11-10-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - మీరు అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. ఇందులోనే జ్ఞానము, భక్తి, వైరాగ్యము మూడూ ఇమిడి ఉన్నాయి, ఇది కొత్త చదువు ''
ప్రశ్న :-
సంగమ యుగములో జ్ఞాన-యోగాలతో పాటు భక్తి కూడా కొనసాగుతుంది. ఎలా?
జవాబు :-
వాస్తవానికి యోగమును 'భక్తి' అని కూడా అనవచ్చు. ఎందుకంటే పిల్లలైన మీరు అవ్యభిచారి స్మృతిలో ఉంటారు. మీరు చేసే ఈ స్మృతి జ్ఞాన సహితమైనది. అందుకే దీనిని యోగమని అన్నారు. ద్వాపర యుగము నుండి కేవలం భక్తి మాత్రమే జరుగుతుంది, జ్ఞానముండదు. అందుకే ఆ భక్తిని యోగమని అనరు. అందులో ముఖ్య ధ్యేయమేదీ లేదు. ఇప్పుడు మీకు జ్ఞానమూ లభిస్త్తుంది, యోగము కూడా చేస్తారు. అంతేకాక మీకు ఈ విశాల అనంతమైన సృష్టి పై వైరాగ్యము కూడా ఉంది.
పాట :-
ఎవరో నన్ను తనవారిగా చేసుకొని నవ్వడం నేర్పించారు...... (కిసీనే అప్నా బనాకే ముఝ్కో,.... ) 
ఓంశాంతి.
అనంతమైన తండ్రి అర్థము చేయిస్తున్నారు - శాస్త్రాల చదువును చదువు అని అనరు. ఎందుకంటే శాస్త్రాల చదువులో లక్ష్యమేదీ లేదు. శాస్త్రాల ద్వారా ప్రపంచాన్ని గూర్చి ఏమీ తెలియదు. అమెరికా ఎక్కడుందో, దానిని ఎవరు వెదికారో ఈ విషయాలు శాస్త్రాలలో లేవు. ఫలానావారు వెతికారని అంటారు. తాము నివసించేందుకు ఇతర ప్రదేశాలను వెతుకుతారు. మనుష్యుల సంఖ్య ఎంతగానో పెరిగిపోయింది అని గమనిస్తారు. మరి ఉండేందుకు స్థలమైతే కావాలి కదా! ఈ విషయాలన్నీ చదువుకు సంబంధించిన విషయాలు. దీనిని విద్య అని అంటారు. ఇది కూడా మీ విద్యయే. దీనిని ఆశ్రమము అని అనాలా లేక సంస్థ(ఇన్స్టిట్యూషన్) అని అనాలా లేక విశ్వవిద్యాలయము (యూనివర్సిటీ) అని పిలవాలా? ఇందులో అన్నీ వచ్చేస్తాయి. ఆ చదువులోని మ్యాపులు మొదలైనవి వేరు. శాస్త్రాల ద్వారా ప్రకాశము లభించదు, చదువు ద్వారానే ప్రకాశము లభిస్తుంది. మీది కూడా చదువే. వైకుంఠము అని దేనిని అంటారో అది ఆ చదువులోనూ లేదు, శాస్త్రాలలోనూ లేదు. ఈ జ్ఞానమే కొత్తది. దీనిని ఒక్క తండ్రే తెలియజేస్తారు. మనుష్యులైతే స్వర్గము, నరకము అన్నీ ఇక్కడే ఉన్నాయని అంటారు. స్వర్గము, నరకము అని దేనిని అంటారో తండ్రియే అర్థం చేయిస్తారు. ఈ విషయాలు శాస్త్రాలలోనూ లేవు, ఆ భౌతిక విద్యలోనూ లేవు. కావున కొత్త విషయాలైనందున మనుష్యులు తికమకపడ్తారు. ఇటువంటి జ్ఞానాన్ని మేము ఎప్పుడూ వినలేదని అంటారు. ఇవి చాలా అద్భుతమైన కొత్త విషయాలు. వీటిని ఎప్పుడూ ఎవ్వరూ వినిపించలేదు. ఇవి పూర్తిగా క్రొత్త విషయాలు. ఈ చదువును వారూ(ప్రపంచములో చదువు నేర్పించేవారు) వినిపించలేరు, సన్యాసులు మొదలైనవారు కూడా వినిపించలేరు. కావున పరమపిత పరమాత్మనే