21-11-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - పావనంగా అయ్యి గతి - సద్గతులకు యోగ్యులుగా అవ్వండి. పతిత ఆత్మలు గతి - సద్గతులకు అర్హులు కారు. అనంతమైన తండ్రి మిమ్ములను అనంతమైన(వారసత్వానికి) యోగ్యులుగా తయారు చేస్తారు ''

ప్రశ్న :-

పితావ్రతులని ఎవరిని అంటారు? వారి ముఖ్యమైన గుర్తులను వినిపించండి ?

జవాబు :-

పితావ్రతులు అంటే తండ్రి శ్రీమతమును పూర్తిగా అనుసరించేవారు. అశరీరులుగా అయ్యే అభ్యాసము చేసేవారు. అవ్యభిచారి స్మృతిలో ఉండేవారు. ఇటువంటి సుపుత్రులైన పిల్లలే ప్రతి విషయాన్ని ధారణ చేయగలరు. వారికి సదా సర్వీసు గురించే ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. వారి బుద్ధి రూపి పాత్ర పవిత్రంగా అవుతూ ఉంటుంది. వారెప్పుడూ తండ్రికి విడాకులు ఇవ్వజాలరు.

పాట :-

నాకు ఆధారమిచ్చువారు,............. ( ముఝ్‌ కో సహారా దేనేవాలే,.........)   

ఓంశాంతి.

పిల్లలు నంబరువారు పురుషార్థానుసారము ధన్యవాదాలు తెలుపుతారు. అందరూ ఒకే విధంగా కృతజ్ఞతలు తెలుపరు. ఎవరైతే మంచి నిశ్చయబుద్ధిని కలిగి ఉంటారో, ఎవరైతే హృదయపూర్వకంగా, ప్రాణప్రీతితో బాబా సేవలో ఉపస్థితమై ఉంటారో వారే - బాబా! అద్భుతమంతా మీదే, మాకేమీ తెలియదు, మీతో కలవడానికి కూడా మేము యోగ్యులుగా కూడా లేము అని ధన్యవాదాలు తెలియజేస్తారు. అవును, అది నిజమే. వాస్తవానికి మాయ అందరినీ అయోగ్యులుగా చేసేసింది. స్వర్గానికి యోగ్యులుగా ఎవరు తయారు చేస్తారు? మళ్లీ నరకానికి యోగ్యులుగా ఎవరు చేస్తారు? - అనేది వారికి తెలియదు. గతి మరియు సద్గతి రెండిటికి యోగ్యులుగా తండ్రియే తయారు చేస్తారని వారు భావిస్తారు. ఒకవేళ అలా భావించకపోతే అక్కడికి వెళ్లేందుకు యోగ్యులైన వారెవ్వరూ ఇక్కడ లేరు. స్వయం వారే మేము పతితులుగా ఉన్నామని చెప్తారు. ఈ ప్రపంచమే పతితంగా ఉంది. సాధు సన్యాసులెవ్వరికీ తండ్రిని గురించి తెలియదు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు తన పరిచయమునిచ్చారు. తండ్రియే వచ్చి పరిచయము ఇవ్వాలనే నియమము కూడా ఉంది. ఇక్కడికే వచ్చి యోగ్యులుగా చేయాలి, పావనంగా చేయాలి. అక్కడే కూర్చుని పావనంగా చేయగలిగితే ఇంత అయోగ్యులుగా(మీరు) ఎందుకు అవుతారు?

పిల్లలైన మీలో కూడా నెంబరువారు పురుషార్థానుసారముగానే నిశ్చయబుద్ధి కలిగి ఉన్నారు. తండ్రి పరిచయమును ఎలా ఇవ్వాలి? అన్న తెలివి కూడా ఉండాలి కదా. శివాయ నమ: అన్నది కూడా తప్పకుండా ఉంది. ఆ తల్లిదండ్రులే శ్రేష్ఠాతి శ్రేష్ఠులు(సర్వోన్నతమైనవారు). బ్రహ్మ-విష్ణు-శంకరులైతే వారి రచన మాత్రమే. వారిని రచించే తండ్ర్రి తప్పకుండా ఉంటారు. తల్లి కూడా ఉంటారు. అందరి గాడ్‌ఫాదర్‌ ఒక్కరే. నిరాకారుడినే గాడ్‌ అని అంటారు. సృష్టికర్త(క్రియేటర్‌) సదా ఒక్కరే ఉంటారు. మొట్టమొదట పరమాత్ముని(అల్ఫ్‌) పరిచయమునివ్వాల్సి ఉంటుంది. యుక్తియుక్తంగా పరిచయమును ఎలా ఇవ్వాలో కూడా అర్థము చేసుకోవాలి. భగవంతుడే జ్ఞానసాగరులు. వారే వచ్చి రాజయోగమును నేర్పించారు. ఆ భగవంతుడు ఎవరు? మొదట(అల్ఫ్‌) పరమాత్ముని పరిచయమును ఇవ్వాలి. తండ్రి కూడా నిరాకారులే. ఆత్మ కూడా నిరాకారమే. ఆ నిరాకార తండ్రి వచ్చి పిల్లలకు వారసత్వమునిస్తారు. ఎవరో ఒకరి ద్వారా అర్థము చేయిస్తారు కదా. లేకుంటే రాజాధి రాజులుగా ఎలా తయారు చేశారు? సత్యయుగ రాజ్యాన్ని ఎవరు స్థాపన చేశారు? స్వర్గ రచయిత ఎవరు? తప్పకుండా స్వర్గ రచయిత (హెవెన్లీ గాడ్‌ఫాదర్‌) తండ్రియే కదా. వారు నిరాకారులై ఉండాలి. మొట్టమొదట తండ్రి పరిచయమును ఇవ్వాల్సి ఉంటుంది. కృష్ణుని గాని, బ్రహ్మ-విష్ణు-శంకరులను గాని తండ్రి అని అనరు. వారైతే రచింపబడ్తారు. సూక్ష్మవతన వాసులు కూడా రచింపబడ్తారు. వారు కూడా రచనయే అయినప్పుడు స్థూల వతనవాసులను భగవంతుడని ఎలా అనగలరు? దేవతాయ నమ: అని గానము చేస్తారు. అయితే వీరిని(శివబాబాకు) శివాయ నమ: అని అంటారు. ఇదే ముఖ్యమైన విషయము. ప్రదర్శనీలలో పదే పదే ఒకే విషయాన్ని అర్థము చేయించము. ఈ విషయాన్ని ఒక్కొక్కరికి బాగా అర్థము చేయించాల్సి ఉంటుంది. నిశ్చయము చేయించాల్సి ఉంటుంది. ఎవరు వచ్చినా వారితో రండి, మీరు వస్తే తండ్రిని సాక్షాత్కారము చేయిస్తామని చెప్పాలి. తండ్రి నుండే మీకు వారసత్వము లభించాల్సి ఉంది. తండ్రియే గీతలో రాజయోగాన్ని నేర్పించారు. కృష్ణుడు నేర్పించలేదు. తండ్రియే గీతా భగవానుడు. ముఖ్యమైన నంబర్‌వన్‌ విషయము ఇదే. కృష్ణ భగవానువాచ కాదు. రుద్ర భగవానువాచ లేక సోమనాథ శివ భగవానువాచ అని అనబడ్తుంది. ప్రతి ఒక్కరి జీవన కథ ఎవరిది వారిదే. ఒకరి దానితో మరొకరిది కలవదు. కనుక ఎవరు వచ్చినా మొట్టమొదట ఈ విషయము పై అర్థము చేయించాలి. ఇదే తెలియచేయవలసిన ముఖ్యమైన విషయము. పరమపిత పరమాత్మ కర్తవ్యము కూడా ఇదే. వారు (శివబాబా) తండ్రి. ఇతడు(బ్రహ్మ) వారి పుత్రుడు. వారు స్వర్గ రచయిత(హెవన్లీ గాడ్‌ఫాదర్‌). ఇతడు స్వర్గములోని ప్రథమ రాకుమారుడు(హెవన్లీ ఫస్ట్‌ప్రిన్స్‌). ఇది పూర్తి స్పష్టము చేసి అర్థము చేయించాలి. ముఖ్యమైనది గీత. దాని ఆధారము పైనే మిగిలిన శాస్త్ర్రాలున్నాయి. సర్వ శాస్త్ర శిరోమణి భగవద్గీత. మీరు శాస్త్ర్రాలు, వేదాలు మొదలైనవి ఒప్పుకుంటారా? - అని మనుష్యులు అడుగుతారు. అరే! ప్రతి ఒక్కరు వారి ధర్మశాస్త్రాన్ని ఒప్పుకుంటారు. అన్ని శాస్త్ర్రాలనైతే ఎవ్వరూ ఒప్పుకోరు. నిజమే, అన్ని శాస్త్ర్రాలు ఉన్నాయి. కాని శాస్త్ర్రాలను గురించి తెలుసుకోవడం కంటే ముందు ఎవరి ద్వారా వారసత్వము లభిస్తుందో, ఆ తండ్రిని గురించి తెలుసుకోవడం ముఖ్యము. వారసత్వము తండ్రి నుండి లభిస్తుంది కాని శాస్త్ర్రాల ద్వారా కాదు. తండ్రి ఏ జ్ఞానమునిస్తారో, ఏ వారసత్వమునిస్తారో దాని పుస్తకము తయారయ్యింది. మొట్టమొదట గీతను తీసుకోవాల్సి ఉంటుంది. గీతా భగవానుడెవరు? అందులోనే రాజయోగము యొక్క ప్రస్తావన వస్తుంది. తప్పకుండా నూతన ప్రపంచము కొరకే రాజయోగము ఉంటుంది. భగవంతుడు వచ్చి పతితులుగా అయితే చేయరు కదా. వారు పావన మహారాజులుగా చేస్తారు. మొట్టమొదట తండ్రి పరిచయాన్నిచ్చి వారితో - వీరు నా తండ్రి అని నేను పూర్తిగా నిశ్చయము చేసుకున్నానని వ్రాయించండి. శివాయ నమ: మీరే తల్లి-తండ్రి,....... అను మహిమ కూడా ఆ తండ్రిదే అని మొట్టమొదట అర్థము చేయించాలి. భగవంతుడు కూడా భక్తి ఫలాన్ని ఇక్కడకు వచ్చే ఇవ్వవలసి ఉంటుంది. భక్తి ఫలము ఏమిటో మీరు అర్థము చేసుకున్నారు. ఎవరైతే చాలా భక్తి చేసి ఉంటారో వారికే మొదట ఫలము లభిస్తుంది. ఈ మాటలు ఏ శాస్త్రములోనూ లేవు. మీలో కూడా నంబరువారు పురుషార్థానుసారము తెలుసుకున్నారు. మీ అనంతమైన తల్లిదండ్రులు వారే అని అర్థం చేయించడం జరుగుతుంది. జగదంబ, జగత్పిత అని మహిమ చేయబడ్తారు. ఆడమ్‌ మరియు ఈవ్‌ అని మనుష్యులనే భావిస్తారు. ఈవ్‌ను తల్లిగా భావిస్తారు. యదార్థంగా ఈవ్‌ ఎవరో ఎవ్వరికీ తెలియదు. తండ్రి కూర్చొని అర్థము చేయిస్తారు. అవును! ఎవ్వరూ వెంటనే అర్థము చేసుకోలేరు. చదువులో సమయము పడ్తుంది. చదువుతూ చదువుతూ న్యాయవాది(బ్యారిష్టరు)గా అవుతారు. ఇక్కడ దేవతగా అవ్వాలనే లక్ష్యము - ఉద్ధేశ్యము కూడా ఉంది. కనుక మొట్టమొదట తండ్రి పరిచయాన్నివ్వాలి. మీరే తల్లి-తండ్రి............. అని మహిమ కూడా చేస్తారు మరియు ఓ పతితపావనా! రండి అని కూడా పిలుస్తారు. మరి పతిత ప్రపంచము మరియు పావన ప్రపంచమని దేనిని అంటారు? మరి కలియుగము ఇంకా 40 వేల సంవత్సరాలు ఉంటుందా? మంచిది. పావనంగా చేసేవారైతే ఒక్క తండ్రియే కదా. స్వర్గాన్ని స్థాపన చేసేవారు గాడ్‌ఫాదరే, కృష్ణుడు అవ్వజాలడు. అతడు వారసత్వము తీసుకున్నాడు. ఆ శ్రీ కృష్ణుడు స్వర్గ రాకుమారుడు, శివబాబా స్వర్గ రచయిత(క్రియేటర్‌). ఆ మొదటి రాకుమారుడు రచన. ఇది కూడా స్పష్టము చేసి పెద్ద పెద్ద అక్షరాలలో వ్రాయాలి. అప్పుడు అర్థం చేయించేందుకు మీకు సహజమవుతుంది. రచయిత మరియు రచనల గురించి తెలుస్తుంది. రచయితయే జ్ఞాన సాగరులు, వారే రాజయోగాన్ని నేర్పిస్తారు. వారు ఏ రాజూ కాదు. వారు రాజయోగాన్ని నేర్పించి రాజాధి రాజులుగా చేస్తారు. భగవంతుడు రాజయోగాన్ని నేర్పించారు. శ్రీ కృష్ణుడు రాజ్యపదవిని పొందాడు, తానే కోల్పోయాడు. మళ్లీ అతడే పొందాలి. చిత్రాల ద్వారా బాగా అర్థము చేయించవచ్చు. తండ్రి కర్తవ్యము తప్పకుండా తెలియజేయాలి. శ్రీ కృష్ణుని పేరు వేయడం ద్వారా భారతదేశము గవ్వ తుల్యంగా అయిపోయింది. శివబాబాను తెలుసుకోవడం వలన భారతదేశము వజ్ర సమానంగా అవుతుంది. కాని ''వీరే మా తండ్రి'' అని బుద్ధిలో కూర్చోవాలి కదా. తండ్రియే మొట్టమొదట నూతన స్వర్గ ప్రపంచాన్ని రచించారు. ఇప్పుడిది పాత ప్రపంచము. రాజయోగము గీతలో కూడా ఉంది. విదేశస్థులు కూడా రాజయోగాన్ని నేర్చుకోవాలని కోరుకుంటారు. గీత ద్వారానే వారు నేర్చుకున్నారు. తండ్రి ఎవరు? అని ఇతరులకు తెలియచేసేందుకు ప్రయత్నము చేస్తున్నామని మీకు తెలుసు. వారు సర్వవ్యాపి కాదు. ఒకవేళ సర్వవ్యాపి అయినట్లయితే రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు? ఈ తప్పు గురించి బాగా ఆలోచించాలి. ఎవరైతే సర్వీసులో తత్పరులై ఉంటారో వారికే ఆలోచనలు నడుస్తాయి. తండ్రి శ్రీమతము పై ఎప్పుడు నడుస్తారో, అశరీరులుగా, మన్మనాభవగా ఉంటారో, పతివ్రతలుగా లేక పితావ్రతులుగా అవుతారో లేక సుపుత్రులుగా అవుతారో అప్పుడే ధారణ జరుగుతుంది.

