25-12-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - సమయ ప్రతి సమయము జ్ఞానసాగరుని వద్దకు వస్తూ ఉండండి. జ్ఞానరత్నాల సామాను నింపుకొని మళ్ళీ బయటకు వెళ్ళి డెలివరీ చేయండి. విచార సాగర మథనము చేసి సేవలో లగ్నమవ్వండి.''

ప్రశ్న :-

అన్నింటికన్నా మంచి పురుషార్థమేది? ఏ పిల్లలంటే బాబాకు ప్రియమనిపిస్తారు?

జవాబు :-

''ఎవరి జీవితమునైనా బాగు చేయడం(తీర్చిదిద్దడము) '' ఇది చాలా మంచి పురుషార్థము. పిల్లలు ఈ పురుషార్థములోనే లగ్నమైపోవాలి. ఎప్పుడైనా, ఏదైనా పొరపాటు జరిగితే అందుకు బదులుగా ఎక్కువ సేవ చేయండి లేకపోతే ఆ పొరపాటు మనస్సును తింటూ ఉంటుంది. తండ్రికి జ్ఞాని మరియు యోగి పిల్లలంటే చాలా ప్రియమనిపిస్తారు.

పాట :-

ఎవరు ప్రియుని జతలో ఉంటారో,.................... ( జో పియాకే సాథ్‌ హై,...................)   

ఓంశాంతి.

