01-11-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - భారతదేశమే వజ్ర సమానముగా ఉండేది, పతితంగా అయినందున ఇప్పుడు నిరుపేదగా అయ్యింది. దీనిని మళ్లీ పావనంగా, వజ్ర సమానంగా తయారు చేయాలి. మధురమైన దైవీ వృక్షానికి అంటు కట్టాలి ''
ప్రశ్న :-
తండ్రి కర్తవ్యము ఏది? అందులో పిల్లలు వారికి సహయోగులుగా అవ్వాలి?
జవాబు :-
పూర్తి విశ్వము పై ఒకే దైవీ రాజ్య స్థాపన చేయడం, అనేక ధర్మాల వినాశనము మరియు ఒకే సత్యమైన ధర్మాన్ని స్థాపన చేయడం - ఇదే తండ్రి కర్తవ్యము. పిల్లలైన మీరు ఈ కర్తవ్యములో సహయోగులుగా అవ్వాలి. ఉన్నతమైన పదవిని పొందేందుకు పురుషార్థము చేయాలి. మేము స్వర్గములోకైతే తప్పకుండా వెళ్తాము కదా, పురుషార్థము ఎందుకు చేయాలి? అని భావించరాదు.
పాట :-
నీవే తల్లి, తండ్రి ,.............. (తుమ్ హీ హో మాతా-పితా,.............) 
ఓంశాంతి.
ప్రపంచములోని మానవులు నీవే తల్లివి, తండ్రివి...... అని మహిమ చేస్తారు. కాని ఎవరి గూర్చి అలా మహిమ చేస్తారో వారికి తెలియదు. ఇది విచిత్రమైన విషయము. కేవలం నామమాత్రంగా అలా అనేస్తారు. ఈ తల్లి, తండ్రి ఎవరు అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. వీరు పరంధామనివాసి. పరంధామము ఒక్కటే. సత్యయుగాన్ని పరంధామమని అనరు. సత్యయుగమైతే ఇక్కడే ఉంటుంది కదా. మనమంతా పరంధామములోనే ఉండేవారము. ఆత్మలమైన మనము ఈ సాకార సృష్టిలోకి నిర్వాణధామము అంటే పరంధామము నుండి వస్తామని పిల్లలైన మీకు తెలుసు. స్వర్గమనేది పైన ఎక్కడా లేదు. మీరు కూడా పరంధామము నుండే వస్తారు. ఆత్మలైన మనము శరీరము ద్వారా పాత్రలు చేస్తున్నామని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. ఎన్ని జన్మలు తీసుకుంటామో, ఎలా పాత్రను అభినయిస్తామో ఇప్పుడు మీకు తెలుసు. వారు(శివబాబా) దూరదేశములో ఉండేవారు, వారు పరాయి దేశములోకి వచ్చారు. ఇప్పుడు పరాయి దేశమని ఎందుకు అంటారు? మీరు భారతదేశములోకి వస్తారు కదా. కాని మొట్టమొదట మీరు తండ్రి స్థాపన చేసిన స్వర్గములోకి వస్తారు. తర్వాత అది నరకంగా, రావణ రాజ్యంగా అయిపోతుంది. అనేక ధర్మాలు, అనేక ప్రభుత్వాలుగా అయిపోతుంది. మళ్లీ తండ్రి వచ్చి ఒకే రాజ్యాన్ని తయారు చేస్తారు. ఇప్పుడైతే చాలా ప్రభుత్వాలున్నాయి. అందరూ కలిసి ఒక్కటిగా అవ్వాలి అని అంటూ ఉంటారు. ఇప్పుడు అందరూ ఒక్కటిగా అవ్వాలంటే అది ఎలా సాధ్యమవుతుంది? 5 వేల సంవత్సరాలకు ముందు భారతదేశములో ఒకే ప్రభుత్వముండేది. పూర్తి ప్రపంచము ఒకే లక్ష్మినారాయణుల అధికారములో ఉండేది. విశ్వములో రాజ్యము చేసేందుకు వీరికి తప్ప ఇతరులెవ్వరికీ ఈ అధికారము లేదు. అన్ని ధర్మాలు ఒక్క ధర్మములోకి రాజాలవు. స్వర్గములో ఒకే ప్రభుత్వముండేది. అందుకే అందరూ ఒక్కటిగా అవ్వాలని అంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - నేను ఇతర అనేక ప్రభుత్వాలను వినాశనము చేయించి ఒక్క ఆది సనాతన దేవతా ప్రభుత్వ స్థాపన చేస్తున్నాను. సర్వశక్తివంతులూ డైరెక్షను అనుసారము మేము భారతదేశంలో ఒకే దైవీ ప్రభుత్వాన్ని స్థాపన చేస్తున్నామని మీరు కూడా అంటారు. దైవీ ప్రభుత్వము తప్ప విశ్వములో ఎక్కడా వేరే ప్రభుత్వముండదు. 