30-12-2018 అవ్యక్త బాప్‌దాదా ఓంశాంతి రివైజ్‌: 02-04-1984 మధువనము


''బిందువు మహత్వము''

ఈ రోజు భాగ్యవిధాత అయిన తండ్రి తన భాగ్యశాలి పిల్లలందరినీ కలుసుకునేందుకు వచ్చారు. భాగ్యవిధాత అయిన తండ్రి తన పిల్లలందరు వారి భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు అతి సహజమైన విధి తెలుపుతున్నారు. కేవలం బిందువు లెక్కాచారాన్ని తెలుసుకోండి చాలు. బిందువు లెక్కాచారము అన్నిటికంటే సులభము. బిందువు మహత్వాన్ని తెలుసుకున్నారంటే మహాత్మలుగా అవుతారు. ఇది అన్నిటికంటే సులభము. మహత్వశాలి అయిన బిందువుతో లెక్క అందరూ బాగా అర్థము చేసుకున్నారు కదా. బిందువు అని అంటూ ఉండాలి, బిందువుగా అవ్వాలి. బిందువుగా అయ్యి బిందువైన తండ్రిని స్మృతి చేయాలి. బిందువులుగా ఉండేవారు(పరంధామంలో), ఇప్పుడు బిందు స్థితిలో స్థితమై బిందువైన తండ్రి సమానంగా అయ్యి మిలనము చేయాలి. ఇది మిలనము చేసే యుగము. దీనిని ఎగిరేకళలోని యుగమని అంటారు. బ్రాహ్మణ జీవితము ఉండేదే కలుసుకునేందుకు మరియు ఉత్సవము జరుపుకునేందుకు. ఈ విధి ద్వారా సదా కర్మలు చేస్తూ కర్మబంధనాల నుండి ముక్తులై కర్మాతీత స్థితిని అనుభవం చేస్తారు. కర్మ బంధనములోకి రారు కాని సదా తండ్రితో సర్వ సంబంధాలలో ఉంటారు. కరావన్‌హార్‌ అయిన తండ్రి(చేయించే తండ్రి) మిమ్ములను నిమిత్తంగా చేసి చేయిస్తున్నారు. కనుక స్వయం సాక్షిగా అయిపోయారు. అందువలన ఈ సంబంధము స్మృతిలో ఉంటే అది బంధనముక్తులుగా చేసేస్తుంది. ఎక్కడైతే సంబంధము ద్వారా చేస్తారో అక్కడ బంధనముండదు. నేను చేశానని అనుకున్నారంటే సంబంధాన్ని మర్చిపోయి బంధనం తయారవుతుంది. సత్యయుగము బంధనముక్త, సర్వ సంబంధ యుక్త జీవన్ముక్త స్థితిని అనుభవం చేసే యుగము. కనుక సంబంధంలో ఉంటున్నారా లేక బంధనములోకి వస్తున్నారా? చెక్‌ చేసుకోండి. సంబంధంలో స్నేహం కారణంగా ప్రాప్తి ఉంది. బంధనములో పెనుగులాట(ఖీంచాతాన్‌) మరియు టెన్షన్‌ల కారణంగా దు:ఖము మరియు ఆందోళన ఉంటుంది. అందువలన తండ్రి బిందువుతో గల సహజ లెక్కాచారాన్ని నేర్పించినప్పుడు దేహ బంధనం కూడా సమాప్తమైపోయింది. ఇప్పుడు దేహము మీది కాదు, తండ్రికి ఇచ్చేశారు. కనుక అది తండ్రిదైపోయింది. ఇప్పుడు వ్యక్తిగతమైన 'నా శరీరము లేక నా దేహము' అనే మీ బంధనము సమాప్తమైపోయింది. ఇప్పుడింకా నా దేహము అంటారా, దాని పై మీకు అధికారముందా? ఇవ్వబడిన వస్తువు పై మీ అధికారమెలా ఉంటుంది? ఇచ్చేశారా లేక ఉంచుకున్నారా? 'నీది' అని అనడం, 'నాది' అని అనుకోవడం ఇలా అయితే లేదు కదా!

