12-11-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - జ్ఞాన బుల్ బుల్ పిట్టగా అయ్యి ( నైటింగేల్ ) రోజంతా జ్ఞాన ఆలాపన( టిక్లూ టిక్లూ) చేస్తూ ఉంటే, లౌకిక తల్లిదండ్రులను, పారలౌకిక తల్లిదండ్రులను ప్రత్యక్షము చేయగలరు''
ప్రశ్న :-
అపనీ ఘోట్ తో నషా చఢే(లోతుగా వెళ్తేనే నషా పెరుగుతుంది) - అనే సామెత ఉంది. దీని భావార్థమేమిటి ?
జవాబు :-
బుద్ధియోగాన్ని ఇటూ-అటూ తిప్పకుండా ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఒక్క తండ్రియే బుద్ధిలో గుర్తుంటే నషా ఎక్కుతుంది. కాని దేహాభిమానము ఇందులో చాలా విఘ్నాలను కలిగిస్తుంది. చిన్న వ్యాధి వచ్చినా దు:ఖితులైపోతారు. బంధు-మిత్రులు గుర్తుకొస్తారు. అందుకే నషా ఎక్కదు. యోగములో ఉంటే నొప్పి కూడా తగ్గిపోతుంది.
పాట :-
తూనే రాత్ గవాయి సోకే, దివస్ గవాయే ఖాకే.............(మీరు నిద్రపోతూ రాత్రిని, తింటూ పగలును పోగొట్టుకున్నారు..........) 
ఓంశాంతి.
ఈ విషయాలన్నీ శాస్త్రాలలో కూడా వ్రాయబడి ఉన్నాయి. ఒకరికొకరు అర్థము చేయిస్తారు కూడా. గురువులు అనేక రకాలైన సలహాలను ఇస్తుంటారు. చాలా మంచి మంచి భక్తులు గదిలో కూర్చుని, గోముఖ ఆకారములో గల ఒక గుడ్డ సంచిలో చేయి పెట్టి మాలను తిప్పుతూ ఉంటారు. ఇది కూడా నేర్పించబడిన ఒక ఫ్యాషన్(వైఖరి). ఇప్పుడు వీటన్నిటినీ వదిలేయండని తండ్రి చెప్తున్నారు. ఆత్మ తన తండ్రిని స్మృతి చేయాలి. ఇందులో మాలను తిప్పి స్మరించవలసిన అవసరము లేదు. శివాయ నమ: అనే పాట అన్నిటికంటే మంచి పాట. భగవంతుని తల్లి-తండ్రి అంటారని, వారినే రచయిత అయిన తండ్రి అని అంటారని ఈ పాటలో అర్థము చేయించబడ్తుంది. రచయిత అన్న తర్వాత దేనిని రచిస్తారు? తప్పకుండా వారు నూతన ప్రపంచాన్నే రచిస్తారని అందరూ భావిస్తారు. మీరే తల్లి, తండ్రి మేము మీ బాలకులము,.............. అని పాడ్తారు కూడా. అంటే మొదట ఈశ్వరుడు అందరికీ తండ్రి అవుతారు. వారు తండ్రి అయినప్పుడు తల్లి కూడా తప్పకుండా కావాలి కదా. తల్లి లేకుండా రచించలేరు. కేవలం వారు ఎలా రచిస్తారో ఎవ్వరికీ తెలియదు. రెండవది, పరస్పరము అందరూ సోదరి - సోదరులైపోయారు. కనుక వికార దృష్టి ఉండజాలదు. తల్లి-తండ్రులు అందరికీ ఒక్కరే కదా. స్వయం అర్థము చేసుకొని ఇతరులకు అర్థము చేయించేందుకు ఈ పాయింట్లు చాలా బాగున్నాయి. మూడవది తప్పకుండా తండ్రి సృష్టిని రచించి ఉంటారు. మనము వారి పిల్లలుగా ఉండినాము. ఇప్పుడు మళ్లీ పిల్లలుగా అయ్యాము. 84 జన్మల చక్రము పూర్తి అయిన తర్వాత మాత-పితలకు చెందిన వారిగా అయ్యాము. భక్తిమార్గములో వారి మహిమే నడుస్తుంది. తల్లిదండ్రులు సృష్టిని రచిస్తారు. వారి పిల్లలుగా అయితే తప్పకుండా వారు అపారమైన సుఖాలనిస్తారు కదా. పరమాత్మ తల్లి-తండ్రిగా కూడా అవుతారు, టీచరుగా కూడా ఉన్నారు, సద్గురువుగా కూడా ఉన్నారని ఎవ్వరికీ తెలియదు.
