10-10-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - క్రొత్త ప్రపంచము కొరకు తండ్రి మీకు అన్నీ క్రొత్త విషయాలు వినిపిస్తున్నారు, క్రొత్త మతాన్ని ఇస్తున్నారు. అందువలన వారి గతి-మతి భిన్నమైనవని మహిమ చేయబడింది ''
ప్రశ్న :-
దయా హృదయులైన తండ్రి పిల్లలందరినీ ఏ విషయములో హెచ్చరిస్తూ ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేస్తారు?
జవాబు :-
పిల్లలూ! శ్రేష్ఠమైన భాగ్యాన్ని తయారు చేసుకోవాలంటే సేవ చేయండి. ఒకవేళ కేవలం తింటూ-నిదురిస్తూ సేవ చేయకుండా ఉంటే ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకోలేరని బాబా చెప్తున్నారు. సేవ చేయకుండా తినడం పాప కర్మ అవుతుంది. అందువలన బాబా అప్రత్తము చేస్తారు. మొత్తము ఆధారమంతా చదువు పైనే ఉంది. బ్రాహ్మణులైన మీరు చదువుతూ, ఇతరులను చదివిస్తూ ఉండాలి. సత్యమైన గీతను వినిపించాలి. తండ్రికి పిల్లల పై దయ కలుగుతుంది. కావున ప్రతి విషయాన్ని అర్థము చేయిస్తూ, మార్గము చూపుతూ ఉంటారు.
పాట :-
మేము, మీరు కలిసిన రోజు నుండి,........ (జిస్ దిన్ సే మిలే హమ్ తుమ్,........) 
ఓంశాంతి.
ఆత్మిక తండ్రి అర్థము చేయిస్తున్నారు - అనంతమైన తండ్రి పిల్లలను ఎప్పుడు కలుసుకుంటారో, అప్పుడైతే అన్నీ కొత్త విషయాలే వినిపిస్తారు. ఎందుకంటే ఈ తండ్రి క్రొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. మానవులైతే ఇటువంటి క్రొత్త విషయాలను వినిపించలేరు. ఈ తండ్రినే హెవెన్లీ గాడ్ఫాదర్(స్వర్గ రచయిత) అని అంటారు. వారు అనంతమైన తండ్రి స్వర్గ స్థాపన చేస్తారు. నరకాన్ని స్థాపన చేయువాడు రావణుడు. పంచ వికారాలు స్త్రీలో, పంచ వికారాలు పురుషునిలో ఉంటాయి. అది రావణ సంప్రదాయము. కనుక ఈ క్రొత్త విషయాన్ని వినిపించాము కదా! స్వర్గాన్ని తయారు చేయువారు పరమపిత పరమాత్మ. వారిని 'రాముడు' అని అంటారు. నరకాన్ని తయారు చేయువాడు రావణుడు. అతడి బొమ్మను తయారు చేసి ప్రతి సంవత్సరము తగులబెడ్తారు. ఒకసారి కాలిపోయాక ఆ శరీరము మళ్ళీ కనిపించదు. ఆ ఆత్మ వెళ్లి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. రూపురేఖలు మొదలైనవన్నీ మారితాయి. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరము అదే రూపురేఖలున్న రావణుని చిత్రాన్ని తయారు చేసి తగులబెడుతూ ఉంటారు. వాస్తవములో ఎలాగైతే నిరాకారుడైన శివబాబాకు ఏ రూపురేఖలూ లేవో, అలాగే రావణునికి కూడా ఏ రూపురేఖలూ లేవు. ఈ వికారాలే రావణుడు అని తండ్రి అర్థము చేయిస్తున్నారు. భక్తిమార్గములో మనుష్యులు ఏమి కోరుకుంటారు? భగవంతుడు భక్తికి ఫలితాన్ని ఇచ్చేందుకే లేక రక్షించేందుకే వస్తారు. ఎందుకంటే భక్తిమార్గములో చాలా దు:ఖముంది. అల్పకాల క్షణ భంగురమైన సుఖముంది. ఇప్పుడు భారతవాసులది పూర్తిగా దు:ఖమయమైన జీవితము. ఎవరి కొడకు మరణించినా, ఎవరైనా దివాలా తీసినా, వారి జీవితము దు:ఖపూరితముగా అవుతుంది కదా! తండ్రి చెప్తున్నారు - నేను అందరి జీవితాన్ని సుఖమయము చేసేందుకు వస్తాను. తండ్రి వచ్చి క్రొత్త విషయాలు చెప్తున్నారు - నేను స్వర్గ స్థాపన చేసేందుకు వచ్చాను. అక్కడ మీరు వికారాలలోకి వెళ్లరు. అది నిర్వికారీ రాజ్యము, ఇది వికారీ రాజ్యము. ఒకవేళ మీకు స్వర్గ రాజ్యము కావాలంటే, దానిని ఆ తండ్రియే స్థాపన చేస్తారు. రావణుడు నరక రాజ్యాన్ని స్థాపన చేస్తాడు. మరి మీరు స్వర్గములోకి వెళ్తారా? వెకుంఠానికి మహారాజ-మహారాణులుగా, విశ్వానికి అధికారులుగా అవుతారా? అని తండ్రి అడుగుతున్నారు. ఇవి ఏ వేద శాస్త్రాలు మొదలైన వాటిలోని మాటలు కావు. రామ! రామ! అనమని, ప్రతి గుమ్మము(గడప) తిరగమని, మందిరాలు, తీర్థ స్థానాలు మొదలైన వాటికి వెళ్లమని లేక గీత, భాగవతము మొదలైనవి చదవమని బాబా చెప్పరు. సత్యయుగములో అయితే శాస్త్రాలు ఉండవు. మీరు భలే ఎన్ని వేదశాస్త్రాలు మొదలైనవి చదివినా, యజ్ఞ, జప, తప, దాన-పుణ్యాలు చేసినా అవన్నీ ఎదురుదెబ్బలు తినడమే. వాటి వలన ప్రాప్తి ఏమియూ లేదు. భక్తిమార్గములో ఎలాంటి లక్ష్యము, ఉద్ధేశ్యము ఉండదు. నేను మిమ్ములను స్వర్గానికి అధిపతులుగా చేసేందుకు వచ్చాను. ఈ సమయములో అందరూ నరకవాసులుగా ఉన్నారు. ఒకవేళ మీరు నరకవాసులు అని ఎవరికైనా చెప్పినట్లయితే వారు కోపపడ్తారు. నిజానికి నరకము అని కలియుగాన్ని, స్వర్గమని సత్యయుగాన్ని అంటారని మీకు తెలుసు. తండ్రి వైకుంఠ సామ్రాజ్యాన్ని తీసుకొచ్చారు. స్వర్గానికి అధిపతులుగా అవ్వాలనుకుంటే తప్పకుండా పవిత్రులుగా అవ్వాల్సి ఉంటుందని తండ్రి చెప్తున్నారు. ముఖ్యమైన విషయము పవిత్రతయే. చాలామంది మనుష్యులు మేము పవిత్రంగా ఎప్పుడూ ఉండలేమని అంటారు. అరే! స్వర్గములోకి వెళ్ళేందుకు తండ్రి మిమ్ములను పావనంగా తయారు చేస్తారు. మొదట శాంతిధామానికి వాపస్ వెళ్లి తర్వాత మళ్ళీ స్వర్గములోకి రావాలి. దేహమును వదిలి అశరీరులై వెళ్లాలి. అందువలన దేహాభిమానాన్ని వదిలేయండి అని అన్ని ధర్మాల వారికి చెప్తున్నారు. నేను క్రైస్తవుడను, నేను బౌద్ధుడను..... ఇవన్నీ దేహ ధర్మాలు. ఆత్మ అయితే ఆ మధురమైన ఇంటిలో పరంధామములో ఉంటుంది.
ఇప్పుడు వాపస్ ముక్తిధామానికి వెళ్తామా? అని తండ్రి అడుగుతున్నారు. అక్కడ మీరు శాంతిగా ఉంటారు. అయితే మీరు వాపస్ ఎలా వెళ్లగలరో చెప్పండి? తండ్రినైన నన్ను, మీ మధురమైన ఇంటిని స్మృతి చేయండి. దేహ ధర్మాలన్నీ వదిలేయండి. ఇతడు మామ, పినతండ్రి, పెదనాన్న మొదలైన అన్ని దేహ సంబంధాలను వదిలేయండి. స్వయాన్ని ఆత్మగా, దేహిగా అనగా దేహాన్ని ధరించిన ఆత్మగా భావించండి. నన్ను స్మృతి చేయండి. ఇదే మీరు చేయాల్సిన శ్రమ. నేను ఇంతకంటే ఎక్కువ వినిపించను(శ్రమ ఇవ్వను). శాస్త్రాలు మొదలైనవి ఏవైతే చదివారో, వాటన్నిటినీ వదిలేయండి. నేను నూతన ప్రపంచము కొరకు మీకు నూతన మతమునిస్తాను. ఈశ్వరుని గతి, మతి భిన్నమైనవని అంటారు కదా. ముక్తిని 'గతి' అని అంటారు. తండ్రి కొత్త విషయాలను వినిపిస్తారు కదా. ఇవి విన్నప్పుడు మనుష్యులు కూడా ఇవన్నీ క్రొత్త విషయాలని అంటారు. ఇక్కడ శాస్త్రాల మాటలేవీ లేవు. వాస్తవానికి ఇవి గీతలోని విషయాలే. కాని మనుష్యులు ఆ గీతను కూడా ఖండన చేసేశారు. నేను గీతను గాని, మరే ఇతర పుస్తకాన్ని గాని, చేతికి తీసుకోలేదు. అవన్నీ తర్వాత తయారవుతాయి. నేను మీకు జ్ఞానాన్ని వినిపిస్తాను. మీరు నా అపురూపమైన పిల్లలని(చాలాకాలం తర్వాత కలిసిన పిల్లలు) ఎప్పుడూ ఎవ్వరూ అనరు. ఈ నిరాకార పరమపిత పరమాత్మ మాత్రమే ఇలా అనగలరు. వారు నిరాకార ఆత్మలతో మాట్లాడ్తారు, ఆత్మ వింటుంది. ఈ శరీరములో ఇంద్రియాలున్నాయి. ఈ విషయాలు ఎప్పుడూ, ఎవ్వరూ అర్థము చేసుకోరు. అక్కడ మనుష్యులకు మనుష్యులకు వినిపిస్తారు. ఇక్కడ పరమాత్మ కూర్చుని ఆత్మలకు వినిపిస్తారు. ఆత్మలమైన మనము ఈ చెవుల ద్వారా వింటాము. పరమపిత పరమాత్మ కూర్చుని వినిపిస్తున్నారని మీకు తెలుసు. భగవంతుడు ఎలా వినిపిస్తారని మనుష్యులు ఆశ్చర్యపోతారు. వారు కృష్ణ భగవానువాచ అని భావిస్తారు. అరే! కృష్ణుడు దేహధారి కదా. నేను దేహధారిని కాను, నేను విదేహిని. నేను వినిపించేది కూడా విదేహీ ఆత్మలకే. ఈ క్రొత్త మాటలు విన్నప్పుడు మనుష్యులు ఆశ్యర్యచకితులైపోతారు. ఏ పిల్లలైతే కల్పక్రితము విని వెళ్ళారో వారికి ఈ విషయాలు చాలా బాగా నచ్చుతాయి, చదువుతారు, మమ్మా-బాబా అని అంటారు. ఇందులో గుడ్డి నమ్మకము ఏదీ ఉండజాలదు. లౌకిక పద్ధతిలో కూడా పిల్లలు తమ తల్లి, తండ్రులను అమ్మా-నాన్న అని పిలుస్తారు. ఇప్పుడు మీరు లౌకిక తల్లి, తండుల్ర స్మృతిని వదిలి పారలౌకిక మాతా-పితలను స్మృతి చేయండి. ఈ పారలౌకిక తల్లిదండుల్రు మీకు అమృతాన్ని ఇచ్చి పుచ్చుకోవడం నేర్పిస్తారు. పిల్లలూ! ఇప్పుడు మీరు విషాన్ని ఇచ్చి పుచ్చుకోవడం వదిలేయండి. నేను మీకు ఏ శిక్షణనైతే ఇస్తున్నానో దానిని ఒకరికొకరు ఇచ్చుకున్నట్లయితే మీరు స్వర్గానికి అధిపతులుగా అయిపోతారని బాబా చెప్తున్నారు. కొద్దిగా విన్నా స్వర్గములోకి వచ్చేస్తారు. కాని ఇతరులను మీ సమానంగా చేయలేకపోతే దాస-దాసీలుగా