01-10-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - ఇప్పుడు పిల్లలైన మీరు సంపూర్ణ నిర్మోహులుగా అవ్వాలని తండ్రి ఆశిస్తున్నారు. బాబా! మీరు మా వారు, మేము మీ వారము అని ఎప్పుడైతే దృఢంగా ప్రతిజ్ఞ చేస్తారో, అప్పుడే సత్యమైన ప్రీతి జోడింపబడ్తుంది.''
ప్రశ్న :-
రుద్రుడైన శివబాబా ద్వారా రచింపబడిన యజ్ఞానికి, మనుష్యుల ద్వారా రచింపబడుతున్న యజ్ఞాలకు గల ముఖ్యమైన బేధములేవి ?
జవాబు :-
1. మనుష్యులు ఏ యజ్ఞములైతే రచిస్తారో అందులో నువ్వులు మొదలైన వాటిని స్వాహా చేస్తారు. అది స్థూల యజ్ఞము. తండ్రి ఏ యజ్ఞమునైతే రచించారో, అది అవినాశి జ్ఞాన యజ్ఞము. ఇందులో మొత్తం పాత ప్రపంచము పూర్తిగా స్వాహా అయిపోతుంది. 2. ఆ యజ్ఞాలు కొద్ది సమయము కొరకే జరుగుతాయి. ఈ యజ్ఞము ఎప్పటివరకు వినాశనము జరగదో, అప్పటివరకు నడుస్తూనే ఉంటుంది. పిల్లలైన మీరు ఎప్పుడైతే కర్మాతీత స్థితి వరకు చేరుకుంటారో, అప్పుడు యజ్ఞము సమాప్తమౌతుంది.
పాట :-
నిర్బలునితో బలవంతుని యుద్ధము,............... ( నిర్బల్ సే లడాయి బల్వాన్ కీ,.............) 
ఓంశాంతి.
దీనిని పాఠశాల అని, జ్ఞాన యజ్ఞమని కూడా అంటారని పిల్లలైన మీకు తెలుసు. పాఠశాల పద్ధతి అనుసారము ముఖ్యమైన లక్ష్యము - ఉద్ధేశ్యము తప్పకుండా ఉండాలి. ఇప్పుడిది యజ్ఞానికి యజ్ఞమూ మరియు పాఠశాల కూడా అయ్యింది. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. ఆ మనుష్యులు దీనిని కాపీ చేస్తారు. స్థూల యజ్ఞాన్ని రచిస్తారు. అందులో నువ్వులు మొదలైనవి ఆహుతి చేస్తారు. ఇది కాక మరొక పెద్ద యజ్ఞాన్ని కూడా రచిస్తారు. అక్కడ నలువైపులా శాస్త్రాలు ఉంచుతారు. చాలా పెద్ద భూమి కూడా తీసుకుంటారు. ఒకవైపు బియ్యం, నెయ్యి, పిండి మొదలైనవన్నీ ఉంచుతారు. మరొకవైపు శాస్త్ర్రాలు కూడా ఉంచుతారు. ఏ శాస్త్ర్రాన్ని అడిగితే ఆ శాస్త్రాన్ని వినిపిస్తారు. అంతేకాక అక్కడ యజ్ఞములో స్వాహా కూడా చేస్తూ ఉంటారు. రుద్రుడు అనునది నా పేరే అని తండ్రి చెప్తున్నారు. రుద్ర భగవానుడు జ్ఞాన యజ్ఞాన్ని రచించారని కూడా అంటారు. దీనికి రుద్ర జ్ఞాన యజ్ఞము అను పేరు ఏర్పడింది. ఉదాహరణానికి నెహ్రూ తర్వాత నెహ్రూ మార్గము, నెహ్రూ పార్కు మొదలైన పేర్లు ఉంచుతారు కదా! అలాగే ఇప్పుడు రుద్రుడు, భగవంతుడైన శివుడే రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. ఈ యజ్ఞములో మొత్తం పాత సృష్టి అంతా పూర్తిగా ఆహుతి అవుతుంది. ఇది ఎవరి బుద్ధిలోనూ ఉండదు. ఇది ఎంత పెద్ద సృష్టి! పట్టణాలు చాలా దూర దూరంగా ఉన్నాయి. ఈ అవినాశి జ్ఞాన యజ్ఞములో అన్నీ ఆహుతి అయిపోతాయి. పాత ప్రపంచము తప్పకుండా వినాశనమవుతుంది. తర్వాత మళ్లీ క్రొత్త ప్రపంచము తయారవుతుంది. వినాశనమయ్యేందుకు ప్రకృతి వైపరీత్యాలు, ఆపదలు కూడా సహయోగము చేస్తాయి. కనుక ఇది రుద్ర రాజస్వ అశ్వమేధ అవినాశి జ్ఞాన యజ్ఞము. అవినాశి అనగా వినాశనమయ్యే వరకు జరుగుతూనే ఉంటుంది. అలాంటి యజ్ఞము ఎవ్వరూ రచించరు. ఎక్కువలో ఎక్కువ ఒక్క మాసము నడుపుతారు. గీతను కూడా ఒక మాసము వినిపిస్తారు. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని నేను రచించాను. ఇది రాజస్వ అశ్వమేధ అనగా మీ రథము ఏదైతే ఉందో దానిని స్వాహా చేయాలి, బలి ఇవ్వాలి అని బాబా అర్థం చేయిస్తున్నారు. వారు వేరొక పేరు పెట్టుకున్నారు. దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని చూపిస్తారు. అందులో గుర్రాన్ని కాలుస్తారు. పెద్ద కథ ఉంది. తండ్రి అర్థము చేయిస్తున్నారు. ఇది నా అవినాశి జ్ఞాన యజ్ఞము. అవినాశి తండ్రి ద్వారా అవినాశి జ్ఞాన యజ్ఞము అలాగని ఈ యజ్ఞము సదా జరుగుతూనే ఉంటుందని కాదు. పూర్తి ప్రపంచమంతా స్వాహా అయ్యే సమయము వచ్చేవరకు ఈ యజ్ఞము నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే తండ్రి జ్ఞానసాగరులు. భక్తిలో అయితే అనేక శాస్త్రాలున్నాయి. తండ్రి జ్ఞానసాగరులు కనుక వారి వద్ద తప్పకుండా నూతన జ్ఞానముంటుంది. తండ్రి తన పూర్తి పరిచయమును పిల్లలకిస్తారు. అంతేకాక సృష్టిచక్రము ఎలా తిరుగుతుందో కూడా అర్థము చేయిస్తారు. దీని ద్వారా ఆత్మ త్రికాలదర్శిగా అవుతుంది. త్రికాలదర్శుల జ్ఞానాన్ని ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. ఒకటేమో మీరు జ్ఞాన ధారణ చేయాలి. రెండవది పిల్లలైన మీరు యోగబలము ద్వారా వికర్మాజీతులుగా అవ్వాలి. తల పై ఉన్న జన్మ-జన్మల పాప భారము భస్మమయ్యేందుకు సమయము పడ్తుంది. ఎన్ని సంవత్సరాలైనప్పటికి ఇంకా కర్మాతీతులుగా అవ్వలేదు. కర్మాతీతస్థితి ఎప్పుడు వస్తుందో అప్పుడు ఈ యజ్ఞము కూడా సమాప్తమౌతుంది. ఇది చాలా భారీ యజ్ఞము, దాని చిహ్నాలు కూడా మీరు చూస్తున్నారు. వినాశనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోను పోను ప్రకృతి వైపరీత్యాలకు కూడా ఏర్పాట్లు జరగడం మీరు చూస్తారు. ఒకసారి తీవ్రమైన వరదలు, మరోసారి భూకంపాలు, ఇంకొకసారి కరువు కాటకాలు వస్తాయి. నాలుగు సంవత్సరాల ప్రణాళికలు తయారుచేశాము, వాటి వలన ధాన్యము చాలా పండుతుందని వారు గొప్పలు చెప్పుకుంటారు. అరే! తినే మనుష్యులు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు. కేవలం మనుష్యులే కాదు, మిడుతలు, సాలె పురుగులు మొదలైనవి కూడా ధాన్యాన్ని తినేస్తాయి కదా. వరదలు వచ్చి చాలా నష్టము కలిగిస్తాయి. పాపం వారికిదంతా తెలియదు. ఈ కరువులు మొదలైనవి రావడం తప్పనిసరి అని మీకు తెలుసు. లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. యుద్ధము కొద్దిగా మొదలయ్యింది అంటే ధాన్యము రావడమే ఆగిపోతుంది. మొదటి ప్రపంచ యుద్ధములో ఎన్నో స్టీమర్లు మునిగిపోయాయి. ఒకరినొకరు చాలా నష్టపరుచుకున్నారు.
