22-12-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - ఈ పాఠశాలకు రావడం ద్వారా మీకు ప్రత్యక్ష ఫలము ప్రాప్తిస్తుంది, తండ్రి ఇచ్చే ఒక్కొక్క జ్ఞాన రత్నము లక్షల విలువ గల ఆస్తి''
ప్రశ్న :-
బాబా ఎక్కించే నషా ఎందుకు తేలికైపోతుంది? నషా సదా ఎక్కి ఉండేందుకు యుక్తి ఏది?
జవాబు :-
(బాబా వద్దకు వచ్చి తిరిగి) బాహ్యంలోకి వెళ్లి కుటుంబ పరివారము వారి ముఖాలను చూచినప్పుడు నషా తేలికైపోతుంది. ఇంకా నిర్మోహులుగా అవ్వలేదు. నషా సదా ఎక్కి ఉండేందుకు తండ్రితో ఆత్మిక సంభాషణ చేయడం నేర్చుకోండి. (బాబాతో ఇలా ఆత్మిక సంభాషణ చేయాలి) ''బాబా! మేము మీ వారిగా ఉండేవారము, మీరు మమ్ములను స్వర్గములోనికి పంపించారు, మేము 21 జన్మలు సుఖాన్ని అనుభవించి మళ్ళీ దు:ఖితులుగా అయ్యాము. ఇప్పుడు మేము మళ్ళీ సుఖ వారసత్వమును తీసుకునేందుకు వచ్చాము,.......... నిర్మోహులుగా అయినట్లయితే నషా ఎక్కి ఉంటుంది.
పాట :-
మరణించినా మీ దారిలోనే,................. (మర్నా తేరీ గలీమే,..................) 
ఓంశాంతి.
ఎవరి మాటలు విన్నారు? గోప-గోపికల మాటలు. ఎవరిని గురించి అన్నారు? పరమపిత పరమాత్మ అయిన శివబాబా గురించి. పేరు తప్పకుండా కావాలి కదా! ''బాబా! మీ కంఠహారముగా తయారయ్యేందుకు మేము జీవించి ఉంటూనే మీవారిగా అవుతాము. మిమ్ములనే స్మృతి చేయడం ద్వారా మేము మీ కంఠహారంగా అవుతాము'' అని అంటారు. రుద్రమాల అయితే ప్రసిద్ధమైనది. ఆత్మలందరూ రుద్రమాల అని తండ్రి అర్థం చేయించారు. అది జియాలాజికల్ మనుష్యుల వృక్షము. ఇది ఆత్మల వృక్షము. వృక్షములో విభాగాలు(సెక్షన్లు) కూడా ఉన్నాయి. దేవీదేవతల విభాగము, ఇస్లామీయుల విభాగము, బౌద్ధుల విభాగము. ఈ విషయాలు ఇంకెవ్వరూ అర్థము చేయించలేరు. గీతా భగవానుడు మాత్రమే వినిపిస్తారు. వారు జనన-మరణ రహితులు. వారిని అజన్ముడని చెప్పేందుకు వీలు లేదు. కేవలం జనన-మరణాలలోకి రారు. వారికి స్థూల, సూక్ష్మ శరీరాలు లేవు. మందిరాలలో కూడా శివలింగమునే పూజిస్తారు, వారినే పరమాత్మ అని అంటారు. దేవతల ఎదుటకు వెళ్లి వారిని మహిమ చేస్తారు. బ్రహ్మ పరమాత్మాయ నమ: అని ఎప్పుడూ అనరు. ఎల్లప్పుడూ శివుడినే పరమాత్మగా భావిస్తారు. శివపరమాత్మాయ నమ: అంటారు. (బాబా మూడులోకాల చిత్రాన్ని చూపిస్తూ చెప్పారు) అది మూలవతనము, దాని క్రింద సూక్ష్మ వతనము. ఇక ఇది స్థూల వతనము.
