05-10-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - చదువునెప్పుడూ మిస్ చేయరాదు. చదివించే తండ్రి పై స్థిరమైన నిశ్చయమున్నప్పుడే, చదువు పై ఆసక్తి ఉంటుంది, నిశ్చయబుద్ధి గల పిల్లలే సేవ చేయగలరు ''
ప్రశ్న :-
బాప్దాదా తన పిల్లల నుండి ఏ సమాచారము విని చాలా సంతోషిస్తారు ?
జవాబు :-
పిల్లలు సేవా సమాచారము తెలుపు ఉత్తరాలు వ్రాసినప్పుడు, బాబా ఈ రోజు మేము ఫలానివారికి అర్థము చేయించాము. వారికి ఇద్దరు తండ్రుల పరిచయమిచ్చాము, ఫలానా విధంగా సేవ చేశాము అని వ్రాస్తే ఆ ఉత్తరాలు చదివి బాబా చాలా సంతోషిస్తారు. కేవలం ప్రియమైన స్మృతులు, క్షేమ సమాచారాలు తెలిపే జాబులు వ్రాసినంత మాత్రాన బాబా కడుపు నిండదు. బాబా తనకు సహయోగము చేసే పిల్లలను చూసి సంతోషిస్తారు. కావున సేవ చేసి ఆ సమాచారము గురించి వ్రాయాలి.
పాట :-
ఓ తల్లి వెళ్తాము పద,...................(చలో చలే మా ...................) 
ఓంశాంతి.
ముళ్ళ ప్రపంచము నుండి పుష్పాల ప్రపంచానికి వెళ్లాలని పిల్లలకు తెలుసు. సత్యయుగ ప్రపంచాన్ని దైవీ పుష్పమని అంటారు. కలియుగములోని మానవులు ముళ్ళ సమానంగా ఉన్నారు. ఒకరినొకరు దు:ఖము కలిగించుకుంటూ ఉంటారు, విసిగించుకుంటారు, సతాయించుకుంటారు. ఇప్పుడు మనము మన దైవీ పుష్పాల సుఖధామానికి వెళ్లాలి, పోదాం పద అని పిల్లలైన మీరు సంతోషిస్తారు. అచ్చటికి వెళ్లే రహస్యాన్ని కూడా అర్థము చేసుకోవాలి. బాగా చదువుకున్నప్పుడే అక్కడకు వెళ్ళగలరు. మొదట చదివించే వారెవరు అన్న విషయము నిశ్చయమవ్వాలి. ఈ విషయాలు ఏ వేద శాస్త్రాలు మొదలైన వాటిలో వ్రాయబడి లేవు. భలే గీతలో రాజయోగమని వ్రాయబడి ఉంది. ఇది రాజ్యము కొరకు చదివే చదువు. రాజ్యము సత్యయుగములో తప్పకుండా ఇస్తారు. మొదట చదివించేవారి పై నిశ్చయముండాలి. వీరు ఎవరో సాధు, సత్పురుషులు, మనుష్యులు కారు. వీరు నిరాకారులు. సర్వాత్మల తండ్రి పరమపిత పరమాత్మ. కల్పక్రితము ఎవరికి నిశ్చయముంటుందో ఇప్పుడు వారికే నిశ్చయముంటుంది. పుష్పాల రాజ్యములోకి వెళ్లేందుకు ప్రతి ఒక్కరు వారి వారి పురుషార్థము వారు చేస్తున్నారని మీరు చూస్తూనే ఉన్నారు. మొదట నిశ్చయముంటే వెంటనే చదువులో లగ్నమైపోతారు. శాస్త్రాలలో కృష్ణ భగవానువాచ అని వ్రాసేశారు. అంతేకాక రుద్ర జ్ఞాన యజ్ఞమని కూడా వ్రాయబడి ఉంది. ఇవేమో జ్ఞాన విషయాలు. మానవులు కృష్ణునికి కర్రతో చేయబడిన పిల్లనగ్రోవినిచ్చారు. నీ మురళిలో దైవీ గారడి,.......... అని గాయనము కూడా ఉంది. వెదురు మురళితో దైవీ గారడి జరగదు. దానిని నోటితో మ్రోగించగలరు. కృష్ణుని బాల్యమే చూపిస్తారు. ఆడుతూ, గెంతుతూ ఉంటాడు. ఇవన్నీ చాలా అర్థము చేసుకునే విషయాలు. పిల్లలు ఇది రాజయోగమని అర్థము చేసుకున్నారు. అనగా రాజ్యము ప్రాప్తి చేసుకునే చదువు. చదివించేవారితో యోగము. వారు ఎదురుగా వచ్చి చదివిస్తారు. ఇందులో వెదురు మురళి మాటే లేదు. ఈ విషయాలే