31-10-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - ఆత్మలైన మీకు మీ - మీ రథాలున్నాయి. నేను నిరాకారుడను, కల్పములో ఒక్కసారి నాకు కూడా రథము కావాలి. నేను బ్రహ్మ అనుభవీ వృద్ధ రథాన్ని అప్పుగా తీసుకుంటాను ''
ప్రశ్న :-
ఏ నిశ్చయము ఆధారముతో దేహ భావాన్ని మర్చిపోవడం చాలా సహజము ?
జవాబు :-
పిల్లలైన మీరు పూర్తి నిశ్చయంతో - బాబా, మేము మీకు చెందినవారిగా అయిపోయామని అన్నారు. తండ్రికి చెందినవారిగా అవ్వడమంటేనే దేహ భావాన్ని మర్చిపోవడం. ఎలాగైతే శివబాబా ఈ రథములోకిి వచ్చి మళ్లీ వెళ్లిపోతారో, అలా పిల్లలైన మీరు కూడా ఈ రథములోకి రావడము, పోవడాన్ని అభ్యాసము చేయండి. అశరీరులుగా అయ్యే అభ్యాసాన్ని చేయండి. ఇందులో ఏ కష్టమూ అనుభవమవ్వరాదు. స్వయాన్ని నిరాకార ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి.
పాట :-
ఓం నమ: శివాయ............................. 
ఓంశాంతి.
శివబాబా పిల్లలకు ఈ బ్రహ్మ రథము ద్వారా అర్థం చేయిస్తారు ఎందుకంటే నాకు నా రథము అయితే లేదు కదా! మరి నాకు కూడా రథము తప్పకుండా కావాలి కదా! అని శివబాబా పిల్లలనే అడుగుతారు. ఆత్మలైన మీ అందరికీ మీ మీ రథాలున్నాయి కదా! బ్రహ్మ, విష్ణు, శంకరులకు కూడా సూక్ష్మ శరీరాలున్నాయి కదా! లక్ష్మీనారాయణులు మొదలైన ఆత్మలందరికీ శరీర రూపీ రథాలు తప్పకుండా ఉన్నాయి. వాటిని అశ్వాలని కూడా అంటారు. కాని నిజానికి వారు మనుష్యులే కదా! మనుష్యుల విషయమే అర్థము చేయించబడ్తుంది. జంతువుల విషయాలు జంతువులకే తెలియాలి. ఇక్కడైతే ఇది మనుష్య సృష్టి. కావున తండ్రి కూడా కూర్చొని మనుష్యులకే అర్థం చేయిస్తారు. మనుష్యుల్లో ఉన్న ఆత్మలకే అర్థం చేయిస్తారు, శరీరాలకు కాదు. ఆత్మలైన మీ అందరికీ మీ మీ శరీరాలున్నాయి కదా అని బాబా నేరుగా అడుగుతారు. ప్రతి ఆత్మ శరీరాన్ని తీసుకుంటుంది, వదులుతుంది. మనుష్యులైతే ఆత్మ 84 లక్షల జన్మలు తీసుకుంటుందని అనేస్తారు. అది తప్పు. నిజానికి మీరు 84 జన్మలు తీసుకుని పూర్తిగా అలసిపోయారు. ఎంతగా విసిగిపోయారు! కనుక 84 లక్షల జన్మల విషయమే లేదు. ఇవన్నీ మనుష్యుల కోతలు. ఆత్మలైన మీకు కూడా మీ మీ రథాలున్నాయి. నాకు కూడా రథము కావాలి కదా. నేను మీ అనంతమైన తండ్రిని. పతిత పావనులు, జ్ఞానసాగరుడు అని కూడా నన్ను మహిమ చేస్తారు. మీరు ఇంకెవ్వరినీ పతితపావనులని అనరు. లక్ష్మీనారాయణులు మొదలైనవారిని కూడా పతిత పావనులని