06-10-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - దేహ సహితంగా సర్వస్వము మర్చిపోయి, ఒక్క తండ్రినే స్మృతి చేయండి. అప్పుడే మీరు స్వంత పిల్లలని పిలువబడతారు.
ప్రశ్న :-
తండ్రి తెలిపే జ్ఞానము ఏ పిల్లల బుద్ధిలో సులభంగా కూర్చోగలదు ?
జవాబు :-
1. పేద పిల్లల బుద్ధిలో. 2. ఎవరికైతే మోహము నశించి ఉంటుందో వారి బుద్ధిలో. 3. ఎవరి బుద్ధి విశాలంగా ఉంటుందో వారి బుద్ధిలో జ్ఞానమంతా సహజంగా కూర్చుంటుంది. ఇకపోతే నా ధనము, నా పతి,........ అని ఎవరి బుద్ధిలో ఉంటుందో వారు జ్ఞానము ధారణ చేసి ఉన్నత పదవిని పొందలేరు. తండ్రికి చెందినవారిగా అయిన తర్వాత కూడా లౌకిక సంబంధాలను స్మృతి చేయడం అనగా వారికి ఇంకా పక్కా నిశ్చయము లేదని అర్థము. వారిని సవతి పిల్లలని అంటారు.
పాట :-
జీవించినా, మరణించినా మీ ఒడిలోనే (మీ దారిలోనే),..... ( మర్నా తేరి గలిమే, జీనా తేరీ గలీమే....) 
ఓంశాంతి.
మధురాతి మధురమైన పిిల్లలు పాటను తమంతకు తామే అర్థము చేసుకొని ఉంటారు. ఇప్పుడు జీవించి ఉండగానే తండ్రికి చెందినవారిగా అవ్వాలి. రౌరవ నరకమనబడే ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. మర్చిపోవడమే కాక తప్పకుండా వదిలేయాలి కూడా. రౌరవ నరకాన్ని మరచి, మళ్లీ స్వర్గాన్ని స్మృతి చేయాలి. స్వయాన్ని 'ఆత్మ'గా భావిస్తూ మన తండ్రిని స్మృతి చేయాలి. పాత ప్రపంచము బుద్ధి నుండి తొలగిపోవాలి. దాని కొరకే పురుషార్థము చేయాలి. ఇది జన్మ-జన్మల కర్మ బంధనము ఒక్క జన్మది కాదు. జన్మ-జన్మల కర్మ బంధనము. ఎవరి పట్ల ఎన్నెన్ని పాప కర్మలు చేశామో వాటన్నిటిని జన్మలు తీసుకుంటూ అనుభవించవలసి ఉంటుంది. కనుక ఈ కర్మ బంధనాల ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఇది ఛీ-ఛీ(పాడైపోయిన) ప్రపంచము. ఇది పతిత శరీరము కదా. దీని నుండి మోహాన్ని తొలగించాలి. పేదవారికి మోహము సులభంగా నశిస్తుంది. ధనవంతులకు నశించడం చాలా కష్టము. వారు మేము స్వర్గములో సుఖంగా కూర్చొని ఉన్నాము, పేదవారు దు:ఖితులుగా ఉన్నారని భావిస్తారు. నిజానికి భారతదేశమంతా పేదగానే ఉంది. కాని అందులో కూడా పేదవారు జ్ఞానాన్ని త్వరగా తీసుకుంటారు. వారి కొరకే తండ్రి వస్తారు. పేదవారికి వారసత్వము ఎక్కువగా లభిస్తుంది. సేవాకేంద్రాలలో గమనిస్తే, ధనవంతులు స్థిరంగా నిలువలేరు. స్త్రీలు కూడా పేద కుటుంబాలకు చెందినవారే వస్తారు. ధనవంతులకు వారి పతుల నుండి సుఖము లభిస్తుంది. అందువలన వారి బుద్ధియోగము వారి పతుల నుండి నుండి తొలగిపోజాలదు. తరచుగా పేదవారే వచ్చి జ్ఞానము తీసుకుంటారు. తండ్రి పేదల పాలిటి పెన్నిధి. ఆ తండ్రినే అందరూ స్మృతి చేస్తారు. అయితే డ్రామానుసారము భక్తులకు భగవంతుడంటే ఎవరో తెలియదు. భక్తులను రక్షించువారు భగవంతుడే. భక్తికి ఫలమునిచ్చేవారు, సద్గతిదాత తండ్రి ఒక్కరు మాత్రమే. పిల్లలైన మీరిప్పుడు తండ్రి ద్వారా జ్ఞాన విషయాలు వింటున్నారు. ఎవరి బుద్ధి విశాలంగా ఉంటుందో, ఎవరికైతే మోహము నశించి ఉంటుందో వారి బుద్ధిలోనే ఈ జ్ఞానము నిలుస్తుంది. ఎవరి బుద్ధిలోనైతే 'నా భర్త, నా ధనము' అని ఉంటుందో వారు ఉన్నతపదవిని పొందలేరు. ఎవరైతే రచయిత, రచనల పరిచయమునిస్తారో, వారే ఉన్నత పదవిని పొందుతారు. తండ్రినే తెలుసుకోకుంటే వారసత్వమెలా లభిస్తుంది? ప్రియుని కేవలము ప్రియుడన్నంత మాత్రాన లాభమేమీ ఉండదు. పూర్తిగా తెలుసుకోకుండా ప్రియునితో నిశ్చితార్థము ఎలా జరుగుతుంది? కన్యలకు నిశ్చితార్థము జరిగేందుకు ముందు అతని ఫోటో మొదలైన వాటిని చూపిస్తారు. ఫలానావారి పుత్రుడు, ఫలానా వృత్తి లేక ఉద్యోగమని తెలుపుతారు. పూర్వము ఇలా ఫోటో మొదలైనవి చూపించేవారు కాదు. అలాగే వివాహము చేసేవారు. అయినా అతడి వృత్తిని గురించి తెలుపుతారు కదా. ఇక్కడ కొంతమంది పిల్లలకు తమ ప్రియుని గురించి లేక తండ్రిని గురించి తెలియనే తెలియదు. అటువంటప్పుడు ప్రియునితో(బాబాతో) నిశ్చితార్థమెలా జరుగుతుంది? నెంబరువారుగా ఉన్నారు. చాలామంది నిశ్చితార్థము(సగాయీ) కచ్ఛాగా ఉంది. పారలౌకిక ప్రియుని స్మృతి చేయరు. లౌకిక ప్రియుని, లౌకిక సంబంధీకులు మొదలైనవారిని స్మృతి చేస్తూ ఉంటే, దానిని 'కచ్చీ(అపరిపక్వ) సగాయీ(నిశ్చితార్థము లేక ద్వితీయ వివాహము) అని అంటారు. వారిని సవతి పిల్లలని అంటారు. పక్కా పిల్లలను స్వంత పిల్లలని అంటారు. స్వంత పిల్లలు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. భట్టీలో కచ్ఛాగా ఉన్నవారెంతమంది వెళ్ళిపోయారు! వారు తమ ప్రియుడిని గుర్తించనే గుర్తించరు. పాదరసము అరచేతిలో ఎలా నిలువదో, అలా స్మృతి కూడా అంత కష్టమైనది. క్షణ క్షణము మర్చిపోతారు. 25-30 సంవత్సరాల వారు కూడా పూర్తిగా స్మృతి చేయలేరు. పారలౌకిక ప్రియుడు 21 జన్మలకు స్వర్గములోని మహారాజా-మహారాణులుగా చేస్తారని మీకు తెలుసు. వారు సృష్టి ఆదిమధ్యాంతాలు తెలిసినవారు. ప్రేయసులకు ఇంత బాగా అర్థం చేయిస్తున్నా వారి బుద్ధిలో నిలువదు. బుద్ధి పాత ప్రపంచ బంధనాలలో భ్రమిస్తూ ఉంటుంది. కాని బంధనములో ఉన్నామని అర్థము చేసుకోరు. ఒక్కరితోనే సంబంధముండాలి. ఆ ఒక్క సంబంధము తప్ప మిగిలినవన్నీ బంధనాలే. ఒక్కరితోనే సంబంధమునుంచండి. వారు మీకు సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానమునిస్తారని పిల్లలకు అర్థము చేయించడం జరిగింది.
