26-10-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - శ్రీమతమును అనుసరిస్తే మీ ఖజానాలన్నీ నిండిపోతాయి. మీ భాగ్యము ఉన్నతంగా అయిపోతుంది ''

ప్రశ్న :-

ఈ కలియుగంలో ఏ విషయంలో దివాలా తీయడం జరిగింది ? దివాలా తీయడంలో దీని పరిస్థితి ఎలా తయారయ్యింది ?

జవాబు :-

కలియుగంలో పవిత్రత-సుఖ-శాంతులు దివాలా తీశాయి, కనుక భారతదేశము సుఖధామము నుండి దు:ఖధామంగా, వజ్రము నుండి గవ్వ సమానవంగా అయిపోయింది. ఈ ఆట అంతా భారతదేశం పైనే ఉంది. ఈ ఆట యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము ఇప్పుడు మీకు తండ్రి వినిపిస్తున్నారు. అదృష్టవంతులైన, సౌభాగ్యవంతులైన పిల్లలే ఈ జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకోగలరు.

పాట :-

భోలానాథునికి సాటి అయినవారు,............ (భోలే నాథ్‌ సే నిరాలా జౌర్‌ కోయీ నహీ,..........)   

ఓంశాంతి.

భగవానువాచ. ఏ భగవానుడు? భోలానాథుడైన భగవానువాచ. తండ్రి కూడా అర్థం చేయిస్తారు, అయితే అర్థము చేయించడం టీచర్‌ పని, సద్గురువు పని కూడా. శివబాబాయే సత్యమైన తండ్రి, వారిని భోలానాథుడని అంటారు. శంకరుని భోలా అని అనరు. అతడు కన్ను తెరిచాడు. దానితో సృష్టినంతటిని భస్మము చేసేశాడు అని శంకరుని గురించి చెప్తారు. భోలాభండారి అని శివుడినే అంటారు. అనగా ఖజానాలను సంపన్నముగా చేసేవారు. అది ఏ ఖజానా? ధనము- సంపద, సుఖ-శాంతుల ఖజానాలు. పవిత్రత మరియు సుఖ-శాంతుల ఖజానాను సంపన్నంగా చేసేందుకే తండ్రి వచ్చారు. కలియుగములో పవిత్రత, సుఖ-శాంతులు దివాలా తీశాయి. ఎందుకంటే రావణుడు శపించాడు. అందరూ శోకవాటికలో ఏడుస్తూ, బాదుకుంటూ ఉంటారు. భోలానాథుడైన శివబాబా కూర్చొని సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు అనగా పిల్లలైన మిమ్ములను త్రికాలదర్శులుగా చేస్తారు. డ్రామాను గూర్చి అయితే ఇంకెవ్వరికీ తెలియదు. మాయ పూర్తిగా బుద్ధిహీనులుగా చేసేసింది. ఈ సుఖ-దు:ఖాల, ఓటమి-గెలుపుల ఆట భారతదేశముదే. భారతదేశం వజ్ర తుల్యంగా, సంపన్నంగా ఉండేది. ఇప్పుడు గవ్వ వలె నిరుపేదగా ఉంది. భారతదేశము సుఖధామంగా ఉండేది. ఇప్పుడు దు:ఖధామంగా ఉంది. భారతదేశము స్వర్గంగా ఉండేది. ఇప్పుడు నరకంగా ఉంది. మళ్ళీ నరకము నుండి స్వర్గంగా ఎలా తయారవుతుందో, దాని ఆదిమధ్యాంత జ్ఞానాన్ని జ్ఞానసాగరులు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ఇది కూడా బుద్ధిలో నిశ్చయముండాలి. ఎవరి భాగ్యమైతే తెరచుకోవలసి ఉంటుందో వారికే నిశ్చయము కలుగుతుంది. ఎవరైతే సౌభాగ్యశాలురుగా అవ్వనున్నారో వారికి నిశ్చయము కలుగుతుంది. అందరూ దుర్భాగ్యశాలురుగానే ఉన్నారు. దుర్భాగ్యశాలురు అనగా వారి భాగ్యము పాడైపోయి ఉంది. భ్రష్టాచారులుగా ఉన్నారు. తండ్రి వచ్చి శ్రేష్ఠాచారులుగా