అనరు. పతిత సృష్టిని పావనంగా తయారు చేసేవారు అనగా పావన సృష్టి అయిన స్వర్గ రచయిత పరమపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ అవ్వజాలరు. తానే ఉన్నతోన్నతుడైన సుప్రీం ఫాదర్. మీరు నెంబరువారీగా రాతిబుద్ధి నుండి పారసబుద్ధి గలవారిగా అవుతున్నారని తండ్రికి తెలుసు. బయటి మనుష్యులకు ఇది తెలియదు. కావున నాకు కూడా తప్పకుండా రథము కావాలి కదా! పతితపావనుడనైన నేను తప్పకుండా పతిత ప్రపంచములోకి రావలసి ఉంటుంది కదా! అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్లు ప్లేగు వ్యాధిగ్రస్థుల వద్దకు రావలసి ఉంటుంది. మీలో పంచ వికారాలనే రోగము అర్ధకల్పం నుండి ఉంది. అవి మనుష్యులకు దు:ఖమునిచ్చేవి. ఈ పంచ వికారాల ద్వారా మీరు పూర్తిగా పతితులుగా అయిపోయారు. కావున నేను పతిత ప్రపంచములోకి మీ వద్దకు రావలసి ఉంటుంది కదా! అని తండ్రి అర్థము చేయిస్తారు. పతితులనే భ్రష్టాచారులని అంటారు. పావనులను శ్రేష్ఠాచారులని అంటారు. తప్పకుండా మీ భారతదేశము పావన శ్రేష్ఠాచారంగా ఉండేది. లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. దానినే సర్వగుణ సంపన్నము అని మహిమ చేస్తారు. అక్కడ అందరూ సుఖంగా ఉండేవారు. ఇది నిన్నటి విషయము. కావున మరి నేను ఎలా రాను? ఎవరి శరీరములోకి రాను? అని తండ్రి అడుగుతారు. నాకైతే మొదట ప్రజాపిత కావాలి. మరి సూక్ష్మవతన వాసిని ఇక్కడకు ఎలా తీసుకు రాగలను? అతడు ఫరిస్తా(సూక్ష్మదేవత) కదా! అతడిని పతిత ప్రపంచములోకి తీసుకు రావడం దోషమౌతుంది. నేను ఏ తప్పు చేశాను? అని అతడు అంటాడు. తండ్రి ఇలా చాలా రమణీకమైన విషయాలను అర్థం చేయిస్తారు. ఎవరైతే తండ్రికి చెందినవారిగా అయ్యి ఉంటారో వారు మాత్రమే అర్థం చేసుకుంటారు. వారు ఘడియ ఘడియ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు.
ఎప్పుడైతే ఈ భూమి పై పాపం పెరిగిపోతుందో అప్పుడే నేను వస్తానని తండ్రి చెప్తారు. కలియుగములో మనుష్యులు ఎన్ని పాపాలు చేస్తారు! కావున పిల్లలూ, మరి నేను రావాలంటే ఎవరి తనువులోకి రావాలో చెప్పండి అని తండ్రి అడుగుతారు. నాకైతే తప్పకుండా వృద్ధ అనుభవీ తనువే కావాలి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ రథము చాలామంది గురువులను ఆశ్రయించాడు. శాస్త్రాలు మొదలైనవి చదివాడు. చాలా చదివాడని కూడా వ్రాయబడి ఉంది కదా. ఇది అర్జునుని విషయం కాదు. నాకు అర్జునుని రథము