తండ్రి చెప్తున్నారు - 5 వేల సంవత్సరాల క్రితము కూడా ఈ యజ్ఞాన్ని రచించాను. అప్పుడు కూడా మీరు రాజయోగము నేర్చుకున్నారు. యజ్ఞము బ్రాహ్మణుల ద్వారా రచింపబడ్తుంది. గీతలో యుద్ధము మొదలైన మాటలు వ్రాసేశారు. సంజయుడు మొదలైనవారు కూడా ఉన్నారు. ఇదంతా భక్తి మార్గములోని సామాగ్రి. ఇది కూడా అవినాశియే. మళ్లీ భక్తి మార్గములో అదే సామగ్రి వెలువడ్తుంది. రామాయణము మొదలైన శాస్త్రాలు ఏవైతే వెలువడ్డాయో మళ్లీ అవే వెలువడ్తాయి. ఎవరి రాజధాని కల్పక్రితము నడిచిందో, ఇంగ్లీషువారు, ముసల్మానులు మొదలైన వారందరూ ఉండి వెళ్లిపోయారో మళ్లీ వారే వస్తారు. దేశ విభజన మళ్లీ జరుగుతుంది. ఈ విషయాలు మీరు మాత్రమే తెలుసుకోగలరు. మీలో కూడా నెంబరువారుగా ఉన్నారు. కొంతమందికైతే ఏమీ తెలియదు. కావున తండ్రి అర్థము చేయిస్తున్నారు - ఎన్నో యజ్ఞాలు రచిస్తారు. ఈ యజ్ఞాలు రచించినవారికి - వాస్తవములో ఉన్నది ఒకే అశ్వమేధ అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞమని, దానిని రుద్రుడైన శివభగవానుడే రచించారని, కృష్ణుడు కాదని అర్థము చేయించమని తండ్రి చెప్తున్నారు. కృష్ణుని అదే రూపము మళ్లీ సత్యయుగములో లభిస్తుంది. తర్వాత ఎప్పుడూ లభించదు ఎందుకంటే ఆ నామ, రూప, దేశ కాలాలన్నీ పరివర్తనవుతూ ఉంటాయి. కృష్ణుడు వచ్చి స్వయాన్ని పతితపావనుడనని చెప్పుకోవడం జరగదు. పతితపావనులు ఒక్క పరమాత్మ మాత్రమే. మీరు మొదటే ఎందుకు మీ రూపాన్ని చూపలేదు? అని అడగరాదు. అన్ని విషయాలు ముందే తెలుపరు. ఈ జ్ఞానాన్ని మొదటే మాకు ఎందుకు ఇవ్వలేదు? ఒకే రోజులో జ్ఞానాన్ని ఎందుకు ఇవ్వరు? అని మీరు అడుగుతారు కాని అలా జరగదు. వీరు జ్ఞానసాగరులు. కావున జ్ఞానాన్ని తప్పకుండా నెమ్మది నెమ్మదిగా వినిపిస్తూ ఉంటారు. అందరూ ఒకేసారి చదువుకోరు. నెంబరువారుగా చదువుకుంటారు. అంతేకాక చదువులో సమయం పడ్తుంది. దీని పేరే అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞము. దీనిని గురించి ఎక్కడా లిఖింపబడి లేదు. శాస్త్రాలలో కేవలం నామమాత్రంగా భారతదేశపు ప్రాచీన సహజ రాజయోగము అనే పదము మాత్రము ఉంది. మంచిది. ప్రాచీనము అంటే ఎప్పుడు? ప్రారంభములో అప్పుడు ఈ అవినాశి