తయారుచేస్తారు. కాని ఆ తండ్రిని కూడా కొందరు మాత్రమే కష్టంగా అర్థము చేసుకోగలరు. ఎందుకంటే వారికి దేహం లేదు. పరమ ఆత్మ మాట్లాడ్తారు. పావనాత్మలు సత్యయుగంలోనే ఉంటాయి. కలియుగంలో అందరూ పతితులుగా ఉన్నారు. అనేక మనోకామనలతో జగదంబ వద్దకు వెళ్తారు. వారికి ఏమీ తెలియదు. అయినా ఏ ఏ భావనలతో పూజ చేస్తారో దాని అనుసారంగా వారికి అల్పకాలికంగా, క్షణభంగుర ఫలాన్ని ఇచ్చేస్తాను. జడ విగ్రహాలు ఎప్పుడూ ఫలితాన్ని ఇవ్వజాలవని తండ్రి చెప్తున్నారు. ఫలమును ఇచ్చేవాడిని, అల్పకాలిక సుఖమును ఇచ్చేవాడిని కూడా నేనే. అంతేకాక అనంతమైన సుఖమునిచ్చే దాతను కూడా నేనే. ''నేను దు:ఖదాతను కాను, నేను దు:ఖహర్త-సుఖకర్తను''. సుఖధామంలో స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు మీరు వచ్చారు. ఇందులో చాలా పథ్యము ఉంది. ఆదిలో సుఖము ఉంది. ఆ తర్వాత మధ్యలో మళ్ళీ భక్తిమార్గం ప్రారంభమౌతుంది. కావున సుఖము పూర్తి అయ్యి దు:ఖము మొదలవుతుంది. దేవీదేవతలు మళ్ళీ వామమార్గం లేక మధువు, మధ్యము, మాంసములు సేవిస్తూ మిదునత్వముతో పూజిస్తూ వికారాలలో పడిపోతారు. అక్కడ నుండే మళ్ళీ భక్తి ప్రారంభమవుతుందని బాబా అర్థం చేయిస్తారు. ఆదిలో సుఖము ఉంటుంది. మధ్యలో దు:ఖము ప్రారంభమౌతుంది. అంతిమంలో మహాదు:ఖము ఉంటుందని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు నేనే మీరు సుఖధామంలోకి వెళ్ళేందుకు మిమ్ములను తయారు చేస్తున్నాను. మిగిలిన వారంతా లెక్కాచారాలను తీర్చుకుని శాంతిధామములోకి వెళ్లిపోతారు. శిక్షలైతే ఎన్నో అనుభవిస్తారు. ట్రిబ్యునల్‌ కూడా కూర్చుంటుంది. కాశిలో కూడా బలిహారమవుతారు. కాశీ కల్వట్‌(కత్తుల బావిలో దూకుట) అని అంటారు కదా కాని బాబా అర్థం చేయించారు. ఇప్పుడు కాశీలో శివుని మందిరం ఉంది. అక్కడ భక్తిమార్గంలో శివబాబా స్మృతిలో ఉంటారు. ఇప్పుడు ఇక మేము మీ వద్దకు వచ్చేస్తామని అంటారు. ఎంతగానో ఏడుస్తూ శివుని పై బలిహారమవుతారు. దానితో వారికి అల్పకాలికమైన క్షణభంగురమైన కొద్ది పాటి ఫలము లభిస్తుంది. ఇక్కడ మీరు బలి అవుతారు అనగా 21 జన్మల వారసత్వాన్ని పొందేందుకు వస్తూనే శివబాబాకు చెందివారిగా అవుతారు. జీవహత్య చేసుకొనే విషయమేదీ లేదు. జీవిస్తూనే బాబా నేను మీ వాడిని,..... అని అంటారు. అక్కడైతే వారు శివుని పై బలిహారమవుతారు, మరణిస్తారు. తద్వారా మేము ఆ శివబాబాకు చెందినవారిగా అయిపోతామని భావిస్తారు. కాని వారు ఇలా అవ్వరు. ఇక్కడైతే జీవిస్తూనే తండ్రికి చెందినవారుగా అవుతారు. బాబా ఒడిలోకి వస్తారు. మళ్ళీ తండ్రి శ్రీమతానుసారము నడవవలసి ఉంటుంది. అప్పుడే శ్రేష్ఠమైన దేవతలుగా అవ్వగలరు. ఇప్పుడు మీరు అలా అవుతున్నారు. కల్ప-కల్పము మీరు ఈ పురుషార్థము చేస్తూ వచ్చారు. ఇది క్రొత్త విషయమేమీ కాదు.