మనమంతా బ్రహ్మ సంతానము, పరస్పరము సోదరీ-సోదరులవుతాము. బ్రహ్మకుమార- కుమారీలని కూడా పిలువబడ్తారు. వారిని కూడా రచించేవారు వారే. అపారమైన సుఖాన్ని పొందేందుకు మాత-పితల ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. దు:ఖములో ఉన్నప్పుడే వారు వచ్చి అపారమైన సుఖాలనిస్తారు అంతేగాని భవిష్య సుఖములోకి వచ్చి శిక్షణనివ్వరు. దు:ఖములో ఉన్నప్పుడే సుఖములోకి వెళ్ళేందుకు శిక్షణ లభిస్తుంది. ఆ మాత-పితలే వచ్చి సుఖాన్నిస్తారు. ఏడమ్ మరియు ఈవ్ ప్రసిద్ధమైనవారు. వారు కూడా తప్పకుండా భగవంతుని సంతానమే అవుతారు. మరి భగవంతుడు ఎవరు?
తండ్రి ఇచ్చే జ్ఞానము అన్ని ధర్మాల వారి కోసమని పిల్లలకు తెలుసు. అందరి బుద్ధియోగము ఆ తండ్రి నుండి తెగిపోయి ఉంది. మాయ అనే భూతము బుద్ధియోగాన్ని జోడింపనివ్వదు. అది ఇంకా తుంచేస్తుంది. తండ్రి వచ్చి ఆ భూతము పైన విజయాన్ని కలిగిస్తారు. ఈ రోజుల్లో ప్రపంచములో రిద్ధి - సిద్ధి(తాంత్రిక విద్యల) వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇది భూతాల ప్రపంచము. కామ వికారపు భూతము పరస్పరము ఆదిమధ్యాంతము దు:ఖాన్నిస్తుంది. ఒకరికొకరు దు:ఖమిచ్చుకోవడం భూతాల పని. సత్యయుగములో భూతాలుండవు. ఈ ఘోస్ట్(భూతము) అనే పదము బైబిల్లో ఉంది. రావణుడంటే మాయావి భూతము. ఇది భూతాల రాజ్యము. సత్యయుగ రామరాజ్యములో భూతాలు ఉండవు. అక్కడ అపారమైన సుఖముంటుంది.