గాని, కృష్ణుని రథము గాని అవసరం లేదు. నాకు బ్రహ్మ రథమే కావాలి. వారినే ప్రజాపిత అని అంటారు. కృష్ణుడిని ప్రజాపిత అని అనరు. తండ్రికైతే బ్రహ్మ రథమే కావాలి. దాని ద్వారా బ్రాహ్మణుల ప్రజలను రచించగలుగుతారు. బ్రాహ్మణులది సర్వోత్తమ కులము. విరాట రూపాన్ని చూపిస్తారు కదా! అందులో దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఉంటారు. పోతే బ్రాహ్మణులు ఏమైనట్లు? ఇది ఎవ్వరికీ తెలియదు. ఉన్నతోన్నతమైనది బ్రాహ్మణుల పిలక. పిలక ఉంటేనే బ్రాహ్మణులు అని భావించబడ్తుంది. సత్య సత్యమైన పిలక మీదే. మీరు పెద్ద పిలక ఉన్న రాజఋషులు. ఎవరైతే పవిత్రంగా ఉంటారో వారిని ఋషులని అంటారు. మీరు రాజయోగులు, రాజఋషులు. మీరు రాజ్యము కొరకు తపస్సు చేస్తున్నారు. వారు ముక్తి కొరకు హఠయోగ తపస్సును చేస్తారు. మీరు జీవన్ముక్తి కొరకు. రాజ్యము కొరకు రాజయోగ తపస్సు చేస్తున్నారు. మీ పేరే శివశక్తులు, శివబాబా మీకు పునర్జన్మను ఇస్తారు. కావున మీరు మళ్లీ భారతదేశములో జన్మ తీసుకుంటారు. జన్మ తీసుకున్నారు కదా. కొందరు భలే జన్మ తీసుకున్నా తాము శివబాబాకు చెందినవారిగా అయ్యామని, వారి వద్ద జన్మ తీసుకున్నామని భావించరు. అలా భావించినట్లైతే దేహ భావము పూర్తిగా తొలగిపోవాలి. ఎలాగైతే నిరాకారుడైన శివబాబా ఈ రథములో ఉన్నారో అలా మీరు కూడా స్వయాన్ని నిరాకారి ఆత్మగా భావించండి. పిల్లలూ! నన్ను స్మృతి చేయండి అని తండ్రి అంటారు. ఇప్పుడిక తిరిగి ఇంటికి వెళ్లాలి. మొదట మీరు అశరీరులుగా ఉండేవారు. తర్వాత మళ్లీ దేవీ దేవతల శరీరాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత క్షత్రియ శరీరాన్ని, వైశ్య శరీరాన్ని, శూద్ర శరీరాన్ని తీసుకున్నారు. ఇప్పుడు మీరు మళ్లీ అశరీరులుగా అవ్వండి. మీరు తండ్రి అని నిరాకారుడనైన నన్నే అంటారు. తండ్రీ! ఇప్పుడు మేము మీకు చెందినవారిగా అయ్యాము, ఇప్పుడు తిరిగి(వాపస్) వెళ్లాలి. దేహాన్నైతే తీసుకెళ్లరు. ఓ ఆత్మలారా, ఇప్పుడు తండ్రినైన నన్ను, మధురమైన ఇంటిని స్మృతి చేయండి. మనుష్యులు విదేశాల నుండి తిరిగి వచ్చేటప్పుడు మన స్వీట్ హోమ్ అయిన భారతదేశానికి వెళ్తాము, ఎక్కడైతే జన్మ తీసుకున్నామో అక్కడికి వెళ్తాము అని అంటారు. మనుష్యులు మరణిస్తే, వారు జన్మ తీసుకున్న చోటుకే వారిని తీసుకెళ్తారు. భారతదేశ మట్టితో తయారైనవారు కాబట్టి వారి మట్టిని భారతదేశములోనే వదలాలని భావిస్తారు.