అయిపోతారు. దాస-దాసీలలో కూడా నెంబరువారుగా ఉంటారు. పిల్లలను సంభాళించే దాస-దాసీలు తప్పకుండా మంచి పదవి గలవారిగానే ఉంటారు. ఇక్కడ ఉంటూ కూడా చదవకపోతే దాస-దాసీలుగా అయిపోతారు. అలాగే ప్రజలలో కూడా నెంబరువారీగా ఉంటారు. ఎవరైతే బాగా చదువుకుంటారో వారు ఎంతో ఉన్నత పదవిని పొందుతారు. ప్రజలలోని ధనవంతులకు కూడా దాస-దాసీలు ఉంటారు. మేము ఎలా అయ్యేందుకు యోగ్యులుగా ఉన్నామని ప్రతి ఒక్కరు తమ ముఖాన్ని తామే చూసుకోవాలి. ఒకవేళ బాబాను ఎవరైనా అడిగితే బాబా వెంటనే తెలియజేస్తారు. తండ్రికైతే అన్నీ తెలుసు. ఈ కారణము వలన మీరు ఇలా అవుతారని బాబా నిరూపించి చెప్తారు. భలే సమర్పణ చేసిన దానికి కూడా లెక్కాచారముంటుంది. సమర్పణ చేసినా ఏ సేవా చేయకపోతే, కేవలం తింటూ-త్రాగుతూ గడిపారంటే, ఏదైతే ఇచ్చారో దానినంతా తిని సమాప్తము చేసుకుంటారు. ఏదైతే ఇచ్చారో దానంతా తింటూ సేవ చేయకపోతే మూడవ శ్రేణి దాస-దాసీలుగా అవుతారు. సేవ చేస్తూ తిన్నట్లయితే లెక్కాచారము సరిపోతుంది. అది మంచిదే. వ్యాపారమేమీ చేయకపోతే అంతా తిని సమాప్తము చేసుకుంటారు. భారము ఇంకా పెరిగిపోతుంది. ఇక్కడ ఉంటారు, ఏది పెడితే అది తింటారు. కొందరు భలే ఏమీ ఇవ్వకపోయినా, సేవ బాగా చేసినట్లయితే వారు ఉన్నత పదవిని పొందుతారు. మమ్మా ధనమేమీ ఇవ్వలేదు. కాని చాలా ఉన్నత పదవిని పొందుతుంది. ఎందుకంటే బాబా చెప్పిన ఆత్మిక సర్వీసు చేసింది. లెక్క అయితే ఉంది కదా! మేము సర్వస్వాన్ని ఇచ్చేశాము. సరెండరు(సమర్పణ) అయ్యామని కొందరికి నశా ఉంటుంది. కాని యజ్ఞములో తింటున్నారు కదా. బాబా అన్ని రకాల ఉదాహరణలు ఇస్తారు. సేవ చేయకుండా తింటూ ఉంటే సమాప్తము చేసుకుంటారు. ఎవరు నిద్రపోతారో, వారు కోల్పోతారు,......... ( జిన్ సోయా, తిన్ ఖోయా.......) అని అంటారు కదా. 8 గంటలు సేవ చేయకుండా తినడం పాప కర్మ అవుతుంది. కేవలం తింటూ ఉంటే ఏమీ జమ కాదు. మళ్ళీ ఇంకా సేవ చేయవలసి ఉంటుంది. తండ్రి అయితే అన్ని విషయాలను తెలియజేయవలసి ఉంటుంది కదా. ఎందుకంటే మాకు ఎందుకు చెప్పలేదు బాబా అని ఎవ్వరూ అనరాదు. బాబా తన సర్వస్వము ఇచ్చేశారు. అంతేకాక సేవ కూడా చేస్తుంటారు. కనుక వారికి ఉన్నత పదవి కూడా ఉంది. సమర్పితమై కూర్చుని తింటూ సేవ చేయకుంటే ఏమవుతారు? శ్రీమతానుసారము నడవరు. బాబా ప్రత్యేకించి అర్థము చేయిస్తున్నారు - మాకు ఇలాంటి పదవి ఎందుకు దొరికింది? అని చివరిలో ఎవ్వరూ అనకుండా అన్ని విషయాలు ముందే అర్థము చేయిస్తున్నారు. సేవ చేయక ఊరికే తింటూ ఉంటే దాని ఫలితము కల్ప-కల్పాలకు అలాగే ఉంటుంది. కనుక బాబా హెచ్చరిస్తున్నారు. కల్ప-కల్పాలకు మేము పద భ్రష్ఠులవుతామని అర్థము చేసుకోండి. బాబాకు దయ కలుగుతుంది. కనుక ప్రతి విషయమును స్పష్టంగా అర్థము చేయిస్తారు. సేవ చేయకుంటే శ్రేష్ఠ పదవిని పొందలేరు. గృహస్థ వ్యవహారములో ఉంటూ సర్వీసు చేసిన వారి పదవి చాలా ఉన్నతంగా ఉంటుంది.