మురళిని సన్ముఖములో వినడంలో, టేపు ద్వారా వినడంలో లేక కాగితములో చూసి చదవడంలో తప్పకుండా తేడా ఉంటుందని పిల్లలు అర్థం చేసుకోగలరు. పాటలో కూడా - ఎవరు ప్రియుని జతలో ఉంటారో,........ అని అంటారు. జ్ఞాన వర్షమైతే అందరి కొరకు ఉంది కాని జతలో ఉండుట వలన తండ్రి భావాలను అర్థం చేసుకోవడంలో విభిన్న ఆదేశాలను గ్రహించడంలో చాలా లాభం ఉంటుంది. అయితే ఇక్కడే కూర్చుండిపోవాలని కూడా కాదు. సామాను నింపుకొని సేవ చేసేందుకు వెళ్ళాలి. మళ్లీ సామాను నింపుకునేందుకు వచ్చారు. మనుష్యులు సామాను అమ్ముకునేందుకే ఖరీదు చేస్తారు. అమ్మి మళ్లీ కొనుక్కునేందుకు వస్తారు. ఇవి కూడా జ్ఞాన రత్నాల సామాను. సామాను తీసుకొని పోయేవారైతే వస్తారు కదా. కొందరు డెలివరీ చేయరు(ఇవ్వరు). పాత సామానుతోనే కాలం గడుపుతారు. క్రొత్త సామాను తీసుకోవాలని అనుకోరు. ఇలాంటి బుద్ధిహీనులు కూడా ఉంటారు. మనుష్యులు తీర్థ యాత్రలకు వెళ్తారు కాని తీర్థ యాత్రలు ఇక్కడకు రావు. ఎందుకంటే అవి జడ చిత్రాలు. ఈ విషయాలు పిల్లలకే తెలుసు. మనుష్యులకేమీ తెలియదు. చాలా గొప్ప గొప్ప గురువులు శ్రీ శ్రీ మహామండలేశ్వరులు మొదలైనవారు జిజ్ఞాసువులను తీర్థ యాత్రలకు తీసుకెళ్తారు. త్రివేణీ సంగమానికి ఎంతో మంది వెళ్తారు. నది వద్దకు వెళ్ళి దానం చేయడంలో పుణ్యం ఉంటుందని భావిస్తారు. ఇక్కడైతే భక్తి మాటే లేదు. ఇక్కడైతే తండ్రి వద్దకు రావాలి. కనుక పిల్లలు అర్థము చేసుకొని మళ్లీ ఇతరులకు అర్థం చేయించాలి. ప్రదర్శనీలో కూడా మనుష్యులకు అర్థము చేయించాలి. 84 జన్మల చక్రమును తిరుగుతారు. అందులో కూడా అందరూ 84 జన్మలు తీసుకోరని పిల్లలకు తెలుసు. ఇది అర్థము చేయించేందుకు మంచి యుక్తి కావాలి. ఈ చక్రములోనే మనుష్యులు తికమక పడ్తారు. వృక్షాన్ని గురించి అయితే ఎవ్వరికీ తెలియదు. శాస్త్రాలలో కూడా చక్రాన్ని చూపిస్తారు. కల్పము ఆయువు చక్రము ద్వారా లెక్కిస్తారు. చక్రములోనే గడబిడ ఉంది. మనమైతే పూర్తి చక్రమంతా తిరుగుతాము. 84 జన్మలు తీసుకుంటాము. ఇక ఇస్లాం మతము వారు, బౌద్ధులు మొదలైనవారు తర్వాత వస్తారు. చక్రములో మనము ఎలా సతో, రజో, తమోలలోకి వస్తామో సృష్టిచక్రం చిత్రములో చూపించబడింది. ఇక తర్వాత ఎవరైతే వస్తారో, ఇస్లాం, బౌద్ధులు మొదలైనవారిని గురించి ఎలా చూపించాలి? వారు కూడా సతో, రజో, తమోలలోకి వస్తారు. మనము మన విరాట రూపమును కూడా చూపిస్తాము - సత్యయుగము నుండి కలియుగము వరకు పూర్తి చక్రము తిరిగి వస్తాము. (విరాట రూపములో) పిలక భాగము బ్రాహ్మణులది. ముఖభాగము సత్యయుగములో. బాహువులు (భుజములు) త్రేతా యుగములో, ఉదర భాగము ద్వాపరములో, కాళ్ళను చివరిలో నిలపాలి. మన విరాట రూపాన్ని చూపించాలి. మిగిలిన ధర్మాలవారిని ఎలా చూపించాలి? వారిని కూడా ప్రారంభంలో సతోప్రధానము, తర్వాత సతో, రజో, తమో అనగా దీని నుండి ఎవ్వరూ ఎప్పుడూ నిర్వాణధామములోకి వెళ్ళలేదని ఋజువవుతుంది. వారు ఈ చక్రములోకి రావలసిందే. ప్రతి ఒక్కరు సతో, రజో, తమోలలోనికి రావాలసినదే. ఇబ్రహీమ్‌, ఇబ్రహీమ్‌, బుద్ధుడు, క్రీస్తు మొదలైనవారు కూడా మనుష్యులే. రాత్రి పూట బాబాకు చాలా ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలలో నిద్ర నషా కూడా ఎగిరిపోతుంది. నిద్ర తొలగిపోతుంది. ఇతరులకు అర్థం చేయించేందుకు చాలా మంచి యుక్తి ఉండాలి. వారిది కూడా విరాట రూపాన్ని తయారు చేయాల్సి పడ్తుంది. వారికి కూడా కాళ్ళను చివరిలోనికి తీసుకువెళ్ళాలి. తర్వాత వ్రాత పూర్వముగా వివరించాలి. క్రీస్తు ఎప్పుడు వస్తారో అప్పుడు వారు కూడా సతో, రజో, తమోలను దాటుకోవలసిందే అని పిల్లలు అర్థము చేయించాలి. వారు సత్యయుగములోకి రానే రారు. వచ్చేది తర్వాతనే. క్రీస్తు స్వర్గములోనికి రారు అని చెప్తారు. ఇది