ప్రపంచం పాతబడ్తుంది. మళ్ళీ తప్పకుండా క్రొత్తదిగా అవ్వాలి కదా! భారతదేశము క్రొత్తదిగా, సుఖధామంగా ఉండేది. ఇప్పుడు పాతదిగా, దు:ఖధామంగా ఉంది. మనుష్యులు ఎంత రాతిబుద్ధి గలవారిగా అయిపోయారంటే వారు సృష్టి ఒక్కటే అన్నది అర్థం చేసుకోరు. అదే సృష్టి కేవలం క్రొత్తదిగా, పాతదిగా మారుతూ ఉంటుంది. మాయ బుద్ధికి తాళం వేసి పూర్తిగా తుచ్ఛబుద్ధి గలవారిగా చేసేసింది. అందుకే వారి కర్తవ్యమేమిటని తెలియకుండానే దేవతలను పూజిస్తూ ఉంటారు. దీనిని గుడ్డి నమ్మకము అని అంటారు. దేవతల పూజలో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారు. వారిని పూజించి, తినిపించి, త్రాగించి ఆ తర్వాత సముద్రంలో ముంచేస్తారు. కనుక ఇది బొమ్మల పూజయే కదా! దీని వల్ల లాభమేముంది? ఎంత ధూం-ధాం(ఆడంబరము)గా జరుపుతారు. ఎంత ఖర్చు చేస్తారు! వారము రోజుల తర్వాత శ్మశానములో పాతిపెట్టినట్లు, సముద్రములో, నదులలో ముంచేస్తారు. భగవానువాచ - ఇది ఆసురీ సంప్రదాయపు రాజ్యము. నేను మిమ్ములను దైవీ సంప్రదాయులుగా చేస్తాను. కొంతమందికి నిశ్చయము లభించడం కష్టము ఎందుకంటే సాకారములో చూడలేరు. ఆగాఖాన్‌ సాకారములో ఉండేవారు. అతనికి అనేకమంది అనుచరులు ఉండేవారు. అతనిని బంగారు, వజ్రాలతో తులాభారం చేసేవారు. ఏ చక్రవర్తికి కూడా అంత మహిమ జరగదు. అయితే అతడు చేసిందేమీ లేదు. కనుక తండ్రి అర్థము చేయిస్తున్నారు - దీనిని అంధశ్రద్ధ అని అంటారు. ఎందుకంటే స్థిరమైన సుఖము లేదు కదా. చాలా మురికి అపవిత్రమైనవారు కూడా ఉంటారు. గొప్ప-గొప్ప వ్యక్తుల ద్వారా పెద్ద-పెద్ద పాపాలు జరుగుతాయి. తండ్రి చెప్తున్నారు - నేను పేదలపాలిటి పెన్నిధిని. పేదవారిచే అన్ని పాపాలు జరగవు. ఈ సమయంలో అందరూ పాపాత్మలుగా ఉన్నారు. ఇప్పుడు మీకు అనంతమైన తండ్రి లభించారు. అయినా మీరు వారిని ఘడియ-ఘడియ మర్చిపోతారు. అరే! మీరు ఆత్మయే కదా! ఆత్మను కూడా ఎప్పుడూ, ఎవ్వరూ చూడలేదు. ఒక నక్షత్రము వలె భృకుటి మధ్యలో ఉంటుందని భావిస్తారు. ఎప్పుడైతే ఆత్మ బయటకు వెళ్లిపోతుందో అప్పుడు శరీరము అంతమైపోతుంది. ఆత్మ నక్షత్రము వలె ఉంటుంది. కనుక తప్పకుండా ఆత్మలమైన మన తండ్రి కూడా మనలాగే ఉంటారు. కాని వారు సుఖసాగరులు, శాంతిసాగరులు, నిరాకారులు వారసత్వాన్ని ఎలా ఇస్తారు? కావున తప్పకుండా భృకుటి మధ్యలోకి వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు ఆత్మ జ్ఞానాన్ని ధారణ చేసి దుర్గతి నుండి సద్గతిలోకి వెళ్తుంది. ఎవరు చేస్తే వారు పొందుతారు. తండ్రిని స్మృతి చేయకుంటే వారసత్వాన్ని కూడా పొందలేరు. ఎవరైనా తమ సమానముగా వారసత్వాన్ని పొందేందుకు అర్హులుగా తయారు చేయకపోతే వారు పైసకు విలువ చేసే చిన్న పదవి పొందుతారని భావించడం జరుగుతుంది. శ్రేష్ఠాచారులు మరియు భ్రష్ఠాచారులు అని ఎవరిని అంటారో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. శ్రేష్ఠాచారులైన దేవతలు ఒకప్పుడు భారతదేశములోనే ఉండి వెళ్ళిపోయారు. హెవెన్లీ గాడ్‌ఫాదర్‌ అని గానము కూడా చేస్తారు. కాని హెవెన్లీ గాడ్‌ఫాదర్‌ ఎప్పుడు వచ్చి సృష్టిని స్వర్గంగా చేస్తారో వారికి తెలియదు. అది మీకు తెలుసు కాని పూర్తి పురుషార్థం చేయడం లేదు. అది కూడా డ్రామానుసారంగానే జరగుతుంది. ఎవరి భాగ్యములో ఎంత ఉంటే అంత పొందుతారు. బాబాను ఎవరైనా మేము ఏ పదవి పొందుతామని అడిగితే, మీరు ఈ విధంగా నడుచుకుంటూ శరీరాన్ని వదిలేస్తే మీరు ఫలానా పదవిని పొందుతారని బాబా చెప్తారు. కాని బాబాను అడిగే ధైర్యమును కూడా ఎవ్వరూ ఉంచరు. ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో వారు తాము అంధులకు చేతికర్రగా ఎంతవరకు అవుతున్నారో అర్థం చేసుకోగలరు. ఈ పిల్లలు మంచి పదవిని పొందుతారు. ఈ పిల్లలు ఏ సేవా చేయడం లేదు కావున అక్కడ కూడా దాస-దాసీలుగా అవుతారని బాబా అర్థం చేసుకుంటారు. ఇల్లు మొదలైనవి ఊడ్చేవారు. కృష్ణుని పాలన చేసేవారు, మహారాణిని అలంకరించే దాస-దాసీలు కూడా ఉంటారు కదా! వారు పావన రాజులు, వీరు పతిత రాజులు, కావున పతిత రాజులు, పావన రాజుల మందిరాలను నిర్మించి వారిని పూజిస్తారు కాని వారికి ఏమీ తెలియదు.

