15-11-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - తమ బుద్ధి లేక ఆలోచనలను ఎంత శుద్ధంగా, స్వచ్ఛంగా చేసుకోవాలంటే తద్వారా శ్రీమతమును యధార్థ రీతిలో ధారణ చేసి తండ్రి పేరును ప్రసిద్ధము చేయగలగాలి ''

ప్రశ్న :-

పిల్లల ఎటువంటి స్థితి తండ్రిని ప్రత్యక్షము చేస్తుంది ?

జవాబు :-

పిల్లలు ఎవరైతే నిరంతరము హర్షితముఖులుగా, అచలంగా, స్థిరంగా, మగ్నస్థితిని తయారు చేసుకుంటారో అప్పుడు తండ్రిని ప్రత్యక్షము చేయగలరు. అటువంటి ఏకరస స్థితిని కలిగిన తెలివైన పిల్లలే యధార్థ రీతిలో అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వగలరు.

పాట :-

మర్‌నా తేరీ గలీమే, జీనా తేరీ గలీమే,............ ( నీ దారిలో మరణించాలి,................)   

ఓంశాంతి.

పిల్లలు పాట విన్నారు. జీవించి ఉండే మరణించేందుకు మీ ద్వారము ముందుకు వచ్చామని అంటారు. ఎవరి ద్వారములోకి ? ఒకవేళ గీతా భగవానుడు కృష్ణుడైతే ఈ విషయాలన్నీ సాధ్యము కావు. కృష్ణుడు ఇక్కడ ఉండేందుకు వీలు లేదు. అతడు సత్యయుగ రాకుమారుడు, గీతను కృష్ణుడేమీ వినిపించలేదు. పరమాత్మయే వినిపించారు. ఆధారమంతా ఈ ఒక్క విషయము పైనే ఉంది. భక్తిలో చేసినంత కష్టము ఇక్కడ అవసరము లేదు. ఇది కేవలం ఒక్క క్షణములోని విషయమే. కేవలం ఈ ఒక్క విషయాన్ని నిరూపించేందుకు తండ్రి ఎంతగా శ్రమించవలసి వస్తుంది, ఎంత జ్ఞానాన్ని ఇవ్వవలసి పడ్తుంది. భగవంతుడిచ్చిన ప్రాచీన జ్ఞానమే ఈ జ్ఞానము. విషయమంతా గీత పైనే ఉంది. పరమపిత పరమాత్మయే వచ్చి దేవీ దేవతా ధర్మ స్థాపన చేసేందుకు సహజ రాజయోగాన్ని, జ్ఞానాన్ని నేర్పించారు. అదిప్పుడు ప్రాయ: లోపమైపోయింది. కృష్ణుడు మళ్లీ ఎప్పుడైనా వచ్చి గీతను వినిపిస్తారని మనుష్యులు భావిస్తారు. సృష్టి చక్ర చిత్రము ద్వారా పారలౌకిక పరమపిత పరమాత్మ జ్ఞానసాగరులే గీతను వినిపించారని మీరు నిరూపించాలి. కృష్ణుని మహిమ వేరు, పరమపిత పరమాత్ముని మహిమ వేరు. కృష్ణుడు సత్యయుగ రాకుమారుడు. సహజ రాజయోగము ద్వారా రాజ్యభాగ్యాన్ని పొందుకున్నాడు. విద్యను అభ్యసించు సమయములో ఉండిన నామ-రూపాలు, రాజ్యభాగ్యాన్ని పొందుకున్న సమయములో ఉండే నామ-రూపాలు వేరు వేరని ఋజువు చేసి తెలిపించాలి. కృష్ణుడిని పతితపావనుడని ఎప్పుడూ అనరు. పతితపావనులు ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు మళ్లీ శ్రీ కృష్ణుని ఆత్మ పతితపావనుల ద్వారా రాజయోగాన్ని నేర్చుకుని భవిష్య పావన ప్రపంచ రాకుమారునిగా తయారవుతోందని ఋజువు చేసి అర్థము చేయించేందుకు కూడా యుక్తులు కావాలి. విదేశీయులకు కూడా నిరూపించి చెప్పాల్సి ఉంటుంది. నెంబర్‌వన్‌ శాస్త్రము గీత. అది సర్వశాస్త్రమయి శ్రీమత్‌ భగవద్గీతా మాతా. మరి ఈ మాతకు