19-10-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - తండ్రితో సర్వ సంబంధాలు ఉంచుకుంటే సర్వ బంధనాలు సమాప్తమైపోతాయి. మాయ బంధనాలలో బంధిస్తుంది. తండ్రి బంధనాల నుండి ముక్తులుగా చేసేస్తారు''

ప్రశ్న :-

నిర్బంధనులని ఎవరిని అంటారు ? నిర్బంధనులుగా అయ్యేందుకు ఉపాయమేది ?

జవాబు :-

నిర్బంధనులు అనగా అశరీరులు. దేహ సహితంగా దేహ సంబంధాలేవీ బుద్ధిని తమ వైపు ఆకర్షించరాదు(లాగరాదు). దేహాభిమానములోనే బంధనముంది. దేహీ-అభిమానులుగా అయితే సర్వ బంధనాలు సమాప్తమైపోతాయి. జీవించి ఉండి మరణించడమే నిర్బంధనులుగా అవ్వడం. ఇప్పుడిది అంతిమ సమయము, నాటకము సమాప్తమైపోయింది, ఇప్పుడు మేము తండ్రి దగ్గరకు వెళ్తామని బుద్ధిలో ఉంటే నిర్బంధనులుగా అయిపోతారు.

పాట :-

భగవంతుడే సాథీగా ఉన్నవారికి,..............( జిస్‌కా సాథీ హై భగవాన్‌,.............)   

ఓంశాంతి.

తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు ఎంతోమంది పిల్లలున్నారు. అందువలన అనంతమైన తండ్రి తప్పకుండా ఉంటారు. వారిని నిరాకార శివబాబా అని కూడా అంటారని తండ్రి అర్థము చేయిస్తున్నారు. బ్రహ్మను కూడా బాబా అని అంటారు. విష్ణువును లేక శంకరుని బాబా అని అనరు. శివుని సదా తండ్రి అనే అంటారు. శివుని చిత్రము వేరు, శంకరుని చిత్రము వేరు. ఓం నమ: శివాయ అనే పాట కూడా ఉంది. మళ్లీ నీవే తల్లివి, తండ్రివి అని కూడా అంటారు. తప్పకుండా నిరాకార శివుడినే తండ్రి అని అంటారని ఎవరికైనా అర్థము చేయించడం చాలా సహజము. వారు సర్వాత్మలకు తండ్రి. విష్ణువు గాని, శంరుడు గాని నిరాకారులు కారు, శివుడిని నిరాకారుడని అంటారు. మందిరాలలో వారందరి చిత్రాలు(విగ్రహాలు) ఉన్నాయి. భక్తి మార్గములో ఎన్ని చిత్రాలున్నాయి! శివబాబా చిత్రాన్ని ఉన్నతోన్నతంగా చూపిస్తారు. ఆ తర్వాత బ్రహ్మ, విష్ణు, శంకరుల చిత్రాలను చూపిస్తారు. వారికి(బ్రహ్మ, విష్ణు, శంకరులకు) కూడా రూపాలున్నాయి. జగదంబ, జగత్‌పితలకు కూడా రూపాలున్నాయి. లక్ష్మీనారాయణులకు కూడా సాకార రూపాలున్నాయి. పోతే భగవంతుడొక్కరే నిరాకారులు. కాని వారిని కేవలం గాడ్‌ అని అనడం వలన మనుష్యులు తికమకపడ్తారు. మీకు గాడ్‌(భగవంతుడు) ఏమౌతారు? అని ప్రశ్నించండి. ఫాదర్‌(తండ్రి) అని చెప్తారు. కావున గాడ్‌ఫాదర్‌ భగవంతుడు తండ్రి అని నిరూపించి చెప్పాలి. రచయిత అయిన తండ్రితో పాటు తల్లి కూడా కావాలి. తల్లి లేకుండా తండ్రి సృష్టిని ఎలా రచిస్తారు? ఆ తండ్రి ఎప్పుడు వస్తారు? ఓ పతితులను పావనంగా చేసే తండ్రీ! రండి అని అందరూ పిలుస్తారు. ఇప్పుడు ప్రపంచమంతా పతితంగా ఉంది. పతితులుగా అవుతేనే కదా వచ్చి పావనంగా తయారు చేస్తారు కదా! దీని ద్వారా తండ్రి తప్పకుండా పతిత ప్రపంచములోనే రావలసి ఉంటుందని నిరూపించబడ్తుంది. కాని డ్రామానుసారము ఇది ఎవ్వరికీ అర్థం కాదు. అర్థం చేసుకోలేనప్పుడే తండ్రి వచ్చి అర్థము చేయిస్తారు. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థము చేయిస్తారు. భారతదేశములోనే జ్ఞానము, భక్తి అని గాయనము చేయబడ్తుంది. తర్వాత బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అని కూడా అంటారు. రాత్రివేళలో గాఢాంధకారమవుతుంది. జ్ఞాన అంజనము సద్గురువు ప్రసాదించగానే అజ్ఞానాంధకారము వినాశనమయ్యిందని మహిమ కూడా ఉంది. మనుష్యులలో ఎంత అజ్ఞానముందంటే దాని వల్ల తండ్రిని కూడా తెలుసుకోరు, గౌరవించరు. ఇటువంటి అజ్ఞానము మరేదీ ఉండదు. పరమపిత, ఓ గాడ్‌ఫాదర్‌ అంటూ వారిని గురించి తెలుసుకోలేదంటే దానికి మించిన అజ్ఞానము మరొకటి ఉండదు. పిల్లలు తండ్రీ! అని ఒకవైపు పిలుస్తూ వారి కర్తవ్యము, నామ-రూపాదుల గురించి మాకు తెలియదు అని అంటే వారిని అజ్ఞానులనే అనడం జరుగుతుంది కదా! భారతీయుల పొరపాటు ఇదే. వారు తండ్రీ! అంటూ కూడా వారిని గురించి తెలియదు. ఓ గాడ్‌ఫాదర్‌! మీరు వచ్చి పతితులను పావనంగా చేయండి, దు:ఖాల నుండి విడుదల చేయండి, దు:ఖములను హరించి సుఖమునివ్వండి అని పాడ్తారు. తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. ఇది మీకు కూడా నెంబరువారుగా తెలుసు. మనము తండ్రి నుండి పూర్తి వారసత్వము తీసుకోవాలని కొంతమంది అర్థము చేసుకోరు.

