03-12-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - జ్ఞాన - యోగాలతో పాటు మీ నడవడిక కూడా చాలా బాగుండాలి. మీరు భూతాలను పారదోలేవారు కనుక మీలో ఏ భూతమూ ఉండరాదు ''
ప్రశ్న :-
సుపుత్ర పిల్లలలో ఏ నషా స్థిరంగా ఉండగలదు ?
జవాబు :-
''బాబా ద్వారా మేము ద్వికిరీటధారులుగా, విశ్వాధికారులుగా అయ్యే వారసత్వాన్ని తీసుకుంటున్నాము'' - ఈ నషా సుపుత్ర పిల్లలకే స్థిరంగా ఉండగలదు. కాని కామ క్రోధాదుల భూతము లోపల ఉంటే ఈ నషా ఉండదు. అటువంటి పిల్లలు తండ్రి పై గౌరవాన్ని కూడా ఉంచలేరు. అందువలన మొదట భూతాలను పారద్రోలాలి. మీ స్థితిని శక్తిశాలిగా చేసుకోవాలి.
పాట :-
నా మనసు అనే ద్వారం వద్దకు ఎవరు వచ్చారు,.........(కౌన్ ఆయా మేరే మన్ కే ద్వారే,..........) 
ఓంశాంతి.
పిల్లలైన మీరు తప్ప ఈ పాట అర్థాన్ని ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. పిల్లలు కూడా నెంబరువారు పురుషార్థానుసారముగా అర్థము చేసుకున్నారు. ఎందుకంటే పరమపిత పరమాత్మునికి స్థూల లేక సూక్ష్మ చిత్రము లేదు. సూక్ష్మమైనవారు దేవతలు. వారు కూడా కేవలం ముగ్గురే ఉన్నారు. వారి కంటే అతిసూక్ష్మమైన వారు పరమాత్మ. ఇప్పుడు ''ఓ పరమపిత పరమాత్మ!'' అని ఎవరు అంటున్నారు? - ఆత్మ. పరమపిత పరమాత్మను పరమ - ఆత్మ అని అంటారు. లౌకిక తండ్రిని ఆత్మ పరమాత్మ అని పిలువజాలదు. పారలౌకిక పరమపిత పరమాత్మను స్మృతి చేసినప్పుడు వారిని దేహీ-అభిమానులని అంటారు. దేహాభిమానంలో ఉంటే దేహముతో సంబంధముండే తండ్రి గుర్తుకు వస్తారు. కాని వీరు ఆత్మతో సంబంధము కలిగిన తండ్రి. వారిప్పుడు వచ్చి ఉన్నారు. ఆత్మ బుద్ధితో గ్రహిస్తుంది. బుద్ధి ఆత్మలోనే ఉంది కదా. కావున పరమపిత పరమాత్మ తప్పకుండా పారలౌకిక తండ్రియే అవుతారు. వారిని ఈశ్వరుడు అని అంటారు. ఇప్పుడు బాబా ఈ ప్రశ్నావళిని తయారు చేయించారు. దీని పై అర్థం చేయించడం పిల్లలైన మీకు సులభంగా ఉంటుంది. ఎలా ఫారమ్ (ప్రశ్నావళి) నింపిస్తారో, అలా ఈ ప్రశ్నలను కూడా అడగవచ్చు. ఎవరైతే అడుగుతారో వారు తప్పకుండా నాలెడ్జ్ఫుల్ కనుక వారు తప్పకుండా టీచరే అవుతారు. ఆత్మయే శరీరాన్ని ధరిస్తుంది. కర్మేంద్రియాలతో అర్థము చేయిస్తుంది. కావున పిల్లలు సహజంగా అర్థము చేయించేందుకు ఈ ప్రశ్నావళి తయారు చేయబడింది. కాని జ్ఞానాన్ని వినిపించే పిల్లల స్థితి కూడా చాలా బాగుండాలి. భలే ఎవరిలోనైనా జ్ఞానము చాలా మంచిగా ఉంది, యోగము కూడా బాగుంది, కాని