07-12-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - అవినాశి సర్జన్ వద్ద ఏమీ దాచరాదు, ఏదైనా అవజ్ఞ (తప్పు) జరిగినట్లయితే క్షమాపణ అడగాలి. అలా చేయకపోతే భారము పెరుగుతూ ఉంటుంది. అలా చేయకపోతే నిందకులుగా అయిపోతారు''
ప్రశ్న :-
సత్యమైన సంపాదనకు ఆధారమేది? ఉన్నతిలో విఘ్నాలు ఎందుకు కలుగుతాయి?
జవాబు :-
సత్యమైన సంపాదనకు ఆధారం - 'చదువు'. ఒకవేళ చదువు సరిగ్గా చదవకపోతే సత్యమైన సంపాదన చేసుకోలేరు. సాంగత్యం సరిగ్గా లేనప్పుడే ఉన్నతి చెందుటలో విఘ్నాలు కలుగుతాయి. '' సత్యమైన సాంగత్యం తేలుస్తుంది ( తీరానికి చేరుస్తుంది), చెడు సాంగత్యం ముంచి వేస్తుంది,..........'' (సంగ్ తారే కుసంగ్ బోరే........) '' అని అంటారు. సాంగత్యం చెడుగా ఉన్నట్లయితే చదువుకోరు, ఫెయిల్ అయిపోతారు. సాంగత్యం ద్వారానే ఒకరినొకరు రసాతలంలోకి చేర్చుకుంటారు. అందువలన పిల్లలైన మీరు సాంగత్య దోషము నుండి స్వయాన్ని చాలా కాపాడుకోవాలి.
పాట :-
మీరు ప్రేమ సాగరులు............... (తూ ప్యార్ కా సాగర్ హై ..........) 
ఓంశాంతి.
పిల్లలు అనంతమైన తండ్రిని మహిమ చేస్తారు. ఇది భక్తిమార్గములోని మహిమ. సుపుత్రులైన మీరు ఇప్పుడు సన్ముఖములో తండ్రిని మహిమ చేస్తారు. అనంతమైన తండ్రి వచ్చి మనకు జ్ఞానమునిచ్చి మనలను స్వర్గానికి అధికారులుగా చేస్తున్నారని మీరు భావిస్తారు. ఎందుకంటే వారే జ్ఞానసాగరులు. భగవంతునిలో జ్ఞానముంది. దానిని ఈశ్వరీయ జ్ఞానము(గాడ్లీ నాలెడ్జ్) అని అంటారు. జ్ఞానాన్ని ఇచ్చేవారు పరమపిత పరమాత్మ. ఎవరికిస్తారు? - పిల్లలకు. మీ మమ్మాకు చదువుల తల్లి (గాడెస్ ఆఫ్ నాలెడ్జ్, విద్యాదేవత) అనే పేరు ఉంది. జగదంబ జ్ఞానదేవత కనుక వారి పిల్లలలో కూడా అదే జ్ఞానముంటుంది. విద్యాదేవి సరస్వతికి భగవంతుడు జ్ఞానాన్నిస్తారు. అయితే ఎవరి ద్వారా ఇస్తారు? ఇవి ఎంతో అర్థం చేసుకోవలసిన విషయాలు. జగదంబ ఎవరో ప్రపంచములోని వారికి తెలియదు. జగదంబ అయితే ఒక్కరే ఉంటారని పిల్లలకు తెలుసు. అనేక పేర్లు పెట్టేశారు. వీరు ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళికి చెందిన సరస్వతి అని మనుష్యులకు తెలియదు. ఆమెకు జ్ఞానాన్ని ఇచ్చేవారు గాడ్ఫాదర్. సృష్టిచక్రము ఎలా తిరుగుతుంది? - ఈ జ్ఞానమును గాడ్ఫాదర్ ఇస్తారు. పిల్లలకు తండ్రి జ్ఞానమునిచ్చారు. సరస్వతికి ఎలా లభించింది? ఆమె ప్రజాపిత బ్రహ్మముఖవంశావళి కనుక జ్ఞానసాగరులైన పరమపిత పరమాత్మ ఈ ముఖము(బ్రహ్మ నోటి) ద్వారా సరస్వతికి జ్ఞానమును ఇచ్చి ఉంటారు. అదే జ్ఞానాన్ని మళ్లీ ఇతరులకు కూడా ఇచ్చి ఉంటారు. గాడ్ఫాదర్ చదివిస్తారు కనుక గాడ్ఫాదర్ పిల్లలు