17-11-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - బ్రహ్మ సంతానమైన మీరు పరస్పరము సోదరీ - సోదరులు కనుక మీ వృత్తి చాలా శుద్ధంగా, పవిత్రంగా ఉండాలి''
ప్రశ్న :-
ఎటువంటి పిల్లలు జ్ఞానాన్ని అర్థము చేయిస్తే చాలా మంచి ప్రభావము పడ్తుంది ?
జవాబు :-
ఎవరైతే గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానం పవిత్రంగా ఉంటారో, వారి ప్రభావము చాలా బాగా పడ్తుంది. అటువంటి అనుభవీ పిల్లలు ఎవరికైనా అర్థము చేయిస్తే దాని ప్రభావము చాలా బాగా పడగలదు. ఎందుకంటే వివాహము చేసుకుని కూడా అపవిత్ర వృత్తి(భావనలు) కలగక పోవడము - ఇది చాలా గొప్ప లక్ష్యము. ఇందులో పిల్లలు చాలా చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి.
పాట :-
మా తీర్థ స్థానాలు భిన్నమైనవి,................( హమారే తీర్థ్ న్యారే హై,................) 
ఓంశాంతి.
తండ్రి కూర్చుని పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. ఎందుకంటే పిల్లలకే తండ్రి గురించి తెలుసు. అందరూ పిల్లలే. పిల్లలందరు బ్రహ్మకుమార-కుమారీలే, అంటే సోదరీ - సోదరులమని వారికి తెలుసు. అందరూ ఒక్క తండ్రి పిల్లలైనందున ఆత్మలైన మనమంతా సోదరులమని వాస్తవికతను అర్థము చేయించాలి. అందరూ సోదరులే. మనము ఒకే గ్రాండ్ ఫాదర్(తాత) మరియు ఫాదర్(తండ్రి) పిల్లలమని మీకు తెలుసు. శివబాబాకు పౌత్రులము, బ్రహ్మకు పిల్లలము. వీరి లౌకిక పత్ని కూడా, నేను బ్రహ్మకుమారిని అని అంటే వారిది కూడా అదే సంబంధమైపోయింది. ఉదాహరణానికి లౌకిక సోదర, సోదరీల మధ్య చెడు దృష్టి ఉండదు కాని ఈ రోజుల్లో అందరూ అశుద్ధంగా అయిపోయారు. ఎందుకంటే ఇది వికారీ(మురికి) ప్రపంచము. బ్రహ్మ ద్వారా దత్తు చేసుకోబడిన బ్రహ్మకుమార-కుమారీలైన మనము సోదరి-సోదరులమని మీరిప్పుడు అర్థము చేసుకున్నారు. సన్యాసము కూడా రెండు ప్రకారాలుగా ఉంటుందని అర్థము చేయించాల్సి ఉంటుంది. సన్యాసము అంటే పవిత్రంగా ఉండడము, పంచ వికారాలను త్యజించడము. వారు హఠయోగ సన్యాసులు. వారి విభాగమే వేరు. ప్రవృత్తి మార్గము వారితో సంబంధాన్ని వదిలేసుకుంటారు. వారి పేరే హఠయోగి, కర్మ సన్యాసులు. మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను త్యాగము చేసి తండ్రిని స్మృతి చేయాలని మీకు అర్థం చేయించబడ్తుంది. వారు ఇల్లు-వాకిళ్ళను వదిలేస్తారు. మామ, చిన్నాన్న, పినతండ్రి మొదలైనవారెవ్వరూ ఉండరు. ఉన్నవారు ఒక్కరే, వారొక్కరినే స్మృతి చేయాలి లేక జ్యోతి జ్యోతిలో లీనమవ్వాలని, నిర్వాణధామానికి వెళ్లాలని