11-12-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - తండ్రి ప్రతి విషయములోనూ కళ్యాణకారియే. అందువలన ఏ ఆదేశము లభించినా, దానిని పెడచెవిన పెట్టకుండా ( సాకులు చెప్పకుండా ) శ్రీమతమును సదా అనుసరిస్తూ ఉండండి ''

ప్రశ్న :-

నవవిధాల భక్తి(అమితమైన భక్తి) మరియు నవ విధాల చదువు - ఈ రెండిటి ద్వారా కలిగే ప్రాప్తులలో తేడా ఏమిటి ?

జవాబు :-

నవవిధాల(నౌధా) భక్తి నుండి కేవలం సాక్షాత్కారము అవుతుంది. ఉదాహరణానికి శ్రీ కృష్ణుని భక్తులుగా ఉండేవారికి శ్రీ కృష్ణుని సాక్షాత్కారము జరుగుతుంది. రాసలీల(కృష్ణునితో పాటు నాట్యము చేయుట) మొదలైనవి చేస్తారు. కాని వారు వైకుంఠపురికి లేదా శ్రీ కృష్ణపురిలోకి వెళ్లరు. పిల్లలైన మీరు నౌధా చదువును చదువుతారు. దీని ద్వారా మీ సర్వ మనోకామనలు పూర్తి అవుతాయి. ఈ చదువు ద్వారా మీరు వైకుంఠపురిలోకి వెళ్లిపోతారు.

పాట :-

ఈ రోజు కాకపోతే రేపు ఈ మేఘాలు తొలగిపోతాయి,......... (ఆజ్‌ నహీతో కల్‌ బిఖరేంగే యహ్‌ బాదల్‌,..........)  

ఓంశాంతి.

'' ఇంటికి పద '' - అని ఎవరు చెప్తున్నారు? ఎవరి పిల్లలైనా అలిగి వెళ్లిపోతే వారి బంధు-మిత్రులు మొదలైనవారు అతని వెనుకపడి అతనితో ఎందుకు అలిగావు? ఇప్పుడు ఇంటికి పద అని అంటారు. అలాగే ఇక్కడ కూడా అనంతమైన తండ్రి వచ్చి పిల్లలందరికీ ఇంటికి పద అని చెప్తున్నారు. వీరు తండ్రే కాక తాత కూడా. శారీరకమైనవారు మరియు ఆత్మికమైనవారు కూడా. '' ఓ పిల్లలారా! ఇప్పుడు ఇంటికి పద! రాత్రి పూర్తయ్యింది, పగలు వస్తుందని చెప్తున్నారు.'' ఇవి జ్ఞాన విషయాలు. బ్రహ్మ రాత్రి, బ్రహ్మ పగలు. ఇవి ఎవరు అర్థము చేయించారు? తండ్రి కూర్చుని బ్రహ్మ మరియు బ్రహ్మకుమార-కుమారీలకు అర్థము చేయిస్తారు. అర్ధకల్పము రాత్రి అనగా పతిత రావణ రాజ్యము లేదా భ్రష్ఠాచారీ రాజ్యము. ఎందుకంటే ఆసురీ మతమును అనుసరిస్తారు. ఇప్పుడు మీరు శ్రీమతము పైన నడుస్తున్నారు. శ్రీమతము కూడా నిరాకారునిది(గుప్తమైనది). తండ్రే స్వయంగా వస్తారని మీకు తెలుసు. వారి రూపము వేరు, రావణుని రూపము వేరు. అతడిని ''పంచ వికారాల రూపి రావణుడు'' అని అంటారు. ఇప్పుడు రావణ రాజ్యము సమాప్తమౌతుంది. మళ్లీ ఈశ్వరీయ రాజ్యము వస్తుంది. రామ రాజ్యమని అంటారు కదా! సీతాపతి అయిన రాముడిని జపించరు. మాలలో రామ - రామ అని జపిస్తారు కదా! ఆ విధంగా పరమాత్మను స్మృతి చేస్తారు. సర్వుల సద్గతిదాత అయిన వారినే జపిస్తూ ఉంటారు. రాముడు అనగా భగవంతుడు(గాడ్‌). మాల జపించేటప్పుడు ఎప్పుడూ ఏ వ్యక్తినీ స్మృతి చేయరు. వారి బుద్ధిలోకి ఇతరులెవ్వరూ రారు. ఇప్పుడు రాత్రి పూర్తి అయ్యిందని తండ్రి అర్థము చేయిస్తున్నారు. ఇది కర్మక్షేత్రము, స్టేజ్‌(రంగ స్థలము). ఇక్కడ ఆత్మలైన మనము శరీరాలను ధరించి పాత్రను అభినయిస్తాము. 84 జన్మల పాత్ర అభినయించాలి. మళ్లీ అందులో వర్ణాలను కూడా చూపుతారు. ఎందుకంటే 84 జన్మల లెక్క కూడా కావాలి కదా. ఏ ఏ జన్మలో, ఏ ఏ కులములో, ఏ ఏ వర్ణాలలో వస్తారో తెలియాలి కదా. అందుకే విరాట రూపాన్ని కూడా చూపించారు. మొట్టమొదట బ్రాహ్మణులు ఉంటారు. కేవలం సత్యయుగ సూర్యవంశములోనే 84 జన్మలు ఉండవు. బ్రాహ్మణ కులములో కూడా 84 జన్మలు ఉండవు. 84 జన్మలైతే భిన్న - భిన్న నామము, రూపము, దేశము, కాలాలలో ఉంటాయి. సత్యయుగ సతోప్రధాన స్థితి నుండి మళ్లీ కలియుగ తమోప్రధానములోకి తప్పకుండా రావాలి. దాని సమయము కూడా సూచించడం జరిగింది. మనుష్యులు 84 జన్మలు ఏ విధంగా తీసుకుంటారో కూడా అర్థము చేసుకోవలసిన విషయము. మనుష్యులైతే అర్థము చేసుకోలేరు అందుకే తండ్రి మీకు మీ జన్మల గురించి తెలియదు, నేను తెలియజేస్తానని చెప్తున్నారు. డ్రామా అనుసారంగా తప్పకుండా మర్చిపోవలసిందేనని తండ్రి చెప్తున్నారు.