ఓం నమ: శివాయ అనే పాట చాలా బాగుంది. శివుడే తల్లి-తండ్రి. బ్రహ్మ-విష్ణు-శంకరులను తల్లిదండ్రులని అనరు. శివుడినే తండ్రి అని అంటారు. ఏడమ్-ఈవ్ అంటే బ్రహ్మ-సరస్వతులు ఇక్కడి వారే కదా. అక్కడ క్రైస్తవులు గాడ్ఫాదర్ను ప్రార్థన చేస్తారు. ఈ భారతదేశము మాతా - పితల స్వంత ఊరు(జన్మ స్థానము). వారి జన్మ ఇక్కడే జరిగింది. మీరే తల్లి-తండ్రి అని పాడ్తారు కదా. కనుక పరస్పరము మీరంతా సోదర-సోదరీలవుతారు కదా అని అర్థము చేయించాలి. వారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచనను రచిస్తారు. వారు దత్తత తీసుకుంటారు. సరస్వతి కూడా దత్తత తీసుకోబడ్డది. ప్రజాపిత బ్రహ్మను దత్తత తీసుకున్నారు. అందుకే ఇంతమంది బ్రహ్మకుమారీ-కుమారులుగా అయ్యారు. శివబాబా దత్తత తీసుకుంటూ ఉంటారు. నూతన సృష్టి బ్రహ్మ ద్వారా రచించబడ్తుంది. అర్థము చేయించేందుకు చాలా యుక్తులున్నాయి. కాని పూర్తిగా అర్థము చేయించరు. ఈ శివాయ నమ: అనే పాటను అన్ని చోట్ల వినిపించమని బాబా చాలాసార్లు అర్థము చేయించారు. మనము ఆ తల్లిదండ్రుల సంతానంగా ఎలా అవుతాము? - దీనిని గురించి వారే కూర్చుని అర్థము చేయిస్తారు. బ్రహ్మ ద్వారా నూతన సృష్టిని స్థాపన చేశారు. ఈ కలియుగాంతములో తిరిగి సత్యయుగాన్ని స్థాపన చేస్తున్నారు. బుద్ధిలో ధారణ చేయాలి. జ్ఞానము చాలా సహజము. మాయా తుఫానులు జ్ఞాన- యోగాలలో నిలువనివ్వవు. బుద్ధి చకితమైపోతుంది. అందరి రచయిత అయిన భగవంతుడు ఒక్కరే. వారినే తండ్రి అని పిలుస్తారు కదా. ఆ నిరాకారులు జనన-మరణ రహితులు. బ్రహ్మ-విష్ణు-శంకరులకు సూక్ష్మ శరీరముంది. మనుష్యులు 84 జన్మలు ఇక్కడే తీసుకుంటారు. సూక్ష్మవతనంలో తీసుకోరు. మనము మాతా-పితల సంతానమని మీకు తెలుసు. మనము కొత్త పిల్లలము. తండ్రి దత్తత తీసుకున్నారు. ప్రజాపిత బ్రహ్మ అంటే ఎంతో మంది ప్రజలుంటారు. తప్పకుండా దత్తత తీసుకొని ఉంటారు. బ్రహ్మకు అనేక భుజాలు చూపుతారు. కాని అర్థము ఏమాత్రము తెలియదు. ఏవైతే చిత్రాలు లేక శాస్త్రాలు వెలువడ్డాయో అవన్నీ డ్రామా పై ఆధారపడవలసి ఉంటుంది. బ్రహ్మ పగలుగా ఉండేది, ఇప్పుడు భక్తి మార్గము ప్రారంభమయ్యింది, అది కొనసాగుతూ ఉంది. ఈ రాజయోగాన్ని తండ్రియే వచ్చి నేర్పిస్తారు. ఇది స్మృతిలో ఉండాలి.
తమలోని విశేషతలను తల్చుకునే కొలది నషా పెరుగుతుందని(ఆప్నే ఘోట్ తో నషా చఢే) అని అంటారు కదా. కాని బుద్ధియోగము తండ్రితో ఉండాలి. ఇక్కడ అనేకమంది బుద్ధియోగము భ్రమిస్తూ ఉంటుంది. పాత ప్రపంచములోని బంధు-మిత్రులు మొదలైనవారి వైపు లేక దేహాభిమానములో చిక్కుకొని ఉంటుంది. కొద్దిగా జబ్బుపడినా భయపడిపోతారు. అరే! యోగములో ఉంటే నొప్పి మొదలైనవి కూడా తక్కువైపోతాయి. యోగము చేయకుంటే జబ్బులెలా దూరమౌతాయి? నెంబరువన్ పావనంగా అయ్యే మాతా-పితలే మళ్లీ అందరికంటే ఎక్కువగా క్రిందకు దిగుతారు. వారు చాలానే అనుభవించాల్సి ఉంటుంది. కాని యోగయుక్తులై ఉన్న కారణంగా జబ్బులు దూరమౌతూ ఉంటాయి. లేకుంటే వాస్తవానికి వీరు అందరికన్నా ఎక్కువగా అనుభవించవలసి ఉంటుంది. కాని యోగబలము ద్వారా దు:ఖాన్ని దూరము చేసుకొని - బాబా ద్వారా మేము స్వర్గములో అపారమైన సుఖాలు పొందుతామని చాలా మంది సంతోషంగా ఉంటారు. చాలామంది పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించరు. రోజంతా ధ్యాస దేహము పైనే ఉంటుంది.