జ్ఞాన యజ్ఞము ద్వారానే తప్పకుండా స్వర్గము తయారై ఉంటుంది. కల్ప-కల్పము సంగమ యుగములో నేను వస్తానని తండ్రి చెప్తున్నారు. వారు దీనిని తప్పుగా చేసి సమయాన్ని కూడా మార్చి వేశారు. సత్యయుగము ఆయువును లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. అసత్యాలు గొప్పగా చెప్పుకున్నారు. ఇది నాలుగు భాగాలు. స్వస్తిక్లో కూడా నాలుగు భాగాలు ఉంటాయి. జ్ఞానము మరియు భక్తి. అర్ధకల్పము జ్ఞానము - పగలు, అర్ధకల్పము భక్తి - రాత్రి. జ్ఞాన ప్రాలబ్ధంగా వెన్న లభిస్తుంది. భక్తి ప్రాలబ్ధంగా మజ్జిగ లభిస్తుంది. క్రింద పడుతూ, క్రింద పడుతూ ఒక్కసారిగా సమాప్తమైపోతారు. క్రొత్త ప్రపంచము మళ్లీ తప్పకుండా పాతదిగా అవుతుంది. కళలు తగ్గిపోతూ వస్తాయి. అందుకే ఇప్పుడు వీరిని భ్రష్టాచారులు, వికారులు అని అంటారు. ఇది ఆసురీ ప్రపంచము కదా! ఈ భక్తి మొదలైనవి చేయుట వలన భగవంతుడు లభించడని మీకు తెలుసు. ఇంతకాలము భక్తి చేస్తూనే వచ్చారు. ఒకవేళ భగవంతుడు లభించినట్లయితే భక్తి ఆగిపోవాలి కదా! అర్ధకల్పము భక్తి నడవాలి. ఈ విషయాలన్నీ మనుష్యులకు అర్థము చేయించవలసి ఉంటుంది. ప్రపంచము నూతనంగా ఎలా అవుతుందో చిత్రాల ద్వారా సాక్షాత్కారము చేయించాలి. పాత ప్రపరచము సమాప్తమై మళ్లీ కొత్త ప్రపంచము స్థాపనౌతుంది. ఇప్పుడు ప్రదర్శిని మొదలైనవాటిని ఎవరైనా గొప్ప వ్యక్తుల ద్వారా ప్రారంభము చేయించాల్సి ఉంటుంది. సహాయమేమో తీసుకోవలసి ఉంటుంది కదా! వారికి తర్వాత ధన్యవాదాలు తెలుపబడ్తాయి. శుభకారక్షలు తెలిపేందుకు టెలిగ్రామ్ ఇవ్వబడుతుంది. ఎంత గొప్ప గొప్ప బిరుదులను తమ పై తాము ఉంచుకుంటారు! శ్రీ శ్రీ అను బిరుదును కూడా పెట్టించుకున్నారు. శ్రీ శ్రీ తండ్రి అర్థము చేయిస్తున్నారు - ఒకప్పుడు శ్రేష్ఠాచార ప్రపంచము ఉండేది. ఇప్పుడదే భ్రష్ఠాచారిగా ఉంది. మళ్లీ తండ్రి శ్రేష్ఠాచార ప్రపంచాన్ని తయారు చేసేందుకు వచ్చారు. వారు మొదటి నుండే తమకు శ్రీ అనే పేరును పెట్టుకుంటారు. వాస్తవంలో శ్రీలక్ష్మి - శ్రీ నారాయణ అని సత్యయుగములోనే అనబడ్తారు. రాజులకు శ్రీ అనే బిరుదును ఎప్పుడూ ఇచ్చేవారు కాదు. వారికి హిస్హైనెస్(ఆదరణీయ) అని అంటారు. అందరికన్నా గొప్ప