15-10-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - అనంతమైన సర్వీసు కొరకు మీ బుద్ధి పని చేయాలి, రేడియమ్‌ ముళ్ళుండే పెద్ద గడియారాన్ని( సృష్టి చక్రాన్ని ) తయారు చేయండి, అది దూరము నుండే మెరుస్తూ ఉండాలి ''

ప్రశ్న :-

సర్వీసు వృద్ధి చేసేందుకు ఏ యుక్తిని రచించాలి ?

జవాబు :-

తెలివైన మహారథి పిల్లలను మీ వద్దకు ఆహ్వానిస్తూ ఉండాలి. మహారథి పిల్లలు తిరుగుతూ ఉంటే సర్వీసు వృద్ధి అవుతూ ఉంటుంది. అలా చేస్తే మా గౌరవము తగ్గిపోతుందని ఎప్పుడూ భావించరాదు. పిల్లలెప్పుడూ దేహాభిమానములోకి రాకూడదు. మహారథులను చాలా గౌరవించాలి.

పాట :-

యహ్‌ వక్త్‌ జా రహా హై,.....................( ఈ సమయము గడిచిపోతున్నది,.............. )  

ఓంశాంతి.

గడియారము అనే పేరును వింటూనే అనంతమైన గడియారము జ్ఞాపకము వస్తుంది. ఇది అనంతమైన గడియారము. ఇదంతా బుద్ధితోనే అర్థము చేసుకోవాలి. అందులో కూడా ఒక చిన్న ముల్లు, ఒక పెద్ద ముల్లు ఉంటుంది. సెకండ్ల పెద్ద ముల్లు తిరుగుతూ ఉంటుంది. రాత్రి 12 గంటలు అంటే రాత్రి పూర్తయ్యి, పగలు ప్రారంభమౌతుంది. ఈ అనంతమైన గడియారము ఎంత పెద్దదిగా ఉండాలి! ఆ ముళ్ళుకు రేడియమ్‌ ఉంటే దూరము నుండే మెరుస్తూ ఉంటాయి. గడియారము తనంతకు తానే తెలిపిస్తుంది. కొత్తవారెవరు వచ్చినా గడియారాన్ని చూపించండి. ముళ్ళు అంతిమ సమయాన్ని సూచిస్తున్నాయని బుద్ధి కూడా చెప్తుంది. వినాశనము తప్పకుండా అవ్వాలని ఎవరైనా అర్థము చేసుకుంటారు. తర్వాత సత్యయుగ ఆది వస్తుంది. సత్యయుగములో చాలా కొద్దిమంది ఆత్మలే ఉంటారు. మరి ఇంతమంది ఆత్మలు వాపస్‌ వెళ్ళి ఉంటారు కదా. చిత్రాల ద్వారా అర్థము చేసుకోవడం చాలా సహజము. ఇటువంటి గడియారాలను తయారు చేస్తే అనేక మంది కొనుగోలు చేసి ఇంట్లో కూడా పెట్టుకుంటారు. దీని పై అర్థము చేయించాలి. ఈ కలియుగము అధికారము ఎలా లభించి ఉంటుంది? తప్పకుండా తండ్రి ద్వారానే లభించి ఉంటుంది. పతితపావనులు సంగమ యుగములో పతిత ప్రపంచములోనే వస్తారు. పావన ప్రపంచములో తండ్రి రారు. చాలా ఫస్ట్‌క్లాస్‌ అయిన ఈ సృష్టిచక్రము చిత్రము పై అర్థము చేయించడం ఎవరికైనా చాలా సులభము. ధనము ఎక్కువగా ఉన్నవారు చిత్రకారునికి వెంటనే ఆర్డరిస్తే, చిత్రము వెంటనే తయారైపోతుంది. ప్రభుత్వ కార్యాలు చాలా త్వరగా జరిగిపోతాయి. ఇక్కడ అతికష్టము మీద మన పనులు నెరవేరుతాయి. మంచి కళాకారునితో చేయిస్తే సుందరంగా తయారౌతుంది. ఈ రోజుల్లో కళలకు చాలా గౌరవముంది. నృత్యకళను ఎంత ప్రదర్శిస్తూ ఉంటారు. ఇంతకు ముందు ఇలాంటి నృత్యాలుండేవని భావిస్తారు. కాని నిజానికి అలాంటిదేమీ లేదు. కావున ఈ అనంతమైన గడియారాన్ని వెంటనే తయారు చేయించాలి. తద్వారా మనుష్యులు బాగా అర్థము చేసుకుంటారు. రంగు కూడా బాగా మెరుస్తూ ఉండాలి. మనుష్యులు పతితపావనులుగా అయ్యేందుకు వీలు లేదు. మనుష్యులు పతితులైనందున భగవంతుని పిలుస్తారు. స్వర్గము పావన ప్రపంచము. కృష్ణుడే శ్యామంగా మరియు సుందరంగా తయారవుతారని, అందుకే వారిని శ్యామసుందరుడని అంటారని మనుష్యులకు తెలియదు. మొదట మనకు కూడా అర్థమయ్యేది కాదు. తప్పకుండా ఆత్మ కామచితి పై కూర్చుని నల్లగా లేక పతితంగా అవుతుందని ఇప్పుడు బుద్ధిలో ఉంది అనగా ఆత్మ పతితమైపోయింది. ఇది కూడా స్పష్టంగా వ్రాయాలి. పరమపిత పరమాత్మ ఆస్తినిస్తారు, రావణుడు శాపమిస్తాడు. కాని మనుష్యుల బద్ధి రఘుపతి రాఘవ రాజా రాముని.......... వైపు పోతుంది. కాని రాముడంటే పరమపిత పరమాత్మ. బుద్ధిని బాగా వినియోగించి ఈ చిత్రాలన్నింటిని తయారు చేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ నేనే భగవంతుడనని చెప్తూ ఉంటారు. కాని తండ్రి ఒక్కరేనని మీకు తెలుసు. ఆత్మలమైన మనమంతా పరంధామములో పరమాత్ముని వద్దకు వెళ్లి ఉంటాము. ఆ సమయములో తండ్రి మరియు మనము ఇరువురము బ్రహ్మాండానికి అధిపతులుగా ఉంటాము. నేను మిమ్ములను విశ్వాధికారులుగా తయారు చేస్తానని తండ్రి చెప్తున్నారు. ఇక ఏ ఇతర గొప్ప రాజులైనా ఇలా మేము విశ్వానికి అధిపతులమని చెప్పలేరు. తండ్రి మనలను విశ్వానికి అధిపతులుగా చేస్తున్నారు. మరి ఇటువంటి తల్లి, తండ్రుల పైన ఎంత బలిహారమవ్వాలి. వారి శ్రీమతము ప్రసిద్ధమైనది. వారి శ్రీమతము అనుసారంగా నడుస్తూ, నడుస్తూ అంత్యములో శ్రీమతమును పూర్తిగా అనుసరిస్తాము. ఇప్పుడే శ్రీమతాన్ని పూర్తిగా పాటిస్తే శ్రేష్ఠులైపోతాము. ఎంత తల బద్ధలు కొట్టుకోవలసి వస్తుంది (కష్టపడాల్సి వస్తుంది)! ఎంతవరకు యజ్ఞము నడుస్తుందో అంతవరకు పురుషార్థము నడుస్తూ ఉంటుంది.

ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. శాంతి కొరకు వారు కూడా రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు. కాని దానితో శాంతి లభించదు. తండ్రిది ఒక్కటే యజ్ఞము. అందులో పూర్తి సామాగ్రి(ప్రపంచములోని అన్ని వస్తువులు) స్వాహా అయిపోతుంది, సెకండులో జీవన్ముక్తి లభిస్తూ ఉంటుంది. వారు ఎన్ని యజ్ఞాలను రచిస్తారు కాని లాభమేమీ లేదు. పిల్లలైన మీరు సంపూర్ణ అహింసకులు. పవిత్రత లేకుండా ఎవ్వరూ స్వర్గానికి వెళ్లలేరు. ఇది చివరి సమయము. పతిత ప్రపంచము, భ్రష్టాచారి రావణుని ప్రపంచము. 100 శాతము అపవిత్రత, దు:ఖము, అశాంతి, రోగాలు.............. ఇవన్నీ వ్రాయవలసి ఉంటుంది. మళ్లీ స్వర్గములో శ్రేష్ఠాచారులుగా ఉంటారు. 100 శాతము పవిత్రత-సుఖము-శాంతి నిరోగులుగా ఉంటారు. ఇది శివబాబా వారసత్వము. అది రావణుని శాపము - అని విశదంగా వ్రాయాలి. భారతదేశము ఫలానా సమయము నుండి ఫలానా సమయము వరకు శ్రేష్ఠాచారిగా ఉండేది, మళ్లీ ఫలానా సమయము నుండి భ్రష్టాచారిగా అయ్యింది - చూస్తూనే అర్థమయ్యే విధంగా వ్రాయాలి. అర్థము చేయించడం ద్వారా బుద్ధిలో నషా పెరుగుతుంది. అనుభవము పెరగాలంటే ఇదే కర్తవ్యములో ఉండాలి. వారు 8 గంటలు సర్వీసు చేస్తారు. ఇక్కడ కూడా 8 గంటలు సర్వీసు చేయాలి. సేవాకేంద్రాలలో పిల్లలు ఎవరైతే ఉంటారో, వారు కూడా నెంబరువారుగా ఉంటారు. కొంతమందికి సర్వీసు చేయాలనే అభిరుచి చాలా ఉంటుంది. అన్ని చోట్లకు పరిగెడుతూ ఉంటారు. కొంతమంది అయితే ఒకే స్థలములో విశ్రాంతిగా కూర్చుంటారు. వారిని ఆల్‌రౌండర్‌ అని అనరు. మహారథులను పూర్తిగా అర్థము చేసుకుంటే సేవ కూడా చల్లబడిపోతుంది. చాలామందికి స్వయాన్ని గురించిన అహంకారము చాలా ఉంటుంది. మాకు గౌరవము లభించాలి. ఇతరులు ఎవరైనా వచ్చారంటే మా గౌరవము తగ్గిపోతుందని భావిస్తారు. మహారథులు సహాయము చేస్తారని అర్థము చేసుకోరు. అహంకారముతో ఉంటారు. ఇటువంటి బుద్ధిహీనులు కూడా ఉన్నారు. సత్యమైన మనసుకే ప్రభువు రాజీ అవుతారని తండ్రి చెప్తున్నారు. బాబా వద్దకు సమాచారమంతా వస్తూ ఉంటుంది కదా. బాబాకు ప్రతి ఒక్కరి నాడి గురించి తెలుసు. ఈ బాబా కూడా అనుభవజ్ఞులే.

