24-12-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - మౌనంగా ఉంటూ నన్నొక్కరినే స్మృతి చేయండి - ఈ సహజ వశీకరణ మంత్రము మీకు సద్గురువు ద్వారా లభించింది. ఇదే మాయను అధీనం చేసుకునే మహామంత్రం''

ప్రశ్న :-

శివబాబాయే అందరికన్నా భోలా గ్రాహకుడు(అమాయక కొనుగోలుదారుడు)- ఎలా ?

జవాబు :-

బాబా చెప్తున్నారు - పిల్లలారా! మీ వద్ద దేహ సహితంగా ఉన్న పురాతన మలినము (పాత చెత్త) ఏదైతే ఉందో, అదంతా నేను తీసుకుంటాను. అది కూడా మీరు మరణావస్థకు చేరుకున్నప్పుడు. మీ తెల్లని వస్త్రాలు కూడా మరణించినందుకే గుర్తు. మీరు ఇప్పుడు తండ్రి పై బలిహారమవుతారు. తండ్రి మళ్లీ మిమ్ములను 21 జన్మలకు సుసంపన్నంగా(మాలామాల్‌గా) చేసేస్తారు. భక్తిమార్గములో కూడా తండ్రి అందరి మనోకామనలను పూర్తి చేస్తారు. జ్ఞాన మార్గములో కూడా సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానమునిచ్చి త్రికాలదర్శులుగా చేస్తారు.

పాట :-

భోలానాథునికి సాటి అయినవారు లేరు,................. ( భోలానాథ్‌ సే నిరాలా,...................)   

ఓంశాంతి.

పిల్లలు భోలానాథుని సన్ముఖములో కూర్చుని ఉన్నారు. తక్కువ బుద్ధిగలవారు (అమాయకులు) వచ్చి వెయ్యి, 2 వేల రూపాయల సరుకును తీసుకొని, మాకు చాలా ధనమునిచ్చి వెళ్లాలని వ్యాపారస్థులు కోరుకుంటారు. ఓ భగవంతుడా! మా వద్దకు అలాంటి గ్రాహకుడిని పంపండి అని అంటారు. ఇప్పుడు భోలానాథుడైన తండ్రి వచ్చి పిల్లలకు ఆది-మధ్య-అంత్యముల రహస్యాన్ని అర్థము చేయించి త్రికాలదర్శులుగా చేస్తున్నారు. మీకు నా వంటి గ్రాహకులు(కొనుగోలుదారులు) ఎప్పుడైనా దొరుకుతారా? మీరు వారికి(శివబాబా) అర్పణ చేస్తారు. భక్తిమార్గములో చాలా మహిమ చేస్తారు. ''మీరే మా మాతా-పితా,.............'' అని భోలానాథునికి మహిమ చేస్తారు. వారు వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు, రాజ్యాన్నిస్తారు. పిల్లలు తండ్రితో అంటారు - '' ఈ పాత చెత్తనంతా మీకు అర్పణ చేసేస్తాము. మీరు మమ్ములను 21 జన్మలకు సుసంపన్నంగా చేస్తారు. హోల్‌సేల్‌ వ్యాపారము (చట్టా వ్యాపారము) చేయు వ్యాపారస్థులుంటారు కదా. కమీషను తీసుకుంటారు. వీరు(శివబాబా) కూడా చెప్తారు - దేహ సహితంగా ఏదంతా మీ పాత చెత్త ఉందో అదంతా నేను తీసుకుంటాను, అది కూడా మీరు మరణావస్థలో ఉన్నప్పుడు. ఇక్కడ బ్రహ్మకుమారీ-కుమారులైన మీ వస్త్రాలు కూడా తెల్లగా ఉన్నాయి అనగా అవి మీరు మరణించారని తెలియజేస్తాయి. మరణించిన వారి పై సదా తెల్లని వస్త్రాన్నే కప్పుతారు. ఎటువంటి మచ్చ ఉండరాదు. ఈ సమయములో అందరికీ మాయ యొక్క నల్లని మచ్చ ఏర్పడింది. దీనినే రాహు గ్రహణము అని అంటారు. చంద్రునికి కూడా గ్రహణము పట్టడం వలన నల్లగా అవుతాడు కదా! అలాగే ఈ మాయా గ్రహణం కూడా మొత్తం విశ్వాన్నంతా నల్లగా చేసేస్తుంది. ఇందులో పంచ తత్వాలు మొదలైనవన్నీ వచ్చేస్తాయి.

