19-12-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - సదా పాత్రులకే (అర్హులకే) దానము చేయాలి. సమయాన్ని వ్యర్థం చేయరాదు. వినే సమయములో వినే వారి వృత్తి (మనోభావాలు) ఎక్కడకు వెళ్తోంది అని ప్రతి ఒక్కరి నాడిని చూడండి ''

ప్రశ్న :-

పావన ప్రపంచములోకి వెళ్లేందుకు పిల్లలైన మీరు ఏ క్లిష్టమైన పథ్యాన్ని(పర్‌హేజ్‌) పాటిస్తున్నారు? మీ పథ్యము ఏది ?

జవాబు :-

గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండడమే అతి పెద్ద మరియు క్లిష్టమైన పథ్యము. పూర్తి అనంతమైన పాత ప్రపంచాన్ని త్యాగము చేయడమే మీ త్యాగము. ఒక కంటిలో మధురమైన ఇల్లు మరొక కంటిలో మధురమైన రాజధాని ఉంటుంది. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడరాదు - ఇది చాలా పెద్ద మరియు క్లిష్టమైన పథ్యము. దీని ద్వారా మీరు పావన ప్రపంచములోకి వెళ్లిపోతారు.

పాట :-

ధైర్యము వహించు మనసా!....................... ( ధీరజ్‌ ధర్‌ మనువా..........)   

ఓంశాంతి.