కనుక ఈ సృష్టి చక్ర వివరణ చాలా బాగుంది. ఈ వివరణ వెలువడ్తే విహంగ మార్గములో మంచి సేవ జరుగుతుంది. ఇప్పుడు చీమ మార్గము వంటి సర్వీసు జరుగుతోంది. ఇప్పుడు దేహాభిమానములో ఉన్నారు కనుక బుద్ధి పని చేయదు. ఇప్పుడిది విహంగ మార్గపు సేవ. ఏమేమి తయారు చేయాలని సేవాధారి పిల్లల బుద్ధి నడుస్తూ ఉంటుంది. చిత్రాలను చూపించి అర్థము చేయించడం చాలా సహజము. ఇప్పుడిది కలియుగము, మళ్లీ సత్యయుగ స్థాపన అవుతుంది. తండ్రియే అందరినీ వాపస్‌ తీసుకెళ్తారు. అక్కడ సుఖముంటుంది, ఇక్కడ దు:ఖముంది. అందరూ పతితులుగానే ఉన్నారు. పతిత మనుష్యులెవ్వరికీ ముక్తి-జీవన్ముక్తులను ఇవ్వలేరు. వీరందరూ భక్తి మార్గపు కర్మలను నేర్పించేవారు. గురువులందరూ భక్తిమార్గపు గురువులే. జ్ఞానమార్గపు గురువులు ఎవ్వరూ లేరు. ఇక్కడైతే ఎంత శ్రమ చేయాల్సి ఉంటుంది. భారతదేశాన్ని స్వర్గంగా చేయాలంటే ఇంద్రజాలమే కదా. అందుకే వారిని జాదూగర్‌(ఇంద్రజాలికుడు) అని అంటారు. కృష్ణుని ఎప్పుడూ ఇంద్రజాలికుడని అనరు. కృష్ణుని కూడా శ్యామము నుండి సుందరంగా చేయువారు ఆ తండ్రియే. అర్థము చేయించేందుకు చాలా నషా ఉండాలి. వెలుపలికి(మధుబన్‌ నుండి సేవాకేంద్రాలకు) వెళ్లాలి. పేదవారే బాగా అర్థము చేసుకోగలరు. ధనవంతులకు నమ్మకము తక్కువగా ఉంటుంది. నూరుమంది పేదవారుంటే ఒక్కరో ఇద్దరో ధనవంతులు, 5-7 మంది సాధారణమైనవారు వెలువడ్తారు. ఇలాగే పని నడుస్తూ ఉంటుంది. ధనము ఆవశ్యకత అంతగా ఉండదు. ప్రభుత్వాన్ని చూడండి, ఎన్ని తుపాకీ గుండ్లను తయారు చేసింది! దీని ద్వారా మనము వినాశనమవుతామని, వినాశనము అయిపోతుందని ఇరువురికీ(యుద్ధము చేయు రెండు వర్గాలవారికి) అర్థమవుతుంది. మేము వినాశనమవుతామని కూడా తెలుసు. అప్పుడు వేటగానిగా ఎవరు అవుతారు? రెండు పిల్లులు కొట్లాడుకుంటే మధ్యలో వెన్నను కోతి కాజేసిందనే కథ ఉంది కదా. కృష్ణుని నోటిలో వెన్నను చూపిస్తారు. అది స్వర్గమనే వెన్న. ఈ విషయాలు ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. 20-25 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నవారు కూడా అర్థము చేసుకోరు. బాబా భట్టీ తయారయ్యింది. అందులో ఎంతమంది వచ్చారు! ఎంతమంది వెళ్లిపోయారు. కొంతమంది నిలబడిపోయారు. కల్పక్రితము కూడా డ్రామాలో ఇలాగే జరిగింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది. చిత్రాలు ఎంత పెద్దవిగా ఉంటే ఎవరికైనా అర్థము చేయించడం అంత సహజమవుతుంది. లక్ష్మీనారాయణుల చిత్రము కూడా అవసరము. భక్తి సంప్రదాయము ఎప్పటి నుండి మొదలవుతుందో కల్పవృక్షము చిత్రము ద్వారా అర్థమవుతుంది. రెండు యుగాలు బ్రహ్మ పగలు, రెండు యుగాలు బ్రహ్మ రాత్రి. మానవులు బ్రహ్మ సూక్ష్మవతనములో ఉన్నారని అంటారు. కానీ ఏమీ అర్థము చేసుకోరు. అయితే ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ఇక్కడే ఉంటారు కదా. ఇవి ఎంతో రహస్యయుక్తమైన విషయాలు. ఇవి శాస్త్రాలలో ఉండజాలవు. మానవులు అసత్య చిత్రాలను చూశారు. అసత్య జ్ఞానము విన్నారు. బ్రహ్మకు కూడా చాలా భుజాలను చూపించారు. ఇప్పుడు శాస్త్రాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో, అవన్నీ భక్తిమార్గపు సామగ్రి. ఇది ఎప్పటి నుండి మొదలవుతుందో ప్రపంచములోని వారికి