిత పరమాత్మ సృష్టిని రచిస్తారని కూడా భావించరు.
పతితపావనుడైన తండ్రియే వచ్చి పావన దేవీ దేవతలుగా తయారు చేస్తారు. తండ్రియే స్వర్గ రచయిత కావున స్వర్గములో తప్పకుండా మనుష్యులే ఉండాలి. బాబా వచ్చి మీకు స్వర్గ ద్వారమును తెలియజేస్తున్నారు. నరకవాసులను స్వర్గవాసులుగా చేసేందుకు మీరు ప్రయత్నిస్తారు. ఎవరైనా పెద్ద వ్యక్తులను నేరుగా - మీరు పతితులని, నరకవాసులని అంటే ఎంతగా ఎగిరిపడతారు. మనము నరము నుండి విడుదలై స్వర్గములోకి వెళ్తున్నామని మీకు తెలుసు. ఇప్పుడు మనము సంగమవాసులము...... ఈ శరీరాన్ని వదిలి బాబా వెంట తండ్రి ఇంటికి వెళ్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఇది మీ ఆత్మిక యాత్ర. బాబా స్మృతిలో ఉండాలి. ఈ శరీరము ఉన్నంత వరకు ఈ యాత్ర కొనసాగుతుందని మీరు అర్థము చేసుకున్నారు. కర్మ కూడా చేయాలి. భలే తినండి, త్రాగండి, వంట చేయండి. ఎంత సమయము లభిస్తే అంత సమయం ఆ తండ్రిని స్మృతి చేయాలి. కార్యాలయము (ఆఫీసు)లో కూర్చున్నా ఖాళీ సమయం లభిస్తే తండ్రి స్మృతిలో కూర్చుండిపోవాలి. అందులో చాలా సంపాదన ఉంది. రైలులో ప్రయాణము చేయు సమయంలో ఇతర ఏ పనీ ఉండదు. కూర్చుని తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఇప్పుడు మనము బాబా వద్దకు వెళ్తాము, మనలను తీసుకెళ్లేందుకు బాబా పరంధామము నుండి వచ్చారు. మంచిది. సాయంకాల సమయంలో వంట చేయునప్పుడు కూడా పరస్పరము బాబా స్మృతిని కలిగించుకోండి. రండి, మనము మన తండ్రి స్మృతిలో కూర్చుంటామని అనండి. ఒకరికొకరు పాయింట్లను కూడా వినిపించండి. మనము స్వదర్శన చక్రధారులము. బాబా చెప్తున్నారు - మీరు లైట్హౌస్లు కూడా. మార్గాన్ని తెలియజేస్తారు. మీరు లేస్తూ-కూర్చుంటూ, తిరుగుతూ ఉండే లైట్హౌస్లు. ఒక కంటిలో ముక్తి, మరొక కంటిలో జీవన్ముక్తి ఉంటుంది. స్వర్గము ఇక్కడే ఉండేది. ఇప్పుడు లేదు. ఇప్పుడిది నరకంగా ఉంది. బాబా మళ్లీ స్వర్గ స్థాపన చేస్తున్నారు. నేను మిమ్ములను చాలా మంచి సుగంధభరిత పుష్పాలుగా చేస్తానని బాబా అంటున్నారు. మళ్లీ మీరు వెళ్లి మహారాణులుగా, పట్టపు రాణులుగా అవుతారు. ఖద్దరు రాణులుగా అవ్వకండి. మీరు 16 కళా సంపన్నులుగా అవ్వాలి, 14 కళల వారిగా అవ్వరాదు. శ్రీ కృష్ణుడు 16 కళా సంపూర్ణుడు. పిల్లలైన మీరు ఎన్ని వ్రతాలు, నోములు చేసేవారు. 