దానితో పాటు నడవడిక కూడా బాగుండాలి. ఎవరిలో అయితే కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారాలనే భూతాలుండవో, వారి నడవడిక దైవీ నడవడికగా ఉంటుంది. ఇవి చాలా పెద్ద పెద్ద భూతాలు. పిల్లలైన మీలో ఎలాంటి భూతాలు ఉండరాదు. మనము భూతాలను పారద్రోలే వారము. గాలిలో తిరిగే అశుద్ధ ఆత్మలను కూడా భూతాలు అని అంటారు. ఆ భూతాలను తొలగించేవారు కూడా ఉస్తాదులుగా ఉంటారు. కాని ఈ పంచ వికార రూపీ భూతాలను పరమపిత పరమాత్మ తప్ప ఇతరులెవ్వరూ తొలగించలేరు. అందరి భూతాలను తొలగించేవారు ఒక్కరే. సర్వులకు సద్గతినిచ్చేవారు ఒక్కరే. రావణుని నుండి విముక్తి కలిగించువారు కూడా ఒక్కరే. రావణుడు చాలా పెద్ద భూతము. వీరిలో క్రోధ భూతముంది. మోహము లేక అశుద్ధ అహంకార భూతముందని అంటారు. కాని అందరినీ ఈ భూతాల నుండి విడిపించే విముక్తిదాత, పరమపిత పరమాత్మ ఒక్కరే. ఈ సమయములో అత్యంత శక్తివంతులు ఈ క్రైస్తవులని మీకు తెలుసు. వారి ఆంగ్లభాష పదాలు కూడా చాలా బాగున్నాయి. ఏ రాజులు ఉంటారో, వారు తమ భాషనే నడిపిస్తారు. దేవతల భాష గురించి ఎవ్వరికీ తెలియదు. (యజ్ఞ ప్రారంభములో చాలామంది ధ్యానము ద్వారా స్వర్గములోకి వెళ్ళి అక్కడి విశేషాలను తెలుసుకొని వచ్చి చెప్పేవారు.) ఇంతకు ముందు పిల్లలు ధ్యానములో అంతా తెలుసుకొని వచ్చి తెలిపించేవారు. 2 - 4 రోజులు ధ్యానములోనే ఉండిపోయేవారు. కాని ఇప్పుడు అక్కడ భాషను చూచి వచ్చి వినిపించేందుకు మంచి బుద్ధివంతులైన సందేశీలు కావాలి.
పిల్లలైన మీరు అందరికీ భారతదేశ కథను వినిపించండి. భారతదేశము సతోప్రధానముగా ఉండేది. ఇప్పుడు తమోప్రధానంగా, పూజ్య స్థితి నుండి పూజారిగా అయిపోయింది. భారతదేశములో దేవతల చిత్రాలు చాలా ఉన్నాయి. అంధశ్రద్ధతో పూజిస్తారు. వారి జీవిత చరిత్ర(బయోగ్రఫీ) గురించి తెలియనే తెలియదు. పాత్రధారులకు డ్రామాలోని దర్శకుడు మొదలైన వారి గురించి తెలిసి ఉండాలి కదా. అందుకే ప్రశ్నావళి తయారు చేయబడింది. పోప్(క్రైస్తవ ధర్మపెద్ద) గారికి కూడా వ్రాయాలి. మీరు మీ శిష్యులకు ఈ వినాశీ వస్తువుల తయారీని నిలుపమని వ్రాస్తున్నారు. కాని వారు మీ మాటలను ఎందుకు ఒప్పుకోవడం లేదు? మీరు అందరికీ గురువు కదా. మీకు చాలా మహిమ జరుగుతుంది. అయినా వీరు మీ మాటలు ఎందుకు అంగీకరించడం లేదు? మీకు కారణము తెలియకుంటే మేము తెలియజేస్తాము. వీరు మీ మతానుసారము నడవడం లేదు. వాటిని ఈశ్వరీయ మతానుసారము తయారుచేస్తున్నారు. ఆడమ్ - ఈవ్ ద్వారా