తయారు చేసి చేయబడిన ఆట. క్రీస్తు కంటే ముందు కూడా ధర్మాలు ఉండేవని మీకు తెలుసు. అవి మళ్లీ పునరావృతమవ్వాలి. డ్రామా రహస్యాన్ని అర్థం చేయించాల్సి ఉంటుంది. మొట్టమొదట తండ్రి పరిచయమునివ్వాలి. తండ్రి నుండి సెకండులో ఏ విధంగా ఆస్తి లభిస్తుంది? '' సెకండులో జీవన్ముక్తి '' అని గాయనము కూడా ఉంది. బాబాకు ఎన్ని ఆలోచనలు నడుస్తాయో చూడండి. బాబా పాత్ర విచార సాగర మథనము చేయడం. గాడ్‌ఫాదర్లీ బర్త్‌ రైట్‌.... నౌ ఆర్‌ నెవర్‌(ఈశ్వరీయ జన్మ సిద్ధ అధికారము - ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు) అనే పదము వ్రాయబడి ఉంది. ''జీవన్ముక్తి'' అనే పదాన్ని వ్రాయాలి. వ్రాయబడిన అంశము స్పష్టంగా ఉన్నట్లయితే అర్థము చేయించడం సహజమౌతుంది. జీవన్ముక్తి వారసత్వంగా లభించింది. జీవన్ముక్తిలో రాజులు, రాణులు, ప్రజలు అందరూ ఉంటారు. అందువల్ల వ్రాసిన అంశాన్ని కూడా సరి చేయవలసి ఉంటుంది. చిత్రాలు లేకుండా కూడా అర్థము చేయించవచ్చు. కేవలం సైగలతోనే అర్థము చేయించవచ్చు - '' వీరు బాబా, ఇది ఆస్తి '' ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో వారు బాగా అర్థం చేయించగలరు. పూర్తి ఆధారమంతా యోగము పైనే ఉంది. యోగము ద్వారా బుద్ధి పవిత్రంగా అవ్వగలదు. అప్పుడే ధారణ అవుతుంది. ఇందులో ఆత్మాభిమాని అవస్థ ఉండాలి. అన్నీ మర్చిపోవాల్సి ఉంటుంది. శరీరాన్ని కూడా మర్చిపోవాలి. మనమిప్పుడు వాపసు వెళ్ళాలి. ఈ ప్రపంచమైతే వినాశనమవుతుంది. ఈ బాబా కొరకైతే సహజము. ఎందుకంటే ఇతడి వ్యాపారమే ఇది. పూర్తి రోజంతా బుద్ధి ఇందులోనే నిమగ్నమై ఉంది. అచ్ఛా! గృహస్థ వ్యవహారములో ఉండే వారైతే కర్మ చేయాలి. స్థూల కర్మ చేయడం వలన ఈ విషయాలు మర్చిపోతారు. బాబా స్మృతి మర్చిపోతారు. (బ్రహ్మ) బాబా స్వయంగా తన అనుభవాన్ని వినిపిస్తారు. (శివ) బాబాను స్మృతి చేస్తాను. బాబా! ఈ రథానికి తినిపిస్తున్నానని భావిస్తాను అయినా మళ్లీ మర్చిపోతాను. ఇలా నేనే మర్చిపోతున్నానంటే ఇక పాపము మిగిలినవారికి ఎంత కష్టంగా ఉంటుందో అని బాబా ఆలోచిస్తారు. ఈ చార్టును ఎలా పెంచగలము? ప్రవృత్తి మార్గము వారికిది కష్టము. వారు శ్రమ చేయాల్సి పడ్తుంది. బాబా అయితే అందరికీ అర్థము చేయిస్తారు. ఎవరైతే పురుషార్థము చేస్తూ ఉంటారో వారు తమ ఫలితాన్ని వ్రాసి పంపవచ్చు. తప్పకుండా కష్టంగా ఉంటుందని బాబాకు తెలుసు. బాబా చెప్తారు - రాత్రి పూట శ్రమ చేయండి. ఒకవేళ మీరు యోగయుక్తులై విచార సాగర మథనము చేస్తూ ఉన్నట్లయితే. మీ అలసట అంతా తొలగిపోతుంది. బాబా తన అనుభవాన్ని వినిపిస్తారు - ఒక్కొక్కసారి ఇతర విషయాలలో బుద్ధి వెళ్ళినప్పుడు తల వేడెక్కుతుంది. మళ్లీ ఆ తుఫాను నుండి బుద్ధిని తొలగించి ఈ విచార సాగర మథనములో నిమగ్నమౌతాను. అప్పుడు తల తేలికైపోతుంది. మాయ తుఫానులైతే అనేక రకాలుగా వస్తాయి. ఈ వైపు బుద్ధిని లగ్నము చేయడం ద్వారా ఆ అలసటంతా దిగిపోతుంది. బుద్ధి రిఫ్రెష్‌ అవుతుంది. బాబా సేవలో లగ్నమైతే జ్ఞానము మరియు యోగాల వెన్న లభిస్తుంది. ఈ బాబా తన అనుభవాన్ని వినిపిస్తున్నారు. ఇలా, ఇలా జరుగుతుంది, మాయ వికల్పాలు వస్తాయని తండ్రి పిల్లలకు తెలిపిస్తారు కదా. బుద్ధిని మళ్లీ ఆ వైపు మగ్నం చేయాలి. చిత్రాలను తీసుకొని వాటి పై ఆలోచించాలి. అప్పుడు మాయా తుఫానులు ఎగిరిపోతాయి. మాయ ఎటువంటిదంటే, స్మృతిలో ఉండనివ్వదని బాబాకు తెలుసు. చాలా కొద్దిమంది మాత్రమే పూర్తి స్మృతిలో ఉంటారు. గొప్ప గొప్ప విషయాలను చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ బాబా స్మృతిలో ఉన్నట్లయితే బుద్ధి స్పష్టముగా ఉంటుంది. స్మృతి చేయడం వంటి వెన్న మరొకటి లేదు. కాని స్థూలమైన (పనుల) బరువు ఎక్కువగా ఉంటే స్మృతి తక్కువైపోతుంది.