7 రోజులు నిర్జలముగా(నీరు త్రాగకుండా) ఉండేవారు, ఎంత కష్టపడేవారు. అయినా కృష్ణపురికి వెళ్ళలేకపోయారు. ఇప్పుడు మీరు స్వర్గమైన కృష్ణపురిలో ప్రాక్టికల్(వాస్తవికము)గా వెళ్లేందుకు పురుషార్థము చేస్తున్నారు. కృష్ణుడిని ద్వాపరములోకి తీసుకెళ్ళినందున స్వర్గము గురించి ఎవ్వరికీ తెలియదు. వాస్తవానికి 7 రోజుల అర్థమేమిటో మీకిప్పుడు తెలుసు. ఒక్క తండ్రిని తప్ప మరెవ్వరినీ స్మృతి చేయరాదు. అంతేకాని నీరు లేకుండా ఉండమని కాదు. బాబాను స్మృతి చేయడం ద్వారా మీరు బాబా వద్దకు వెళ్ళిపోతారు. తండ్రి మళ్లీ స్వర్గములోకి పంపేస్తారు. వ్రతాలు - నోములు చేస్తూ మీరెన్ని రోజులు ఆకలితో ఉంటారు! జన్మ-జన్మలుగా ఎంత శ్రమ చేస్తూ ఉంటారు! ప్రాప్తి ఏమీ లభించలేదు. ఇప్పుడు మిమ్ములను వాటి నుండి విడిపించి సద్గతి మార్గములోకి తీసుకెళ్తారు. బాబా! కల్పక్రితము కూడా స్వర్గ వారసత్వము తీసుకునేందుకు మిమ్ములను కలుసుకున్నామని మీరు అంటారు. అడుగడుగులో సలహా తీసుకుంటూ ఉండమని తండ్రి అంటారు. అన్ని లెక్కలు అడగండి అని బాబా అంటారు. తండ్రి సలహాను ఇస్తూ ఉంటారు. భలే మీరు మీ వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేసుకుంటూ ఉండండి. అయినా బాబా సలహా ఇస్తూ ఉంటారు. వీరు చాలా తమ వ్యాపార-వ్యవహారాలలో మునిగి ఉన్నారని గమనిస్తే ఎందుకు ఇంతగా తల కొట్టుకుంటారు(కష్టపడ్తారు)? ఎంత సమయము మీరు జీవిస్తారు? అని బాబా సలహానిస్తారు. కడుపు, ఒకటి - రెండు రొట్టెలను మాత్రమే అడుగుతుంది. వాటితోనే పేదవారూ గడిపేస్తారు, ధనవంతులూ జీవిస్తారు. షాహుకార్లు బాగా తింటారు, అలాగే బాగా రోగులుగా కూడా అవుతారు. అడవి మనుష్యులను చూడండి ఎంత దృఢంగా ఉంటారు, వారు తినేదేమిటి? ఎంతగా పని చేస్తారు! తమ గుడిసెలలో వారు సంతోషంగా ఉంటారు. కావున మీరిప్పుడు ఇతర అన్ని ఆశలను వదిలేయాలి. రెండు రొట్టెలు దొరికితే కడుపు నిండితే చాలు, తండ్రిని స్మృతి చేయాలి. మీరు ఆత్మిక పిల్లలు. ప్రియుడైన పరమపిత పరమాత్ముని ప్రేయసులు. ఎంతెంత తండ్రిని స్మృతి చేస్తారో అంతంత వికర్మలు వినాశనమౌతాయి. అంతేకాక ఎవరిని స్మృతి చేస్తారో వారితో వెళ్లి కలుసుకుంటారు. సాక్షాత్కారాలు జరగాలని, ఇది జరగాలి....... అని చాలా మంది అనుకుంటారు. ఇంట్లో కూర్చుని కూడా మీకు జరగవచ్చని బాబా చెప్తారు. శివబాబాను స్మృతి చేయడం ద్వారా మీకు వైకుంఠ సాక్షాత్కారమౌతుంది. కృష్ణపురిని చూస్తారు. ఇక్కడైతే బాబా మిమ్ములను వైకుంఠానికి అధిపతులుగా చేసేస్తారు. '' కేవలం సాక్షాత్కారాల విషయం కాదు. నేను మిమ్ములను తీసుకెళ్లేందుకు వచ్చాను కనుక నన్ను స్మృతి చేయండి.'' శివబాబాను స్మృతి చేయాలి. వారే కృష్ణపురికి అధిపతులుగా