ఇది మీ రాజయోగమని తండ్రి కూర్చుని అర్థము చేయిస్తారు. రాజయోగము ద్వారా స్వర్గములో రాజ్య పదవిని ప్రాప్తి చేసుకోవాలి. మీరు రాజాధి రాజులుగా అవుతారు. నారాయణీ నషా ఉంటుంది. నరుని నుండి నారాయణునిగా అవుతారు. లక్ష్మీనారాయణుల రాజ్యము సత్యయుగములో ఉంటుంది. అందువల్ల నేను తప్పకుండా కలియుగ అంతిమములో రావలసి పడ్తుంది. ఈ సమయము భక్తిమార్గానికి చెందినది. భక్తిమార్గములో అడుగడుగులో ప్రతి దానికి నమస్కరిస్తూ మోసపోతూ ఉంటారు. ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. భక్తుల రక్షకుడు భగవంతుడు. వారు వచ్చి భక్తికి ఫలాన్నిస్తారు. అందరూ భక్తులే కాని అందరికీ ఒకే విధమైన ఫలం లభించదు. కొందరికి సాక్షాత్కారమవుతుంది. కొందరికి పుత్రుడు లభిస్తాడు,...... ఇవన్నీ అల్పకాలము కొరకే. రకరకాల మనోకామనలను పూర్తి చేస్తాను. రాజయోగము నేర్పించేందుకు భగవంతుడు వచ్చి ఉన్నారని, ప్రపంచములోని వారెవ్వరికీ తెలియదు. వారు ద్వాపర యుగములో వచ్చి రాజయోగాన్ని నేర్పించి ఉంటారని భావిస్తారు. మరి అక్కడ ద్వాపర యుగములో నరుని నుండి నారాయణునిగా ఎలా అవుతారు? ఇప్పుడే తండ్రి మీకు రాజయోగాన్ని నేర్పించి రాజాధి రాజులుగా చేస్తారు. ఇక్కడైతే మీరు కేవలం శాంతిగా, మౌనంగా ఉండాలి. 'మన్మనాభవ' - ఇదే సద్గురువు ఇచ్చిన సహజమైన వశీకరణ మంత్రము. ఈ మంత్రం వలన చాలా సంపాదన ఉంది. ఇది మాయను అధీనపరుచుకునే మంత్రం. మాయను జయించినవారు విశ్వాన్నే జయిస్తారు(మాయాజీత్‌ జగత్‌జీత్‌). భక్తి మార్గములోనివారు మనసును జయించినవారు విశ్వాన్ని జయిస్తారు(మన్‌జీతే జగత్‌జీత్‌) అని అంటారు. కాని అలా జరగదు. అందుకే వారు హఠయోగము మొదలైనవి చేస్తారు. అది కూడా జగత్‌జీతులుగా అయ్యేందుకు చేయరు. వారు కేవలం ముక్తి కొరకు చేస్తారు. తండ్రి వచ్చి చెప్తున్నారు - '' పిల్లలూ! దేహ సహితంగా సర్వ ధర్మాలను పరిత్యజించి నన్నొక్కరినే స్మరించండి,..........(సర్వ ధర్మాన్‌ పరిత్యజ్య,.......) నేను ఫలానా ధర్మానికి చెందినవాడిని. నేను ఫలానా అయినాను,.......... ఈ విషయాలన్నీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇక నేను ఏ మతమునిస్తున్నానో దాని పై నడవండి చాలు. ఇంతవరకు ఏ అనేక మతాల పై నడుస్తూ వచ్చారో వాటన్నిటిని వదిలేయాలి. కనుక మీ జ్ఞానము చాలా కొత్తదైపోయింది. వీరి విషయాలు(మీ మాటలు) కొత్తగా ఉన్నాయని భావిస్తారు.

