14-12-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - మీ సర్నేమ్ను( ఇంటి పేరు ) సదా గుర్తుంచుకోండి. మీరు గాడ్లీ చిల్డ్రన్(ఈశ్వరీయ సంతానము), మీది ఈశ్వరీయ కులము. మీరు దేవతల కంటే ఉన్నతమైనవారు. మీ నడవడిక చాలా రాయల్గా ఉండాలి''
ప్రశ్న :-
తండ్రి పిల్లలను తన సమానంగా ప్రేమసాగరులుగా చేశారు. అందుకు గుర్తు ఏమిటి?
జవాబు :-
పిల్లలైన మీరు తండ్రి సమానంగా, ప్రియంగా అయినారు. అందుకే మీ స్మృతిచిహ్న చిత్రాలను అందరూ ప్రేమిస్తారు. ప్రేమతో చూస్తూ ఉంటారు. లక్ష్మీనారాయణులు సదా హర్షితముఖులుగా, రమణీకముగా ఉంటారు. బాబా, మనలను జ్ఞాన-యోగాలతో చాలా చాలా మధురంగా చేస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. మీ నోటి ద్వారా సదా జ్ఞాన రత్నాలే వెలువడాలి.
పాట :-
మీరు ప్రేమ సాగరులు................... ( తూ ప్యార్ కా సాగర్ హై ..............) 
ఓంశాంతి.
మీరు ప్రేమ సాగరులు........... ఈ మహిమ ఎవరి మహిమలో పాడ్తారు? ఇది ఏ మనుష్యుల మహిమా కాదు. మీరు ప్రేమ, శాంతి మరియు పవిత్రతా సాగరులని అంటారు. ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతారు. వివాహము చేసుకోకుండా కూడా చాలా మంది పవిత్రంగా ఉంటారు. సన్యాసము తీసుకోకుండా కూడా పవిత్రంగా చాలామంది ఉంటారు. గృహస్థ వ్యవహారములో జనకుని వలె జ్ఞానము తీసుకోవాలి,............... అని గాయనము కూడా చేయబడింది. అతడి చరిత్ర కూడా ఉంది. జనకుడు - ''నాకు ఎవరైనా బ్రహ్మ జ్ఞానాన్ని వినిపించండి'' అని అన్నాడు. వాస్తవానికి బ్రహ్మా జ్ఞానము అని అనాలి. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా వచ్చి బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలకు జ్ఞానమునిస్తారు.
ఈ సమయములో మన సర్నేమ్ బ్రహ్మాకుమార్, బ్రహ్మాకుమారీలని మీకు తెలుసు. మనము గాడ్లీ చిల్డ్రన్ అని మీకు తెలుసు. మేము ఈశ్వరుని సంతానమని అందరూ అంటారు. అంటే తప్పకుండా అందరూ సోదరులే కదా. అప్పుడు తమను తాము తండ్రి అని అనలేరు. ఫాదర్హుడ్ కాదు, బ్రదర్హుడ్ అని అనాలి. ఒక్కటేమో మీరు బ్రహ్మాకుమారులు-కుమారీలు అని పిలువబడ్తారు. రెండవది ఎవరి కుమారులు-కుమారీలు అయినారో, వారిని మమ్మా-బాబా అని అంటారు. మేము శివబాబాకు మనవళ్లు, మనవరాళ్లు. బ్రహ్మాకుమారులు - కుమారీలు అని మీకు తెలుసు. భారతదేశములో అనేక శాస్త్రాలు, వేదాలు, పురాణాలు మొదలైనవన్నీ అయితే అందరూ చదువుతారు. సర్వశాస్త్రమయి శిరోమణి శ్రీమత్ భగవద్గీత. గీత నుండి సత్యయుగము స్థాపన జరుగుతుంది. గీతా జ్ఞానాన్ని జ్ఞానసాగరుడైన పరమాత్మయే ఇచ్చారు. వీరంతా జ్ఞాన నదులు జ్ఞాన సాగరుని నుండి వెలువడ్తారు. పావనంగా అయ్యేందుకు నీటి గంగ నుండి జ్ఞానము లభించదు. సద్గతి అనగా పావనంగా అవ్వడం. ఇది తమోప్రధాన పతిత ప్రపంచము. ఒకవేళ పావనంగా అయితే, ఎక్కడ ఉండాలి. వాపస్ తిరిగి అయితే వెళ్లలేరు. అటువంటి నియమము లేదు. అందరూ పునర్జన్మలు తీసుకొని తమోప్రధానంగా అవ్వవలసిందే. తండ్రి జ్ఞాన సాగరులు. మీరు ఇప్పుడు ప్రాక్టికల్గా వింటున్నారు. దీనిని ఎవ్వరూ కాపీ చేయలేరు. భలే మేము కూడా అదే జ్ఞానమునిస్తామని చాలామంది అంటారు. కాని అలా ఇవ్వలేరు. ఇక్కడ ఎవరికి జ్ఞానము లభించినా, వారిని బ్రహ్మాకుమారులు-కుమారీలుగా పిలువబడ్తారు. ఈ విధంగా బ్రహ్మాకుమారులు, కుమారీలని పిలువబడే సంస్థ ఏదీ లేదు. భలే ఒకవేళ ఇటువంటి వస్త్రాలనే ధరించినా మేము బ్రహ్మా పిల్లలము అని ఏ విధంగా చెప్తారు? ఇతనికి నేను బ్రహ్మా అనే పేరునిచ్చాను. ఇతనికి కూర్చుని అర్థము చేయిస్తాను. బ్రహ్మాకుమారులు-కుమారీలైన మీకు కూడా మీ జన్మల గురించి తెలియదు. నాకు తెలుసు అని మీతో కూడా అంటారు. ఇప్పుడు సంగమ యుగములో కాళ్లు మరియు పిలక రెండూ ఉన్నాయి. దీని ద్వారా పురాతన ప్రపంచము పరివర్తనై నూతన ప్రపంచంగా అవుతుంది. సత్యయుగము, త్రేతా, ద్వాపర, కలియుగము................. ఇలా సృష్టి వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇప్పుడిది అంతిమ సమయము. ప్రపంచము పరివర్తనై కొత్తదిగా అవుతుంది. తండ్రి వచ్చి త్రికాలదర్శులుగా చేస్తారు. వారు ప్రేమ సాగరులు కనుక తప్పకుండా ఈ విధంగా ప్రియంగానే చేస్తారు కదా. లక్ష్మీనారాయణులను చూడండి, ఎంతో ఆకర్షణీయంగా ఉన్నారు. లక్ష్మీనారాయణుల రమణీయమైన, హర్షితముఖముతో కూడిన చిత్రాలను ఎంతగా చూస్తారో, అంతగా రాముడు-సీతల చిత్రాలను చూడరు. లక్ష్మీనారాయణులను చూడడంలోనే సంతోషము కలుగుతుంది. రాధా-కృష్ణుల మందిరానికి వెళ్ళినప్పుడు ఇంతటి సంతోషము కలుగదు. లక్ష్మీనారాయణులకైతే రాజ్య భాగ్యముంది. ఇప్పుడు ప్రపంచములోని వారికి ఈ విషయాలను గురించి తెలియదు. బాబా మనలను చాలా మధురంగా చేస్తారని మీకు తెలుసు. లక్ష్మీ నారాయణులను జ్ఞానసాగరులని అనరు. వారు ఈ జ్ఞాన - యోగాలతో ఇలా తయారయ్యారు. ఇప్పుడు మీరు కూడా అలా అవుతారు. ప్రపంచమంతా ఒక్కటిగా అవ్వాలని ఏక రాజ్యముండాలని మనుష్యులు కోరుతారు. ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ఒకే రాజ్యముగా ఉండేదని గుర్తు చేయిస్తారు. కాని ఆ విధంగా అందరూ కలిసి ఒక్కటిగా అవ్వడం జరగదు. అక్కడైతే చాలా తక్కువమంది మనుష్యులుండేవారు. మనము ఈశ్వరీయ సంతానమని మీరు భావిస్తారు. ఈశ్వరుడు ప్రత్యక్షంగా ఉన్నాడని అంటారు(హాజిరా హజూర్). కాని ప్రత్యక్షము(హాజిర్ - నాజిర్)గా ఉందని ఆత్మను అంటారు. ఆత్మ సర్వవ్యాపి. అందరిలోనూ ఆత్మ ఉంది అంతేకాని అందరిలో పరమాత్మ లేరు. అలాగైతే ప్రతిజ్ఞ చేయవలసిన అవసరమేముంది? ఒకవేళ మనలో పరమాత్మ ఉన్నట్లైతే ప్రతిజ్ఞ ఎవరి పై చేస్తారు? ఒకవేళ మనము వ్యతిరేకమైన కార్యాలను చేసినట్లైతే పరమాత్మ శిక్షిస్తారు. ఒకవేళ పరమాత్మ అందరిలో ఉంటే