5 వేల సంవత్సరాలకు ముందు భారతదేశము మరియు మొత్తం విశ్వం పై ఒకే దైవీ ప్రభుత్వముండేది. ఇప్పుడు మళ్లీ విశ్వములో దైవీ ప్రభుత్వాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వచ్చారు. పిల్లలైన మనము ఇందులో సహాయకులము. గీతలో ఈ రహస్యముంది. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. రుద్రుడు అని నిరాకారుడినే అంటారు. కృష్ణుని రుద్రుడని అనరు. రుద్రుడు అనే పేరు నిరాకారునిదే. అనేక పేర్లు విని మానవులు రుద్రుడు వేరు, సోమనాథ్ వేరు అని భావిస్తారు. ఇప్పుడు ఒక్క దైవీ ప్రభుత్వము స్థాపన అవ్వనున్నది. కేవలం స్వర్గములోకి వెళ్లనే వెళ్తాము కదా అని అందులోనే సంతోషపడరాదు. నరకములో పదవుల కొరకు మనుష్యులు ఎంత కష్టపడ్తున్నారో చూడండి. ఒకటేమో పదవి లభిస్తుంది, రెండవది చాలా సంపాదిస్తారు. భక్తుల కొరకైతే ఒకే భగవంతుడు ఉండాలి. లేకుంటే భ్రమిస్తారు. ఇక్కడైతే అందరినీ భగవంతుడని అనేస్తారు. అనేకులను అవతారంగా భావిస్తారు. నేను ఒక్కసారి మాత్రమే వస్తానని తండ్రి అంటున్నారు. పతితపావనా! రండి అని గానము కూడా చేస్తూ ఉంటారు. పూర్తి ప్రపంచమంతా పతితంగా ఉంది. అందులోనూ భారతదేశము చాలా పతితంగా ఉంది. భారతదేశమే నిరుపేదగా ఉంది, భారతదేశమే వజ్ర సమానంగా ఉండేది. మీకు కొత్త ప్రపంచములో రాజ్యము లభిస్తుంది. కృష్ణుని భగవంతుడని అనజాలరని తండ్ర్రి అర్థము చేయిస్తున్నారు. ఒక్క నిరాకారుడైన పరమపిత పరమాత్మను మాత్రమే భగవంతుడని అంటారు. వారు జనన-మరణ రహితులు. మనుష్యులైతే వారూ భగవంతుడే, మేమూ భగవంతుడే అని అనేస్తారు. ఇక్కడ సుఖపడేందుకు వచ్చామని అనేస్తారు. చాలా మస్త్గా ఉంటారు. ఎక్కడ చూసినా మీరే మీరు, అంతటా మీ ప్రభావమే.......... అని అంటారు. నీవే నేను, నేనే నీవు అని నృత్యము చేస్తూ ఉంటారు. వారికి అనుచరులు వేల సంఖ్యలో ఉంటారు. భక్తులు భగవంతుని సేవ చేస్తూ ఉంటారని తండ్రి చెప్తున్నారు. భక్తిలో చాలా భావనతో పూజిస్తారు. నేను వారికి సాక్షాత్కారము చేయిస్తాను. కాని వారు నన్ను కలవరు. నేను స్వర్గ రచయితను. అలాగని వారికి(భక్తులకు) స్వర్గ వారసత్వమునిస్తానని కాదు. భగవంతుడైతే ఒక్కరే. అందరూ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ బలహీనులుగా అయిపోయారు. తండ్రి చెప్తున్నారు - ఇప్పుడు నేను పరంధామము నుండి వచ్చాను. నేనే స్వర్గాన్ని స్థాపిస్తాను. కాని నేను అందులోకి రాను. చాలామంది మనుష్యులు మేము నిష్కామ సేవ చేస్తున్నామని అంటారు. కాని కావాలనుకున్నా, వద్దనుకున్నా ఫలమైతే తప్పకుండా లభిస్తుంది. దానము చేసినట్లయితే ఫలము తప్పకుండా లభిస్తుంది కదా. మీరు ధనవంతులుగా అయ్యారు. ఎందుకంటే గతంలో దాన-పుణ్యాలు చేశారు. ఇప్పుడు మీరు పురుషార్థము చేస్తున్నారు. ఎంత పురుషార్థము చేస్తారో భవిష్యత్తులో