26-11-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - దేహాభిమానములోకి వచ్చినందునే మాయ చెంపదెబ్బ తగుల్తుంది. దేహీ - అభిమానులుగా ఉంటే తండ్రి ఇచ్చే ప్రతి శ్రీమతాన్ని పాలన చేయగలరు''

ప్రశ్న :-

తండ్రి వద్ద రెండు రకాల పురుషార్థీ పిల్లలున్నారు, వారు ఎవరు?

జవాబు :-

మొదటి రకము పిల్లలు తండ్రి నుండి వారసత్వము తీసుకునేందుకు పూర్తి పురుషార్థము చేస్తారు. ప్రతి అడుగులో తండ్రి సలహాను తీసుకుంటారు. రెండవ రకము వారు తండ్రికి విడాకులిచ్చే పురుషార్థము చేస్తారు. కొందరు దు:ఖము నుండి విడుదల అయ్యేందుకు తండ్రిని చాలా చాలా స్మృతి చేస్తారు. కొందరు మళ్లీ దు:ఖాలలో చిక్కుకోవాలని అనుకుంటారు. ఇది కూడా విచిత్రమే కదా.

పాట :-

సభలో దీపము వెలిగినది,...............( మహఫిల్‌ మే జల్‌ ఉఠీ శమా,................)   

ఓంశాంతి.

ఈ పాటను పిల్లలు చాలాసార్లు విన్నారు. క్రొత్త పిల్లలు మళ్ళీ కొత్తగా వింటారు. తండ్రి ఎప్పుడు వస్తారో అప్పుడు తమ పరిచయాన్ని తామే ఇస్తారు. పిల్లలైన మీకు తండ్రి పరిచయము లభించింది. ఇప్పుడు మనము బేహద్‌ మాత-పితల సంతానమైనామని తెలుసుకున్నారు. తప్పకుండా మనుష్య సృష్టికి రచయితలు మాత-పితలే. కాని మాయ మానవుల బుద్ధిని పూర్తిగా చంపేసింది. ఇంత సహజమైన విషయం బుద్ధిలో కూర్చోదు. మాకు భగవంతుడే జన్మనిచ్చారని అందరూ అంటారు. మరి వారు తప్పకుండా అందరికీ మాత-పితలే అవుతారు కదా. భక్తిమార్గంలో స్మృతి కూడా చేస్తారు. ప్రతి ధర్మము వారు తప్పకుండా గాడ్‌ఫాదర్‌ను స్మృతి చేస్తారు. భక్తులు స్వయం భగవంతుడు అవ్వలేరు. భక్తులు భగవంతుని కొరకు సాధన చేస్తున్నారు. గాడ్‌ఫాదర్‌ అయితే తప్పకుండా అందరికీ ఒక్కరే ఉంటారు. అనగా సర్వాత్మలకు తండ్రి ఒక్కరే. అందరి శరీరాలకు తండ్రి ఒక్కరే ఉండేందుకు సాధ్యము లేదు. వారు అనేకమంది తండ్రులుంటారు. వారు దేహధారి తండ్రులు అయినా ఓ ఈశ్వరా! అని స్మృతి చేస్తారు. తండ్రి కూర్చొని అర్థము చేయిస్తున్నారు - మానవులు తెలివిహీనులుగా ఉన్నారు. వారు తండ్రి పరిచయాన్నే మర్చిపోతారు. స్వర్గ రచయిత తప్పకుండా ఒక్క తండ్రేనని పిల్లలైన మీకు తెలుసు. ఇది కలియుగము. కలియుగము తప్పకుండా వినాశనమవుతుంది. ప్రాయ: లోపము అను అక్షరము ప్రతి విషయములోనూ వస్తుంది. సత్యయుగము ఇప్పుడు ప్రాయ: లోపమయ్యిందని పిల్లలకు తెలుసు. మంచిది. సత్యయుగము ప్రాయ: లోపమవుతుందని, త్రేతాయుగము వస్తుందని సత్యయుగములో ఉన్న వారికి తెలుస్తుందా? అనే ప్రశ్న వారికి ఉత్పన్నమవుతుంది. లేదు అక్కడ వారికి ఈ జ్ఞానమే అవసరము లేదు. సృష్టి చక్రము ఎలా తిరుగుతూ ఉంది? మన పారలౌకిక తండ్రి ఎవరు? ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. ఈ విషయాలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీరు తల్లి-తండ్రి, మేము మీ పిల్లలము అని పాడ్తారు,............. కాని వారికేమీ తెలియదు. కాని ఇలా పాడినా పాడనట్లే అవుతుంది. తండ్రిని మర్చిపోయారు. కనుక అనాథలుగా అయిపోయారు. తండ్రి ప్రతి విషయాన్ని అర్థము చేయిస్తారు. అడుగడుగునా నా శ్రీమతమును అనుసరించండి. లేదంటే మాయ ఏదో సమయములో పెద్దగా మోసము చేస్తుంది. మాయ ఉన్నదే మోసము చేసేందుకు. మాయ నుండి ముక్తులుగా చేయడం తండ్రి పనే. దు:ఖమిచ్చేవాడు రావణుడు. తండ్రి సుఖమునిచ్చేవారు. ఈ మాటలను మానవులు అర్థము చేసుకోలేరు. వారు సుఖమూ, దు:ఖమూ రెండూ భగవంతుడే ఇస్తారని భావిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మానవులు దు:ఖితులుగా అయ్యేందుకు వివాహాలలో ఎంత ఖర్చు చేస్తారు! అక్కడ పవిత్రులుగా ఉన్నవారిని అపవిత్రులుగా చేసే పురుషార్థము చేయబడ్తుంది. ఇది కూడా పిల్లలైన మీరు మాత్రమే అర్థము చేసుకోగలరు. కాని ప్రపంచము వారు అర్థము చేసుకోరు. ఈ విషయ సాగరములో మునిగేందుకు ఎన్నో వేడుకలు చేస్తారు! సత్యయుగములో ఈ విషము (వికారాలు) ఉండదని వారికి తెలియదు. అది క్షీర సాగరము. దీనిని విషయ సాగరమని అంటారు. అది సంపూర్ణ నిర్వికారి ప్రపంచము. భలే త్రేతా యుగములో రెండు కళలు తగ్గిపోతాయి. అయినా దానిని నిర్వికారి ప్రపంచమని అంటారు. అక్కడ వికారాలు ఉండవు. ఎందుకంటే రావణ రాజ్యము ద్వాపర యుగము నుండే మొదలవుతుంది. రెండూ సగం సగం ఉంటాయి కదా. జ్ఞాన సాగరము మరియు అజ్ఞాన సాగరము. అజ్ఞాన సాగరము కూడా ఉంది కదా.