తండ్రి సంపూర్ణ పరిచయము లేని కారణంగా ఏం చేయాలి? బంధనాలున్నాయి అని అంటారు. జీవించి ఉండే మరణించడము వస్తే మీ బంధనాలన్నీ సమాప్తమైపోతాయి. మనుష్యులు అకస్మాత్తుగా మరణిస్తే బంధనాలన్నీ వదిలిపోతాయి. ఇప్పుడు అందరి బంధనాలు వదిలిపోనున్నాయి. మీరు జీవించి ఉండే నిర్బంధనులుగా అనగా అశరీరులుగా అవ్వాలి. తండ్రి చెప్తున్నారు - ఈ శారీరిక బంధనాలు మొదలైన వాటిని మర్చిపోండి. మిమ్ములను మీరు ఆత్మ అని భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. పోతే దేహాభిమానానికి వశమైనప్పుడు బంధనమనిపిస్తుంది. మళ్లీ మేము బంధనాలను ఎలా దూరం చేసుకోవాలి? అని అంటారు. తండ్రి చెప్తున్నారు - భలే గృహస్థ వ్యవహారములో ఉండండి. కాని వాపస్‌ వెళ్లాలని బుద్ధిలో ఉండాలి. ఎలాగైతే నాటము పూర్తవుతుందో పాత్రధారులందరూ నాటకము నుండి అతీతమైపోతారో, పాత్ర చేస్తూ చేస్తూ ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది, ఈ పాత్రను అభినయించి ఇంటికి వాపస్‌ వెళ్తాము అని వారి బుద్ధిలో ఉంటుందో అలా మీకు కూడా ఇది అంతిమ సమయము, మేము దైవీ సంబంధాలలోకి వెళ్తామని బుద్ధిలో ఉండాలి. ఈ పాత ప్రపంచములో ఉంటూ, ఇక మేము మా తండ్రి వద్దకు వెళ్తామని బుద్ధిలో ఉండాలి. మేము మీకు సమర్పితులౌతామని పాట కూడా పాడ్తారు. జీవించి ఉండే మీ వారిగా అవుతాము. దేహ సహితంగా సర్వ దేహ సంబంధాలను మరచి మీ ఒక్కరితోనే సంబంధాన్ని ఉంచుకుంటాము అని అంటారు. సంబంధముంటే స్మృతి చేయండి, ప్రేమించండి. తండ్రితో లేక మీ ప్రియతమునితో బుద్ధియోగాన్ని జోడించండి. అప్పుడే మీకు పట్టిన త్రుప్పు వదిలిపోతుంది. యోగము మహిమ చేయబడింది కదా! బాబాతోటి యోగము తప్ప మిగిలినవన్నీ శారీరిక యోగాలు. మామ, పినతండ్రి, గురువు-గోసాయిలు మొదలైనవారితో యోగముంచుతారు. అవన్నీ దేహ సంబంధమైన యోగాలు. తండ్రి చెప్తున్నారు - అందరి నుండి యోగమును తొలగించి నన్నొక్కరినే స్మృతి చేయండి. నా ఒక్కరితోనే యోగమును జోడించండి. దేహాభిమానములోకి రాకండి. దేహము ద్వారా కర్మలు చేస్తున్నా ఇప్పుడు నేను కేవలం పాత్రను అభినయిస్తున్నానని నిశ్చయముంచుకోండి. ఇప్పుడు ఈ పాత ప్రపంచము అంతమవ్వనున్నది. మనము వాపస్‌ వెళ్లాలి. దేహ సహితముగా దేహ సర్వ సంబంధాల నుండి అతీతంగా అవ్వాలి. ఈ విధంగా మీతో మీరే మాట్లాడుకోవాలి. ఇప్పుడు తండ్రి వద్దకు వెళ్లాలి. కొందరికి పత్నుల బంధనము, కొందరికి పతుల బంధనము, కొందరికి ఇంకేదో బంధనము ఉంది. బాబా బంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు ఎన్నో యుక్తులు తెలియచేస్తారు. మేము పవిత్రమై భారతదేశాన్ని తప్పకుండా పవిత్రంగా చెయ్యాలని చెప్పండి. మనము పవిత్రంగా అయ్యి తనువు-మనసు-ధనముల ద్వారా సేవ చేస్తాము. కాని మొదట నిర్మోహులుగా అవ్వాలి. మోహము నశించినట్లయితే గవర్నమెంటుకు ఉత్తరము వ్ర్రాయండిి. అప్పుడు వారు కూడా మీకు సహకరిస్తారు. ''కామము మహాశత్రువు అని భగవానువాచ ఉంది కదా. మేము దాని పై విజయము పొంది పవిత్రంగా ఉండాలనుకుంటున్నాము. పవిత్రంగా అయితే స్వర్గానికి అధిపతులుగా అయిపోతారని మాకు తండ్రి ఆజ్ఞ ఉంది. అంతేకాక మాకు వినాశనము మరియు స్థాపనల సాక్షాత్కారాలు కూడా జరిగాయి. పవిత్రంగా అవ్వడంలో వీరు మాకు విఘ్నాలు కలిగిస్తున్నారు, హింసిస్తున్నారు. నేనైతే భారతదేశానికి సత్యమైన సేవ చేస్తున్నాను. నాకు రక్షణ కలిగించండి'' అని ఉత్తరము వ్రాయండి. మీకు తప్పకుండా సహాయము లభిస్తుంది. అయితే ఇలా వ్రాయలంటే పక్కాగా మోహము దూరము చేసుకొని నిర్మోహులుగా ఉండాలి. సన్యాసులైతే ఇల్లు-వాకిళ్లు వదిలిపోతారు. కాని ఇక్కడ జతలో ఉంటూ నిర్మోహులుగా అవ్వాలి. సన్యాసుల మార్గము వేరు. గృహస్థ వ్యవహారములో ఉంటూ జనకునిలాగా ముక్తి-జీవన్ముక్తులను పొందగలిగే జ్ఞానాన్ని తెలపండి అని మనుష్యులు అంటారు. ఇప్పుడు మీకు ఆ జ్ఞానమే లభిస్తోంది కదా.