చేస్తారు. కృష్ణుడైతే తయారు చేయడు. శివబాబాను స్మృతి చేయడం ద్వారా మీకు వైకుంఠ సామ్రాజ్యం లభిస్తుంది. వారిప్పుడు పరంధామము నుండి వచ్చారు. తప్పకుండా వచ్చారు కనుకనే స్మృతిచిహ్న మందిరాలు తయారయ్యాయి కదా. శివుని మందిరాలున్నాయి. శివజయంతిని కూడా ఆచరిస్తారు కదా. కాని వారు భారతదేశములో ఎలా వస్తారో ఎవ్వరికీ తెలియదు! కృష్ణుని తనువులోకి అయితే రారు. కృష్ణుడు సత్యయుగములో ఉంటాడు. శివుని చాలా పెద్ద మందిరముంది. కృష్ణునికి అంత పెద్ద మందిరము లేదు. సోమనాథ మందిరము ఎంత పెద్దది! కృష్ణమందిరములో రాధా-కృష్ణులకు చాలా ఆభరణాలను చూపిస్తారు. శివమందిరములో ఎప్పుడూ ఆభరణాలను చూడరు. అంటే శివబాబా పెద్ద మహళ్ళలో ఉండరు, శ్రీకృష్ణుడు ఉంటాడు. బాబా చెప్తున్నారు - నేను మహళ్ళలో ఉండనే ఉండను. కాని భక్తిమార్గములో ఎంత సుందరమైన వైభవోపేతమైన వజ్ర వైడూర్యాలతో మందిరాలను నిర్మించారు. ఎవరికైతే శివబాబా ద్వారా స్వర్గ వారసత్వము లభించిందో వారు శివుని కొరకు అంత ఉన్నతమైన పెద్ద మందిరాన్ని నిర్మించారు. స్మృతిచిహ్నము కొరకు ఎంత పెద్ద మరదిరాన్ని నిర్మించారు! అంటే కట్టించినవారు స్వయం ఎంత ధనవంతులుగా ఉంటారు! మందిరాలను చాలా బాగా నిర్మిస్తారు. బొంబాయిలో బబూరీనాథ్లో శివుని మందిరముంది. మాధవభాగ్లో లక్ష్మీనారాయణుల మందిరముంది. నేను మిమ్ములను స్వర్గాధిపతులుగా చేస్తానని బాబా చెప్తున్నారు. భక్తిమార్గములో మీరెంత పెద్ద మందిరాలను తయారు చేస్తారు. కాని ఇప్పుడు చూడండి, ఎటువంటి గుడిసెలో కూర్చుని ఉన్నాను. మీ పేరు కూడా ప్రసిద్ధమౌతుంది. మన మందిరాలు కూడా తయారవుతాయని మీకు తెలుసు. మన తండ్రి శివునికి కూడా చాలా మందిరాలున్నాయి. ఇది అద్భుతము. ఎవరైతే సోమనాథ మందిరాన్ని కట్టించారో, వారు ఎంత ధనవంతులై ఉండవచ్చు! ఇప్పుడెంత గుప్తంగా ఉన్నాను. ఎవ్వరికీ తెలియదు. మళ్లీ శివబాబా మందిరాన్ని ఎలా నిర్మించవలసి ఉంటుందో మీరు తెలుసుకున్నారు. భక్తిమార్గములో వస్తారు. మమ్మా-బాబాలు ఎవరైతే మొదటి నెంబరులో పూజ్యులుగా అవుతారో, వైకుంఠాధిపతులుగా అవుతారో తిరిగి వారే మొట్టమొదట పూజారులుగా అయ్యి మందిరాలను కూడా వారే తయారు చేయాలి. కనుక మేము పూజారులుగా అయ్యి మందిరాలను నిర్మిస్తామని మనసులో భావిస్తారు కదా. ఇటువంటి విషయాలు రమణము(స్మరణ) చేస్తూ ఉంటే పాత ప్రపంచాన్ని మర్చిపోతారు. పరస్పరము కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మీకు చాలా సంతోషము కలుగుతుంది. మీతో మీరే ఆత్మిక సంభాషణ చేసుకోండి.