ఇక్కడ 'పరమాత్మ సర్వవ్యాపి' అను జ్ఞానము లేదని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. ఒకవేళ ఇతనిలో కూడా పరమాత్మ ఉన్నట్లయితే అప్పుడు ఇతడిని కూడా పరమాత్మాయ నమ: అని అనాలి. శరీరములో ఉన్నప్పుడు పరమాత్మాయ నమ: అని అనజాలరు. వాస్తవానికి మహాత్మ, పుణ్యాత్మ, పాపాత్మ,...... అనే పదాలే ఉన్నాయి గాని, మహాన్ పరమాత్మ అని అనరు, పుణ్య పరమాత్మ లేక పాప పరమాత్మ,...... అనే పదాలు కూడా లేవు. ఇవి అర్థము చేసుకోవలసిన విషయాలు కదా. ఈ పాఠశాలకు రావడం ద్వారా ప్రత్యక్ష ఫలమును ఇచ్చే ప్రాప్తి కలుగుతుందని కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఈ చదువు ద్వారా మనము భవిష్యత్తులో దేవీ దేవతలుగా అవుతాము. ఇలా ఎవ్వరూ అనలేరు. మనుష్యల నుండి దేవతలుగా మీరు మాత్రమే అవుతారు. దేవతలలో ప్రసిద్ధమైనవారు లక్ష్మీ నారాయణులు. అందుకే సత్యనారాయణ కథ అని అంటారు. నారాయణుని జతలో తప్పకుండా లక్ష్మి ఉంటుంది. సత్య రామ కథ అని అనరు. సత్య నారాయణ కథ అని అంటారు. అచ్ఛా. మరి దాని ద్వారా ఏమవుతారు? నరుని నుండి నారాయణునిగా అవుతారు. బ్యారిష్టరు ద్వారా బ్యాస్టరుగా అయ్యే కథను విని బ్యారిస్టరుగా అవుతారు. మీరు ఇక్కడికి వచ్చేదే భవిష్య 21 జన్మల ప్రాప్తి కొరకు. సంగమ యుగము ఉన్నప్పుడే భవిష్య 21 జన్మల ప్రాప్తి కలుగుతుంది. మీరు తండ్రి నుండి సత్యయుగ రాజధానిని వారసత్వంగా తీసుకునేందుకే వచ్చారని మీకు తెలుసు. అయితే మొదట ''శివబాబా! మాకు తండ్రి అన్న నిశ్చయము పక్కాగా ఉండాలి. ఈ బ్రహ్మకు కూడా వారు తండ్రియే. కనుక బి.కెలకు తాత అవుతారు. ఇది నా ఆస్తి కాదని ఈ బాబా(బ్రహ్మ) అంటారు. తాత ఆస్తి మీకు లభిస్తుంది. శివబాబా వద్ద జ్ఞాన రత్నాల ధనము ఉంది. ఒక్కొక్క జ్ఞాన రత్నము లక్షల విలువగల ఆస్తి. దీని విలువ ఎంతటి భారీ అంటే - 21 జన్మలు రాజ్య భాగ్యమనేది ఎవరి స్వప్నములో కూడా ఉండదు. లక్ష్మీ నారాయణులు మొదలైనవారి పూజ అయితే భలే చేస్తూ వచ్చారే కాని వారికి ఆ పదవి ఎలా వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. సత్యయుగము ఆయువు లక్షల సంవత్సరాలయ్యిందని అనేశారు. అందుకే ఏమీ అర్థము చేసుకోలేరు. వారు(లక్ష్మీ నారాయణులు) రాజ్యము చేసి 5 వేల సంవత్సరాలయ్యిందని ఇప్పుడు మీకు తెలుసు. మళ్ళీ ఒకటవ సంవత్సరము(0001) నుండి ప్రారంభమైన కథ అని చెప్పబడ్తుంది. లాంగ్ లాంగ్ ఎగో,......