ఇప్పుడిది సంగమ యుగము. ప్రపంచములోని వారైతే కలియుగము ఇంకా బాల్యావస్థలో ఉందని అంటారు. దీనిని '' అజ్ఞానము, ఘోరాంధకారము '' అని అంటారు. ఎలాగైతే డ్రామాలో పాత్రధారులకు ఇక నాటకము ఇప్పుడిక 10 నిముషాలలో పూర్తి అవుతుందని తెలుస్తుందో అలాగే ఇది కూడా చైతన్య నాటకము. ఇది ఎప్పుడు పూర్తి అవుతుందో మనుష్యులకు తెలియదు. మనుష్యులైతే ఘోరాంధకారములో ఉన్నారు. తండ్రి చెప్తున్నారు - గురువులు, మఠాధిపతులు, వేదశాస్త్రాలు, జప తపాలు మొదలైనవాటి ద్వారా నేను లభించను. ఇదంతా భక్తిమార్గములోని సామాగ్రి. నేనైతే నా సమయానుసారంగా వస్తాను అనగా ఎప్పుడైతే రాత్రి నుండి పగలుగా అవ్వవలసి వస్తుందో లేక అనేక ధర్మాలను వినాశనము చేసి ఒక్క ధర్మ స్థాపన చేయవలసి ఉంటుందో అప్పుడే వస్తాను. సృష్టి చక్రము పూర్తి అవుతున్నప్పుడు నేను స్వర్గ స్థాపన చేస్తాను. ఆ తర్వాత వెంటనే సామ్రాజ్యము ప్రారంభమౌతుంది. మనము మళ్లీ రాజుల వద్ద జన్మ తీసుకుంటామని మీకు తెలుసు. తర్వాత మళ్లీ నెమ్మది నెమ్మదిగా కొత్త ప్రపంచము తయారవుతుంది. అన్నిటినీ నూతనంగా తయారు చేయవలసి ఉంటుంది. బాబా అర్థమ చేయిస్తున్నారు - ఆత్మలో చదువు, సంస్కారాలు లేక కర్మలు చేసే సంస్కారముంటుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. మనుష్యులంతా దేహాభిమానములో ఉన్నారు. ఎప్పుడైతే ఆత్మాభిమానులుగా అవుతారో అప్పుడు పరమాత్మను స్మృతి చేయగలరు. మొట్టమొదట ఆత్మాభిమానిగా అవ్వవలసి ఉంటుంది. మనము జీవాత్మలమని అందరూ అంటారు కూడా. ఆత్మ అవినాశి, శరీరము వినాశి అని కూడా చెప్తారు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక దానిని తీసుకుంటుందని కూడా అంటారు. కాని దాని పై నడవరు. ఆత్మ నిరాకార ప్రపంచము నుండి వస్తుందని, అందులో అవినాశి పాత్ర ఉందని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇదంతా తండ్రి కూర్చుని అర్థము చేయిస్తున్నారు. పునర్జన్మలు తీసుకుంటారు. డ్రామా అయితే ఉన్నది ఉన్నట్లుగా పునరావృతమౌతుంది. మళ్లీ క్రీస్తు మొదలైన వారంతా రావలసి వస్తుంది. వారు తమ-తమ సమయాలలో వచ్చి ధర్మస్థాపన చేస్తారు. ఇది మీ సంగమ యుగీ బ్రాహ్మణుల ధర్మము. వారు పూజారీ బ్రాహ్మణులు. మీరు పూజ్యులు, మీరెప్పుడూ పూజ చేయరు. మనుష్యులైతే పూజ చేస్తారు. అందువలన తండ్రి అర్థము చేయిస్తున్నారు - ఇది ఎంతో గొప్ప చదువు! ఎంతో ధారణ చేయవలసి ఉంటుంది. విస్తారంగా ధారణ చేయడంలో నెంబరువారుగా ఉన్నారు. క్లుప్తంగా బాబా రచయిత అని, ఇదంతా వారి రచన అని అర్థము చేసుకుంటారు. అచ్ఛా! వీరు తండ్రి అని అర్థము చేసుకుంటారు కదా! తండ్రిని భక్తులందరూ స్మృతి చేస్తారు. భక్తులు కూడా ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. భక్తులు తండ్రి అని పిలుస్తారు. ఒకవేళ భక్తులే భగవంతుడైతే ఇక ''తండ్రీ'' అని ఎవరిని పిలుస్తారు? ఇది కూడా అర్థము చేసుకోరు. స్వయాన్ని భగవంతుడని భావించి కూర్చుండిపోతారు. బాబా చెప్తున్నారు - డ్రామానుసారంగా ఈ పరిస్థితి ఎప్పుడు ఏర్పడ్తుందో భారతదేశము పూర్తిగా చివరి దశలోకి వెళ్లినప్పుడు తండ్రి వస్తారు. భారతదేశము ఎప్పుడైతే పురాతనమైతుందో అప్పుడు మళ్లీ నూతనంగా అయిపోతుంది. నూతన భారతమున్నప్పుడు ఏ ఇతర ధర్మమూ ఉండేది కాదు. దానిని స్వర్గము అని అంటారు. ఇప్పుడిది పురాతన భారతదేశము. దీనిని నరకము అని అంటారు. అక్కడ పూజ్యులుండేవారు. వారే ఇప్పుడు పూజారులుగా ఉన్నారు. పూజ్యులు మరియు పూజారులకు తేడా అయితే తెలిపించారు. మనము ఆత్మలము. మనమే పూజ్యులుగా మళ్లీ మనమే పూజారులుగా అవుతాము. మనమే జ్ఞానీ ఆత్మలము. ఆత్మలైన మనమే పూజారీ ఆత్మలము. మీరే పూజ్యులు, మీరే పూజారులని భగవంతుని అనరు. లక్ష్మీనారాయణులను ఇలా అంటారు. వారు పూజ్యులు మరియు పూజారులుగా ఎలా అవుతారో బుద్ధిలోకి రావాలి.

