12-10-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - ఇప్పుడు గాఢాంధకారమయమైన భయంకరమైన రాత్రి పూర్తవుతోంది. మీరు పగలులోకి వెళ్లాలి. ఇది బ్రహ్మ అనంతమైన పగలు మరియు రాత్రుల కథ ''

ప్రశ్న :-

సెకండులో జీవన్ముక్తిని పొందేందుకు లేక వజ్ర తుల్యమైన జీవితాన్ని తయారు చేసుకునేందుకు ఆధారము ఏది ?

జవాబు :-

సత్యమైన గీత అది భగవంతుడిచ్చిన శ్రీమతము. తండ్రి మీకు సన్ముఖములో ఏ ఆదేశమైతే ఇస్తున్నారో అదే సత్యమైన గీత. దాని ద్వారా మీకు సెకండులో జీవన్ముక్తి పదవి ప్రాప్తమౌవుతుంది. మీరు వజ్ర తుల్యంగా అవుతారు. ఆ గీత ద్వారా భారతదేశము గవ్వ సమానమైపోయింది. ఎందుకంటే తండ్రిని మరచి గీతను ఖండితము చేసేశారు.

పాట :-

ఓ రాత్రి ప్రయాణీకుడా! అలసిపోకు,................ (రాత్‌ కా రాహీ థక్‌ మత్‌ జానా,...................)   

ఓంశాంతి.