భావిస్తారు. వారి విభాగమే వేరు. వారి వేష ధారణే వేరు, పాలనే వేరు. '' స్త్రీ నరక ద్వారమని, అగ్ని మరియు పత్తి కలిసి ఉండలేవు'' అని అంటారు. దూరమైతేనే మేము రక్షింపబడ్తామని భావిస్తారు. డ్రామానుసారము వారి ధర్మమే వేరు. దాని స్థాపన శంకరాచార్యులు చేశారు. వారు హఠయోగాన్ని, కర్మ సన్యాసాన్ని నేర్పిస్తారు. రాజయోగాన్ని కాదు. ఇది తయారైన డ్రామా అని మీకు తెలుసు. నెంబరువారుగా ఉంటారు. అందరూ నూరు శాతము తెలివైనవారని చెప్పలేము. కొందరు నూరు శాతము తెలివివంతులుగా, కొందరు నూరు శాతము బుద్ధిహీనులుగా కూడా ఉంటారు. ఇది జరగనే జరుగుతుంది. మమ్మా-బాబాలు పరస్పరములో సోదరి, సోదరులు. చెడు వృత్తి ఉండరాదని నియమము(లా) చెప్తుంది. సోదరి-సోదరులకు పరస్పరము ఎప్పుడూ వివాహము జరగదు. సోదరీ-సోదరుల మధ్య ఒకవేళ ఇంటిలో ఏదైనా జరిగినట్లు గమనిస్తే, ఇంత చెడు ఉందే అని తండ్రికి చాలా చింత ఉంటుంది. వీరు ఎక్కడ నుండి పుట్టారు(వీడు నా కడుపున చెడబుట్టాడు), ఎంతగా నష్టపరుస్తున్నారని, వారిని చాలా తిడ్తారు. ఇంతకుముందు ఈ విషయాలలో చాలా నియంత్రణ ఉండేది. కాని ఇప్పుడు నూరు శాతము తమోప్రధానంగా ఉన్నారు. మాయ ప్రభావము తప్పకుండా చాలా తీవ్రంగా ఉంది. పరమపిత పరమాత్ముని పిల్లలతో మాయ తీవ్రంగా పోరాడుతుంది. వీరు నా పిల్లలు, నేను వీరిని స్వర్గములోకి తీసుకెళ్తానని తండ్రి అంటారు. ''కాదు, వీరు నా పిల్లలు, నేను వీరిని నరకానికి తీసుకెళ్తానని మాయ అంటుంది.'' ఇక్కడ ధర్మరాజు తండ్రి చేతిలో ఉన్నారు కనుక ఎవరైతే గృహస్థ వ్యవహారములో పవిత్రంగా ఉంటారో, వారు తాము గృహస్థములో కలిసి ఉండి కూడా ఎలా పవిత్రంగా ఉంటారో ఇతరులకు బాగా అర్థము చేయించాలి. హఠయోగీ సన్యాసులు చేయలేని కార్యాన్ని తండ్రి చేస్తున్నారు. సన్యాసులెప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. వివేకానందుని పుస్తకము పై కూడా రాజయోగమని వ్రాయబడి ఉంది. కాని నివృత్తి మార్గము వారైన సన్యాసులు ఎవరైతే నారి నరక ద్వారమని అంటారో, వారు రాజయోగమును నేర్పించలేరు. గృహస్థ వ్యవహారములో ఉండి పవిత్రంగా ఉండేవారు అర్థము చేయిస్తే వారి బాణము బాగా తగులుతుంది. ఢిల్లీలో వృక్షాల గురించి ఏదో సమ్మేళనము జరుగుతుందని బాబా వార్తాపత్రికలలో చూశారు. అటువంటి సమయాలలో మీరు ఈ అడవి వృక్షాలు మొదలైన వాటి గురించి ఆలోచిస్తున్నారు కాని ఈ మానవ వృక్షము గురించి ఎప్పుడైనా ఆలోచించారా? - ఈ మానవ సృష్టి ఎలా ఉత్పత్తి అవుతుంది, పాలన ఎలా జరుగుతుంది? దీనిని గురించి ఎలా అర్థము చేయించాలో ఆలోచించండి.