తెలియదు. మానవులు ఎంత భక్తి చేస్తారు! భక్తి లేకుండా భగవంతుడు లభించజాలరని అంటారు. అయితే ఎప్పుడు పూర్తి దుర్గతి అవుతుందో అప్పుడే సద్గతిని కలుగజేసేందుకు భగవంతుడు లభిస్తారు. ఈ లెక్కాచారమంతా మీకు తెలుసు. అర్ధకల్పము నుండి భక్తి మొదలవుతుంది. తండ్రి అంటున్నారు - ఈ వేదాలు, ఉపనిషత్తులు, యజ్ఞ, తపాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఇవన్నీ సమాప్తమయ్యేవే. అందరూ నల్లగా అవ్వాల్సిందే. మళ్లీ సుందరంగా చేసేందుకు తండ్రి రావలసే పడ్తుంది. తండ్రి చెప్తున్నారు - నేను కల్పము యొక్క సంగమ యుగే - యుగములో వస్తాను, కాని యుగ-యుగములో రాను. అయితే కచ్ఛావతారము(తాబేలు అవతారము), మత్స్యావతారము(చేప అవతారము), పరుశురామావతారము.......... మొదలైనవి చూపిస్తారు. ఇవన్నీ భగవంతుని అవతారాలని అంటారు. మరి రాయి-రప్పలలో భగవంతుడెలా ఉండగలరు! మానవులు ఎంతటి తెలివిహీనులుగా అయిపోయారు! తండ్రి వచ్చి ఎంత వివేకవంతులుగా తయారు చేశారు! పరమపిత పరమాత్మ జ్ఞానసాగరులు, పవిత్ర సాగరులు అని మహిమ కూడా చేయాల్సి ఉంటుంది. కృష్ణునికి ఈ మహిమ ఉండజాలదు. మళ్లీ కృష్ణుని భక్తులు, కృష్ణుని సర్వవ్యాపి అని అంటారు. ఎంత హత్తుకొని ఉంటారు. బుద్ధిని అతడి నుండి తొలగించి తండ్రి పరిచయం ఇవ్వబడ్తుంది. ఆత్మలందరూ సోదరులు. అందరూ తండ్రులుగా అవ్వలేరు. తండ్రులైపోతే ఎవరిని స్మృతి చేస్తారు? పిల్లలు గాడ్‌ఫాదర్‌ను స్మృతి చేస్తారు. అర్థము చేయించేవారు కూడా అనంతమైన బుద్ధి గలవారిగా ఉండాలి. పిల్లల బుద్ధి హద్దులోనే చిక్కుకొని పోతుంది. ఒకే స్థలములో కూర్చుండిపోతారు. వ్యాపారస్థులు పెద్ద-పెద్ద శాఖలను (బ్రాంచిలను) తెరుస్తూ ఉంటారు. ఎవరు ఎక్కువ సేవాకేంద్రాలను తెరుస్తారో ఆ మేనేజరు మంచివారు. సేవాకేంద్రము పై కూడా ఆధారపడి ఉంటుంది. ఇది అవినాశి జ్ఞాన రత్నాల దుకాణము ఎవరిది? జ్ఞానసాగరునిది. ఈ జ్ఞానము శ్రీ కృష్ణునిలో అయితే లేదు. ఆ సమయములో యుద్ధము కూడా జరగలేదు. పాయింట్లు అయితే చాలా ఉన్నాయి, వాటిని ధారణ చేసి ఇతరులకు అర్థము చేయించాలి. సభలో కూడా చిత్రాలను ఉంచితే అందరూ చూడగలరు. గడియారపు చిత్రము చాలా బాగుంది. ఈ చక్రాన్ని తెలుసుకోవడం వలన చక్రవర్తులుగా అవుతారు. స్పదర్శన చక్రధారులుగా అవ్వాలి. గడియార చిత్రము చూపించి అర్థము చేయించడం చాలా సహజము. కాని ఎంతోమంది పాత పిల్లలు యోగ్యులుగా అవ్వనే అవ్వరు. స్వయాన్ని గొప్పగా(మియామిట్టూగా) భావించుకొని కూర్చుంటారు. అసత్య ఖుషీలో ఉంటారు. సర్వీసు చేయలేదంటే వీరు దాతలు అని ఎవరు అంగీకరిస్తారు? దానము కూడా బంగారు నాణేలు దానము చేయాలా? లేక నయా పైసాలు దానము చేయాలా? ఈ చిత్రము అంధుల ముందు అద్దము(దర్పణము) వంటిది. దర్పణములో తమ ముఖాన్ని చూసుకుంటారు. మొదట కోతి ముఖము వలె ఉండేది. ఇప్పుడు మందిర యోగ్యమైన ముఖము తయారవుతోంది. మందిరములో ఉండేందుకు యోగ్యముగా అయ్యేందుకు పురుషార్థము చేయాలి. ఇది పతిత ప్రపంచము. అది పావన ప్రపంచము దానిని శివబాబాయే స్థాపన చేస్తున్నారు. ఎవరైతే శ్రీమతాన్ని అనుసరించరో వారి బుద్ధిలో ఎప్పుడూ ధారణ కూడా అవ్వజాలదు. రోజురోజుకు మీకు చాలా గుహ్యమైన విషయాలను తెలియజేస్తానని తండ్రి చెప్తున్నారు. కనుక జ్ఞానము తప్పకుండా వృద్ధి అవుతూ ఉంటుంది.