ఇప్పుడు ఈ పాటను పిల్లలైన మీరు తయారు చేయించలేదు. దీనిని సినిమా వారు కూర్చుని తయారు చేశారు. వారికి దీనికి గూర్చిన అర్థము ఏమీ తెలియదు. ఏ విషయమైనా యదార్థమైన అర్థము తెలియకుంటే అనర్థమైపోతుంది. పాడుతూ ఉంటారు కానీ వారికి ఏమీ అర్థం కాదు. ఇప్పుడు పిల్లలైన మీకు శ్రీమతము లభించింది. ఎవరి శ్రీమతము? భగవంతుని శ్రీమతము. భగవంతుని గురించే భక్తులకు తెలియకుంటే మరి ఆ భక్తులకు సద్గతి ఎలా లభిస్తుంది? భక్తుల రక్షకుడు భగవంతుడు. వారిని రక్షించమని వేడుకుంటారు. అనగా తప్పకుండా ఏదో ఒక దు:ఖము ఉందనే కదా! మమ్ములను రక్షించండి అని అంటారు. ఎంతో మహిమ చేస్తారు కాని భగవంతుడు ఎవరో ఎవరి ద్వారా రక్షిస్తారో కొద్దిగా కూడా తెలియదు. భక్తులు లేక పిల్లలు తమ తండ్రిని తెలుసుకోని కారణంగా ఎంతో దు:ఖములో పడి ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు దీని అర్థం తెలుసు. ఇప్పుడిది ఘోర అంధకారమయమైన అర్ధకల్పపు రాత్రి. ఏ విద్వాంసులు, ఆచార్యులు, పండితులు మొదలైనవారికి రాత్రి అని దేనినంటారో తెలియదు. రాత్రి పడుకోవాలని, పగలు మేల్కోవాలని జంతువులకు కూడా తెలుసు. పక్షులు రాత్రి పడుకుంటాయి. మళ్లీ ఉదయమవ్వడంతోటే ఎగరడం మొదలుపెడ్తాయి. ఆ పగలు-రాత్రుళ్ళు సామాన్యమైనవి, ఇది బ్రాహ్మ అనంతమైన రాత్రి మరియు అనంతమైన పగలు. సత్య, త్రేతా యుగాలు అనంతమైన పగలు, ద్వాపర-కలియుగాలు రాత్రి. రెండూ సగం-సగం ఉండాలి కదా! పగటి ఆయువు 2500 సంవత్సరాలు. ఈ రాత్రి-పగలును గూర్చి ఎవ్వరికీ తెలియదు. రాత్రి పూర్తవుతుందని అనగా 84 జన్మలు పూర్తవుతాయని లేక డ్రామా చక్రము పూర్తవుతుందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మళ్లీ పగలు ప్రారంభమౌతుంది. రాత్రిని పగలుగా, పగలును రాత్రిగా తయారు చేసేవారు ఎవరో కూడా ఎవ్వరికీ తెలియదు. భగవంతుని గూర్చే తెలియనప్పుడు మరి ఈ విషయాలన్నీ ఎలా తెలుసుకోగలరు? మనుష్యులు పూజిస్తారు కాని తాము మహిమ చేసేదెవరినో వారికి తెలియదు. గీతను ఖండితము చేయడమే మొట్టమొదటి కారణమని బాబా కూర్చుని అర్థము చేయిస్తున్నారు. 'శ్రీమద్భగవద్గీత' అని అంటారు. గీతాపతి భగవంతుడే కాని ఏ మనిషీ కాదు. బ్రహ్మ-విష్ణు-శంకరులను దేవతలు అని అంటారు. సత్యయుగపు మనుష్యులు దైవీగుణాలు కలిగినవారు. దైవీ ధర్మము గల శ్రేష్ఠాచారులను దైవీగుణాలు గలవారని అంటారు. భారతదేశములోని మనుష్యులు శ్రేష్ఠాచారులుగా ఉండేవారు. వారే మళ్లీ అసురీ గుణాలు గలవారిగా అయిపోయారు. ముఖ్య ధర్మశాస్త్రాలు నాలుగు. ఇక ఏ ధర్మశాస్త్రాలు లేవు. ఉన్నా అవన్నీ చిన్న చిన్న మఠాలుగా స్థాపించబడ్డాయి. ఉదాహరణానికి సన్యాసుల మఠాలు, బౌద్ధ మఠాలు ఉన్నాయి కదా. బుద్ధుడు బౌద్ధ ధర్మాన్ని స్థాపన చేశాడు. మాది ఫలానా ధర్మశాస్త్రమని వారు అంటారు. భారతీయుల ధర్మశాస్త్రము ఒక్కటే. సత్యయుగ దేవీ దేవతా ధర్మశాస్త్రము ఒక్కటే. దానిని శ్రీమత్‌ భగవద్గీత అని అంటారు, ఆ గీత మాత అవుతుంది. గీతా రచయిత పరమపిత పరమాత్మ. కృష్ణుని ఆత్మ ఎప్పుడైతే 84 జన్మలు పూర్తి చేస్తుందో అప్పుడు మళ్లీ గీతా భగవానుడు, జ్ఞాన సాగరుడైన పరమపిత పరమాత్మ నుండి సహజ రాజయోగాన్ని, జ్ఞానాన్ని నేర్చుకొని ఉన్నత పదవిని పొందుతుంది. ఇటువంటి ఉన్నతోన్నతమైన ధర్మశాస్త్రాన్ని ఖండితము చేసేశారు. ఈ కారణంగానే భారతదేశము గవ్వ తుల్యంగా అయిపోయింది. ఇది కూడా డ్రామాలో జరిగిన ఒక పొరపాటు. అదే గీతను ఖండితము చేసేసింది. తండ్రి ఇప్పుడు ఏ సత్యమైన గీతనైతే వినిపిస్తున్నారో, అది తయారవ్వాలి. గవర్నమెంటువారు సత్యమైన గీతను ముద్రించాలి. ఇది శ్రీమత్‌ భగవానువాచ! క్లుప్తంగా, మంచిగా వ్రాయాలని బాబా పిల్లలకు ఆదేశమునిస్తున్నారు. సత్యమైన గీత ద్వారా క్షణములో జీవన్ముక్తి లభిస్తుందని మీకు తెలుసు. తండ్రివారిగా అయ్యి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. బీజము, వృక్షము, డ్రామా చక్రములను అర్థం చేయించాలి. సత్యయుగ ఆది సత్యము, అది సత్యము మరియు సత్యముగానే ఉంటుంది అని కూడా మహిమ చేస్తారు. వృక్షమును తెలుసుకోవడం కూడా సహజమే. దీని బీజము పైన ఉంటుంది. ఇది వెరైటీ ధర్మాల వృక్షము. ఇందులో అన్నీ వచ్చేశాయి. పోతే చిన్న చిన్న శాఖలైతే లెక్కలేనన్ని ఉన్నాయి. మఠాలు, మార్గాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. భారతదేశానిది ఆది సనాతన దేవీ దేవతా ధర్మము. దానిని ఎవరు స్థాపించారు? భగవంతుడు. దానిని మనుష్యమాత్రులు ఎవ్వరూ స్థాపించలేదు. శ్రీ కృష్ణుడు దైవీ గుణాలు గల మానవుడు. అతడు 84 జన్మలు పూర్తి చేసి ఇప్పుడు అంతిమ జన్మలో ఉన్నాడు. సూర్యవంశీ, చంద్రవంశీ, వైశ్య వంశీయులుగా అవుతూ అవుతూ కళలు తగ్గిపోతూ ఉంటాయి. సత్యయుగములో శ్రేష్ఠాచారులుగా ఉన్న సూర్యవంశీయుల రాజధాని ఇప్పుడు కలియుగములో భ్రష్ఠాచారిగా ఉంది. ఇప్పుడు మరలా శ్రేష్ఠాచారీగా తయరవుతోంది. ఉన్నతోన్నతమైన పాత్ర ఎవరిది? అన్నది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. శివాయ నమ: అని ముఖ్యమైన వారి(శివబాబా) మహిమను బ్రహ్మ, విష్ణు, శంకరులకు ఇవ్వలేరని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ప్రెసిడెంటు మహిమను ప్రైమినిష్టర్‌కు లేక ఇతరులెవ్వరికో ఇస్తారా? ఇవ్వరు కదా! వేర్వేరు టైటిళ్లు ఉన్నాయి కదా! అందరూ ఒకే విధంగా అవ్వలేరు కదా. పిల్లలైన మీకిప్పుడు బుద్ధి లభించింది. క్రీస్తుకు కూడా తన క్రైస్తవ ధర్మాన్ని స్థాపన చేసే పాత్ర లభించిందని మీకు తెలుసు. ఆత్మ ఒక బిందువు. ఆ ఆత్మలో పాత్ర నిండి ఉంది. క్రైస్తవ ధర్మాన్ని స్థాపన చేసి మళ్లీ పునర్జన్మలు తీసుకుంటూ పాలన చేస్తూ సతో, రజో, తమోలలోకి రావాలి. చివరిలో వృక్షమంతా శిథిలావస్థకు చేరుకోవాల్సిందే. ప్రతి ఒక్కరికీ ఎంత సమయము పాత్ర లభించిందో, బుద్ధుడు ఎంత సమయము పాలన చేయాలో ఇవన్నీ మీకు తెలుసు. భిన్న-భిన్న నామ-రూపాలతో జన్మలు తీసుకుంటూ ఉంటారు.