నా జన్మ కూడా భారతదేశములోనే జరుగుతుంది అని తండ్రి అంటారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు. నాకు ఎన్నో పేర్లు పెట్టేశారు. హర హర మహాదేవా! సర్వుల దు:ఖాన్ని హరించువాడా! అని అంటారు. అది కూడా నేనే, శంకరుడు కాదు. బ్రహ్మ సేవ చేస్తూ హాజరుగా ఉన్నాడు. ఎవరైతే స్థాపన చేశారో, వారే మళ్లీ విష్ణువు యొక్క రెండు రూపాల ద్వారా పాలన చేస్తారు. నాకు ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా కావాలి. ఆదిదేవుని మందిరము కూడా తప్పకుండా ఉంది. ఆది దేవుడు ఎవరి పుత్రుడు? ఎవరైనా చెప్పండి. ఈ దిల్వాడా మందిరము ట్రస్టీలకు కూడా ఆదిదేవుడు ఎవరో, అతడి తండ్రి ఎవరో తెలియదు. ఆదిదేవుడు ప్రజాపిత బ్రహ్మ. అతడి తండ్రి శివుడు. ఇది జగత్పిత మరియు జగదంబల స్మృతిచిహ్న మందిరము. ఈ ఆదిదేవుడైన బ్రహ్మ రథములో తండ్రి కూర్చొని జ్ఞానాన్ని వినిపించారు. పిల్లలందరూ గదులలో కూర్చున్నారు. అందరి మందిరాలను తయారు చేయరు. 108 మాల ముఖ్యమైనది. కనుక 108 గదులను తయారుచేశారు. 108 మాలకే పూజ జరుగుతుంది. ముఖ్యమైనవారు శివబాబా ఆ తర్వాత బ్రహ్మ, సరస్వతి జంట పూసలు. శివబాబా పుష్పము వారికి తమ శరీరము లేదు. బ్రహ్మ-సరస్వతులకు తమ శరీరాలున్నాయి. శరీరధారుల మాలయే తయారు చేయబడి ఉంది. అందరూ మాలను పూజిస్తారు. పూజించి పూర్తి చేశాక మళ్లీ శివబాబాకు నమస్కరిస్తారు. తల వంచుతారు ఎందుకంటే వారు వీరందరినీ పతితులను పావనంగా చేశారు. అందుకే పూజింపబడ్తారు. మాలను చేతిలోకి తీసుకుని రామ-రామ అని అంటారు. పరమపిత పరమాత్మ పేరును గూర్చి ఎవ్వరికీ తెలియదు. శివబాబా ముఖ్యమైనవారు అలాగే ప్రజాపిత బ్రహ్మ మరియు సరస్వతి కూడా ముఖ్యమైనవారే. పోతే బ్రహ్మకుమారి-కుమారులు ఎవరెవరు పురుషార్థము చేస్తూ ఉంటారో వారి పేర్లు ఉంటాయి. ముందు ముందు మీరు అన్నీ చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే చివరి సమయము వస్తుందో అప్పుడు మీరు ఇక్కడకు వచ్చి ఉంటారు. ఎవరైతే పక్కా యోగులుగా ఉంటారో, వారే ఇక్కడ ఉండగలరు. భోగులైతే కాస్త అలజడి వినగానే అంతమైపోతారు. కొందరు మనుష్యులు ఎవరి ఆపరేషన్ను చూసినా స్పృహ తప్పి పడిపోతారు. ఇప్పుడు పార్టీషన్(దేశ విభజన)లో ఎంతమంది మరణించారు! మేము ఏ యుద్ధమూ లేకుండా రాజ్యము తీసుకున్నామని వారు గొప్పలు చెప్తూ ఉంటారు. కాని లెక్కలేనంతమంది మరణించారు. ఇదంతా అసత్యమైన మాయ. ఇప్పుడు సత్యమైన తండ్రి కూర్చుని మీకు సత్యమైన విషయాలను వినిపిస్తారు. నాకు రథమైతే తప్పకుండా కావాలి. ప్రియుడైన నేను గొప్పవాడిని కనుక నా ప్రేయసి కూడా గొప్పదే కావాలి. సరస్వతి బ్రహ్మ ముఖవంశావళి. తాను బ్రహ్మకు పత్ని(యుగల్) కాదు, బ్రహ్మ పుత్రిక. ఆమెను జగదంబ అని ఎందుకు అంటారు? ఎందుకంటే ఇతడు పురుషుడు కదా! కావున మాతలను సంభాళించేందుకు ఆమెను ఉంచారు. బ్రహ్మ ముఖ వంశావళి అయిన సరస్వతి బ్రహ్మకు కూతురు అవుతుంది. మమ్మా యువతి. బ్రహ్మ వృద్ధుడు. మరి యువతి అయిన సరస్వతి బ్రహ్మకు భార్యగా శోభించదు కూడా. జీవిత భాగస్వామి అని పిలువబడజాలదు. ఇప్పుడు మీరు అర్థము చేసుకున్నారు. కనుక నేను ఈ బ్రహ్మ శరీరాన్ని అప్పుగా తీసుకోవలసి ఉంటుందని తండ్రి అంటారు. అప్పుగా అయితే చాలామంది తీసుకుంటూ ఉంటారు. బ్రాహ్మణులకు తినిపించినప్పుడు ఆ ఆత్మ వచ్చి బ్రాహ్మణుని శరీరాన్ని ఆధారంగా తీసుకుంటుంది. ఆత్మ ఆ శరీరాన్ని వదిలి అయితే రాదు కదా! అలా జరగదు. డ్రామాలో ఈ సాక్షాత్కారాల యొక్క ఆచారము కూడా మొదటి నుండి రచింపబడిందని పిల్లలకు అర్థము చేయించడం జరిగింది. ఇక్కడ కూడా పిలుస్తారు. అలా ఆత్మ శరీరాన్ని వదిలి వచ్చేస్తుందని కాదు. అలా రాదు. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. తండ్రి కొరకైతే ఈ రథము నంది గణము వంటిది. లేకుంటే శివుని మందిరంలో నందిని ఎందుకు చూపిస్తారు? సూక్ష్మ వతనములో శంకరుని వద్దకు నంది ఎక్కడ నుండి వచ్చినట్లు? అక్కడ బ్రహ్మ, విష్ణు, శంకరులే ఉంటారు. వారిని యుగల్స్(జంటలు)గా చూపిస్తారు. ప్రవృత్తి మార్గాన్ని చూపిస్తారు. మరి అక్కడకు ఆ జంతువు ఎక్కడ నుండి వచ్చింది? మనుష్యుల బుద్ధి ఏ మాత్రము పని చేయదు. ఏది తోస్తే అది అంటూ ఉంటారు. దాని వలన సమయము, శక్తి అన్నీ వ్యర్థమవుతాయి.
మేము పావన దేవతలుగా ఉండేవారము. మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మేము పతితులుగా, పూజారులుగా అయిపోయామని మీరు అంటారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు అని అంటారు కదా! పూజ్యునిగానూ, పూజారిగానూ భగవంతుడు అవ్వరు. వారు 84 జన్మలు తీసుకోరు. మాయ మనుష్యులను పూర్తిగా రాతిబుద్ధిగల వారిగా చేసేస్తుంది. ''హమ్ సో, సో హమ్'' అన్న పదానికి అర్థము - ఆత్మలైన మనమే పరమాత్మ అని కాదు. బ్రాహ్మణులైన మనమే దేవతలుగా అవుతాము అని దాని అర్థము. పునర్జన్మలు తీసుకుంటూ వస్తాము. ఇది ఎంత మంచి జ్ఞానము! నేను ఎవరిలో అయితే ప్రవేశించానో అతడు ఎందరో గురువులను ఆశ్రయించాడు. శాస్త్రాలు చదివాడు. పూర్తి 84 జన్మలు తీసుకున్నాడు. ఇతడికి ఆ జన్మలు తెలియవు. మీకు ఇతడితో పాటు ఈ విషయాలను తెలిపిస్తాను. బ్రహ్మకు కూడా తెలిపిస్త్తాను. నేను ఎల్లప్పుడు అలా స్వారీ చేయలేను. బ్రహ్మ ముఖ వంశావళులైన బ్రాహ్మణులకు తెలియజేస్తాను. నాకు రథము కూడా కావాలి కదా! పిల్లలైన మీరు స్మృతి చేస్తారు, నేను వచ్చేస్తాను. నేను సేవ చేయాలి కావున శ్రీ శ్రీ అయిన శివుని మతము ద్వారా భారతదేశము పావనంగా అవుతుంది. నరకవాసులకు శ్రీ శ్రీ అన్న టైటిల్ను ఇవ్వడం తప్పు. ఇంతకుముందు ఈ శ్రీ అన్న పేరు ఉండేది కాదు. ఇప్పుడు అందరినీ శ్రీ అనగా శ్రేష్ఠులుగా చేసేశారు. శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు ఒక్క శివబాబాయే. ఆ తర్వాత సూక్ష్మవతనవాసులైన బ్రహ్మ, విష్ణు, శంకరులు, ఆ తర్వాత శ్రీ లక్ష్మీనారాయణులు. ఇవి అర్థము చేసుకోవలసిన విషయాలు. జ్ఞానము ఎంతో ఆనందకరమైనది. కాని కొందరు చదువుతూ చదువుతూ పారిపోతారు. మాయ తండ్రి చేతిని వదిలింపచేస్తుంది. దుకాణాలు కూడా నంబరువారీగా ఉన్నాయి. పెద్ద దుకాణాలు తప్పకుండా మంచి సేల్స్మేన్ ఉంటారు. చిన్న-చిన్న దుకాణాలలో తక్కువ మంది ఉంటారు కావున మహారథులు ఉండే పెద్ద దుకాణము ఎక్కడైతే ఉంటుందో అక్కడకు వెళ్లాలి. మాతలకు చాలా సమయము ఉంటుంది. పురుషులు వ్యాపార వ్యవహారాలు చూసుకోవాలి. కాబట్టి బిజీగా ఉంటారు. మాతలైతే ఖాళీగా ఉంటారు. వంట వండితే చాలు. కాని వారు పురుషులు మళ్లీ మీ పై బంధనాలు వేస్తారు. బ్రహ్మకుమారీల వద్దకు వెళ్తే విషము ఆగిపోతుందని వింటారు. కావున మాతలను ఆపుతారు.
