22-11-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - దేహీ అభిమానులుగా అవ్వడంలోనే మీకు రక్షణ ఉంది. మీరు శ్రీమతానుసారము ఆత్మిక సేవలో తత్పరులవ్వండి, అప్పుడు దేహాభిమానము అనే శత్రువు మీ పై దాడి చేయదు''

ప్రశ్న :-

వికర్మల బరువు తల పై ఉంది అనేందుకు గుర్తు ఏది ? ఆ బరువును తేలిక చేసుకునే విధానము వినిపించండి?

జవాబు :-

ఎంతవరకైతే వికర్మల భారము ఉంటుందో, అంతవరకు జ్ఞాన ధారణ జరగదు. పదే పదే విఘ్నాలు కలిగించే వికర్మలు చేశారు. అవి మిమ్ములను ముందుకు వెళ్ళనీయవు. ఈ భారము నుండి తేలికగా అయ్యేందుకు నిద్రను జయించే నిద్రాజీతులుగా అవ్వండి. రాత్రిళ్ళు మేలుకొని తండ్రిని స్మృతి చేసినట్లైతే భారము తగ్గి తేలికైపోతారు.

పాట :-

మాతా ! ఓ మాతా ! ...................   

ఓంశాంతి.

ఇది జగదంబ మహిమ ఎందుకంటే ఇది కొత్త రచన. పూర్తి కొత్త రచన అయితే ఉండదు. పాతది కొత్తదిగా అవుతుంది. మృత్యులోకము నుండి అమర లోకానికి వెళ్లాలి. ఇది జీవన్మరణ సమస్య. మృత్యులోకములో మరణించి సమాప్తమైనా అవ్వాలి లేక జీవించి ఉండగానే మరణించి అమరలోకానికైనా వెళ్లాలి. జగన్మాత అంటే జగత్తును రచించే తల్లి. వీరు తండ్రి తప్పకుండా స్వర్గ రచయిత. బ్రహ్మ ద్వారా రచనను రచిస్తారు. నేను సూర్యవంశ, చంద్రవంశీ రాజధానులను స్థాపన చేస్తాను. సంగమ యుగములోనే వస్తానని తండ్రి చెప్తారు. కల్పము సంగమ యుగములో, ప్రతి(కల్పపు) సంగమ యుగములో వస్తాను. స్పష్టంగా అర్థము చేయించాలి. కేవలం మనుష్యులు తప్పుగా పేరును మార్చేశారు. సర్వవ్యాపి జ్ఞానాన్ని ఎవరు వినిపిస్తారో వారిని, ఇది ఎవరు చెప్పారు? ఎప్పుడు చెప్పారు, ఎక్కడ లిఖింపబడి ఉంది? అని అడగాల్సి వస్తుంది. మంచిది. అలా చెప్పే గీతా భగవానుడు ఎవరు? శ్రీ కృష్ణుడైతే దేహధారి. వారు సర్వవ్యాపి అయ్యేందుకు సాధ్యము కాదు. భగవద్గీతలో శ్రీ కృష్ణుని పేరు మారిపోతే విషయం తండ్రికి వర్తిస్తుందని అర్థమౌతుంది. తండ్రి అయితే ఆస్తిని ఇవ్వాలి. నేను సూర్యవంశీ - చంద్రవంశీ వారసత్వాన్ని ఇచ్చేందుకు రాజయోగాన్ని నేర్పిస్తారు. లేనట్లయితే 21 జన్మల వారసత్వాన్ని వారికెవరిచ్చారు? బ్రహ్మ ముఖము ద్వారా బ్రాహ్మణులను రచించారని కూడా లిఖింపబడి ఉంది కూడా. మళ్లీ ఆ సృష్టి ఆదిమధ్యాంత జ్ఞానాలను బ్రాహ్మణులకు వినిపిస్తారు. కనుక ఎవరు జ్ఞానమునిస్తారో వారు తప్పకుండా అర్థము చేయించేందుకు చిత్రాలను కూడా తయారుచేస్తారు. వాస్తవానికి ఇందులో వ్రాసే, చదివే విషయమేదీ లేదు. కాని దీనిని సహజము చేసి అర్థము చేయించేందుకు చిత్రాలు తయారు చేయబడ్డాయి. వీటి ద్వారా చాలా పని జరుగుతుంది. కనుక జగదంబకు కూడా మహిమ ఉంది. ఆమెను శివశక్తి అని కూడా అంటారు. శక్తి ఎవరి నుండి లభిస్తుంది? వరల్డ్‌ ఆల్‌మైటి తండ్రి నుండి. వరల్డ్‌ ఆల్‌మైటి అథారిటి అన్న పదాన్ని కూడా వారి మహిమలో చెప్పాలి. అథారిటి అనగా శాస్త్రాలు మొదలైనవాటి జ్ఞానమేదైతే ఉందో అది అందరికీ తెలుసు. అర్థము చేయించే అథారిటీ ఉంది. బ్రహ్మ చేతిలో శాస్త్రాలను కూడా చూపిస్తారు. బ్రహ్మ ముఖ కమలము ద్వారా సర్వ వేదశాస్త్రాల రహస్యాలను అర్థము చేయిస్తారని అంటారు. కనుక ఇది అథారిటీ అయ్యింది కదా. పిల్లలైన మీకు అన్ని వేదశాస్త్రాల రహస్యాన్ని అర్థము