పిల్లలైన మీకు తెలుసు - అర్ధకల్పము జ్ఞానకాండము. అర్ధకల్పము భక్తికాండము. జ్ఞాన కాండములో 21 జన్మలకు వారసత్వము లభిస్తుంది. అక్కడ సతోప్రధానంగా ఉంటారు. తర్వాత మళ్లీ సతోప్రధానము నుండి క్రిందికి సతోలోకి, తర్వాత సతో నుండి క్రిందికి రజో గుణములోకి రావలసి ఉంటుంది. ఎప్పుడైతే సతో స్థితి పూర్తవుతుందో జ్ఞాన కాండము సమాప్తమైపోతుంది. ద్వాపర యుగము నుండి భక్తి ప్రారంభమౌతుంది. భక్తి కూడా మొదట సతోప్రధానంగా ఉంటుంది. తర్వాత అది కూడా సతో, రజో, తమోలోకి వస్తుంది. వ్యభిచారిగా అవ్వడంతో మళ్లీ భక్తి దిగజారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ విషయాలను తెలుసుకోవడం ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. పిల్లలైన మీరు రౌరవ నరకము నుండి సంబంధాన్ని తెంచి ఒక్కరితో సంబంధాన్ని జోడించాలి. ఒక్క బాబాతో సంబంధాన్ని ఉంచే అభ్యాసము చేయండి. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశనమౌతాయి. పేదవారు బాగా కష్టపడ్తారు. కావున బలిహారము పేదలదే. బాబా కూడా పేదవారి పై బలిహారమౌతారు. ప్రారంభములో ఎంతమంది గోపులు వచ్చారు. అలాగే మాతలు కూడా ఎంతమంది వచ్చారు! ఎంతోమంది అంతమైపోయారు. కొద్దిమంది మాత్రమే మిగిలారు. మాతలు కూడా కొద్దిమందే ఉన్నారు. కొందరు షాహుకార్ల ఇంటివారు కూడా ఇక్కడే ఉండిపోయారు. క్వీన్మదర్, దేవి మొదలైనవారు ఉన్నారు కదా! ఏ భగవంతుడినైతే అందరూ తలచుకుంటారో వారి పరిచయము ఏమిటి? అన్న ముఖ్యమైన విషయాన్ని మీరు అర్థం చేయించాలి. '' పతితపావనుడైన తండ్రి ఎవరైతే రాజయోగాన్ని నేర్పించి నరుని నుండి నారాయణునిగా తయారుచేస్తారో వారిని తెలుసుకోకపోతే మీరు పాపాలు చేస్తూనే ఉంటారు. తండ్రిని నిందిస్తూనే ఉంటారు'' అని చెప్పండి. చాలా కాన్ఫరెన్స్లు (సమ్మేళనాలు) జరుగుతూనే ఉంటాయి. అక్కడికి వెళ్లి అర్థం చేయించేవారు చాలా చురుకైనవారుగా ఉండాలి. మీరు వేదాల మహిమను అర్థం చేసుకున్నారు కాని వాటి వలన ఎలాంటి లాభము ఉండదని వారికి అర్థము చేయించాలి. లాభము ఒక్క తండ్రి ద్వారా మాత్రమే జరుగుతుంది. అటువంటి తండ్రిని గూర్చి మేము తెలుసుకున్నాము. మీకు ఇంకా తెలియదు. మీరు వచ్చినట్లయితే మీకు వారిని గురించి మేము తెలిపిస్తాము. తండ్రిని గూర్చి తెలుసుకోకుండా వారసత్వము ఎలా లభిస్తుంది? తండ్రి ఇచ్చే వారసత్వము ముక్తి - జీవన్ముక్తి లేక గతి - సద్గతి. ఈ పదాలు వినిపించేది ఆ తండ్రి