పాట విన్న వెంటనే పిల్లల ఖుషీ పాదరస మట్టము పెరిగిపోవాలి. ఎందుకంటే ప్రపంచములో చాలా దు:ఖముంది. మనుష్య మాత్రులందరూ నాస్తికులు. అంటే తండ్రిని గురించి తెలియదు. మీరిప్పుడు నాస్తికుల నుండి ఆస్తికులుగా అవుతున్నారు. మన సుఖమయమైన రోజులు వస్తున్నాయని పిల్లలైన మీకు తెలుసు. మీరు ఎక్కడకు వెళ్లినా మొదట బ్రహ్మకుమార-కుమారీలని మిమ్ములను ఎందుకు అంటారో మీ పరిచయమునివ్వండి. బ్రహ్మ ప్రజాపిత, అతడు శివుని పుత్రుడు. ఆ నిరాకారుడినే ఉన్నతాతి ఉన్నతమైన వాడని అంటారు. బ్రహ్మ-విష్ణు-శంకరులైతే వారి సంతానము. విష్ణువు మరియు శంకరులను ఎప్పుడూ ప్రజాపిత అని అనరు. ప్రజాపిత బ్రహ్మ సాకారములో ఇక్కడే ఉన్నారు. చూడండి, ఈ పాయింట్లను బాగా ధారణ చేయండి. లక్ష్మీనారాయణులను, రాధ-కృష్ణులను ప్రజాపిత అని అనరు. ప్రజాపిత బ్రహ్మ పేరు బాగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రజాపిత సాకారుడు. స్వర్గ రచయిత పరమపిత పరమాత్మ అయిన శివుడు. స్వర్గ రచయిత బ్రహ్మ కాదు. నిరాకార పరమాత్మయే వచ్చి ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్వర్గాన్ని రచిస్తారు. వారి పిల్లలైన మనము ఎంతోమంది ఉన్నాము. ఆత్మలైతే పరమపిత పరమాత్ముని సంతానము. అర్థం చేయించే పద్ధతి చాలా బాగుండాలి. వారు మాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని చెప్పండి. బ్రహ్మ ద్వారా సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థము చేయిస్తున్నారు. కనుక మొదట ఈ బ్రహ్మ వింటాడు. ఈ జగదంబ కూడా వింటుంది. మేము బి.కెలము. కన్య అంటే 21 కులాలను ఉద్ధరిస్తుందని, 21 జన్మలకు సుఖాన్నిస్తుందని మహిమ కూడా ఉంది. మనము పరమపిత పరమాత్మ నుండి సత్య, త్రేతా యుగాలలో 21 జన్మలకు సుఖము పొందేందుకు వారసత్వాన్ని తీసుకుంటున్నాము. సత్య-త్రేతా యుగాలలో తప్పకుండా భారతదేశము సదా సుఖంగా ఉండేది. పవిత్రత కూడా ఉండేది. కనుక వారు మన తండ్రి, ఇతడు దాదా(సోదరుడు). ఎవరి వద్ద అయితే ఇంతమంది పిల్లలుంటారో వారికి ఎటువంటి చింతా ఉండదు! వారికి ఎంతమంది పిల్లలున్నారు! బ్రహ్మ ద్వారా శివబాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఆ అనంతమైన తండ్రి నుండి మనకు వారసత్వము లభిస్తుంది. పూర్తి ప్రపంచమంతా పతితంగా ఉంది. దానిని పావనంగా చేయువారు ఒక్క తండ్రియే. పాత ప్రపంచాన్ని పరివర్తన చేయువారు స్వర్గ రచయిత అయిన ఆ సద్గురువే. తాను సర్వుల సద్గతిదాత. నూతన ప్రపంచములో లక్ష్మీనారాయణుల రాజ్యముంటుంది. భారతదేశములో దేవీ దేవతల రాజ్యమున్న సమయములో ఉన్న దేవతలే 84 జన్మలు తీసుకుంటారు. తర్వాత వర్ణాలను గురించి కూడా తెలియజేయాల్సి ఉంటుంది. మొదటే వారి నుండి సమయము తీసుకోవాలి. ఈ విషయాలను మనసు పెట్టి బాగా వినండి అని చెప్పాలి. బుద్ధిని భ్రమింపజేయకండి. అక్కయ్యలూ, అన్నయ్యలూ! మీరందరూ వాస్తవానికి శివసంతానులు అని చెప్పండి. ప్రజాపిత బ్రహ్మ అయితే పూర్తి వంశ వృక్షానికి పెద్ద(నాయకుడు). బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులైన మేము వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. యోగబలముతో విశ్వ రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటాము, బాహుబలముతో కాదు. మేము ఇల్లు-వాకిళ్ళను త్యజించము(వదలము). మేము మా ఇంటిలోనే ఉంటాము. ఇది మనుష్యులు దేవతలుగా అయ్యే పాఠశాల. మనుష్యులెవ్వరూ దేవతలుగా చేయలేరు. ఈ ప్రపంచమే పతిత ప్రపంచము. నీటి గంగ పతితపావని కాదు. పదే పదే అందులో స్నానము చేసేందుకు వెళ్తారు కాని పావనంగా అవ్వనే అవ్వరు. అలాగే రావణుని ఉదాహరణ కూడా ఉంది. ప్రతి సంవత్సరము రావణుని చిత్రాన్ని తగులబెడ్తూనే ఉంటారు కాని రావణుడు మరణించడు. ఈ రావణుని చిత్రము కలిగిన పోస్టరును కూడా మీరు తీసుకు వెళ్లాలి. ఏదైనా విశేష స్థానాలకు వెళ్లినప్పుడు ఆల్బమ్‌ను కూడా తీసుకెళ్లాలి. చూడండి, వీరంతా పిల్లలు. ఇవి పవిత్రంగా ఉంటామని వీరు చేసిన ప్రతిజ్ఞలు. వాస్తవానికి అందరూ బ్రహ్మ సంతానులే(పిల్లలే). ప్రజాపిత బ్రహ్మ ఈ వృక్షానికి పెద్ద. ఈ సమయములో మేము ప్రాక్టికల్‌గా బ్రహ్మకుమార-కుమారీలము. మీరు కూడా బ్రహ్మ సంతానమే. కాని మీరు గుర్తించడం లేదు. ఇప్పుడు ప్రపంచములో సత్యమైన బ్రాహ్మణుల్వెరూ లేరు. మేమే సత్యమైన బ్రాహ్మణులము. రాజ్యాన్ని కూడా మేమే పొందుతాము. తర్వాత ఇది బ్రాహ్మణుల వంశ వృక్షము. బ్రాహ్మణుల స్థానము శిఖ(పిలక, జుట్టు). కృష్ణుడు భగవంతుడు కాదని పిల్లలకు అర్థము చేయించబడింది. అతడు పూర్తి 84 జన్మలు తీసుకుంటాడు. 84 జన్మలు పూర్తి అవుతూనే మళ్లీ దేవతగా అవుతాడు. మరి అలా తయారుచేయువారు ఎవరు? తండ్రి తయారు చేస్తారు. మేముు వారి ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. ''ఏక్‌ ఓంకార్‌'' అని వారినే మహిమ చేస్తారు. వారు నిరాకారులు, నిరహంకారులు. వారే వచ్చి సేవ చేయవలసి ఉంటుంది. వారు పతిత ప్రపంచములో, పతిత శరీరములో వస్తారు. ఇప్పుడు అదే గీతా ఎపిసోడ్‌(భాగము, అధ్యాయము) పునరావృత్తమౌతోంది. మహాభారీ యుద్ధము జరిగింది. అందరూ దోమల వలె వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ సమయము అదే. పరమపిత పరమాత్మ శివభగవానువాచ - వారు రచయిత. స్వర్గములో లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. సృష్టిని సతోప్రధానంగా చేయడం ఒక్క తండ్రి కర్తవ్యమే. వారిని మనము బాబా - బాబా అని పిలుస్తాము. వారు తప్పకుండా వస్తారు. అందుకే శివరాత్రి కూడా ఉంది. దాని అర్థమును కూడా తెలియజేయాలి. పాయింట్లు నోట్‌ చేసుకొని ధారణ కూడా చేయాలి. పాయింట్లు బుద్ధిలో ఉండాలి. కన్యల బుద్ధి అయితే బాగుంటుంది. కుమారీల పాదాలను కడుగుతారు. కుమార-కుమారీలు ఇరువురూ పవిత్రంగా ఉంటారు. కాని కుమారీల పేరు అంతగా మహిమ ఎందుకు చేయబడ్తుంది. ఎందుకు? ఎందుకంటే ఇప్పటి మీ పేరు - ''కన్య.'' కన్య 21 కులాలను ఉద్ధారము చేసినందుకు గుర్తుగా మీకు అంతటి మహిమ నడుస్తూ వచ్చింది. మనము భారతదేశానికి ఆత్మిక సేవ చేస్తాము. మన ఉస్తాదు సహయోగి పరమపిత పరమాత్మ శివుడు. యోగబలముతో మనం వారి నుండి శక్తిని తీసుకుంటాము. దీని ద్వారా మనము 21 జన్మలకు సదా ఆరోగ్యవంతంగా అవుతాము. ఇది గ్యారెంటీ(నిశ్చితము, నిస్సందేహము) కలియుగములో అయితే అందరూ రోగులుగానే ఉన్నారు. ఆయువు కూడా తక్కువే. సత్యయుగములో అంత పెద్ద ఆయువు గలవారు ఎక్కడ నుండి వస్తారు? ఈ రాజయోగము ద్వారానే అంత పెద్ద ఆయువు గలవారిగా అవుతారు. అక్కడ అకాల మృత్యువు ఉండదు. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు. ఇది పాత శరీరము. శివబాబా స్మృతిలో ఉండి దేహ సహితముగా, దేహ సర్వ సంబంధాలను మర్చిపోవాలి. బుద్ధితో మనము బేహద్‌ త్యాగము చేస్తాము. ఇది బుద్ధియోగముతో చేసే ఆత్మిక యాత్ర. ఆ శారీరిక యాత్రలను మనుష్యులు నేర్పిస్తారు. బుద్ధి యాత్రను తండ్రి తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు. ఈ రాజయోగాన్ని నేర్చుకునేవారే స్వర్గములోకి వస్తారు. ఇప్పుడు మళ్లీ అంటు కట్టబడుతోంది. మనమంతా ఆ తండ్రి పిల్లలము. పిల్లలైన మనకు శివబాబా నుండి వారసత్వము లభిస్తుంది. ఈ దాదా(పెద్ద అన్న) కూడా శివబాబా నుండే ఆస్తిని తీసుకుంటాడు. మీరు కూడా అనంతమైన తండ్రి నుండి వారసత్వము తీసుకోండి. ఇది పెద్ద హాస్పిటల్‌(ఆసుపత్రి). 21 జన్మల వరకు ఎప్పుడూ రోగులుగా అవ్వము. మనము భారతదేశానికి సత్యమైన సేవ చేస్తున్నాము. అందుకే శివశక్తి సైన్యమని మహిమ ఉంది.

