01-12-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - మీరు అందరికీ జీవన్ముక్తిని పొందు మంత్రమునిచ్చే సద్గురువు పిల్లలైన గురువులు. మీరు ఈశ్వరుని గూర్చి ఎప్పుడూ అసత్యాన్ని చెప్పజాలరు ''

ప్రశ్న :-

సెకండులో జీవన్ముక్తిని పొందేందుకు విధి ఏది? దాని గాయనము ఏది ?

జవాబు :-

సెకండులో జీవన్ముక్తిని పొందేందుకు ప్రవృత్తిలో ఉంటూ కమలపుష్ప సమానంగా, పవిత్రంగా అవ్వండి. కేవలం ఈ అంతిమ జన్మలో పవిత్రతా ప్రతిజ్ఞను చేసినారంటే జీవన్ముక్తి లభిస్తుంది. ఈ విషయంలోనే జనక మహారాజు ఉదాహరణ మహిమ చేయబడింది. తాను గృహస్థ వ్యవహారంలో ఉంటూ ప్రతిజ్ఞ ఆధారం పై ఒక్క సెకండులో జీవన్ముక్తిని పొందా

పాట :-

యహ్‌ వక్త్‌ జా రహా హై,..............(ఈ సమయము వెళ్ళిపోతోంది,.............)