మాస్టర్ గాడ్ అయినట్లే కదా! అందువల్లనే గాడెజ్ ఆఫ్ నాలెడ్జ్(జ్ఞానదేవి) అని పేరుంచారు. ఎవరినైతే గీతా భగవానుడు అని అంటారో ఆ జ్ఞానసాగరుని ద్వారా మేము మరియు మా మమ్మా జ్ఞానమును తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. భగవంతుడు ఒక్కరే. దేవతలు కానీ మనుష్యులు కాని భగవంతుడు అవ్వజాలరు. గాడెజ్ ఆఫ్ నాలెడ్జ్(జ్ఞానదేవి) అనగా వారిలో ఏ జ్ఞానముంటుంది? రాజయోగ జ్ఞానముంటుంది. ఈ సహజ రాజయోగ జ్ఞానము ద్వారా జ్ఞానదేవి సరస్వతియే లక్ష్మీదేవిగా అవుతుంది. జ్ఞానదేవికి మహిమ ఉంది అంటే తప్పకుండా పిల్లలకు కూడా ఉంటుంది. ప్రజాపితకు అందరూ సంతానమే. మమ్మా సంతానమని అనరు. వీరు ప్రజాపిత బ్రహ్మ ముఖకమలం నుండి జన్మించిన సంతానము. మీరంతా ఈశ్వరీయ సంతానమని నిశ్చయం చేసుకుంటారు. నేను పిల్లలైన మీ సన్ముఖములోకే వస్తాను. మీరు మాత్రమే నన్ను తెలుసుకుంటారని ఈశ్వరుడైన తండ్రి చెప్తున్నారు. కనుక జగదంబ జ్ఞానదేవి అయ్యింది. ఇది సహజ రాజయోగ జ్ఞానము. శాస్త్రాల జ్ఞానము కాదు. భగవంతుడు ఈమెకు(సరస్వతికి) జ్ఞానమునిచ్చారు. ఈమె దేవి అని పిలువబడింది. జగదంబ అనగా మాత. తర్వాత మరుజన్మలో ధనదేవి(గాడెజ్ ఆఫ్ వెల్త్) లక్ష్మిగా అవుతుంది. వారి నుండి మనుష్యులు ధనాన్ని కోరుకుంటారు. కనుక తండ్రి ద్వారా జగదంబకు రాజయోగ వారసత్వం లభించిందని ఋజువు అవుతుంది. వారిని జ్ఞానదేవి అని అంటారు. జ్ఞానమే సంపాదనకు ఆధారము(నాలెడ్జ్ ఈజ్ సోర్సు ఆఫ్ ఇన్కమ్). ఇది సత్యమైన సంపాదన. సత్యమైన తండ్రి ద్వారా లభిస్తుంది. ఇప్పుడు మీరు నెంబరువారు పురుషార్థానుసారము సత్యమైన సంపాదన చేస్తున్నారు. చదువుకోకపోతే వారికి ఏ సంపాదనా జరగదు. సాంగత్యము సరిగ్గా లేకపోతే చదువుకోలేరు, వారికి ఉన్నతి జరగదు. సత్సంగము తీరానికి చేరుస్తే(తేలుస్తే) చెడు సాంగత్యం ముంచేస్తుంది. చదవకపోతే ఫెయిల్ అవుతారు. వెనుక కూర్చుని ఉంటారు. అలా ఎందుకు కూర్చున్నారో టీచరుకు తెలుసు. తండ్రికి తెలియదు. అయితే ఇంతమాత్రం తండ్రి అర్థం చేసుకుంటాడు - ''ఇతడు తక్కువగా చదువుతున్నా చెడు సాంగత్యం కారణంగా ఫెయిల్ అవుతున్నాడు. ఒకవేళ పరస్పరము ప్రేమ ఏర్పడి ఇరువురూ చదవకపోతే వారు ఒకరినొకరు రసాతలంలోకి చేర్చుకుంటారు. వీరు సరిగ్గా చదవడం లేదు కావున వీరిని వేరు చేయాలి అని తండ్రి భావిస్తారు. చదవలేకపోతే మనుష్యులను బుద్ధిహీనులని అంటారు. బాగా చదువుకుంటే వివేకవంతులని అంటారు. భగవంతుని మతానుసారము నడవకపోతే వారిని సవతి పిల్లలని అంటారు. కాని వారికి అర్థము తెలియదు. ఎవరైనా చదవకపోతే వారు పతితులుగా ఉండిపోతారు. ఫెయిల్ అయ్యి పారిపోతారు. ''ఓహో! రావణా! నీవు