స్మృతి ద్వారా వికర్మలు వినాశనము చేసుకుంటే ఆత్మ శుద్ధమౌతుంది, జ్ఞాన ధారణ చేసుకుంటే మీరు చక్రవర్తి రాజులుగా అవుతారని తండ్రి చెప్తున్నారు. పవిత్రంగా అయితే లక్ష్మీ లేక నారాయణులను కూడా వరిస్తాము. సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులుగా ఇక్కడ అవ్వలేకపోతే ఆ లక్ష్మీనారాయణులను ఎలా వరిస్తారు? అందుకే లక్ష్మీనారాయణులను వరించేందుకు యోగ్యులుగా అయ్యామా? అని దర్పణములో చూసుకోమని చెప్తారు. పూర్తి నిర్మోహులుగా అవ్వలేదంటే లక్ష్మిని వరించలేరు. మళ్లీ ప్రజలలోకి వెళ్లిపోతారు. శివబాబా కూడా పరంధామము నుండి రావలసి పడ్తుంది. పతిత ప్రపంచములోకి వచ్చి పావనంగా చేసి వాపస్‌ తీసుకెళ్తారు. ఇక్కడ మనము చాలా పథ్యాన్ని కూడా పాటిస్తాము. ఒక కంటిలో మధురమైన ఇల్లు, మరొక కంటిలో మధురమైన రాజధాని ఉన్నాయి. పూర్తి ప్రపంచాన్నే త్యాగము చేస్తున్నాము. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉంటాము. మాది వానప్రస్థ అవస్థ అని వృద్ధులు భావిస్తారు. ముక్తిధామానికి వెళ్లేందుకు మనము పురుషార్థము చేయాలి. ఈ సమయములో అందరిదీ వానప్రస్థ అవస్థయే. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది. దు:ఖధామాన్ని మర్చిపోవాలి. ఇది బుద్ధితో చేసే త్యాగము. మనము ఈ పాత ప్రపంచాన్ని బుద్ధితో మరిచి క్రొత్త ప్రపంచాన్ని స్మృతి చేస్తాము. అప్పుడే అంతిమతే సో గతి అవుతుంది. ఇది చాలా పెద్ద ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. భగవానువాచ - ''రాజయోగాన్ని నేర్పించి మనుష్యులను దేవతలుగా తయారు చేస్తాను.'' ఈ విధంగా అందరికీ అర్థము చేయించాలి. మేము ఏది వింటున్నామో, అది మీరు కూడా కూర్చొని వినండి. మధ్యలో ప్రశ్నలు అడిగితే, ఆ ప్రవాహము తెగిపోతుంది. మేము మీకు పూర్తి సృష్టి చక్ర రహస్యాన్ని అర్థము చేయిస్తాము. ఈ డ్రామాలో శివబాబాకు ఏ పాత్ర ఉందో, ఈ లక్ష్మీనారాయణులు ఎవరో అందరి జీవిత గాథలను తెలియజేస్తాము. ప్రతి ఒక్కరి నాడిని చూడాలి. వింటున్నప్పుడు వారి వృత్తిని(భావాలను) గమనించాలి - బాగా వింటున్నారా లేక వేడి పెనము వలె కూర్చుని ఉన్నారా? అటు ఇటు దిక్కులు చూడడం లేదు కదా అని గమనించాలి. ఇక్కడ కూడా సన్ముఖములో కూర్చుని ఎవరు నాట్యము చేస్తున్నారో బాబా గమనిస్తారు. ఇది జ్ఞాన నృత్యము. ఆ పాఠశాలలైతే చిన్నవిగా ఉంటాయి. అక్కడ టీచరు అందరినీ బాగా చూడగలుగుతారు. నెంబరువారుగా కూర్చోపెట్టగలుగుతారు. కాని ఇక్కడ చాలామంది ఉన్నారు. నంబరువారుగా కూర్చోపెట్టలేరు. కావున వారి బుద్ధి ఎక్కడకూ పారిపోవడం లేదు కదా? అని గమనించాలి. వింటూ హర్షిస్తున్నారా? ఖుషీ మట్టము పెరుగుతున్నదా? ఏకాగ్రతతో వింటున్నారా? యోగ్యతను చూసి దానము చేయాలి. ఊరకే సమయాన్ని వ్యర్థము చేయరాదు. నాడిని చూసే తెలివి కూడా ఉండాలి. మనుష్యులు భయపడ్తారు. ముఖ్యంగా సింధు ప్రజలు - ఈ బి.కె.ల మాయాజాలము మాకు తగలకూడదని తలెత్తి కూడా చూడరు.