బాబా వచ్చి జ్ఞానాన్ని వినిపించడం(టిక్లు, టిక్లు) నేర్పిస్తారు. కనుక మీరు జ్ఞాన బుల్బుల్గా అవ్వాలి. బయట చిన్న-చిన్న పిల్లలు చాలా మంచివారున్నారు. జ్ఞానమును చాలా చక్కగా ఇతరులకు వినిపిస్తారు. భీష్మ పితామహులు మొదలైనవారికి కూడా కుమారీల ద్వారానే జ్ఞానమివ్వడం జరిగింది. చిన్న-చిన్న పిల్లలను నిల్చోబెట్టాలి అనగా శక్తిశాలురుగా తయారు చేయాలి. చిన్న పిల్లలు లౌకిక- పారలౌకిక తల్లిదండ్రులను ప్రత్యక్షము చేస్తారు. లోక, పరలోకాలు రెండూ ప్రకాశవంతంగా ఉంటాయి కదా. కావున లౌకిక తల్లిదండ్రులను కూడా పైకి ఎత్తవలసి ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు తమ తల్లిదండ్రులను ఎలా ఉన్నతి చేస్తారో మీరు చూస్తారు. కుమారీలకు చాలా గౌరవముంటుంది. కుమారీలకు అందరూ నమస్కరిస్తారు. శివశక్తి సైన్యములో అందరూ కుమారీలే. భలే మాతలైనా వారు కూడా కుమారీలనే పిలువబడ్తారు కదా. చాలా మంచి మంచి కుమారీలు వెలువడ్తారు. చిన్న చిన్న కుమారీలే చాలా బాగా ప్రత్యక్షము చేస్తారు. కొంతమంది చిన్న కుమారీలు చాలా బాగున్నారు, కాని కొందరిలో మోహము కూడా చాలా ఉంది కదా. ఈ మోహము చాలా చెడ్డది. ఇది కూడా ఒక భూతమే. బాబా నుండి విముఖులుగా చేస్తుంది. పరమపిత పరమాత్మ నుండి విముఖులుగా చేయడమే మాయ భూతము చేసే వ్యాపారము.
ఈ ఓం నమ: శివాయ అనే పాట చాలా బాగుంది. ఈ పాటలోనే మీరే తల్లి, తండ్రి,.......... అనే పదాలు కూడా ఇందులోనే లభిస్తాయి. తరచుగా రాధా-కృష్ణుల మందిరాలలో వారిని జంటగానే చూపిస్తారు. కాని గీతలో కృష్ణునితో పాటు రాధ పేరే లేదు. కృష్ణుని మహిమ - సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు......... కాని శివుని మహిమ వేరే. శివునికి హారతి ఇచ్చునప్పుడు ఎంతగానో మహిమ చేస్తారు! కాని అర్థము ఏమీ తెలుసుకోరు. పూజలు చేస్తూ చేస్తూ అలసిపోయారు. మమ్మా-బాబా మరియు బ్రాహ్మణులైన మనమే అందరికంటే చాలా ఎక్కువగా పూజారులుగా అయ్యామని మీకు తెలుసు. మళ్లీ ఇప్పుడిక్కడకు వచ్చి బ్రాహ్మణులుగా అయ్యాము. అందులో కూడా నెంబరువారుగా ఉన్నాము. కర్మభోగము కూడా ఉంటుంది. దానిని యోగము ద్వారా దూరము చేసుకోవాలి. దేహాభిమానాన్ని తెంచేయాలి. బాబాను స్మృతి చేసి చాలా సంతోషంగా ఉండాలి. తల్లిదండ్రుల నుండి మనకు అపారమైన సుఖము లభిస్తుంది. తండ్రి నుండి మనకు ఆస్తి లభిస్తుందని ఈ బ్రహ్మ కూడా చెప్తారు. బాబా నా శరీరాన్ని లోను(అప్పు)గా తీసుకున్నారు కనుక ఈ రథాన్ని బాబాయే(శివబాబా) చూసుకుంటారు. నేను ఆత్మ ఈ రథానికి తినిపిస్తున్నానని మొదట భావించేవాడిని. ఇది కూడా రథమే కదా. ఇప్పుడు ఈ రథానికి