స్వర్గ స్థాపన జరుగుతోంది. భగవంతుడు జ్ఞానసాగరులు. వారు గుప్తముగా ఉన్నారు. వారి సైన్యము తప్పకుండా వారి మతము అనుసారముగానే నడుస్తూ ఉంటుంది - ఇలా ఇలా తెలిపించాలి. కాని పిల్లలు ఇంకా అంత విశాల బుద్ధి గలవారిగా అవ్వలేదు. అందుకే స్క్రూను టైట్(బిగువు) చేయవలసి ఉంటుంది. ఏ విధంగా ఇంజను చల్లబడినప్పుడు దానిని వేగవంతంగా చేసేందుకు అందులో బొగ్గులు వేస్తారో, అలా ఇది కూడా జ్ఞానమనే బొగ్గు. పరమపిత పరమాత్మ అందరికంటే పెద్దవారు. అందరూ వారికి సలామ్(నమస్కారం) చేసేందుకు వస్తారు. పోప్ను కూడా అందరూ శక్తిశాలిగా భావిస్తారు. పోప్కు ఎంత గౌరవమిస్తారు! అంత గౌరవం ఇతరులెవ్వరికీ ఇవ్వరు. వారికి తండ్రిని గురించి తెలియనే తెలియదు. వారు గుప్తంగా ఉన్నారు. పిల్లలకు మాత్రమే వారిని గురించి తెలుసు, వారికి గౌరవాన్ని కూడా ఇస్తారు. కాని మాయ అటువంటి తండ్రి పై కూడా గౌరవముంచకుండా పిల్లలను తయారు చేస్తుంది. బాబా విశ్వాధిపతులుగా చేస్తారు. కాని వెలుపలికి వెళ్ళగానే ఈ నషా ఎగిరిపోతుంది. మేము బాబా నుండి ద్వికిరీటధారులుగా అయ్యే వారసత్వము ఎందుకు తీసుకోము...... ఇది సుపుత్రులైన పిల్లల నషా. కాని చాలామంది పిల్లలలో కామము, క్రోధము, లోభములనే భూతాలు వచ్చేస్తాయి. బాబా మురళీని నడిపించే సమయములో మాలో ఇంకా కామ సంబంధమైన హల్కా(తేలికైన) నషా ఉందని గ్రహిస్తారు. కాని ఏ ఒక్కరైనా(భార్య, భర్త) శక్తిశాలిగా ఉంటే ఏమీ జరగజాలదు. కొన్ని చోట్ల పత్ని శక్తిశాలిగా ఉంటే, కొన్ని చోట్ల పురుషుడు శక్తిశాలిగా ఉంటాడు. బాబా వద్దకు అన్నిరకాల సమాచారాలు వస్తుంటాయి. కొందరు సత్యమైన హృదయంతో వ్రాస్తారు. లోపల-వెలుపలా చాలా స్వచ్ఛత ఉండాలి. కొంతమంది వెలుపలికి మంచిగా, లోపల అసత్యంగా ఉంటారు. అనేకమందికి తుఫానులు వస్తాయి. బాబాకు ఇలా వ్రాస్తారు - బాబా, ఈ రోజు నా వద్దకు కామ వికారపు తుఫాను వచ్చింది, కాని రక్షింపబడ్డాను. వ్రాయకపోతే ఒకటేమో శిక్ష పడుతుంది, రెండవది అలవాటు పెరుగుతూ ఉంటుంది. చివరికి క్రింద పడిపోతారు. బాబాకు పిల్లల పై ఆశలుంటాయి కదా. కొద్దిగా గ్రహచారముంటే అది కూడా దిగిపోతుంది. కొందరు ఈ రోజు బాగా నడుస్తుంటారు. రేపు మూర్ఛితులైపోతారు లేక గొంతు ఎండిపోతుంది. అంటే తప్పకుండా ఏదో ఆజ్ఞను ఉల్లంఘించి ఉంటారు. ప్రతి విషయములో సత్యతతో మెలిగినప్పుడే సత్య ఖండానికి అధికారులుగా అవుతారు. అసత్యాన్ని చెప్తే వ్యాధి పెరుగుతూ నష్టాన్ని కలుగజేస్తుంది.