ఓంశాంతి

అందరికీ సెకండులో జీవన్ముక్తిని ఇచ్చేందుకు తండ్రి వస్తారు. సర్వుల సద్గతిదాత, జీవన్ముక్తిదాత ఒక్కరేనన్న మహిమ కూడా ఉంది. ఒక్క సెకండులో జీవన్ముక్తి అని ఎందుకు అంటారు? జనక మహారాజు ఉదాహరణ ఉంది కదా! అతని పేరు జనకుడు. కాని భవిష్యత్తులో తానే అనుజనకునిగా అవుతాడు. జనకునికి ఒక్క సెకండులో జీవన్ముక్తి లభించిందని అంటారు. కాని జీవన్ముక్తి అయితే సత్య, త్రేతా యుగాలలో ఉంటుంది. గురువులు చెవిలో మంత్రమును చెప్తారు. దానిని వశీకరణ మంత్రము అని కూడా అంటారు. వారందరూ మంత్రాలు ఇస్తారు. కాని మీకు మహామంత్రము లభిస్తుంది. జీవన్ముక్తిని పొందే మంత్రము లభిస్తుంది. ఈ మంత్రమును ఎవరు ఇస్తారు? బ్రహ్మకుమార - కుమారీలు. వారికి ఈ మంత్రము ఎక్కడి నుండి లభించింది? ఆ సద్గురువు నుండి లభించింది. సర్వోత్తముడైతే ఒక్క తండ్రి మాత్రమే. ఆ తర్వాత పిల్లలైన మీరు సర్వోత్తములుగా అవుతారు. వారిలో సర్వోత్తమ గురువులు ఉంటారు. సద్గురువు పిల్లలైన మీరు కూడా గురువులే. గీతను వినిపించేవారిని కూడా గురువులని అంటారు. నెంబరువారుగా అయితే ఉంటారు కదా. మీరు కూడా సత్యాన్ని చెప్పే గురువులు. మీరు ఎప్పుడూ ఈశ్వరుని గూర్చి అసత్యమును చెప్పరు. మేము ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళము అని ప్రతిజ్ఞ చేయండి అని మీరు మొట్టమొదట పవిత్రతను గూర్చే అర్థం చేయిస్తారు. అసత్యం మొదలైనవి చెప్పకుండా ఉండడం సామాన్య విషయాలు. అబద్ధమైతే చాలామంది నుండి వెలువడ్తూ ఉంటుంది. కాని ఇక్కడ ఆ విషయం లేదు. ఇక్కడ ఇది పవిత్రంగా ఉండే విషయము. గృహస్థ వ్యవహారములో ఉంటూ ఈ అంతిమ జన్మలో మనము - '' మేము కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉంటాము '' అని తండ్రితో ప్రతిజ్ఞ చేస్తాము. కనుక ఇది పవిత్రంగా ఉండే విషయము. ఇది చాలా ఉన్నతమైన లక్ష్యము, అది సాధ్యము కానిది అని అంటారు. కాని ఎందుకు జరగదు! అని మీరంటారు. కమలపుష్ప సమానంగా ఉండడం......... అన్న గాయనము ఉంది. ఈ ఉదాహరణ శాస్త్రాలలో వ్రాయబడి ఉంది. తప్పకుండా తండ్రియే ఇటువంటి శిక్షణను ఇచ్చారు. భగవానువాచ లేక బ్రాహ్మణ ఉవాచ అని ఉంది. భగవంతుడు అందరికీ వినిపించరు. బ్రాహ్మణ పిల్లలే వింటారు. ఈ విషయాన్ని మీరు అందరికీ అర్థము చేయించాలి. పవిత్రతయే ముఖ్యమైన విషయము. జనకునిలా కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. అదే జనకుడు మళ్లీ అనుజనకునిగా అయ్యాడు. ఉదాహరణానికి రాధ అనురాధగా అవుతుంది కదా! ఎవరికైనా నారాయణ అన్న పేరు ఉంటే భవిష్యత్తులో అనునారాయణునిగా అవుతాడు. ఇది ఖచ్ఛితమైన విషయము. కావున ఎవరు వచ్చినా వారికి అర్థం చేయించవలసి ఉంటుంది. సెకెండులో జీవన్ముక్తి అని అయితే వినే ఉంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఉన్నత పదవిని పొందవచ్చు. మేము అనుభవంతో చెబుతున్నాము, కేవలం గొప్పలు (గప్పాలు) చెప్పడం లేదు. '' భగవానువాచ - భగవంతుడు అందరికి తండ్రి '' అన్న ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి. తప్పకుండా జీవన్ముక్తిదాత కూడా వారే. ఇది ప్రవృత్తి మార్గము. సన్యాసులదైతే నివృత్తి మార్గము. వారు ఎప్పుడూ రాజయోగం నేర్పించలేరు. వారు ఇళ్ళూ-వాకిళ్ళను వదిలి పారిపోయేవారు. వారు ఈ జ్ఞానమును ఇవ్వలేరు. ఇది రాజయోగము. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. సత్యయుగములో భారతదేశము పవిత్ర ప్రవృత్తి మార్గముగా ఉండేది. అది నిర్వికారీ ప్రపంచము. రాజ్యంలో స్త్రీలు, పురుషులు ఇరువురూ కావాలి. కావున మేము అనుభవజ్ఞులము, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండవచ్చు అని వారికి అర్థం చేయంచవలసి ఉంటుంది. పవిత్రంగా అయ్యి తండ్రి ద్వారా పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అవుతామని మనకు తెలుసు. ఒకప్పుడు పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది. ఇప్పుడైతే అపవిత్ర మార్గముగా ఉంది. ఈ ప్రపంచమే భ్రష్ఠాచారీ ప్రపంచము. అది శ్రేష్ఠాచారీ ప్రపంచంగా ఉండేది. రావణుడు భ్రష్ఠాచారీ ప్రపంచంగా చేస్తాడు. రాముడు శ్రేష్ఠాచారిగా చేస్తాడు. అర్ధకల్పం రావణరాజ్యం కొనసాగుతుంది. భ్రష్ఠాచారీ ప్రపంచములో భక్తిమార్గం ఉంటుంది. దాన-పుణ్యాదులు చేస్తూ ఉంటారు ఎందుకంటే భ్రష్ఠాచారము ఉంది. మనుష్యులు ఎంతగా భక్తి, దాన-పుణ్యాదులు చేస్తూ ఉంటారో అంతగా వారికి భగవంతుడు లభిస్తాడని భావిస్తారు. భగవంతుడిని భక్తి చేస్తారు. మీరు వచ్చి మమ్ములను శ్రేష్ఠంగా తయారు చేయండని అంటారు. భారతదేశం శ్రేష్ఠాచారిగా ఉండేది. ఇప్పుడు అలా లేదు.