తండ్రి చెప్తున్నారు - కల్పక్రితము కూడా నేను ఈ విధంగానే జ్ఞానమునిచ్చాను. ఇలా కల్ప-కల్పము ఇస్తాను. నేను కల్పము యొక్క సంగమయుగములోనే వస్తాను. నా పేరే పతితపావనుడు. ప్రపంచమంతా పతితమైనప్పుడే నేను వస్తాను. ఈ వృక్షమును చూడండి! ఇందులో బ్రహ్మ పైన నిల్చొని ఉన్నాడు. మొదట ఆదిలో చూపిస్తారు. ఇప్పుడు అందరూ అంతిమములో ఉన్నారు. ఏ విధంగా బ్రహ్మ అంతిమములో ప్రత్యక్షమై ఉన్నారో, అలాగే వారు కూడా చివర్లో వస్తారు. క్రీస్తు ఉన్నట్లైతే అతడు మళ్లీ చివర్లో వస్తాడు. కాని మనము చివర్లో అనగా కొమ్మ చివర్లో అతని చిత్రమును చూపించలేము, అర్థము చేయించగలము. ఈ దేవీదేవతా ధర్మాన్ని స్థాపన చేసే ప్రజాపిత బ్రహ్మ ఏ విధంగా వృక్షము చివర్లో నిల్చొని ఉన్నాడో అలాగే క్రీస్తు కూడా క్రిష్టియన్‌ ధర్మానికి ప్రజాపితయే కదా! ఈ ప్రజాపిత ఎలా ఉన్నాడో అలాగే ప్రజాపిత క్రీస్తు, ప్రజాపిత బుద్ధుడు............ వీరందరూ ధర్మస్థాపన చేసేవారు. సన్యాసుల శంకరాచార్యుని కూడా పిత అనే అంటారు. అయితే వారు గురువు అని అంటారు. మా గురువు శంకరాచార్యులు అని వారు అంటారు. కనుక ఆ శాఖలో ఆదిలో నిల్చొని ఉన్నాడు. ఇతడు మళ్లీ జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ అంతములో వస్తాడు. ఇప్పుడు అందరూ తమోప్రధాన అవస్థలో ఉన్నారు. వారు కూడా వచ్చి అర్థము చేసుకుంటారు. అంతములో తప్పకుండా నమస్కరించేందుకు వస్తారు. వారికి కూడా అనంతమైన తండ్రిని స్మృతి చేయమని చెప్తారు. అనంతమైన తండ్రి అందరికి - '' దేహ సహితముగా దేహ సర్వ సంబంధాలను వదిలి వేయండని చెప్తారు.'' ఈ జ్ఞానము అన్ని ధర్మాల వారి కొరకు. ఈ దేహ ధర్మాలను వదిలేయండి. స్వయాన్ని అశరీరి అని భావించండి. తండ్రిని స్మృతి చేయండి. ఎంతెంత స్మృతి చేస్తారో, జ్ఞాన ధారణ చేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. కల్పక్రితము ఎవరెవరు ఎంతెంత జ్ఞానము తీసుకున్నారో వారు మళ్లీ తప్పకుండా వచ్చి అంతే జ్ఞానాన్ని తీసుకుంటారు.