8 సామ్రాజ్యాలు ఎలా నడుస్తాయని కొంతమంది ప్రశ్నిస్తారు. ఈ లెక్కతో అయితే ఇన్ని రాజ్యాలు ఉండాలని అంటారు. మీరు ఈ మాటలలో ఎందుకు చిక్కుకుంటారని తండ్రి అంటున్నారు? మొదట తండ్రిని, వారి వారసత్వాన్ని స్మృతి చేయండి. అక్కడి పద్ధతులు, ఆచారాలు ఎలా ఉంటాయో అవి అక్కడ జరుగుతాయి. పిల్లలు ఏ విధంగా జన్మించాలో ఆ విధంగానే జన్మిస్తారు. మీరు వీటిలోకి ఎందుకు వెళ్తారు? వికారాల విషయాలను నోటి పై ఎందుకు తీసుకొస్తారు? ఈ చిత్రాన్ని (సృష్టి చక్రము) ఎవరికైనా బహుమతిగా ఇచ్చేందుకు కూడా చాలా బాగుంది. ఇది ఈశ్వరీయ(గాడ్‌ఫాదర్‌లీ) గిఫ్ట్‌. ఇటువంటి ఈశ్వరీయ గిఫ్ట్‌ను తీసుకోకుండా ఎవరు ఉంటారు! క్రైస్తవులు ఇతరుల సాహిత్యము మొదలైనవేవీ తీసుకోరు, వారికి వారి ధర్మపు నషా ఉంటుంది. దేవతా ధర్మము అన్నిటికంటే శ్రేష్ఠమయ్యిందని తండ్రి అంటారు. ఈ క్రైస్తవుల ద్వారా మాకు చాలా ధనము లభిస్తుందని వారు భావిస్తారు. కాని ఇవి జ్ఞాన విషయాలు. ఎవరైతే ఈ జ్ఞానాన్ని తీసుకుంటారో వారే తండ్రి నుండి వారసత్వము పొందుతారు. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. విశ్వానికి అధిపతులుగా చేసే తల్లిదండ్రులకు హృదయమును అర్పించాలి. వారి శ్రీమతమును బాగా అనుసరిస్తూ శ్రేష్ఠంగా అవ్వాలి.