అంత ఉన్నత పదవి పొందుతారు. భవిష్య జన్మ-జన్మల కొరకు మీకు మంచి కర్మలు నేర్పించబడ్తాయి. మనుష్యులు మరుసటి జన్మ కొరకు చేస్తారు. పూర్వ కర్మల ఫలమని అంటారు. సత్య, త్రేతా యుగాలలో ఇలా అనరు. భవిష్య 21 జన్మల కొరకు కర్మ ఫలాన్ని ఇప్పుడే తయారు చేయించబడుతోంది. సంగమయుగ పురుషార్థ ప్రాలబ్ధము 21 తరాలు నడుస్తుంది. మీకు 21 జన్మలకు సుఖ ప్రాలబ్ధాన్ని తయారు చేయిస్తున్నామని సన్యాసులు అనజాలరు. మంచికైనా లేక చెడుకైనా ఫలాన్ని భగవంతుడే ఇవ్వాలి కదా. కనుక చేసిన పొరపాటు ఏమిటంటే కల్పము ఆయువును చాలా పెద్దదిగా చేసేశారు. కల్పము 5 వేల సంవత్సరాలని చాలామంది చెప్తారు. మీ వద్దకు ముసల్మానులు వచ్చి కల్పము ఆయువు తప్పకుండా 5 వేల సంవత్సరాలని అన్నారు. ఇక్కడి విషయాలను విని ఉంటారు. చిత్రాలైతే అందరి వద్దకు వెళ్తాయి. అయినా అందరూ అంగీకరించరు. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞమని, దీని నుండి ఈ వినాశ జ్వాలలు వెలువడ్డాయని మీకు తెలుసు. ఇందులో సహజ రాజయోగము నేర్పించబడ్తుంది. కృష్ణుని ఆత్మ ఇప్పుడు ఈ అంతిమ జన్మలో రుద్రుడైన శివుని నుండి వారసత్వము తీసుకుంటోంది. ఇక్కడ కూర్చొని ఉంది. బాబా వేరు, వీరు వేరు. బ్రాహ్మణులకు తినిపించునప్పుడు కూడా ఆత్మను పిలుస్తారు కదా. ఆ ఆత్మ బ్రాహ్మణునిలో వచ్చి మాట్లాడ్తుంది. తీర్థయాత్రలలో కూడా విశేషంగా పిలుస్తూ ఉంటారు. మరి వాస్తవానికి ఆత్మ వెళ్ళి ఎంత సమయమయ్యింది. మరి ఆ ఆత్మ ఎలా వస్తుంది? ఏం జరుగుతుంది? నేను చాలా సుఖంగా ఉన్నాను, ఫలానా ఇంట్లో జన్మ తీసుకున్నాను........... అని చెప్తుంది. ఇదెలా జరుగుతుంది? ఆత్మ శరీరము నుండి వెలువడి నిజంగానే వస్తుందా? నేను భావనా ఫలాన్ని ఇస్తాను, దానితో వారు సంతోష పడిపోతారని బాబా అర్థము చేయిస్తారు. ఇది కూడా డ్రామాలోని రహస్యమే. మాట్లాడ్తున్నారంటే పాత్ర నడుస్తోంది. ఎవరైనా మాట్లాడలేదంటే అది కూడా డ్రామాలోని నిర్ణయము అని తెలుసుకోండి. తండ్రి స్మృతిలో ఉంటే వికర్మలు వినాశనమవుతాయి. ఇక ఏ ఇతర ఉపాయము లేదు. ప్రతి ఒక్కరు సతో, రజో, తమోలోకి రానే రావాలి. నేను మిమ్ములను నూతన విశ్వాధికారులుగా చేస్తానని తండ్రి చెప్తున్నారు. మళ్లీ నేను పరంధామము నుండి పురాతన ప్రపంచము, పురాతన శరీరములో వస్తాను. వీరు పూజ్యులుగా ఉండి, ఇప్పుడు పూజారిగా అయ్యి మళ్లీ పూజ్యునిగా అవుతాడు. తతత్వమ్, మిమ్ములను కూడా అలాగే తయారుచేస్తాను. మొదటి నెంబరు పురుషార్థీ ఈ బ్రహ్మ. అందరూ మాతేశ్వరి, పితాశ్రీ అని అంటారు. మీరు సింహాసనాధికారులయ్యే పురుషార్థము చేయమని తండ్రి కూడా చెప్తున్నారు. ఈ జగదంబ అందరి కోరికలను పూర్తి చేస్తుంది. తల్లి ఉన్నారంటే తండ్రి కూడా ఉంటారు, వేరే పిల్లలు కూడా ఉంటారు. మీరు అందరికీ దారి తెలియజేస్తారు. మీ మనోకామనలన్నీ సత్యయుగములో పూర్తి అవుతాయి. ఇంట్లో ఉండి పూర్తిగా యోగము జోడించినట్లయితే ఇక్కడి వారి కంటే శ్రేష్ఠమైన పదవిని పొందగలరని తండ్రి తెలియజేస్తున్నారు.
