09.11.2018
Morning Telugu Murli Om Shanti BapDada Madhuban
“మధురవైున పిల్లలూ - క్షణంలో ముక్తి మరియు
జీవన్ముక్తులను పొందేందుకు మన్మనాభవ, మధ్యాజీభవగా అవ్వండి, బాబాను యథార్థరీతిగా
గుర్తించి స్మృతి చేయండి మరియు అందరికీ బాబా పరిచయమును ఇవ్వండి.’’
ప్రశ్న:-
ఏ నషా
ఆధారం పైనే మీరు బాబా ప్రత్యక్షతను చేయగలరు ?
జవాబు:-
మేము
ఇప్పుడు భగవంతుని పిల్లలము , వారు మమ్మల్ని చదివిస్తున్నారు అన్న నషా ఉండాలి . మనమే
మనుష్యుమాత్రులందరికీ సత్యవైున మార్గమును చూపించాలి . ఇప్పుడు మనం సంగమ యుగంలో
ఉన్నాము , మనము మన రాయల్ నడవడిక ద్వారా బాబా పేరును ప్రఖ్యాతము చేయాలి . బాబా మరియు
శ్రీ కృష్ణు ని మహిమను అందరికీ వినిపించాలి .
గీతము:-
రానున్న
రేపటికి నీవు భాగ్యానివి...
ఓం శాంతి.
ఈ గీతమును కాంగ్రెస్ సైన్యమువారు గానం చేశారు.
ప్రపంచపు భాగ్యము అని దేనినంటారో ఈ భారతవాసులకు తెలియదు. ఇది మొత్తం ప్రపంచమంతటి
ప్రశ్న. మొత్తం ప్రపంచపు భాగ్యమును మార్చి నరకము నుండి స్వర్గంగా తయారుచేసేవారు
మానవమాత్రులెవరూ కాజాలరు. ఈ మహిమ మనుష్యులెవ్వరిదీ కాదు, ఇది కృష్ణుని గూర్చి అని
అంటే, మరి అతడిని ఎవరూ తిట్టజాలరు. కృష్ణుడు చవితి చంద్రుడిని చూసిన కారణంగా అతనికి
కళంకాలు తగిలాయి అని మనుషులు అంటారు, కాని అది ఎలాగో అర్థం చేసుకోలేరు. కళంకాలు
నిజానికి కృష్ణునికి తగలవు, అలాగే గీతాభగవానునికి కూడా తగలవు, కళంకాలు బ్రహ్మ పైనే
మోపబడతాయి. కృష్ణుడు ఎత్తుకుపోయాడని అతడిపై కళంకాలు మోపుతారు. శివబాబాను గూర్చి
అయితే ఎవరికీ తెలియదు. తప్పకుండా ఈశ్వరుని వెనుక పరిగెడుతారు, కాని ఈశ్వరుడైతే
నిందలు పొందజాలడు. ఈశ్వరునిపై మరియు కృష్ణునిపై కూడా నిందలు మోపజాలరు. ఇరువురి మహిమ
అద్భుతవైునది, కృష్ణుని మహిమ కూడా నెంబర్ వన్ మహిమ. లక్ష్మీనారాయణులకు అంతటి మహిమ
లేదు, ఎందుకంటే వారు వివాహితులు. కృష్ణుడు కుమారుడు, కావున అతడి మహిమ ఎక్కువగా
ఉంటుంది. లక్ష్మీనారాయణులను కూడా 16 కళా సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులు అని
మహిమను గానం చేస్తారు. కాని కృష్ణుడు ద్వాపరయుగంలో ఉన్నాడు అని అంటారు, ఈ మహిమ
పరంపరగా కొనసాగుతూ వచ్చింది అని భావిస్తారు. ఈ విషయాలన్నింటినీ గూర్చి కూడా
పిల్లలైన మీకే తెలుసు. ఇది ఈశ్వరీయ జ్ఞానము, ఈశ్వరుడే రామరాజ్య స్థాపనను చేశారు.
రామరాజ్యమును మనుష్యులు అర్థం చేసుకోరు. తండ్రి వచ్చి వీటన్నిటి వివరణను ఇస్తారు,
మొత్తం ఆధారమంతా గీత పైనే ఉంది. గీతలోనే పొరపాటును వ్రాసారు. కౌరవులు మరియు పాండవుల
యుద్ధము జరగలేదు, కావున అర్జునుని విషయమే లేదు. ఇక్కడైతే బాబా కూర్చొని పాఠశాలలో
చదివిస్తారు, పాఠశాల యుద్ధ వైుదానంలో ఉండదు. ఇది మాయా రావణునితో చేసే యుద్ధమ, అతడిపై
విజయాన్ని పొందాలి. మాయను జయించి జగత్జీతులుగా అవ్వాలి. కాని ఈ విషయాలను కొద్దిగా
కూడా అర్థం చేసుకోలేరు! డ్రామాలోనే ఈ విధంగా రచింపబడి ఉంది, వారు చివరిలో వచ్చి
అర్థం చేసుకోవాలి మరియు పిల్లలైన మీరే అర్థం చేయించగలరు. డ్రామాలో ఈ విధంగానే
రచింపబడి ఉంది. భీష్మపితామహులు మొదలైనవారికి హింసాయుతవైున బాణాలను వేసే విషయమే లేదు.
శాస్త్రాలలో ఎన్నో విషయాలను వ్రాసేశారు. మాతలు వారి వద్దకు వెళ్ళి సమయం తీసుకోవాలి,
మేము మీతో ఈ విషయాన్ని గూర్చి మాట్లాడాలనుకుంటున్నాము అని చెప్పండి. ఈ గీతను
భగవంతుడే గానం చేశాడు, ఇది భగవంతుని మహిమ, శ్రీకృష్ణుడైతే వేరు, మాకు ఈ విషయంలో
సంశయం కలుగుతోంది, రుద్ర భగవానువాచ అని ఉంది, ఇది వారి రుద్ర జ్ఞాన యజ్ఞము అని
చెప్పాలి. భగవంతుడు అని నిజానికి ఒక్కరినే అంటారు, కావున వారి మహిమను వ్రాయాలి.
కృష్ణుని మహిమ ఇది, మరి వీరిరువురిలోను గీతాభగవానుడు ఎవరు? గీతలో సహజ రాజయోగము అని
వ్రాయబడి ఉంది. బేహద్ సన్యాసమును చేయండి అని బాబా అంటారు. దేహసహితంగా, దేహపు
సర్వసంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. మన్మనాభవ, మధ్యాజీభవ. బాబా ఎంతో
బాగా అర్థం చేయిస్తారు. గీతలో శ్రీమత్ భగవానువాచ అని ఉంది. శ్రీ అనగా శ్రేష్ఠము అని
పరమపిత శివ పరమాత్ముడినే అంటారు. శ్రీకృష్ణుడైతే దైవీగుణాలుగల మానవుడు.
గీతాభగవానుడైతే శివుడే, తానే రాజయోగాన్ని నేర్పించారు. తప్పకుండా చివరిలో అన్ని
ధర్మాలూ వినాశనవైు ఏకధర్మస్థాపన జరిగింది, సత్యయుగంలో ఒక్క ఆదిసనాతన దేవీదేవతా
ధర్మమే ఉండేది, దానిని స్థాపన చేసింది కృష్ణుడు కాదు, భగవంతుడు, ఇది వారి మహిమ,
వారిని త్వమేవ మాతాశ్చ, పితా త్వమేవ అని అంటారు. కృష్ణుడిని ఆ విధంగా అనరు. మీరు
సత్యవైున తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. భగవంతుడే ముక్తిప్రదాత మరియు మార్గదర్శకుడు,
తాను అందర్నీ తీసుకువెళతారు, దోమల గుంపులా అందర్నీ తీసుకువెళ్ళడం శివుని పని మాత్రమే
అని మీరు అర్థం చేయించవచ్చు. సుప్రీం అన్న పదము కూడా చాలా బాగుంది. కావున పరమపిత
శివపరమాత్ముని మహిమ వేరు, కృష్ణుని మహిమ వేరు, రెండింటిని నిరూపించి అర్థం చేయించాలి.