అద్భుతమైనవి. నిరాకార భగవంతుడు స్వయంగా వచ్చి చదివిస్తారని ఎవ్వరికీ తెలియదు. కృష్ణుని మురళిలో ఈశ్వరీయ(ఖుదా) గారడి ఉందని అంటారు. అనగా భగవంతుడు(ఖుదా) వేరే ఉన్నారనే కదా. కృష్ణుని ఖుదా అని అనరు. ఖుదా ఖుదాయే. వారినే ఇంద్రజాలికులు(జాదూగర్) అని అంటారు. జాదూగర్ స్వయంగా వచ్చి ఇంద్రజాలము చూపిస్తారు. సాక్షాత్కారము చేయిస్తారు. అంతేకాక ఉన్నత పదవి ప్రాప్తి చేయించేందుకు చదివిస్తారు. మీరాబాయి కూడా వైకుంఠము చూసి నృత్యము చేసింది. కాని ఆమె రాజయోగము నేర్చుకోలేదు. రాజయోగము గురించి మరి ఇతర ఏ శాస్త్రాలలోనూ లేదు. మీరాబాయిని చదివించేవారెవ్వరూ లేరు. మీరా పేరు కూడా భక్తుల మాలలో ఉంది. ఇది జ్ఞాన మాల. రెండింటికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. జ్ఞానము ఎంత ఎక్కువగా గ్రహిస్తారో అంత ఉన్నతంగా అవుతారని మీరు అర్థము చేసుకున్నారు. తప్పకుండా భక్తి మాల కూడా ఉంది. అందులో కూడా నెంబరువారీగా ఉన్నారు. వారి పేరు ప్రసిద్ధి గాంచింది. ఆ జ్ఞానము మరెవ్వరిలోనూ లేదు. కావున ఈ జ్ఞానమిచ్చే అథారిటీ అయిన త0డ్రి అని అర్థము చేయించాలి. వారు బ్రహ్మముఖ కమలము ద్వారా బ్రాహ్మణులను రచించారని, వారికి సర్వ వేద శాస్త్రాల సారాన్ని వినిపిస్తారని అంటారు. శివబాబాకైతే శాస్త్రాలు ఇవ్వలేము. ఎందుకంటే వారు నిరాకారులు. కావున బ్రహ్మ ద్వారా అర్థము చేయిస్తారు. ఈ యుక్తి రచించారు. కాని ఈ విషయాలన్నీ అర్థము చేయించేవారు ఆ ఒక్కరు మాత్రమే. బ్రహ్మ ద్వారా సారము తెలుపుతారు అనగా అర్థము చేయించేవారు తప్పకుండా వేరేవారు కదా. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూస్తారు. జ్ఞానసాగరులైన శివబాబా మనకు తండ్రి కూడా అయ్యారు. వారు సన్ముఖములో కూర్చొని ఉన్నారు. వారు భారతదేశములోనే వస్తారు, తప్పకుండా ఇతరుల శరీరములో వస్తారు. ఇది బ్రహ్మ శరీరము. ప్రజాపిత బ్రహ్మ ఉండడం కూడా అవసరము. తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ ద్వారానే తండ్రి వచ్చి బ్రాహ్మణ ధర్మాన్ని రచిస్తారు. ధర్మమునెలా స్థాపిస్తారో కూడా మీకు తెలుసు. మీరు ప్రాక్టికల్గా బ్రహ్మ సంతానము. మేము బ్రాహ్మణ-బ్రాహ్మణీలమని, తండ్రి నుండి వారసత్వము తీసుకుంటున్నామని మీరంటారు. శిష్యులెప్పుడూ వారసత్వము తీసుకోలేరు. పిల్లలే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు, మీరు వచ్చి అనంతమైన పిల్లలుగా అయ్యారు. ఏసుక్రీస్తు అనుచరులని అంటారే గానీ పిల్లలని అనరు. అలాగే బుద్ధుని అనుచరులు గురునానక్ అనుచరులని అంటారు. పిల్లలని అనరు. ఇక్కడ మీరు పిల్లలుగా ఉన్నారు. ప్రజాపిత కూడా తండ్రే. శివబాబా కూడా తండ్రే. వారేమో నిరాకారులు. ఈ సాకారుడు వేరుగా ఉన్నాడు. ఈ సాకారము ద్వారానే శివబాబా పిల్లలను రచించారు. ఇప్పుడు మీలో కూడా కొంతమందికి పక్కా నిశ్చయముంది. కొంతమందికి లేదు. ఇది చాలా పెద్ద లాటరీ.
