03-10-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మీకు చాలా విచిత్రమైన గురువు లభించారు. మీరు వారి శ్రీమతమును అనుసరిస్తే (డబుల్) ద్వి కిరీటధారీ దేవతలుగా అయిపోతారు ''
ప్రశ్న :-
విద్య(చదువు)లో ఎప్పుడూ అలసిపోకుండా ఉండేందుకు సహజమైన పురుషార్థము ఏది ?
జవాబు :-
విద్య(చదువు)ను అభ్యసించే సమయములో వచ్చే నింద-స్తుతి, మాన-అవమానాలలో స్థితి సమానంగా ఉండాలి. వాటిని ఒక ఆటగా భావిస్తే ఎప్పుడూ అలసట రాదు. అందరికంటే ఎక్కువగా కృష్ణుని నిందించారు. ఎన్ని కళంకాలు ఆపాదించారు! మళ్ళీ అలాంటి కృష్ణుడిని పూజిస్తూ కూడా ఉన్నారు. కనుక నిందలు లభించడం కొత్త విషయమేమీ కాదు. కనుక చదువులో అలసిపోరాదు. ఎప్పటివరకు తండ్రి చదివిస్తూ ఉంటారో, అంతవరకు చదువుతూనే ఉండాలి.
పాట :-
'' హే కృష్ణా! జీవితానికి నీ పేరే ఆధారము,.......... ( బన్వారీ రే జీనే కా సహారా తేరా నామ్ రే!.......... ) 
ఓంశాంతి.
ఈ విధంగా ఎవరన్నారు? ఎవరు ఎవరిని ఆజ్ఞాపించారు? ఈ విషయం గోప-గోపికలుగా అనబడే పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. కావున వారు తమ తండ్రి అయిన గోపీవల్లభుని స్మృతి చేశారు. అలాంటి తండ్రి పరమపిత పరమాత్మ తప్ప వేరెవ్వరూ కాజాలరు. ఎవరైతే ఉండి వెళ్లిపోయారో వారినే స్మృతి చేయడము జరుగుతుంది. తర్వాత వారి మహిమ జరుగుతుంది. ఉదాహరణకు - క్రీస్తు వచ్చారు. క్రిష్టియన్ ధర్మ స్థాపన చేసి ఎక్కడికీ వెళ్లిపోలేదు. ఎందుకంటే స్థాపన చేసిన ధర్మాన్ని పాలన కూడా తప్పకుండా చేయాలి. పునర్జన్మ తీసుకోవాలి. కానీ ఎవరు ధర్మస్థాపన చేసి వెళ్లారో వారి పుట్టినరోజును ప్రతి సంవత్సరము ఆచరిస్తారు. భక్తిమార్గములో వారిని స్మృతి చేయడం జరుగుతుంది. అదే విధంగా వర్తమాన సమయములో దశరా ఉత్సవము మొదలైనవాటిని కూడా జరుపుతారు. ఆచరిస్తూ ఉన్నారంటే తప్పకుండా శుభమే కలుగుతుంది. ఎవరైనా మంచి పని చేసి వెళ్లారంటే వారి ఉత్సవాన్ని ఆచరించడము జరుగుతుంది. దీపావళి ఉత్సవాన్ని కూడా ఆచరిస్తారు. కృష్ణ జయంతిని కూడా ఆచరిస్తారు. ఎవరు ఉండి వెళ్ళిపోయారో, వారి ఉత్సవాన్ని ఆచరిస్తారు. అయితే ఈ రాఖీ మొదలైన ఉత్సవాలను ఎందుకు ఆచరిస్తున్నారు? ఏమి జరిగిందో భారతవాసులకు తెలియదు. ఏసుక్రీస్తు, బుద్ధుడు మొదలైనవారు ధర్మస్థాపన చేసేందుకు వచ్చారని తెలుసు. ఈ సమయములో అందరూ ఆసురీ సంప్రదాయానికి చెందినవారు. మీరు ఈశ్వరీయ సంప్రదాయానికి చెందినవారు. ఇప్పుడు 'తండ్రి అయిన రాముడు వచ్చి దైవీ శ్రేష్ఠాచారులుగా తయారు చేస్తున్నారు లేక పరమపిత వచ్చి స్వర్గాన్ని ఉద్ఘాటన(ప్రారంభం) చేస్తున్నారు లేక పునాది వేస్తున్నారని కూడా అనవచ్చు. ప్రారంభోత్సవము