బాబా చెప్తున్నారు - ఇతడు(బ్రహ్మ) నా యుగల్‌(పత్ని). నేను ఇతని నోటి ద్వారా ప్రజలను రచిస్తాను. ప్రజాపిత బ్రహ్మ నోటి ద్వారానే ఈ మాటలు చెప్తారు. మీరు నా పౌత్రులు అని శివబాబా అంటారు. మీరు నాకు పిల్లలై శివబాబాకు పౌత్రులుగా అవుతారని బ్రహ్మాబాబా చెప్తున్నారు. వారసత్వము వారి నుండి లభిస్తుంది. స్వర్గ వారసత్వమును మనుష్యమాత్రులెవ్వరూ ఇవ్వలేరు. దానిని నిరాకారుడే ఇస్తారు. కనుక భక్తి వేరు, జ్ఞానము వేరు. భక్తిలో వేద-శాస్త్రాలను చదువుతూ యజ్ఞ, తప, దాన, పుణ్యాలు చేస్తూ ఎంతో ఖర్చు చేస్తారు. అదంతా భక్తిమార్గపు సామగ్రి. భక్తి ద్వాపర యుగము నుండి ప్రారంభమౌతుంది. దేవీదేవతలు ఎప్పుడైతే వామమార్గములోకి వచ్చి పతితులుగా అయినప్పుడు వారు దేవీదేవతలని పిలువబడరు. ఎందుకంటే దేవతలు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. అందుకే దేవతా ధర్మమువారు వామమార్గములోకి వచ్చి వికారులుగా అవుతారు. కనుక దేవతా ధర్మము వారు వామమార్గములోకి వచ్చి పతితులుగా అయ్యారని అంటారు. పతితులను దేవతలని అనజాలరు. అందుకే వారికి హిందువులని పేరుంచారు. వేద-శాస్త్రాలలో ఆర్యులనే పేరు పెట్టబడింది. ఆర్యులనే పేరు ఈ భారతదేశానికి సంబంధించింది. అసలు ఈ పదము ఎక్కడ నుండి వచ్చింది? సత్యయుగములో ఆర్యులు అనే పదమే ఉండదు. క్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రితము భారతదేశములోని దేవీదేవతలు అత్యంత వివేకవంతులుగా ఉండేవారు. ఆ దేవతలే ద్వాపర యుగములో వికారులుగా అయినప్పుడు అనార్యులు అని అనబడ్తారు. ఎవరైనా ఒకరు ఆర్యులు అని అనగానే అదే పేరు కొనసాగుతూ వస్తుంది. ఉదాహరణానికి ఒకరు కృష్ణ భగవానువాచ అని అన్నందున లేక వ్రాసినందున ఇక దానినే నమ్మడము ప్రారంభించారు. భలే శివాయ నమ: త్వమేవ మాతాశ్చ పితా,.......... అని మహిమ చేస్తారు కాని వారు తల్లిదండ్రులెలా అయ్యారో, రచనను ఎప్పుడు రచించారో ఎవ్వరికీ తెలియదు. తప్పకుండా సృష్టి ఆదిలోనే రచించి ఉంటారు. అయితే సృష్టి ఆది అని దేనిని అనాలి? సత్యయుగమునా లేక సంగమ యుగమునా? సత్యయుగములోకి తండ్రి రారు. సత్యయుగము ఆదిలో అయితే లక్ష్మీనారాయణులు వస్తారు. వారిని సత్యయుగానికి అధిపతులుగా ఎవరు చేశారు? కలియుగములోకి కూడా వారు(శివబాబా) రారు. ఇది కల్పము యొక్క సంగమ యుగము. తండ్రి చెప్తున్నారు - నేను ప్రతి కల్పము యొక్క సంగమ యుగములో ఆత్మలందరూ పతితమైనప్పుడు, సృష్టి పాతదైనప్పుడు వస్తాను. డ్రామా చక్రము ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడే కదా తండ్రి వచ్చేది. పిల్లలైన మీలో చాలా తెలివి ఉండాలి, ధారణ ఉండాలి. వేదాలను చదవడం వలన లాభమేమిటి? అసలు వేదాలను ఎందుకు చదవాలి? అని పెద్ద పెద్ద కాన్ఫరెన్స్‌లు చేస్తారు. కాన్ఫరెన్స్‌ ముగిసినా ఏమీ నిర్ణయించలేరు. మరలా అదే కాన్ఫరెన్స్‌ను మరుసటి సంవత్సరము కూడా చేస్తారు. నిర్ణయించాలని అనుకుంటారు కాని నిర్ణయించలేరు. వినాశనానికి కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. బాంబులు తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడిది కలియుగము. ఈ విషయాలన్నీ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీ విషయాలు పూర్తిగా విచిత్రమైనవి, అతీతమైనవి. మనుష్యులకు మనుష్యులు గతి-సద్గతులను ఇవ్వలేరని మీకు తెలుసు. హే పతితపావనా! అని కూడా గానము చేస్తారు. కానీ స్వయాన్ని పతితులమని ఎందుకు భావించరు? ఇది పతిత ప్రపంచము, విషయ సాగరము. అందరూ నావికులుగా అవ్వలేరు కదా.