మీరు శరీర నిర్వహణార్థము కర్మలు కూడా ఆచరించాలి. ఈ జ్ఞానము కూడా నేర్చుకోవాలి. ఈ చదువులో చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా తండ్రి చెప్తున్నారు - ఒక ఘడియ, అర్ధ ఘడియ తప్పకుండా చదవండి. ఏ కారణంగానైనా ప్రతి రోజూ చదవలేపోతే కనీసము మొదట 7 రోజులు చదివి(కోర్సు తీసుకొని) తర్వాత మురళీ ఆధారముతో జ్ఞానములో నడవగలరు. లక్ష్యాన్ని పట్టుకున్నారు, ఇక మిగిలిన శాఖలు, కొమ్మలు, ఆకులు మొదలైన వాటిని అర్థము చేసుకోవడం, ఇవన్నీ చక్రములో వచ్చేస్తాయి. మీకు 84 జన్మల రహస్యము కూడా అర్థము చేయించారు. ఈ రహస్యము సృష్టి చక్రములో సార రూపంలో, క్లుప్తంగా, కల్పవృక్షములో విస్తారంగా ఉంది. ఇది మనుష్య సృష్టిలోని రకరకాల ధర్మాలను తెలుపుతుందని అర్థము చేయించడం జరిగింది. మొదట ఒకే ధర్మము ఉంటుంది. ఆ తర్వాత వృద్ధి చెందుతుంది. ఏ విధంగా వృద్ధి చెందుతుందో, పునాది ఎలా ఏర్పడిందో కూడా చూపించారు. ఎంత స్వాభావికమైన సహజమైన రహస్యము - డ్రామాను, వృక్షాన్ని అర్థము చేసుకొని బుద్ధిలో ధారణ చేయాలి. అంతేకాక ఇతరులకు కడా అర్థము చేయించాలి. ఇద్దరు తండ్రుల పాయింటును తప్పకుండా అర్థము చేయించాలి. అనంతమైన తండ్రి నుండి స్వ రాజ్యము లభిస్తుంది. దాని కొరకు రాజయోగము తప్పకుండా నేర్చుకోవాల్సి ఉంటుంది. స్వయం పరమపిత పరమాత్మయే స్వర్గ స్థాపన చేస్తారు. దానిని కృష్ణపురము అని కూడా అంటారు. కంసపురములో కృష్ణపురము స్థాపించబడదు. అలా స్థాపించేందుకు సంగమ యుగము ఉంచబడింది. పిల్లలైన మీకిది సంగమ యుగము. మిగిలిన వారందరికీ కలియుగము. మీరు మాత్రమే మళ్లీ సంగమ యుగము నుండి సత్యయుగములోకి వెళ్తారు. ఇందులో నిశ్చయముండాలి. ఇప్పుడు మనము సంగమ యుగములో ఉన్నాము. సంగమ యుగము గుర్తుంటే సత్యయుగము కూడా గుర్తుంటుంది. అంతేకాక సత్యయుగాన్ని స్థాపించేవారు కూడా స్మృతిలో ఉంటారు. కాని క్షణ క్షణము మర్చిపోతారు. ఇప్పుడు మనము సంగమ యుగములో ఉన్నామని మీరు అర్థము చేసుకున్నారు. కల్పము యొక్క సంగమ యుగములోనే అనంతమైన తండ్రి వస్తారు. గీతలో పొరపాటు చేసేశారు. గీతతో సంబంధముండేవి భాగవతము. మహాభారతము మొదలైనవి మాత్రమే.