బొంబాయికి పోపు వచ్చినప్పుడు చూడండి! సర్వుల భగవంతుడే వచ్చారన్నట్లు అతనికి ఎంత మహిమ చేశారు. శక్తిగలవారు కదా. భారతవాసులకు తమ ధర్మము గురించి తెలియదు. తమ ధర్మాన్ని వారు హిందూధర్మమని చెప్పుకుంటూ ఉంటారు. హిందూ అనే ధర్మమేదీ లేదు. అది ఎక్కడ నుండి వచ్చింది? ఎప్పుడు స్థాపన అయ్యింది? ఎవ్వరికీ తెలియదు. మీలో జ్ఞానము ఉప్పొంగుతూ ఉండాలి. శివశక్తులు జ్ఞానములో ఉప్పొంగుతూ ఉండాలి. వారు శక్తులను సింహము పై కూర్చుని ఉన్నట్లు చూపించారు. ఇదంతా జ్ఞానపు విషయము. చివర్లో ఎప్పుడైతే మీలో శక్తి వస్తుందో అప్పుడు సాధువులు, సన్యాసులు మొదలైన వారికి కూడా మీరు అర్థము చేయిస్తారు. ఇంత జ్ఞానము ఎప్పుడు బుద్ధిలో ఉంటుందో అప్పుడు ఉత్సాహముతో ఎగురగలరు. ఎలాగైతే 'చక్రాతా' అనే గ్రామములో పొలం పని చేసేవారిని టీచరు చదివిస్తూ ఉండగా వారు చదువుకునేవారు కాదు. వారికి పొలము పనులే(వ్యవసాయమే) మంచిగా అనిపించేవి. అలా ఈనాటి మనుష్యులకు కూడా ఈ జ్ఞానాన్ని ఇచ్చినట్లయితే వారు - ఇది మంచిగా అనిపించడము లేదు, మేమైతే శాస్త్రాలనే చదవాలి అని అంటారు. కాని భగవంతుడు స్పష్టంగా చెప్తున్నారు - జప, తప, దాన, పుణ్యాలు మొదలైనవి చేయుట ద్వారా లేక శాస్త్రాలను చదవడం ద్వారా నన్ను ఎవరూ పొందలేరు. డ్రామాను గురించి తెలియదు నాటకములో పాత్రధారులుంటారు. పాత్రాభినయనం చేసేందుకు శరీరాన్ని తీసుకున్నారని వారికేమీ తెలియదు. ఇది ముళ్ళ అడవి. ఒకరికి మరొకరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు. దోపిడీ చేస్తూ, చంపుకుంటూ ఉంటారు. ముఖము భలే మనుష్యులదే కాని లక్షణాలు కోతి సమానంగా ఉన్నాయి. తండ్రి కూర్చుని పిల్లలైన మీకు అర్థము చేయిస్తారు. ఎవరైనా కొత్తవారు విన్నట్లయితే అర్థము కాక వేడెక్కుతారు(కోపగించుకుంటారు). పిల్లలు అలా వేడిగా అవ్వరు. తండ్రి చెప్తున్నారు - నేను పిల్లలకే అర్థము చేయిస్తాను. పిల్లలకైతే మాతా - పితలు ఏదైనా చెప్పగలరు. పిల్లలను తండ్రి చెంప దెబ్బ వేసినా ఇతరులు ఏమీ చేయలేరు. మాతా - పితల కర్తవ్యము - పిల్లలను సరిదిద్దడం. కాని ఇక్కడ నియమము లేదు. ఏ విధమైన కర్మ నేను చేస్తానో, నన్ను చూచి దానిని ఇతరులు కూడా చేస్తారు. అందువల్లనే బాబా ఏ విచార సాగర మథనము చేశారో కూడా తెలిపించారు. ఇతడు మొదటి నంబరులో ఉన్నారు. వీరు 84 జన్మలు తీసుకోవలసి పడ్తుంది. అటువంటప్పుడు ఇతర ధర్మస్థాపకులు ఎవరెవరు ఉన్నారో, వారెలా నిర్వాణధామానికి వెళ్తారు? వారు కూడా సతో, రజో, తమోలోకి తప్పకుండా రావాల్సిందే. మొదటి నంబరులో లక్ష్మీనారాయణులు ఉన్నారు. వారు విశ్వానికి అధికారులు. వారు కూడా 84 జన్మలు తీసుకోవలసి ఉంటుంది. మనుష్య సృష్టిలో ఎవరైతే ఉన్నతమైన కొత్త మానవుడు(న్యూమేన్‌) ఉన్నాడో అతని జతలో నూతన స్త్రీ(న్యూ ఉమన్‌) కూడా ఉండాలి. లేకపోతే స్త్రీ లేకుండా సంతానము ఎలా ఉత్పన్నమౌతుంది? సత్యయుగములో న్యూమెన్‌ ఈ లక్ష్మీనారాయణులు. పాత వారి నుండి కొత్త వారిగా అవుతారు. వీరు ఆల్‌రౌండ్‌ పాత్రధారులు. మిగిలిన అందరు కూడా సతో నుండి తమోలోకి వస్తారు. పాతవారిగా అవుతారు. మళ్లీ పాత వారి నుండి కొత్త వారిగా అవుతారు. ఏ విధంగా క్రీస్తు మొదట కొత్తగా వచ్చి తర్వాత మళ్లీ పాతగా అయ్యాడో అలా మళ్లీ అతని సమాయానుసారంగా(తర్వాత కల్పములో) కొత్తగా అయ్యి వస్తాడు. ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవలసినవి. ఇందులో యోగము బాగుండాలి. పూర్తి సమర్పణ కూడా అవ్వాలి. అప్పుడే వారసత్వానికి హక్కుదారులుగా అవ్వగలరు. సమర్పణ అయినప్పుడే ఇలా ఇలా చేయండని బాబా ఆదేశాలను కూడా ఇవ్వగలరు. కొందరు సమర్పణ అయినారు కాని వ్యవహారములో కూడా ఉండమని చెప్తారు. అప్పుడు వారి బుద్ధిని గురించి తెలుస్తుంది. వ్యవహారములో ఉంటూ జ్ఞానమును పొందండి. అలా ఉత్తీర్ణులై చూపించండి! గృహస్థములోకి వెళ్ళకండి. బ్రహ్మచారిగా ఉన్నట్లయితే మంచిది. బాబా ప్రతి ఒక్కరి లెక్కాచారాలను అడుగుతారు. మమ్మా-బాబాల పాలన తీసుకున్నారంటే మళ్లీ దాని(అప్పు తీర్చుకున్నప్పుడు) ప్రతి ఫలమును చూపినప్పుడే బలము లభిస్తుంది. అలా కానిచో మేము ఇంత శ్రమ చేసి పాలన ఇస్తే మమ్ములను వదిలేశారు అని తండ్రి కూడా అంటారు. ప్రతి ఒక్కరి నాడిని చూడవలసి పడ్తుంది. తర్వాత ఆదేశము ఇవ్వబడ్తుంది. ఇతని ద్వారా(బ్రహ్మాబాబా) ఏదైనా పొరపాటు జరిగితే తండ్రి(శివబాబా) దానిని సరిదిద్దుతారు. ఇతడు కూడా అడుగు అడుగులో శ్రీమతమును అనుసరిస్తూ ఉంటాడు. ఎప్పుడైనా నష్టము వాటిల్లితే డ్రామాలో అలా ఉందని భావిస్తారు. తర్వాత ఇటువంటి విషయము జరుగరాదు. పొరపాటు మన హృదయమును తింటూ ఉంటుంది. పొరపాటు చేసినట్లయితే దానికి బదులుగా మళ్లీ సేవలో చాలా నిమగ్నమవ్వాలి. చాలా పురుషార్థము చేయాలి. ఇతరుల జీవనాన్ని తీర్చిదిద్దడమే పురుషార్థము.