కానీ పిల్లలలో అంతటి విశాలబుద్ధి ఇంకా రాలేదు. అంత గమనము పెట్టడము లేదు. ఏదో ఒక జబ్బులపాలై ఉన్నారు. లౌకిక పరివారాల్లో కూడా సోదరి-సోదరుల మధ్య చెడు సంకల్పాలుండవు. ఇక్కడైతే మీరంతా ఒకే తండ్రి పిల్లలు, సోదరి-సోదరులు, బ్రహ్మకుమార-కుమారీలు. ఒకవేళ చెడు ఆలోచనలు కలిగితే వారిని ఏమంటారు? నరకములో ఉన్న వారికంటే వేయి రెట్లు చెడ్డవారిగా లెక్కించబడ్తుంది. పిల్లల పై చాలా బాధ్యత ఉంది. ఎవరైతే గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రంగా ఉంటారో వారికిది చాలా శ్రమతో కూడిన పని. ప్రపంచానికి ఈ విషయాలు తెలియవు. పావనంగా చేసేందుకు తండ్రి వచ్చినప్పుడు పిల్లలు తప్పకుండా ప్రతిజ్ఞ చేస్తారు. రాఖీ కట్టబడి ఉంది. ఇందులో చాలా శ్రమ ఉంది. ''వివాహితులై పవిత్రంగా ఉండడం ఇది చాలా గొప్ప గమ్యము''. కొద్దిగా కూడా బుద్ధి అటువైపు వెళ్లరాదు. వివాహితులౌతూనే వికారులుగా అయిపోతారు. తండ్రి వచ్చి అపవిత్రులుగా అవ్వకుండా రక్షిస్తున్నారు. ద్రౌపది గురించి కూడా శాస్త్రాలలో వ్రాసి ఉన్నారు. ఈ విషయాలలో ఏదో ఒక రహస్యముంది కదా. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ డ్రామాలో రచింపబడి ఉన్నాయి - ఏదైతే జరిగిపోతుందో అది డ్రామా నిర్ణయము. అది మళ్లీ తప్పకుండా పునరావృతమౌతుంది. జ్ఞాన మార్గము మరియు భక్తి మార్గము కూడా నిర్ణయింపబడి ఉన్నాయి. మీ బుద్ధి ఇప్పుడు చాలా విశాలమైపోయింది. బేహద్ తండ్రి బుద్ధి ఎలాగుందో, శ్రీమతమును పాటించే అతిప్రియమైన పిల్లల బుద్ధి కూడా అలాగే ఉంది. లెక్కలేనంత మంది పిల్లలున్నారు. ఇంకా ఎంతమంది పిల్లలున్నారో చెప్పలేము. బ్ర్రాహ్మణ- బాహ్మణీలుగా అవ్వనంతవరకు ఆస్తిని తీసుకోలేరు. బ్రహ్మ వంశీయులైన మీరిప్పుడు మళ్లీ వెళ్లి సూర్య వంశీయులు లేక విష్ణు వంశీయులుగా అవుతారు. ఇప్పుడైతే శివ వంశీయులు. శివుడు తాత, బ్రహ్మ తండ్రి. ప్రజాపిత అంటే పూర్తి ప్రజలందరికీ పిత ఒక్కరే కదా. ఏదైతే మనుష్య సృష్టి రూపి వృక్షముందో, దానికి కూడా బీజముంటుంది. ఇందులో మొదటి మానవుడు కూడా ఉంటాడు. వారినే న్యూమేన్ (క్రొత్త మానవుడు) అని అంటారు. న్యూమేన్ ఎవరై ఉండవచ్చు? తప్పకుండా బ్రహ్మనే అయ్యి ఉంటాడు. బ్రహ్మ మరియు సరస్వతి కొత్తవారిగా లెక్కింపబడ్తారు. దీనికి గొప్పబుద్ధి కావాలి. ''ఓ గాడ్ ఫాదర్, ఓ సుప్రీమ్ గాడ్ ఫాదర్ '' అని ఆత్మయే పిలుస్తుంది. వారు సర్వుల రచయిత. వారు ఉన్నతాతి ఉన్నతులు. తర్వాత మనుష్య సృష్టిలోకి రండి, అందులో శ్రేష్ఠమైన వారెవరు?- ''ప్రజాపిత''. ఈ మనుష్య సృష్టి రూపి వృక్షములో బ్రహ్మ ముఖ్యమైనవారని ఎవరైనా అర్థము చేసుకుంటారు. శివుడైతే ఆత్మల తండ్రి. బ్రహ్మను మనుష్యుల రచయిత అని అనవచ్చు. కాని ఎవరి మతమనుసారము నడుస్తారు? తండ్రి చెప్తున్నారు - నేనే బ్రహ్మను దత్తు చేసుకుంటాను. మరి నూతన బ్రహ్మ ఎక్కడి నుండి వస్తారు? అనేక జన్మల అంతిమ జన్మలో నేను ఇతనిలో ప్రవేశిస్తాను. ఇతనికి ప్రజాపిత బ్రహ్మ అని