జ్ఞానసాగరుడని అంటారు. వారు అనంతమైన చరిత్ర-భూగోళాలను కూడా అర్థము చేయిస్తారు. జ్ఞానము ద్వారా స్వర్గము, నరకముల విస్తారాన్ని కూడా వినిపిస్తారు. ఇవి క్రొత్త విషయాలు కదా! ఈ చదువులో అన్నీ ఉన్నాయి. జ్ఞానమూ ఉంది, యోగమూ ఉంది. చదువూ ఉంది, భక్తి కూడా ఉంది. యోగమును భక్తి అని కూడా అనవచ్చు. ఎందుకంటే ఒక్కరితో యోగమును జోడించాలి, వారినే స్మృతి చేయవలసి ఉంటుంది. ఆ భక్తులు కూడా స్మృతి చేస్తారు, పూజిస్తారు, గానం చేస్తారు. ఆ భక్తిని యోగమని అనరు. మీరాబాయి కృష్ణునితో యోగము జోడించేది. అతనినే స్మృతి చేస్తూ ఉండేది. కాని దానిని భక్తి అని అంటారు. ఆమె బుద్ధిలో లక్ష్యము, ఉద్ధేశ్యము ఏదీ లేదు. కాని దీనినైతే జ్ఞానమనీ అంటారు, భక్తి అని కూడా అంటారు. యోగమును జోడిస్తారు. ఒక్కరినే స్మృతి చేస్తారు. సత్యయుగములో భక్తీ ఉండదు, జ్ఞానము కూడా ఉండదు. సంగమ యుగములో జ్ఞానము మరియు భక్తి రెండూ ఉన్నాయి. మళ్లీ ద్వాపర యుగం నుండి కేవలం భక్తి ఒక్కటే కొనసాగుతూ వచ్చింది. ఎవరినైనా స్మృతి చేయడాన్ని భక్తి అని అంటారు. ఇక్కడ ఇది జ్ఞానము, యోగము మరియు భక్తి కూడా అర్థం చేసుకోగలరు. వారు కేవలం భక్తులే. వారు తత్వముతో యోగాన్ని జోడిస్తారు. కాని వారిది అనేకులతో చేసే యోగము. అందుకే దానిని భక్తి అని అంటారు. మీది అవ్యభిచారీ యోగము. ఇది జ్ఞాన సాగరుడే స్వయంగా కూర్చొని చదివిస్తారు. వారితో యోగము జోడించవలసి ఉంటుంది. భక్తులకైతే ఆత్మను గూర్చే తెలియదు. అది మనకు తెలుసు. పరమపిత పరమాత్మ అయిన తండ్రితో బుద్ధియోగాన్ని జోడించడం ద్వారా మనం తండ్రి వద్దకు వెళ్లిపోతాము. వారు హనుమంతుని స్మృతి చేస్తారు. అప్పుడు వారికి హనుమంతుని సాక్షాత్కారము జరుగుతుంది. వారిది వ్యభిచారీ స్మృతి అని అంటారు. ఇది అవ్యభిచారీ యోగము. కేవలం ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. కావున ఇందులో జ్ఞానము, భక్తి, వైరాగ్యము అన్నీ కలిసి ఉన్నాయి. అక్కడ వారివన్నీ వేరు వేరుగా ఉంటాయి. భక్తి వేరు, వారికున్న జ్ఞానమంతా కేవలం శాస్త్రాలదే. వారి వైరాగ్యము కూడా హద్దులోనిదే. ఇక్కడిది అనంతమైన వైరాగ్యము. మనకు అనంతమైన తండ్రిని గూర్చి తెలుసు. కావున వారిని స్మృతి చేస్తాము. వారు శివుని తల్చుకున్నా వికర్మలైతే వినాశమవ్వవు ఎందుకంటే వారికి వారి కర్తవ్యము గూర్చి తెలియదు. వికర్మలను వినాశనము చేసుకొనే జ్ఞానమే లేదు. ఇక్కడైతే తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనమౌతాయి. అక్కడ కాశీలో బలి అవుతారు(కత్తుల బావిలో దూకుతారు). కావున వారి వికర్మలు వినాశనమౌతాయి. కర్మభోగమును అనుభవించవలసి ఉంటుంది. అంతేకాని మీ వలె వారు మెల్ల-మెల్లగా కర్మాతీతులుగా