పిల్లలు చాలా యుక్తితో ప్రశ్నావళిని తయారు చేయాలి - పరమపిత పరమాత్మతో సంబంధమేమిటి? వారు తండ్రి అయినప్పుడు వారు సర్వవ్యాపి ఎలా అవుతారు? వారు సర్వుల సద్గతిదాత, పతితపావనుడు. గీతా భగవంతుడైనందున తప్పకుండా ఎప్పుడో జ్ఞానమిచ్చి ఉంటారు. వారి జీవన చరిత్ర గురించి తెలుసునా? తెలియకపోతే ఆస్తి ఎలా లభిస్తుంది? తండ్రి నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది కదా. ఇక మరొక ప్రశ్నను ఇలా అడగాలి - ప్రజాపిత బ్రహ్మ మరియు వారి ముఖవంశావళి గురించి తెలుసునా? సరస్వతి జ్ఞాన జ్ఞానేశ్వరి. వారిని చదువుల తల్లి(గాడెస్ ఆఫ్ నాలెడ్జ్) అని అంటారు. జగదంబ అంటే వారికి పిల్లలు కూడా ఉంటారు కదా. తండ్రి కూడా ఉంటారు కదా. వారే జ్ఞానము ఇచ్చేవారు. ఇప్పుడు ఈ ప్రజాపిత మరియు జగదంబలు ఎవరు? వారిని ధనలక్ష్మి అని కూడా అంటారు. అప్పుడు(సత్యయుగములో) వారు జ్ఞాన-జ్ఞానేశ్వరి కాదు, ఈ బ్రహ్మ-సరస్వతులు రాజ రాజేశ్వరులుగా అవుతారు. వారి పిల్లలు కూడా స్వర్గాధికారులుగా అవుతూ ఉండవచ్చు. ఇప్పుడిది సంగమ యుగము, కుంభము. ఆ కుంభమేళాలో ఏమి జరుగుతుందో చూడండి. భక్తిమార్గములోని అర్థానికి, దీనికి రాత్రికి - పగలుకు ఉన్నంత వ్యతాసముంది. అది నీటి నదుల మరియు సాగరపు మేళా. ఇక్కడ జ్ఞానసాగరుని నుండి వెలువడే మానవ గంగల మేళా. పతితులను పావనంగా చేసేవారెవరు? అనే ప్రశ్నను అడగడం జరుగుతుంది. ఇవన్నీ తెలుసుకోవలసిన విషయాలు కదా! అందుకే అడుగుతారు. ఈ తల్లిదండ్రుల జ్ఞానము ద్వారా మీరు రాజరాజేశ్వరులుగా అవ్వగలరు. ఈశ్వరుని సర్వవ్యాపి అంటే నోరు తీపి అవుతుందా? ఇప్పుడు భక్తికి ఫలంగా జ్ఞానము లభిస్తుంది. భగవంతుడు చదివిస్తున్నారంటే ఎదురుదెబ్బలు తినడం సమాప్తమౌతుంది. బాబా చెప్తున్నారు - పిల్లలారా! అశరీరి భవ! ఆత్మకు జ్ఞానము లభించింది. ఇప్పుడు ఆత్మ చెప్తుంది - మేము బాబా వద్దకు వాపస్ వెళ్లాలి. తర్వాత ప్రాలబ్ధము లభిస్తుంది. రాజధాని స్థాపన జరుగుతుంది. ఇవన్నీ ఎంతగా అర్థం చేసుకోవలసిన విషయాలు! ఈ ప్రశ్నావళి చాలా బాగుంది. ఇది అందరి జేబులలోనూ ఉండాలి. సర్వీసు యోగ్యమైన పిల్లలే ఈ విషయాలను గురించి ఆలోచిస్తారు. పిల్లల కొరకు తండ్రి ఎంత శ్రమ చేయవలసి పడ్తుంది. బాబా చెప్తున్నారు - పిల్లలారా, మీ భవిష్యత్తును శ్రేష్ఠంగా చేసుకోండి. లేకుంటే కల్ప-కల్పము పదవి తక్కువైపోతుంది. ఎలాగైతే ఈ బాబా మహారాజుగా - మహారాణిగా అవుతారో అలా పిల్లలు కూడా అవ్వాలి. కాని మీ పై మీకు నిశ్చయముండాలి. రాజులో కూడా చాలా శక్తి ఉంటుంది. అక్కడ అంతా సుఖమే సుఖముంటుంది. ఇంకా ఈశ్వరార్థము దాన-పుణ్యాలు చేస్తే రాజులుగా అవుతారు. రాజు ఆజ్ఞానుసారము ప్రజలంతా నడుస్తారు. ఈ సమయములో భారతవాసులకు రాజు ఎవ్వరూ లేరు. పంచాయితీ రాజ్యముంది. కనుక ఎంత బలహీనంగా అయ్యారు!