పిల్లలైన మీరు ఇతరులకు అర్థము చేయించునప్పుడు మొదట వారి నాడిని చూడాలి. అందరి ముందు ఒకే విధంగా మాట్లాడరాదు. మనుష్యులవి అనేక మతాలు. మీది ఒకే మతము. కాని నంబరువారుగా ఉన్నారు. ఎవరైతే మంచి యోగములో ఉంటారో, ధారణ చేస్తారో వారు తప్పకుండా బాగా అర్థము చేయిస్తారు. తక్కువ ధారణ గలవారు తక్కువగా అర్థము చేయిస్తారు. ఎవరైనా వచ్చినప్పుడు వారికి సాధారణమైన ఒకే విషయాన్ని చెప్పండి - ''భలే గృహస్థ వ్యవహారములోనే ఉండండి, కాని కమలపుష్ప సమానంగా ఉండండి.'' కమలపుష్పానికి పిల్ల పిలుకలు చాలా ఉంటాయని మీకు తెలుసు. దానిని ఉదాహరణగా ఇవ్వడం జరుగుతుంది. తండ్రికి కూడా చాలామంది పిల్లలున్నారు. కమలపుష్పం తాను స్వయం నీటి పై ఉంటుంది. ఇక మిగిలిన దాని పిల్లలంతా (సంసారమంతా) నీటి లోపల ఉంటుంది. ఈ ఉదాహరణ బాగుంది. బాబా చెప్తారు - గృహస్థ వ్యవహారములో ఉండండి అయితే పవిత్రంగా ఉండండి. ఈ విషయము పవిత్రతకు చెందినది. అది కూడా ఈ అంతిమ జీవితము కొరకే. పవిత్రంగా ఉండి నన్నొక్కరినే స్మృతి చేయండి. రచనను(సంతానమును) తప్పకుండా పాలన కూడా చేయాలి. అలా చేయనట్లయితే అది హఠయోగమవుతుంది. ప్రపంచములో పవిత్రంగా అయితే చాలామంది ఉంటారు. బాలబ్రహ్మచారి అని భీష్మపితామహుని ఉదాహరణ ఉంది. అచ్ఛా! బాలబ్రహ్మచారి అంటే స్త్రీ - పురుషులు ఇరువురూ కలిసి ఉంటూనే పవిత్రంగా ఉండేవారు. గాంధర్వ వివాహము గురించి శాస్త్రాలలో కూడా చర్చ ఉంది. కాని దానిని గురించి ఎవ్వరికీ తెలియదు. అది తండ్రియే అర్థము చేయిస్తారు. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, ఇప్పుడు కామచితికి బదులు ఇరువురూ జ్ఞానచితి అనే కంకణము కట్టుకోండి. బ్రాహ్మణులైన మీరు ఎంత మంచి పని చేస్తారు! పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయాలి. ఒకరికొకరు సావధానపరచుకుంటూ ఇరువురూ స్వర్గములోకి వెళ్లిపోతారు. ఇక్కడ మీరు కలిసి ఉండి పవిత్రంగా ఉండి చూపిస్తారు. అందుకే మీరు చాలా ఉన్నతమైన పదవి తీసుకోగలరు. ఉదాహరణమివ్వబడుతుంది కదా - జ్ఞానచితి పై కూర్చుని స్వర్గములోకి వెళ్లి ఉన్నత పదవిని పొందుతారు. ఇందులో చాలా గొప్ప ధైర్యముంది, ఒకవేళ దృఢంగా(పక్కాగా) ఉండి నడుస్తున్నట్లయితే చాలా ఉన్నత పదవి పొందుతారు. మళ్లీ సేవ పై కూడా ఆధారపడి ఉంది. ఎవరైతే ఎక్కువగా సేవ చేస్తారో, అనేకమంది ప్రజలను తయారుచేస్తారో వారు మంచి పదవిని కూడా పొందుతారు. బాబా-మమ్మాల కంటే కూడా ఉన్నతంగా వెళ్లిపోవాలి. బాబా-మమ్మాల కంటే కూడా ఉన్నతంగా వెళ్లిపోవాలి. ఏ విధంగా క్రైస్తవులు పరస్పరములో కలిసిపోతే వారు విశ్వానికి యజమానులుగా అవ్వగలరని బాబా ఉదాహరణనిస్తారో, అలా మాతా-పితలకంటే ఉన్నతంగా వెళ్లే జోడి వెలువడాలి. కాని అలాంటి వారెవ్వరూ లేరు. జగదంబ, జగత్పితలే ప్రసిద్ధి చెందినవారు. వీరిలా ఎవ్వరూ సేవ చేయలేరు. వీరే నిమిత్తమై ఉన్నారు. అందువల్ల ఎప్పుడూ హార్ట్‌ ఫెయిల్‌ అవ్వరాదు. అచ్ఛా! భలే మమ్మా - బాబాల వలె అవ్వలేకపోతే రెండవ నంబరు అయినా పొందవచ్చు కదా! ఆధారమంతా సేవ పైనే ఉంది. ప్రజలను, వారసులను తయారు చేయాలి. ఇవన్నీ కొత్త విషయాలు. కొత్త