మనుష్యులు ఎంత అజ్ఞానులు! వారికి తండ్రి కూడా తెలియదు. ఇలా చేసినట్లయితే భగవంతుడు లభిస్తారని కేవలం చెప్తూ ఉంటారు. కాని నిజానికి ఏమీ లభించదు. తల కొట్టుకుంటూ దు:ఖీలుగా, అనాథలుగా అయిపోతారు. అప్పుడే నాథుడనైన నేను వస్తానని బాబా అంటున్నారు. నిధనులైన పిల్లలను మాయా కొండచిలువ తినేసింది. మాయ చాలా ప్రబలమైనదని తండ్రి అర్థము చేయిస్తారు. చాలామంది మోసపోతారు. కొంతమందికి కామ చెంపదెబ్బ, కొంతమందికి మోహపు చెంపదెబ్బ తగులుతుంది. దేహాభిమానములోకి వచ్చిన కారణంగానే చెంపదెబ్బ పడ్తుంది. ఆత్మాభిమానులుగా అవ్వడములోనే శ్రమ ఉంది. అందువల్లనే తండ్రి మాటిమాటికీ 'మన్మనాభవ' అని గమనమిప్పిస్తున్నారు. తండ్రిని స్మృతి చేయకుంటే మాయ చెంపదెబ్బ వేస్తుంది. అందువలన నిరంతరము తండ్రిని స్మృతి చేసే అభ్యాసము చేయండి. లేదంటే మాయ ఉల్టా(వ్యతిరేక) కర్మలను చేయిస్తుంది. పిల్లలైన మీకు సత్యమేదో, అసత్యమేదో నిర్ణయించుకునే బుద్ధి అయితే లభించింది. ఎక్కడ తికమకపడ్తున్నా తండ్రిని అడగండి. టెలిగ్రాం ద్వారా, పత్రము ద్వారా లేక ఫోన్‌ ద్వారానైనా అడగవచ్చు. ఉదయాన్నే అయితే ఫోను వెంటనే లభిస్తుంది. ఎందుకంటే ఆ సమయములో పిల్లలైన మీరు తప్ప మిగిలిన వారందరూ నిద్రలో ఉంటారు. కావున మీరు ఫోన్‌ ద్వారా అడగవచ్చు. రోజురోజుకు ఫోను శబ్ధాలు మొదలైనవి కూడా బాగవుతూ ఉంటాయి. అయితే ప్రభుత్వము పేదది. కనుక ఖర్చు కూడా అలాగే చేస్తారు. ఈ సమయములో అయితే అందరూ శిథిలావస్థలో తమోప్రధానంగా ఉన్నారు. ముఖ్యంగా భారతవాసులనే రజో, తమోగుణీలని ఎందుంటారు? ఎందుకంటే ఇదే అన్నిటికంటే ఎక్కువగా సతోప్రధానంగా ఉండేది. ఇతర ధర్మాల వారు ఇంత సుఖాన్నీ చూడరు, ఇంత దు:ఖాన్నీ చూడరు. వారు ఇప్పుడు సుఖంగా ఉన్నారు. అందుకే ఇన్ని ధాన్యాలు మొదలైనవి పంపుతూ ఉంటారు. వారి బుద్ధి రజోప్రధానంగా ఉంది. వినాశనము కొరకు ఎన్ని అన్వేషణలు చేస్తున్నారు! కాని వారికి ఇది తెలియదు. కనుక వారికి ఈ చిత్రాలు మొదలైనవి పంపవలసి వస్తుంది. వీటి ద్వారా వారికి తెలుస్తుంది. చివరికి ఈ చిత్రాలు చాలా మంచివని అర్థము చేసుకుంటారు. ఇది భగవంతుని బహుమానమని దాని పై వ్రాయబడి ఉండాలి. ఆపద సమయము వచ్చినప్పుడు శబ్ధము వెలువడ్తుంది. ఇవి మనకు సరియైన సమయములో లభించాయని అర్థము చేసుకుంటారు. ఈ చిత్రాల ద్వారా ఎంతో పని జరుగుతుంది. పాపం వారికి తండ్రిని గురించి తెలియనే తెలియదు. ఆ తండ్రి ఒక్కరే సుఖదాత. అందరూ వారినే స్మృతి చేస్తారు. చిత్రాల ద్వారా చాలా బాగా అర్థము చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు మూడు అడుగుల నేల కూడా లభించదు. తర్వాత ఈ పూర్తి విశ్వానికే అధిపతులుగా అయిపోతారు! విదేశాలలో కూడా ఈ చిత్రాలు చాలా సేవ చేస్తాయి. ఈ చిత్రాలకు పిల్లలు అంత మహత్వమునివ్వడం లేదు. ఖర్చు అవ్వనే అవుతుంది. ఆ ప్రభుత్వము వారికి రాజధాని స్థాపన చేసేందుకు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యి ఉండవచ్చు. లక్షల మంది మరణించారు. ఇక్కడైతే మరణించే మాటే