'' మేము విశ్వ రచయిత అయిన తండ్రి పిల్లలము, తండ్రి మమ్ములను విశ్వానికి అధికారులుగా చేస్తారు, రాజయోగమును నేర్పిస్తున్నారు '' - అని పిల్లలైన మీకు ఎంతో నషా ఉండాలి! ఎంత సహజమైన విషయము! కాని నడుస్తూ నడుస్తూ చిన్న విషయాలలో సంశయం వచ్చేస్తుంది. దీనినే మాయా తుఫాను లేక పరీక్ష అని అంటారు. గృహస్థ వ్యవహారములోనే ఉండండి అని తండ్రి చెప్తారు. అందరినీ ఇల్లు-వాకిళ్లను వదిలించినట్లయితే, అందరూ వచ్చి ఇక్కడే కూర్చుండిపోతారు. వ్యవహారములో కూడా పాస్‌ అవ్వాలి. మళ్లీ సమయానుసారముగా సర్వీసులో కూడా మగ్నమవ్వాలి. ఎవరైతే వ్యాపారము మొదలైనవాటిని వదిలేశారో వారిని సర్వీసులో మగ్నము చేయిస్తారు. అప్పుడు కొందరు గొడవ చేస్తారు, కొందరు శ్రీమతములోనే కళ్యాణముందని భావిస్తారు. శ్రీమతమును తప్పకుండా అనుసరించాలి. ఆదేశము లభించింది. అందులో మళ్లీ ఎలాంటి సాకులు చెప్పరాదు. ప్రతి విషయంలో తండ్రి కళ్యాణకారియే. మాయ చాలా చంచలమైనది. చాలామంది ఈ విధంగా ఉండటం కంటే ఏదైనా వ్యాపారము మొదలైనవి చేసుకోవచ్చు కదా అని అనుకుంటారు. మరి కొందరు వివాహం చేసుకోవాలనుకుంటారు. బుద్ధి తిరుగుతూ ఉంటుంది. అప్పుడు చదువును వదిలివేస్తారు. కొందరు తండ్రికి - మేము శ్రీమతం పై నడుస్తామని గ్యారంటీ ఇస్తారు. అది ఆసురీ మతము. ఇది ఈశ్వరీయ మతము. ఆసురీ మతమును అనుసరించడం ద్వారా చాలా పెద్ద శిక్షలు అనుభవిస్తారు. గరుడ పురాణంలో వారు భయపెట్టి మనసును ఆకర్షించే విషయాలు వ్రాసేశారు. అది చదవటం వలన ఎక్కువ పాపాలు చేయకుండా ఉండేందుకు అలా వ్రాసేశారు. అయినా బాగుపడరు. ఈ విషయాలన్నీ తండ్రియే అర్థము చేయిస్తారు. ఏ మనిషీ జ్ఞానసాగరునిగా అవ్వలేడు. జ్ఞానసాగరుడు నాలెడ్జ్‌ఫుల్‌ అయిన తండ్రియే అర్థము చేయిస్తున్నారు. ఎవరు అర్థం చేసుకుంటారో, మళ్లీ వారు ఇతరులకు అర్థము చేయిస్తారు. అప్పుడు వారు అవును! ఇది సరైన విషయమే. మేము మళ్లీ వస్తామని అంటారు. అయితే ప్రదర్శని నుండి బయటకు వెళ్లారంటే ఇక సమాప్తం. ఇద్దరూ-ముగ్గురు వెలువడినా మంచిదే. ప్రజలుగా అయితే చాలా మంది తయారవుతూ ఉంటారు. వారసత్వాన్ని పొందేందుకు యోగ్యులైనవారు అతికష్టము మీద వెలువడ్తారు. రాజా-రాణీలకు 1-2 పిల్లలు మాత్రమే ఉంటారు. వారిని రాజకులము వారని అంటారు. ప్రజలైతే అనేకమంది ఉంటారు. ప్రజలు వెంటనే తయారవుతారు. అలా రాజులు తయారవ్వరు. 