ప్రపంచాన్ని రచించేందుకు తండ్రి తప్పకుండా రావలసి పడ్తుంది. వారే రచయిత. వారైతే పరమాత్మ నామ-రూపాలకు అతీతుడని అంటారు. కాని అలా కాదు. అయితే ఇది వారి దోషము కూడా కాదు. అదృష్టంలో ఉంటే అర్థము చేసుకుంటారు. చాలామంది వస్తారు. ఈ విషయమైతే సరియైనదేనని అర్థము కూడా చేసుకుంటారు. ఎవరైనా ఆత్మకు నామ-రూపాలు లేవని అన్నారంటే ''ఆత్మ'' - ఈ పేరు ఎవరికి చెందింది? ఆత్మ అనే పేరైతే ఉంది కదా! అని వారిని అడగండి. ఇది రాజయోగమని మీరు అందరికీ చెప్పండి. పరమపిత పరమాత్మ సంగమ యుగములో వస్తారు. తప్పకుండా సంగమ యుగములోనే రాజయోగాన్ని నేర్పిస్తారు. అప్పుడే పతితులను పావనంగా చేస్తారు. అంటే ఇక్కడి విషయాలే అతీతమైనవి. తండ్రి చెప్తున్నారు - మీరు కేవలం స్వయాన్ని ఆత్మ అని భావించండి. తండ్రి వద్దకు వెళ్లాలి. ఇందులో ప్రశ్నించవలసిన విషయమేదీ లేదు. మా ఆత్మను దు:ఖపెట్టకండి అని అంటారు. మీరు పాపాత్మ, పుణ్యాత్మ,......... అని అంటారు. ఆత్మకు ఏ విధమైన రూపము లేదని ఎవరూ చెప్పలేరు. వివేకానందుడు రామకృష్ణ పరమహంస ఎదుట కూర్చున్నప్పుడు అతనికి సాక్షాత్కారమయ్యింది. ఒక ప్రకాశం(లైటు) వచ్చి తనలో ప్రవేశించిందని గమనించాడు. ఈ విధంగా ఏదో ఒకటి చెప్తారు. మాది రాజయోగము, ఇందులో దేహ సహితంగా బంధు-మిత్రులు మొదలైనవారందరినీ మర్చిపోవలసి ఉంటుందని మీరు చెప్పండి. ఆత్మలైన మనము వారికి పిల్లలము, మనము పరస్పరములో సహోదరులము(బ్రదర్‌హుడ్‌). ఒకవేళ అందరూ తండ్రులే అయితే తండ్రులే తండ్రిని ప్రార్థించాలి(అనగా స్వయాన్ని స్వయం ప్రార్థించుకొన్నట్లు). ఇప్పుడు మనము రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. ఇది రాజాధి రాజులుగా అయ్యే యోగము. ఇప్పుడైతే రాజ్యము లేనే లేదు. అందువలన ఇప్పుడు మేము మౌనంగా ఉండి కేవలం శివబాబాను స్మృతి చేస్తామని అందరికీ అర్థము చేయించాలి. స్వయాన్ని శరీరము నుండి అతీతమని భావించాలి. నేను ఒక శరీరాన్ని వదిలి మరొక దానిని తీసుకుంటానని ఆత్మ చెప్తుంది అనగా జ్ఞాన సంస్కారము ఆత్మలో ఉంటుంది కదా. మంచి లేక చెడు సంస్కారము ఆత్మలోనే ఉంటుంది. ఆత్మ నిర్లేపము కాదని అర్థము చేయించాలి. ఆత్మ పునర్జన్మలోకి వస్తుంది. అనేకసార్లు శరీరాన్ని తీసుకోవలసి వస్తుంది. ఆత్మ నక్షత్రము వంటిది. భృకుటి మధ్యలో ఉంటుంది. (వివేకానందునికి) ఆత్మ సాక్షాత్కారమయ్యింది. అప్పుడతడు - వీరిలో(రామకృష్ణ పరమహంస) ఇంతటి శక్తి ఉంది కనుకనే నాకు ఆత్మ సాక్షాత్కారము చేయించారని భావించాడు. ఇప్పుడు ఆత్మ అయితే భృకుటి మధ్యలో ఉంటుంది. సాక్షాత్కారము చేసుకున్నా, చేసుకోకపోయినా తేడా ఏముంది? ఆత్మ స్వయంగా చెప్తుంది - నేను నక్షత్ర సమానంగా ఉన్నాను. నాలో 84 జన్మల పాత్ర ఉంది. ఒకవేళ 84 లక్షల జన్మలైతే ఏమవుతుందో అర్థము కానంతటి ఎక్కువ సంస్కారాలవుతాయి. 84 జన్మలు అనే దానిని అంగీకరించవచ్చు. 84 లక్షల జన్మలని అనడం అంగీకరించలేము. ఇప్పుడు మనము పావనంగా అవుతున్నాము. బాబా మనలను నరుని నుండి నారాయణునిగా చేసేందుకు పవిత్రంగా చేశారు. ఈ నషా ఉండాలి! మీరు ఎవరితోనూ వాద వివాదము చేసే అవసరం లేదు.