చాలామంది పిల్లలకు అనేక తుఫానులు వస్తాయి. కాని సమాచారమివ్వరని బాబాకు తెలుసు. ఇటువంటి తుఫానులు వస్తున్నాయి. మేమేమి చెయ్యాలో మీరు సలహానివ్వడంని బాబాకు వ్రాయాలి. పరిస్థితి చూసి బాబా సలహానిస్తారు. కాని బాబాకు వ్రాయరు. జతలో ఉన్న వారు కూడా మా సహచరుని పరిస్థితి ఇలా ఉందని సమాచారమివ్వరు. బాబాకు సమాచారమివ్వాలి కదా. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
రాత్రి క్లాసు (11-01-1969) :-
అనంతమైన తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు, తమవారిగా చేసుకుంటారు, రాజ్య పదవి కొరకు శిక్షణనిస్తారు. పవిత్రంగా కూడా తయారు చేస్తారు. తండ్రి చాలా సహజ రీతిగా తన పరిచయాన్ని వారసత్వపు పరిచయాన్ని అర్థము చేయిస్తారు. తమకు తాము అర్థం చేసుకోలేరు. బేహద్ తండ్రి ద్వారా తప్పకుండా బేహద్ వారసత్వము లభిస్తుంది - ఈ విషయం కూడా మంచి బుద్ధివంతులే అర్థము చేసుకుంటారు. తండ్రి ఏ వారసత్వాన్నిస్తారు? ఇంటి వారసత్వము, చదువు వారసత్వము మరియు స్వర్గ చక్రవర్తిత్వ వారసత్వాన్ని ఇస్తారు. ఎవరైతే పవిత్ర దైవీ సంప్రదాయం గలవారిగా అవుతారో వారే రాజధానిలో వస్తారు. ఎవరు ఎంత చదువుతారో, చదివిస్తారో వారే అంత శ్రేష్ఠ పదవిని పొందుతారు. ఎంతోమంది పిల్లలున్నారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. తండ్రి పిల్లలను స్వర్గాధిపతులుగా, నరుని నుండి నారాయణునిగా తయారు చేస్తారు. వీరు రాజ్యాధికారులుగా అవుతారు కనుక స్వర్గరచయిత అయిన అనంతమైన తండ్రికి మనము పిల్లలము కనుక స్వర్గ చక్రవర్తి పదవిని తీసుకుంటాము. యథా రాజా రాణి తథా ప్రజా........ ఎంత పురుషార్థము చేస్తారో, అంత శ్రేష్ఠ పదవిని పొందుతారు. ఇది రాజ్య పదవి కొరకు పురుషార్థము. సత్యయుగ రాజ్య పదవి అందరికీ లభించదు. ఎవరు ఎంత పురుషార్థము చేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. పురుషార్థమే ప్రాలబ్ధానికి ఆధారము. ఎంత పురుషార్థము చేస్తారో, అంత పదవి పొందుతారు. పురుషార్థము ద్వారానే చక్రవర్తి పదవి లభిస్తుందని పిల్లలకు తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే తమోప్రధానము నుండి సతోప్రధానంగా, స్వచ్ఛమైన బంగారంగా అయిపోతారు. రాజ్య పదవి కూడా లభిస్తుంది. మేము భారతదేశానికి అధికారులమని ఇక్కడ కూడా చెప్తారు కదా. అందరూ అధికారులుగానే అవుతారు కాని ఏ పదవిని పొందుతారు? చదువు తర్వాత స్వర్గములో మనకేమి పదవి ఉంటుంది. మీరిప్పుడు సంగమ యుగములో చదువుతున్నారు. సత్యయుగములో రాజ్య పాలన చేస్తారు. తండ్రి యోగాన్ని కూడా