ప్రతిజ్ఞ చేయడం మొదలైన విషయాలే ఉండవు. ఇప్పుడు మీరు సాకారములో ఉన్నారు. ఆత్మ ఈ కళ్ళకు కనబడదని అంటారు. మరి పరమాత్మను ఎలా చూడగలరు? మనలో ఆత్మ ఉందని అనుభూతి పొందుతారు. పరమాత్మ సాక్షాత్కారమవ్వాలని అంటారు. కాని ఆత్మనే చూడలేనప్పుడు ఇక పరమాత్మనెలా చూడగలరు? ఆత్మయే పుణ్యాత్మగా, పాపాత్మగా అవుతుంది. ఈ సమయములో పాపాత్మగా ఉంది. మీరైతే చాలా పుణ్యము చేశారు. తండ్రి ఎదుట తనువు-మనసు-ధనములను సమర్పణ చేశారు. ఇప్పుడు పాపాత్మల నుండి పుణ్యాత్మలుగా అవుతున్నారు. శివబాబాకు తనువు - మనసు - ధనములను బలి ఇస్తారు. ఇతడు (బ్రహ్మాబాబా) కూడా అర్పణ చేశాడు కదా. తనువును కూడా సత్యమైన సేవలో ఇచ్చాడు. మాతలకు అర్పణ చేసి వారిని నిమిత్తంగా(ట్రస్టీగా) చేశాడు. మాతలను ముందుంచి వృద్ధినొందించారు. మాతలే వచ్చి శరణు తీసుకున్నారు. మరి వారి సంభాళన ఎలా జరగాలి? మాతల పై బలి అవ్వాల్సి పడ్తుంది. ''వందేమాతరమ్'' - అని తండ్రి అంటారు. హాజిర్-నాజిర్(ఎదురుగా ఉండుట) అనే దాని రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఓ గాడ్ఫాదర్ అని ఆత్మ పిలుస్తుంది. ఏ తండ్రిని పిలుస్తుందో అర్థము చేసుకోరు. మీరు లక్ష్మీనారాయణులుగా అవుతారు. వారిని మనుష్యులు ఎంతగా ప్రేమిస్తారు! వారినే హర్ హోలీనెస్, హిస్ హోలీనెస్ అని అంటారు. మనము ఈశ్వరీయ కులానికి చెందినవారమని ఇప్పుడు మీరు అంటారు. ఇంతకుముందు ఆసురీ కులానికి చెందినవారిగా ఉండేవారు. బ్రాహ్మణుల సర్నేమ్ ఈశ్వరీయ సంతానము. బాపూజీ గాంధీగారు కూడా రామరాజ్యము కావాలని కోరేవారు. నూతన భారతదేశములో నూతన రాజ్యముంటుంది. వరల్డ్ ఆల్మైటీ అథారిటీ ప్రభుత్వము ఉంటుంది. అయితే దానిని అనంతమైన తండ్రియే తయారు చేయగలరు. నేను వరల్డ్ ఆల్మైటీ అథారిటీని, సర్వోన్నతమైనవాడిని, నిరాకారుడను అని తండ్రి అంటారు. బ్రహ్మ-విష్ణు-శంకరులు నా రచన. భారతదేశము శివాలయముగా సంపూర్ణ నిర్వికారిగా ఉండేది. ఇప్పుడు సంపూర్ణ వికారిగా ఉంది. సంపూర్ణ నిర్వికారులు ఇక్కడే ఉంటారని కూడా తెలియదు. ఒకే ప్రభుత్వము ఒకే ప్రపంచము ఉండాలని, ఒకే సర్వ శక్తివంతమైన రాజ్యముండాలని కోరుకుంటారు. ఒకే ప్రభుత్వము, సర్వశక్తివంతమైన దేవీ దేవతల లక్ష్మీనారాయణుల రాజ్యమును పరమాత్మయే స్థాపన చేస్తున్నారు. మిగిలిన వాటన్నిటి వినాశనము ఎదుట నిలిచి ఉంది. ఇంతటి నషా ఉండాలి. ఇక్కడి నుండి ఇంటికి వెళ్ళగానే మూర్ఛితులైపోతారు. సంజీవిని మూలిక కథ కూడా ఉంది కదా. కాని ఇది జ్ఞాన మూలిక. 