దేహ సహితంగా సర్వ దేహ ధర్మాలను త్యాగము చేసి స్వయాన్ని ఆత్మగా, అశరీరిగా భావించాలి. భలే మనము శాస్త్రాలు మొదలైనవి చదివాము, అయినా మనము ఎందుకు వాదించాలి(చర్చించాలి)? తండ్రి చెప్తారు - '' నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇక రెండవ ఆజ్ఞ - గృహస్థ వ్యవహారములో కమలపుష్ప సమానంగా ఉండండి. '' యోగాగ్ని ద్వారానే పాపాలు నాశనమవుతాయి. ఇది భగవానువాచ! భగవంతుడు కూడా పరమ ఆత్మ. వారిని కూడా నక్షత్ర రూపుడనే అంటారు. అనేక పాయింట్లు (విషయాలు) ఉన్నాయి. కానీ అన్నీ ఒకే సమయములో వెలువడవు. వచ్చిన గ్రాహకులను చూచి యుక్తిగా చర్చించాలి. ''మేము కూడా శాస్త్రాలను చదువుతాము. అయితే వాటన్నిటిని మరిచి నన్నొక్కరినే స్మృతి చేయండి'' అని తండ్రి ఆజ్ఞాపించారు అని వారికి చెప్పండి. వారు నిరాకారులు. ఆత్మనైతే అందరూ అంగీకరిస్తారు. వివేకాందునికి చెందినవారు కూడా అంగీకరిస్తారు. ఆత్మ అందరిలోనూ ఉంది. తప్పకుండా ఆత్మలకు తండ్రి ఉంటారు కదా. వారినే పరమపిత పరమాత్మ అని అంటారు. ఇవన్నీ పాయింట్లు కదా! వీటిని స్మరించడం ద్వారా సదా పాయింట్లు వెలువడ్తూ ఉంటాయి. (బుద్ధి రూరీ) స్టీమరు నిండుతూ ఉంటుంది. ఇవి అవినాశి జ్ఞాన రత్నాల సామాగ్రితో నింపుకోవడం వంటిది. పాయింట్లు నోట్‌ చేసుకొని వాటిని రివైజ్‌ చేసుకుంటూ ఉండండి. ఇవి రత్నాలు. వీటిని ధారణ చేసేందుకు, వ్రాసుకునేందుకు ఉత్సాహం ఉండాలి. మంచి రీతిలో అందరికీ అర్థము చేయించాలి. ఆత్మ అయితే అందరిలోనూ ఉంది. దానికి నామ-రూపాలు లేవు. ఆత్మకు రూపమున్నప్పుడు పరమాత్మకు ఎందుకు ఉండదు? అని ఎవ్వరూ అడగలేరు కదా. వారిని పరమపిత పరమాత్మ అని పరంధామ నివాసి అని అంటారు కనుక ఇప్పుడు సేవ చేసి చూపించండి - అని పిల్లలకు ఎంతగానో అర్థము చేయిస్తారు! బాబా సేవ చేసినవారికి బహుమతులు ఇస్తారు. జ్ఞాన రత్నాలతో ఎంతగానో శృంగారము చేస్తారు. మనము ఇక్కడ పదమాపతులుగా అవ్వాలని కోరుకోవడం లేదు. మనకు విశ్వ చక్రవర్తి పదవి కావాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