భ్రష్ఠాచారులే శ్రేష్ఠాచారులుగా అవుతారు. భారతదేశపు కొత్త రచనను గూర్చిన కథ ఎవ్వరికీ తెలియదు. చిత్రాల ద్వారా బాగా అర్థం చేయంచవచ్చు. అటువంటి చిత్రాలను తయారు చేయవలసి ఉంటుంది. ప్రతి సెంటర్లో ప్రదర్శనీ చిత్రాలు ఉండాలి. మా వద్ద చిత్రాలు లేవు అని వ్రాస్తే అవి తయారు చేసి అందరికి పంపించినట్లయితే అందరి వద్ద ప్రదర్శని ఉంటుందని అని బాబా డైరెక్షన్‌ ఇస్తారు. ఈ చిత్రాలు చాలా అర్థ సహితంగా ఉన్నాయి. మేము తండ్రి పిల్లలము అన్నది మొట్టమొదట బుద్ధిలోకి రావాలి. భగవంతుడు స్వర్గాన్ని రచించేవారు. నరకాన్ని రచించేది రావణుడు. గోళము పై 10 శిరస్సుల రావణుని చిత్రాన్ని తయారు చేయండి. స్వర్గం గోళము పై చతుర్భుజ చిత్రాన్ని చేయండి. ఇది రామరాజ్యము. అది రావణరాజ్యము అని కూడా వ్రాయవచ్చు. ఈ సమయములో రావణుడు సర్వవ్యాపిగా ఉన్నాడు. అక్కడ రాముడు సర్వవ్యాపి అని అనైతే మనము అనజాలము. ఆత్మ, పరమాత్మలు ఎంతో కాలము దూరంగా ఉండినారు. తర్వాత సద్గురువు మధ్యవర్తిగా లభించడముతో సుందరమైన మిలనము జరిపాడు......... అని గాయనము కూడా చేయబడింది. మరి వారు తప్పకుండా వస్తారు కదా! ఈ లెక్కను గూర్చి ఎవ్వరికీ తెలియదు. మొట్టమొదట దేవీదేవతల ఆత్మలు వేరయ్యారు. ఈ జ్ఞానాన్ని మీరు ఎవరికైనా అర్థం చేయించాలి. ఆత్మలకు తండ్రి అయితే ఉన్నారు కదా! ఇప్పుడు హే ఆత్మల్లారా! మీ పరమపిత పరమాత్మ కర్తవ్యాన్ని గూర్చి తెలిపించండి. మీకు తెలియదా? తండ్రి కర్తవ్యాన్ని గూర్చి తెలియని పిల్లలు ఎవ్వరూ ఉండరు. మీకు మీ జన్మలను గురించి తెలియదు. నేను అర్థం చేయిస్తానని తండ్రి కూర్చొని అర్థము చేయిస్తున్నారు. మొట్టమొదట దేవీదేవతలు ఇన్ని జన్మలు తీసుకుంటారు. మరి ఇతర ధర్మాలవారు ఎన్ని జన్మలు తీసుకుంటారో లెక్క వేయండి. ఎక్కువలో ఎక్కువ ఇన్ని జన్మలు తీసుకుంటారు అని ఋజువు చేసి చెప్పవలసి ఉంటుంది. వ్షృము వృద్ధి చెందుతూ ఉంటుంది. మొట్టమొదట దేవీదేవతలు ఉండేవారు. వారే 84 జన్మలు తీసుకుంటారని చెప్పబడ్తుంది. ఇది భారతదేశపు జ్ఞానం కదా! ప్రాచీన భారతదేశ జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారు? కృష్ణుడంటే ఒప్పుకోరు. దానిని భగవంతుడే ఇచ్చారు. జ్ఞానసాగరులు తండ్రి అయిన భగవంతుడే కదా. బ్రహ్మను కూడా నాలెడ్జ్‌ఫుల్‌(జ్ఞానసాగరులు) అని అనరు. అలాగే కృష్ణుడిని కూడా అనరు. కృష్ణుని మహిమయే వేరు. ఇది అర్థం చేసుకోవలసిన చాలా స్పష్టమైన జ్ఞానము. అందరి భగవంతుడు ఒక్క నిరాకార పరమపిత పరమాత్మయే. వారు రచయిత. కృష్ణుడు రచన. ఉన్నతోన్నతుడైన భగవంతుడైతే ఒక్కరే కదా! వారిని సర్వవ్వాపి అని అనరు. భారతదేశంలో