పూర్తి ఆధారమంతా చదువు పైన, చదివించడము పైన ఉంటుంది. మీరు బ్రాహ్మణులు. మీరు సత్యమైన గీతను వినిపించాలి. వారు చంకలో శాస్త్రాలు(కచ్ఛ్ మే కురమ్) పెట్టుకుంటారు. మీ చంకలో ఏ గ్రంథాలూ లేవు. మీరు సత్యమైన బ్రాహ్మణులు. మీరు సత్యమే వినిపించాలి. సత్యమైన ప్రాప్తిని చేయించాలి. మిగిలిన వారందరూ నష్టమునే కలిగించారు. అందుకే అదంతా అసత్యము అని వ్రాయబడ్తుంది. బాబా సత్యాన్ని వినిపించి సత్య ఖండానికి అధికారులుగా చేస్తారు. ఇది బాగా అర్థము చేసుకోవలసిన విషయము. విశ్వానికి అధిపతులుగా అవ్వడం చిన్న విషయమా? తెలివిగల పిల్లలకు - మేము బంగారు ఇటుకలతో ఈ విధంగా భవనాలు కడ్తాము, అది చేస్తాము, ఇది చేస్తామని ప్లాన్లు తయారు చేస్తుంటారు. షావుకారు కొడుకు పెద్దవాడవుతున్న కొద్దీ నేను ఇది చేస్తాను, ఇది కడ్తాను అని అంటూ ఆలోచనలు చేస్తూ ఉంటాడు. మీరు కూడా భవిష్యత్తులో రాకుమారులుగా అవుతారు. కనుక మేము ఎవ్వరికీ లేనటువంటి భవనాలను నిర్మిస్తామనే ఆసక్తి, అభిరుచి ఉంటాయి కదా. బాగా చదువుకొని, ఇతరులను చదివించిన వారికే ఇటువంటి అభిరుచి ఉంటుంది. రాజ్యాధికారము ఉంటుంది కదా. మేము ఏ నెంబరులో పాసవుతాము? అను ఆలోచన బుద్ధిలో నడుస్తూ ఉండాలి. ఇది చాలా గొప్ప పాఠశాల. ఇందులో లక్షలాది మంది, కోట్లాది మంది చదువుకుంటారు, లెక్కలేనంత మంది వస్తారు. ఈ విషయాలన్నీ తండ్రియే కూర్చుని అర్థము చేయిస్తారు. భగవంతుడు ఒక్కరే. వారినే మాతా-పిత అని అంటారు. వారే వచ్చి దత్తత తీసుకుంటారు. ఇవి ఎంతటి గుహ్యమైన విషయాలు! ఇది క్రొత్త పాఠశాల. చదివించేవారు కూడా క్రొత్తవారే. ఎంత బాగా అర్థము చేయిస్తారు! యోగ్యులైన వారి జోలెను, బాబాను స్మృతి చేసిన వారి జోలెను బాబా నింపుతారు. తమ తల్లిదండ్రులను ఎవ్వరూ, ఎప్పుడూ మర్చిపోరు. మరి సంగమ యుగములోని పిల్లలు తండ్రిని ఎలా మర్చిపోగలరు? అచ్ఛా!