మాతేశ్వరి గారి మహావాక్యాలు

సద్గతిని కలుగజేసే పరమాత్ముని గతి - మతి పరమాత్మకు మాత్రమే తెలుసు

'' మీ గతి-మతి మీకే తెలుసు '' - ఈ మహిమ ఎవరి స్మృతిచిహ్నంగా గానం చేస్తారు? ఎందుకంటే సద్గతిని కలిగించే పరమాత్ముని మతము ఏదైతే ఉందో అది పరమాత్మకే తెలుసు. మనుష్యులు తెలుసుకోజాలరు. మనుష్యులకు మాత్రమే - ''మాకు సదా కొరకు సుఖము కావాలనే కోరిక ఉంటుంది '' కాని ఆ సుఖము ఎలా లభిస్తుంది? ఎంతవరకు మనుష్యులు తమలోని పంచ వికారాలను భస్మము చేసుకొని, కర్మలను అకర్మలుగా చేసుకోరో అంతవరకు వారికి ఆ సుఖము లభించజాలదు. ఎందుకంటే కర్మ, అకర్మ, వికర్మల గతి చాలా లోతైనది. ఆ రహస్యము పరమాత్మ తప్ప ఏ ఇతర మనుష్య ఆత్మలు కర్మల గతిని తెలుసుకోజాలరు. ఇప్పుడు ఎంతవరకు పరమాత్మ ఆ గతిని వినిపించడో అంతవరకు మనుష్యులకు జీవన్ముక్తి లభించజాలదు. అందువలన మనుష్యులు '' తేరే గత్‌ మత్‌ మీకే తెలుసు'' అని అంటారు. సద్గతిని కలిగించే మతము పరమాత్మ వద్ద ఉంది. కర్మలను అకర్మలుగా ఎలా చేయాలో, ఆ శిక్షణనివ్వడం పరమాత్ముని పని. మనుష్యులకు ఈ జ్ఞానము లేదు. అందువలన వారు ఉల్టా(వ్యతిరేక) కర్మలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనుష్యుల మొదటి కర్తవ్యము - తమ కర్మలను బాగు చేసుకోవడం. అప్పుడే మనుష్య జీవితములోని పూర్తి లాభాన్ని తీసుకోగలరు. అచ్ఛా. ఓంశాంతి.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. ఏ జ్ఞాన రత్నాలైతే లభిస్తున్నాయో వాటి పై విచార సాగర మథనము చేసి స్వయంలో ధారణ చేయాలి. జ్ఞాన రత్నాలతో సదా సంపన్నంగా ఉండాలి.

2. తమ నారాయణీ నషాలో ఉండాలి, ఎవరితోనూ వ్యర్థ విషయాలు మాట్లాడరాదు. అశరీరిగా అయ్యే అభ్యాసము చేయాలి.

వరదానము :-

''మాయను శత్రువుకు బదులు పాఠాన్ని చదివించే సహయోగిగా భావించి ఏకరసంగా ఉండే మాయాజీత్‌ భవ''

మాయ మీకు పాఠము చదివించేందుకు వస్తుంది కనుక భయపడకండి. పాఠము చదువుకోండి. ఒకసారి సహనశీలతా పాఠాన్ని, ఒకసారి శాంతి స్వరూపంగా అయ్యే పాఠాన్ని పక్కా చేయించేందుకే మాయ వస్తుంది. కనుక మాయను శత్రువుకు బదులు మీ సహయోగిగా భావిస్తే భయపడి ఓడిపోరు. పాఠాన్ని పక్కాగా చేసుకొని అంగదుని సమానం అచలంగా అవుతారు. ఎప్పుడూ బలహీనంగా అయ్యి మాయను ఆహ్వానించకుండా ఉంటే అది వీడ్కోలు తీసుకుంటుంది.

స్లోగన్‌ :-

''ప్రతి సంకల్పంలో దృఢత అనే మహానత ఉంటే, సఫలత లభిస్తూ ఉంటుంది''