నేర్పిస్తారు, చదివిస్తారు కూడా. మేము రాజయోగాన్ని నేర్చుకుంటున్నామని మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి స్మృతి ద్వారా పావనంగా కూడా అవుతారు. తర్వాత మళ్లీ మనకు పునర్జన్మ రామరాజ్యములో జరుగుతుంది. రావణ రాజ్యములో కాదు. ఇప్పుడు మనము చదువుతున్నాము - మన్మనాభవ, మధ్యాజీభవ! ఇప్పుడిది కలియుగ అంత్యము. మళ్లీ సత్యయుగ స్వర్గము తప్పకుండా వస్తుంది. తండ్రి సంగమ యుగములోనే వచ్చి అనంతమైన స్కూలు తెరుస్తారు. ఆ స్కూలులో అనంతమైన చక్రవర్తి పదవిని పొందుకునేందుకు అనంతమైన చదువు చదువుకుంటారు. ఇప్పుడు మనము నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతామని మీకు తెలుసు. నూతన ప్రపంచాన్ని స్వర్గమని అంటారు. నషా పెరుగుతుంది కదా. పురాతన ప్రపంచము తర్వాత తప్పకుండా కొత్త ప్రపంచము వస్తుంది. పిల్లలకు గుర్తుకొస్తుంది. స్వర్గాధిపతులుగా చేసేందుకు పరమపిత పరమాత్మ మనలను చదివిస్తున్నారని పిల్లలందరి హృదయములో ఉంది. మనలను భగవంతుడు చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. తద్వారా సత్యయుగ రాజా - రాణులుగా అవుతాము. రాజయోగము ద్వారా రాజ్యము లభిస్తుంది. అందులో పవిత్రత, సుఖ - శాంతులు అన్నీ ఉంటాయి. ఈ బాబాలో ఇప్పుడు శివబాబా అవతరించి ఉన్నారు. వారు శ్రేష్ఠాతి శ్రేష్ఠులు. ఆత్మ అనుభవాన్ని తీసుకెళ్తుంది. అక్కడకు వెళ్తే అక్కడ కూర్చోవడం కూడా శ్రేష్ఠంగా ఉంటుంది. విద్యార్థులందరూ తమ-తమ పద్ధతిలో కూర్చుంటారు. ఒకరి స్థానములో మరొకరు కూర్చోలేరు. ఒకరి పాత్ర మరొకరితో కలువదు. ఆత్మలో రికార్డు నిండి ఉందని తండ్రి అర్థం చేయించారు. డ్రామా ప్లాను అనుసారము మన పురుషార్థము నడుస్తోంది. కొందరు రాజులుగా అవుతారు, కొందరు రాణులుగా అవుతారు. అంత్యములో పురుషార్థ ఫలితం వెలువడ్తుంది. అప్పుడు మళ్లీ మాల కూడా తయారౌతుంది. ఉన్నతమైన నంబరు తీసుకునే వారికి తప్పకుండా తెలిసి ఉంటుంది. ఆత్మ వెళ్లి కర్మానుసారము మరొక శరీరాన్ని తీసుకుంటుంది. మరణించిన తర్వాత భావించబడ్తుంది. మంచి కర్మలు చేసిన వారికి యోగబలము ద్వారా మంచి జన్మ లభిస్తుంది. పురుషార్థము చేయకుంటే తక్కువ పదవిని పొందుతారు. ఇలా ఇలా ఆలోచిస్తూ ఉంటే చాలా ఖుషీ కలుగుతుంది. ఎవరెలాంటి మహారథులుగా ఉంటారో వారికంత మహిమ జరుగుతుంది. అందరి మురళీ కూడా ఒకే రకంగా ఉండదు. ప్రతి ఒక్కరి మురళి వేరు వేరుగా ఉంటుంది. ఇది తయారు చేయబడిన ఆట కదా. ఇప్పుడు పిల్లలకు కర్మల పైన గమనముంది. తల్లిదండ్రులెలా చేస్తారో పిల్లలు కూడా అలాగే నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు శ్రేష్ఠ కర్మలు చేస్తారు. సర్వీసు ద్వారా తెలిసిపోతుంది. మహారథుల శ్రమ దాగి ఉండదు. శ్రేష్ఠ పదవి పొందేందుకు ఎవరు శ్రమ చేస్తున్నారో తెలుసుకోవచ్చు. పిల్లలందరికీ ఛాన్స్ కూడా ఉంది. ఉన్నత పదవి పొందేందుకు మన్మనాభవ పాఠము జ్ఞాన సహితంగా లభించింది. ఈ గీతా జ్ఞానాన్ని జ్ఞానసాగరులైన తండ్రియే స్వయంగా వచ్చి ఇస్తున్నారంటే తప్పకుండా ఖచ్ఛితమైనదేనని పిల్లలకు తెలుసు. మళ్లీ ధారణ పై ఆధారపడి ఉంది. ఏదైౖతే వింటున్నారో అది వాస్తవిక జీవితములో అలవడాలి. ఇందులో కష్టమేమీ లేదు. తండ్రిని స్మృతి చేయాలి మరియు చక్రాన్ని తెలుసుకోవాలి. ఇది అంతిమ జన్మలోని చదువు. ఇందులో పాస్ అయినవారు నూతన ప్రపంచమైన సత్యయుగములోకి వెళ్లిపోతారు.
నిశ్చయములోనే విజయముందని గాయనముంది. మమ్ములను భగవంతుడే చదివిస్తున్నారని ప్రీతి బుద్ధి గల పిల్లలు అర్థము చేసుకున్నారు. మా ఆత్మలు ధారణ చేస్తాయని పిల్లలకు తెలుసు. ఆత్మ ఈ శరీరము ద్వారా చదువుతుంది, ఉద్యోగము చేస్తుంది. ఇవి అర్థము చేసుకోవలసిన విషయాలు. తండ్రిని స్మృతి చేస్తారు మళ్లీ మాయా రావణుడు బుద్ధియోగాన్ని తెంచేస్తాడు. కావున మాయతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతెంత ముందుకు పోతారో అంతంత మీ ప్రభావము కూడా వెలువడ్తుంది అంతేకాక ఖుషీ పాదరస మట్టము కూడా పెరుగుతుంది. నూతన జన్మను తీసుకుంటే చాలా ప్రత్యక్షము చేస్తారు. మంచిది.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. వెలుపలా - లోపల చాలా శుద్ధంగా ఉండాలి. సత్యమైన హృదయముతో తండ్రికి తమ సమాచారమునివ్వాలి. ఏమీ దాచరాదు.
2. ఇప్పుడు వాపస్ వెళ్ళాలి కనుక అశరీరిగా అయ్యే అభ్యాసము చేయాలి, మౌనంగా ఉండాలి.
వరదానము :-
'' ''నాది (మేరేపన్)'' అను దానిని వదిలి ట్రస్టీగా ఉండి సేవ చేసే సదా సంతుష్ట ఆత్మా భవ ''
లౌకిక పరివారంలో ఉంటూ, సేవ చేస్తూ, సదా నేను ట్రస్టీని, సేవాధారిని అని గుర్తుండాలి. సేవ చేస్తూ కొంచెం కూడా మైపన్ లేకుంటే సంతుష్టంగా(తృప్తిగా) ఉంటారు. ఎప్పుడైతే మైపన్ వస్తుందో అప్పుడు విసుక్కుంటారు. నా కొడుకు ఇలా చేస్తున్నాడు...... అని అనుకుంటారు. కనుక ఎక్కడైతే మై పన్ ఉంటుందో, అక్కడ విసుక్కుంటారు, టెన్షన్లోకి వస్తారు. ఎక్కడైతే 'నీది, నీది' అని అంటారో అక్కడ తేలికగా ఉంటారు. నీది నీది అనడం అనగా స్వమానంలో ఉండడం. నాది నాది అనడం అనగా అభిమానంలోకి రావడం.
స్లోగన్ :-
''బుద్ధిలో ప్రతి సమయం తండ్రి మరియు శ్రీమతము స్మృతిలో ఉంటే వారిని హృదయపూర్వకంగా సమర్పితమైన ఆత్మ అని అంటారు ''