ఎంత సాధ్యమవుతుందో అంత స్మృతిని పెంచుకోండి అని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. దేహాభిమానములోకి రావడము వలన మీరు స్మృతి చేయరు. బుద్ధి పవిత్రంగా కూడా అవ్వదు. పులిపాల కొరకు బంగారు పాత్ర కావాలని అంటారు. ఇందులో కూడా పితావ్రతా బుద్ధి రూపి పాత్ర కావాలి. అవ్యభిచారి పితావ్రతులు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. కొందరికైతే ఏ మాత్రమూ తెలియదు. చిన్న పిల్లల వలె ఉన్నారు. భలే ఇక్కడ కూర్చుని ఉన్నారు కాని ఏమీ అర్థము చేసుకోరు. ఉదాహరణానికి చిన్న పిల్లలకు కొందరికి చిన్న ప్రాయములోనే వివాహము చేసేస్తారు కదా. పరస్పరములో స్నేహితులుగా ఉంటే, వారి మధ్య చాలా ప్రేమ ఉంటే, వెంటనే వివాహము చేసేస్తారు. ఇది కూడా అలాగే. నిశ్చితార్థము చేసుకున్నారు కాని ఏమీ అర్థము చేసుకోరు. మేము మమ్మా- బాబావారిగా అయ్యాము, వారి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అని అంటారు. కాని ఏమీ తెలియదు. ఇది విచిత్రము కదా! 5-6 సంవత్సరాలు ఉండిన తర్వాత కూడా పతికి లేదా తండ్రికి విడాకులు ఇచ్చేస్తారు. మాయ బాగా సతాయిస్తుంది, విసిగిస్తుంది.