అవ్వరు. వారి వికర్మలు శిక్షలు అనుభవిస్తూ అనుభవిస్తూ అంతమవుతాయే కాని అవి క్షమించబడవు. ఇది చదువు, జ్ఞానము మరియు యోగము కూడా. ఇందులో అన్నీ ఇమిడి ఉన్నాయి. నేర్పించేవారు ఒక్క తండ్రియే. దీనిని ఆశ్రమము లేక ఇన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. ఇది చాలా బాగా వ్రాయబడి ఉంది. ఇంతకు ముందు ఉన్న 'ఓంమండలి' అన్న పేరు సరిగ్గా లేదు. ఇప్పుడు అర్థమయ్యింది. ఈ పేరు( ప్రజాపిత బ్రహ్మాకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయము) చాలా బాగుంది. మీరు కూడా బ్రహ్మాకుమారులే అని ఎవరికైనా అర్థం చేయించవచ్చు. తండ్రి అందరి రచయిత. వారు మొట్టమొదట సూక్ష్మవతనాన్ని రచిస్తారు. బ్రహ్మ, విష్ణు, శంకరులు సూక్ష్మ వతనవాసులు, క్రొత్త సృష్టిని రచిస్తారు. కావున తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ కావాలి. సూక్ష్మవతనవాసి అయితే ఇక్కడకు రాజాలడు. అతడు సంపూర్ణ అవ్యక్తుడు. ఇక్కడైతే సాకార బ్రహ్మ కావాలి కదా! మరి అతడు ఎక్కడ నుండి వస్తాడు? మనుష్యులు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. చిత్రాలైతే ఉన్నాయి కదా! బ్రహ్మ నుండి బ్రాహ్మణులు జన్మించారు. కాని అసలు బ్రహ్మ ఎక్కడ నుండి వచ్చాడు? దత్తత తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణానికి ఏ రాజుకైనా పిల్లలు లేకపోతే ఆ రాజు దత్తత తీసుకుంటాడు. అలాగే బాబా కూడా ఇతడిని(బ్రహ్మ) దత్తత తీసుకున్నారు. మళ్లీ ఇతనికి పేరు మార్చి ' ప్రజాపిత బ్రహ్మ' అన్న పేరును పెట్టారు. పైన ఉన్న బ్రహ్మ అయితే క్రిందకు రాజాలడు. క్రింద ఉన్నవాడే పైకి వెళ్లాలి. అతడు అవ్యక్తుడు, ఇతడు వ్యక్తుడు. కావున ఈ రహస్యాన్ని కూడా బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అందరికీ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ దాదాను కాసేపు బ్రహ్మ అని, కాసేపు భగవంతుడు అని, కాసేపు కృష్ణుడు అని అంటున్నారే.........! అని అంటారు. ఇతడిని 'భగవంతుడు' అని అనడం జరగదు. పోతే 'బ్రహ్మ మరియు కృష్ణుడు' అని అనవచ్చు. ఎందుకంటే కృష్ణుడు నల్లగా అవుతాడు. రాత్రిగా అయినప్పుడు 'బ్రహ్మ' అని, పగలు ఉన్నప్పుడు 'కృష్ణుడు' అని అంటారు. ఇప్పుడిది(బ్రహ్మ) కృష్ణుని ఆత్మ యొక్క అంతిమ జన్మ మరియు కృష్ణుడు ఆది జన్మ. ఈ విషయాన్ని స్పష్టంగా వ్రాయవలసి ఉంటుంది. 84 జన్మలు రాధా-కృష్ణులవా లేక లక్ష్మీ నారాయణులవా? అనే విషయాలను అర్థము చేయించవలసి ఉంటుంది. ఇక్కడ వారిని మళ్లీ దత్తత తీసుకుంటారు. కావున బ్రహ్మకు పగలు, బ్రహ్మకు రాత్రి ఉంటాయి. అక్కడ మళ్లీ లక్ష్మీనారాయణుల పగలు, రాత్రి ఉంటాయి. వారి వంశావళికి కూడా అలాగే జరుగుతుంది.