ఎప్పుడైతే 'నీది' అని అన్నారో 'నాది(మేరాపన్‌)' అనే బంధనం సమాప్తమైపోయింది. ఈ హద్దులోని 'నాది(మేరా)'యే మోహమనే దారము(నరము) అనండి, సంకెళ్లు అనండి, తాడు అని అనండి, ఇది బంధనంలో బంధిస్తుంది. అంతా మీదే అని(అన్నప్పుడు) ఈ సంబంధము జోడించారు. కనుక బంధనము సమాప్తమై సంబంధము తయారవుతుంది. ఏ విధమైన బంధమైనా, దేహంది కావచ్చు, స్వభావంది కావచ్చు, మానసిక ఝుకావ్‌ది(లొంగుబాటు) కావచ్చు...... ఈ బంధనము తండ్రితో సర్వ సంబంధాలను, సదా సంబంధాలను ఉంచుకోవడంలో బలహీనత ఉందని ఋజువు చేస్తుంది. చాలామంది పిల్లలు సదా సర్వ సంబంధాలలో బంధనముక్తులుగా ఉంటారు, ఇంకా చాలామంది పిల్లలు సమయ ప్రమాణంగా స్వార్థముతో సంబంధాన్ని జోడిస్తారు. అందువలన బ్రాహ్మణ జీవితంలోని అలౌకిక ఆత్మిక మజా పొందడం నుండి వంచితులుగా ఉండిపోతారు. స్వయం స్వయంతో సంతుష్టంగా ఉండరు. ఇతరుల ద్వారా సంతుష్టంగా ఉండేందుకు ఆశీర్వాదాలు తీసుకోలేరు. బ్రాహ్మణ జీవితము శ్రేష్ఠ సంబంధాల జీవితము. ఈ జీవితము తండ్రి మరియు సర్వ బ్రాహ్మణ పరివారము నుండి ఆశీర్వాదాలు తీసుకునే జీవితము. ఆశీర్వాదాలు అనగా శుభ భావనలు, శుభ కామనలు. బ్రాహ్మణులైన మీ జన్మ బాప్‌దాదా ఆశీర్వాదమనండి, వరదానమనండి - వీటి ఆధారముతోనే జరిగింది. మీరు భాగ్యశాలురైన శ్రేష్ఠమైన విశేష ఆత్మలు - ఇదే స్మృతి రూపీ ఆశీర్వాదము లేక వరదానము ద్వారా, శుభ భావన, శుభ కామనల ద్వారా బ్రాహ్మణులైన మీ కొత్త జీవనము, కొత్త జన్మ జరిగింది. సదా ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండాలి. ఇదే సంగమ యుగము విశేషత. కాని వీటన్నిటికి ఆధారము సర్వ శ్రేష్ఠమైన సంబంధము. సంబంధము 'నాది-నాది' అనే సంకెళ్లను, బంధనాలను సెకండులో సమాప్తం చేసేస్తుంది. సంబంధాల మొదటి స్వరూపము, అదే సహజమైన విషయము - తండ్రి కూడా బిందువే, నేను కూడా బిందువే అంతేకాక సర్వ ఆత్మలు కూడా బిందువులే కనుక ఇదంతా బిందువు లెక్కాచారమే కదా. ఈ బిందువులోనే జ్ఞాన సింధువు ఇమిడి ఉంది. ప్రపంచములోని వారి లెక్కలో కూడా బిందువు 10 ని 100 గా చేసేస్తుంది. వందను వెయ్యిగా చేసేస్తుంది. బిందువులను పెంచుతూ వెళ్లండి, సంఖ్యను పెంచుతూ వెళ్లండి. కనుక మహత్యము ఎవరిది? బిందువుదే. ఈ విధంగా బ్రాహ్మణ జీవితంలో సర్వ ప్రాప్తులకు ఆధారము బిందువే.

చదువు రాని వారు కూడా బిందువును సులభంగా అర్థము చేసుకోగలరు కదా! ఎవరు ఎంత బిజీగా ఉన్నా, ఆరోగ్యంగా లేకున్నా, బుద్ధి బలహీనంగా ఉన్నా, బిందువు లెక్కాచారాన్ని అందరూ తెలుసుకోగలరు. మాతలు కూడా లెక్కలో తెలివి గలవారిగా ఉంటారు కదా. కనుక బిందువు యొక్క లెక్కాచారము సదా గుర్తుండాలి. అచ్ఛా.