నా పిల్లలను కూడా మింగేస్తావు. ఎంత శక్తిశాలివి!'' అని బాబా అంటారు. పిల్లలు రావణుని మతానుసారము నడుస్తారు. శ్రీమతమును అనుసరించరు. ''అడుగు అడుగునా మేము బాబా మతము పైనే నడుస్తాము'' అని మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి. శ్రీమతము పై నడవని వారిని ఆసురీ మతమువారని అంటారు. వీరు ఉన్నత పదవిని పొందలేరని బాబా అర్థం చేసుకుంటారు. ఎవ్వరికీ అర్థం చేయించలేదంటే వారు రావణునికి వశమై ఉన్నారని భావించబడ్తుంది. వీరికి బుద్ధి శుద్ధంగా అయ్యేందుకు యోగమే లేదు. బుద్ధియోగము కూడా కావాలి. ఈశ్వరీయ పిల్లల నడవడిక చాలా గొప్పగా ఉండాలి. పుట్టినప్పుడే ఎవ్వరూ వివేకవంతమైన రాజులుగా ఉండరు. ఈ కారణంగా బాబా పంచ వికారాల రూపి రావణుని పైన శ్రీమతము ద్వారా విజయం పొందాలని అంటారు. శ్రీమతము పై నడవని వారిని, వీరు ఆసురీమతం పై ఉన్నారని బాబా అంటారు. అయినా అందులో కొందరు 5 శాతం మాత్రమే శ్రీమతమును అనుసరిస్తారు, కొందరు 10 శాతం అనుసరిస్తారు. ఈ లెక్క కూడా ఉంది.
జగదంబ ఒక్కరే. జగదంబ, బ్రహ్మముఖవంశావళి సరస్వతి. ఇది ఆమె పూర్తి పేరు. సరస్వతి చేతిలో వీణను చూపిస్తారు. ఈమె జ్ఞానదేవి. తప్పకుండా తనకు సంతానము కూడా ఉంటుంది. ఆ సంతానానికి కూడా తంబూరా ఉండాలి కదా! చూడండి! వృక్షములో ఈ సరస్వతి కూర్చొని ఉంది. రాజయోగము నేర్చుకుంటూ ఉంది. ఈమె మళ్లీ వెళ్ళి లక్ష్మిగా(గాడెస్ ఆఫ్ వెల్త్గా) అవుతుంది. ఇందులో ఆరోగ్యము, సంపద, సంతోషము(హెల్త్, వెల్త్, హ్యాపినెస్) అన్నీ వచ్చేస్తాయి. వీటిని పరమపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. వారు స్వర్గ రచయిత( హెవెన్లీ గాడ్ఫాదర్ ). ఇప్పుడు చూడండి! - మమ్మా సేవ చేస్తోంది. ఉదాహరణకు ఎక్కడ నుండి అయినా మమ్మాకు ఆహ్వానము వచ్చినట్లయితే మొదట వారికి మమ్మా ఆక్యుపేషన్(కర్తవ్యము) తెలిసి ఉండాలి. వీరెవరు? అన్న జ్ఞానము ఉండాలి. ప్రపంచములోని వారికి ఇది తెలియదు. కృష్ణుని పై నిందలు మోపబడ్డాయని అంటారు. కాని ఇది అసంభవము(ఇంపాసిబుల్). అందరికంటే ఎక్కువగా నిందలు మోసేవారు శివబాబా. రెండవ నెంబరులో నిందలు బ్రహ్మకు లభిస్తాయి. కృష్ణుడు మరియు బ్రహ్మ. కాని కృష్ణుడినైతే తిట్టజాలరు. జ్ఞానదేవి అయిన సరస్వతియే భవిష్యత్తులో రాధగా అవుతుందని మనుష్యులకు తెలియదు. స్వయంవరం తర్వాత ధనదేవి అయిన లక్ష్మీగా అవుతుంది. అందులోనే హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అన్నీ వచ్చేస్తాయి. మీలో ఇతరులకు అర్థము చేయించాలనే గొప్ప నషా ఉండాలి. మమ్మా ఎవరు అనేది అర్థం చేయించవలసి ఉంటుంది కదా. ఈ సరస్వతి బ్రహ్మ పుత్రిక, ముఖవంశావళి. భారతవాసులకు