తండ్రి అర్థము చేయిస్తున్నారు - మీరందరూ సీతలు. నేనొక్కరినే రాముడిని. మీరు రావణ రాజ్యమనే లంకలో ఉన్నారు. ఆ లంక కాదు, అక్కడ రావణ రాజ్యము లేదు. సత్యయుగములో లంక మొదలైనవేవీ ఉండవు. ఆ వైపు బౌద్ధ ధర్మముంది. ఇప్పుడు బౌద్ధ ధర్మము చాలా వ్యాపించి ఉంది. భారతదేశము మొదట సంపూర్ణ పవిత్రతంగా ఉండి, అందులో సుఖ-శాంతులుండేవని, ఒకే దేవీ దేవతా ధర్మముండేదని పిల్లలకు అర్థము చేయించబడింది. మొదట వీరు మన అనంతమైన తండ్రి అని, వారి నుండి వారసత్వము తీసుకోవాలని పక్కా నిశ్చయముండాలి. పురుషార్థములో ఎప్పుడూ పొరపాటు చేయరాదు. నిశ్చయము లేకుండా పురుషార్థము ఎలా చేయగలరు? తండ్రి చదివిస్తారు. వారి నుండి స్వర్గ వారసత్వము సదా కొరకు సుఖము లభిస్తోంది. ఇది తప్పక లభించి తీరుతుంది. నిశ్చయము లేకుండా, లక్ష్యము లేకుండా పాఠశాలలో కూర్చోలేరు. అక్కడ చాలా సబ్జెక్టులు ఉంటాయి. మార్జిన్ ఉంటుంది అనగా ఏ సబ్జెక్టు అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ఉండేది ఒకే ఒక సబ్జెక్టు. దాని ద్వారా ఎంత గొప్ప రాజధాని స్థాపనైపోతుంది! చదవనివారు చదివినవారి ముందు సేవకులవుతారు. ప్రజలలో కూడా మంచి ప్రజల ముందు తక్కువ స్థాయి ప్రజలు సేవకులవుతారు. ప్రజలలో కూడా నెంబరువారుగా ఉంటారు. కొందరు పేదవారిగా, మరికొందరు షాహుకార్లుగా ఉన్నారు. ఒకరు మరొకరితో కలవరు. ఇది ఎటువంటి అద్భుతమైన డ్రామా! మానవులందరికి ప్రత్యేక పాత్రలు, రూపురేఖలు డ్రామాలో పాత్ర చేసేందుకు నిశ్చయింపబడి ఉన్నాయి. ఇవన్నీ ధారణ చేసి తెలుపవలసిన ఎంతో రహస్యమైన విషయాలు. అందరూ అర్థము చేయించలేరు. ఎంతో మంచి విషయాలను అర్థము చేయిస్తారు. నిశ్చయములోనే విజయముంది. నిశ్చయమున్నప్పుడే చదువుకుంటారు. కొంతమంది సంశయబుద్ధి గలవారుంటే ఈ చదువును వదిలేస్తారు. అహో మాయ వెంటనే తుఫాను కలిగించి సంశయంలో పడేస్తుంది. సంశయబుద్ధి వినశ్యంతి. పైకి ఎక్కారంటే వైకుంఠ రసము చవి చూస్తారు, క్రింద పడ్డారంటే చూర్ణమైపోతారు(ఛడే తో ఛాకే వైకురఠ రస్, గిరే తో చక్నా చూర్) చాలా వ్యత్యాసముంది. క్రింద పడ్డారంటే పూర్తి చండాలురుగా అయిపోతారు. పైకి ఎదిగారంటే ఒక్కసారిగా చక్రవర్తులుగా అవుతారు. మొత్తం ఆధారమంతా చదువు పైనే ఉంది. నిరాకారులు శిక్షకులుగా అవుతారని ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు శివబాబా ద్వారా వింటున్నారు. మీకు నిశ్చయమైపోయింది - నేను మీ తండ్రిని అంతేకాదు పతిత పావనుడను. నన్ను జ్ఞానసాగరుడని కూడా అంటారు. జ్ఞానము ద్వారా చక్రవర్తులుగా తయారవ్వాలని నిశ్చయముండాలి కదా. నిశ్చయములోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. శత్రువు మీ ఎదుటనే