అన్ని స్థానాల నుండి తమ స్వీట్‌హోంలోకి వచ్చేశారు. బాప్‌దాదా కూడా తమ భాగ్యాన్ని తయారు చేసుకున్నందుకు పిల్లలందరికి అభినందనలు తెలుపుతున్నారు. మీ ఇంటికి వచ్చేశారు. ఇది మీ ఇల్లే, దాత ఇల్లు. మీ ఇల్లు ఆత్మ మరియు శరీరము రెండిటికి విశ్రాంతిని, సుఖాన్ని ఇచ్చే ఇల్లు. సుఖము లభిస్తోంది కదా. డబల్‌ ప్రాప్తి ఉంది. ఆరాం(సుఖము) కూడా లభిస్తుంది, రాముడు కూడా లభిస్తాడు కనుక డబల్‌ ప్రాప్తి అయ్యింది కదా! తండ్రి ఇంటికి పిల్లలే అలంకారము. బాప్‌దాదా ఇంటికి శృంగారమైన పిల్లలను చూస్తున్నారు. అచ్ఛా.

సదా సర్వ సంబంధాల ద్వారా బంధనముక్తులు, కర్మాతీత స్థితిని అనుభవం చేసేవారు, సదా బిందువు మహత్యాన్ని తెలుసుకొని మహాన్‌గా అయ్యేవారు, సదా సర్వ ఆత్మల ద్వారా సంతుష్టత యొక్క శుభ భావనలు, శుభ కామనల ఆశీర్వాదాలు తీసుకునేవారు, అందరికి ఇటువంటి ఆశీర్వాదాలు ఇచ్చేవారు, సదా స్వయాన్ని సాక్షిగా భావించి నిమిత్త భావంతో కర్మలు చేసేవారు - ఇటువంటి సదా భాగ్యశాలి ఆత్మలకు భాగ్యవిధాత అయిన తండ్రి యాద్‌ప్యార్‌ ఔర్‌ నమస్తే.

దాదీలతో - సమయం చాలా వేగంగా సాగిపోతూ ఉంది. ఎలాగైతే సమయం తీవ్ర వేగంతో వెళ్లిపోతూ ఉందో అలా సర్వ బ్రాహ్మణులు తీవ్ర వేగంతో ఎగురుతూ ఉంటారు. ఇంత తేలికగా డబల్‌లైట్‌గా అయ్యారా? ఇప్పుడు విశేషంగా ఎగిరించే సేవ చేయాలి(ఉంది). ఇలా ఎగిరిస్తారా? ఏ విధి ద్వారా అందరినీ ఎగిరించాలి? క్లాసు వింటూ వింటూ క్లాసు చేయించేవారిగా(క్లాసు చేసేవారిగా) అయ్యారు. ఏ విషయం మీరు ప్రారంభించినా అంతకు ముందే ఆ విషయానికి సంబంధించిన పాయింట్లు అందరి వద్ద ఉంటాయి. కనుక ఏ విధి ద్వారా ఎగిరించాలి, అందుకు ప్లాను తయారుచేశారా? ఇప్పుడు తేలికగా చేసే విధి కావాలి. ఈ బరువే క్రిందకు, పైకి తీసుకొస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బరువు ఉంది. స్వంత సంస్కారాల బరువు కావచ్చు, సంఘటనకు సంబంధించిన బరువు కావచ్చు......... ఏ బరువైనా ఎగురనివ్వదు. ఎగరనేమో ఎగురుతారు కాని సదా ఎగురరు. ఇప్పుడు ఎప్పుడైతే సర్వ బ్రాహ్మణాత్మలు ఎగురుతారో అప్పుడు ఇతర ఆత్మలను ఎగిరించి తండ్రి వద్దకు చేర్చగలరు. ఇప్పుడు ఎగిరి, ఎగిరించుట తప్ప వేరే విధి ఏదీ లేదు. ఎరిగే వేగమే విధి. పని ఎంత ఉంది? సమయమెంత ఉంది?