అని కూడా అనవచ్చు. భారతదేశములో శ్రేష్ఠాచారీ మహారాజా - మహారాణులు ఉండి వెళ్ళిపోయారు. సత్యయుగీ దేవీ దేవతలు ద్వి కిరీటధారులుగా ఉండేవారు. పవిత్రతా కిరీటముతో పాటు రత్నజడిత కరీటము కూడా ఉండేది. వికారీ రాజులకు కేవలం రత్నజడిత కిరీటము ఉంటుంది. డబుల్ కిరీటధారులను సింగల్ కిరీటధారులు పూజిస్తారు. కాని 'ఎప్పుడు ఉండి వెళ్ళిపోయారో, ఎలా రాజ్యము పొందారో ఎవ్వరికీ తెలియదు. లక్ష్మీనారాయణులు ఇంతటి శ్రేష్ఠమైన డబల్ కిరీటధారీ దేవతలుగా ఉండేవారు. వారిని అంతటి శ్రేష్ఠమైనవారిగా తయారు చేసినవారెవరో కూడా తండ్రి కూర్చొని అర్థము చేయిస్తారు. ఇప్పుడు దశరా పండుగను ఆచరిస్తారు తప్పకుండా ఏదో జరిగింది. అందువల్లనే దశరాను ఆచరిస్తారు. రావణుని దగ్ధము చేస్తారని మీకు తెలుసు. కాని రావణుడు కాలిపోయే వస్తువు కాదు. ఇప్పుడు అతని రాజ్యము పూర్తి అవుతుంది. ఎప్పటివరకు రామరాజ్యము స్థాపన జరగదో, అప్పటివరకు ఈ భ్రష్ఠాచారీ రాజ్యము కొనసాగాలి. రావణ రాజ్యము సమాప్తమై రామరాజ్యము స్థాపన జరిగింది. దాని ఉత్సవాన్ని ఆచరిస్తూ ఉంటారు. రావణుని తగలబెడ్తూ ఉంటారు. ఇది భ్రష్ఠాచారీ ఆసురీ రాజ్యమని దీని ద్వారా నిరూపణ చేస్తారు. భ్రష్ఠాచారులలో కూడా గ్రేడులు ఉంటాయి. భ్రష్ఠాచారము ద్వాపరము నుండి మొదలౌతుంది. మొట్టమొదట రెండు కళల భ్రష్ఠాచారులుంటారు. మళ్ళీ 4 కళలు, మరలా 8 కళలు, 10 కళలు పెరుగుతూ పెరుగుతూ భ్రష్ఠాచారము 16 కళలుగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 16 కళా భ్రష్ఠాచారులను పరివర్తన చేసి 16 కళా శేష్ఠాచారులుగా తయారు చేయు కర్తవ్యము ఒక్క తండ్రిదే.
ఈ సమయములో ఇది రావణరాజ్యమని, రామరాజ్యము శ్రేష్ఠముగా ఉండేదని తండ్రి అర్థము చేయిస్తున్నారు. ఇప్పుడది భ్రష్ఠమైపోయింది. శ్రేష్ఠాచార భారతదేశాన్ని స్వర్గమని అంటారు. అదే రాజ్యము ఇప్పుడు భ్రష్ఠాచారమైపోయింది. '' ఇప్పుడు నేను భ్రష్ఠాచారి రాజ్యాన్ని శ్రేష్ఠాచారి రాజ్యంగా తయారు చేసేందుకేే వచ్చానని తండ్రి చెప్తున్నారు. యాదవ కులము కూడా ఉంది. కౌరవ కులము కూడా ఉంది. యాదవ కులములో కూడా అనేక ధర్మాలున్నాయి. ఎవరైతే శ్రేష్ఠాచారీ దైవీ ధర్మమువారిగా ఉండేవారో, వారు ధర్మ భ్రష్ఠులుగా, కర్మ భ్రష్ఠులుగా అయ్యారు. మళ్ళీ తండ్రి శ్రేష్ఠ కర్మలు చేయడం నేర్పిస్తారు. భక్తిమార్గములో ఉత్సవాలు జరుపుకుంటూ వచ్చారు. తప్పకుండా భగవంతుడే వచ్చారు. ఇది 5 వేల సంవత్సరాల మాట. తండ్రి వచ్చి భ్రష్ఠాచారులను శ్రేష్ఠాచారులుగా తయారు చేశారు. పూర్తి ప్రపంచాన్ని శ్రేష్ఠాచారులుగా చేయడం ఒక్క తండ్రి పనే. మరలా దానిని పాలన చేసేందుకు మిమ్ములను పై నుండి