2. మీ హృదయాన్ని సదా సత్యంగా ఉంచుకోవాలి, అహంకారముండరాదు. బంగారు నాణేలను దానము చేయాలి. జ్ఞాన దానము చేయడంలో మహారథులుగా అవ్వాలి. 8 గంటలు ఈశ్వరీయ సేవ తప్పకుండా చెయ్యాలి.

వరదానము :-

''మీ బరువు బాధ్యతలన్నీ తండ్రికి ఇచ్చి నిశ్చింతులుగా ఉండే సఫలతా సంపన్న సేవాధారీ భవ ''

పిల్లలు ఎవరైతే స్వయం ఎంత తేలికగా ఉంటారో అంత సేవ చేస్తూ స్వయం సదా పైకి ఎక్కుతూ ఉంటారు అనగా ఉన్నతి చెందుతూ ఉంటారు. అందువలన అన్ని బరువు బాధ్యతలను తండ్రికిచ్చి స్వయం నిశ్చింతగా ఉండండి. ఏ విధమైన 'మై పన్‌(నాది)' యొక్క బరువు ఉండరాదు. కేవలం స్మృతి చేస్తూ నషాలో ఉండండి. తండ్రితో కలిసి కంబైండ్‌గా ఉంటే తండ్రి ఎక్కడుంటారో అక్కడ సేవ స్వతహాగా అయ్యే(జరిగే) ఉంది. కరావన్‌హార్‌(చేయించేవారు) చేయిస్తూ ఉంటే తేలికగా ఉంటారు, సఫలతా సంపన్నులుగా కూడా అవుతారు.

స్లోగన్‌ :-

''అనంతమైన డ్రామాలోని ప్రతి దృశ్యము నిశ్చితమని తెలుసుకొని సదా నిశ్చింతులుగా ఉండండి ''