శివుడు జనన, మరణాలలోకి రాడు, తాను పతితపావనుడు. కృష్ణుడైతే పూర్తి 84 జన్మలూ
తీసుకుంటాడు, మరి ఇప్పుడు పరమాత్మ అని ఎవరిని అనాలి? ఇది కూడా వ్రాయాలి. అనంతవైున
తండ్రిని తెలుసుకోని కారణంగానే అనాథలుగా, దుఃఖితులుగా అయ్యారు. సత్యయుగంలో ఎప్పుడైతే
సనాథలుగా అయిపోతారో అప్పుడు తప్పకుండా సుఖవంతులుగా ఉంటారు. ఇటువంటి స్పష్టవైున పదాలు
ఉండాలి. నన్ను స్మృతిచేయండి మరియు వారసత్వాన్ని తీసుకోండి అని బాబా అంటారు. క్షణంలో
జీవన్ముక్తి లభిస్తుంది, ఇప్పుడు కూడా శివబాబా ఈ విధంగా అంటారు. మహిమను పూర్తిగా
వ్రాయాలి. శివాయ నమః, వారి ద్వారా స్వర్గ వారసత్వం లభిస్తుంది. ఈ సృష్టిచక్రమును
అర్థం చేసుకోవడం ద్వారా మీరు స్వర్గవారసులుగా అయిపోతారు. ఇప్పుడు ఏది సరైనదో మీరే
నిర్ణయించండి. పిల్లలైన మీర సన్యాసుల ఆశ్రమాలలోకి వెళ్ళి వారిని వ్యక్తిగతముగా
కలవాలి. సభలలోనైతే వారికి ఎంతో అహంకారము ఉంటుంది.
మనుష్యులకు సత్యవైున మార్గమును ఎలా తెలియజేయాలి అని కూడా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది.
భగవానువాచ- నేను ఈ సాధువులు మొదలైనవారి ఉద్ధారమును కూడా చేస్తాను. ముక్తిప్రదాత
అన్న పదము కూడా ఉంది. నావారిగా అవ్వండి అని బేహద్ తండ్రే అంటారు. ఫాదర్ షోస్ సన్.
శ్రీకృష్ణుడినైతే తండి అని అనరు. అందరూ ఆ భగవంతుడైన తండ్రికి పిల్లలుగా అవ్వవచ్చు.
కాని మనుష్యమాత్రులకు అందరూ పిల్లలుగా కాజాలరు. కావున పిల్లలైన మీకు అర్థం
చేయించేందుకు ఎంతో నషా ఉండాలి. మనం బేహద్ తండ్రికి పిల్లలము, రాజు పిల్లలైన
రాజకుమారుల నడవడిక ఎలా ఉంటుందో మీరు చూడండి! కాని పాపం శ్రీకృష్ణునిపై భారతవాసులు
కళంకాలను మోపారు. మీరు కూడా భారతవాసులే కదా అని అంటారు. అవును, మేము కూడా
భారతవాసులమే, కాని మేమిప్పుడు సంగమయుగంలో ఉన్నాము, మేము భగవంతుని పిల్లలుగా అయ్యాము
మరియు వారి ద్వారా చదువుతున్నాము. భగవానువాచ- మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఇది
కృష్ణుని విషయం కాజాలదు. ముందు ముందు అర్థం చేసుకుంటూ ఉంటారు. జనక మహారాజు కూడా
సూచనతోటే అర్థం చేసుకున్నాడు కదా! పరమపిత పరమాత్మను స్మృతి చేశాడు మరియు ధ్యానములోకి
వెళ్ళిపోయాడు. ధ్యానములోకైతే ఎంతోమంది వెళుతూ ఉంటారు. ధ్యానములో నిరాకారీ లోకాన్ని
మరియు వైకుంఠాన్ని చూస్తారు. మనము నిరాకారలోక వాసులమని మీకు తెలుసు. పరంధామం నుండి
ఇక్కడకు వచ్చి పాత్రను అభినయిస్తాము, వినాశనం కూడా ముందు ఉంది. సైన్స్వారు
చంద్రునిపైకి వెళ్ళేందుకు కష్టపడుతూ ఉంటారు. ఇది సైన్స్ అతి అహంకారములోకి వెళ్ళడము,
దాని ద్వారా మళ్ళీ తమను తామే వినాశనం చేసుకుంటారు, అంతేకాని చంద్రుడు మొదలైనవాటిలో
ఏమీలేదు. విషయాలైతే చాలా బాగున్నాయి కాని కేవలం అర్థం చేయించేందుకు యుక్తి కావాలి.