పూర్తిగా అర్థము చేయించే శక్తి పిల్లలైన మీకు ఇంకా రాలేదు. ఇప్పుడు మీరు ఇంకా అంత తెలివైనవారుగా అవ్వలేదు, యోగము కూడా లేదు, ఇప్పుడు ఇంతవరకు ఇంకా చిన్న పిల్లల వలె ఏడుస్తూ ఉంటారు, మాయ కలిగించే తుఫానులలో నిలువలేరు. దేహాభిమానము చాలా ఉంది. దేహీ-అభిమానులుగా అవ్వనే అవ్వరు. బాబా పదే పదే చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు మనము తిరిగి వాపస్‌ వెళ్లాలి. పాత్రధారులందరు తమ-తమ పాత్రలను అభినయిస్తారు. అందరూ శరీరాలను వదిలి ఇంటికి వాపస్‌ వెళ్తారు. మీరు సాక్షిగా ఉండి చూడండి. దేహధారుల సంబంధములో, దేహము పై మోహము ఎందుకుంచుకుంటారు? విదేహులుగా ఎందుకు అవ్వరు? దాని వలన వికర్మలు వినాశనమవ్వవు. తండ్రిని స్మృతి చేస్తే ఖుషీ పాదరస మీటరు పైకి ఎక్కుతుంది. మనలను శివబాబా చదివిస్తున్నారు. మళ్లీ మనము దేవీదేవతలుగా అవుతామంటే అపారమైన సంతోషము ఉండాలి కదా!