ఇప్పుడు మీరు బ్రాహ్మణ కులానికి చెందినవారు మళ్లీ మీరు దేవతా కులానికి చెందినవారిగా అవుతారు. కావున బ్రహ్మాకుమారీ-కుమారులకు కూడా రాత్రి మరియు పగలు ఉంటాయి కదా! ఇవన్నీ బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. చిత్రాలలో కూడా స్పష్టంగా ఉంది. క్రింద తపస్సు చేస్తున్నారు. ఇది అంతిమ జన్మ. బ్రహ్మ ఎక్కడ నుండి వచ్చారు, ఎవరి ద్వారా జన్మ తీసుకుంటారు? కావున బ్రహ్మను దత్తత తీసుకుంటారు. ఉదాహరణానికి రాజు దత్తత తీసుకొని రాజకుమారునిగా చేస్తాడు కదా! ప్రిన్స్ ఆఫ్ ఫలానా అని బదిలీ చేసేస్తారు. అంతకు ముందు అతడు యువరాజు కాదు. రాజు దత్తత తీసుకోవడంతో రాకుమారుడు అన్న పేరు వచ్చేసింది. ఈ ఆచారము కొనసాగుతూ వచ్చింది. పిల్లలకు ఈ విషయం బుద్ధిలోకి రావాలి. తండ్రి ఏ విధంగా పాత ప్రపంచ వినాశనము, కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారో ప్రపంచానికి తెలియదు. ఈ జ్ఞాన ప్రకాశము పిల్లలైన మీలో ఉంది. మీలో కూడా నెంబరువారీగా ఉన్నారు. ముందు ముందు, చిన్న చిన్న పిల్లలు కూడా చాలా చురుకుగా అవుతూ ఉంటారు. ఎందుకంటే వారు కుమారీలు కదా! చదువుకున్నవారు కూడా ఉన్నారు. కుమారీల ద్వారా బాణాలను వేయించారు అని కూడా శాస్త్రాలలో వ్రాయబడి ఉంది. కుమారీల చమత్కారము నెంబర్వన్లోకి వెళ్లింది. మమ్మా కూడా కుమారీయే. అందరికంటే వేగంగా ముందుకకు వెళ్లింది. కుమార్తె తల్లిని ప్రత్యక్షం చేస్తుంది అని అంటారు. తల్లి కూర్చుని ఎవరితోనూ మాట్లాడదు కదా! ఇక్కడ ఈ తల్లి గుప్తము. ఆ మమ్మా ప్రత్యక్షంగా ఉంది. కావున శక్తులు లేక పిల్లలైన మీ పని - తల్లిని ప్రత్యక్షం చేయడం. చాలా మంచి మంచి పిల్లలు కూడా ఉన్నారు. వారి పురుషార్థము చాలా బాగా నడుస్తుంది. కౌరవ సంప్రదాయములో కూడా మహారథులుగా ఉన్నవారి కొందరి పేర్లు ముఖ్యంగా ఉన్నాయి కదా! అలాగే ఇక్కడ కూడా మహారథుల పేర్లు ఉన్నాయి. అందరికన్నా ఉన్నతమైనవారు శివబాబా. వారు ఉన్నతోన్నతమైన భగవంతుడు. వారి నివాస స్థానము