మాకు శిక్షణ ఇచ్చేవారు ఉన్నతోన్నతుడైన భగవంతుడే, వారు మీకు కూడా తండ్రియే. కృష్ణుని
మహిమ వేరు, వారి మహిమ వేరు. ఇది అవినాశీ రుద్రజ్ఞాన యజ్ఞము. ఇందులో అన్నీ ఆహుతి
అవ్వనున్నాయి. పాయింట్లయితే చాలా బాగున్నాయి, కాని ఇప్పుడు ఇంకొంత ఆలస్యమున్నట్లుగా
అన్పిస్తోంది.
ఒకటేమో, ఆత్మిక యాత్ర, ఇంకొకటి, దైహిక యాత్ర. ఈ పాయింటు కూడా బాగుంది. నన్ను స్మృతి
చేసినట్లయితే అంతమతిని బట్టి గతి ఏర్పడుతుంది. ఆత్మిక తండ్రి తప్ప ఇంకెవరూ ఈ
విషయాలను నేర్పించజాలరు. ఇటువంటి పాయింట్లను వ్రాయాలి. మన్మనాభవ-మధ్యాజీభవ. ఇది
ముక్తీజీవన్ముక్తుల యాత్ర. యాత్రనైతే తండ్రియే చేయిస్తారు, కృష్ణుడైతే చేయించలేడు.
స్మృతి చేసే అలవాటును ఏర్పరచుకోవాలి. ఎంతగా స్మృతిచేస్తారో అంతగా సంతోషము ఉంటుంది.
కాని మాయ స్మృతిచేయనివ్వదు. అచ్ఛా!
మధురాతి మధురవైున ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు
గుడ్మార్నింగ్. సేవనైతే అందరూ చేస్తారు, కాని ఉన్నతవైున మరియు నీచవైున సేవ అయితే
ఉంది కదా! ఎవరికైనా బాబా పరిచయమును ఇవ్వడం చాలా సహజము. అచ్ఛా- ఆత్మిక పిల్లలకు
ఆత్మిక తండ్రి నమస్తే.
రాత్రి క్లాసు
పర్వతాల పైకి గాలికొరకు, రిఫ్రెష్ అయ్యేందుకు వెళతారు. ఇంట్లో లేక ఆఫీసులో ఉండడం
ద్వారా బుద్ధిలో పనే గుర్తుంటుంది. బైటకు వెళ్ళడం ద్వారా ఆఫీసు ఆలోచనల నుండి ఫ్రీ
అయిపోతారు. అలాగే ఇక్కడకు కూడా పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. అర్థకల్పం
భక్తి చేస్తూ, చేస్తూ అలసిపోయారు. పురుషోత్తమ సంగమ యుగంలో జ్ఞానము లభిస్తుంది,
జ్ఞానయోగాల ద్వారా మీరు రిఫ్రెష్ అయిపోతారు. ఇప్పుడు పాత ప్రపంచం వినాశనం అయిపోతుంది,
కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోందని మీకు తెలుసు. ప్రళయవైుతే జరగదు, ప్రపంచవైుతే
పూర్తిగా అంతవైుపోతుందని వారు భావిస్తారు. కాని అలా జరగదు, అది మార్పుచెందుతుంది.