ఇప్పుడు బాబా మీ బుద్ధిని చాలా విశాలంగా తయారు చేస్తారు. కాని కొందరు శివబాబాను కూడా స్మృతి చేయలేరు. అనంతమైన తండ్రి అనంతమైన స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. ఈ విషయాన్ని కూడా మీరు అర్థము చేయించలేరా? బాబా ఎన్నో సార్లు అర్థం చేయించారు. ఆత్మలో అవినాశీ పాత్ర రచింపబడి ఉంది. ఒక శరీరాన్ని వదిలి మళ్లీ ఇంకొక శరీరాన్ని తీసుకోవాలి. ఇవి అర్థము చేసుకోవాల్సిన ఎంత గుహ్యమైన విషయాలు! ఎవరు స్కూల్లో రోజూ చదువుతూ ఉంటారో వారే అర్థం చేసుకుంటారు. కొందరు నడుస్తూ నడుస్తూ అలసిపోతారు. నీవే తల్లివి, తండ్రివి, మేము మీ పిల్లలము,......... అని మహిమ కూడా చేస్తారు. నేను మీకు స్వర్గములో అపారమైన సుఖమును ఇచ్చేందుకు పురుషార్థము చేయిస్తున్నాను, మీరు అలసిపోరాదు అని బాబా చెప్తున్నారు. ఇంత ఉన్నతమైన చదువును చదవడము మీరు వదిలేస్తారు! కొందరు చదువును వదిలేసి మళ్లీ వికారాలలోకి కూడా వెళ్లిపోతారు. మొదట ఎలా ఉండేవారో మళ్లీ అలాగే అయిపోతారు. నడుస్తూ నడుస్తూ పడిపోతారు. ఇంకేమి జరుగుతుంది? అక్కడ వారు భలే సుఖములో ఉన్నా, పదవిలో అయితే తేడా ఉంటుంది కదా. ఇక్కడ అందరూ దు:ఖితులుగా ఉన్నారు. అక్కడ రాజులకు, ప్రజలకు అందరికీ సుఖము ఉంటుంది. అయినా ఉన్నత పదవి తీసుకోవాలి కదా! చదువును వదిలేస్తే మీరు అర్హులు కారని మాతా-పితలు అంటారు. తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటూ తీసుకుంటూ కొంతమంది పిల్లలు అలసిపోతారు. నడుస్తూ నడుస్తూ మాయ దాడి చేయడంతో తిరిగి వెళ్లిపోతారు. ఏదైతే జమ చేసుకున్నారో అదంతా మళ్లీ సమాప్తమైపోతుంది. ఇంకేమౌతారు? స్వర్గములోకి భలే వెళ్లినా పూర్తి సాధారణ ప్రజలుగా అవుతారు. నాకు చెందినవారిగా అయ్యి మళ్లీ అలసిపోయినట్లయితే లేక ద్రోహులుగా అయిపోయినట్లయితే ప్రజలలో ఛండాలురుగా అయిపోతారు. అన్ని రకాలవారూ కావాలి కదా! స్వర్గాధిపతులుగా అవుతూ అవుతూ చదువును వదిలేసినట్లయితే, అటువంటి మహామూర్ఖులు ప్రపంచములో ఇంకెవ్వరూ ఉండరు. నీవే తల్లివి, తండ్రివి, మేము మీ పిల్లలము,......... మీ కృప ద్వారా స్వర్గములో అపారమైన సుఖ-సంపదలు లభిస్తాయి,....... కృప చూపించు! అని కూడా వ్రాస్తారు. ఇక్కడ కృప చూపు విషయమే లేదు. నేను టీచరును, చదివిస్తాను. మంచి మార్కులతో పాసయ్యేందుకు పురుషార్థము మీరు చేయండి అని బాబా అంటారు. అంతేకాని నేను కూర్చుని అందరినీ ఆశీర్వదించను. మీరు యోగము చేస్తూ ఉంటే మీకు శక్తి లభిస్తూ ఉంటుంది. అందరూ సింహాసనము పై కూర్చోరు కదా. ఒకరి తల పై ఒకరు కూర్చుంటారా? కావున ముఖ్యమైన ధర్మాలు 4 మాత్రమే. శాస్త్రాలు కూడా నాలుగే - వాటిలో ముఖ్యమైనది గీత. మిగిలినవన్నీ దాని పిల్లలే. వారసత్వము మాతా-పితల నుండే లభిస్తుంది. ఇప్పుడు బాబా సన్ముఖములో అర్థము చేయిస్తున్నారు. కేవలం గీతను చదవడం ద్వారా రాజాధి రాజులుగా అయిపోరు. బాబా అయితే (బ్రహ్మాబాబా) గీతను చదివారు. కాని దాని వలన ఏమీ జరగలేదు. ఇవన్నీ భక్తిమార్గపు శాస్త్రాలు. మీరు పురుషార్థము చేసి 16 కళా సంపూర్ణులుగా అవ్వాలి. ఇప్పుడు మీలో ఏ కళ, ఏ గుణాలు మిగలలేదు. నిర్గుణుడైన నాలో ఏ గుణమూ లేదు. మీరే దయ చూపించండి....... మమ్ములను మళ్లీ 16 కళా సంపూర్ణులుగా తయారు చేయండి అని మహిమ చేస్తారు. ఒకప్పుడు మేము ఎలాగైతే ఉండేవారమో మళ్లీ అలా తయారు చేయండి అని అంటారు. బాబా సన్ముఖములో వచ్చి అర్థము చేయిస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. ఒక నిర్గుణ సంస్థను కూడా తయారు చేశారు. నిర్గుణ నిరాకార్‌ అనే పదానికి అర్థము కూడా తెలియదు. శివబాబాకైతే ఆకారము కూడా ఉంది. పేరు ఉన్నప్పుడు ఆ వస్తువు తప్పకుండా ఉంటుంది కదా! ఆత్మ ఎంతో సూక్ష్మమైనది. దానికి కూడా పేరు ఉంది. బ్రహ్మ మహాతత్వములో ఆత్మలు నివసిస్తాయి. ఆ పేరు కూడా ఉంది కదా. నామ-రూపాలకు అతీతముగా ఏ వస్తువు కూడా ఉండదు. భగవంతుడు నామ-రూపాలకు అతీతులని అంటారు. మళ్లీ వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. ఇది ఎంత పెద్ద తప్పు! ఈ విషయాలను మనుష్యులు ఎప్పుడైతే అర్థము చేసుకుంటారో అప్పుడు నిశ్చయము ఏర్పరచుకోగలరు. బాబా మేము మిమ్ములను తెలుసుకున్నాము. కల్ప-కల్పము మీ నుండి రాజ్య భాగ్యమును తీసుకుంటూ వచ్చాము అని అంటారు. ఇటువంటి నిశ్చయము ఉన్నప్పుడే చదువుకోగలరు. ఇక్కడ నుండి బయటకు వెళ్లగానే మర్చిపోతారు. కావున రాజయోగాన్ని నేర్పించేందుకు శివబాబా తప్పకుండా వచ్చారని మొట్టమొదటనే వ్రాయించుకోవాలి. వ్రాసి కూడా ఇస్తారు కాని తర్వాత చదవరు. రక్తముతో కూడా వ్రాసి ఇచ్చారు. కాని వారు ఈ రోజు లేరు. మాయ ఎంత శక్తివంతమైనది! తండ్రి కూర్చుని ఎంతగానో అర్థము చేయిస్తారు! మీరు ఈ విధంగా ఉత్తరాలను వ్రాసినప్పుడు మీ విహంగ మార్గపు సేవ జరుగుతుంది. మీ శక్తి సేనలో కూడా నంబరువారుగా ఉన్నారు. ఒకరు ఛీఫ్‌ కమాండర్‌(కమాండర్‌ ఇన్‌ఛీఫ్‌)గా, కొందరు కెప్టన్లుగా, కొందరు మేజర్లుగా ఉన్నారు. కొందరు సిపాయిల(సోల్జర్‌)తో పాటు, బరువులు ఎత్తేవారు కూడా ఉన్నారు. అంతా సైన్యమే. బాబా అయితే పురుషార్థము చేయిస్తారు కదా. ప్రతి ఒక్కరి పురుషార్థము ద్వారా వీరు రాజు-రాణులుగా అవుతారా? లేక మంచి షావుకారు ప్రజలుగా అవుతారా? లేక సాధారణ ప్రజలలోకి వస్తారా? లేక దాస-దాసీలుగా అవుతారా? అనేది తెలిసిపోతుంది. ఇది అర్థము చేసుకునేందుకు చాలా సులభము. అయితే మొదటి ముఖ్యమైన విషయము గురించి మాట్లాడాలి. బాబా మహారథులకు సేవ చేసి చూపండి అని ఎంతగా సవాలు చేస్తారు. కావున విహంగ మార్గపు సేవ కొరకు మీ చింతన నడవాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. చదువులో అలసిపోరాదు. అత్యంత ఉన్నతమైన చదువును ప్రతి రోజూ చదవాలి, చదివించాలి.