చేయిస్తారు. ధర్మశాస్త్రమని దేనినంటారో ప్రపంచానికి తెలియదు. నాలుగు ధర్మాలున్నాయని కూడా అంటారు. వాటిలో కూడా ఒక ధర్మము ముఖ్యమైనది. ఇది పునాది. మర్రి వృక్షపు ఉదాహరణ కూడా ఇస్తారు. దీని పునాది కుళ్ళిపోయింది. శాఖోపశాఖల పై నిలబడి ఉంది. ఇది ఒక ఉదాహరణము. ప్రపంచములో వృక్షాలు చాలా ఉన్నాయి. సత్యయుగములో కూడా వృక్షాలు ఉంటాయి కదా. కాకపోతే అడవి ఉండదు. ఉద్యానవనాలు ఉంటాయి. అవసరమైన వస్తువుల కొరకు అడవులు కూడా ఉంటాయి. కలప మొదలైనవి కావాలి కదా. అడవులలో కూడా పశు, పక్షులు చాలా ఉంటాయి కాని అక్కడ అన్ని వస్తువులు మంచి ఫలదాయకంగా ఉంటాయి. పశు, పక్షులు కూడా శోభనిచ్చే విధంగా ఉంటాయి కాని మలినపరిచేవిగా ఉండవు. ఈ పశు-పక్షుల సౌందర్యము అయితే కావాలి కదా. సృష్టి సతోప్రధానంగా ఉన్న కారణంగా అన్ని వస్తువులు సతోప్రధానంగా ఉంటాయి. స్వర్గమంటే మరేమనుకున్నారు! మొట్టమొదటి ముఖ్యమైన విషయము - తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. చిత్రాలు తయారౌతూ ఉంటాయి. అందులో కూడా బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన....... అని వ్రాయాలి. ఈ మాటలను మనుష్యులు అర్థము చేసుకోలేరు. కనుక విష్ణువు యొక్క రెండు రూపాలైన లక్ష్మీనారాయణులు పాలన చేసేవారు అని వ్రాస్తే దీనిని అర్థము చేసుకుంటారు. కోటిలో కొందరు మాత్రమే అర్థము చేసుకోగలరు. ఆశ్చర్యవంతముగా వింటారు, వర్ణిస్తారు.......... అని కూడా వ్రాయబడి ఉంది. నెంబరువారు పురుషార్థానుసారము తమ పదవులను ప్రాప్తి చేసుకుంటారు. ఎక్కడో అక్కడ ఈ విషయాలు వ్రాయబడ్డాయి. భగవానువాచ అను పదము కూడా కరెక్టుగా ఉంది. భగవంతుని బయోగ్రఫి(జీవితచరిత్ర)లో పొరపాటు జరిగినట్లయితే సర్వశాస్త్రాలు ఖండితమైపోతాయి. తండ్రి రోజురోజుకు మంచి-మంచి పాయింట్లు ఇస్తూ ఉండడం చూస్తున్నాము. మొట్టమొదట భగవంతుడు జ్ఞానసాగరుడు, మనుష్యసృష్టికి బీజరూపుడు అనునది నిశ్చయము చేయించాలి. చైతన్య బీజములో ఏ జ్ఞానము ఉంటుంది? తప్పకుండా వృక్ష జ్ఞానమే ఉంటుంది కనుక ఆ జ్ఞానాన్ని తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా అర్థము చేయిస్తారు. బ్రహ్మకుమారీ-కుమారుల పేరు బాగుంది. ప్రజాపిత బ్రహ్మకుమార-కుమారీలు అనేకమంది ఉన్నారు. ఇందులో అంధ విశ్వాసము మాటేమీ లేదు. ఇది రచన కదా. బాబా-మమ్మా మరియు మీరు. మాత-పితలని అందరూ అంటారు. జగదంబ సరస్వతి బ్రహ్మ పుత్రిక. ఆమె ప్రాక్టికల్‌గా బ్రహ్మకుమారి. కల్పక్రితము కూడా బ్రహ్మ ద్వారా నూతన సృష్టిని రచించారు. ఇప్పుడు మళ్లీ తప్పకుండా బ్రహ్మ ద్వారానే రచన జరుగుతుంది. సృష్టి ఆదిమధ్యాంత రహస్యాలను తండ్రియే అర్థం చేయిస్తారు. అందుకే వారిని జ్ఞానసాగరులని అంటారు. బీజములో తప్పకుండా సృష్టి చక్ర జ్ఞానము పూర్తిగా ఉంటుంది. వారి రచన చైతన్య మనుష్య సృష్టి. తండ్రి రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు. పరమపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులకు నేర్పిస్తారు. ఈ బ్రాహ్మణులే మళ్లీ దేవతలుగా అవుతారు. వినేటప్పుడు అందరికి చాలా ఆనందం కలుగుతుంది. కాని దేహాభిమాన కారణంగా ధారణ జరగదు. ఇ్కడ నుండి వెలుపలకు వెళ్లగానే సమాప్తమైపోతుంది. అనేక ప్రకారాలైన దేహాభిమానము ఉంది. ఇందులో చాలా శ్రమ చేయాలి.