ఇది నరకము, పాత ప్రపంచము. కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము ఎలా ఉంటుందో కూడా మీకు
తెలుసు. మీకు విస్తారంగా అర్థం చేయించబడింది. మీ బుద్ధిలో విస్తారము ఉంది, అది కూడా
నెంబర్వారీగా, పురుషార్థానుసారంగా ఉంది. అర్థం చేయించడంలో కూడా ఎంతో రిఫైన్ బుద్ధి
కావాలి. ఎవరికైనా ఎలా అర్థం చేయించాలంటే, వెంటనే వినగానే బుద్ధిలో కూర్చుండిపోవాలి.
చాలామంది పిల్లలు కచ్ఛాగా ఉన్నారు, వారు నడుస్తూ, నడుస్తూ పడిపోతారు. ఆశ్చర్యవంతులై
వింటారు, కథాగానం చేస్తారు... అని భగవానువాచ కూడా ఉంది. ఇక్కడ మాయతో యుద్ధము
జరుగుతుంది. మాయ నుండి మరణించి ఈశ్వరునికి చెందినవారిగా అవుతారు, మళ్ళీ ఈశ్వరుని
నుండి మరణించి మాయకు చెందినవారిగా అయిపోతారు. దత్తత అయి మళ్ళీ వదిలివెళ్ళిపోతారు.
మాయ చాలా ప్రబలవైునది, అనేకులను తుఫానులలోకి తీసుకువస్తుంది. ఓటమి, గెలుపులు
జరుగుతాయి అని పిల్లలు కూడా భావిస్తారు. ఈ ఆటయే ఓటమి, గెలుపుల ఆట. పంచవికారాలతో
ఓడిపోయారు. ఇప్పుడు మీరు గెలిచేందుకు పురుషార్థం చేస్తున్నారు, చివరికి విజయం మీదే.
బాబాకు చెందినవారిగా అయ్యారు, కావున పక్కాగా అవ్వాలి. మాయ ఎంత టెంప్టేషన్ను ఇస్తుందో
మీరు చూస్తారు. అనేకసార్లు ధ్యానము, సాక్షాత్కారంలోకి వెళ్ళడం ద్వారా కూడా ఆట
సమాప్తవైుపోతుంది. ఇప్పుడు 84 జన్మల చక్రమును చుట్టివచ్చి ఇక పూర్తిచేశామని
పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అయ్యారు. ఇప్పుడు
శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు, బ్రాహ్మణులుగా అయి మళ్ళీ దేవతలుగా అయిపోతారు,
దీనిని మర్చిపోకూడదు, దీనిని మర్చిపోయినట్లయితే కాళ్ళు వెనక్కువెళ్ళిపోతాయి. మళ్ళీ
ప్రాపంచిక విషయాలలో బుద్ధి నిమగ్నవైుపోతుంది, మురళి కూడా గుర్తుకురాదు. స్మృతియాత్ర
కూడా ఎంతో కష్టంగా జరుగుతుంది, ఇది కూడా ఆశ్చర్యమే!
కొంతమంది పిల్లలకు బాడ్జ్ను ధరించడంలో కూడా సిగ్గు అన్పిస్తుంది, ఇది కూడా
దేహాభిమానమే కదా! తిట్లయితే తినవలసిందే. కృష్ణుడు ఎంతగా తిట్లు తిన్నాడు! అందరికన్నా
ఎక్కువగా శివబాబా తిట్లు తిన్నారు, ఆ తర్వాత కృష్ణుడు, ఆ తర్వాత అందరికన్నా ఎక్కువగా
రాముడు తిట్లు తిన్నాడు, నెంబర్వారీగా ఉన్నారు. అలా అవమానపర్చడం ద్వారా భారతదేశపు
గ్లాని ఎంతగా జరిగింది! పిల్లలైన మీరు ఇందులో భయపడకూడదు. అచ్ఛా! మధురాతి మధురవైున
ఆత్మిక పిల్లలకు ప్రియస్మృతులు మరియు గుడ్నైట్.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. బుద్ధి ద్వారా బేహద్ సన్యాసమును చేసి , ఆత్మిక
యాత్రలో తత్పరులై ఉండాలి . స్మృతి లో ఉండే అలవాటును ఏర్పరచుకోవాలి .