హిస్హోలీనెస్ లక్ష్మీనారాయణులను రాజులు కూడా పూజిస్తారు. ఎందుకంటే వారు పవిత్రమైనవారు. వీరు స్వయం పతితులు. పావన రాజులను హిస్హోలీనెస్ అని అంటారు. ఇప్పుడు హిస్హైనెస్ బదులుగా అందరికీ చాలా బిరుదులు ఇస్తున్నారు. శ్రీ శ్రీ అని అంటూ ఉంటారు. ఇప్పుడు అనంతమైన తండ్రి మిమ్ములను శ్రీ(శ్రేష్ఠం)గా తయారు చేస్తున్నారు. నూతన ప్రపంచము ఎలా స్థాపన జరుగుతుందో చిత్రాల ద్వారానే అర్థము చేయించగలరు. మేము భ్రష్ఠాచారుల నుండి శ్రేష్ఠాచారులుగా చేసే సేవను చేస్తున్నాము. మీరు ప్రారంభము చేయండి. ఒక్క సెకండులో జీవన్ముక్తి అని మహిమ చేయబడింది కదా! అని వారికి అర్థము చేయించాలి. అర్థము చేయించేవారు చాలా చురుకుగా ఉండాలి. మిలిట్రీవారు ఎంత టిప్టాప్గా ఉంటారు! శివశక్తి సేన అనే మీ పేరు ఎంత గొప్పగా ఉంది. ఈ జ్ఞానము లభించేదే అబలలకు, అహల్యలకు. ఇక్కడి విషయాలు అద్భుతమైనవి. భగవంతుడు అత్యంత ఉన్నతులు. అయితే చదివిస్తున్నది ఎలాంటి వారినో చూడండి - అహల్యలు, కుబ్జలకు. భగవానువాచ - వారికి రాజయోగాన్ని నేర్పిస్తాను. డ్రామాలో ఇలా నిర్ణయించబడింది. కాని స్వయాన్ని అందరూ పాపాత్మలుగా భావించరు. తండ్రి చెప్తున్నారు - ఈ అంతిమ జన్మ పవిత్రంగా అవుతే ఒక్క సెకండులో జీవన్ముక్తిని పొందగలరు. రావడమేమో చాలా మంది వస్తారు. ఆశ్చర్యవంతముగా వింటారు, వర్ణిస్తారు, బాబావారిగా అవుతారు, అయినా పడిపోతారు తర్వాత పారిపోతారు. ఇది మొదటి నుండి జరుగుతూనే ఉంది. ఉదయము మాకు పక్కా నిశ్చయముందని అంటారు. సాయంకాలము నాకు సంశయముంది, నేను వెళ్లిపోతాను. నేను నడవలేను, గమ్యము చాలా ఉన్నతమైనది, నేను శెలవు తీసుకుంటానని అంటారు. ఇది డ్రామాలోని విధి. తండ్రిని వదిలి వెళ్లిపోతారు. మాయ ఎంత ప్రబలమైనదంటే నడుస్తూ - నడుస్తూ చెంపదెబ్బ వేస్తుంది. ''బాబా! కొంచెము సున్నితంగా ఉండమని మాయకు చెప్పండి'' అని పిల్లలు అంటారు. కాని బాబా అంటారు - చాలా తీక్షణంగా ఉండమని నేను మాయకు చెప్తాను. తండ్రి చెప్తున్నారు - మీరు జాగ్రత్తగా ఉండండి. మాయ చెంపదెబ్బ వేయడం, మీరు చిక్కుకోవడం జరగరాదు. జనకుని వలె గృహస్థ వ్యవహారములో ఉంటూ జీవన్ముక్తిని పొందాలని మీరు కోరుకుంటారు కదా!
తండ్రి అంటారు - ఒక్క జన్మ పవిత్రంగా ఉంటే, మీరు స్వర్గానికి అధిపతులుగా అవుతారు. మనుష్యులకు ఈ విషము(వికారాలు) పైన ఎంత కోరిక ఉంది. నడుస్తూ నడుస్తూ పడిపోతారు. ఒకవేళ కుమారీలు వివాహము చేసుకునేందుకు ఇష్టపడకుంటే ప్రభుత్వము కూడా ఏమీ చేయలేదు. పూజారులై అందరి ముందు తల వంచే విధంగా మేము పతితులుగా ఎందుకు అవ్వాలి? అని ప్రశ్నించవచ్చు. నేను కుమారిగా ఉన్నాను కావున అందరూ నా ముందు తల వంచుతారు. కనుక మేము ఎందుకు పూజ్యులుగా ఉండరాదు? పవిత్ర పూజ్యులుగా అవ్వండి అని అనంతమైన తండ్రి చెప్తున్నారు. రాజయోగపు పరీక్ష ఒక్కటే. ఎంతగానో పైకెక్కుతూ పడిపోతూ ఉంటారు. ప్రతి ఒక్కరు తమ తమ పాత్రను అభినయిస్తారు. కల్పక్రితము ఏమి జరిగిందో మళ్లీ అదే రిజల్టు వస్తుంది. ఇది డ్రామా. మనము పాత్రధారులము. పూర్తి నిర్మోహులుగా తయారైనప్పుడు తండ్రితో పూర్తిగా ప్రీతి జోడింపబడ్తుంది. బాబా మేము మిమ్ములనే స్మృతి చేస్తాము. మీ నుండి వారసత్వము తప్పకుండా తీసుకుంటాము - ఇటువంటి ప్రతిజ్ఞ చేయాల్సి వస్తుంది. అప్పుడే స్త్రీ - పురుషులు ఇరువురు పవిత్రమై స్వర్గధామానికి వెళ్లగలరు. ఇరువురు జ్ఞానచితి పై కూర్చుంటారు. ఇటువంటి యుగల్స్ చాలామంది అవుతారు. తర్వాత మళ్లీ వృక్షము త్వరత్వరగా వృద్ధి చెందడం మొదలవుతుంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఈ అవినాశి జ్ఞాన యజ్ఞములో మీ రథముతో (దేహముతో) పాటు సర్వస్వాన్ని స్వాహా చేయాలి. సర్వీసు కొరకు చాలా చాలా చురుకుగా అవ్వాలి.
2. మాయ ఎంత తీక్షణంగా ఉన్నా అప్రమత్తంగా ఉండి దాని చెంపదెబ్బ నుండి స్వయాన్ని రక్షించుకోవాలి. గాభరా పడరాదు(భయపడరాదు).
వరదానము :-
'' ఒక్క తండ్రినే మీ ప్రపంచంగా చేసుకొని సదా నవ్వుతూ, పాడుతూ ఎగిరే ప్రసన్నచిత్త్ భవ ''
దృష్టి ద్వారా సృష్టి పరివర్తన చెందుతుందని అంటారు. కనుక మీ ఆత్మిక దృష్టితో సృష్టి మారిపోయింది. ఇప్పుడు మీ ప్రపంచమంతా ఒక్క తండ్రియే. ఇంతకు ముందు ప్రపంచము, ఇప్పటి ప్రపంచములో వ్యత్యాసమొచ్చేసింది. ఇంతకుముందు ప్రపంచములో మీ బుద్ధి అన్నివైపులా భ్రమిస్తూ ఉండేది. కాని ఇప్పుడు తండ్రియే మీ ప్రపంచమైపోయాడు. కనుక ఇప్పుడు మీ బుద్ధి భ్రమించడం సమాప్తమైపోయింది. అనంతమైన ప్రాప్తులు చేయించే తండ్రి లభించారు. కనుక ఇంకేం కావాలి? అందువలన నవ్వుతూ, పాడుతూ, ఎగురుతూ సదా ప్రసన్నంగా ఉండండి.
స్లోగన్ :-
'' మనసు శుద్ధంగా ఉంటే, కోరికలు పూర్తి అవుతూ ఉంటాయి. సర్వ ప్రాప్తులు స్వతహాగా మీ ముందు హాజరౌతాయి(వచ్చేస్తాయి) ''