కనుక మొట్టమొదట శివాయ నమ: అని వినిపించాలి. బ్రహ్మ-విష్ణు-శంకరుల రచయిత కూడా వారే. జ్ఞానసాగరులు ఈ శివుడే. కనుక ఇప్పుడేం చేయాలి? త్రిమూర్తి ప్రక్కన స్థలముంది. దాని పైన శివబాబా మరియు కృష్ణుడు ఇరువురి కర్తవ్యాలే వేరు వేరు అని వ్రాయవలసి ఉంటుంది. ఈ మొట్టమొదటి ముఖ్యమైన విషయము ఎప్పుడైతే అర్థము చేయిస్తారో అప్పుడు బుద్ధి ద్వారము తెరవబడ్తుంది. ఈ చదువు భవిష్యత్తు కొరకు. ఇలాంటి చదువు మరేదీ ఉండదు. శాస్త్ర్రాల ద్వారా ఈ అనుభవము కలగదు. మేము సత్యయుగము ఆది కొరకు ఈ విద్యను నేర్చుకుంటున్నామని మీ బుద్ధిలో ఉంది. స్కూలు పూర్తి అవుతుంది తర్వాత మన అంతిమ పరీక్ష జరుగుతుంది. వెళ్ళి రాజ్యము చేస్తాము. గీత వినిపించేవారు ఇలాంటి విషయాలను అర్థము చేయించలేరు. మొట్టమొదట తండ్రిని తెలుసుకోవాలి. తండ్రి నుండి ఆస్తిని తీసుకోవాలి. తండ్రియే త్రికాలదర్శి. ప్రపంచములో వేరే ఏ మనుష్యులూ త్రికాలదర్శులు కారు. వాస్తవములో ఎవరైతే పూజ్యులుగా ఉన్నారో వారే మళ్లీ పూజారులుగా అవుతారు. భక్తి కూడా మీరే చేశారు. ఇదెవ్వరికీ తెలియదు. ఎవరైతే భక్తి చేశారో, వారే మొదటి నెంబరులో బ్రహ్మ తర్వాత బ్రహ్మ ముఖవంశస్థులు. మళ్లీ వారే పూజ్యులుగా కూడా అవుతారు. మొదటి నంబరులో ఉండే పూజ్యులే పూజారులుగా అవుతారు మళ్లీ వారే పూజ్యులుగా అవుతారు. భక్తిఫలము కూడా మొదట వారికే లభిస్తుంది. బ్రాహ్మణులే చదువుకొని మళ్లీ దేవతలుగా అవుతారు - ఇది ఎక్కడా వ్రాయబడలేదు. భీష్మ పితామహుడు మొదలైనవారికి వీరి ద్వారా జ్ఞాన బాణాలు వేయించేవారు వేరే ఒకరు ఉన్నారని తెలిసింది కదా. ఏదో శక్తి ఉందని తప్పకుండా అర్థం చేసుకుంటారు. వీరికి నేర్పించే శక్తి ఏదో ఉందని ఇప్పుడు కూడా అంటారు.