బ్రాహ్మణులైన మీరే త్రికాలదర్శులుగా అవుతారని శివబాబా అర్థము చేయిస్తారు. వర్ణాల రహస్యాన్ని కూడా అర్థము చేసుకోవాలి. ''హమ్‌ సో'' యొక్క అర్థమును కూడా తెలిపించాలి. ఆత్మలైన మనమే పరమాత్మ అని అనడం తప్పు. మళ్లీ కొందరు బ్రహ్మను కూడా అంగీకరిస్తారు. అహం బ్రహ్మస్మి అని అంటారు. మాయ అంటే పంచ వికారాలు. మేము బ్రహ్మమును నమ్ముతామని అంటారు. కాని బ్రహ్మము అంటే మహాతత్వము. అది మన నివాస స్థానము. ఎలాగైతే హిందూస్థాన్‌లో ఉన్నవారు తమది హిందూ ధర్మమని చెప్పుకుంటారో, అలా వారు కూడా బ్రహ్మతత్వమును తమదిగా భావిస్తారు. తండ్రి మహిమ భిన్నమైనది. సర్వ గుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు............. ఈ మహిమ దేవతలది. ఆత్మ శరీరములో ఉన్నప్పుడే దాని మహిమ జరుగుతుంది. ఆత్మయే పావనంగా, ఆత్మయే పతితంగా అవుతుంది. ఆత్మను నిర్లేపి అని అనరాదు. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర ఉంది. మరి అది నిర్ల్లేపి అని ఎలా అనగలరు?