'మన్మనాభవ' అనే మూలిక. దేహాభిమానములోకి వస్తే మాయ ద్వారా చెంపదెబ్బ తగుల్తుంది. దేహీ-అభిమానులుగా అవుతే చెంపదెబ్బ పడదు. మనము శివబాబా నుండి వారసత్వము తీసుకుంటున్నాము. ఇది బ్రహ్మ అంతిమ జన్మ. అతడు కూడా ఆస్తిని తీసుకుంటాడు. దైవిక సుసంపన్నమైన రాజ్యము మీ ఈశ్వరీయ జన్మ సిద్ధ అధికారము. పిల్లలైన మీలో దైవీ నడవడికలు ఉండాలి. బ్రాహ్మణులైన మీరు దేవతల కంటే కూడా శ్రేష్ఠమైనవారు. మీరు చాలా మధురంగా మాట్లాడాలి. ఉపన్యసించు సమయములో మొదలైన వాటిలో మాట్లాడవలసి ఉంటుంది. ఇక వ్యర్థ విషయాలలోకి వెళ్ళరాదు. నోటి ద్వారా సదా రత్నాలే వెలువడాలి. భలే ఈ కళ్ళు ఉన్నాయి అయితే మీరు స్వర్గాన్ని మూలవతనాలనే చూడండి. ఆత్మకు జ్ఞాన నేత్రము ప్రాప్తిస్తుంది. ఆత్మ అవయవాల ద్వారా చదువుతుంది. మీకు జ్ఞాన మూడవ నేత్రము లభించింది. ఉదాహరణానికి జ్ఞాన దంతము వెలువడ్తుంది కదా. తండ్రి వారసత్వాన్ని బ్రాహ్మణులకు మాత్రమే ఇస్తారు, శూద్రులకు ఇవ్వరు. మూడవ నేత్రము ఆత్మకు లభిస్తుంది. జ్ఞాన నేత్రము లేకుండా తప్పును, ఒప్పును అర్థము చేసుకోలేరు. రావణుడు తప్పుడు మార్గములోనే నడిపిస్తాడు. బాబా సరియైన మార్గములో నడిపిస్తారు. సదా ఒకరు మరొకరి నుండి గుణాలను తీసుకోవాలి. గుణాలకు బదులు అవగుణాలను తీసుకోరాదు.
డాక్టర్ నిర్మల వస్తుంది. ఆమె స్వభావము చాలా మధురమైనది, శాంతచిత్తముగా ఉంటుంది. తక్కువగా మాట్లాడటము ఆమెను చూచి నేర్చుకోవాలి. చాలా వివేకము గల మరియు మధురమైన పుత్రిక. శాంతిగా కూర్చునే రాయల్టీ కూడా కావాలి. కొద్ది సమయము స్మృతి చేసి, ఇక రోజంతా మర్చిపోరాదు. ఇది కూడా అభ్యాసము చేయాలి. తండ్రిని స్మృతి చేయడం ద్వారా శక్తి లభిస్తుంది. అప్పుడు తండ్రి కూడా సంతోషిస్తారు. ఇటువంటి స్థితి గలవారు ఎవరిని చూచినా, వెంటనే వారిని కూడా అశరీరిగా చేసేస్తారు. అశరీరిగా అయిపోయారంటే శాంతముగా అయిపోతారు. కేవలం శాంతిలో కూర్చోవడం వల్ల ఏ సుఖమూ లేదు. అది అల్పకాలిక సుఖమే. శాంతిగా కూర్చుని ఉంటే కర్మలెలా చేస్తారు? యోగము ద్వారా వికర్మలు వినాశనమౌతాయి. సత్యమైన సుఖ-శాంతులు ఇక్కడ ఉండవు. ఇక్కడ ప్రతి వస్తువు అల్పకాలానికి చెందినదే. అచ్ఛా!
రాత్రి క్లాసు (09-04-1968) :-
ఈ రోజుల్లో ఎక్కువగా విశ్వములో శాంతి ఎలా ఏర్పడ్తుంది అనే అంశము పైనే సమావేశాలు(కాన్ఫ్రెన్స్లు) చేస్తూ ఉంటారు. వారికి ఇలా తెలియజేయాలి - చూడండి! సత్యయుగములో ఒకే ధర్మము, ఒకే రాజ్యము, అద్వైత ధర్మముండేది. జగడాలు చేసేందుకు మరే ఇతర ధర్మాలు ఉండవు. అప్పుడు రామరాజ్యమే ఉండేది. అప్పుడే విశ్వములో శాంతి ఉండేది. విశ్వములో శాంతి ఏర్పడాలని మీరు కోరుకుంటున్నారు. అది సత్యయుగములో ఉండేది. తర్వాత అనేక ధర్మాలు రావడం వలన అశాంతి ఏర్పడింది. కాని ఇది అర్థము చేసుకునేంత వరకు తలబద్ధలు కొట్టుకోవలసిందే. మున్ముందు వార్తాపత్రికలలో కూడా వస్తుంది. అప్పుడు ఈ సన్యాసులు మొదలైన వారికి కూడా అర్థమౌతుంది. మన రాజధాని స్థాపనౌతూ ఉంది. ఇది పిల్లలైన మీకు లభించే గౌరవము. పిల్లలైన మీకు ఈ నషా ఉంది. మ్యూజియమ్ వైభవాన్ని చూసి చాలా మంది వస్తారు. లోపలికి వచ్చి ఆశ్చర్యపోతారు. కొత్త కొత్త చిత్రాల పై కొత్త కొత్త వివరణ వింటారు.