కూడా చాలా ఉన్నతమైనది. వాస్తవానికి ఆత్మలైన మన నివాస స్థానము కూడా ఉన్నతమైనదే. మనుష్యులైతే కేవలం మహిమ చేస్తూ ఉంటారు. కాని వారికి ఏమీ తెలియదు. ఆత్మలైన మనం కూడా అచ్చటి నివాసులమే. కాని మనం జనన-మరణాలలోకి వచ్చి పాత్రను అభినయించాలి. వారు తండ్రి జనన-మరణాలలోకి రారు. అయితే వారికి కూడా పాత్ర ఉంది. కాని అది ఎలా ఉందో మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడిది శివబాబా రథమని పిల్లలైన మీరు అర్థము చేసుకున్నారు. ఇది అశ్వము లేక గుర్రము కూడా. అంతేకాని ఆ గుర్రపు బండి విషయమేదీ లేదు. తప్పులు ఏవైతే జరిగాయో అవి కూడా డ్రామాలో రచింపబడి ఉన్నాయి. అర్ధకల్పము మనము కూడా ఆ పొరపాట్లలో భ్రమిస్తూ, భ్రమిస్తూ పూర్తిగా తప్పిపోతాము. ఇప్పుడు జ్ఞాన ప్రకాశము లభించడంతో చాలా అప్రమత్తమైపోయారు. ఈ పురాతన ప్రపంచము అంతము కానున్నదని, మనము నిర్మోహులుగా అవ్వాలని మనకు తెలుసు. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా నిర్మోహులుగా అయ్యేందుకు పురుషార్థము చేయాలి. అందరితోనూ తోడు నిభాయించాలి. కలిసి నివసించాలి కూడా. ఈ భట్టీ కూడా తయారు అవ్వవలసి ఉంది. కల్పక్రితము కూడా ఇదే విధంగా తయారయ్యింది. ఇప్పుడు అంటున్నారు - గృహస్థ వ్యవహారములో ఉంటూ కష్టపడాలి. ఇక్కడ ఇళ్లు-వాకిళ్లు వదిలే విషయమే లేదు. మనమందరమూ ఇంట్లోనే ఉన్నాము కదా! ఎంతమంది పిల్లలు ఉండేవారు! లౌకికము వారు కూడా ఉండేవారు కదా. నిజానికి ఏమీ వదలలేదు. సన్యాసులైతే ఇళ్లు-వాకిళ్ళు వదిలి అడవులకు వెళ్ళిపోతారు. మనమైతే పట్టణములోనే కూర్చుని ఉన్నాము. మనము అందరితో తోడు నిభాయించాలి. రచన తండ్రిదే. లౌకిక తండ్రి సంపాదించి పిల్లలకు వారసత్వమును ఇస్తారు. మొదట కామ వికారాన్ని వారసత్వముగా ఇస్తాడు, ఆ తర్వాత దాని నుండి విడిపించి నిర్వికారులుగా చేయడం ఈ తండ్రి కర్తవ్యమే. కొన్ని చోట్ల పిల్లలే తల్లిదండ్రులకు జ్ఞానమునిస్తారు. మరికొన్ని చోట్ల తల్లిదండ్రులు పిల్లలకు జ్ఞానమునిస్తారు.