పరమ ఆత్మ కూర్చుని మీ ఆత్మను సంతోషపరుస్తారు. ఈ జ్ఞానముతో హర్షితంగా తయారు చేస్తారు. కల్పము తర్వాత మళ్లీ వచ్చి కలిశామని మీరంటారు. అనేకమార్లు తండ్రితో కలిశాము, వారసత్వము పొందాము. ఇలా మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. మీరు కర్మయోగులు కూడా. భలే ఇంట్లో అన్నము మొదలైనవి వండుతున్నా సంతోషముంటుంది. మీకు 84 జన్మల చరిత్ర- భూగోళాలు తెలుసు. ఇప్పుడు మనము బ్రాహ్మణులుగా అయ్యాము. మళ్లీ దేవతలుగా అయ్యి రాజ్యము చేస్తాము పూజారుల నుండి పూజ్యులుగా అవుతాము. మళ్లీ మహళ్ళు మొదలైనవి నిర్మిస్తాము. మీ చరిత్ర-భూగోళాలను వినిపిస్తూ ఉండండి. మన చరిత్ర-భూగోళాల చక్రము ఎలా తిరుగుతూ ఉంటామో తెలుసుకున్నవారిని స్వదర్శన చక్రధారులని అంటారు. మీరు మూడు లోకాలను తెలుసుకున్నవారు, మీ జ్ఞాన మూడవ నేత్రము తెరవబడింది. ఈ చక్రాన్ని స్మృతి చేస్తూ ఉంటే మీకు చాలా సంతోషము కలగాలి. తండ్రికి కూడా ఖుషీ సంతోషముంటుంది. ఇప్పుడు మీరు సేవలో ఉపస్థితులై ఉన్నారు. సేవధారులైన మీ మందిరాలు మళ్లీ భక్తిమార్గములో తయారవుతాయి. నేనిప్పుడు పిల్లల సర్వీసుకై వచ్చాను. మీకు పూర్తి స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చాను. ఎవరెంత పురుషార్థము చేస్తారో, దాని అనుసారంగా స్వర్గాధిపతులుగా అవుతారు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. నడుస్తూ, తిరుగుతూ లైట్ హౌస్లుగా అయ్యి అందరికీ దారి చూపించాలి. అన్ని ఆశలను వదిలి ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. తండ్రి నుండి సలహా తీసుకుంటూ ఉండాలి.
2. జ్ఞాన విషయాలలోనే రమిస్తూ ఉండాలి. మీతో మీరే మాట్లాడుకుంటూ ఉండాలి. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ సదా హర్షితంగా ఉండాలి.
వరదానము :-
''శ్రేష్ఠ స్వమానమనే సీటు పై ఉండి అందరికీ సన్మానమిచ్చే అందరికి మాననీయ భవ(గౌరవనీయులవ్వండి)''
సదా మీ శ్రేష్ఠ స్వమానంలో స్థితమై ఉంటూ నిరహంకారులుగా అయ్యి అందరికి గౌరవమిస్తూ ఉండండి. ఈ ఇవ్వడమే తీసుకోవడమవుతుంది. గౌరవమివ్వడం అనగా ఆ ఆత్మను ఉల్లాస - ఉత్సాహములోకి తీసుకొచ్చి ముందు ఉంచడం. సదా స్వమానంలో ఉంచుట వలన సర్వ ప్రాప్తులు స్వతహాగా కలుగుతాయి. స్వమానం కారణంగా విశ్వము సన్మానమిస్తుంది. అందరి ద్వారా గౌరవము లభించేందుకు పాత్రులుగా, మాననీయులుగా అవుతారు.
స్లోగన్ :-
''ఎవరైతే అందరికి గౌరవమునిస్తారో, వారి రికార్డు స్వతహాగా బాగుంటుంది''