ఇప్పుడు మొదట కనీసం 9 లక్షల మంది బ్రాహ్మణులైతే కావాలి. నిజానికి సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాని మొత్తం విశ్వము పై రాజ్యము చేస్తారు కనుక కనీసం 9 లక్షల మంది అయితే ఉండాలి. సమయానుసారము శ్రేష్ఠమైన విధి కావాలి. ఎగిరించే విధియే శ్రేష్ఠమైన విధి. అందుకు ప్లాను తయారు చేయండి. చిన్న చిన్న సమూహాలను తయారు చేయండి. అవ్యక్త పాత్ర ప్రారంభమై కూడా ఎన్ని సంవత్సరాలయ్యింది! సాకార పాలన, అవ్యక్త పాలన జరుగుతూ ఎంత సమయం గడిచిపోయింది. ఇప్పుడు ఏదైనా కొంత నవీనత చేయాలి కదా. ప్లాను తయారు చేయండి. ఇప్పుడు ఎగిరి క్రిందికి వచ్చే చక్రమునైతే పూర్తి చెయ్యాలి. 84 జన్మలు, 84 జన్మల చక్రము మహిమ చేయబడింది. కనుక 84 జన్మలలో తిరిగి ఎప్పుడైతే ఈ చక్రము పూర్తి అవుతుందో అప్పుడు స్వదర్శన చక్రము ఆత్మలను దూరం నుండి సమీపానికి తీసుకొస్తుంది. స్మృతిచిహ్నంగా ఏం చూపిస్తారు? ఒక స్థానములో కూర్చుని చక్రాన్ని పంపించారు, ఆ స్వదర్శన చక్రమే స్వయంగా ఆత్మలను సమీపంగా తీసుకొచ్చినట్లు చూపిస్తారు. స్వయం వారంతకు వారే వెళ్లరు. చక్రము నడిపిస్తుంది. కనుక ముందు ఈ చక్రము పూర్తి అవ్వాలి. అప్పుడు స్వదర్శన చక్రము తిరగాలి. కనుక ఇప్పుడు 84 లో ఈ విధిని అనుసరించండి. తద్వారా అన్ని హద్దు చక్రాలు సమాప్తమౌతాయి. ఇలాగే అనుకున్నారు కదా. అచ్ఛా.

టీచర్లతో - టీచర్లంటేనే ఎగిరేకళలోని వారు. నిమిత్తంగా అవ్వడమే ఎగిరేకళకు సాధనము. కనుక నిమిత్తంగా అయ్యారంటే డ్రామానుసారము ఎగిరేకళకు సాధనము లభించింది. మీరు ఇదే విధి ద్వారా సదా సిద్ధిని పొందే శ్రేష్ఠ ఆత్మలు. నిమిత్తంగా అవ్వడమే లిఫ్ట్‌ వంటిది. కనుక లిఫ్ట్‌ ద్వారా సెకండులో చేరుకునే ఎగిరేకళ వారుగా అయ్యారు. ఎక్కేకళలోని వారు కాదు, కదిలేవారు కాదు కాని కదులుట నుండి రక్షించేవారు(కదిలేవారిని రక్షించేవారు). అగ్ని సెగలోకి వచ్చేవారు కాదు. అగ్నిని ఆర్పేసేవారు. కనుక నిమిత్తమయ్యే విధి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకోండి. టీచర్లకు అర్థమే నిమిత్త భావము. ఈ నిమిత్త భావమే సర్వ ఫలాల ప్రాప్తిని స్వతహాగా చేయిస్తుంది. అచ్ఛా.

అవ్యక్త మహావాక్యాలు - కర్మ బంధనముక్త్‌గా, కర్మాతీతంగా, విదేహీగా అవ్వండి

విదేహి స్థితిని మరియు కర్మాతీత స్థితిని అనుభవం చేసేందుకు హద్దులోని నాది-నాది అనే దేహాభిమానము నుండి ముక్తులుగా అవ్వండి. లౌకికము మరియు అలౌకికములో కర్మ మరియు సంబంధము రెండిటిలో స్వార్థ భావము నుండి ముక్తులుగా అవ్వండి. గత జన్మల కర్మల లెక్కాచారము నుండి లేక వర్తమాన సమయంలోని పురుషార్థములో బలహీనత కారణంగా ఏవైనా వ్యర్థ స్వభావ సంస్కారాలకు వశము కాకుండా ముక్తులుగా అవ్వండి. ఒకవేళ ఏదైనా సేవ, సంఘటన, ప్రకృతి ద్వారా వచ్చు పరిస్థితులు, స్వ స్థితిని లేక శ్రేష్ఠమైన స్థితిని విచలితం చేసిందంటే - అది కూడా బంధనముక్త స్థితి కాదు. ఈ బంధనము నుండి కూడా ముక్తులుగా అవ్వండి. వ్యాధులు రావడం, ఇది భావి(తప్పక జరిగేదే) కాని స్థితి కదిలిపోవడం - ఇది బంధనయుక్తుల గుర్తు. స్వ చింతన, జ్ఞాన చింతన, శుభ చింతకులుగా అవ్వాలనే చింతన మారి శారీరిక వ్యాధిని గురించిన చింతన నడవడం నుండి ముక్తులుగా అవ్వండి - దీనినే కర్మాతీత స్థితి అని అంటారు.