భారతవాసులు సుఖంగా ఉన్నప్పుడు మిగిలిన మనుష్యులందరూ నిర్వాణధామము, శాంతిధామములో ఉండేవారు. ఇప్పుడు అనేక కోట్ల మనుష్యులున్నారు. ఇప్పుడు జీవన్ముక్తిని పొందుకునే పురుషార్థము చేస్తున్నారు. మిగిలినవారందరూ వాపస్‌ వెళ్లిపోతారు. పాత ప్రపంచము పరివర్తనై నూతన ప్రపంచంగా అవ్వనున్నది. కొత్తదానిని తండ్రియే తయారుచేస్తారు. అంటు కట్టబడ్తున్నది. ఇది దైవీ పుష్పాల అంటు. మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. పూలతోట పూర్తిగా తయారైపోతే ఈ ముళ్ల అడవి సమాప్తమైపోతుంది. దీనికి అగ్ని అంటుకుంటుంది. తర్వాత మళ్లీ మనము పూలతోటలోకి వెళ్లిపోతాము. మరి మనము మమ్మా-బాబాలను ఎందుకు అనుసరించరాదు? ఫాలో ఫాదర్‌-మదర్‌(మాతా-పితలను అనురించండి) అని కూడా చెప్పబడింది. ఈ మమ్మా-బాబాలే లక్ష్మీనారాయణులుగా అవుతారని మీకు తెలుసు. వీరే 84 జన్మలు పూర్తిగా గడిపారు. మీది కూడా అలాగే. వీరిది ముఖ్యమైన పాత్ర. తండ్రి వచ్చి సూర్యవంశీ, చంద్రవంశీ స్వరాజ్యాన్ని తిరిగి స్థాపన చేస్తున్నారని వ్రాయబడ్తుంది. ఎంతగా అర్థం చేయించినా దేహాభిమానము తెగిపోదు. నా పతి, నా పిల్లలు,........... అరే! ఇవి పాత ప్రపంచములోని పాత సంబంధాలే కదా. నాకు ఒక్క శివబాబా తప్ప మరెవ్వరూ లేరని భావించాలి. దేహధారులందరి నుండి మమకారము తెగిపోవడం చాలా కష్టము. వీరి మమకారము తొలగిపోవడం కష్టమనిపిస్తోందని తండ్రి అర్థము చేసుకుంటారు. వీరి ముఖాలే ఇలా కనిపిస్తున్నాయని బాబా భావిస్తారు. కుమారీలు మంచి సహయోగులుగా అవుతారు. మంచిది!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. దేహ సహితంగా అందరి నుండి మోహమును తొలగించి విదేహులుగా అయ్యే పురుషార్థాన్ని పూర్తిగా చెయ్యాలి. ప్రతి పాత్రధారి పాత్రను సాక్షిగా ఉండి చూడాలి. బంధనముక్తులుగా అవ్వాలి.