ఏమీ తెలియదు. జ్ఞానమే లేదు. మూఢ విశ్వాసాలు(అంధశ్రద్ధ) చాలా ఉన్నాయి. ఈ విధంగా భారతవాసులు అనేక మంది మూఢ విశ్వాసాలలో ఉన్నారు. తాము ఎవరిని పూజిస్త్తున్నారో కూడా తెలియదు. క్ర్రైస్తవులకు తమ క్రీస్తును గురించి తెలుసు. గురునానక్ సిక్కు ధర్మమును స్థాపన చేశారని సిక్కు ధర్మము వారికి తెలుసు. అందరికీ తమ ధర్మస్థాపకులను గురించి తెలుసు. కేవలం భారతవాసులైన హిందువులకే (తమ ధర్మము, ధర్మస్థాపకులెవరన్నది) తెలియదు. అంధశ్రద్ధతో పూజలు చేస్తూ ఉంటారు. వారి కర్తవ్యం గురించి ఏమీ తెలియదు. కల్పం ఆయువును ఎక్కువగా చేయడం వల్ల ఏమీ అర్థం చేసుకోరు. ఇస్లాం, బౌద్థులు మొదలైనవారు తర్వాత వచ్చారు. అనగా వారి కంటే ముందు తప్పకుండా ఈ దేవతలు ఉంటారు కదా! మిగిలిన అన్ని ధర్మాలన్నిటికి అర్ధకల్పం సమయం పడ్తుంది. అంటే ఈ ఒక్క ధర్మానికి కూడా అర్ధకల్పం ఇవ్వాల్సి ఉంటుంది. లక్షల సంవత్సరాలని చెప్పేందుకు వీలు లేదు. మీరు జగదంబ మందిరానికి వెళ్ళి - ''ఈ జ్ఞానదేవి సరస్వతికి ఎవరు జ్ఞానమునిచ్చారు? అని అర్థము చేయించండి. అప్పుడు కృష్ణుడు జగదంబకు జ్ఞానమిచ్చాడని అయితే అనరు కదా. కాని ఇది కూడా ఎవరికి మంచి అభ్యాసముందో వారే అర్థము చేయించగలరు. కొంతమందికి చాలా దేహాభిమానము ఉంది. ఎవరో ఒకరు బంధు-మిత్రులు మొదలైనవారు గుర్తుకొస్తూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు - ఇతరులను స్మృతి చేశారంటే నా స్మృతిని మర్చిపోతారు. ఇతరుల సాంగత్యాన్ని వదిలి మీ ఒక్కరి సాంగత్యమునే జోడిస్తామని మీరు పాడ్తారు కూడా. మరి వారు ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్నారు. బాబా! మేము మీ వారము, మీ మతమును అనుసరిస్తాము, మీకు చెడ్డపేరు వచ్చే పనులు చేయము అని అంటారు. చాలామంది పిల్లలు చెడ్డ పేరు వచ్చే పనులు చేస్తూ ఉంటారు. ఎవరైనా అర్థం చేసుకోనంత వరకు నింద చేస్తూనే ఉంటారు. దాని వలన కూడా పేరు ప్రసిద్ధి చెందింది కదా. ''అహో! ప్రభూ! మీ లీల అపారమైనది.............'' అని మహిమ చేశారు కదా! కాని ఈ విషయాలు పిల్లలే అర్థం చేసుకోగలరు. ఇంకెవ్వరు తెలుసుకోలేరు. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ! నేనైతే నిష్కామ సేవ చేస్తాను. అపకారులకు కూడా ఉపకారము చేస్తాను. భారతదేశమునే బంగారు పిచుకలా చేస్తాను. నేను నెంబరువన్ ఉపకారిని. అయితే మనుష్యులు నన్ను సర్వవ్యాపి అని అంటూ నిందిస్తూ ఉంటారు. నేనైతే పిల్లలైన మీకు జ్ఞానమునిస్తున్నాను. ఈ జ్ఞాన యజ్ఞములో ఆసురీ సంప్రదాయము వారి విఘ్నాలు చాలా పడ్తాయి. తండ్రి అయితే అర్థము చేయిస్తారు - ఏ పిల్లలైతే బాగా అర్థం చేసుకోరో, వారి కారణంగానే చెత్త పడ్తుంది. గ్లాని చేయిస్తారు. కొందరు పిల్లలైతే చాలా బాగా సేవ చేస్తారు. కొందరు డిస్ సర్వీసు కూడా చేస్తారు. ఒకవైపు కొందరు నిర్మాణము చేస్తూ ఉంటే, మరొకవైపు కొందరు వినాశనము కూడా చేస్తారు. ఎందుకంటే వారికి జ్ఞానము లేదు. ఇక్కడ సూర్యవంశీ, చంద్రవంశీ రాజధాని స్థాపనవుతూ ఉంది. ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకోరో వారికి అర్థం చేయించాలి. వారి పై దయ కలుగుతుంది కదా! తండ్రికి చెందినవారై ఆస్తిని తీసుకోలేదంటే వారు ఇక ఎందుకు పనికి వస్తారు? తండ్రి లభించారు కనుక పురుషార్థము చేసి వారసత్వాన్ని తీసుకోవాలి. శ్రీమతము పై నడవాలి. తండ్రికి నింద కలుగజేసే పనులు చేయరాదు. కామ, క్రోధాలు మహాశత్రువులని తండ్రికి తెలుసు. అవి ముక్కు-చెవులను పట్టుకుంటూ ఉంటాయి. ఇవి జరగనే జరుగుతాయి. వాటిని దాటేయాలి. కొందరు నామ-రూపాలలో చిక్కుకుంటారు. పిల్లలందరూ ఒకే విధంగా ఉండరు. గమనంతో ఉండమని తండ్రి కూడా సావధానపరుస్తూ ఉంటారు. ఆ విధంగా అకర్తవ్య కార్యాలు చేసి నింద చేయించినట్లయితే పదభ్రష్ఠులుగా అవుతారు. రుస్తుం(శక్తివంతులు) అయినవారి జతలో మాయ కూడా రుస్తుం అయ్యి యుద్ధము చేస్తుంది. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూనే మాయా తుఫానులు ఎక్కడికో తీసుకెళ్తాయి. కొంతమంది పిల్లలు సత్యము చెప్పరు. సలహా కూడా తీసుకోరు. అవినాశీ సర్జను వద్ద ఏదీ దాచరాదు. ఒకవేళ చెప్పకపోతే ఇంకా చెడుగా, మురికిగా అయిపోతారు. బాబా సర్వము తెలిసినవాడని వారికి అంతా తెలుసని అనుకోరాదు. మీరు ఏ తప్పులు చేస్తారో, వాటిని వచ్చి వినిపించండి - ''శివబాబా! నా ద్వారా ఈ పొరపాటు జరిగింది, క్షమించమని వేడుకుంటున్నాను. క్షమాపణ అడగనట్లయితే పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి అనగా మీ తల పై పాపాలను పెంచుకుంటూ ఉంటారు. కల్ప-కల్పాంతరాల కొరకు మీ పదవిని భ్రష్ఠము చేసుకోవద్దని తండ్రి అయితే తెలియజేస్తారు. ఒకవేళ ఇప్పుడు ఉన్నత పదవిని తయారు చేసుకోకపోతే కల్ప-కల్పాంతరాలకు అదే గతి అవుతుంది. ఇది జ్ఞానము. కల్పక్రితము వలె రాజ్యస్థాపన జరుగుతోందని బాబాకు తెలుసు. బాప్దాదా ఎక్కువ అర్థము చేసుకోగలరు. అయినా ఇతడు అల్లారుముద్దు కొడుకు. మాతల మహిమను పెంపొందింపజేయాలి. మాతలను ముందు ఉంచాల్సి ఉంటుంది. వారిని ముందుకు తీసుకొని రండని, గోపులకు అర్థము చేయిస్తారు. గోపులు కూడా చాలా సేవ చేయగలరు. చిత్రాలు తీసుకొని అర్థం చేయించండి - సర్వోన్నతమైనవారు ఈ భగవంతుడు. తర్వాత త్రిమూర్తులైన బ్రహ్మ-విష్ణు-శంకరులు. వారిలో కూడా ఉన్నతమైనవారు