కర్మయోగులుగా అయ్యి కర్మ బంధనము నుండి సదా అతీతంగా, తండ్రికి ప్రియంగా అవ్వండి. ఇదే కర్మాతీత విదేహీ స్థితి. కర్మాతీతమంటే కర్మ చేయకుండా అతీతమైపొమ్మని కాదు. కర్మతో అతీతం కాదు, కర్మబంధనములో చిక్కుకోవడం నుండి అతీతమవ్వండి. ఎంత పెద్ద కార్యమైనా అది పని చేస్తున్నట్లు కాక ఆట ఆడుతున్నట్లనిపించాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినా, లెక్కాచారము చుక్తా చేసుకునే ఆత్మ ఎదిరించేందుకు వస్తున్నా, శారీరిక కర్మభోగము ఎదిరించేందుకు వస్తున్నా, హద్దు కామనల నుండి ముక్తముగా ఉండడమే విదేహి స్థితి. ఎంతవరకు ఈ దేహముంటుందో, కర్మేంద్రియాలతో ఈ కర్మక్షేత్రం పై పాత్రను అభినయిస్తూ ఉంటారో అంతవరకు కర్మలు చేయకుండా ఒక సెకండు కూడా ఉండలేరు. కాని కర్మలు చేస్తూ కర్మబంధనాల నుండి అతీతంగా ఉండడమే కర్మాతీత విదేహి స్థితి. కనుక కర్మేంద్రియాల ద్వారా కర్మ సంబంధములోకి రావాలి. కర్మ బంధనములో బంధింపబడరాదు. కర్మల ద్వారా వచ్చే వినాశి ఫలము కావాలనే కోరికకు వశీభూతులుగా అవ్వరాదు. కర్మాతీతమనగా కర్మలకు వశమయ్యేవారు కాదు. అధికారులై, అథారిటీగా అయ్యి కర్మేంద్రియాల సంబంధములోకి రావాలి. వినాశి కామనలతో అతీతమై కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయిస్తూ ఉండాలి. చేయించేవారిగా అయ్యి కర్మలు చేయించడాన్ని కర్మ సంబంధములోకి రావడం అని అంటారు. కర్మాతీత ఆత్మ సంబంధములోకి వస్తుంది. బంధనములోకి రాదు.