లేదు. శ్రీమతానుసారము పూర్తిగా పురుషార్థము చేసినప్పుడే శ్రేష్ఠ పదవిని పొందుతారు. లేకుంటే చివరిలో శిక్షలు అనుభవించునప్పుడు చాలా పశ్చాత్తాపపడ్తారు. వీరు తండ్ర్రే కాక ధర్మరాజు కూడా. తండ్రి చెప్తున్నారు - నేను ఈ పతిత ప్రపంచములోనికి వచ్చి పిల్లలకు 21 జన్మలకు స్వరాజ్యమునిస్తాను. ఒకవేళ మళ్లీ ఏదైనా వినాశకారీ కర్తవ్యాలను చేసినట్లయితే పూర్తి శిక్షలను అనుభవిస్తారు. ఏమౌతుందో చూస్తాములే, మరుసటి జన్మను గురించి ఎవరు కూర్చుని ఆలోచిస్తారని కొంతమంది అంటారు. మనుష్యులు దాన-పుణ్యాలు కూడా మరుసటి జన్మ కొరకు చేస్తారు. మీరిప్పుడు ఏమి చేస్తున్నారో అది 21 జన్మల కొరకు. వారు ఏమి చేసినా అది అల్పకాలానికే చేస్తారు. వారు ఏమి చేసినా ప్రతిఫలము వారికి నరకములోనే లభిస్తుంది. పిల్లలైన మీకైతే ప్రతిఫలము స్వర్గములో లభిస్తుంది. రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసముంది. మీరు స్వర్గములో 21 జన్మల కొరకు ప్రాలబ్ధము పొందుతారు. ప్రతి విషయములో శ్రీమతమును అనుసరిస్తే నావ తీరము చేరుకుంటుంది. తండ్రి చెప్తున్నారు - పిల్లలైన మిమ్ములను నా నయనాల పై కూర్చోబెట్టుకొని చాలా సుఖంగా తీసుకెళ్తాను. మీరు చాలా దు:ఖము అనుభవించారు. ఇప్పుడు బాబా అంటున్నారు - నన్ను ఒక్కరినే తలంపు చేయండి. మీరు అశరీరిగా(నగ్నంగా) వచ్చారు. ఇక్కడ పాత్రను అభినయించారు. ఇప్పుడు మళ్లీ వాపస్‌ ఇంటికి వెళ్ళాలి. ఇది మీ అవినాశి పాత్ర. ఈ విషయాలను ఏ విజ్ఞానవేత్తలూ అర్థము చేసుకోలేరు. ఆత్మ చాలా చిన్న నక్షత్రము. ఇందులో సదా కాలానికి అవినాశి పాత్ర నిండి ఉంది. ఇది ఎప్పటికీ సమాప్తమవ్వదు. నేను రచయితనే కాక పాత్రధారిని కూడా అని తండ్రి చెప్తున్నారు. నేను కల్ప-కల్పము పాత్రను అభినయించేందుకు వస్తానని తండ్రి చెప్తున్నారు. పరమాత్ముడు మనసు-బుద్ధి సహితంగా చైతన్య జ్ఞానసాగరులని అంటారు. కాని వారు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు - ఎలాగైతే ఆత్మలైన మీరు నక్షత్ర సమానంగా ఉన్నారో అలా నేను కూడా నక్షత్ర సమానంగా ఉన్నాను. పిల్లలైన మీరు భక్తిమార్గములో కూడా దు:ఖితులుగా ఉన్న కారణంగా నన్ను స్మృతి చేస్తారు. అందువలన నేను వచ్చి పిల్లలైన మిమ్ములను జతలో తీసుకెళ్తాను. బాబా చెప్తున్నారు - నేను మార్గదర్శకుడను కూడా. పరమాత్మనైన నేను ఆత్మలైన మిమ్ములను జతలో తీసుకెళ్తాను. ఆత్మ దోమ కంటే చిన్నదిగా ఉంటుంది. పిల్లలైన మీకు ఈ తెలివి కూడా ఇప్పుడే లభిస్తుంది. తండ్రి ఎంత బాగా అర్థము చేయిస్తున్నారు! - నేను మిమ్ములను విశ్వానికి అధిపతులుగా తయారుచేస్తాను. దివ్యదృష్టి అను తాళంచెవిని నా వద్దనే ఉంచుకుంటాను. దీనిని ఎవ్వరికీ ఇవ్వను. ఇది భక్తిమార్గములో నాకే పనికి వస్తుందని తండ్రి అంటున్నారు. నేను మిమ్ములను పావనంగా, పూజ్యులుగా తయారుచేస్తాను. మాయ పతితులుగా, పూజారులుగా చేస్తుంది. బాబా అర్థము చేయించేందుకు చాలానే అర్థము చేయిస్తారు. కాని దీనిని బుద్ధివంతులు మాత్రమే అర్థము చేసుకుంటారు.