జన్మనిచ్చిన వారెవరు? తండ్రియే తల్లిని దత్తత చేసుకుంటారు కదా. గీతను ఎవరు వినిపించారు? ఏసుక్రీస్తు బైబిలును దత్తు తీసుకున్నారని అనరు. ఏసుక్రీస్తు ఇచ్చిన శిక్షణలను బైబిలుగా రూపొందించి చదువుకుంటారు. మరి గీతా శిక్షణలను ఎవరు ఇచ్చారు? దానిని తర్వాత పుస్తకంగా చేసి చదువుతూ ఉంటారు. కాని దీనిని గూర్చి ఎవ్వరికీ తెలియదు. మిగిలిన శాస్త్రాలన్నిటి గురించి అయితే తెలుసు. ఈ సహజ రాజయోగ శిక్షణను ఎవరు ఇచ్చారో నిరూపించాలి. ప్రపంచము రోజురోజుకు తమోప్రధానమౌతూ పోతుంది. ఈ విషయాలన్నీ స్వచ్ఛమైన బుద్ధిలోనే కూర్చుంటాయి. శ్రీమతమును అనుసరించని వారికి ధారణ జరగజాలదు. మీరేమీ అర్థము చేయించలేరని శ్రీమతము చెప్తుంది. స్వయాన్ని జ్ఞానులమని భావించకండి. పరమపిత పరమాత్మయే గీతా భగవంతుడని, వారే పతితపావనులు అనే విషయాన్ని మొదట నిరూపించాలి. మనుష్యులైతే సర్వవ్యాపి అని లేక బ్రహ్మ తత్వమని లేక సాగరమని అనేస్తారు. నోటికి ఏది వస్తే దానిని అర్థము లేకుండా చెప్పేస్తారు. గీతా భగవంతుడు శ్రీ కృష్ణుడు అని చెప్పి గీతనే ఖండించారు. తప్పులన్నీ గీత నుండే వెలువడినాయి. కావున అర్థం చేయించేందుకు గీతను తీసుకోవలసి వచ్చింది. గీతా భగవానుడు కృష్ణుడు కాదని నిరూపించి చెప్పమని బనారస్‌లోని గుప్తాగారికి కూడా చెప్పేవారు. ఇప్పుడు సమ్మేళనాలు జరుగుతాయి. ధార్మిక వ్యక్తులంతా శాంతి కొరకు ఉపాయమేది? అని చర్చిస్తారు. కాని శాంతి స్థాపన పతిత మనుష్యుల ద్వారా సాధ్యము కాదు. ''పతిత పావనా రండి'' అని పిలుస్తూ ఉంటారు. మరి శాంతి స్థాపన పతితులెలా చేయగలరు? పతితులను పావనంగా చేసే తండ్రి గురించే తెలియదు. భారతదేశము పావనంగా ఉండేది, ఇప్పుడు పతితమయ్యింది. మరి పతితపావనులు ఎవరు అన్నది ఎవరి బుద్ధిలోకి రాదు. రఘుపతి రాఘవ........ అని మహిమ చేస్తారు. కాని ఆ రాముడు ఇప్పుడు లేడు. సత్యాన్ని గ్రహించక పిలుస్తారు కాని ఏమీ తెలియదు. మరి ఇది ఎవరు వెళ్ళి అర్థము చేయిస్తారు? చాలామంచి పిల్లలు కావాలి. తెలిపించేందుకు మంచి యుక్తి కావాలి. గీతను భగవంతుడే రచించారని అర్థము చేయించేందుకు పెద్ద సృష్టి చక్రాన్ని కూడా తయారు చేయించారు. వారెవరైనా సరే అందరూ భగవంతులే కదా అని అంటారు. తండ్రి చెప్తున్నారు - మీరు అవివేకులు. నేను వచ్చి పావన రాజ్యాన్ని స్థాపన చేశాను. నా బదులు శ్రీ కృష్ణుని పేరు వేసేశారు. పతితమైన వాడినే పావనంగా చేసి ప్రథమ రాకకుమారునిగా తయారుచేస్తాను. భగవానువాచ - నేను కృష్ణుని ఆత్మను(అతని అంతిమ జన్మలో) దత్తత చేసుకొని బ్రహ్మగా చేసి అతని ద్వారా జ్ఞానమునిస్తాను. బ్రహ్మ ఈ సహజ రాజయోగము ద్వారా సత్యయుగపు ప్రథమ రాకుమారునిగా అవుతాడు. ఈ జ్ఞానము ఎవరి బుద్ధిలోనూ లేదు.