అనేకమంది బంధనములో ఉన్నారు. ఈ అబలల పైన అత్యాచారాలు ఆపు చేయించేందుకు రాత్రి కూడా రక్షణ మంత్రికి అర్థం చేయించారు. కాని 2-4 సార్లు వింటేనే వారి బుద్ధికి తోస్తుంది. అదృష్టములో ఉంటే అంగీకరిస్తారు. క్లిష్టమైన(తికమక, అర్థము చేసుకునేందుకు కష్టమైన) జ్ఞానము కదా. సిక్కు ధర్మము వారికి కూడా తెలిపిస్తే, మనుష్యులను దేవతలుగా ఎవరు తయారు చేస్తారో అర్థము చేసుకుంటారు. ఏక్ఓంకార్ సత్నామ్ - ఇది వారి మహిమే కదా. అకాలమూర్తి. వారి సింహాసనము బ్రహ్మతత్వము. సింహాసనము వదిలి రండి అని పిలుస్తారు కదా. పూర్తి సృష్టి యొక్క ఆదిమధ్యాంతాలు నాకు తెలుసని బాబా చెప్తున్నారు. అలాగని అందరి హృదయాలు తెలిసినవారు కాదు. సద్గతికి తీసుకెళ్ళండని భగవంతుని స్మృతి చేస్తారు. నేను సర్వశక్తివంతమైన దైవీ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నానని తండ్రి చెప్తున్నారు. ఇది ఏదైతే విభజన జరిగిందో, వీరందరూ వెళ్ళిపోతారు. మన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిదే అంటు కట్టాలి. వృక్షమైతే చాలా పెద్దది. అందులో మధురాతి మధురమైన వారు దేవీ దేవతలు. మళ్లీ వారిదే అంటు కట్టాలి. ఇతర ధర్మాల వారు అంటేమీ కట్టరు.
అచ్ఛా! ఈ రోజు సద్గురువారము. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, శ్రీమతమును అనుసరించి పవిత్రులుగా అవుతే జతలో తీసుకెళ్తాను. తర్వాత కావాలంటే మఖ్మల్ రాణిగానైనా అవ్వండి లేకుంటే పట్టు వస్త్రపు రాణిగానైనా అవ్వండి. ఆస్తి తీసుకోవాలంటే నా మతమును అనుసరించండి. స్మృతి ద్వారానే అపవిత్రులైన మీరు పవిత్రులైపోతారు. అచ్ఛా! బాప్దాదా మరియు మధురమైన మమ్మాగారి అపురూపమైన పిల్లలకు ప్రియస్మృతులు, సలామ్ మాలికమ్(మహమ్మదీయులు ఒకరినొకరు నమస్కరించుట). అచ్ఛా.
బాప్దాదా మరియు మధురమైన మమ్మాల అపురూపమైన పిల్లలకు ప్రియస్మృతులు మరియు సలాం - మాలేకుం ఆత్మిక తండ్రి నమస్తే.