(చాలా కాలము క్రితము) ఈ భారతదేశములోనే లక్ష్మీనారాయణుల రాజ్యము ఉండేది. ఆ సమయములోని భారతదేశాన్ని బహిశ్త్, స్వర్గము అని అంటారు. ఇది ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. కల్పము ఆయువు 5 వేల సంవత్సరాలని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఈ శాస్త్రాలలో ఏమి వ్రాశారో, అలా వ్రాయడం కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. వాటిని వినడం వలన లాభమేమి కలుగలేదు. ఎన్నో వేడుకలను జరుపుతారు. జగదంబ ఒక్కరే ఉన్నా ఆమెకు ఎన్నో మూర్తులను తయారుచేస్తారు. జగదంబ సరస్వతి బ్రహ్మ పుత్రిక వారికి 8-10 భుజాలు లేవు. ఇవన్నీ భక్తిమార్గపు గొప్ప గొప్ప సామాగ్రి అని తండ్రి చెప్తున్నారు. జ్ఞానములో అయితే ఇవన్నీ లేవు(చేయవలసిన అవసరము లేదు). మౌనంగా ఉండి తండ్రిని స్మృతి చేయాలి. చాలామంది ఎప్పుడూ బాబాను చూసి ఉండకపోయినా ఇలా బాబాకు జాబు వ్రాస్తారు. ''బాబా! మీరు మమ్ములను గుర్తించలేరు, కాని నాకు మీరు బాగా తెలుసు, మీరు ఆ బాబాయే, మేము మీ నుండి వారసత్వము తీసుకునే తీరుతాము.'' ఇంట్లో కూర్చుని ఉండగానే చాలామందికి సాక్షాత్కారాలు అవుతాయి. భలే సాక్షాత్కారాలు అవ్వకపోయినా, ఇలాంటి పత్రాలు వస్తూ ఉంటారు. స్మృతిలో పూర్తిగా లవలీనమైపోతారు. తండ్రియే సద్గతిదాత, వారిని ఎంతగా ప్రేమించాలి. మాతా-పితల పై పిల్లలు పూర్తిగా హత్తుకుపోతారు. ఎందుకంటే మాత-పితలు పిల్లలకు సుఖమునిస్తారు. కాని ఈ రోజుల్లోని మాతా-పితలకు సుఖన్ని ఏమీ ఇవ్వరు. ఇంకా వికారాలలో చిక్కుకునేలా చేస్తారు. తండ్రి చెప్తున్నారు - గతం గత: అనగా గడిచిపోయిందేదో గడిచిపోయింది. '' పిల్లలూ! కామఖడ్గపు విషయాలు వదిలి పవిత్రంగా అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కృష్ణపురిలోకి వెళ్లాలని మీకు ఇప్పుడు శిక్షణ లభిస్తుంది. కృష్ణుని రాజ్యము సత్యయుగములోనే ఉంటుంది. మనుష్యులు కృష్ణుని ద్వాపర యుగములో చూపించేశారు. సత్యయుగ రాకుమారుడు ద్వాపర యుగములోకి వచ్చి గీతను వినిపించలేదు. అతను శ్రీ నారాయణునిగా అయ్యి సత్యయుగములో రాజ్యము చేయాలి.
భగవానువాచ! - ఈ సమయములో మనుష్య మాత్రులందరూ ఆసురీ స్వభావము గలవారు. వారిని దైవీ స్వభావము గలవారిగా చేసేందుకు గీతా భగవానుడు వస్తారు. ఆ తండ్రికి బదులు పుత్రుని పేరు వ్రాసేశారు. అంతేకాక ఆ పుత్రుని ద్వాపర యుగములోనికి తీసుకొచ్చారు. ఇది కూడా చాలా పెద్ద పొరపాటు. ఇప్పుడు యాదవులు, పాండవులు నిరూపింపబడరు. కనుక తండ్రి చెప్తున్నారు - పిల్లలూ! మీరు ఉన్నతమైన దైవీ కులానికి చెందినవారుగా ఉండేవారు. తర్వాత మీకు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఇప్పుడు మళ్ళీ మిమ్ములను దేవతలుగా చేస్తాను. మనుష్యులు మనుష్యులను స్వర్గ రాజులుగా చేయలేరు. మనుష్యులేమీ స్వర్గ స్థాపన చేయరు. ఆత్మను, పరమాత్మ అని అనడం ఎంతో పెద్ద పొరపాటు! సన్యాసులైతే మనుష్యులను దేవతలుగా చేయలేరు. ఆ కర్తవ్యము తండ్రిదే. ఆర్య సమాజము వారు ఆర్య సమాజస్థులుగా చేస్తారు. క్రిస్టియన్లు క్రిస్టియన్లుగా చేస్తారు. ఈ విధంగా మీరు ఎవరి వద్దకు వెళ్తారో, వారు వారిలాగే తయారు చేస్తారు. దేవతా ధర్మము సత్యయుగములోనే ఉంది. అందువల్ల తండ్రి(సత్యయుగ స్థాపన చేసేందుకు) సంగమ యుగములోనే రావలసి ఉంటుంది. ఇది మహాభారత యుద్ధము. ఈ యుద్ధము ద్వారానే మీకు విజయము లభిస్తుంది. వినాశనము తర్వాత మళ్ళీ జయ జయ ధ్వనులు అవుతాయి. వినాశనము కూడా తప్పకుండా జరుగుతుందని మీకు తెలుసు. ఈ రోజు గద్దె పై కూర్చుంటారు. వారిని గద్దె దింపేందుకు ఏ మాత్రము ఆలస్యము చేయరు. మరి ఇటువంటి ప్రపంచాన్ని స్వర్గమని అంటారా? ఇది పూర్తి నరకము. దీనిని స్వర్గమనడం తప్పు. మనుష్యులు ఎంతో దు:ఖితులుగా ఉన్నారు. ఈ రోజు ఎవరైనా జన్మించారంటే సంతోషము, సుఖము కలుగుతుంది. మరణిస్తే దు:ఖము కలుగుతుంది. ఇక్కడ మీరు అందరి నుండి నిర్మోహులుగా అవ్వాల్సి ఉంటుంది. అలా నిర్మోహులుగా అవ్వనట్లయితే సేవకు వెళ్లండి అని బాబావారికి ఎప్పుడూ చెప్పరు. తాను నిర్మోహుడనని బాబా(శివబాబా) చెప్తున్నారు. శివబాబా అంటున్నారు - దేని పై అయినా నేను మోహాన్ని ఎందుకుంచుకుంటాను? నేనేమీ గృహస్థుడను కాను.
ఈ ఎండిపోయిన వెదురు అడవికి నిప్పంటుకోనున్నదని, వినాశనము జరగడానికి ఆలస్యమవ్వదని పిల్లలైన మీకు తెలుసు. మీరు ఎక్కడ భాషణము చేసినా వారికి - ''మీరు వచ్చి అనంతమైన తండ్రి నుండి ఆస్తిని తీసుకోండి'' అని అర్థము చేయిస్తారు. హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వము లభిస్తుంది. మీరు ఈ నరకములో 63 జన్మలు తీసుకున్నారు. నేను మీకు 21 జన్మల కొరకు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చాను. ఇప్పుడు రావణుని ఆస్తి మంచిదా? లేక రామునిదా? ఒకవేళ రావణుని ఆస్తి మంచిదైతే అతడిని ఎందుకు తగులబెడ్తారు? శివబాబాను ఎప్పుడైనా తగులబెడ్తారా? కృష్ణుని కాల్చరు. ఇదంతా రావణ సాంప్రదాయము. ఇక్కడ వికారాల నుండి జన్మిస్తారు. ఇది వేశ్యాలయము. విషయ సాగరము, అది నిర్వికారీ శివాయలము. అమృత సాగరము. క్షీర సాగరములో విష్ణువును చూపిస్తారు కదా! క్షీర సాగరమేదీ ఉండదు. పాలైతే ఆవు నుండి వస్తాయి. ఇప్పుడు చూడండి! ఈశ్వరుని సర్వవ్యాపి అని అంటారు. మళ్ళీ తమను తాము శివోహమ్ అని అంటారు. ఎందుకంటే స్వయం పవిత్రంగా ఉంటారు. కనుక మాలో ఈశ్వరుడన్నారని అంటారు. మీలో కూడా ఈశ్వరుడు ఉన్నాడని ఇతరులతో అనరు. మీలో లేడు ఎందుకంటే మీరు పతితులు అని అంటారు. ఆత్మ చెప్తుంది - నేను ఇప్పుడు పరమపిత పరమాత్మ ద్వారా పావనంగా అవుతున్నాను. మళ్ళీ పావనంగా అయ్యి రాజ్యము చేస్తాను. మీరు అనేకసార్లు వారసత్వాన్ని తీసుకున్నారు, పోగొట్టుకున్నారు. ఈ డ్రామా చక్రము బుద్ధిలో కూర్చుంది. తండ్రి అర్థము చేయిస్తున్నారు - మీరంతా పార్వతులు. నేను శివుడిని. కథలు మొదలైనవన్నీ ఇక్కడి విషయాలే. సూక్ష్మవతనములో అయితే కథలు మొదలైనవి ఉండవు. అమరపురికి అధిపతకులుగా చేసేందుకు అమరకథను మీకు వినిపిస్తాను. అది అమరలోకము. అక్కడ సుఖమే సుఖముంటుంది. మృత్యులోకములో ఆదిమధ్యాంతము దు:ఖమే ఉంటుంది. బాబా ఎంత బాగా అర్థము చేయిస్తున్నారు! కల్పక్రితము ఎవరైతే తండ్రి నుండి ఆస్తిని తీసుకున్నారో, వారి పురుషార్థమే ఇప్పుడు నడుస్తుంది. ఈ సమయము వరకు ఏ మిషనరీ నడుస్తోందో, క్రితం కూడా అంతే నడిచింది. మీరు సర్వీసు తక్కువగా చేస్తున్నారని భలే బాబా అన్నా, ఇది కూడా తెలిపిస్తారు. కల్పక్రితము మీరు ఏ సర్వీసు చేశారో అంతే చేస్తారు. అయినా పురుషార్థము చేస్తూ ఉండాలి. చిన్న చిన్న దీపాలను తుఫానులు కదిలిస్తాయి. సర్వులకు నావికుడు ఒక్క తండ్రియే నా నావను తీరానికి చేర్చండి(నయ్యా మేరీ పార్ లగావో,........) అనే సామెత కూడా ఉంది. డ్రామాలో విధి ఇలా తయారై ఉంది. అందరూ ఆ పురాతన ప్రపంచము వైపు వెళ్తున్నారు. ఇక్కడ తక్కువమందే ఉన్నారు. మీరు ఎంతో తక్కువమంది ఉన్నారు. భలే చివరిలో చాలామంది ఉంటారు అయినా రాత్రింబవళ్ల తేడా ఉంటుంది. వారంతా రావణ సంప్రదాయులు. తండ్రి ఎంతగానో నషా ఎక్కిస్తారు. కాని బాహ్యములో కుటుంబ పరివారములోని ముఖాలను చూడగానే నషా తేలికైపోతుంది. ఈ విధంగా అవ్వరాదు. మీరు తండ్రితో ఇలా ఆత్మిక సంభాషణ చేయండి అని ఆత్మలకు చెప్తారు. ''బాబా! మేము మీ వారము. మీరు మమ్ములను స్వర్గంలోకి పంపించారు. 21 జన్మలు రాజ్యము చేశాము. తర్వాత 63 జన్మలు దు:ఖాన్ని పొందాము. ఇప్పుడు మేము మీ నుండి ఆస్తిని తీసుకునే తీరుతాము. బాబా! మీరెంత మంచివారు, మేము మిమ్ములను అర్ధకల్పం మర్చిపోయాము. ఇది అనాదిగా చేయబడిన డ్రామా. ఇది నా కర్తవ్యము కూడా అని తండ్రి అంటారు. నేను కల్ప-కల్పము వచ్చి పిల్లలైన మిమ్ములను మాయ నుండి ముక్తులుగా చేసి బ్రాహ్మణులుగా చేసి, సృష్టి ఆదిమధ్యాంత రహస్యాలను వినిపిస్తాను. స్వర్గాన్ని తయారు చేయాల్సి ఉన్నప్పుడే నేను వస్తాను. మీరు ఇప్పుడు ఫరిస్తాలుగా అవుతున్నారు. పవిత్రతను కూడా సాక్షాత్కారము చేయిస్తారు. మీరు ఒకవేళ నిర్మోహులుగా కూడా అవ్వాలి. ''బాబా! నేను సేవకు వెళ్లేదా?'' అని ఎవరైనా అడిగితే బాబా అంటారు - '' మీరు ఒకవేళ నిర్మోహులుగా ఉంటే ఇక మాలికులే, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లండి.'' ఎందుకు తికమకపడ్తారు? అధిపతకులై అంధులకు మార్గమును తెలిపించాలి. నష్టోమోహులుగా అవ్వలేదు కనుకనే అడుగుతారు. నష్టోమోహులుగా అయితే ఇక పరుగెడ్తారు, వారు నిలువలేరు. ఇది చాలా గొప్ప గమ్యము. తండ్రి సర్వీసు యోగ్య పిల్లల పట్ల అర్పణవుతారు. మొదటి నంబరులో అయితే ఈ బాబా(బ్రహ్మ) ఉన్నారు కదా. త్యాగమైతే అందరూ చేస్తారు కాని ఇతడిది(బ్రహ్మాబాబాది) మొదటి నంబరు.
తండ్రి చెప్తున్నారు - ''దేహీ-అభిమానులుగా అవ్వండి అనగా స్వయాన్ని అశరీరిగా భావించండి.'' అనంతమైన తండ్రి మీకు 21 జన్మల వారసత్వాన్ని ఇస్తారు. అచ్ఛా. వారు ఏ విధంగా వచ్చారు? బ్రహ్మ నోటి ద్వారా రచనను రచిస్తారని వ్రాయబడి కూడా ఉంది. కనుక తప్పక బ్రహ్మలోనే వస్తారు. బ్రహ్మనే ప్రజాపిత అని అంటారు. కనుక వచ్చి ఆ బేహద్ తండ్రి నుండి ఆస్తిని తీసుకోండి. ఈ విషయాలను అర్థం చేయించడంలో సిగ్గుపడే మాటేదీ లేదు. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. బ్రహ్మాబాబా సమానంగా త్యాగములో నంబరు ముందుకు వెళ్లాలి. రుద్రుని కంఠహారంగా తయారయ్యేందుకు జీవించి ఉంటూనే బలిహారమవ్వాలి.
2. సర్వీసు యోగ్యులుగా అయ్యేందుకు నిర్మోహులుగా అవ్వాలి. అంధులకు మార్గాన్ని చూపించాలి.
వరదానము :-
''దువా మరియు దవా (ఆశీర్వాదాలు మరియు ఔషధము) ద్వారా శారీరిక - మానసిక జబ్బుల నుండి ముక్తముగా ఉండే సదా సంతుష్ట ఆత్మా భవ''
శారీరిక జబ్బులు వచ్చినా వాటితో మనసు డిస్టర్బ్ అవ్వరాదు. సదా సంతోషంగా నాట్యము చేస్తూ ఉంటే శరీరము కూడా బాగుంటుంది. మానసిక సంతోషము ద్వారా శరీరాన్ని నడిపిస్తూ ఉంటే రెండు వ్యాయామాలు జరిగిపోతాయి. సంతోషమంటే ఆశీర్వాదము, వ్యాయామమంటే ఔషధము. కనుక దువా మరియు దవా రెండిటి ద్వారా తనువు, మనసుల జబ్బుల నుండి ముక్తులైపోతారు. సంతోషము వలన బాధలు కూడా మర్చిపోతారు. సదా తనువు-మనసు ద్వారా సంతుష్టంగా ఉంటే ఎక్కువగా ఆలోచించకండి. అధికంగా ఆలోచించుట ద్వారా సమయం వృథా అవుతుంది. సంతోషము మాయమవుతుంది.
స్లోగన్ :-
''విస్తారములో కూడా సారాన్ని చూచే అభ్యాసము చేసినట్లయితే, మీ స్థితి ఏకరసముగా ఉంటుంది''