2. తండ్రి పిల్లలను ప్రఖ్యాతము చేస్తారు , పిల్లలు తండ్రిని ప్రఖ్యాతము చేస్తారు ,
అందరికీ బాబా సత్య పరిచయమును ఇవ్వాలి , క్షణంలో జీవన్ముక్తిని పొందే మార్గమును
తెలియజేయాలి .
వరదానము:-
శ్రేష్ఠకర్మరూపీ కొమ్మలపై వేళ్ళాడేందుకు బదులుగా ఎగిరే
విహంగంగా అయ్యే హీరోపాత్రధారీ భవ.
సంగమయుగంలో మీరు ఏ శ్రేష్ఠ కర్మలనైతే చేస్తారో ఆ
శ్రేష్ఠ కర్మలు కూడా వజ్రపు కొమ్మల లాటింవి. సంగమయుగపు ఎంత శ్రేష్ఠ కర్మ అయినా కాని
ఆ శ్రేష్ఠ కర్మ బంధనంలో చిక్కుకోవడము లేక హద్దులోని కామనను కలిగి ఉండడము, ఇవి కూడా
బంగారు సంకెళ్ళే. ఈ బంగారు సంకెళ్ళులోకి లేక వజ్రపు కొమ్మలలోకి కూడా వెళ్ళాడకూడదు.
ఎందుకంటే ఎంతైనా బంధనము బంధనమే కావున సర్వ బంధనాలు అనగా హద్దులను దాటివేసి
హీరోపాత్రధారులుగా అవ్వండి అన్న స్మృతిని బాప్దాదా ఎగిరే పక్షులందరికీ
కలిగిస్తున్నారు.
స్లోగన్:-
లోలోపలి స్థితికి దర్పణము మీ ముఖము. మీ ముఖము ఎప్పుడూ
శుష్కించుకుపోకూడదు, సంతోషంగా ఉండాలి.
మాతేశ్వరిగారి మధుర మహా”వాక్యాలు.
''కలియుగ అసార ప్రపంచమునుండి సత్యయుగ సార ప్రపంచములోకి
తీసుకు”వెళ్ళటము ఎవరి పని!''
ఈ కలియుగ ప్రపంచమును అసార ప్రపంచమని ఎందుకు అంటారు? ఎందుకంటే ఈ ప్రపంచములో ఎటువంటి
సారము లేదు అనగా ఏ వస్తువులోనూ శక్తి లేదు అనగా సుఖ-శాంతి-పవిత్రతలు లేవు, ఒకానొక
సమయములో ఈ సృష్టిలో సుఖ-శాంతి-పవిత్రతలు ఉండేవి. ఇప్పుడు ఆ శక్తి లేదు ఎందుకంటే ఈ
సృష్టిలో 5 భూతాలు ప్రవేశించాయి కనుకనే ఈ సృష్టిని భయ సాగరము లేక కర్మబంధన సాగరము
అని అంటారు కనుకనే ఓ పరమాత్మా, మమ్మల్ని ఈ భవ సాగరమునుండి దాటించు అని మనుష్యులు
దు:ఖితులై పరమాత్మను పిలుస్తున్నారు. కనుక తప్పకుండా ఒక అభయ ప్రపంచము అనగా
నిర్భయతతో కూడిన ప్రపంచము ఉండేదనీ, అందులోకి మరల వెళ్ళాలని కోరుకుంటున్నారనీ
దీనిమూలంగా నిరూపణ అవుతుంది. ఈ ప్రపంచమును పాప ప్రపంచము అని అంటారు. దీనిని దాటి
పుణ్య ఆత్మలు కల ప్రపంచములోకి వెళ్ళాలని కోరుకుంటారు. కనుక ప్రపంచాలు రెండు, ఒకటేమో
సత్యయుగములోని సార ప్రపంచము, రెండవది కలియుగములోని అసార ప్రపంచము. రెండు ప్రపంచాలు
ఈ సృష్టి పైనే ఉంటాయి. అచ్ఛా! ఓం శాంతి.