19-11-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - జ్ఞాన - యోగాల శక్తితో వాయుమండలాన్ని శుద్ధంగా చేయాలి, స్వదర్శన చక్రము ద్వారా మాయ పై విజయము పొందాలి''
ప్రశ్న :-
ఆత్మ ఎప్పుడూ జ్యోతిలో లీనమవ్వదని ఏ మాట ద్వారా నిరూపించబడ్తుంది ?
జవాబు :-
ఇది తయారై తయారవుచున్న డ్రామా......... (బనీ బనాయీ బన్ రహీ) అని అంటారు అనగా ఆత్మ తప్పకుండా తన పాత్రను మరలా మరలా(రిపీట్) చేస్తుంది. జ్యోతి జ్యోతిలో లీనమైపోతే పాత్ర సమాప్తమైపోయినట్లే. అప్పుడు అనాది డ్రామా అనడం కూడా తప్పైపోతుంది. ఆత్మ పాత శరీరాన్ని వదిలి క్రొత్తది తీసుకుంటుంది, లీనమవ్వదు.
పాట :-
ఓ దూర్కే ముసాఫిర్,..........(ఓ బహుదూరపు బాటసారి,...............) 
ఓంశాంతి.
యోగి, జ్ఞాని పిల్లలు ఎవరైతే ఇతరులకు అర్థము చేయించగలరో వారు ఈ పాట అర్థాన్ని యదార్థంగా అర్థము చేసుకోగలరు. మానవమాత్రులందరు ఇప్పుడు శ్మశానవాసులై ఉన్నారు. ఎవరి జ్యోతి ప్రకాశము తగ్గిపోయిందో(కొడిగట్టిపోయిందో), ఎవరు తమోప్రధానంగా ఉన్నారో వారిని శ్మశానవాసులని అంటారు. ఎవరు స్థాపన చేశారో, జన్మ-జన్మలుగా పాలన కొరకు నిమిత్తమై ఉన్నారో, వారందరూ తమ-తమ జన్మలను పూర్తి చేశారు. ప్రారంభము నుండి, చివరి వరకు ఏ ఏ ధర్మాలు స్థాపించబడ్డాయో లెక్క తీయగలరు. హద్దు నాటకములో కూడా డ్రామాలోని ముఖ్య పాత్రధారులు, రచయిత, డైరెక్టర్ నటులకే అధిక గౌరవముంటుంది. వారికి ఎన్నో బహుమతులు లభిస్తాయి, వైభవము(ఆడంబరము) చూపిస్తారు కదా. మీది జ్ఞాన-యోగాల వైభవము సౌందర్యము(శోభ), మృత్యువు ఎదుర్లోనే నిలబడి ఉందని, డ్రామాలో ఎన్ని జన్మలు తీసుకుంటారో, ఎక్కడ నుండి వస్తారో ఈ విషయాలన్నిటి గురించి మానవులకు తెలియదు. అన్ని జన్మల గురించి విస్తారంగా నాకు, మీకు తెలియదు. పోతే ఈ సమయంలో మన భవిష్యత్తు కొరకు పురుషార్థము నడుస్తోంది, కొనసాగుతూ ఉంది. దేవతలుగా అయితే అవుతారు కాని ఏ పదవిని పొందుతామో దానికై పురుషార్థము చేయాలి. ఈ లక్ష్మీనారాయణులు 84 జన్మలు తీసుకున్నారని మీకు తెలుసు. ఇప్పుడు వీరు తప్పకుండా రాజా-రాణీగా అవుతారు. వారి ముఖ్య గుణగణాలు, రూపురేఖలు కూడా మీకు తెలుసు. ప్రాక్టికల్గా మీకు సాక్షాత్కారము చేయిస్తారు. భక్తిమార్గములో కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి. వారు ఎవరిని ధ్యానము చేస్తారో వారి సాక్షాత్కారం జరుగుతుంది. కృష్ణుని చిత్రము నల్లగా చూపిస్తారు. దానినే ధ్యానిస్తారు. కనుక అలాగే నల్లగా సాక్షాత్కారమౌతుంది. కాని కృష్ణుడు అలా నల్లగా ఉండడు. మనుష్యులకు ఈ విషయాల జ్ఞానము కొద్దిగా కూడా ఉండదు. మీరిప్పుడు ప్రత్యక్షంగా ఉన్నారు. సూక్ష్మవతనములో కూడా చూస్తారు. వైకుంఠములో కూడా చూస్తారు. మీకు ఆత్మ-పరమాత్మల జ్ఞానముంది. ఆత్మ సాక్షాత్కారమే జరుగుతుంది. ఇచ్చట మీరు ఏది సాక్షాత్కారములో చూస్తారో దాని జ్ఞానము మీ వద్ద ఉంది. వెలుపలి వారికి భలే ఆత్మ సాక్షాత్కారము జరిగినా వారికి దాని జ్ఞానమైతే లేదు. వారు ఆత్మయే పరమాత్మ అని అంటారు. ఆత్మ ఖచ్ఛితంగా నక్షత్రము వంటిదే. చాలా కనిపిస్తాయి. ఎంతమంది మనుష్యులో అన్ని ఆత్మలున్నాయి. మనుష్యుల శరీరము ఈ కనులకు కనిపిస్తుంది. ఆత్మను దివ్యదృష్టి ద్వారా చూడవచ్చు. మనుష్యుల రంగులు, రూపాలు వేరు వేరుగా ఉంటాయి. ఆత్మలు అలా భిన్న భిన్నంగా ఉండవు. అన్నీ ఒకే రకంగా ఉంటాయి. కేవలం ఒక్కొక్క ఆత్మ పాత్ర వేరు వేరుగా ఉంటుంది. మనుష్యులు పెద్దగా - చిన్నగా ఉన్నట్లు ఆత్మలు పెద్దగా - చిన్నవిగా ఉండవు. అన్ని ఆత్మల సైజు(పరిమాణము) ఒక్కటే. ఒకవేళ ఆత్మ జ్యోతిలో లీనమైపోతే పాత్ర రీపీట్ ఎలా అవుతుంది? తయారై తయారవుతున్న డ్రామా అని గాయనము కూడా ఉంది. ఈ అనాది సృష్టి చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇది పిల్లలైన మీకు తెలుసు. దోమల వలె ఆత్మలు వాపస్ వెళ్లిపోతాయి. దోమలనైనా ఈ కళ్లతో చూడవచ్చు. కాని ఆత్మను దివ్యదృష్టి లేకుండా చూడలేము. సత్యయుగములో అయితే ఆత్మ సాక్షాత్కారము అవసరమే ఉండదు. పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరము తీసుకోవాలని ఆత్మకు తెలుస్తుంది. పరమాత్మను గూర్చి వారికి తెలియనే తెలియదు. పరమాత్మ గురించి తెలిసి ఉంటే సృష్టి చక్రము గురించి కూడా తెలిసి ఉండాలి.
కావున పాటలో, మమ్ములను కూడా మీ జతలో తీసుకెళ్లండి అని అంటారు. చివర్లో చాలా పశ్చాత్తాపపడ్తారు. అందరికీ ఆహ్వానము లభిస్తుంది. ఆహ్వానించేందుకు అనేక యుక్తులు రచింపబడ్తున్నాయి.