ఇప్పుడు బాబా శాంతి స్థాపన చేస్తారు. పిల్లలైన మీరిప్పుడు తండ్రికి ఏమి బహుమానమిస్తారు? వారు మీకు 21 జన్మల స్వర్గ రాజధానిని బహుమతిగా ఇస్తారు. మీరు బాబాకు ఏమిస్తారు? ఎవరు ఎంతటి కానుకను తండ్రికి ఇస్తారో అంతే తండ్రి నుండి కూడా తీసుకుంటారు. మొట్టమొదట ఇతడు బహుమతినిచ్చాడు. శివబాబా అయితే దాత. రాజులు ఎప్పుడూ తమ చేతులతో తీసుకోరు. వారిని అన్నదాతలని అంటారు. మనుష్యులను దాత అని అనరు. భలే మీరు సన్యాసులు మొదలైనవారికి ఇచ్చినా ప్రతిఫలమును దాత అయిన శివబాబా ఇస్తారు. సర్వమూ ఈశ్వరుడే ఇచ్చాడు, ఈశ్వరుడే తీసుకుంటారని మహిమ చేస్తారు మరి ఎవరైనా మరణిస్తే ఎందుకు ఏడుస్తారు? నిజానికి వారు (ఈశ్వరుడు) ఎవ్వరినీ తీసుకపోరు అలాగే ఎవ్వరినీ ఇవ్వరు. ఆ లౌకిక తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తారు. పిల్లలు మరణిస్తే వారికే(ఆ తల్లిదండ్రులకే) దు:ఖము కలుగుతుంది. ఒకవేళ ఈశ్వరుడు ఇచ్చి, ఈశ్వరుడే తీసుకుంటే ఇక ఎందుకు దు:ఖపడాలి? తాను సుఖ-దు:ఖాలకు అతీతంగా ఉంటానని బాబా చెప్తున్నారు. ఈ దాదా తన సర్వస్వమూ ఇచ్చాడు కనుక పూర్తి బహుమతిని కూడా తీసుకుంటున్నాడు. కన్యల వద్ద అయితే ఏమీ ఉండదు. వారికి తల్లిదండ్రులిస్తే శివబాబాకు ఇవ్వవచ్చు. మమ్మా పేదరాలైనా ఎంత తీక్షణముగా వెళ్లిందో చూడండి! తనువు-మనసు-ధనముల ద్వారా సేవ చేస్తోంది.