పేరు పెట్తాను. మనమందరము తప్పకుండా బ్రహ్మ పిల్లలమని మీకు తెలుసు. శివబాబా ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. మనము తండ్రి ద్వారా పవిత్రత, సుఖము, శాంతి, ఆరోగ్య, ఐశ్వర్యాలను తీసుకునేందుకు వచ్చాము. భారతదేశములో మనమే సదా సుఖంగా ఉండేవారము. ఇప్పుడలా లేము. ఇప్పుడు తిరిగి తండ్రి వారసత్వమునిస్తారు. ముఖ్యమైనది పవిత్రత అని పిల్లలకు తెలుసు. రాఖీ ఎవరికి కడ్తారు? అపవిత్రులైన వారే తిరిగి మేము పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తారు. ఈ గురి(లక్ష్యము) చాలా గొప్పదని తండ్రి చెప్తున్నారు. యుగల్స్గా ఉన్నవారు - సోదరి-సోదరులుగా ఎలా ఉంటున్నారో అర్థము చేయించాలి. స్థితిని తయారు చేసుకోవడంలో సమయము పడ్తుంది. మాయా తుఫానులు చాలా వస్తున్నాయని పిల్లలు వ్రాస్తారు కూడా. గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రంగా ఉండే పిల్లలు ఉపన్యసిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది కొత్త విషయము. ఇది స్వరాజ్య రాజయోగము. ఇందులో కూడా సన్యాసముంది. గృహస్థ వ్యవహారములో ఉంటూ మనము జీవన్ముక్తులుగా లేక సద్గతిని పొందుకుంటాము. ఇక్కడున్నది జీవన బంధనము. మీది స్వరాజ్య పదవి. స్వయానికి రాజ్యము కావాలి. ఇప్పుడు వారికి రాజ్యము లేదు. ''నేను రాజుగా ఉన్నాను, రాణిగా ఉన్నాను ఇప్పుడు మేము వికారిగా, భికారిగా అయిపోయాము, మాలో ఏ గుణమూ లేదు - ఇలా ఆత్మనే చెప్తుంది కదా. కావున స్వయాన్ని ఆత్మ అని పరమపిత పరమాత్మ సంతానమని భావించాలి. ఆత్మలైన మనము సోదరులము, పరస్పరములో చాలా ప్రీతి కలిగి ఉండాలి. మనము పూర్తి ప్రపంచాన్ని ప్రేమమయంగా చేస్తాము. రామరాజ్యములో మేక, పులి కూడా ఒక్కటిగా నీరు త్రాగేవి. ఎప్పుడూ పోట్లాడుకునేవి కావు. కనుక పిల్లలైన మీలో ఎంత ప్రేమ ఉండాలి! ఈ స్థితి నెమ్మది నెమ్మదిగా వస్తుంది. చాలా పోట్లాడ్తారు కదా. పార్లమెంటులో కూడా జగడాలైనప్పుడు ఒకరి పై, మరొకరు కుర్చీలు విసిరేసుకొని కొట్టుకోవడం ప్రారంభిస్తారు. అది ఆసురీ సభ. ఇది మీ ఈశ్వరీయ సభ. మీకు ఎంత నషా ఉండాలి. కాని ఇది స్కూలు. చదువులో కూడా కొంతమంది చాలా పైకి వెళ్తారు. కొందరు ఢీలా అయిపోతారు. ఈ స్కూలు కూడా అద్భుతమైనది. అక్కడైతే స్కూలు టీచర్లు వేరు వేరుగా ఉంటారు. ఇక్కడ స్కూలు ఒక్కటే, టీచరు ఒక్కరే. ఆత్మ శరీరాన్ని ధరించి బోధిస్తుంది. ఆత్మకు నేర్పిస్తుంది. మనము ఆత్మలము, వారు పరమాత్మ. ఇది పూర్తి రోజంతా బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఇంత ఆత్మాభిమానులుగా అవ్వాలి. దేహాభిమానము వలననే తప్పులు జరుగుతూ ఉంటాయి. తండ్రి మాటిమాటికి దేహీ-అభిమాని భవ అని చెప్తున్నారు. దేహాభిమానములోకి వస్తే మాయ యుద్ధము చేస్తుంది. చాలా ఎత్తైన గమ్యము. ఎంతగా విచార సాగర మథనము చేయవలసి ఉంటుంది! రాత్రి సమయములోనే విచార సాగర మథనము జరగగలదు. ఇలా విచార సాగర మథనము చేస్తూ చేస్తూ తండ్రి వలె అవుతూ ఉంటారు.