శాంతి - శాంతి అని అందరూ అంటారు. కాని శాంతికి అర్థము ఎవ్వరికీ తెలియదు. శాంతి ఎలా ఏర్పడ్తుందో మీకు తెలుసు. ఎలాగైతే గానుగలో ఆవాలు నలిగి చూర్ణమవుతాయో అలా వినాశనములో శరీరాలన్నీ సమాప్తమైపోతాయి. ఆత్మలు నలిగిపోవు, అవేమో వెళ్లిపోతాయి. ఆత్మలు దోమల గుంపు వలె పరుగెడ్తాయని కూడా వ్రాయబడి ఉంది. అంతేకాని పరమాత్మలందరూ పరుగెడ్తారని కాదు. మనుష్యులు ఏమీ అర్థం చేసుకోరు. ఆత్మ-పరమాత్మలకు గల బేధమేమిటో కూడా తెలియదు. మేమంతా సోదరులమని అంటారు. మరి అలా సోదరులు(భాయీ-భాయీ)గా ఉండాలి కదా. సత్యయుగములో అందరూ భాయి-భాయి లేక సోదరీ-సోదరులు పరస్పరము పాలు-చెక్కెర వలె కలిసి ఒక్కటిగా ఉంటారని వారికి తెలియదు. అక్కడ ఉప్పు-నీరులా అయ్యే విషయమే లేదు. ఇక్కడ గమనించండి. ఇప్పుడిప్పుడే పాలు-పంచదార వలె కలిసి ఉంటారు, ఇప్పుడిప్పుడే ఉప్పు-నీరుగా అయిపోతారు. ఒక వైపేమో హిందూ-చీనీ(చైనా) భాయి-భాయి అంటారు. కాని వారి బొమ్మలు తయారు చేసి తగులబెడ్తూ ఉంటారు. శారీరిక భాయి-భాయిల ఈ స్థితి ఎలా ఉందో చూడండి. ఆత్మిక సంబంధాల గురించి తెలియనే తెలియదు. తండ్రి అర్థము చేయిస్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహాభిమానములో చిక్కుకోరాదు. కొంతమంది దేహాభిమానములో చిక్కుకుంటారు. తండ్రి చెప్తున్నారు - దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ వదలాలి. ఈ ఇల్లు - వాకిళ్ళు మొదలైనవన్నీ మర్చిపోండి. వాస్తవానికి మీరు పరంధామ నివాసులు. మీరు పాత్ర చేసేందుకు ఎక్కడ నుండి వచ్చారో అక్కడకు మళ్లీ వెళ్లాలి. నేను మళ్లీ మిమ్ములను సుఖములోకి పంపిస్తాను. కావున అర్హులుగా తయారవ్వాలని తండ్రి అంటున్నారు. భగవంతుడు రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. ఏసుక్రీస్తుకు ఏ రాజ్యమూ ఏదీ లేదు. కాని లక్షల సంఖ్యలో క్రైస్తవులుగా అయినప్పుడు వారి రాజ్యము తయారై ఉంటుంది. ఇక్కడైతే వెంటనే సత్యయుగ రాజ్యము తయారైపోతుంది. ఇది ఎంత సులభమైన విషయము. స్వయం భగవంతుడే తప్పకుండా వచ్చి స్థాపన చేశారు. కృష్ణుని పేరు వేయడం వలన అంతా గడబిడ చేసేశారు. గీతలో ప్రాచీన రాజయోగము, జ్ఞానము ఉంది. అది ప్రాయ: లోపమైపోతుంది. ఆంగ్ల పదాలు బాగున్నాయి. బాబాకు ఆంగ్లము తెలియదని మీరంటారు. నేను ఎన్ని భాషలు మాట్లాడగలను? ముఖ్యమైనది హింది. కావున నేను హిందీలోనే మురళీ చెప్తాను. ఎవరి శరీరాన్ని ధారణ చేశానో అతనికి కూడా హిందీ మాత్రమే తెలుసు. కావున నేను ఇతని భాషలోనే మాటాడ్తాను. ఇతర ఏ భాషలోనూ నేను చదివించను. నేను ఫ్రెంచి మాట్లాడితే ఇతడెలా అర్థము చేసుకుంటాడు? ముఖ్యంగా ఇతడి(బ్రహ్మ) విషయము. మొదట ఇతడు అర్థము చేసుకోవాలి కదా. ఇతరుల ఎవరి శరీరాన్ని తీసుకోను.