బిర్లా మందిరము ఎంత పెద్దగా ఉంది! లక్ష్మీనారాయణుల మందిరాలను ఎన్నో నిర్మిస్తారు! కాని అసలు ఈ లక్ష్మీనారాయణులు ఎవరో వారికి తెలియదు. మందిరాలు నిర్మించినందున ఎంత లాభం కలుగుతుందో తెలియదు. అల్పకాలిక సుఖము లభిస్తుంది. జగదంబ వద్దకు వెళ్తారు కాని ఈ జగదంబయే లక్ష్మిగా అవుతుందని వారికి తెలియదు. ఈ సమయంలో మీరు జగదంబ ద్వారా విశ్వములో ఉన్నవారి మనోకామనలన్నింటిని పూర్తి చేస్తున్నారు. విశ్వరాజ్యాన్ని తీసుకుంటున్నారు. జగదంబ మిమ్ములను చదివిస్తోంది. మళ్ళీ తానే లక్ష్మిగా అవుతుంది. ఆమెను ప్రతి సంవత్సరం వేడుకుంటారు. ఎంత తేడా ఉంది! లక్ష్మిని ప్రతి సంవత్సరము డబ్బును ఇవ్వమని వేడుకుంటూ ఉంటారు. మాకు కొడుకు కావాలి లేక రోగాల నుండి దూరం చేయమని లక్ష్మిని ఎప్పుడూ వేడుకోరు. లక్ష్మి నుండి కేవలం ధనాన్నే కోరుకుంటారు. లక్ష్మి పూజ అన్న పేరు కూడా ఉంది. జగదంబనైతే అనేక కోరికలు కోరుకుంటారు. ఆమె అన్ని మనోకామనలను పూర్తి చేస్తుంది. ఇప్పుడు మీకు స్వర్గ రాజ్యాధికారము జగదంబ ద్వారా లభిస్తుంది. లక్ష్మి ద్వారా ప్రతి సంవత్సరము ఎంతో కొంత ధన ఫలం లభిస్తుంది. అందుకే ప్రతి సంవత్సరము పూజిస్తారు. ఆమె ధనమునిచ్చే దేవత అని భావిస్తారు. ఆ ధనముతో మళ్ళీ పాపాలు చేస్తూ ఉంటారు. ఆ ధనమును పొందేందుకు పాపాలు కూడా చేస్తారు.