వీరందరూ నా పిల్లలే అని బాబా చూస్తూ ఉంటారు. ఈ(బ్రహ్మ) కళ్ళ ద్వారానే చూస్తారు. ఉదాహరణానికి పితృలకు శ్రాద్ధము పెట్టినప్పుడు ఆత్మ వస్తుంది, వీరు ఫలానావారు అని చూస్తుంది. తినేటప్పుడు కనులు మొదలైనవి వారిలాగానే అవుతాయి. తాత్కాలికంగా లోను(అప్పు) తీసుకుంటారు. ఇది భారతదేశములోనే జరుగుతుంది. ప్రాచీన భారతదేశములో మొట్టమొదట రాధా-కృష్ణులు ఉండేవారు. వారికి జన్మనిచ్చేవారు అత్యంత ఉన్నతమైనవారిగా(శ్రీ కృష్ణుని లౌకిక తల్లిదండ్రులు) భావింపబడరు. వారు తక్కువ పాసైనవారు కదా. మహిమ కృష్ణుని నుండే ప్రారంభమౌతుంది. రాధా-కృష్ణులు ఇరువురు వారి వారి రాజధానులలోకి వస్తారు. వారి తల్లి, తండ్రుల కంటే పిల్లల పేరు ఎక్కువ ప్రసిద్ధమై ఉంటుంది. ఇవి ఎంత అద్భుతమైన విషయాలు! గుప్తమైన ఖుషీ ఉంటుంది. నేను సాధారణమైన శరీరములోనే వస్తానని తండ్రి చెప్తారు. ఇంతమంది మాతల గుంపును సంభాళన చేయాలి. కనుక సాధారణమైన శరీరాన్ని తీసుకున్నాను. ఇతని ద్వారానే ఖర్చు నడుస్తూ ఉండేది. శివబాబా భండారము, భోళాభండారము. అవినాశి జ్ఞాన రత్నాల భండారము కూడా అయ్యింది. అలాగే దత్తు పిల్లలు కూడా ఉన్నారు. వారి సంభాళన కూడా జరుగుతూ వచ్చింది. ఇది పిల్లలకే తెలుసు.