16,108 మంది రాజులు త్రేతా యుగము అంతిమానికి తయారవుతారు. ప్రజలైతే కోట్ల కొలది ఉంటారు. ఇవన్నీ అర్థం చేసుకునేందుకు చాలా విశాలమైన బుద్ధి ఉండాలి. మనము పారలౌకిక తండ్రి నుండి ఆస్తి తీసుకుంటున్నాము. తండ్రి ఆజ్ఞ - '' నన్ను స్మృతి చేయండి మరియు వారసత్వమును స్మృతి చేయండి. మన్మనాభవ, మధ్యాజీ భవ.'' స్వర్గం విష్ణుపురి, ఇది రావణపురి. శాంతిధామము, సుఖధామము మరియు దు:ఖధామము - ఈ విషయాలు తండ్రియే అర్థము చేయిస్తారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా అంతిమతి సో గతి అవుతుంది. భక్తిమార్గములో శ్రీ కృష్ణున్ని స్మృతి చేస్తారు. కాని వారు కృష్ణపురిలోకి వెళ్ళరు. కృష్ణపురిలోకి వెళ్ళి ధ్యానము(ట్రాన్స్‌)లో నాట్యము మొదలైనవి చేసి తిరిగి వస్తారు. అది నవ విధాల భక్తి ప్రభావము. దీని ద్వారా సాక్షాత్కారమౌతుంది. మనోకామన పూర్తి అవుతుంది. ఇక సత్యయుగమైతే సత్యయుగమే. అక్కడికి వెళ్లేందుకు నవ విధాల చదువు కావాలి. కాని నవవిధాల భక్తి కాదు. చదువుతూ ఉండండి, మురళీ తప్పక చదవండి. సెంటరుకు(సేవాకేంద్రానికి) తప్పకుండా వెళ్లాలి. అలా వీలు కానిచో మురళి తీసుకొని వెళ్లి ఇంట్లో తప్పకుండా చదవండి. కొందరికి సేవాకేంద్రానికి వెళ్ళండి అని చెప్పబడుతుంది. ప్రతి ఒక్కరి కొరకు వేరు వేరుగా ఉంటుంది. అందరి కొరకు ఒకే విధంగా ఉండజాలదు. దృష్టినిచ్చి భోజనము చేస్తే చాలు అని బాబా చెప్తారు కదా అని భావించరాదు. విధి లేని పరిస్థితిలో ఇంకేమీ చేయలేకపోతే కనీసం దృష్టినిచ్చి తినండి అని బాబా అంటారు. అయితే బాబా ఇలా అందరి కొరకు చెప్పరు. కొందరికి భలే సినిమాకు వెళ్ళండి అని బాబా చెప్తారు, అలాగని అది అందరి కొరకు కాదు. ఎవరి జతలోనైనా విధి లేక వెళ్ళవలసి పడ్తుంది. అయితే వారికి కూడా జ్ఞానము ఇవ్వాలి. అది హద్దులోని నాటకము, ఇది బేహద్‌ నాటకము. అలా సర్వీసు చేయవలసి పడ్తుంది. అంతేకాని కేవలం సినిమా చూచేందుకు వెళ్లరాదు. శ్మశానములోకి కూడా వెళ్లి సర్వీసు చేయాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. తండ్రి చెప్పే ప్రతి మాటలో కళ్యాణముందని అర్థము చేసుకొని నిశ్చయబుద్ధిగా అయ్యి నడవాలి. ఎప్పుడూ సంశయంలోకి రాకూడదు. శ్రీమతమును యదార్థ రీతిలో అర్థము చేసుకోవాలి.