శ్రీమద్భగవద్గీత సర్వశాస్త్ర్రాల తల్లి - తండ్రి. మరి గీతా రచయిత ఎవరు? ఈ విషయములో ఏ పొరపాటు జరిగిందో దానిని మొదట మీరే ఋజువు చేసి చూపించాలి. ఉదాహరణానికి ఏసుక్రీస్తు బైబిలుకు జన్మనిచ్చాడు. అది క్రైస్తవ ధర్మశాస్త్రంగా అయ్యింది. బైబిల్‌ తండ్రి ఎవరు ? - ఏసుక్రీస్తు. క్రీస్తును తల్లి, తండ్రి అని అనరు. అక్కడ తల్లి విషయమే లేదు. ఇక్కడ తల్లి - తండ్రి ఇరువురూ ఉన్నారు. క్రైస్తవులు కృష్ణుని ధర్మముతో పోటీ పడ్తారు. వారు క్రీస్తును నమ్ముతారు. బుద్ధుడు ధర్మస్థాపన చేసినందున వారి ధర్మశాస్త్రము కూడా ఉంది. ఇప్పుడు గీతను ఎవరు వినిపించారు? దాని ద్వారా ఏ ధర్మస్థాపన జరిగింది? ఇది ఎవ్వరికీ తెలియదు. పతితపావనుడైన పరమపిత పరమాత్మయే జ్ఞానమిచ్చారని ఎప్పుడూ చెప్పరు. పరమపిత పరమాత్మయే జ్ఞానమిచ్చారని అర్థము చేసుకునే విధంగా సృష్టిచక్ర చిత్రాన్ని తయారు చేశారు. రాధా-కృష్ణులైతే సత్యయుగములో ఉంటారు. వారు తమకు తామే జ్ఞానమునిచ్చుకోలేదు. జ్ఞానమునిచ్చేవారు మరొకరుండాలి. ఎవరో వారిని పాస్‌(ఉత్తీర్ణులుగా) చేయించి ఉండాలి. ఈ రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునే జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారు? అదృష్టము దానంతట అదే తయారవ్వదు కదా. అదృష్టాన్ని తయారుచేసేందుకు తండ్రి లేక టీచరు ఉండాలి. గురువు గతిని(మోక్షమును) ఇస్తారని అంటారు. కాని గతి-సద్గతుల అర్థము కూడా వారికి తెలియదు. ప్రవృత్తి మార్గము వారి సద్గతి జరుగుతుంది. గతి అనగా అందరూ తండ్రి వద్దకు వెళ్తారు. ఈ విషయాలు ఎవ్వరూ అర్థము చేసుకోరు. వారు భక్తిమార్గములో చాలా పెద్ద, పెద్ద దుకాణాలను తెరచి కూర్చున్నారు. సత్యమైన జ్ఞాన మార్గపు దుకాణము ఇదొకటే. మిగిలినవన్నీ భక్తి మార్గపు దుకాణాలు. ఈ వేద శాస్త్రాలన్నీ భక్తిమార్గపు సామగ్రి అని తండ్రి చెప్తున్నారు. ఈ జప, తపాలు వేద శాస్త్రాలు మొదలైనవాటి అధ్యయనము ద్వారా నేను లభించనని తండ్రి చెప్తున్నారు. నేను పిల్లలకు జ్ఞానమునిచ్చి పావనంగా చేస్తాను. సమస్త సృష్టికి సద్గతిదాతను. గతి(ముక్తిధామము) మీదుగా మీరు సద్గతిలోకి రావాలి. అందరూ సత్యయుగములోకి రారు. ఇది తయారైన డ్రామా. ఏదైతే కల్పక్రితము నేర్పించి ఉన్నానో, ఏ చిత్రాలను తయారు చేయించానో వాటిని మళ్లీ ఇప్పుడు తయారు చేయిస్తున్నాను.