పిల్లలైన మీరు మొత్తం జ్ఞానాన్ని అంతా బుద్ధిలో ఉంచుకోవాలి. గృహస్థ వ్యవహారములో ఉంటూ రాజయోగాన్ని నేర్చుకోవాలి. అంతా బుద్ధితోనే పని. బుద్ధిలోనే ధారణ అవుతుంది. గృహస్థులకైతే చాలా కష్టము. ఈ రోజుల్లో తమోప్రధానులైన కారణంగా చాలా చెడుగా(మురికిగా) ఉంటారు. మాయ అందరినీ సమాప్తము చేసేసింది. బాగా నమిలి ఒక్కసారిగా తినేస్తుంది. మాయ రూపి కొండచిలువ కడుపు నుండి వెలికి తీసేందుకు తండ్రి వస్తారు. వెలికి తీయడం చాలా కష్టము. ఎవరైతే గృహస్థ వ్యవహారములో ఉంటారో వారు తమ ప్రతాపాన్ని చూపించాలి. మాది రాజయోగమని అర్థము చేయించాలి. మనలను బ్రహ్మకుమార-కుమారీలని ఎందుకు పిలుస్తారు? ఈ ప్రశ్నను అర్థము చేసుకొని ఇతరులకు అర్థము చేయించాలి. వాస్తవానికి మీరు కూడా బ్రహ్మకుమారీలే. ప్రజాపిత బ్రహ్మ నూతన సృష్టిని రచిస్తారు. నూతన మనుష్యుని(న్యూ మ్యాన్) ద్వారా నూతన సృష్టిని తయారు చేస్తారు. వాస్తవానికి సత్యయుగములో ఉండే మొదటి పుత్రుడినే కొత్తవారని అంటారు. ఇది ఎంతో సంతోషించదగ్గ విషయము. అక్కడైతే ఆత్మ మరియు శరీరము రెండూ పవిత్రంగా ఉంటాయి. సంతోషపు బాజా భజంత్రీలు మ్రోగుతూ ఉంటాయి. ఇక్కడైతే ఇప్పుడు ఇతనిలో బాబా ప్రవేశించి ఉన్నారు. ఈ నూతన మనిషి పవిత్రంగా ఏమీ లేడు. తండ్రి పాత వ్యక్తిలో కూర్చొని కొత్తగా తయారు చేస్తారు. పాత వస్తువును కొత్తదిగా తయారు చేస్తారు. ఇప్పుడు నూతన మనిషి అని ఎవరిని అనాలి? బ్రహ్మను అనవచ్చా? బుద్ధితో పని చేయాలి. ఏడమ్ - ఈవ్ ఎవరో వారికి తెలియదు. శ్రీ కృష్ణుడు నూతన మనిషి. అతడే మళ్లీ పురాతన మనిషిగా, బ్రహ్మగా అవుతాడు. మళ్లీ ఆ పురాతన మనిషిని నూతన ప్రపంచము కొరకు కొత్త మనిషిగా నేను తయారుచేస్తాను. కొత్త ప్రపంచానికి కొత్త మనిషి కావాలి. అతడు ఎక్కడ నుండి వస్తాడు? నూతన మనిషి సత్యయుగ రాజకుమారుడు. అతడిని సుందరమైనవాడని అంటారు. ఇతడు పతితుడు, ఇతడు నూతన మనిషి కాదు. ఆ శ్రీ కృష్ణుడే 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు చివరి జన్మలో ఉన్నాడు. బాబా అతడినే దత్తు తీసుకుంటారు. పాత వారిని కొత్తవారిగా తయారుచేస్తారు. ఇవి ఎంత లోతైన అర్థము చేసుకోదగ్గ విషయాలు. కొత్త నుండి పురాతనమైన వారిగా, పురాతనమైన వారి నుండి నూతనమైన వారిగా, శ్యామము నుండి సుందరంగా, సుందరము