యోగము ముక్తి - జీవన్ముక్తుల కొరకు అని పిల్లలైన మీకు తెలుసు. దానిని మనుష్య మాత్రులెవ్వరూ నేర్పించలేరు. పరమపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ముక్తి - జీవన్ముక్తుల కొరకు యోగమును నేర్పించలేరని కూడా వ్రాయాలి. సర్వుల సద్గతిదాత ఒక్కరే. దీనిని మనుష్యులు చదివే విధంగా స్పష్టంగా వ్రాయాలి. సన్యాసులు ఏమి నేర్పిస్తారు? యోగము - యోగము అంటూ ఉంటారు. వాస్తవానికి యోగమును ఎవ్వరూ నేర్పించలేరు. మహిమ అంతా ఒక్కరిదే. విశ్వములో శాంతి స్థాపన చేయడం లేదా ముక్తి - జీవన్ముక్తులను ఇవ్వడం ఒక్క తండ్రి కర్తవ్యమే. ఇలా ఇలా విచార సాగర మథనము చేసి మంచి-మంచి పాయింట్లు అర్థము చేయించాలి. మనుష్యులు ఈ విషయాలు నిజమే అనుకునే విధంగా వ్రాయాలి. ఈ ప్రపంచమైతే పరివర్తన చెందాల్సిందే. ఇది మృత్యు లోకము. కొత్త ప్రపంచాన్ని అమర లోకమని అంటారు. అమర లోకములో మనుష్యులు ఎలా అమరంగా ఉంటారు? ఇది కూడా అద్భుతమే కదా. అక్కడ ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. సమాయానికి తమకు తామే ఒక శరీరమును వదిలి మరొక శరీరమును వస్త్రాలను మార్చుకున్న విధంగా తీసుకుంటారు. ఇవన్నీ అర్థము చేయించవలసిన విషయాలు. అచ్ఛా!
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి మరియు బాబాల ప్రియస్మృతులు, గుడ్నైట్ మరియు నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మీ స్వభావాన్ని చాలా మధురంగా, శాంతచిత్తముగా చేసుకోవాలి. చాలా తక్కువగా మరియు రాయల్టీ(మహానత)తో మాట్లాడాలి.
2. తనువు-మనసు-ధనముల ద్వారా బ్రహ్మాబాబా సమానంగా ట్రస్టీలుగా అయ్యి(నిమిత్తమై) ఉండాలి.
వరదానము :-
''తమ ఆది, అనాది స్వరూప స్మృతి ద్వారా సర్వ బంధనాలను సమాప్తం చేసుకునే బంధనముక్త్ స్వతంత్ర భవ ''
ఆత్మ, ఆది అనాది స్వరూపము స్వతంత్రంగా ఉండే యజమాని స్వరూపము. కాని తర్వాత పరతంత్రంగా అయ్యింది. అందువలన మీ ఆది-అనాది స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకొని బంధన ముక్తులుగా అవ్వండి. మానసిక బంధనము కూడా ఉండరాదు. మానసిక బంధనమున్నా ఆ బంధనము, ఇతర బంధనాలను తీసుకొస్తుంది. బంధన ముక్తులనగా రాజులు, స్వరాజ్య అధికారులు. ఇటువంటి బంధనముక్త స్వతంత్ర ఆత్మలే పాస్ విత్ ఆనర్గా(గౌరవ యుక్తంగా పాస్) అవుతారు అనగా ఫస్ట్ డివిజన్లో వస్తారు.
స్లోగన్ :-
''మాస్టర్ దు:ఖహర్తలుగా అయ్యి దు:ఖాన్ని కూడా సుఖములోకి పరివర్తన చేయడమే సత్యమైన సేవ''