పంపుతారు. మీరు ఏ దైవీ ధర్మాన్ని స్థాపన చేశారో, దాని పాలన కూడా మీరే చేయండి. ఇలా ఎవ్వరూ చెప్పరు. డ్రామానుసారము ఆటోమేటిక్గా జరుగుతుంది. మీరు శ్రేష్ఠాచారులుగా అవుతారు. అప్పుడు సృష్టి కూడా సతోప్రధాన శ్రేష్ఠాచారిగా అవుతుంది. ఇప్పుడైతే 5 తత్వాలు కూడా తమోప్రధానంగా ఉన్నాయి. ఎంతో అతలాకుతలము అవుతూ ఉంటుంది. మనుష్యులు ఎంతో దు:ఖితులుగా అవుతారు! కోట్ల నష్టము వాటిల్లుతుంది. సత్యయుగములో ఇలాంటి ఉపద్రవాలేవీ ఉండవు. నరకములోనే ఈ ఉపద్రవాలు జరుగుతాయి. ఉపద్రవాలు కూడా మొదట రెండు కళలవిగా ఉండేవి. ఇప్పుడు 16 కళలుగా తయారయ్యాయి. ఇవి అన్నీ విపులంగా అర్థము చేయించవలసిన విషయాలు. ఈ విషయాలైతే చాలా సహజము. కాని అర్థము చేసుకోరు, అర్థము చేయించలేరు. ఈ రావణుని తగులబెట్టడం ద్వాపరము నుండి మొదలౌతుంది. 5 వేల సంవత్సరముల నుండి జరుగుతోందని అనేందుకు వీలు లేదు. భక్తిమార్గము ప్రారంభమైనప్పుడే ఈ ఉపద్రవాలు కూడా ప్రారంభమవుతాయి. ఇప్పుడు మళ్ళీ రావణ రాజ్య వినాశనము, రామరాజ్య స్థాపన ఎలా జరుగుతుందో మీకు తెలుసు. రావణుడు ఎవరో మనుష్యులకు తెలియదు. నిజానికి ' లంక ' ఏదీ లేదు. సత్యయుగములో లంక ఉండదని తండ్రి అంటున్నారు. ఆ సమయములో చాలా తక్కువమంది మనుష్యులుంటారు. యమునా నది తీరముంటుంది. అజ్మీరులో వైకుంఠము నమూనా(మోడల్)ను కూడా చూపిస్తారు. కాని దాని గురించి అర్థము చేసుకోరు. బంగారు భవనాలు మొదలైన వాటిని తయారు చేసేందుకు అక్కడ పెద్ద సమయమేమీ పట్టదు. మిషన్ల ద్వారా తక్షణమే కరిగించి ఇటుకలు తయారు చేస్తారు.
ఈ సైన్సు(విజ్ఞానము) ద్వారా వినాశనము జరుగుతుందని మళ్ళీ అదే సైన్సు మీకు అక్కడ ఉపయోగపడ్తుందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు ఈ విమానాలు మొదలైనవి సంతోషము కొరకు తయారు చేస్తారు. వాటి ద్వారానే వినాశనము చేస్తారు. కనుక ఈ విమానాలు సుఖము కొరకే కాదు దు:ఖము కొరకు కూడా ఉన్నాయి. అల్పకాల సుఖముంది. నూరు సంవత్సరాల లోపలే ఈ వస్తువులన్నీ వెలువడ్డాయి. కావున నూరు సంవత్సరాల లోపలే ఇవన్నీ జరిగినట్లయితే వినాశనము జరిగినప్పుడు క్రొత్త ప్రపంచములో ఎంత కొద్ది సమయములో వస్తువులన్నీ తయారౌతాయో మీరు ఆలోచించండి. అక్కడ క్షణంలో బంగారు భవనాలు తయారైపోతాయి. భారతదేశములో ఎన్ని బంగారు, వెండి భవనాలు, రత్నాలు మొదలైనవాటితో పొదగబడి తయారవుతాయి! అక్కడ పెద్ద దర్బారు తయారౌతుంది. రాజులు, ధనవంతులు పరస్పరములో కలుసుకుంటూ ఉంటారు. దానిని ' పాండవ సభ ' అని అనరు. దానిని ' లక్ష్మీనారాయణుల రాజధాని సభ ' అని అంటారు. రాజకుమార, రాజకుమారీలు వచ్చి కూర్చుంటారు. బ్రిటీష్ ప్రభుత్వమున్నప్పుడు రాజకుమారుడు, రాజకుమారి