ఈ టేప్‌ మిషన్‌ చాలా బాగుంది. పిల్లలు మురళిని తప్పకుండా వినాలి. మీరు చాలా అపురూపమైన పిల్లలు. బాబాకు బంధనములో ఉండే గోపికల పైన చాలా దయ కలుగుతుంది. బాబా మురళి విని వారు చాలా సంతోషిస్తారు. పిల్లల ఖుషీ కొరకు ఏమైనా చేయాలి. బాబాకైతే రాత్రింబవళ్ళు పల్లెలలో ఉండే గోపికల గురించిన ఆలోచనే ఉంటుంది. ఏమి యుక్తి రచించాలి, పిల్లలను దు:ఖము నుండి ఎలా విడిపించాలి అని బాబాకు(బ్రహ్మ) నిద్ర కూడా పారిపోతుంది. కొంతమంది పిల్లలైతే మళ్లీ దు:ఖములో చిక్కుకునేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటారు. కొంతమంది ఆస్తి తీసుకునేందుకు పురుషార్థము చేస్తారు. కొంతమంది విడాకులు ఇచ్చేందుకు కూడా పురుషార్థము చేస్తారు. ఈ రోజుల్లో ప్రపంచమైతే చాలా చెడిపోయింది. కొంతమంది పిలలైతే తండ్రిని చంపేందుకు కూడా వెనుకాడరు. అనంతమైన తండ్రి ఎంతో బాగా అర్థము చేయిస్తారు! తండ్రి చెప్తున్నారు - నేను పిల్లలైన మీకు ఎప్పుడూ దు:ఖీలు కానంత ధనము ఇస్తాను. కావున పిల్లలైన మీరు కూడా అందరికీ సుఖ మార్గాన్ని తెలిపించే దయాహృదయులుగా అవ్వాలి. ఈ రోజుల్లో అయితే అందరూ దు:ఖమునే ఇస్తారు. పోతే టీచరు ఎప్పుడూ దు:ఖమునిచ్చే దారిని తెలుపరు. వారు చదివిస్తారు. చదువు ఆదాయానికి మూలము. చదువు ద్వారా శరీర నిర్వహణ చేసుకునేందుకు యోగ్యులుగా అవుతారు. తల్లి-తండ్రి ద్వారా భలే ఆస్తి ఏమో లభిస్తుంది. అయితే అది ఎందుకు పనికొస్తుంది? ఎంత ఎక్కువ ధనము ఉంటుందో అంత ఎక్కువ పాపాలు చేస్తారు. లేదంటే చాలా నమ్రతతో తీర్థయాత్రలు చేసేందుకు వెళ్తారు. అయితే కొంతమంది తీర్థయాత్రలకు కూడా మత్తు పానీయాలు(మద్యము) తీసుకెళ్తారు. దాచుకొని తాగుతూ ఉంటారు. వారు మద్యం లేకుండా ఉండలేని వారిని బాబా కూడా చూశారు. యుద్ధాలకు వెళ్ళేవారు కూడా మత్తు పానీయాలను బాగా సేవిస్తారు. యుద్ధ మైదానములో ఉన్నవారికి తమ ప్రాణాల చింత ఉండదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటుందని భావిస్తారు. పిల్లలైన మీకు కూడా ఇప్పుడు జ్ఞానము లభిస్తుంది. ఈ ఛీ-ఛీ శరీరాన్ని వదలాలి. వారికి ఏ జ్ఞానమూ లేదు. కాని చంపడము, చావడము ఇదే అలవాటైపోయింది. ఇక్కడైతే మనము కూర్చుంటూ కూర్చుంటూనే తండ్రి దగ్గరకు వెళ్ళిపోవాలనుకుంటాము. ఇది పాత శరీరము. ఉదాహరణానికి సర్పము కూడా పాత పొరను వదిలేస్తుంది కదా. చలిలో ఎండిపోతే పాత పొరను వదిలేస్తుంది. ఇది మీ చాలా ఛీ-ఛీ పాత శరీరము. పాత్రాభినయము చేస్తూ ఇప్పుడు దీనిని వదలాలి. తండ్రి వద్దకు వెళ్ళాలి. బాబా యుక్తినైతే తెలిపించారు - ''మన్మనాభవ''. నన్ను స్మృతి చేయండి, చాలు. ఇలా కూర్చుని కూర్చునే శరీరాన్ని వదిలేస్తారు. సన్యాసులు కూడా ఇలాగే కూర్చుని కూర్చునే శరీరాన్ని వదిలేస్తారు. ఆత్మ వెళ్ళి బ్రహ్మములో కలిసిపోవాలని భావిస్తారు అందుకే యోగాన్ని జోడించి కూర్చుంటారు. కాని వెళ్లలేరు. కాశీలో కత్తుల బావిలో దూకుతారు. అది జీవహత్య అవుతుంది. ఆ సన్యాసులు కూడా అలాగే కూర్చుని కూర్చునే శరీరాన్ని వదిలేస్తారు. బాబా ఇవన్నీ చూశారు. వారిది హఠయోగ సన్యాసము.