ఉన్నతోన్నతుడు ప్రెసిడెంట్‌(దేశాధ్యక్షులు). ఆ తర్వాత నెంబరువారుగా ఇతరులు ఉన్నారు. అందరి కర్తవ్యాలను గూర్చి తెలిపిస్తారు. అంతేకాని అందరూ ఒక్కరే అని అనరు కదా. ప్రతి ఆత్మకు అవినాశి పాత్ర లభించింది. దీనిని నిరూపించాలి. పరస్పరం యోచించి సేవా ప్లాన్‌ తయారు చేయాలి. కాని, ఎవరి లైను క్లియర్‌గా ఉండదో ఎవరికైతే వికారాలు ఉంటాయో ఎవరైతే నామ-రూపాలలో చిక్కుకుని ఉంటారో వారిచే ఈ పని జరగదు. ఇందులో లైన్‌ చాలా స్పష్టంగా ఉండాలి. రిజల్టు అంతిమములోనే వెలువడ్తుంది. ఇప్పుడైతే అందరూ నెంబరువారీగా ఉన్నారు. వ్యాసభగవానుడు శాస్త్రాలను తయారు చేశాడని మనుష్యులు అంటారు. వ్యాసుడైతే భగవంతుడు కాజాలడు. నిజానికి ఉన్న ధర్మశాస్త్రాలు నాలుగే. భారతదేశ ధర్మశాస్త్రం ఒక్క మాత - పిత అయిన గీతయే. వారసత్వం వారి నుండే లభిస్తుంది. తల్లి ద్వారా, తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. గీతా మాతకు రచయిత తండ్రియే. కావున గీత ద్వారానే తండ్రి ప్రాచీన సహజ రాజయోగము యొక్క జ్ఞానమునిచ్చారు. గీత భారతఖండపు శాస్త్రము. ఆ తర్వాత ఇస్లాముల ధర్మశాస్త్రము ఇస్లాములది, బౌద్ధులది, క్రైస్తవులది ఎవరిది వారిదే. గీత అయితే అందరికీ మాత-పిత వంటిది. మిగిలిన శాస్త్రాలు పిల్లల వంటివి. అవి తర్వాత వెలువడ్డాయి. మిగిలిన ఇన్ని వేదోపనిషత్తులు మొదలైనవన్నీ ఏ ధర్మానికి చెందినవి? వీటిని ఎవరు ఉచ్ఛరించారో అన్నదైతే తెలియాలి కదా! వాటి ద్వారా ఏ ధర్మం వెలువడింది? ఏ ధర్మమూ లేదు. గీత ఖండితమయిందని మొట్టమొదట నిరూపించాలి. తండ్రికి బదులుగా కొడుకు పేరును వేసేశారు. అందరి జీవిత చరిత్రలు వేరు వేరు. '' సర్వ ధర్మాలను పరిత్యజించి నన్నొక్కరినే స్మృతి చేయండి '' అని తండ్రి అంటారు. ''మీరు అశరీరులుగా అవ్వండి, నన్ను స్మృతి చేయండి'' అని పరమాత్మ ఆత్మలకు చెప్తారు. అశరీరి అయిన తండ్రియే ఇలా చెప్పగలరు. సన్యాసులైతే ఇలా చెప్పలేరు. ఇవి గీతలోని పదాలు. '' అశరీరి భవ! '' అని అన్ని ధర్మాలవారికి చెప్తారు. ఇప్పుడు నాటకము పూర్తి అవుతుంది. ''దేహ సహితంగా దేహము యొక్క సర్వ సంబంధాలను పరిత్యజించి నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు నా వద్దకు వచ్చేస్తారు '' అని అందరికీ మంత్రము లభిస్తుంది. ముక్తి తర్వాత జీవన్ముక్తి పదవి తప్పకుండా ఉంటుంది. జీవన్ముక్త పదవి వయా ముక్తి ఉంటుంది. ఎవరు వచ్చినా వారంతా సతో, రజో, తమో గుణాలను దాటుతారు. ఎంత బాగా అర్థం చేయించబడ్తుంది! కాని పిల్లలు ఒక చెవి నుండి విని ఇంకొక చెవి నుండి వదిలేస్తారు. నిజానికి ఇది చాలా సహజము.