ఒక్కరు మాత్రమే. ఈ విషయాలు పిల్లలైన మీరు గుర్తుంచుకోవాలి. ఇక ఏ ఇతర విషయాల వలన, వస్తువుల వలన లాభము లేదు. తండ్రి మరియు వారి రచనల ఆదిమధ్యాంతాలను తెలుసుకోవాలి. ఇందులో కూడా అర్ధకల్పము భక్తికాండము, అర్ధకల్పము సద్గతి లేక జ్ఞానకాండము. భలే వారు సమ్మేళనాలు జరుపుతారు. కాని స్వయం వారే సంశయపడి, తికమకపడి ఉన్నారు. ఏ మాత్రము అర్థం చేసుకోరు. మీరు అందరికీ తండ్రి పరిచయమునివ్వాలి. ఎప్పుడైతే చాలామందికి పరిచయము లభిస్తుందో ''ఇది అద్భుతము(కమాల్)'' అని అంటారు. 'వీరు సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాలను చిత్రాల సహితంగా తెలిపిస్తున్నారు!' అని భావిస్తారు. మాతలకు చాలా నషా ఉండాలి. పురుషులు సహాయము చేసేందుకు తయారుగా ఉన్నారు. డైరక్షన్లు(ఆదేశాలు) తండ్రి ఇస్తారు. చేయవలసింది కన్యలు మరియు మాతలే. ఈ రోజుల్లో కన్యలు, మాతల మహిమ చాలా ఎక్కువగా ఉంది. గవర్నర్లుగా, ప్రధానమంత్రులుగా కూడా మాతలు అవుతారు. ఒకవైపు ఆ మాతలు, మరొకవైపు పాండవుల మాతలైన మీరు ఉన్నారు. వారు బాగా పైకి ఎగురుతున్నారు. సంతోషంతో చాలా గంతులు వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాజ్యము వారిదే. మీకు మూడడుగుల భూమి కూడా లభించదు.
తండ్రి పిల్లలైన మీకు అనేక రహస్యాలను అర్థము చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు స్వర్గ వారసత్వాన్ని పొందుతారు. ప్రియుడు మిమ్ములను అలంకరిస్తున్నారు(గుణాలతో). మహారాణులుగా చేసేస్తారు. ఇటువంటి ప్రియునితో బుద్ధియోగాన్ని ఉంచకపోవడం చాలా పెద్ద పొరపాటు. పిల్లలకైతే చాలానే అర్థము చేయిస్తారు. మీరు కేవలం భక్తికి, జ్ఞానానికి తేడాను తెలపండి. భారతదేశములోనే - దు:ఖములో అందరూ స్మరిస్తారు, సుఖములో ఎవ్వరూ స్మృతి చేయరు అనే గాయనముంది. సుఖములో ఎందుకు స్మృతి చేస్తారు? ఇప్పుడు ఆ కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది. అయితే సుఖ వారసత్వాన్ని కూడా పూర్తిగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు ఎంత అర్హులుగా ఉన్నారో మాత-పితలకు తెలుసు. మృత్యువు సమీపించినప్పుడు మీరు పురుషార్థము పూర్తిగా చేయలేదు, అందుకే మీకు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అని తెలియజేస్తారు, చూపిస్తారు. అంతేకాక మీరు ఎటువంటి ప్రజలుగా అవుతారో, ఎటువంటి నౌకర్లు-చాకర్లుగా అవుతారో అన్ని విషయాలు తెలిపిస్తారు. అచ్ఛా.