నిలిచి ఉన్నాడని మీకు తెలుసు. మాయ మన శత్రువని, అది క్షణ-క్షణము మోసము చేస్తుందని మీకు తెలుసు. దాని వలన సంశయపడి చాలామంది పిల్లలు చదువును వదిలేస్తారు. చదువును వదిలేశారంటే తండ్రి, టీచర్, సద్గురువును కూడా వదిలేసినట్లే. ఆ గురువులు మారుతూ ఉంటారు. అనేకమంది గురువులను ఆశ్రయిస్తారు. అయితే సద్గురువు వీరొక్కరు మాత్రమే. ఈ బ్రహ్మ తన మహిమను చెప్పుకోరు. తండ్రి తన పరిచయమునిస్తారు. భక్తులు ఓం నమ: శివాయ, మీరే మా మాతా-పిత,......... అంటూ పాడ్తారు. కాని ఆ మాత-పితల గురించి వారికేమీ తెలియదు. కేవలం నోటితో అంటూ ఉంటారు. పూజిస్తూ ఉంటారు. శివుడు ఎవరో మీరిప్పుడు తెలుసుకున్నారు. శివుని తర్వాత బ్రహ్మ-సరస్వతులు వస్తారు. ఆ తర్వాత లక్ష్మీనారాయణులు వస్తారు. మొదట శివబాబా తర్వాత బ్రహ్మ, విష్ణు, శంకరులు. తండ్రి చెప్తున్నారు - నేను మొట్టమొదట బ్రహ్మలో ప్రవేశిస్తాను. మొదట వీరిని రచిస్తాను. బ్రహ్మ ద్వారా స్థాపన తర్వాత బ్రహ్మయే విష్ణువుగా అయ్యి పాలన చేస్తారు. ఈ పాయింట్లన్నీ బాగా నోట్ చేసుకోవాలి. తర్వాత ఇతరులకు అర్థము చేయించే ప్రయత్నము చేయాలి. కొంతమంది చాలా బాగా అర్థము చేయిస్తారు. బాబా విషయము వేరే. కాసేపు శివబాబా అర్థము చేయిస్తారు, కాసేపు ఈ బాబా కూడా అర్థము చేయిస్తాడు. కానీ మీరు సదా శివబాబాయే అర్థము చేయిస్తున్నారని భావించండి. శివబాబాను స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. శివబాబా వీరి ద్వారా కొత్త కొత్త విషయాలు, పాయింట్లు వినిపిస్తారు, చాలా యుక్తిగా అర్థము చేయిస్తారు. కావున పిల్లలు అర్థము కూడా చేసుకోవాలి. మొదట నిశ్చయము చేసుకోవాలి. 7 రోజులలో రంగు బాగా ఏర్పడగలదు. అయితే మాయ కూడా చాలా తీవ్రమైనది కదా. మొదట తండ్రి స్వర్గ రచయిత కావున రాజయోగమును వారే నేర్పించి ఉంటారని నిశ్చయముండాలి. కృష్ణుడు నేర్పించలేడు. వారు వచ్చేదే సత్యయుగములో. స్వర్గ రచయిత శివబాబా. ఎవరైనా కృష్ణుని శరీరములో వచ్చారని అన్నా, కృష్ణుడైతే ఆ రూపములో రాజాలరు. అతడు రావడం సత్యయుగములోనే జరుగుతుంది. బాబా ఎవరి గర్భము నుండీ జన్మించరు. ఇతని శరీరములో ప్రవేశించి ఇతని పేరు బ్రహ్మ అని ఎందుకుంచారో ఇతనికి తన పరిచయము కూడా ఇస్తారు. ఇతడే ప్రారంభము నుండి చివరి వరకు పాత్రను అభినయిస్తాడు. మీకు కూడా చాలా మంచి మంచి పేర్లు పెట్టాను. ఎంత మంది పిల్లల పేర్లు వచ్చాయి! ఆశ్చర్యము కదా! వెంటనే 200 - 250 మంది పేర్లు వచ్చాయి. ఇక్కడి బ్రాహ్మణులు ఇన్ని పేర్లు వెంటనే ఇవ్వలేరు. సందేశి క్షణములో పేర్లు తీసుకొచ్చింది. అనంతమైన తండ్రి ఆ పేర్లు ఉంచారు. అద్భుతము కదా! అద్భుతమైన తండ్రి అద్భుతమైన లక్ష్యము.