నిద్రను జయించేవారుగా అవ్వండి, దేహాభిమానాన్ని వదలండి, ఆత్మాభిమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. రాత్రి మేలుకొని స్మృతి చేయాలి. ఎందుకంటే మీ తల పై జన్మ-జన్మల వికర్మల భారము చాలా ఉంది. ఇది మిమ్ములను ధారణ చేయనివ్వదు. ఎలాంటి కర్మలు చేశారంటే దాని కారణంగా ఆత్మాభిమానులుగా అవ్వరు. చాలా గొప్పలు చెప్పుకుంటారు. మేము 75 శాతము స్మృతిలో ఉంటామని చాలా గొప్పలు చార్టులో కూడా వ్రాసి పంపిస్తారు. కాని అది అసాధ్యము అని బాబా అంటారు. అందరికంటే ముందుకు వెళ్ళేవారే స్వయంగా చెప్తారు - స్మృతి చేసేందుకు ఎంతగా ప్రయత్నించినా మాయ మరపింపజేస్తుంది. సత్యమైన చార్టు వ్రాయాలని బాబా కూడా తెలిపిస్తున్నారు కదా. కనుక పిల్లలు కూడా అనుసరించవలసి ఉంటుంది. అనుసరించలేకుంటే చార్టును కూడా పంపరు. పురుషార్థము కొరకు సమయము లభించింది. ఈ ధారణ అంత సులభము కాదు(పిన్నమ్మ ఇల్లేమీ కాదు). ఇందులో అలసిపోరాదు. కొందరు అర్థము చేసుకునేందుకు సమయము తీసుకుంటారు. ఈ రోజు కాకుంటే రేపైనా అర్థము చేసుకుంటారు. ఎవరైతే దేవీదేవతా ధర్మము వారిగా ఉంటారో, ఇతర ధర్మాలలోకి వెళ్లిపోయి ఉంటారో వారు తప్పకుండా వాపస్‌ వచ్చేస్తారు అని బాబా చెప్తారు. ఒక రోజు ఆఫ్రికన్లు మొదలైనవారి సమ్మేళనము కూడా జరుగుతుంది. భారత ఖండానికి వస్తూ ఉంటారు. ఇంతకుముందు ఎన్నడూ వచ్చేవారు కాదు. ఇప్పుడు అందరూ గొప్ప గొప్ప వారు కూడా వస్తూ ఉంటారు. జర్మనీ రాకుమారుడు మొదలైన వారందరు ఎప్పుడూ వెలుపలకు వెళ్ళేవారు కాదు. నేపాల్‌ రాజు ఎప్పుడూ రైలును చూసి ఉండలేదు. తమ పరిమితులను దాటి బయటకు వెళ్ళే అనుమతి లేదు. పోప్‌ ఎప్పుడూ వెలుపలికి వెళ్లలేదు. ఇప్పుడు వచ్చారు. అందరూ వస్తారు. ఎందుకంటే ఈ భారతదేశము అన్ని ధర్మాల వారికి చాలా గొప్ప తీర్థస్థానము. కనుక ఈ ప్రకటన తీవ్రంగా వెలువడ్తుంది. మీరు అన్ని ధర్మాల వారికి తెలియచేయాలి. నిమంత్రణ ఇవ్వాలి. అయినా ఎవరు దేవతా ధర్మము నుండి కన్‌వర్ట్‌ అయ్యి ఉన్నారో వారే జ్ఞానాన్ని తీసుకుంటారు. ఇందులో వివేకము అవసరము. ఒకవేళ అర్థము చేసుకుంటే తప్పకుండా శంఖు ధ్వని చేస్తారు. మనము బ్రాహ్మణులము కదా. మనము గీతనే వినిపించాలి. చాలా సహజము. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత. వారి ద్వారా వారసత్వాన్ని పొందడం మన హక్కు. తమ తండ్రి ఇంటికి(ముక్తిధామము) వెళ్ళేందుకు అందరికీ హక్కు ఉంది. ముక్తి-జీవన్ముక్తుల హక్కు ఉంది. జీవన్ముక్తి అందరికీ లభిస్తుంది. జీవన బంధనము నుండి ముక్తులై శాంతిలోకి వెళ్తారు. మళ్లీ ఎప్పుడు వస్తారో అప్పుడు జీవన్ముక్తి ఉంటుంది. కాని అందరికీ సత్యయుగములో అయితే జీవన్ముక్తి లభించదు. సత్యయుగములో జీవన్ముక్తిలో దేవీ దేవతలు ఉండేవారు. చివరిలో ఎవరైతే వస్తారో, వారు తక్కువ సుఖాన్ని తక్కువ దు:ఖాన్ని పొందుతారు. దీనికి లెక్కాచారముంది. ఏ భారతదేశమైతే చాలా శ్రేష్ఠంగా ఉండేదో, అదే అందరికంటే భికారి దేశంగా అయ్యింది. ఈ దేవీ దేవతా ధర్మము అత్యంత సుఖమిచ్చేదని తండ్రి కూడా అంటారు. ఇది తయారై ఉంది. అందరూ తమ తమ సమయానుసారంగా తమ తమ పాత్రను అభినయిస్తారు. హెవెన్లీ గాడ్‌ఫాదర్‌(స్వర్గ రచయిత) హెవన్‌(స్వర్గము)ను స్థాపన చేస్తారు. వేరెవ్వరూ చెయ్యలేరు. క్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రిందట తప్పకుండా స్వర్గముండేది. నూతన ప్రపంచముండేది అని కరెక్టుగానే చెప్తారు. ఏసుక్రీస్తు అక్కడకు(సత్యయుగములోనికి) రాలేడు. అతడు తన సమయములోనే వస్తాడు. మళ్లీ తన పాత్రను పునరావృతము చేయాలి. ఈ విషయాలన్నీ బుద్ధిలో కూర్చుంటే శ్రీమతమును అనుసరించగలరు. అందరి బుద్ధి ఒకే విధంగా ఉండదు. శ్రీమతమును అనుసరించేందుకు ధైర్యము ఉండాలి. తర్వాత శివబాబా, మీరు బ్రహ్మ మరియు జగదంబ ద్వారా ఏమి తినిపిస్తారో, ఏది ధరింపజేస్తారో................ అదే తీసుకుంటాము. బ్రహ్మ ద్వారానే అంతా చేస్తారు కదా. కనుక ఇరువురూ కంబైండ్‌(సంయుక్తము)గా ఉన్నారు. బ్రహ్మ ద్వారానే కర్తవ్యాన్ని చేస్తారు. శరీరాలైతే రెండూ కలిసి లేవు. కొందరి కంబైండ్‌ శరీరాలను కూడా బాబా చూశారు. రెండు ఆత్మలైతే వేరు వేరుగా ఉంటాయి. ఇతనిలో బాబా ప్రవేశము చేస్తారు. వారు జ్ఞాన సాగరులు. వారు జ్ఞానాన్ని ఎవరి ద్వారా ఇవ్వాలి? కృష్ణుని చిత్రమైతే(దేహమైతే) వేరే. ఇక్కడ బ్రహ్మ కావాలి. వాస్తవంలో బ్రహ్మకుమార-కుమారీలు ఎంతమంది ఉన్నారు. ఇది అంధ విశ్వాసమేమీ కాదు. దత్తు పిల్లలను భగవంతుడు చదివిస్తున్నారు. కల్పక్రితము ఎవరైతే దత్తత వచ్చారో, వారే ఇప్పుడు వస్తారు. వెలుపల ఆఫీసులలో అయితే ఎవ్వరూ మేము బ్రహ్మకుమారీలమని చెప్పుకోరు. ఇది గుప్తమైనది. శివబాబా సంతానమే కాని నూతన సృష్టి రచనను రచించవలసి వస్తుంది. పాత నుండి కొత్తదిగా తయారుచేస్తారు. ఆత్మలో మలినము కలవడం ద్వారా పాతదైపోతుంది. బంగారములోనే మురికి పడ్తుంది. అప్పుడది అసత్యంగా(కల్తీ) అవుతుంది. అలా ఆత్మ కల్తీ(అసత్యంగా) అయినప్పుడు శరీరము కూడా కల్తీ అవుతుంది. మళ్లీ సత్యంగా ఎలా అవ్వాలి? అసత్యమైన వస్తువులను పవిత్రంగా చేసేందుకు అగ్నిలో వేస్తారు. మరి ఎంత పెద్ద