పాటలో కూడా ఓ దూరపు బాటసారి, నన్ను తీసుకెళ్ళమని అంటారు ఎందుకంటే తండ్రిని గురించి, తండ్రి ఇల్లు గురించి ఎవ్వరికీ తెలియదు. ఊరికే అసత్యాలు చెప్తుంటారు. అనేక మనుష్యుల అనేక మతాలున్నాయి. అందువలన దారము చిక్కుపడిపోయింది. తండ్రి ఎలా కూర్చొని ఉన్నారో చూడండి. ఈ పాదాలు ఎవరివి?(శివబాబావి) అవి నావి(బ్రహ్మ) కదా, నేను అప్పుగా ఇచ్చాను. శివబాబా తాత్కాలికంగా ఉపయోగించుకుంటారు. నిజానికి ఈ పాదాలు నావి కదా. శివుని మందిరములో చరణాలు(పాదాలు) ఉంచరు. కృష్ణ మందిరములో పాదాలుంచుతారు. శివుడు అత్యంత ఉన్నతులు. వారికి పాదాలెక్కడివి? అయితే శివబాబా అప్పుగా తీసుకున్నారు. పాదాలైతే బ్రహ్మవే. మందిరాలలో నందిని చూపించారు. కాని నంది పై ఎలా ఊరేగుతారు? శివబాబా నంది పైకి ఎలా ఎక్కగలరు? సాలిగ్రామ ఆత్మలు మానవ శరీరములో సవారీ అవుతాయి. తండ్రి చెప్తున్నారు - ఇప్పుడు మీకు జ్ఞానము వినిపిస్తాను. అది ప్రాయ: లోపమైపోయింది. పిండిలో ఉప్పు ఉన్నంత మాత్రమే మిగిలి ఉంది. దానిని ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. నేనే వచ్చి దాని సారాన్ని అర్థము చేయిస్తాను. నేనే శ్రీమతమునిచ్చి సృష్టి చక్ర రహస్యాన్ని అర్థము చేయించాను. కాని వారు దేవీ దేవతలకు స్వదర్శన చక్రాన్ని చూపించారు. వారి వద్ద జ్ఞానము లేనే లేదు, ఇవన్నీ జ్ఞాన విషయాలు, ఆత్మకు సృష్టి చక్ర జ్ఞానము లభిస్తుంది. తన ద్వారా మాయ తల నరకబడ్తుంది. వారు అసురుల పై స్వదర్శన చక్రాన్ని ప్రయోగించినట్లు చూపించారు. ఈ స్వదర్శన చక్రము ద్వారా మాయ తల నరకబడ్తుంది. ఈ స్వదర్శన చక్రము ద్వారా మీరు మాయ పై విజయము పొందుతారు. ఎక్కడి మాట ఎక్కడికో తీసుకెళ్ళారు. మీలో కూడా ఏ ఒక్కరో ఈ విషయాలను ధారణ చేసి ఇతరులకు అర్థము చేయించగలరు. జ్ఞానము ఉన్నతమైనది. అందులో సమయము పడ్తుంది. చివర్లో మీలో జ్ఞాన-యోగ శక్తులుంటాయి. ఇది డ్రామాలో నిశ్చయింపబడింది. వారి బుద్ధి కూడా పరివర్తనౌతూ మెత్తబడ్తూ అదుపులోకి వస్తుంది. మీరు వాయుమండలాన్ని శుద్ధపరుస్తారు. ఇది ఎంతో గుప్తమైన జ్ఞానము, ఆజామిళుని వంటి పాపులను ఉద్ధరించారని వ్రాశారు, అయితే దానిని కూడా అర్థము చేసుకోరు. వారు జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని భావిస్తారు. సాగరములో లీనమైపోయిందని అంటారు. పంచ పాండవులు హిమాలయ పర్వతాలలో కరిగిపోయారని, ప్రళయం జరిగిందని అంటారు. ఒకవైపు వారు రాజయోగాన్ని నేర్చుకున్నారని అంటారు. తిరిగి ప్రళయము చూపించారు, మళ్లీ శ్రీ కృష్ణుడు బొటన వ్రేలును చప్పరిస్తూ రావి ఆకు పై వచ్చినట్లు చూపిస్తారు. దాని అర్థము కూడా వారికి తెలియదు. అతడు గర్భమహలులో ఉన్నాడు కదా. బొటన వ్రేలును చిన్న పిల్లలు చీకుతారు. ఎక్కడి మాట ఎక్కడికో తీసుకెళ్ళారు. మానవులు వారు విన్నదంతా సత్యము - సత్యము అని అంటూ ఉంటారు.