మీకు 84 జన్మలు ఎలా లభిస్తాయో తండ్రి అర్థము చేయిస్తారు. మీకు ఎంత జ్ఞానాన్నిస్తారు! కాని ఎవరో కొంతమంది మాత్రమే శ్రీమతమును అనుసరిస్తారు. దేహాభిమానములోకి వచ్చినందున తండ్రికే మతమివ్వడము మొదలుపెడ్తారు. ఆత్మాభిమానులుగా అవ్వండి అని తండ్రి అర్థము చేయిస్తారు. నేను ఆత్మను. బాబా మీరు జ్ఞానసాగరులు, చాలు మీ సలహా అనుసారమే నడుచుకుంటాను. అడుగడుగునా చాలా అప్రమత్తంగా ఉండాలి. తప్పులైతే జరుగుతూ ఉంటాయి. మళ్లీ పురుషార్థము చేయాల్సి వస్తుంది. ఎక్కడకు వెళ్ళినా తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. వికర్మల బరువు తల పై చాలా ఉంది. కర్మభోగమును కూడా సమాప్తము చేసుకోవాలి కదా. చివరి వరకు ఈ కర్మభోగము వదలదు. శ్రీమతమును అనుసరించడం ద్వారా పారస బుద్ధి గలవారిగా అవ్వాలి. జతలో ధర్మరాజు కూడా ఉన్నారు. కనుక బాధ్యత తనదే. తండ్రి కూర్చుని ఉన్నారు. మీరెందుకు తల పై బరువును ఉంచుకుంటారు? పతితపావనుడైన తండ్రి పతితుల సభలోకి రానే రావాలి. ఇది కొత్త విషయము కాదు. అనేకమార్లు ఈ పాత్రను అభినయించారు. మళ్లీ అభినయిస్తూ ఉంటారు. దీనినే అద్భుతమని అంటారు. మంచిది.