మీరు అన్ని చోట్లా ప్రదర్శని చేయండి. ఇది వార్తాపత్రికల్లో కూడా పడాలి. ఇందులో మీరు ఖర్చు చేయవచ్చు. తద్వారా అందరూ వినగలరు. వార్తాపత్రికల్లో తప్పకుండా వేయాలి. పిల్లలకు ఎంతో నషా ఉండాలి. చాలా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. అతీంద్రియ సుఖం యొక్క అనుభూతిని గూర్చి గోప-గోపికలను అడగండి. వీరు గోపీ వల్లభుని గోప-గోపికలు అన్న గాయనము ఉంది. గోప గోపికలు సత్యయుగంలోనూ ఉండరు. కలియుగములోనూ ఉండరు. అక్కడ లక్ష్మీదేవి, రాధా దేవీలు ఉంటారు. గోప-గోపిలు ఇప్పుడున్నారు. గోపీవల్లభుని పిల్లలు మనవళ్ళు, మనవరాళ్ళు తప్పకుండా తాత కూడా ఉంటారు. తాత, తండ్రి మరియు తల్లి, సంగమ యుగములో ఇది కొత్త రచన. నేను కల్ప-కల్పము కల్పము యొక్క సంగమ యుగములో కొత్త ప్రపంచాన్ని తయారు చేసేందుకు వస్తానని బాబా అంటారు. మీరు ఆసురీ సంతానం నుండి ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. తర్వాత మీరు మళ్లీ దైవీ సంతానంగా అవుతారు. ఆ తర్వాత క్షత్రియ, వైశ్య, శూద్ర సంతానంగా 84 జన్మలలో అవుతారు. అలాగే వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. వృక్షం కూడా పూర్తిగా ఉండాలి. ప్రళయం కూడా జరగదు. భారతదేశమైతే అవినాశీ ఖండము. భారతదేశాన్ని చాలా మహిమ చేయాలి. భారత ఖండము అన్ని ఖండాలలోకి శ్రేష్ఠమైనది. అదెప్పుడూ వినాశనమవ్వదు అచ్ఛా!