మొట్టమొదట ఎప్పుడైతే ప్రారంభము చేస్తారో అప్పుడు శివ భగవానువాచ అని చెప్పండి. వారు అందరి రచయిత. కృష్ణుని జ్ఞానసాగరులు, గాడ్‌ఫాదర్‌ అని ఎలా అనగలరు? చదివిన వెంటనే బాగా బుద్ధిలో కూర్చునే విధంగా స్పష్టంగా వ్రాయాలి. కొందరికైతే అర్థము చేసుకునేందుకు 2-3 సంవత్సరాలు పడ్తుంది. భగవంతుడు వచ్చి భక్తులకు ఫలమునివ్వాలి. బ్రహ్మ ద్వారా తండ్రి యజ్ఞాన్ని రచించారు. బ్రాహ్మణులను చదివించారు. బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేశారు. మళ్లీ క్రిందకు రానే రావాలి. చాలా బాగా వివరించబడింది. శ్రీ కృష్ణుడు హెవెన్లీ రాకుమారుడు కాని హెవెన్లీ గాడ్‌ఫాదర్‌ కాదని మొట్టమొదట నిరూపణ చేసి అర్థము చేయించాలి. సర్వవ్యాపి అనే జ్ఞానము ద్వారా పూర్తిగా తమోప్రధానమైపోయారు. ఎవరైతే సామ్రాజ్యానిచ్చారో వారినే మర్చిపోయారు. కల్ప-కల్పము బాబా రాజ్యమునిస్తారు. మనము మళ్లీ ఆ తండ్రిని మర్చిపోతాము. చాలా ఆశ్చర్యమనిపిస్తుంది. పూర్తి రోజంతా సంతోషంగా నృత్యము చేయాలి - బాబా మనలను విశ్వాధిపతులుగా చేస్తారు. అచ్ఛా.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. అవ్యభిచారి పితావ్రతులై ఉండాలి. స్మృతిని పెంచుతూ బుద్ధిని పవిత్రంగా చేసుకోవాలి.

2. తండ్రి యొక్క యుక్తియుక్త పరిచయమును ఇచ్చే పద్ధతిని కనుగొనాలి. విచార సాగర మథనము చేసి అల్ఫ్‌(పరమాత్మ)ను నిరూపించాలి. నిశ్చయబుద్ధి గలవారిగా అయ్యి సేవ చేయాలి.

వరదానము :-

'' స్వ ఉన్నతి అనే యధార్థమైన కళ్లజోడును ధరించి ఉదాహరణంగా అయ్యే అల్‌బేలాపన్‌(నిర్లక్ష్యము) నుండి ముక్త్‌ భవ ''

ఏ పిల్లలైతే స్వయాన్ని కేవలం విశాల బుద్ధి అనే దృష్టితో చెక్‌ చేసుకుంటారో, వారి కళ్లజోడు నిర్లక్ష్యంగా ఉంటుంది. వారికెలా కనిపిస్తుందంటే ఇప్పటివరకు ఎంత చేశామో, అది ఎక్కువగానే చేశాము, నేను ఫలానా ఫలానా ఆత్మల కంటే బాగున్నాను, కొద్దో గొప్పో లోపము పేరు ప్రఖ్యాతులు గలవారిలో కూడా ఉంది అని భావిస్తారు. కాని ఎవరైతే సత్యమైన హృదయంతో స్వయాన్ని చెక్‌ చేసుకుంటారో వారి కళ్లజోడు యధార్థమైన స్వ ఉన్నతి కలిగించేదిగా ఉన్నందున కేవలం తండ్రిని మరియు స్వయాన్నే చూస్తారు. ఇతరులు(వీరు, వారు) ఏం చేస్తున్నారో చూడరు. నేను పరివర్తనవ్వాలి అనే ధ్యాసలోనే ఉంటారు. వారు ఇతరులకు ఉదాహరణగా అవుతారు.

స్లోగన్‌ :-

''హద్దులను సర్వ వంశ సహితంగా సమాప్తం చేస్తే, బేహద్‌ సామ్రాజ్యపు నషా ఉంటుంది''