నుండి శ్యామంగా, అతిపురాతనమైనది మళ్లీ అతిక్రొత్తదిగా తయారౌతుంది. బాబా మనలను నవీకరణము(రిజువనేట్) చేసి అత్యంత నూతనమైనవారిగా తయారుచేస్తున్నారు. ఇవి చాలా అర్థము చేసుకోవలసిన విషయాలు అంతేకాక తమ స్థితిని కూడా తయారుచేసుకోవాలి. కుమార, కుమారీలైతే పవిత్రులు మిగిలిన మనము గృహస్థములో ఉంటూ కమల పుష్ప సమానంగా స్వదర్శన చక్రధారులుగా అవుతాము. విష్ణు వంశీయులకు త్రికాలదర్శులుగా అయ్యే జ్ఞానము లేదు. పాత మనిషి త్రికాలదర్శి. ఎంత అతిక్లిష్టమైన విషయాలు. పాత మనిషే జ్ఞానము తీసుకొని నూతన మనిషిగా అవుతాడు. అది హఠ యోగము. ఇది రాజయోగమని తండ్రి కూర్చుని అర్థము చేయిస్తారు. రాజయోగము అంటేనే స్వర్గ చక్రవర్తి పదవి. సన్యాసులు సుఖాన్ని కాకిరెట్టతో సమానమని అంటారు, అసహ్యించుకుంటారు. ''నారి స్వర్గ ద్వారము'' అని తండ్రి చెప్తున్నారు. మాతల పైనే కళశాన్ని పెడ్తాను. కావున మొట్టమొదట శివాయ నమ:, భగవానువాచ అని తెలియజేయాలి. శబ్ధం బిగ్గరగా వెలువడాలి. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఆత్మలమైన మనము సోదరులము ఈ నిశ్చయముతో పవిత్రతా వ్రతమును పాలన చేస్తూ పరస్పరము చాలా ప్రీతితో మెలగాలి. అందరినీ ప్రీతి పాత్రులుగా(లవ్లీగా) తయారు చేయాలి.
2. విశాల బుద్ధిగలవారై జ్ఞాన గుహ్య రహస్యాలను అర్థము చేసుకోవాలి. విచార సాగర మథనము చేయాలి. మాయ యుద్ధము నుండి రక్షింపబడాలంటే దేహీ-అభిమానులుగా ఉండే అభ్యాసము చేయాలి.
వరదానము :-
''సంతోషమనే ట్యాబ్లెట్ లేక ఇంజెక్షన్ ద్వారా మీ చికిత్స మీరే చేసుకునే నాలెడ్జ్ఫుల్ భవ''
బ్రాహ్మణ పిల్లలు తమ జబ్బుకు తామే చికిత్స చేసుకోగలరు. సంతోషమనే పౌష్ఠిక ఆహారము సెకండులో ప్రభావము చూపే చికిత్స. ఎలాగైతే డాక్టర్లు శక్తిశాలి ఇంజెక్షన్ వేస్తే పరివర్తన అయిపోతారో, అలా బ్రాహ్మణులు స్వయం మీకు మీరే సంతోషము కలిగించే మాత్రలు ఇచ్చుకుంటే లేక ఖుషీ అనే ఇంజెక్షన్ వేసుకుంటే వ్యాధి రూపమే మారిపోతుంది. జ్ఞానమనే లైటు, మైటు శరీరాన్ని కూడా నడిపించడంలో చాలా సహాయము చేస్తుంది. ఏదైనా జబ్బు చేస్తే అది కూడా బుద్ధికి విశ్రాంతినిచ్చే సాధనంగా అవుతుంది.
స్లోగన్ :-
''ఎవరైతే మానసిక ఏకాగ్రత ద్వారా సర్వ సిద్ధులు ప్రాప్తి చేసుకుంటారో, వారే సిద్ధి స్వరూపులుగా అవుతారు.''