శివబాబా ఎటువంటి జారిపోయే వస్తువంటే వారిని ఘడియ ఘడియ మర్చిపోతారు. తండ్రి పూర్తిగా సహజమైన దారిని తెలియజేస్తారు - నన్ను స్మృతి చేసినట్లైతే, మీ పాపాలు కూడా అంతమైపోతాయి, అంతేకాక నా వద్దకు కూడా వచ్చేస్తారని చెప్తారు. స్మృతి చేయకుంటే పాపాలూ అంతమవ్వవు, నా వెంట కూడా తీసుకెళ్ళను. కనుక శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. భక్తి మార్గములో మజ్జిగ త్రాగుతూ వచ్చారు. వెన్నను మీరు సత్య, త్రేతా యుగాలలో తిని పూర్తి చేసేశారు పోతే చివరిలో మజ్జిగ మిగులుతుంది. ఆ మజ్జిగ కూడా మొదట మంచిది లభిస్తుంది ఆ తర్వాత నీరు నీరుగా లభిస్తుంది. సత్య, త్రేతా యుగాలలో నెయ్యి-పాల నదులు ప్రవహిస్తాయి. ఇప్పుడు నెయ్యి ఎంత ఖరీదైపోయింది! మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. రాజఋషులుగా అయ్యి తపస్సు చేయాలి. పూజ్యనీయ మాలలోకి వచ్చేందుకు తండ్రి సమానంగా సేవ చేయాలి. పక్కా యోగులుగా అవ్వాలి.
2. జ్ఞానము ఎంతో ఆనందదాయకమైనది కావున రమణీకతతో చదవాలి. తికమక పడరాదు.
వరదానము :-
''వరదానాల దివ్య పాలన ద్వారా సహజ (న్యాచురల్) శ్రేష్ఠమైన జీవితాన్ని అనుభవం చేసే సదా ఖుశ్నసీబ్ (భాగ్యశాలి) భవ ''
బాప్దాదా సంగమయుగంలో పిల్లలందరినీ మూడు సంబంధాలతో పాలన చేస్తారు. తండ్రి సంబంధములో వారసత్వ స్మృతి ద్వారా పాలన, శిక్షకుని సంబంధముతో చదువు ద్వారా పాలన, సద్గురువు సంబంధముతో వరదానాల అనుభూతి ద్వారా పాలన......... ఒకే సమయంలో అందరికి లభిస్తున్నాయి. ఈ దివ్య పాలన ద్వారా సహజమైన, శ్రేష్ఠమైన జీవితాన్ని అనుభవం చేస్తూ ఉండండి. శ్రమ, కష్టము అను శబ్ధాలే సమాప్తమైపోవాలి. అప్పుడు ఖుశ్ నసీబ్(గొప్ప భాగ్యము) అని అంటారు.
స్లోగన్ :-
''తండ్రితో పాటు సర్వ ఆత్మల స్నేహీలుగా అవ్వడమే సత్యమైన సద్భావన ''