ఇప్పుడు పిల్లలైన మీకు అవినాశి జ్ఞాన రత్నాలు లభిస్తాయి. వీటి ద్వారా మీరు సంపన్నంగా అయిపోతారు. జగదంబ ద్వారా మీకు స్వర్గ రాజ్యాధికారం లభిస్తుంది. అక్కడ పాపమనేది ఉండదు. ఇవి ఎంతో అర్థం చేసుకోవలసిన విషయాలు! కొందరైతే మంచిరీతిగా అర్థం చేసుకుంటారు. కొందరు ఏ మాత్రం అర్థం చేసుకోరు. ఎందుకంటే వారి భాగ్యములోనే లేదు. శ్రీమతంను అనుసరించకపోతే శ్రేష్ఠులుగా అవ్వరు. మళ్ళీ పదభ్రష్టులుగా అయిపోతారు. మొత్తం రాజధాని అంతా స్థాపించబడుతోంది. ఇది అర్థం చేసుకోవాలి. భగవంతుడైన తండ్రి దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. మళ్ళీ భారతదేశము స్వర్గంగా అయిపోతుంది. దీనిని కళ్యాణకారి యుగము అని అంటారు. ఇది ఎక్కువలో ఎక్కువ(మాక్సిమమ్‌) 100 సంవత్సరాల యుగము. మిగిలిన యుగాలన్నిటికి 1250 సంవత్సరాలుంటాయి. అజ్మీర్‌లో వైకుంఠము యొక్క మాడల్‌ ఉంది. స్వర్గమెలా ఉంటుందో, అందులో చూపించారు. స్వర్గము తప్పక ఇక్కడనే ఉంటుంది కదా! కొద్దిగా విన్నా స్వర్గములోకి వచ్చేస్తారు. కాని చదవకపోతే అటవికులవంటివారే. ప్రజలు కూడా నెంబరువారీగా ఉంటారు కదా. కాని అక్కడ పేదవారికి, షాహుకార్లకు అందరికీ సుఖముంటుంది. ఇక్కడైతే అంతా దు:ఖమే దు:ఖము. భారతదేశము సత్యయుగంలో సుఖధామంగా ఉండేది. కలియుగంలో దు:ఖధామంగా ఉంది. ఈ ప్రపంచ చరిత్ర-భూగోళము పునరావృతమౌతాయి. భగవంతుడు ఒక్కరే. అలాగే ప్రపంచము కూడా ఒక్కటే. క్రొత్త ప్రపంచములో మొదట భారతదేశమే ఉంటుంది. ఇప్పుడు భారతదేశము పాతబడిపోయింది. అదే మళ్ళీ క్రొత్తగా తయారవ్వాలి. ఈ ప్రపంచ చరిత్ర-భూగోళము ఇదే విధంగా పునరావృతమౌతూ ఉంటుంది. ఇంకెవ్వరికీ ఈ విషయాల గురించి తెలియదు. అందరూ ఒకే విధంగా ఉండరు కదా! అక్కడ కూడా పదవులుంటాయి. అక్కడ సిపాయిలు ఉండరు. ఎందుకంటే అక్కడ భయం ఉండదు. ఇక్కడైతే భయముంది. అందుకే సిపాయిలు మొదలైనవారిని ఉంచుకుంటారు. భారతదేశాన్ని ముక్కలు, ముక్కలుగా చేసేశారు. కాని సత్యయుగంలో ఇలాంటి విభజన ఉండదు. లక్ష్మీనారాయణల రాజ్యము ఒక్కటే నడుస్తుంది. ఎలాంటి పాపమూ జరగదు. పిల్లలూ! నా మతమును అనుసరిస్తూ నా నుండి సదా సుఖ వారసత్వాన్ని తీసుకోండి అని తండ్రి అంటున్నారు. సద్గతి మార్గాన్ని చూపించేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇది శివశక్తి సైన్యము. ఈ సైన్యము భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తుంది. వీరు తమ తనువు-మనస్సు-ధనములన్నింటిని ఈ సేవలో వినియోగిస్తారు. ఆ బాపూజీ క్రైస్తవులను పారద్రోలాడు. అది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. కాని దాని వల్ల సుఖమేమీ లభించలేదు. ఇంకా దు:ఖము ఎక్కువ అయ్యింది. తినేందుకు అన్నమే లేదు. కాని ఇది లభిస్తుంది. ఇది జరుగుతుంది,..... అంటూ కోతలు కోస్తూ ఉంటారు. లభించేది కేవలం తండ్రి నుండి మాత్రమే. మిగిలినవన్నీ అంతమైపోతాయి. బర్త్‌కంట్రోల్‌(కుటుంబ నియంత్రణ) చేయండి అని అంటారు. దాని కొరకు ఎంతో కష్టపడ్తూ ఉంటారు. దాని వల్ల ఒరిగేదేమీ లేదు. ఇప్పుడు కాస్త యుద్ధం ప్రారంభమయ్యిందంటే కరువులు వచ్చేస్తాయి. పరస్పర కొట్లాటలు, జగడాలు జరుగుతాయి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. జీవించి ఉండే తండ్రికి బలిహారమవ్వాలి అనగా తండ్రికి చెందినవారిగా అయ్యి బాబా శ్రీమతం పైనే నడవాలి, మీ సమానంగా తయారు చేసే సేవ చేయాలి.