మనము సుఖధామానికి శాంతిధామము ద్వారా(వయా) వెళ్తామని మీకు తెలుసు. తండ్రి వద్దకు వెళ్ళకుండా అత్తగారింటికి ఎలా వెళ్లగలుగుతాము. అమ్మగారి ఇంటిలో కూర్చుని ఉన్నారు. మొదట తండ్రి వద్దకు వెళ్లి తర్వాత అత్తగారింటికి వస్తాము. ఇది శోకవాటిక. సత్యయుగము ఆశోకవాటిక. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. ఈ వానప్రస్థావస్థలో బుద్ధితో మధురమైన ఇల్లు మరియు మధురమైన రాజధానిని స్మృతి చేయడం తప్ప మిగిలినవన్నీ మర్చిపోవాలి. పూర్తి నిర్మోహులుగా అవ్వాలి.

2. బుద్ధియోగము ద్వారా అనంతమైన త్యాగము చేసి ఆత్మిక యాత్ర చేయాలి. శ్రీమతమనుసారము పవిత్రంగా అయ్యి భారతదేశానికి సత్యమైన సేవ చేయాలి.

వరదానము :-

''మానసిక సంతోషము ద్వారా వ్యాధులను దూరంగా పారదోలే ఎవర్‌హెల్తీ భవ''

మనసు సంతోషంగా ఉంటే ప్రపంచమంతా సంతోషంగా ఉంటుందని అంటారు. మానసిక జబ్బు ద్వారా శరీరము కూడా భయంతో పాలిపోతుంది. మనసు బాగుంటే శారీరిక రోగం కూడా రోగంగా అనుభవమవ్వదు. శరీరము జబ్బుగా ఉన్నా మనసు ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే మీ వద్ద చాలా ఫస్ట్‌క్లాసైన సంతోషమనే పౌష్ఠికాహారము(ఖురాక్‌) ఉంది. ఈ పౌష్ఠికాహారము జబ్బును పారదోలుతుంది, మరపింపజేస్తుంది. కనుక మనసూ సంతోషమే, ప్రపంచమూ సంతోషమే అందువలన మీరు ఎవర్‌హెల్తీగా ఉంటారు.

స్లోగన్‌ :-

''సమయం యొక్క మహత్యాన్ని తెలుసుకుంటే, అన్ని ఖజానాలతో సంపన్నమైపోతారు''