సత్యయుగము గురించి ఎవ్వరికీ తెలియదు. అసలే లేని వస్తువును అసత్యము అని అంటారు. ఉదాహరణానికి పరమాత్మకు నామ-రూపాలు లేవని అంటారు. ఇది అసత్యము. కాని వారిని పూజిస్తారు. కావున పరమాత్మ అత్యంత సూక్ష్మమైనవారు, అటువంటి సూక్ష్మమైన వస్తువు మరొకటి లేనే లేదు. పూర్తిగా తానొక బిందువు. అత్యంత సూక్ష్మమైనందునే ఎవ్వరికీ తెలియదు. ఆకాశాన్ని కూడా సూక్ష్మమని అంటారు, కాని అనంతంగా ఉంది. ఇక 5 తత్వాలున్నాయి. 5 తత్వాల శరీరములో ప్రవేశిస్తారు. ఎంతో సూక్ష్మమైనవారు. పూర్తిగా చిన్న బిందువు. నక్షత్రమెంతో చిన్నదిగా కనిపిస్తుంది. ఇచ్చట నక్షత్రమైన పరమపిత వచ్చి ప్రక్కన కూర్చున్నప్పుడే మాట్లాడగలరు. ఇవన్నీ ఎంతో సూక్ష్మమైన విషయాలు. మంద బుద్ధిగల వారు కొంచెము కూడా అర్థము చేసుకోలేరు. తండ్రి అత్యంత మంచి-మంచి విషయాలు అర్థము చేయిస్తున్నారు. డ్రామానుసారము కల్పక్రితము ఏ పాత్రను అభినయించారో దానిని తిరిగి అభినయిస్తారు. బాబా ప్రతి రోజు వచ్చి కొత్త కొత్త పాయింట్లు వినిపిస్తారు. కనుక కొత్త జ్ఞానము తెలియచేస్తారని పిల్లలు భావిస్తారు. కనుక జ్ఞానము కొత్తగా ఉంటుంది కదా. కావున ప్రతి రోజూ చదువుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా ప్రతి రోజూ రాకుంటే స్నేహితుల వద్దకు వెళ్ళి క్లాసులో ఈ రోజు ఏమి జరిగిందని అడుగుతారు కదా. ఇక్కడ కొంతమంది చదువే మానేస్తారు. ఈ అవినాశి జ్ఞానరత్నాల వారసత్వము మాకు వద్దు అని అంటారు. అరే! చదువు మానేస్తే మీ గతి ఏమౌతుంది? తండ్రి నుండి వారసత్వమేం తీసుకుంటారు? వారి అదృష్టములో లేదని అర్థము. ఇక్కడ స్థూలమైన ఆస్తి మాట కాదు. జ్ఞాన ఖజానా తండ్రి ద్వారా లభిస్తుంది. ఆ స్థూలమైన ఆస్తిపాస్తులన్నీ వినాశనమౌతాయి. దాని నషా ఎవ్వరూ ఉంచుకోలేరు. తండ్రి ద్వారానే వారసత్వము లభిస్తుంది. భలే మీ వద్ద కోట్ల ఆస్తి ఉండవచ్చు, కాని అది కూడా మట్టిలో కలిసిపోతుంది. ఈ మాటలన్నీ ఇప్పటివే, అందుకే కొంతమందిది మట్టిలో కలిసిపోతుంది, కొంతమందిది అగ్నిలో కాలిపోతుంది,...... ఇవన్నీ ఇప్పటి విషయాలే. ఇవి తర్వాత వాడుకలోకి వస్తాయి. ఇప్పుడు వినాశనము కాబోతుంది. వినాశనము తర్వాత మళ్లీ స్థాపన. ఇప్పుడు స్థాపన చేస్తున్నారు. అది మీ రాజధాని, మీరు ఇతరుల కొరకు చేయరు. మీరు చేసేదంతా మీ కొరకే. ఎవరైతే శ్రీమతమును అనుసరిస్తారో వారు అధిపతులుగా అవుతారు. మీరు నూతన విశ్వములో నూతన భారతదేశానికి అధిపతులుగా అవుతారు. నూతన విశ్వము అనగా సత్యయుగము. అందులో మీరు అధిపతులుగా ఉండేవారు. ఇప్పుడిది పాత యుగము. మళ్లీ నూతన ప్రపంచము కొరకు మీతో పురుషార్థము చేయిస్తారు. ఇవన్నీ అర్థము చేసుకునే ఎంతో