మాతేశ్వరిగారి మధుర మహావాక్యాలు ---------- ఆత్మకు, పరమాత్మకు గల భేదము
ఆత్మ పరమాత్మలు చాలా కాలము వేరుగా ఉన్నాయి, సద్గురువు దళారి రూపములో లభించి సుందరమైన కలయిక చేసేశారు............ ఈ మాటలు అన్నారంటే దాని యధార్థమైన అర్థము - ఆత్మ పరమాత్మ నుండి చాలాకాలము నుండి వేరుగా ఉంది, విడిపోయింది. చాలాకాలము అంటే చాలా సమయము నుండి ఆత్మ పరమాత్మ నుండి విడిపోయిందని అర్థము. కనుక ఈ మాట ద్వారా ఆత్మ పరమాత్మలు వేరు వేరుగా ఉండే రెండు వస్తువులని, రెండిటికి ఆంతరిక భేదముందని ఋజువు అవుతుంది. కాని ప్రపంచములోని మనుష్యులకు తెలియని కారణంగా వారు ఆత్మనైన నేనే పరమాత్మనని, ఆత్మ పై మాయ ఆవరించినందున తమ అసలు స్వరూపాన్ని మర్చిపోయారని, ఆ మాయ ఆవరణ తొలగిపోతే మళ్లీ ఆత్మయే పరమాత్మగా అవుతుందని అంటారు. కనుక వారు ఈ అర్థముతో ఆత్మ, పరమాత్మ వేరని అంటారు. వేరే కొంతమంది ఆత్మయే పరమాత్మ, కాని ఆత్మ స్వయాన్ని మర్చిపోయినందున దు:ఖితమై పోయిందని అంటారు. ఎప్పుడైతే ఆత్మ మళ్లీ స్వయాన్ని తెలుసుకొని శుద్ధంగా అవుతుందో అప్పుడు ఆత్మ పరమాత్మలో కలిసిపోయి ఒక్కటిగా అయిపోతుందని అంటారు. కనుక వారు ఆత్మ, పరమాత్మ నుండి వేరని ఈ అర్థముతో చెప్తారు. కాని ఆత్మ, పరమాత్మ రెండూ వేరు వేరని మనకు తెలుసు. ఆత్మ, పరమాత్మగానూ అవ్వలేదు, ఆత్మ పరమాత్మతో కలిసి ఒకటిగానూ అవ్వలేదు. అంతేకాక పరమాత్మ పై మాయ ఆవరణ కూడా పడజాలదు.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. సంగమయుగ పురుషార్థ ప్రాలబ్ధము 21 జన్మల వరకు కొనసాగుతుంది. ఈ విషయాన్ని స్మృతిలో ఉంచుకొని శ్రేష్ఠ కర్మలు చేయాలి. జ్ఞాన దానము ద్వారా మీ ప్రాలబ్ధాన్ని తయారుచేసుకోవాలి.
2. మధురమైన దైవీ వృక్షానికి అంటు కట్టబడ్తోంది. కనుక అత్యంత మధురంగా తయారవ్వాలి.
వరదానము :-
'' కర్మభోగాన్ని కర్మయోగములోకి పరివర్తన చేసి సేవకు నిమిత్తమయ్యే భాగ్యవాన్ భవ ''
శారీరిక లెక్కాచారాలు ఎప్పుడూ ప్రాప్తి మరియు పురుషార్థ మార్గములో విఘ్నాలుగా అనుభవం అవ్వరాదు. శరీరాన్ని ఎప్పుడూ సేవ నుండి వంచితము చేయరాదు. భాగ్యశాలి ఆత్మలు కర్మభోగం అనుభవించే సమయంలో కూడా ఏదో ఒక విధంగా సేవకు నిమిత్తంగా అయిపోతారు. కర్మభోగం చిన్నదైనా, పెద్దదైనా దాని కథ విస్తారం చేయకండి. దానిని వర్ణించడం అనగా సమయాన్ని, శక్తిని వ్యర్థంగా పోగొట్టుకోవడం. యోగీ జీవితమనగా కర్మభోగాన్ని కర్మయోగంలోకి పరివర్తన చేసే జీవితము. ఇదే భాగ్యశాలుర గుర్తు.
స్లోగన్ :-
'' దృష్టిలో దయ మరియు శుభ భావన ఉంటే, అభిమాన దృష్టి మరియు అవమాన దృష్టి సమాప్తమైపోతాయి ''