మహారాజుల పెద్ద సభ జరిగేది. అందరూ రాజవంశస్థుల కిరీటాలు ధరించి కూర్చునేవారు. నేపాలులో బాబా వెళ్ళినప్పుడు అక్కడ రాణా పరివారము వారి సభ జరిగేది. పెద్ద కిరీటధారులైన రాణాలు కూర్చునేవారు. వారిని మహారాజ-మహారాణులని అంటారు. మళ్ళీ వారిలో కూడా నెంబరువారుగా ఉంటారు. రాణులు సభలో కూర్చునేవారు కాదు, తెర చాటున ఉండేవారు. చాలా వైభవంగా, ఆడంబరంగా కూర్చునేవారు. ఇది పాండవ రాజ్యము అని నేను అనేవాడిని. వారు మేము సూర్య వంశీయులమని అనేవారు. సూర్య వంశీయులే కాని సింగిల్ కిరీటధారులు. వారికి ముందు డబుల్ కిరీటధారులు ఉండేవారు. కృష్ణుని గురించి అనేక విషయాలు వ్రాసేశారు - ఫలానావారిని ఎత్తుకొని పోయారని, అది చేశారని ఇది చేశారని..... వ్రాసేశారు. కాని నిజానికి అటువంటి విషయాలేవీ లేవు.
ఏ ఉత్సవాలైతే జరిగిపోతాయో, వాటిని మళ్ళీ జరుపుతూ వస్తారు. వీరు కూడా ఉత్సవాలను ఆచరించేవారు. రావణ రాజ్యము సమాప్తమై రామరాజ్యము స్థాపన జరిగినంత వరకు ప్రతి సంవత్సరము ఆచరిస్తూనే ఉంటారు. కావున 5 వేల సంవత్సరాల క్రితము కూడా ఆసురీ రావణ రాజ్యముండేదని నిరూపణ అవుతుంది. తండ్రి వచ్చారు, వచ్చి రావణ రాజ్యాన్ని వినాశనము చేయించారు. అదే మహాభారత యుద్ధము ఇప్పుడు సమీపములో ఉంది. అంతేకాని ' రావణుడు ' అనే వారెవ్వరూ లేరు. మండోదరిని రావణుని పత్నిగా చూపిస్తారు. కాని ఆమెకు పది తలలు చూపించరు. రావణునికి పది తలలు చూపుతారు. విష్ణువుకు నాలుగు భుజాలు చూపిస్తారు. రెండు లక్ష్మివి, రెండు నారాయణునివి. అలాగే రావణునికి పది తలలు చూపుతారు. 5 వికారాలు అతనివి, 5 వికారాలు మండోదరివి. చతుర్భుజ విష్ణువును కూడా అర్థ సహితంగా చూపించారు. పూజ కూడా మహాలక్ష్మికే చేస్తారు. మహాలక్ష్మిని ఎప్పుడూ రెండు భుజాలవారిగా చూపించరు. దీపావళిలో లక్ష్మిని ఆహ్వానము చేస్తారు. ఎందుకు? నారాయణుడు ఏమైనా అపరాధము చేశాడా? లక్ష్మికి కూడా ధనాన్ని నారాయణుడే ఇస్తూ ఉంటారు కదా! అర్థ భాగస్వామి అవుతారు. కావున నారాయణ ఏ అపరాధము చేశాడు? వాస్తవానికి ధనము లక్ష్మి నుండి లభించదు. ధనము జగదంబ నుండి లభిస్తుంది. జగదంబయే మళ్ళీ లక్ష్మిగా అవుతుందని మీకు తెలుసు. వారు వారిని వేరు వేరుగా చేశారు. జగదంబ నుండే ప్రతి ఒక్కటి వేడుకుంటారు. ఏదైనా దు:ఖము కలిగినా, బిడ్డ మరణించినా 'రక్షించండి, సంతానాన్ని ఇవ్వండి, ఈ జబ్బును దూరము చేయండి ' అని జగదంబనే వేడుకుంటారు. చాలా కోరికలు తెలియజేసుకుంటారు. లక్ష్మి వద్దకు ధనము కావాలనే ఒకే ఒక్క కోరికను ఉంచుకొని వెళ్తారు. జగదంబ అన్ని కోరికలను పూర్తి చేయువారు. వీరే ధనవంతులుగా చేస్తారు. ఈ సమయములో మీ కోరికలన్నీ పూర్తవుతాయి. ఎలాంటి ధనము ఇవ్వరు. కేవలం చదివిస్తారు. దీని ద్వారా మీరు ఎలాంటివారు ఎలాంటివారుగా అవుతారు. మళ్ళీ లక్ష్మిగా అవుతారు. అప్పుడు ధనవంతులుగా కూడా అవుతారు. అన్ని ఆశలను పూర్తి చేసే శక్తి ఈ సమయములో మీలోనే ఉంది. జగదంబ దానమునిస్తుంది. లక్ష్ష్మి దానమునివ్వదు. అక్కడ దానమునివ్వరు. ఆకలి ఉండనే ఉండదు. పేదవారు ఎవ్వరూ ఉండరు. సత్యయుగములో రావణుడు ఉండడు. ఇక్కడ రావణుని తగులబెడ్తారు. దశరా తర్వాత దీపావళిని ఆచరిస్తారు. ఖుషీగా ఆచరిస్తారు. ఎందుకంటే రావణరాజ్యము వినాశనమై రామరాజ్యము స్థాపన జరుగుతున్నప్పుడు ఖుషీ ఉంటుంది కదా! ప్రతి ఇల్లు ప్రకాశమయమౌతుంది. మీ ఆత్మలోకి ప్రకాశము వచ్చేస్తుంది. ఏ వస్తువులు సంగమ యుగములో ఉంటాయో అవి సత్యయుగములో ఉండవు. మీరు త్రికాలదర్శులు. అక్కడైతే మీరు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. ఈ జ్ఞానాన్ని పూర్తిగా మర్చిపోతారు. సంగమ యుగములోనే వినాశనము మరియు స్థాపన జరుగుతాయి. స్థాపన జరిగిపోతే ఇక చాలు. ఈ ఉత్సవాలు మొదలైనవాటి జ్ఞానము మీకే ఉంది. 'అజ్ఞానీ మనుష్యులు ఏమీ అర్థము చేసుకోలేరు. చాలా ప్రదర్శన చేసేస్తారు. కాని నిజానికి ఏమీ లేదు. మీరు ప్రాక్టికల్గా చూస్తున్నారు. సత్యయుగములో ఈ ఇవేవీ ఉండవు' అని మీరు ప్రాక్టికల్గా చూస్తున్నారు. నారదుని మాట కూడా శాస్త్రాలలో ఉంది. మిమ్ములను కూడా అడుగుట జరుగుతుంది. బాబా మేము లక్ష్మిని వరిస్తాము లేక నారాయణుని వరిస్తాము అని మీరంటారు. అప్పుడు తండ్రి - నాలో ఏ వికారము లేదు కదా? అని స్వయాన్ని చూసుకోండి. ఒకవేళ క్రోధము మొదలైనవి ఉంటే ఎలా వరించగలరు? అని అంటారు. సరే ఇప్పుడు సంపూర్ణులుగా ఎవ్వరూ అవ్వలేదు. కాని అవ్వాలి. ఈ భూతాలను తరిమేయాలి. అప్పుడే ఇంతటి పదవిని పొందగలరు. గురువు కూడా చాలా విచిత్రమైనవారు లభించారు. తండ్రి అయితే సర్వ గుణ సంపన్నులు, జ్ఞానసాగరులు, ఆనందసాగరులు. కావున ఎవరైతే వచ్చి పిల్లలుగా అవుతారో వారిని కూడా సర్వ గుణ సంపన్నులుగా, డబుల్ కిరీటధారి దేవతలుగా తయారు చేస్తారు. మీరు కూడా అలాగే తయారవుతున్నారు. దేవతలకు రెండు కిరీటాలుంటాయి. బాబా నుండి ఆస్తి తీసుకొనుటకు మీరు వచ్చారు. వారసత్వమును తీసుకోవాలి, చదువుకోవాలి. పాయింట్లు చాలా వస్తూ ఉంటాయి. ఒకవేళ చదవలేదంటే ఇతరులకు ఎలా అర్థము చేయించగలరు? డ్రామా ఉన్నదున్నట్లుగా పునారావృతము అవుతూ ఉంది. ఈ జ్ఞానాన్ని ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. తర్వాత ఇది అదృశ్యమైపోతుంది. ఇప్పుడు ఏ లంకనైతే చూపుతున్నారో, అది కూడా లేదు. రావణుని జన్మ ఎప్పుడు జరిగింది? 