ఎవరు? వారి పేరేమిటి? అని అడిగితే - ఎవరి ద్వారా వారసత్వము లభిస్తోందో, ఆ ప్రజాపిత బ్రహ్మ అని చెప్తారు. శంకరుడు లేక విష్ణువును తండ్రి అని అనరు. వారి నుండి ఏ వారసత్వమూ లభించదు. వీరిని ప్రజాపిత బ్రహ్మ అని వారు అంటారు. వారి ద్వారా ఏ వారసత్వం లభిస్తుంది? బ్రహ్మ శివబాబా సంతానము. శివబాబా జ్ఞానసాగరులు. స్వర్గ స్థాపన చేయువారు. కనుక తప్పకుండా స్వర్గము కొరకు శిక్షణ లభిస్తుంది. ఇది రాజయోగము కొరకు ఇచ్చే మతము. బ్రహ్మ ద్వారా తండ్రి దేవతలుగా అయ్యేందుకు శ్రీమతమునిస్తారు. బ్రహ్మకుమారి అయితే ధనదేవి శ్రీలక్ష్మిగా అవుతుంది. వీరు బ్రాహ్మణులు, వీరే దేవీదేవతలు. నిరాకార ప్రపంచములో అన్నీ ఆత్మలే ఉంటాయి. పిల్లలకు చాలా అర్థము చేయిస్తారు. కాని అర్థము చేసుకునేవారే అర్థము చేసుకోగలరు. మనుష్యులైతే గుడ్డినమ్మకముతో సన్యాసులకు, గురువులకు అనుచరులుగా అవుతారు. వారి నుండి ఏమి లభిస్తోందో కూడా తెలియదు. టీచర్కైతే కనీసము పదవిని పొందుతారని తెలుసు. మిగిలినవారికి ఎవరైతే అనుచరులుగా అవుతారో వారి నుండి ఏ ప్రాప్తి కలుగుతుందో ఏ మాత్రము తెలియదు. ఇది అంధశ్రద్ధ. అనుచరులైతే లేనే లేరు. వారు అలా తయారు చేయరు. అలా మీరు కూడా వారిలాగ అవ్వరు. లక్ష్యము - ఉద్ధేశ్యమనేది ఏ మాత్రమూ తెలియదు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సదా సాంగత్య దోషము నుండి రక్షించుకుంటూ ఉండాలి. సత్యమైన చదువును చదువుకొని సత్యమైన సంపాదన అనే స్టాకును జమ చేసుకోవాలి.
2. అడుగడుగులో బాబా శ్రీమతము పై నడుస్తామని తమలో తామే ప్రతిజ్ఞ చేసుకోవాలి.
వరదానము :-
''ఏకవ్రతగా అయ్యి రహస్యాన్ని(రాజ్ను) తెలుసుకొని వరదాతను రాజీ చేసుకునే సర్వసిద్ధి స్వరూప భవ''
వరదాత అయిన తండ్రి వద్ద తరగని వరదానాల ఖజానా ఉంది. ఎవరు ఎంత తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అది తెరవబడిన భండారము. ఇటువంటి తెరవబడిన భండారము నుండి చాలామంది పిల్లలు సంపన్నంగా అవుతారు. ఇతరులెవ్వరూ యథా శక్తి సంపన్నంగా అవ్వరు. అందరికంటే ఎక్కువగా జోలెను నింపి ఇవ్వడంలో భోలానాథుడైన వరదాత రూప్ ఒక్కరే. కేవలం వారిని రాజీ చేసుకునే విధిని తెలుసుకుంటే అన్ని సిద్ధులు ప్రాప్తిస్తాయి. వరదాతకు ఒక శబ్ధము అన్నిటికంటే ప్రియమైన శబ్ధము - ఏకవ్రత. సంకల్పములో, స్వప్నములో కూడా రెండవ వ్రతమేదీ ఉండరాదు. స్మృతిలో - ''నాకు ఒక్కరు తప్ప ఇతరులెవ్వరూ లేరు'' అని ఉండాలి. ఎవరైతే ఈ రహస్యాన్ని తెలుసుకున్నారో వారి జోలె వరదానాలతో నిండుగా ఉంటుంది.
స్లోగన్ :-
''మనసా మరియు వాచా రెండు సేవలు జత జతలో చేస్తే డబల్ ఫలము ప్రాప్తిస్తూ ఉంటుంది''