2. ఆత్మాభిమానిగా ఉండే అభ్యాసము చేయాలి. డ్రామాలో ప్రతి పాత్రధారికి అనాది పాత్ర ఉంది. అందువల్ల సాక్షిగా అయ్యి చూసే అభ్యాసం చేయాలి.

వరదానము :-

''ప్రతి ఒక్కరి విశేషతలను చూస్తూ, వారిని సేవలో లగ్నము చేసే ఆశీర్వాదాలకు పాత్ర భవ''

ఎలాగైతే బాప్‌దాదాకు ప్రతి పుత్రుని విశేషతలంటే ప్రేమ ఉందు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేషత ఉంది, అందువలన అందరి పై ప్రేమ ఉంది. కనుక మీరు కూడా ప్రతి ఒక్కరి విశేషతలను చూడండి. ఎలాగైతే హంస రత్నాలను ఏరుకుంటుందో, రాళ్లను ఏరుకోదో, అలా మీరు కూడా హోలీ హంసలు. కనుక ప్రతి ఒక్కరి విశేషతను చూడడం, వారి విశేషతలను సేవలో ఉపయోగించడం మీ పని. వారిని వారి విశేషతలతో ఉత్సాహపరచి వారి ద్వారా ఆ విశేషతలను సేవలో ఉపయోగిస్తే వారి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. వారు ఏ సేవ అయితే చేస్తారో, అందులో భాగము కూడా మీకు లభిస్తుంది.

స్లోగన్‌ :-

''మీ ద్వారా ఇతరులకు తండ్రి స్మృతి కలిగేటంతగా బాప్‌దాదాతో కంబైండ్‌గా ఉండండి''