మంచి-మంచి విషయాలు. ఆత్మ-పరమాత్మల జ్ఞానము, ఆత్మ స్వయము గురించి అనుభవముతో గ్రహించే జ్ఞానము(సెల్ఫ్ రియలైజేషన్). స్వయానికి తండ్రి ఎవరు? ఇవన్నీ నేను ఆత్మలైన మీకు నేర్పించేందుకు వస్తానని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు ఆ తండ్రి ద్వారా తండ్రి ఎవరో తెలుసుకున్నారు. మీరు నాకు అపురూపమైన పిల్లలు, కల్పము తర్వాత మళ్లీ వారసత్వము తీసుకునేందుకు వచ్చారని తండ్రి అర్థము చేయిస్తున్నారు. కావున పురుషార్థము చేయాలి కదా. లేకుంటే చాలా పశ్చాత్తాప పడవలసి వస్తుంది. చాలా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. నా పిల్లలుగా అయ్యి చెడు పనులు చేసే వారి విషయము అడగవలసిన పనే లేదు(చాలా దుర్గతి అనుభవిస్తారు). బాబాకు డ్రామాలో ఎంత పాత్ర ఉందో చూడండి. అంతా ఇచ్చేశారు. భవిష్య 21 జన్మలకు ప్రతి ఫలమునిస్తానని కూడా బాబా అంటారు. ఇంతకుముందు మీరు పరోక్షంగా ఇచ్చేవారు కనుక భవిష్య ఒక్క జన్మకు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు ప్రత్యక్షంగా ఇస్తున్నారు. కనుక భవిష్య 21 జన్మలకు ఇన్ష్యూర్ చేసేస్తాను. డైరక్టు(ప్రత్యక్షము)గా చేసేందుకు, పరోక్షంగా చేసేందుకు ఎంత బేధముంది! వారు ద్వాపర-కలియుగాల కోసం ఈశ్వరుని వద్ద భీమా చేస్తారు. మీరు సత్య-త్రేతా యుగాల కోసం భీమా చేస్తారు. డైరక్టు అయినందున 21జన్మలకు లభిస్తుంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల నంబరువారు పురుషార్థానుసారము ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. అవినాశి తండ్రి ద్వారా అవినాశి జ్ఞాన రత్నాల ఖజానాను తీసుకొని భాగ్యశాలురుగా అవ్వండి. నూతన జ్ఞానము, నూతన చదువును ప్రతి రోజూ చదవాలి. వాయుమండలాన్ని శుద్ధంగా చేసే సేవ చేయాలి.
2. భవిష్య 21 జన్మల కోసం మీకున్నదంతా భీమా చేయాలి. తండ్రి వారైన పిదప ఎలాంటి వికర్మలాచరించరాదు.
వరదానము :-
''జ్ఞానామృత వర్షము ద్వారా ముర్దే(శవము) నుండి మహాన్గా అయ్యే మరజీవా భవ''
ఇంతకుముందు చింతల చితి పై కాల్తూ ఉండేవారము. ఇప్పుడు తండ్రి జ్ఞానామృత వర్షాన్ని కురిపించి కాలిపోతూ ఉన్న చితి నుండి మరజీవాగా చేసేశారు. జీవము గలవారిగా చేసేశారు. తండ్రి మనకు అమృతాన్ని తాపించి అమరులుగా చేసేశారు. ఇంతకుముందు మరణించిన శవాల సమానంగా ఉండేవారము. ఇప్పుడు శవాల నుండి మహాన్గా అయ్యాము. ఇంతకుముందు భగవంతుడు మరణించిన వారిని బ్రతికిస్తారని అనేవారము. కాని ఎలా బ్రతికిస్తారో తెలిసేది కాదు. ఇప్పుడు తండ్రి మనలను కాలిపోతున్న చితి నుండి లేపి అమరులుగా చేశారనే సంతోషముంది.
స్లోగన్ :-
''ధర్మములో స్థితమై కర్మలు చేసేవారే ధర్మాత్మలు''