వినాశనమౌతుంది. ఈ పండుగలు మొదలైనవన్నీ భారతదేశానివే. ఇవి ఎవరివి? మరియు ఎప్పటివో ఎవ్వరికీ తెలియదు. జ్ఞానాన్ని చాలా తక్కువ మంది తీసుకుంటారు. చివర్లో రాజ్యము లభించినా అది ఎందుకు పనికి వస్తుంది? సుఖము చాలా తక్కువగా ఉంటుంది కదా. దు:ఖమైతే నెమ్మది నెమ్మదిగా ప్రారంభమవుతుంది. కనుక పురుషార్థము మంచిరీతిగా చెయ్యాలి. ఎంతమంది కొత్త పిల్లలు చురుకుగా అయిపోయారు. పాతవారు గమనమివ్వరు. దేహాభిమానము చాలా ఉంది. సర్వీసు చేసేవారే హృదయాన్ని అధిరోహిస్తారు. లోపల ఒకటి, వెలుపల మరొకటి అని అంటారు కదా. బాబా ఆంతరికంగా చాలా చాలా మంచి పిల్లలను ప్రేమిస్తారు. కొందరు వెలుపల మంచిగా, ఆంతరికములో చెడుగా ఉంటారు. కొందరు సర్వీసు చేయరు. గ్రుడ్డివారికి ఊతకర్రగా అవ్వరు. ఇప్పుడిది జీవన్మరణ ప్రశ్న. అమరపురిలో శ్రేష్ఠ పదవిని పొందాలి. ఎవరెవరు కల్పక్రితము పురుషార్థము చేసి శ్రేష్ఠ పదవిని పొందారో అదంతా తెలుస్తుంది, కనిపిస్తుంది. ఎంతెంత ఆత్మాభిమానులుగా అవుతారో అంతంత సురక్షితంగా నడుస్తూ ఉంటారు. దేహాభిమానము ఓడింపజేస్తుంది. శ్రీమతానుసారము ఎంత ఆత్మిక సర్వీసు చేయగలరో అంత మంచిది అని బాబా చెప్తారు. అందరికీ బాబా అర్థము చేయిస్తారు. చిత్రాలతో అర్థం చేయించడం చాలా సహజము. అందరూ బ్రహ్మకుమారీ - కుమారులే. ఆ శివబాబా పెద్దబాబా. తర్వాత మళ్లీ నూతన సృష్టిని రచిస్తారు. మనుష్యుల నుండి దేవతలుగా.................. అని మహిమ కూడా చేస్తారు. సిక్కు ధర్మము వారు కూడా ఆ భగవంతుని మహిమ చేస్తారు. గురునానక్‌ వాడిన శబ్ధాలు చాలా బాగున్నాయి. సాహెబ్‌ను జపిస్తే సుఖము లభిస్తుంది. ఇది సందేశము. సత్యమైన స్వామిని స్మృతి చేస్తే సుఖమును పొందుతారు అనగా వారసత్వం లభిస్తుంది. ఏక్‌ ఓంకార్‌.... అని నమ్ముతారు. ఆత్మను ఏ మృత్యువు కబళించలేదు. ఆత్మ మలినమవుతుంది. కాని వినాశనమవ్వదు. అందుకే అకాలమూర్తి అని అంటారు. తండ్రి అర్థము చేయిస్తారు - నేను అకాలమూర్తిని. ఆత్మలు కూడా అవినాశి అయితే ఆత్మలు పునర్జన్మలోకి వస్తాయి. నేను ఏకరసంగా ఉంటాను. నేను జ్ఞానసాగరుడను, రూపబసంతుడను కూడా అని స్పష్టంగా తెలియజేస్తున్నారు. కనుక ఈ మాటలు అర్థము చేసుకొని అర్థము చేయించాలి. అంధులకు ఊతకర్రగా అవ్వాలి, ప్రాణదానమునివ్వాలి. తర్వాత ఎప్పుడూ అకాలమృత్యువు ఉండదు. మీరు మృత్యువు పై విజయం పొందుతారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. శ్రీమతానుసారము ఆత్మిక సేవ చేయాలి. అంధులకు ఊతకర్రగా అవ్వాలి. శంఖు ధ్వని తప్పకుండా చేయాలి.

2. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు స్మృతి చార్టునుంచాలి. రాత్రి మేలుకొని ప్రత్యేకంగా స్మృతి చేయాలి. స్మృతి చేయడంలో అలసిపోరాదు.

వరదానము :-

''స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తనకు నిమిత్తంగా అయ్యే శ్రేష్ఠ సేవాధారీ భవ''

పిల్లలైన మీరు స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసే కంట్రాక్టు తీసుకున్నారు. స్వ పరివర్తనయే విశ్వ పరివర్తనకు ఆధారము. స్వపరివర్తన జరగకుండా ఏ ఆత్మ పట్ల ఎంత శ్రమ చేసినా, వారిలో పరివర్తన జరగజాలదు. ఎందుకంటే ఈ సమయంలో కేవలం వినడం ద్వారా కాక చూచుట ద్వారా మారిపోతారు. చాలామంది బంధనాలు వేసేవారు కూడా మీ జీవితంలో పరివర్తన చూసి వారు కూడా మారిపోతారు. కనుక చేసి చూపించాలి. మారిపోయి చూపించడమే శ్రేష్ఠమైన సేవాధారులుగా అవ్వడం.

స్లోగన్‌ :-

''సమయము, సంకల్పము మరియు మాటల శక్తిని వ్యర్థము నుండి సమర్థంగా ( వేస్ట్‌ నుండి బెస్ట్‌గా ) పరివర్తన చేసుకుంటే శక్తిశాలురుగా అవుతారు''