తినిపించేవారు వారే అని అనడం జరుగుతుంది. ఈ రథాన్ని వారే సంభాళించవలసి ఉంటుంది. గుర్రాల పై ఎక్కునప్పుడు యజమానులు ఆ గుర్రాలకు తమ చేతితో తినిపిస్తారు. వీపు పై నిమురుతారు, దాని పై సవారీ చేస్తారు కనుక చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కదా. మరిక్కడ తండ్రి వీరి పై సవారి చేస్తున్నారంటే బాబా వీరిని బాగా చూసుకోరా? బాబా స్నానము చేయునప్పుడు నేను కూడా స్నానము చేస్తున్నాను, బాబాకు కూడా చేయిస్తాను. ఎందుకంటే వారు కూడా ఈ రథాన్ని లోనుగా తీసుకున్నారు కదా అని భావిస్తారు. నేను(శివబాబా) కూడా నీ శరీరానికి స్నానము చేయిస్తాను, తినిపిస్తానని బాబా(శివ) చేప్పేవారు. నేను(శివబాబా) తినను, శరీరానికి తినిపిస్తాను. బాబా తినిపిస్తారే కాని వారు తినరు. స్నానము చేయునప్పుడు, తిరుగునప్పుడు ఇటువంటి రకరకాల ఆలోచనలన్నీ వస్తూంటాయి. ఇవి అనుభవం చేసిన విషయాలు కదా. అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశించానని స్వయం బాబా కూడా అంటారు. ఇతనికి తన జన్మల గురించి తెలియదు, నాకు తెలుసు. బాబా మాకు మళ్లీ జ్ఞానమిస్తున్నారని, స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలని మీరు అంటారు. సత్యయుగములో అయితే రాజులు, ప్రజలు అందరూ ఉంటారు. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థము చేయాలి. ఇప్పుడు తీసుకోలేదంటే కల్ప-కల్పము తీసుకోలేరు. ఇంత ఉన్నతమైన పదవిని కూడా పొందలేరు. జన్మ-జన్మల ఆట కనుక శ్రీమతమును ఎంతగా అనుసరించాలి! కల్ప-కల్పము నిమిత్తంగా అవుతారు. కల్ప-కల్పము వారసత్వాన్ని తీసుకుంటూ వచ్చారు. ఈ చదువు కల్ప-కల్పము కొరకు. కనుక దీని పై చాలా గమనమివ్వాలి. 7 రోజులు లక్ష్యాన్ని తీసుకొని తర్వాత మురళీని ఇంట్లో కూడా చదువుకోవచ్చు. పూర్తి సహజము చేసేస్తారు. డ్రామా బుద్ధిలో ఉండాలి కదా.
దీనిని విశ్వవిద్యాలయమని కూడా అంటారు. కావున మీరు అమెరికా వైపు వెళ్లినా, మరెక్కడకు వెళ్లినా తండ్రి నుండి ఆస్తి తీసుకోవచ్చు. కేవలం ఒక్కసారి మాత్రము ధారణ చేసి వెళ్లండి. భగవంతుని పిల్లలైనప్పుడు సోదరీ-సోదరులు అవుతారు కదా. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు అంటే పరస్పరము సోదరీ-సోదరులవుతారు. గృహస్థములో ఉంటూ పవిత్రంగా ఉండగలరు. చాలా సహజము. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. స్వయాన్ని మాయా భూతము నుండి రక్షించుకునేందుకు జ్ఞాన-యోగాలలో తత్పరులై ఉండాలి. మోహ రూపీ భూతాన్ని త్యాగము చేసి తండ్రిని ప్రత్యక్షము చేయాలి. జ్ఞానాన్ని అందరికీ వినిపిస్తూ ఉండాలి(టిక్లూ, టిక్లూ చేయాలి).