చాలా మంది పిల్లలు ఈ రోజు మురళిని మేము చాలా బాగా వినిపించామని అనుకుంటారు. అయితే అలా కాదు. శివబాబా వచ్చి సహాయము చేస్తారు. మీకు ఎలాంటి అహంకారము ఉండరాదు. మీరు ఏదైతే వినిపిస్తారో, దానిని మీకు తండ్రియే నేర్పిస్తారు. తండ్రి లేకపోతే మీ మురళి ఎక్కడిది? మురళీధరుని పిల్లలు మురళీధరులుగా అవ్వాలి. లేకుంటే ఉన్నత పదవిని పొందలేరు. కొద్దో, గొప్పో లాభమైతే ఉంటుంది. కొందరు సెంటర్లు తెరుస్తారు, వారికి చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇంత సమయము చదువుకున్నారు కదా. కావున మీరే సర్వీసు చేసి సెంటర్లను తయారు చేయాలి. స్వయం మీరు నేర్చుకున్నప్పుడు ఇతరులకు నేర్పించలేరా? బ్రహ్మకుమారిని(టీచరును) అడుగుతున్నారంటే బహుశా వీరిలో తగినంత జ్ఞానము లేదోమోనని తండ్రి భావిస్తారు. పోతే ఇచ్చటికి(మధువనానికి) వచ్చి ఏం చేస్తారు? బాబా అర్థం చేయిస్తారు - ''మేఘాలు రావాలి, రిఫ్రెష్ అయ్యి వెళ్లాలి, వర్షాన్ని కురిపించాలి. లేకుంటే పదవిని ఎలా పొందుతారు? మమ్మా-బాబా అంటున్నారంటే సింహాసనాన్ని పట్టుకొని చూపించండి. మేము(సేవకు) ఇచ్చామనే అహంకారము ఎవ్వరికీ రాకూడదు. మీరు ఏమీ ఇవ్వకండి. అప్పుడు బాబా గవ్వలకు బదులు వజ్రాలను ఇవ్వడం నుండి కూడా ముక్తులైపోతారు.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఒక్కరితోనే సర్వ సంబంధాలను ఉంచి, బుద్ధియోగాన్ని అనేక బంధనాల నుండి తొలగించుకోవాలి. ఒక్కరితోనే పక్కాగా వివాహ నిశ్చితార్థమును(సగాయి) చేసుకోవాలి. బుద్ధియోగాన్ని భ్రమింపచేయరాదు.
2. తండ్రి సమానము మురళీధరులుగా అవ్వాలి. 'నేను మురళిని చాలా బాగా వినిపించాను' అనే అహంకారముండరాదు. మేఘాలు నింపుకొని వర్షించాలి. చదువుకున్నారు కనుక సెంటర్లు స్థాపించాలి.
వరదానము :-
''న్యారేపన్(అతీతంగా ఉండు) యొక్క అభ్యాసము ద్వారా పాస్ విత్ ఆనర్గా అయ్యే బ్రహ్మబాప్ సమాన్ భవ ''
బ్రహ్మాబాబా సాకార జీవితంలో కర్మాతీతులుగా అయ్యేందుకు ముందు అతీతంగా, ప్రియంగా (న్యారా, ప్యరాగా) ఉండు అభ్యాసాన్ని ప్రత్యక్షంగా అనుభవం చేయించారు. సేవను గాని, ఏ కర్మను గాని వదలలేదు. కాని న్యారాగా ఉంటూ సేవ చేశారు. ఈ న్యారాతనము ప్రతి కర్మలో సఫలతను సహజంగా అనుభవం చేయిస్తుంది. కనుక సేవా విస్తారాన్ని భలే ఎంతైనా వృద్ధి చేయండి కాని విస్తారంలోకి వెళ్తూ సార స్థితిని అభ్యాసం చేయడం తగ్గిపోరాదు. అప్పుడే డబల్లైట్గా అయ్యి కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకొని డబల్ కిరీటధారులుగా, బ్రహ్మాబాబా సమానంగా పాస్ విత్ ఆనర్గా అవ్వగలరు.
స్లోగన్ :-
'' స్వయాన్ని ఎటువంటి శక్తి స్తంభంగా చేసుకోవాలంటే, అనేకమందికి తమ జీవితాలను బాగు చేసుకునే శక్తి ప్రాప్తమవ్వాలి ''