మూడు ధర్మాల కాళ్ల పై(ఆధారంగా) సృష్టి నిలబడి ఉందని మనుష్యులు అంటారు. ఒక్క దేవతా ధర్మము అనబడే కాలు విరిగి ఉన్నందున కదులుతూ ఉంటుంది. మొదట ఒకే ధర్మము ఉండేది. దానిని అద్వైత రాజ్యము అని అంటారు. తర్వాత ఆ ఒక్క కాలు అదృశ్యమై మూడు కాళ్ళు వెలువడ్తాయి. వాటిలో ఏ మాత్రము శక్తి ఉండదు. పరస్పరము యుద్ధాలు, జగడాలు నడుస్తూ ఉంటాయి. ధనీని(ఇంటి పెద్ద, బాబా) గురించి తెలియనే తెలియదు. అనాథలైపోయారు. ఎంతో యుక్తితో అర్థము చేయించాలి. గీతా భగవానుడు పరమపిత పరమాత్మ అని, కృష్ణుడు కాదని, వారి జన్మ స్థలము భారతదేశమని ప్రదర్శనీలలో కూడా అర్థం చేయించాలి. కృష్ణుడు సాకారుడు, పరమాత్మ శివుడు నిరాకారుడు. వారి మహిమ పూర్తిగా భిన్నమైనది. గీత ఎవరు వినిపించారు అనేది ఋజువయ్యే విధంగా యుక్తితో కార్టూన్‌(హాస్య చిత్రము)ను తయారుచేయాలి. అంధుల ఎదురుగా పెద్ద దర్పణాన్ని పెట్టాలి. ఇది అంధుల ముందు దర్పణము. చాలా లోతుగా వెళ్లరాదు. ఇది చాలా పెద్ద తప్పు. పరమపిత పరమాత్మ మహిమ వేరు. వారికి బదులు కృష్ణునికి మహిమ ఇచ్చేశారు. లక్ష్మీనారాయణుల చిత్రములో క్రింద రాధా-కృష్ణులున్నారు. వారే తిరిగి లక్ష్మీనారాయణులుగా అవుతారు. సత్యయుగములో లక్ష్మీనారాయణులు, త్రేతా యుగములో సీతా-రాములు. మొదటి నంబరు పుత్రుడైన అయిన శ్రీ కృష్ణుని ద్వాపర యుగములోకి తీసుకెళ్లారు. ఇవన్నీ భక్తిమార్గంలో రచింపబడినవి. విదేశీయులకు వీటిని గురించి ఏం తెలుసు? డ్రామానుసారము ఈ జ్ఞానము ఎవరి వద్దా లేదు. జ్ఞానాన్ని పగలు అని, భక్తిని రాత్రి అని అంటారు. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి. సత్యయుగాన్ని స్థాపించేవారెవరు? బ్రహ్మ ఎక్కడ నుండి వచ్చాడు? సూక్ష్మవతనములోకి ఎక్కడ నుండి వచ్చాడు? పరమపిత పరమాత్మయే సూక్ష్మ సృష్టిని రచిస్తారు. అక్కడ బ్రహ్మను చూపిస్తారు. కాని అక్కడ ప్రజాపిత బ్రహ్మ ఉండడు. తప్పకుండా ప్రజాపిత వేరుగా ఉన్నారు. వారు ఎక్కడి నుండి వచ్చారనే విషయము ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. కృష్ణుని అంతిమ జన్మలో పరమాత్మ అతడిని తన రథంగా చేసుకున్నారు, ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు.