2. ఈ పాత ప్రపంచము నుండి అతీతంగా అవ్వాలి. ఇప్పుడు నేను తిరిగి వాపస్‌ వెళ్లాలి, ఇది పాత ప్రపంచము అంతమయ్యే సమయము, నా పాత్ర పూర్తి అయ్యింది అని మీతో మీరు మాట్లాడుకోవాలి.

వరదానము :-

''డబల్‌ లైట్‌ స్థితి ద్వారా ఎగిరేకళను అనుభవం చేసే సర్వ బంధనముక్త భవ ''

నడుస్తూ - తిరుగుతూ నేను డబల్‌లైట్‌ స్థితిలో ఉండే ఫరిస్తాను అనే స్మృతి ఉండాలి. ఫరిస్తా అనగా ఎగిరేవారు. తేలికగా ఉండే వస్తువు సదా పైకి వెళ్తుంది, క్రిందికి రాదు. అర్ధకల్పము క్రిందనే ఉన్నారు. ఇప్పుడిది ఎగిరే సమయము. అందువలన ఏ బరువు గానీ, బంధనము గానీ లేదు కదా? అని చెక్‌ చేసుకోండి. చాలా సమయం బలహీన సంస్కారాలు, వ్యర్థ సంకల్పాలు, దేహ భావములోని బంధనాలు లేక బరువు నడుస్తూ ఉంటే చివర్లో అవి క్రిందకు తీసుకొస్తాయి. అందువలన బంధనముక్తులై డబల్‌లైట్‌ స్థితిలో ఉండే అభ్యాసము చేయండి.

స్లోగన్‌ :-

''ఎవరి వద్ద శుద్ధ సంకల్పాల శక్తి జమ అయ్యి ఉంటుందో, వారే మనసా సేవ చేయగలరు ''