బాబా అంటారు - నాకు యోగీ మరియు జ్ఞానీ పిల్లలే అందరికంటే ప్రియమైనవారు. యోగములో ఉండి భోజనము తయారు చేసి, తినిపించినట్లయితే చాలా ఉన్నతి జరుగుతుంది. ఇది శివబాబా భండారము. కనుక శివబాబా పిల్లలు తప్పకుండా ఇలా యోగయుక్తంగా ఉంటారు. నెమ్మది నెమ్మదిగా అవస్థ ఉన్నతంగా అవుతుంది. సమయమైతే తప్పకుండా పడ్తుంది. ప్రతి ఒక్కరి కర్మ బంధనము ఎవరిది వారిదే. కన్యల పై ఎలాంటి బరువు లేదు. అవును! కొడుకుల పై ఉంది. కొడుకు పెద్దవాడైతే మాతా-పితల భారం అతని పై ఉంటుంది. తండ్రి ఇంతగా అర్థము చేయించారు, ఇంత సమయము పాలన ఇచ్చారు, కనుక వారిని పాలన చేయవలసి ఉంటుంది. లెక్కాచారము సమాప్తం చేసుకోవాలి. వారి మనస్సు కూడా సంతోషిస్తుంది. సుపుత్రులు ఎవరైతే ఉంటారో వారు యాత్ర నుండి తిరిగి వచ్చిన తర్వాత సర్వస్వాన్ని తండ్రి ఎదుట ఉంచుతారు. అప్పు తీర్చుకోవాల్సి ఉంటుంది కదా! ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఉన్నత పదవిని పొందేవారే సింహము వలె ఉత్సాహంగా ఉప్పొంగుతూ ఉంటారు. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. యోగములో ఉండి భోజనము తయారు చేయాలి. యోగములో ఉంటూనే భోజనము తినాలి. మరియు తినిపించాలి.