పారలౌకిక బాప్‌దాదాల అపురూపమైన పిల్లలకు ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌

ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. తండ్రి సమానంగా అందరినీ దు:ఖాల నుండి విముక్తులను చేసే దయ చూపించాలి. సుఖమునిచ్చే మార్గాన్ని తెలిపించాలి.

2. ఎలాంటి వినాశకారీ(విరుద్ధ) కార్యాలను చేయరాదు. శ్రీమతమును అనుసరించి 21 జన్మలకు మీ ప్రాలబ్ధాన్ని తయారుచేసుకోవాలి. అడుగడుగునా అప్రమత్తంగా నడుచుకోవాలి.

వరదానము :-

''నిందించే వారిని కూడా మిత్రులుగా భావించి గౌరవించే బ్రహ్మబాబా సమానం మాస్టర్‌ రచయిత భవ''

ఎలాగైతే బ్రహ్మాబాబా స్వయాన్ని విశ్వ సేవాధారిగా భావించి ప్రతి ఒక్కరిని గౌరవించారో, సదా మాలేకం అని సలాం చేశారు(నమస్కరించారు). ఎవరినైనా నన్ను గౌరవిస్తే నేను గౌరవిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నిందించేవారిని కూడా తన మిత్రులుగా భావించి గౌరవించారు. ఇలా తండ్రిని అనుసరించండి. కేవలం మిమ్ములను గౌరవించేవారిని మాత్రమే మీ వారిగా భావించకండి. మిమ్ములను తిట్టేవారిని కూడా మీ వారిగా భావించి గౌరవించండి. ఎందుకంటే ప్రపంచమంతా మీ పరివారమే. ఆత్మలందరి కాండము బ్రాహ్మణాత్మలైన మీరే. అందువలన స్వయాన్ని మాస్టర్‌ రచయితగా భావించి అందరినీ గౌరవించండి. అప్పుడే మీరు దేవతలుగా అవుతారు.

స్లోగన్‌ :-

''మాయకు సదా కొరకు వీడ్కోలునిచ్చేవారే తండ్రి అభినందనలకు పాత్రులుగా అవుతారు''