ప్రపంచములో ఎన్నో కోలాహలాలు, అలజడులు(ధమ్చక్ర్ ) జరుగుతున్నాయి. పిల్లలైన మీరు నిశ్శబ్ధంగా, శాంతిగా ఉన్నారు. నిశ్శబ్ధతలోనే శాంతి ఉంది. శాంతిలోనే సుఖముంది. ముక్తి తర్వాత మరలా జీవన్ముక్తి ఉందని మీకు తెలుసు. పిల్లలైన మీకు కేవలం రెండు శబ్ధాలు మాత్రమే జ్ఞాపకమున్నాయి. అల్ఫ్(అల్లా-పరమాత్ముడు), బే(సామ్రాజ్యము)'. కేవలం ఒక్క అల్ఫ్ను స్మృతి చేయడం ద్వారా సామ్రాజ్యము లభిస్తుంది. ఇంకేమి మిగిలింది? ఇక మిగిలింది మజ్జిగయే. అల్లా లభించారంటే వెన్న లభించినట్లే. మిగిలిందంతా మజ్జిగే కదా! మనము మౌనంగా, శాంతిగా ఉంటాము. మౌనముగా ఉంటూ మనము శ్రీమతమును అనుసరిస్తున్నామని మీకు తెలుసు. కాని విచిత్రమేమంటే పిల్లలు అల్లాను కూడా పూర్తిగా స్మృతి చేయరు, మర్చిపోతారు. మాయ తుఫానులు తీసుకొస్తుంది. బాబా కూడా మన్మనాభవ! మధ్యాజీ భవ! అని అంటారు. గీతలో కూడా ఈ శబ్ధాలు ఉన్నాయి. కావున మీరు గీత బోధించేవారిని 'మన్మనాభవ-మధ్యాజీభవ' అను పదాలకు అర్థమేమిటి అని అడగండి. నన్ను స్మృతి చేసినట్లయితే మీకు సామ్రాజ్యము లభిస్తుందని బాబా చెప్తారు. దేహ ధర్మాలన్నీ వదిలి దేహిగా అయిపోండి. తండ్రిని స్మృతి చేయండి. అప్పుడు మీకు సామ్రాజ్యము లభిస్తుంది. అల్లాను జపించినట్లయితే సామ్రాజ్యము లభిస్తుందని సిక్కుల గ్రంథములో చెప్పబడింది. సత్య ఖండము పై రాజ్యాధికారము లభిస్తుంది. మనము ఈ ప్రపంచానికి పూర్తిగా అతీతంగా ఉన్నాము. ఇలా ఇంకెవ్వరూ అనలేరు. బాబా మీకు క్రొత్త విషయాలను వినిపిస్తారు. మిగిలిన వారంతా పాత విషయాలనే వినిపిస్తారు. ఈ విషయము చాలా సహజమైనది. అల్లాకు చెందినవారిగా అయితే సామ్రాజ్యము లభిస్తుంది. అయినా పురుషార్థమైతే చేయవలసి ఉంటుంది. మీ సమానంగా తయారు చేసే సేవ ఎంతెంత చేస్తారో, అంత ఫలితము లభిస్తుంది. మనుష్యులకు అల్లాను గురించి తెలియదు, వారసత్వము గురించి కూడా తెలియదు. బే అనగా సామ్రాజ్యము అనే వెన్న, కృష్ణుని నోటిలో వెన్న చూపిస్తారు కదా. మరి తప్పకుండా స్వర్గ స్థాపన చేయువారే ఆ సామ్రాజ్యాన్ని ఇచ్చి ఉంటారు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మధురమైన ఇంటికి వాపస్ వెళ్లాలి. కనుక దేహ ధర్మాలను, సంబంధాలను మరిచి, స్వయాన్ని దేహీగా భావించరాలి. ఇదే అభ్యాసము చేస్తూ ఉండాలి.
2. బాబా నుండి ఏ శిక్షణలైతే లభించాయో వాటిని ఇతరులకు ఇవ్వాలి. మీ సమానంగా తయారు చేయాలి. రోజుకు 8 గంటలు తప్పకుండా సేవ చేయాలి.
వరదానము :-
'' దృష్టి ద్వారా శక్తి తీసుకొని, శక్తినిచ్చే మహాదాని, వరదానీ మూర్త్ భవ ''
పోను పోను వాచా ద్వారా సేవ చేసే సమయము మరియు పరిస్థితులు ఉండవు. అప్పుడు వరదానీ, మహాదానీ ఆత్మలు తమ దృష్టి ద్వారానే శాంతి శక్తిని, ప్రేమ, సుఖము మరియు ఆనంద శక్తులను అనుభవము చేయించగలరు. ఉదాహరణానికి జడవిగ్రహాల ముందుకు వెళ్ళినప్పుడు ఆ మూర్తుల ముఖాల ద్వారా ప్రకంపనలు లభిస్తాయి, కనుల ద్వారా దివ్యత అనుభవమవుతుంది. ఇంతకుముందు చైతన్యములో ఈ సేవ చేశారు. అప్పుడే మీ జడమూర్తులు తయారయ్యాయి. అందువలన ఇప్పుడు దృష్టి ద్వారా శక్తిని తీసుకొని, ఇచ్చే అభ్యాసము చెయ్యండి. అప్పుడు మహాదాని, వరదాని మూర్తులుగా అవుతారు.
స్లోగన్ :-
'' రూపురేఖల (ఫీచర్స్)లో సుఖము, శాంతి, సంతోషాల మెరుపు ఉంటే, అనేక ఆత్మల భవిష్యత్తు(ఫ్యూచర్)ను తయారు చేయగలరు ''