ఇది రాజయోగము, వారిది హఠయోగము. ఆత్మకు పరమాత్మ ద్వారా జ్ఞానము లభిస్తుంది. నేను(బ్రహ్మ) రాజాధి రాజుగా ఉండేవాడిని. ఇప్పుడు నిరుపేదగా అయిపోయాను. నిరుపేదల నుండి సుసంపన్నులుగా అవుతారనే గాయనము కూడా ఉంది. సూర్య వంశీయులుగా ఉన్న మనము ఇప్పుడు శూద్ర వంశీయులుగా అయ్యామని పిల్లలకు తెలుసు. నరకము వేరు, స్వర్గము వేరు అని కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. మనుష్యులకు ఈ విషయాలు తెలియవు. మీలో కూడా చాలా మంది పిల్లలకు ఏమీ తెలియదు. ఎందుకంటే వారి భాగ్యములోనే లేదు. మరింక పురుషార్థమేమి చేస్తారు? కొందరి భాగ్యములో ఏమీ లేదు. కొందరి భాగ్యములో అన్నీ ఉన్నాయి. భాగ్యము పురుషార్థాన్ని చేయిస్తుంది. భాగ్యము లేకపోతే పురుషార్థము ఏమి చేస్తారు? ఉన్నది ఒకే స్కూలు. అది కొనసాగుతూ ఉంటుంది. కొందరు పిల్లలు మధ్యలోనే పడిపోతారు. కొందరు నడుస్తూ నడుస్తూ మరణిస్తారు. జన్మ తీసుకోవడం, మరణించడం జరుగుతూనే ఉంటుంది. ఈ జ్ఞానము ఎంతో అద్భుతమైనది. చాలా సహజమైనది. శ్రమ అంతా కర్మాతీత స్థితిని పొందడంలోనే ఉంది. వికర్మలు వినాశనమైనప్పుడే ఎగురగలరు. ధ్యానము(సాక్షాత్కారాలు, ట్రాన్స్) కన్నా జ్ఞానము శ్రేష్ఠమైనది. ధ్యానములో మాయ ద్వారా విఘ్నాలు చాలా వస్తాయి. అందువలన ధ్యానము కన్నా జ్ఞానము మంచిది. అలాగని యోగము కన్నా జ్ఞానము మంచిదని కాదు. ధ్యానము గురించి అలా చెప్పడం జరుగుతుంది. ఒకప్పుడు ధ్యానములోనికి వెళ్లేవారు. ఈ రోజు లేనే లేరు. యోగములో సంపాదన ఉంటుంది. వికర్మలు వినాశనమవుతాయి. ధ్యానములో సంపాదన ఏమీ లేదు. యోగము మరియు జ్ఞానములో సంపాదన ఉంది. జ్ఞాన-యోగాలు లేకుంటే ఆరోగ్యవంతంగా, సంపన్నంగా అవ్వలేరు. అలా విహరించే అలవాటు అయిపోతుంది. అది కూడా మంచిది కాదు. ధ్యానము ఎంతో నష్టపరుస్తుంది. జ్ఞానము ఒక్క సెకండుదే. యోగము ఒక్క సెకండుది కాదు. జీవించి ఉన్నంత వరకూ యోగము జోడిస్తూనే ఉండాలి. జ్ఞానము సహజమైనది. కానీ ఆరోగ్యవంతంగా, నిరోగులుగా అయ్యేందుకు శ్రమించవలసి ఉంటుంది. ఆమృతవేళలో లేచి స్మృతిలో కూర్చోవటంలో కూడా ఎన్నో విఘ్నాలు వస్తాయి. పాయింట్లు తీసినప్పుడు కూడా బుద్ధి అటూ-ఇటూ వెళ్లిపోతూ ఉంటుంది. మొదటి నంబరులో ఉన్నవారికి అందరికంటే ఎక్కువగా తుఫానులు వస్తాయి. శివబాబాకైతే రాజాలవు. తుఫానులు చాలా వస్తాయని ఈ బాబా సదా తెలుపుతూ ఉంటారు. స్మృతిలో ఉండేందుకు ఎంతగా ప్రయత్నిస్తారో, అంత ఎక్కువగా తుఫానులు వస్తాయి. వాటికి భయపడరాదు, స్మృతిలో ఉండాలి, స్థిరంగా ఉండాలి. మిమ్ములను