మీరే రాజాధి రాజులుగా అవుతారు. లక్ష్మీనారాయణుల చిత్రము చాలా స్పష్టంగా ఉంది. పైన త్రిమూర్తి చిత్రము చాలా ఖచ్ఛితంగా ఉంది. 84 జన్మలు కూడా తప్పకుండా తీసుకోవాలి. కలియుగాంతము పతితము, సత్యయుగము ఆది పవిత్రము. పిల్లలు సేవకు ఋజువునివ్వాలి. బాబా మేము ఇటువంటి చిన్న-చిన్న కరపత్రాలు అచ్చు వేయించామని చూపించాలి. పై భాగములో శివుడు. త్రిమూర్తి మరియు ఇద్దరు తండ్రుల పరిచయము ఉండాలి. ఈ పాయింట్లు తప్పకుండా ఉండాలి. అటువంటి కరపత్రాలు అచ్చు వేయించి బాగా సేవ చేసి సమాచారము బాబాకు తెలపాలి. అప్పుడే తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారు. మీరు వ్రాసే ఉత్తరాలలో కేవలం క్షేమ-సమాచారాలే కాదు, సేవ చేసి బాబా మేము ఫలానా సేవ చేశాము అని సేవా సమాచారాన్ని వ్రాయాలి. కేవలం ప్రియమైన స్మృతులు తెలిపినందున బాబా కడుపు నిండదు(సంతోషించరు). ఈ రోజు ఫలానా వారికి అర్థము చేయించాము. ఈ రోజు పతికి సేవ చేశాము....... చాలా సంతోషించాడు, ఫలానా విధంగా సేవ చేశాము అంటూ సమాచారము బాబాకు వ్రాయాలి. ఇద్దరు తండ్రుల పాయింటు చాలా ముఖ్యము. అనంతమైన తండ్రి స్వర్గ రాజ్యభాగ్యమునిచ్చేవారు. మీరు ఎంత మధురాతి మధురమైన పిల్లలు! వీరంతా దత్త్తత తీసుకోబడిన పిల్లలని తండ్రి అర్థం చేయిస్తారు. ఇంతమంది పిల్లలంటే వీరంతా దత్తత తీసుకున్న పిల్లలే అవ్వగలరు. వారు ధర్మమును అనుసరించే పిల్లలుగా ఉంటారు. ఇక్కడ మీరు పిల్లలు, తండ్రి కూడా ఇటువంటి పిల్లలను చూచి సంతోషిస్తారు. వీరంతా నా పిల్లలు అని అంటారు. ఇప్పుడు చివరి పాత్రను అభినయిస్తున్నారు. స్వర్గ స్థాపనలో నాకు సహాయం చేసేందుకు నా సాథీలుగా అయ్యారు. ఇది రుద్రుడైన శివబాబా, వారి రాజస్వ అశ్వమేధ జ్ఞాన యజ్ఞము. శివబాబా స్వర్గ స్థాపన ఎలా చేస్తారు? మొదట బ్రహ్మ మరియు బ్రాహ్మణుల ద్వారా రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు. దాని ద్వారా స్వర్గ స్థాపన అవుతుంది. కావున తప్పకుండా బ్రాహ్మణులే యజ్ఞాన్ని నిర్వహించాలి.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. నిశ్చయబుద్ధిగలవారై చదువుకోవాలి. ఎప్పుడూ ఏ విషయములోనూ సంశయముండరాదు. నిశ్చయములోనే విజయముంది.
2. తండ్రికి సాథీలుగా అయ్యి స్వర్గ స్థాపన కార్యములో పూర్తి సహాయకారులుగా అవ్వాలి. యజ్ఞాన్ని సంభాళన చేసే పక్కా బ్రాహ్మణులుగా అవ్వాలి.
వరదానము :-
'' వచ్చి, పోయే అభ్యాసము ద్వారా బంధనముక్తులుగా అయ్యే న్యారే, నిర్లిప్త్(నిరాసక్త్) భవ ''
మొత్తం చదువు లేక మొత్తం జ్ఞాన సారము - రావడం, పోవడం. బుద్ధిలో ఇంటికి వెళ్లి రాజ్యములోకి వస్తామనే సంతోషముంది. కాని ఎవరికైతే సదా వచ్చి వెళ్లే (సత్యయుగానికి వచ్చి, పరంధామానికి వెళ్లే) అభ్యాసముంటుందో వారే సంతోషంగా వెళ్లగలరు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అశరీరి స్థితిలో స్థితమైపోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్మాతీతులుగా అయిపోండి - ఈ అభ్యాసము చాలా పక్కాగా ఉండాలి. అలా అభ్యాసము చేసేందుకు ఎలాంటి బంధనము తనవైపు ఆకర్షించరాదు. బంధనమే ఆత్మను టైట్గా(బిగుతుగా) చేసేస్తుంది. బిగువుగా ఉండే వస్త్రాన్ని విప్పడంలో తగుల్పాటు ఉంటుంది. అందువలన సదా న్యారాగా(అతీతంగా), నిర్లిప్తంగా ఉండే పాఠాన్ని పక్కా చేయండి.
స్లోగన్ :-
'' సుఖపు ఖాతాతో సంపన్నంగా ఉంటే, మీ ప్రతి అడుగు ద్వారా అందరికీ సుఖానుభూతి అవుతూ ఉంటుంది ''