2. అవినాశి జ్ఞానరత్నాలను దానం చేసి జగదంబ సమానం సర్వుల మనోకామనలను పూర్తి చేసేవారిగా అవ్వాలి.

వరదానము :-

''ప్రతి విషయములో కళ్యాణముందని భావించి అచల్‌-అడోల్‌ మహావీర్‌గా అయ్యే త్రికాలదర్శీ భవ ''

ఏ విషయాన్నైనా ఏకకాల దృష్టితో చూడకండి, త్రికాలదర్శులుగా అయ్యి చూడండి. ఎందుకు? ఏమికి బదులు సదా ఏం జరుగుతూ ఉందో, అందులో కళ్యాణముందనే సంకల్పముండాలి. బాబా చెప్పింది చేస్తూ ఉండండి. తర్వాత బాబాకు తెలుసు, బాబా పనికి తెలుసు. బాబా ఎలా నడిపిస్తారో అలా నడుస్తూ ఉంటే అందులో కళ్యాణము నిండి ఉందనే నిశ్చయం నుండి ఎప్పుడూ డగ్‌మగ్‌ అవ్వకండి(చలించండి). సంకల్పము, స్వప్నములో కూడా వ్యర్థ సంకల్పాలు రాకూడదు. అప్పుడు అచల్‌-అడోల్‌ మహావీర్‌ అని అంటారు.

స్లోగన్‌ :-

''శ్రీమతము సూచించిన విధంగా ఒక సెకండులో న్యారా - ప్యారాగా అయ్యేవారే తపస్వీలు ''