2. బాబా తెలిపించిన దాని పై బాగా విచార సాగర మథనము చేసి యోగ యుక్తులుగా అయ్యి ఇతరులకు కూడా అర్థం చేయించాలి.

వరదానము :-

''తండ్రి సమానంగా ప్రతి ఆత్మ పై కృప లేక దయ చూపించే మాస్టర్‌ రహమ్‌ దిల్‌ భవ''

తండ్రి ఎలాగైతే దయాహృదయులుగా ఉన్నారో అలా పిల్లలైన మీరు కూడా అందరి పై కృప లేక దయ చూపిస్తారు. ఎందుకంటే తండ్రి సమానం మీరు నిమిత్తంగా అయ్యారు. బ్రాహ్మణ ఆత్మలకు ఎప్పుడూ ఏ ఆత్మ పట్ల అయినా ఘృణ రాజాలదు. కంసుని వంటి వారైనా, జరాసంధుని వంటి వారైనా లేక రావణుని వంటి వారైనా, ఎటువంటి వారైనా దయాహృదయులైన తండ్రి పిల్లలైన వారు కోపగించుకోరు, అసహ్యించుకోరు. పరివర్తన అవ్వాలనే భావన, కళ్యాణ భావన నుంచుతారు. ఎందుకంటే వారు కూడా పరివారములోని వారే, పరవశులై ఉన్నారు. పరవశమై ఉన్న వారి పై ఘృణ రాదు.

స్లోగన్‌ :-

''మాస్టర్‌ జ్ఞానసూర్యులుగా అయ్యి శక్తుల రూపీ కిరణాల ద్వారా బలహీనతలనే చెత్తను భస్మము చేసేయండి''