తుఫానులు కదిలించరాదు. ఇది చివరి స్థితి. ఇది ఆత్మిక పరుగు పందెము. శివబాబాను స్మృతి చేస్తూ ఉండండి. ఇవి కూడా అర్థము చేసుకొని ధారణ చేయవలసిన విషయాలు. ధనాన్ని దానము చేయకపోతే ధారణ జరగదు, పురుషార్థము చేయాలి. ఇరువురు తండ్రుల పాయింటును ఎవరికైనా అర్థము చేయించడం చాలా సులభము. బాబా 21 జన్మల వారసత్వమును ఇస్తారని కూడా మీకు మాత్రమే తెలుసు. ఈ లక్ష్మీనారాయణులకు తండ్రి ద్వారా 21 జన్మల వారసత్వము లభించిందని మీరు అంటారు. బాబా వారికి రాజయోగాన్ని నేర్పించారు. ఇంకెవ్వరూ లక్ష్మీనారాయణులకు భగవంతుడు ఈ వారసత్వమును ఇచ్చారని చెప్పజాలరు. ప్రపంచములో కొందరు ఒక విషయములో, మరికొందరు మరో విషయములో సంతోషపడ్తూ ఉంటారు. మీరు ఏ విషయములో సంతోషపడ్తారో ఎవ్వరికీ తెలియదు. మనుష్యులు అల్పకాలిక క్షణభంగురమైన సంతోషాలను జరుపుకుంటారు. మీరు సత్యమైన బ్రాహ్మణ కులభూషణులు. యోగులు మరియు జ్ఞానులు. మీరు అనుభవించే అతీంద్రియ సుఖమునిచ్చే సంతోషాన్ని గూర్చి ఇతరులెవ్వరికీ తెలియదు. వారు ఎంతో కష్టపడుతూ ఉంటారు. చంద్రుని పైకి వెళ్లేందుకు పురుషార్థము చేస్తారు. ఎంతో కష్టపడ్తారు. వారి శ్రమ అంతా వ్యర్థమవ్వనున్నది. మీరు ఏ కష్టమూ చేయకుండా, ఎవ్వరూ చేరుకోలేని స్థానములోకి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తారు. ఉన్నతోన్నతమైన పరంధామములోకి వెళ్లిపోతారు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. గృహస్థ వ్యవహారములో ఉంటూ నిర్మోహులుగా కూడా అవ్వాలి. అందరితో తోడు నిభాయిస్తూ కమలపుష్ప సమానంగా ఉండాలి.
2. ధారణ చేసేందుకు జ్ఞాన ధనమును తప్పకుండా దానము చేయాలి. జ్ఞాన-యోగముల ద్వారా మీ సంపాదనను జమ చేసుకోవాలి. అంతేకాని ధ్యాన సాక్షాత్కారముల పై ఆశ ఉంచుకోరాదు.
వరదానము :-
'' సైలెన్స్ శక్తి ద్వారా జమ ఖాతాను పెంచుకునే శ్రేష్ఠ పదవికి అధికారీ భవ ''
ఎలాగైతే వర్తమాన సమయంలో సైన్సు శక్తికి చాలా ప్రభావముందో, అల్పకాలానికి ప్రాప్తి చేయిస్తుందో అలా సైలెన్స్ శక్తి ద్వారా జమ ఖాతాను పెంచుకోండి. తండ్రి దివ్యదృష్టి ద్వారా స్వయంలో శక్తిని జమ చేసుకోండి. అప్పుడు మీరు జమ చేసుకున్న దానిని సమయానికి ఇతరులకు ఇవ్వగలరు. ఎవరైతే దృష్టి మహత్యాన్ని తెలుసుకొని సైలెన్స్ శక్తిని జమ చేసుకుంటారో, వారే శ్రేష్ఠ పదవికి అధికారులుగా అవుతారు. వారి ముఖము ద్వారా ఆత్మిక సంతోషపు మెరుపు కనిపిస్తుంది.
స్లోగన్ :-
'' మీ పై మీకు న్యాచురల్ అటెన్షన్ ఉంటే ఏ విధమైన టెన్షన్ రాజాలదు (రాదు). ''