ఇది చాలా పెద్ద(భారీ) తరగతి. ఈ విద్యార్థి ఎలా ఉన్నారు? అని టీచరు తెలుసుకోగలడు. మరి తండ్రి అర్థం చేసుకోలేరా! ఇది బేహద్‌ తండ్రి క్లాసు. ఇక్కడి విషయాలు విలక్షణమైనవి. శాస్త్రాలలో అయితే ప్రళయము మొదలైనవి చూపించి ఎంతో గడబిడ చేసేశారు. ఎంత అహం భావముంది. రామాయణము, భగవద్గీత మొదలైనవాటిని ఎలా కూర్చొని వినిపిస్తారో చూడండి. కృష్ణుడు గీతను వినిపించలేదు. అతడు గీతా జ్ఞానము విని రాజ్యపదవిని పొందాడు. వీరి గుణాలు ఇవి, కృష్ణుని గుణాలు ఇవి అని చెప్తూ గీతా భగవంతుడు శివబాబా అని మనము ఋజువు చేసి అర్థము చేయిస్తాము. ఈ పొరపాటు కారణంగానే భారతదేశము గవ్వ తుల్యంగా అయిపోయింది. మీరు మాతలు, వారికి (సన్యాసులకు) ఇలా చెప్పవచ్చు - నారి నరకానికి ద్వారమని మీరు అంటారు కదా. కాని పరమాత్మ జ్ఞాన కలశాన్ని మాతల పై ఉంచారు. మాతలే స్వర్గానికి ద్వారముగా అవుతారు. మరి మీరేమో మాతలను నింద చేస్తున్నారు. ఈ విధంగా వారు చాలా వివేకవంతులుగా ఉండాలి. ఈ ముఖ్యాంశాలన్నీ వ్రాసుకొని అర్థము చేయించాలి. వాస్తవానికి భక్తిమార్గము గృహస్థుల కొరకే. ఇది ప్రవృత్తిమార్గపు సహజ రాజయోగము. మేము ఋజువు చేసి అర్థము చేయించేందుకు వచ్చాము. పిల్లలు తండ్రిని ప్రత్యక్షము(షో) చేయాలి. సదా హర్షితముఖము, అచలంగా, స్థిరంగా, అనందంగా ఉండాలి. పోను పోను మీ మహిమ తప్పకుండా వెలువడ్తుంది. మీరందరూ బ్రహ్మకుమార-కుమారీలు. కుమారీ అంటే 21జన్మలకు తండ్రి నుండి ఆస్తిని ఇప్పించేవారు. కుమారీల మహిమ చాలా గొప్పది. మీ మమ్మా ముఖ్యమైన కుమారి. చంద్రుని ముందు మంచి నక్షత్రము కూడా కావాలి. వీరు జ్ఞాన సూర్యులు. ఈ గుప్త మమ్మా(బ్రహ్మ) వేరే. ఈ రహస్యాన్ని పిల్లలైన మీరే అర్థము చేసుకొని ఇతరులకు అర్థము చేయించగలరు. ఆ మమ్మా పేరు వేరు, మందిరాలు వారివే. ఈ గుప్త వృద్ధ తల్లికి(బ్రహ్మకు) మందిరాలు లేవు. ఈ మాతా-పితలు సంయుక్తంగా ఉన్నారు. ఇది ప్రపంచానికి తెలియదు. కృష్ణుడు ఇలా మాత-పితగా అవ్వలేడు. అతడు సత్యయుగ రాకుమారుడు. కృష్ణునిలో భగవంతుడు రాలేడు. అర్థము చేయించడం చాలా సహజము. గీతా భగవానుని మహిమ వేరు. వారు పతితపావనుడు, మొత్తం ప్రపంచానికంతా మార్గదర్శకుడు(గైడు), ముక్తిదాత(లిబరేటర్‌). మనుష్యులు చిత్రాల ద్వారా తప్పకుండా పరమాత్మ మహిమ భిన్నమయ్యిందని, అందరూ ఒకే విధంగా ఉండరని అర్థము చేసుకుంటారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. మీ స్థితిని చాలా ఆనందంగా, అచలంగా, స్థిరంగా చేసుకోవాలి. సదా హర్షితముఖులుగా ఉండాలి.

2. జ్ఞానపు శుద్ధమైన నషా(అహంకారము)లో ఉండి తండ్రిని ప్రత్యక్షము చేయాలి. గీతా భగవానుని ఋజువు చేసి తండ్రి సత్యమైన పరిచయమునివ్వాలి.

వరదానము :-

''సర్వ ప్రాప్తుల అనుభూతి ద్వారా మాయకు విదాయీ(వీడ్కోలు) ఇచ్చి బధాయీ(అభినందనలు) పొందే ఖుశ్‌నసీబ్‌(భాగ్యశాలి) ఆత్మా భవ ''

ఎవరి సాథీగా సర్వశక్తివంతుడైన తండ్రి ఉంటారో, వారికి సదా సర్వ ప్రాప్తులు ఉంటాయి. వారి ముందుకు ఎప్పుడూ ఏ విధమైన మాయ రాజాలదు. ఎవరైతే ప్రాప్తుల అనుభూతిలో ఉండి మాయకు వీడ్కోలునిస్తారో వారికి బాప్‌దాదా ద్వారా ప్రతి అడుగులో అభినందనలు లభిస్తాయి. కనుక సదా స్వయం భగవంతుడు, ఆత్మలమైన మాకు అభినందనలు తెలుపుతున్నాడు, ఏదైతే సంకల్పములో కూడా లేదో, ఆలోచించనే లేదో అది పొందుకున్నాము. తండ్రిని పొందాము, అంతా పొందాము - మీరు ఇటువంటి భాగ్యశాలి ఆత్మలు(ఖుశ్‌నసీబ్‌ ఆత్మలు).

స్లోగన్‌ :-

''స్వ చింతన మరియు ప్రభు చింతన చేస్తే వ్యర్థ చింతన స్వతహాగా సమాప్తమైపోతుంది ''