'ద్వాపరము నుండి దేవతలు వామమార్గములో వెళ్లారు. కనుక వికారులుగా అవ్వడం ప్రారంభమైనది' అని వ్రాయబడినది. భక్తి కూడా మొదట అవ్యభిచారిగా ఉండేది. తర్వాత వ్యభిచారిగా అయిపోతుంది. ఇప్పుడు మనుష్యులు తమ పూజలు చేయించుకోవడము మొదలుపెట్టారు. నేను వచ్చేదే భ్రష్ఠాచార ప్రపంచాన్ని వినాశనము చేసి శ్రేష్ఠాచార ప్రపంచ స్థాపన చేసేందుకు అని బాబా చెప్తారు. కావున తప్పకుండా మొదట స్థాపన చేస్తారు తర్వాత వినాశనము చేస్తారు. ఇది నా కల్ప-కల్పపు పాత్ర. భ్రష్ఠాచారుల నుండి శ్రేష్ఠాచారులుగా చేసేందుకు కూడా సమయము పడ్తుంది. ఎంతవరకు తండ్రి కూర్చుని చదివిస్తారో అంతవరకు చదవాలి. క్రిందటి కల్పములో ఎవరు ఎంత చదివారో వారే చదువుతారు. చాలామంది పిల్లలు నడుస్తూ నడుస్తూ - చాలు, ఇక మేము నడవలేము అని అంటారు. అరే! నింద - స్తుతి, మాన - అవమానము మొదలైనవి ఉంటాయి. మీరు చదువును ఎందుకు వదులుతారు? అందరికంటే ఎక్కువ నిందలు కృష్ణునికి జరిగాయి. ఎన్ని కళంకాలు ఆపాదించారు! మరి అలాంటి కృష్ణుని ఎందుకు పూజిస్తారు? వాస్తవానికి నిందలు మొదలైనవి ఇప్పుడు వీరికి(బ్రహ్మకు) లభిస్తాయి. సింధ్లో చాలా నింద జరిగింది. కాని ఏమీ చేయలేకపోయారు. ఇది కూడా ఒక ఆట. క్రొత్త విషయము కాదు. క్రిందటి కల్పములో కూడా నిందన జరిగినది. నదిని దాటి వచ్చారు. మీరు సింధ్ను దాటి ఈ ఒడ్డుకు వచ్చారు కదా. కృష్ణుడు కాదు. ఈ దాదా వస్తూ పోతూ ఉండేవాడు. ఇప్పుడు మేము రాజ్యాన్ని పొంది, మళ్ళీ కోల్పోతాము, 'ఇది కూడా ఆట' అని మీకు తెలుసు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. అందరి మనోకామనలను పూర్తి చేసే కామధేనువు(జగదంబ)గా తయారవ్వాలి. దానము చేస్తూ ఉండాలి.
2. ''స్తుతి - నిందలలో సమాన స్థితిని ఉంచుకోవాలి. ఇవన్నీ జరుగుతున్నా చదువును వదలరాదు. దీనిని ఆట'' అని తెలుసుకొని దాటుకోవాలి.
వరదానము :-
'' శుద్ధమైన మనసు మరియు దివ్య బుద్ధి అను విమానము ద్వారా సెకండులో స్వీట్ హోంకు యాత్ర చేసే మాస్టర్ సర్వ శక్తివాన్ భవ ''
సైన్సువారు తీవ్ర వేగములో యంత్రాలు చేసేందుకు ప్రయత్నిస్తారు, అందుకు ఎంతో సమయాన్ని, శక్తిని ఉపయోగిస్తారు. కానీ మీ వద్ద ఎంత తీవ్ర వేగంతో పని చేసే యంత్రముందంటే, ఏ ఖర్చూ లేకుండా, అనుకున్న వెంటనే చేరుకుంటారు. మీకు శుభ సంకల్పాలనే యంత్రము లభించింది, దివ్య బుద్ధి లభించింది. ఈ శుద్ధమైన మనసు మరియు దివ్య బుద్ధి అనే విమానము ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరగండి. మాస్టర్ సర్వశక్తివంతులను ఎవ్వరూ ఆపలేరు.
స్లోగన్ :-
''మనసు సదా సత్యంగా ఉంటే, మనోభిరాముని ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి ''