22-10-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - బుద్ధిని అటూ - ఇటూ భ్రమింపజేసేందుకు బదులు ఇంట్లో కూర్చొని బాబాను స్మృతి చేయండి, దూర-దూరాలకు బుద్ధిని తీసుకెళ్లండి, దీనినే స్మృతి యాత్ర అని అంటారు ''
ప్రశ్న :-
ఏ పిల్లలైతే సత్యమైన హృదయంతో తండ్రిని స్మృతి చేస్తారో వారి గుర్తులేవి ?
జవాబు :-
1. సత్యమైన హృదయంతో స్మృతి చేసే పిల్లల ద్వారా ఎప్పుడూ ఏ వికర్మలూ జరగజాలవు. వారి ద్వారా తండ్రికి గ్లాని కలిగించే కర్మలు ఏవీ జరగవు. వారి గుణగణాలు(మ్యానర్స్) చాలా బాగుంటాయి. 2. వారు భోజనం చేసేటప్పుడు కూడా స్మృతిలో ఉంటారు. నిద్ర నుండి కూడా సమయానికి స్వతహా(ఆటోమేటిక్)గా లేస్తారు. వారు చాలా సహనశీలురుగా, చాలా మధురంగా ఉంటారు. వారు తండ్రి వద్ద ఏ విషయాన్నీ దాచరు.
పాట :-
మా తీర్థ స్థానాలు అతీతమైనవి,,............. (హమారే తీర్థ్ న్యారే హై,...............) 
ఓంశాంతి.
తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. కొందరు నిరాకార తండ్రి అని భావిస్తారు. కొందరు సాకార తండ్రి అని భావిస్తారు. కొందరు మాత-పితలని భావిస్తారు. ఈ మాత-పితలు అర్థం చేయిస్తారని అన్నప్పుడు తల్లి వేరు, తండ్రి వేరు అవుతారు కదా! నిరాకారుడు అర్థం చేయించినట్లైతే నిరాకారుడు వేరుగా, సాకారుడు వేరుగా ఉంటారు. కాని ఇవి అర్థం చేయించేవారు తండ్రియే. దైహికమైన తీర్థయాత్రలు, ఆత్మిక తీర్థయాత్రలు ఉన్నాయని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఆ భౌతికమైన తీర్థయాత్రలు అర్ధకల్పానికి చెందినవి. జన్మ-జన్మాంతరాలుగా ఇవి కొనసాగుతూ వస్తున్నాయని చెప్తే, ప్రారంభం నుండి ఇది వస్తున్నట్లుగా అనాది అని భావిస్తారు. కానీ అలా లేనే లేదు. అందుకే అర్ధకల్పం నుండి అని అనడం జరుగుతుంది. ఇప్పుడు తండ్రి వచ్చి ఈ తీర్థ యాత్రల రహస్యాన్ని అర్థం చేయించారు. మన్మనాభవ అనగా ఆత్మిక తీర్థయాత్ర. తప్పకుండా వారు ఆత్మలకే అర్థం చేయిస్తారు. అర్థం చేయించేవారు పరమపిత పరమాత్మ. ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ప్రతి ఒక్కరు తమ-తమ ధర్మస్థాపకుల తీర్థస్థానాలకు వెళ్తారు. ఇది కూడా అర్ధకల్పపు ఆచారము. అందరూ తీర్థయాత్రలకు వెళ్తారు. కానీ ఆ తీర్థయాత్రలు ఎవ్వరికీ సద్గతినివ్వలేవు. స్వయం వారే పదే పదే తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. అమరనాథ్, బదరీనాథ్ వైపుకు ప్రతి సంవత్సరము తీర్థయాత్రలు చేసేందుకు వెళ్తూ ఉంటారు. నాలుగు ధామాలు చుట్టి వస్తారు. ఇప్పుడు ఈ ఆత్మిక తీర్థయాత్రను గూర్చి మీకు మాత్రమే తెలుసు. ఆత్మిక పరమపిత(సుప్రీం తండ్రి) వచ్చి - ''మన్మనాభవ, మిగిలిన భౌతికమైన తీర్థయాత్రలు మొదలైనవన్నీ వదిలేయండి, నన్ను స్మృతి చేసినట్లైతే మీరు సత్య సత్యమైన స్వర్గములోకి వెళ్ళిపోతారు'' అని అర్థం చేయించారు. యాత్ర అనగా రావడము, పోవడము. అది ఇప్పుడే జరుగుతుంది. సత్యయుగములో యాత్ర అనేది ఉండదు. మీరు సదా కాలం స్వర్గాశ్రమములోకి వెళ్లి కూర్చుంటారు. ఇక్కడ కేవలం స్వర్గాశ్రమమని పేరు మాత్రమే ఉంచుకుంటారు. వాస్తవానికి స్వర్గాశ్రమము ఇక్కడ ఉండదు. స్వర్గాశ్రమము అని సత్యయుగాన్ని అంటారు. నరకానికి ఈ పదాన్ని ఇవ్వజాలరు. నరకవాసులు నరకములోనే ఉంటారు. స్వర్గవాసులు స్వర్గములోనే ఉంటారు. ఇక్కడ భౌతికమైన ఆశ్రమాలలోకి వెళ్ళి మళ్లీ తిరిగి వస్తారు. ఈ విషయాలను అనంతమైన తండ్రి అర్థం చేయిస్తారు. నిజానికి సత్య సత్యమైన అనంతమైన గురువు ఒక్కరే. అలాగే అనంతమైన తండ్రి కూడా ఒక్కరే. భలే ఆగాఖాన్ను గురువు అని అన్నా నిజానికి అతడు గురువేమీ కాడు. అతడు సద్గతిదాత అయితే కాడు కదా! అతడు సద్గతిదాత అయినట్లైతే తాను స్వయం గతి, సద్గతులలోకి వెళ్లాలి. అతనిని గురువు అని అనరు. కేవలం పేరు అలా పెట్టేశారు. సిక్కులు సద్గురువు అకాల్ అని అంటారు. నిజానికి సత్ శ్రీ అకాల్ ఒక్క పరమాత్మయే. వారిని సద్గురువు అని కూడా అంటారు. సద్గతినిచ్చేవారు వారే. ఇస్లాం మతస్థులు, బౌద్ధులు లేక బ్రహ్మ మొదలైనవారు సద్గతిని ఇవ్వలేరు. భలే గురుబ్రహ్మ, గురువిష్ణు అని అంటారు. బ్రహ్మను భలే గురువు అని అనవచ్చేమో కాని విష్ణువు, శంకరుడు గురువులు అవ్వజాలరు. గురుబ్రహ్మ అన్న పేరు తప్పకుండా ఉంది. కానీ గురువైన బ్రహ్మకు కూడా ఎవరో గురువు ఉంటారు కదా! ఆ సత్ శ్రీ అకాలమూర్తికి గురువు ఎవ్వరూ లేరు. వారు ఒక్కరే సద్గురువు. ఇంకే గురువులూ లేక వేదాంతులు ఎవ్వరూ ఆత్మిక జ్ఞానాన్ని ఇవ్వలేరు. అది వారొక్కరే ఇస్తారు. బుద్ధ్దుడు మొదలైనవారు తమ వెనుక అందరినీ తీసుకొస్తారు. వారు కూడా రజో, తమోలలోకి రావలసిందే. వారు సద్గతి ఇచ్చేందుకు రారు. సద్గతిదాత అన్న పేరు ఒక్కరికే ప్రసిద్ధమౌతుంది. వారిని మళ్లీ సర్వవ్యాపి అని అంటారు. మరి అలాగైతే గురువులను స్వీకరించవలసిన, ఆశ్రయించవలసిన అవసరం ఏముంది? నేనూ గురువునే - నీవూ గురువువే, నేనూ శివుడినే, నీవూ శివుడివే అని ఇలా అనడం ద్వారా ఎవ్వరి కడుపూ నిండదు. కానీ వారు పవిత్రముగా ఉన్నారు. అందుకే వారికి ఎంతో గౌరవముంది. కానీ వారు సద్గతిని ఇవ్వలేరు. సత్య-సత్యమైన గురువు అని ఒక్కరినే అంటారు. గురువులు అనేక రకాలుగా ఉంటారు. కుస్తీలు మొదలైనవి నేర్పించే ఉస్తాదును కూడా గురువు అనే అంటారు. అలాగే వీరు కూడా ఉస్తాదే. మాయ పై యుద్ధం చేయడం నేర్పిస్తారు. పిల్లలైన మీకు మూడుకాలాల జ్ఞానముంది. దాని ద్వారా మీరు చక్రవర్తులుగా అవుతారు. సృష్టిచక్రాన్ని తెలుసుకునేవారే చక్రవర్తి రాజులుగా అవుతారు. డ్రామా చక్రాన్ని లేక కల్పవృక్షము ఆదిమధ్యాంతాలను తెలుసుకోవడం రెండూ ఒక్కటే. చక్రము గుర్తు చాలా శాస్త్రాలలో కూడా వ్రాయబడి ఉంది. ఫిలాసఫీ పుస్తకము వేరుగా ఉంటుంది. పుస్తకాలు అనేక రకాలుగా ఉంటాయి. ఇక్కడ మీరు ఏ పుస్తకాలనూ చదవవలసిన అవసరం లేదు. మీకు బాబా ఏది నేర్పిస్తారో అది అర్థం చేసుకోవాలి. తండ్రి ఆస్తి పై పిల్లలందరికి హక్కు ఉంటుంది. కాని స్వర్గములో అందరికీ ఒకే రకమైన ఆస్తి ఉండదు. అది రాజ్యము. ఎవరైతే తండ్రికి చెందినవారిగా అవుతారో వారికే రాజ్యము లభిస్తుంది. బాబా అని పిలిచి, కాస్త జ్ఞానాన్ని వింటే వారు హక్కుదారులుగా అయిపోతారు. కానీ నెంబరువారుగా ఉంటారు. విశ్వమహారాజు ఎక్కడ, ప్రజలు, దాస-దాసీలు ఎక్కడ! ఇక్కడ మొత్తం రాజధాని అంతా స్థాపనవుతూ ఉంది. తండ్రికి చెందినవారిగా అయినందున స్వర్గ వారసత్వమైతే తప్పకుండా లభిస్తుంది. వారసత్వము తండ్రి నుండే లభిస్తుంది. ఇవి కొత్త విషయాలైనందున మనుష్యులు అర్థం చేసుకోరు. సత్యయుగములో వికారాలే ఉండవని తండ్రి అర్థం చేయిస్తారు. అసలు మాయనే లేనప్పుడు వికారాలు ఎక్కడ నుండి వస్తాయి? ద్వాపర యుగము నుండి మాయ యొక్క రాజ్యము ప్రారంభమౌతుంది. ఇవి రావణుని 5 సంకెళ్ళు. అక్కడ ఇవేవీ ఉండవు. ఎవ్వరితోనూ ఎక్కువగా వాదించరాదు. ఆ ప్రపంచమే సంపూర్ణ నిర్వికారీ ప్రపంచము. పోతే పిల్లలు జన్మించడం, సింహాసనము పై కూర్చోవడం మహళ్ళు మొదలైనవి తయారు చేయడం మొదలైనవాటి ఆచార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా మంచివిగానే ఉంటాయి. ఎందుకంటే అది స్వర్గము.
పిల్లలూ! ఈ ఆత్మికయాత్రలో మీరు నిరంతరము బుద్ధియోగాన్ని జోడించాలి. ఇది చాలా సులభమైనదని తండ్రి అర్థం చేయిస్తున్నారు. భక్తిమార్గములో కూడా ఉదయమే లేస్తారు. అలాగే జ్ఞాన మార్గములో కూడా ఉదయమే లేచి తండ్రిని స్మృతి చేయాలి. ఇంకే పుస్తకము మొదలైనవి చదివే అవసరము లేదు. కేవలం నన్ను స్మృతి చేయండి ఎందుకంటే ఇప్పుడు చిన్న - పెద్ద అందరి ముందు మృత్యువు నిల్చొని ఉందని తండ్రి చెప్తున్నారు. మరణించే సమయంలో భగవంతుని స్మరించమని, అంత్యకాలములో భగవంతుని స్మృతి చేయకుంటే స్వర్గానికి వెళ్ళలేరని అంటారు. ఇప్పుడు తండ్రి కూడా చెప్తున్నారు - మన్మనాభవ, ఈ దేహమును కూడా స్మృతి చేయరాదు. ఆత్మనైన నేను ఒక పాత్రధారిని, శివబాబా సంతానాన్ని. నిరంతరము స్మృతిలో ఉండాలి. భగవంతుడిని స్మృతి చేయండి అని చిన్న పిల్లలకైతే చెప్పరు కదా! కాని ఇక్కడ అందరికీ చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే అందరూ తండ్రి వద్దకు వెళ్లాలి. తండ్రితోనే బుద్ధియోగాన్ని జోడించాలి. ఎవ్వరితోనూ పోట్లాడరాదు. అది చాలా నష్టదాయకమైనది. ఎవరైనా ఏమైనా అంటే వినీ, విననట్లుగా వదిలేయాలి. పోట్లాట జరిగే విధంగా ఎదుర్కోరాదు. ప్రతి విషయములోనూ సహనశీలురుగా ఉండాలి. తర్వాత అలాగే అర్థం కూడా చేయించాలి. తండ్రి, తండ్రే కాక ధర్మరాజు కూడా అని అర్థం చేయించాలి. ఏదైనా విషయం జరిగితే మీరు తండ్రికి రిపోర్ట్ చేయండి. అది మళ్లీ ధర్మరాజు వద్దకు తప్పకుండా చేరుకుంటుంది. శిక్షలకు పాత్రులుగా అయిపోతారు. తండ్రి చెప్తున్నారు - నేను సుఖదాతను. దు:ఖమును అనగా శిక్షలను ధర్మరాజు ఇస్తాడు. నాకు శిక్షించే అధికారము లేదు. నాకు వినిపించండి. శిక్షలు ధర్మరాజు ఇస్తాడు. బాబాకు(బ్రహ్మకు) వినిపించినట్లైతే తేలికగా అయిపోతారు. ఎందుకంటే వీరు కుడిభుజము కదా! సద్గురువు యొక్క నిందకులు ఏ ఆధారమునూ పొందలేరు. దోషము ఎవ్వరిదో ఆ జడ్జిమెంట్ను ధర్మరాజే ఇస్తాడు. అతడి నుండి ఏమీ దాచలేరు. డ్రామానుసారము పొరపాటు చేశారు. కల్ప పూర్వము కూడా చేసి ఉంటారని అంటారు. అలాగని దీని అర్థము ఆ పొరపాట్లను చేస్తూనే ఉండమని కాదు. అలాగైతే మళ్లీ పొరపాట్లు లేనివారి(అభూల్)గా ఎలా అవుతారు? ఏదైనా తప్పు జరిగితే క్షమాపణ అడగవలసి ఉంటుంది. బెంగాల్లో ఎవరికైనా కాలు మొదలైనవి తగిలితే వెంటనే క్షమించమని అడుగుతారు. కానీ ఇక్కడైతే ఒకరినొకరు తిట్టుకోవడం మొదలుపెడ్తారు. మ్యానర్స్ చాలా బాగుండాలి. తండ్రి చాలా నేర్పిస్తారు. కానీ అర్థం చేసుకోకపోతే మీ రిజిస్టర్ బాగోలేదని భావించడం జరుగుతుంది. నిందింపజేస్తూ ఉంటే పదభ్రష్ఠులుగా అయిపోతారు. జన్మ-జన్మాంతరాల వికర్మల భారమైతే ఉండనే ఉంది. దాని శిక్షను అనుభవించవలసిందే. ఇక్కడ ఉంటూ మళ్లీ వికర్మలు చేసినట్లైతే దానికి 100 రెట్ల శిక్షలు లభిస్తాయి. శిక్షలు అనుభవించవలసిందే. బాబా కాశీలోని కత్తులబావిలో బలి అవ్వడము(కాశీకల్వట్)ను గూర్చి అర్థం చేయిస్తారు. అది భక్తిమార్గములోని విషయము. ఇది జ్ఞాన మార్గము. ఒకటేమో ఇంతకుముందు చేసిన వికర్మలు ఉన్నాయి. మళ్లీ ఈ సమయములో ఏ వికర్మలైతే చేస్తారో దాని దండన 100 రెట్లుగా అయిపోతుంది. చాలా కఠినమైన శిక్షలను అనుభవించవలసి వస్తుంది. తండ్రి ఏమో ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు. ఏ పాపాలూ చేయకండి, నిర్మోహులుగా అవ్వండి అని బాబా అంటారు. ఇందులో ఎంతో శ్రమించాలి. ఈ మమ్మా-బాబాలను స్మృతి చేయరాదు. వీరిని స్మృతి చేయడం ద్వారా జమ అవ్వదు. ఇతని(బ్రహ్మ)లోకి శివబాబా వస్తారు. స్మృతి శివబాబాను చేయాలి. ఇతనిలో శివబాబా ఉన్నారు కనుక ఇతడిని స్మృతి చెయ్యాలని కాదు. అలా చేయరాదు. శివబాబాను అక్కడే(పరంధామములో) స్మృతి చేయాలి. శివబాబాను, మధురమైన ఇంటిని స్మృతి చేయాలి. జిన్ను భూతము వలె బుద్ధిలో గుర్తుంచుకోవాలి. శివబాబా అక్కడ ఉంటారు, ఇక్కడకు వచ్చి వినిపిస్తారు. కానీ మనము వారిని అక్కడే స్మృతి చేయాలి, ఇక్కడ కాదు. బుద్ధి దూరంగా వెళ్లాలే కాని ఇక్కడ ఉండరాదు. ఈ శివబాబా ఏమో వెళ్లిపోతారు. శివబాబా ఇతడొక్కరిలోకే వస్తారు. మమ్మాలో వారిని చూడలేరు. ఇతడు బాబా రథమని మీకు తెలుసు. కాని ఇతని ముఖాన్ని చూడరాదు. బుద్ధి అక్కడ వ్రేలాడుతూ ఉండాలి. బుద్ధి ఇక్కడ ఉంటే అంతటి ఆనందం(మజా) కలగదు. అప్పుడు ఇది యాత్ర అవ్వజాలదు. మీ యాత్ర హద్దు అక్కడే ఉంది. ఈ బాబాలో శివబాబా ఉన్నారని, వీరినే చూస్తూ ఉండడం కాదు. అలాగైతే పైకి వెళ్లే అలవాటు పోతుంది. నన్ను అక్కడ స్మృతి చేయండి. బుద్ధి యోగాన్ని అక్కడే జోడించండి అని బాబా అంటారు. కొందరు అమాయకులు కూర్చొని బాబానే చూస్తూ ఉండాలని భావిస్తారు. అరే! బుద్ధిని మధురమైన ఇంటిలో ఉంచాలి. శివబాబా ఎల్లప్పుడూ రథములో ఉండరు కదా! ఇక్కడకు వచ్చి కేవలం సేవ చేస్తారు. సవారీ తీసుకొని సేవ చేసి, మళ్లీ దిగిపోతారు. నంది పై ఎల్లప్పుడూ స్వారీ జరగజాలదు. కావున బుద్ధి అక్కడే ఉండాలి. బాబా వస్తారు. మురళీని వినిపించి వెళ్లిపోతారు. ఇతడి బుద్ధి కూడా అక్కడే ఉంటుంది. మార్గాన్ని సరిగ్గా పట్టుకోవాలి లేకుంటే ఘడియ ఘడియ పట్టాల నుండి పడిపోతారు. ఇక కొద్ది సమయము మాత్రమే ఉంది. ఇతనిలో శివబాబాయే లేకపోతే ఇతనిని ఎందుకు స్మృతి చేస్తారు? మురళీని ఇతడు కూడా వినిపించగలడు. ఇతడిలో కాసేపు ఉంటారు, కాసేపు ఉండరు. కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. కావున స్మృతి అక్కడ(పరంధామములో) చేయండి.
డ్రామానుసారము కల్ప పూర్వము ఈ రోజు ఏ మురళీనైతే వినిపించానో, అదే వెళ్లి చెప్తానని అప్పుడప్పుడు బాబా అనుకుంటారు. కల్ప పూర్వము బాబా నుండి ఎంత వారసత్వమునైతే తీసుకున్నామో అంతే వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీరు కూడా చెప్పవచ్చు. శివబాబా పేరును తప్పకుండా తీసుకోవాలి. కాని ఇలాంటి ఆలోచన ఎవ్వరికీ రాదు. తండ్రి తప్పకుండా గుర్తుకు వస్తారు. తండ్రి పరిచయమునే ఇవ్వాలి. అంతేకాని కేవలం ఇతడిని చూస్తూ కూర్చోవడం కాదు. శివబాబాను స్మృతి చేయండి లేకపోతే పాపం పెరుగుతుందని బాబా అర్థం చేయించారు. నిరంతరము తండ్రిని స్మృతి చేయాలి లేకపోతే వికర్మలు వినాశనమవ్వవు. ఇది చాలా పెద్ద గొప్ప గమ్యము. ఇది పిన్నమ్మ ఇల్లు కాదు(సులభము కాదు). భోజనము చేసేందుకు ముందు ఒక్క క్షణం స్మృతి చేస్తారు. తర్వాత స్మృతి ఉండదు అలాగే భోజనము తింటారు. అలా కాదు. భోజనము చేసినంతసేపు స్మృతి చేయవలసి ఉంటుంది. ఇది సామాన్యమైనదేమీ కాదు. ఇందులోనే శ్రమ ఉంది. అంత సులువుగా ఉన్నత పదవి లభించజాలదు. అందుకే కోట్లాది మందిలో 8 రత్నాలు మాత్రమే పాసవుతారు. గమ్యం చాలా గొప్పది. విశ్వాధిపతులుగా అవ్వాలి. ఇది ఎవరి బుద్ధిలోనూ ఉండదు. ఇంతకుముందు ఇతడి బుద్ధిలో కూడా లేదు. 84 జన్మలు ఎవరికి లభిస్తాయో ఇప్పుడు ఆలోచించడం జరుగుతుంది. తప్పకుండా ఎవరైతే మొదట వస్తారో వారికి లభిస్తాయి. వారు లక్ష్మీనారాయణులే. ఇవన్నీ విచార సాగర మథనము చేయవలసిన విషయాలు. చేతులు పని వైపు, హృదయం ప్రియుని వైపు ఉండాలని తండ్రి అర్థం చేయిస్తారు. భలే మీరు వ్యాపార-వ్యవహారాలలో ఉన్నా నిరంతరము తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఇదే యాత్ర, ఆ తీర్థయాత్రకు వెళ్లి మళ్లీ తిరిగి వచ్చేది లేదు. మనుష్యులు ఎన్నో తీర్థ యాత్రలు చేస్తారు. కాని ఇప్పుడు అక్కడ కూడా మురికిగా అయిపోయింది. నిజానికి తీర్థ స్థానాలలో ఎప్పుడూ వేశ్యాలయాలు ఉండవు. ఇప్పుడు ఎంత భ్రష్టాచారముందో చూడండి! నాథుడు ఎవ్వరూ లేరు. వెంటనే తిట్టుకోవడం మొదలుపెడ్తారు. ఈ రోజు చీఫ్ మినిష్టర్గా ఉంటాడు. రేపు అతడిని కూడా దించేస్తారు. మాయకు దాసులుగా, అనుచరులుగా అయిపోతారు. డబ్బు ప్రోగు చేసుకుంటారు. ఇళ్ళు నిర్మించుకుంటారు. అంతేకాక ధనము కొరకు దొంగతనాలు చేయడం మొదలుపెడ్తారు. ఇప్పుడు మీరు స్వర్గములోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్వర్గమే గుర్తుకు రావాలి. ధారణ కూడా జరగాలి. మురళిని వ్రాసుకొని మళ్లీ రివైజ్ చేసుకోవాలి. తీరిక సమయము చాలా ఉంటుంది. రాత్రివేళలో ఎంతో ఖాళీ ఉంటుంది. రాత్రుళ్లు మేల్కుంటే అది అలవాటైపోతుంది. ఎవరైతే బాబాను సత్యంగా స్మృతి చేస్తారో, వారి కనులు తమంతట తామే తెరుచుకుంటాయి. రాత్రివేళలో కళ్ళు ఎలా తెరుచుకునేవో బాబా తమ అనుభవం చెప్తారు. ఇప్పుడింకా నిద్ర కొరకు పురుషార్థం చేస్తారు. స్థూలమైన పనులు చేయడం ద్వారా కూడా శరీరం అలసిపోతుంది. బాబా రథము కూడా ఎంత పురాతనమయ్యిందో చూడండి! బాబా పతిత ప్రపంచములోకి వచ్చి ఎంతగా కష్టపడ్తారో ఆలోచించండి! భక్తిమార్గములో కూడా ఎంతో కష్టపడేవారు. ఇప్పుడు కూడా కష్టపడ్తున్నారు. శరీరమూ పతితమైనదే. ప్రపంచము కూడా పతితమైనదే. తండ్రి అంటున్నారు - నేను అర్ధకల్పము ఎంతో విశ్రాంతి తీసుకుంటాను. ఏమీ ఆలోచించవలసిన పని ఉండదు. కానీ భక్తిమార్గములో ఎంతో ఆలోచించవలసి ఉంటుంది. అందుకే తండ్రిని దయాహృదయుడు అని మహిమ చేస్తారు. వారు జ్ఞానసాగరుడు. సాగరమైతే ఒక్కటే ఉంటుంది. తర్వాత దానికి విభజనలు జరుగుతాయి. ఆ తండ్రియే మనలను చదివిస్తారు. ఇంకెవ్వరూ చదివించలేరు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఎవ్వరినీ ఎదిరించరాదు, ఎవరైనా, ఏదైనా అంటే వినీ విననట్లుగా వదిలేయాలి. సహనశీలురుగా అవ్వాలి. సద్గురువును నిదింపజేయరాదు.
2. మీ రిజిస్ట్టరును పాడు కానివ్వరాదు. ఏదైనా తప్పు జరిగితే తండ్రికి వినిపించి క్షమాపణ పొందాలి. అక్కడ (పరంధామములో) స్మృతి చేసే అభ్యాసము చేసుకోవాలి.
వరదానము :-
'' దూరంగా వెళ్లేందుకు బదులు స్వయాన్ని అడ్జస్ట్ చేసుకునే సహనశీలతా అవతార్ భవ ''
చాలామంది పిల్లలలో సహనశక్తి తక్కువగా ఉంటుంది. అందువలన ఏదైనా చిన్న విషయము జరిగినా, మొఖము త్వరగా మారిపోతుంది. భయపడి(గాభరాపడి), ఉన్న స్థానాన్నుండి మారిపోవాలని అయినా అనుకుంటారు లేక ఎవరితో విసుగు చెందుతూ ఉంటారో వారినైనా మార్చేస్తారు. స్వయాన్ని మార్చుకోరు, కాని ఇతరుల నుండి దూరమౌతారు. అందువలన స్థానాన్ని లేక ఇతరులను మార్చేందుకు బదులు స్వయాన్ని మార్చుకోండి, సహనశీలతా అవతారంగా అవ్వండి. అందరితో అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోండి.
స్లోగన్ :-
''పరమార్థము ఆధారంతో వ్యవహారాన్ని సిద్ధం చేయడమే యోగీ లక్షణం ''