2. విహంగ మార్గపు సేవను చేసేందుకు యుక్తులు రచించాలి. యోగములో ఉండి మీరు బాబా నుండి శక్తిని తీసుకోవాలి. కృప లేక ఆశీర్వాదాలను వేడుకోరాదు.

వరదానము :-

'' బ్రాహ్మణ జీవితంలో సంతోష వరదానాన్ని సదా స్థిరంగా ఉంచుకునే మహాన్‌ ఆత్మా భవ ''

బ్రాహ్మణ జీవితంలో సంతోషమే జన్మ సిద్ధ అధికారము. సదా సంతోషంగా ఉండడమే మహానత. ఎవరైతే ఈ సంతోషమనే వరదానాన్ని స్థిరంగా ఉంచుకుంటారో వారే మహోన్నతులు. కనుక సంతోషాన్ని ఎప్పుడూ పోగొట్టుకోరాదు. సమస్యలైతే వస్తాయి, పోతాయి కాని సంతోషము పోరాదు. ఎందుకంటే సమస్య పర-స్థితి, ఇతరుల వైపు నుండి వచ్చింది. అది వస్తుంది, పోతుంది. కాని సంతోషము మీ స్వంత వస్తువు. స్వంత వస్తువును సదా జతలో ఉంచుకుంటారు. అందువలన శరీరము భలే పోయినా సంతోషము పోరాదు. సంతోషంగా శరీరము పోతే ఇంతకంటే మంచి ఫస్ట్‌క్లాస్‌ అయిన కొత్త శరీరము లభిస్తుంది.

స్లోగన్‌ :-

'' బాప్‌దాదా నుండి హృదయపూర్వక శుభాకాంక్షలు తీసుకోవాలంటే అనేక విషయాలను చూడకుండా, అలసిపోకుండా సేవలో ఉపస్థితులై ఉండండి ''