కర్మాతీతమనగా దేహము, దేహ సంబంధాలు, దేహ పదార్థాలు, లౌకిక అలౌకిక - రెండు సంబంధాలలో బంధనము నుండి అతీతము అనగా న్యారా. భలే అనడంలో సంబంధమనే శబ్ధము వస్తుంది. దేహ సంబంధము, దేహ సంబంధీకుల సంబంధము కాని దేహములో గాని, సంబంధములో గాని అధీనత ఉంటే సంబంధము కూడా బంధనంగా అయిపోతుంది. కర్మాతీత అవస్థలో కర్మ సంబంధము మరియు కర్మబంధన రహస్యము తెలిసినందున సదా ప్రతి విషయంలో రాజీగా (సంతోషంగా) ఉంటారు, ఎప్పుడూ నారాజ్‌గా(అసంతోషంగా) అవ్వరు. వారు తమ గత కర్మల లెక్కాచారాల బంధనము నుండి కూడా ముక్తులుగా అవుతారు. గత కర్మల లెక్కాచారాల ఫల స్వరూపంగా వచ్చిన శారీరిక వ్యాధులైనా, మానసిక సంస్కారాలు ఇతర ఆత్మల సంస్కారాలతో దెబ్బలు తిన్నా, కర్మాతీతులుగా ఉంటారు. కర్మభోగానికి వశమవ్వ యజమానిగా అయ్యి చుక్త చేయిస్తారు. కర్మయోగులుగా అయ్యి కర్మభోగాన్ని చుక్త చేసుకోవడం - కర్మాతీతులుగా అయినందుకు గుర్తు. యోగము ద్వారా కర్మభోగాన్ని చిరునవ్వుతో శూలాన్ని ముల్లుగా చేసి కర్మభోగాన్ని సమాప్తి చేయండి. కర్మయోగ స్థితి ద్వారా కర్మభోగాన్ని పరివర్తన చేయడమే కర్మాతీత స్థితి. వ్యర్థ సంకల్పాలే, కర్మ బంధనాల సూక్ష్మ దారాలు. కర్మాతీత ఆత్మ చెడులో కూడా మంచినే అనుభవం చేస్తుంది. ఏది జరుగుతుందో, అది మంచిదే అని వారు చెప్తారు. నేనూ మంచిదానినే, తండ్రి కూడా మంచి వాడే, డ్రామా కూడా మంచిదే అను సంకల్పము బంధనాలను తెంచే కత్తెర చేసే పని చేస్తుంది. బంధనాలు తెగిపోతే కర్మాతీతులుగా అవుతారు.

విదేహి స్థితిని అనుభవం చేసేందుకు ఇచ్ఛామాత్రం అవిద్యాగా అవ్వండి. ఇలా హద్దు కోరికల నుండి ముక్తమైన ఆత్మలు అందరి కోరికలను పూర్తి చేసే తండ్రి సమానం కామధేనువుగా ఉంటారు. ఎలాగైతే తండ్రి భండారాలు, సర్వ ఖజానాలు నిండుగా ఉన్నాయో, అప్రాప్తికి నామ-రూపాలు లేవో, అలా తండ్రి సమానం సదా మరియు సర్వ ఖజానాలతో సంపన్నంగా అవ్వండి. సృష్టి చక్రములో పాత్రను అభినయిస్తూ అనేక దు:ఖాల చక్రాల నుండి ముక్తులుగా ఉండాలి. ఇదే జీవన్ముక్త స్థితి. ఇటువంటి స్థితిని అనుభవం చేసేందుకు అధికారులుగా అయ్యి, యజమానులుగా అయ్యి సర్వ కర్మేంద్రియాలతో కర్మలు చేయించేవారిగా అవ్వండి. కర్మలోకి రండి, మళ్లీ కర్మ పూర్తి అవుతూనే న్యారాగా అవ్వండి. దీనినే విదేహి స్థితిని అభ్యసించడమని అంటారు.

వరదానము :-

'''నాది' అనే దానిని 'నీది' లోకి పరివర్తన చేసి ఎగిరేకళను అనుభవం చేసే డబల్‌లైట్‌ భవ ''

ఈ వినాశి శరీరము మరియు ధనము, పాత మనసు నావి కావు, అన్నీ తండ్రికి ఇచ్చేశాను. మొదట 'అంతా మీదే' అని సంకల్పము చేశారు. ఇందులో తండ్రికి ఎలాంటి లాభమూ లేదు. మీకే లాభముంది. ఎందుకంటే 'నాది' అని అనడం వలన చిక్కుకుపోతారు. 'నీది' అని అనడం వలన అతీతంగా(న్యారాగా) అయిపోతారు. 'నాది' అని అన్నందున బరువు మోసేవారిగా అయిపోతారు. 'నీది' అని అనడం వలన డబల్‌లైట్‌గా ఉండే ట్రస్టీలుగా అయిపోతారు. ఎంతవరకు తేలికగా అవ్వరో, అంతవరకు ఉన్నతమైన స్థితి వరకు చేరుకోలేరు. తేలికగా ఉండువారే ఎగిరేకళ ద్వారా ఆనందాన్ని అనుభవం చేస్తారు. తేలికగా ఉండుటలోనే మజా ఉంది.

స్లోగన్‌ :-

''ఎవరి పై ఏ వ్యక్తి గాని, ప్రకృతి గాని తమ ప్రభావాన్ని వేయలేవో వారే శక్తిశాలి ఆత్మలు''