2. చదువు పై పూర్తి గమనముంచి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఇది కల్ప-కల్పపు పందెము(సవాల్). కనుక ఎటువంటి పరిస్థితిలోనూ దీనిని పోగొట్టుకోరాదు.
వరదానము :-
''కర్మయోగి స్థితి ద్వారా కర్మభోగము పై విజయం ప్రాప్తి చేసుకునే విజయీరత్న భవ ''
కర్మయోగులుగా అయినందున ఏ విధమైన శారీరిక కర్మభోగము భోగిస్తున్నానని అనుభవం చేయనివ్వదు. మనసులో ఏదైనా రోగముంటే రోగి అని అంటారు. మనసు నిరోగిగా ఉంటే సదా ఆరోగ్యంగా ఉంటారు. వారు శేషశయ్య పై విష్ణువు సమానంగా జ్ఞాన స్మరణ చేస్తూ హర్షితంగా ఉంటారు. మనన శక్తి ద్వారా ఇంకా సాగరం లోతుకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఇటువంటి కర్మయోగులే కర్మభోగం పై విజయం ప్రాప్తి చేసుకొని విజయీరత్నాలుగా అవుతారు.
స్లోగన్ :-
''సాహసాన్ని సాథీగా చేసుకుంటే ప్రతి కర్మలో సఫలత లభిస్తూ ఉంటుంది ''
మాతేశ్వరిగారి మధుర మహావాక్యాలు
మనుష్యాత్మలు పరమాత్ముని వేడుకోవడం మరియు ప్రాప్తి
నీవు మాత-పితవు, మేము మీ పిల్లలము, మీ కృప ద్వారా అపారమైన సుఖము........ ఇప్పుడు ఈ మహిమ ఎవరి గురించి గాయనం చేయబడింది? తప్పకుండా పరమాత్మ గురించే. ఎందుకంటే స్వయం పరమాత్మ మాత-పిత రూపంలో వచ్చి ఈ సృష్టికి అపారమైన సుఖమునిస్తాడు. తప్పకుండా పరమాత్మ ఎప్పుడో సుఖప్రదమైన సృష్టిని తయారుచేశాడు. అందుకే వారిని మాత-పిత అని పిలుస్తారు. అయితే సుఖమంటే ఏమిటో మనుష్యులకు తెలియనే తెలియదు. ఈ సృష్టిలో అపారమైన సుఖమున్నప్పుడు సృష్టిలో శాంతి ఉండేది. కాని ఇప్పుడు ఆ సుఖము లేదు. ఇప్పుడు మనుష్యులకు ఆ సుఖము ఎల్లప్పుడూ ఉండాలనే కోరిక తప్పకుండా కలుగుతుంది. అందుకు కొంతమంది ధనము, పదార్థాలు వేడుకుంటారు, కొంతమంది సంతానాన్ని కోరుతారు, కొంతమంది మేము పతివ్రతా నారిగా అయ్యి సదా సుమంగళిగా ఉండాలని కోరుతారు. అందరూ సుఖాన్నే కోరుతారు కదా. కనుక పరమాత్మ కూడా ఏదో సమయంలో వారి ఆశను తప్పకుండా పూర్తి చేస్తారు. కనుక సత్యయుగంలో సృష్టిలో స్వర్గమున్నప్పుడు అక్కడ సదా సుఖమే ఉంటుంది. అక్కడ స్త్రీ ఎప్పుడూ విధవగా అవ్వదు. కనుక ఆ ఆశ సత్యయుగంలో పూర్తి అవుతుంది. అక్కడ అపారమైన సుఖముంటుంది. పోతే ఇది కలియుగ సమయం. ఈ సమయంలో మనుష్యులు దు:ఖమే దు:ఖాన్ని అనుభవిస్తారు. అచ్ఛా.