రాత్రి క్లాసు (16-04-1968) :-

పిల్లలైన మీకు తప్ప సంగమ యుగము ఎప్పుడు ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. ఈ కల్పము యొక్క సంగమ యుగానికి ఎంతో మహిమ ఉంది. ఈ సమయంలో తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. సత్యయుగము కొరకు తప్పకుండా సంగమ యుగమే వస్తుంది. అందరూ మనుష్యులే. వారిలో కొందరు కనిష్ఠులు. కొందరు ఉత్తములు ఉన్నారు. మీరు పురుషోత్తములు, మేము కనిష్ఠులము అని వారి ముందు వారి మహిమను గానము చేస్తారు. నేను ఇలా ఉన్నాను, ఇలా ఉన్నాను అంటూ తమకు తామే చెప్పుకుంటారు.

ఇప్పుడు ఈ పురుషోత్తమ సంగమ యుగము గురించి బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఈ విషయం మనుష్యులకు తెలిసే విధంగా ఎలా అడ్వర్‌టైజ్‌(ప్రకటన) చేయాలి? సంగమ యుగములో భగవంతుడే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. మనం రాజయోగాన్ని నేర్చుకుంటున్నామని మీకు తెలుసు. ఇది మనుష్యులకు తెలిసేందుకు ఇప్పుడు ఇటువంటి యుక్తులే రచించాలి. అది మెల్ల మెల్లగా జరుగుతుంది. ఇప్పుడింకా సమయం ఉంది. చాలా పోయింది. ఇక కొద్దిగానే ఉంది,............... మనము చెప్తే మనుష్యులు త్వర త్వరగా పురుషార్థం చేస్తారు. లేకపోతే జ్ఞానము సెకండులో లభిస్తుంది. తద్వారా మీరు అదే సమయంలో క్షణములో జీవన్ముక్తిని పొందుకునేస్తారు. కాని మీ తల పై అర్ధకల్పపు పాపాలున్నాయి. అవి క్షణములో ఎలా నశిస్తాయి. ఇందులో సమయం పడ్తుంది. ఇప్పుడింకా సమయం ఉంది. మనం బ్రహ్మాకుమారీల వద్దకు ఇప్పుడే ఎందుకు వెళ్ళాలి? అని మనుష్యులు భావిస్తారు. సాహిత్యము ద్వారా తప్పుగా(వ్యతిరేకంగా) కూడా తీసుకుంటారు. భాగ్యంలో లేకపోతే దాన్ని తప్పుగా స్వీకరిస్తారు. ఇది పురుషోత్తములుగా అయ్యే యుగమని మీరు భావిస్తారు. వజ్ర తుల్యంగా అవుతారు అన్న గాయనము ఉంది కదా! తర్వాత తక్కువైపోతుంది. స్వర్ణిమ యుగము, వెండి యుగము. ఈ సంగమ యుగము వజ్ర సమానమైన యుగము. సత్యయుగము స్వర్ణిమ యుగము. స్వర్గం కంటే ఈ సంగమము మంచిదని మీకు తెలుసు. ఇది వజ్ర తుల్యమైన జన్మ. అమరలోకానికి మహిమ ఉంది కదా. మళ్ళీ అది తగ్గిపోతూ ఉంటుంది. పురుషోత్తమ సంగమ యుగము వజ్ర సమానమైనదని, సత్యయుగం బంగారము వంటిదని, త్రేతా యుగము వెండి వంటిదని కూడా మీరు అర్థం చేయించవచ్చు. సంగమ యుగములోనే మనము మనుష్యుల నుండి దేవతలుగా అవుతారని మీరు అర్థం చేయించవచ్చు. 8 రత్నాలను తయారు చేస్తారు కదా. మధ్యలో వజ్రాన్ని ఉంచుతారు. సంగమానికి ఎంతో ప్రఖ్యాతి ఉంటుంది. సంగమ యుగము వజ్ర సమానమైనది. వజ్రానికి సంగమ యుగంలో విలువ ఉంది. యోగము మొదలైనవి నేర్పిస్తారు. దానిని ఆధ్యాత్మిక యోగము అని అంటారు. కాని ఆత్మికమైనవారు ఒక్క తండ్రియే. ఆత్మిక తండ్రి మరియు ఆత్మిక జ్ఞానము సంగమ యుగంలోనే లభిస్తుంది. ఏ మనుష్యులలో అయితే దేహ అహంకారము ఉంటుందో, వారు అంత త్వరగా ఎలా అంగీకరిస్తారు? పేదలు మొదలైనవారికి అర్థం చేయించబడ్తుంది. సంగమ యుగము వజ్ర సమానమయిందని కూడా వ్రాయవలసి ఉంటుంది. దాని ఆయువు ఇంత. సత్యయుగము స్వర్ణ యుగము. దాని ఆయువు కూడా ఇంత అని వ్రాయాలి. శాస్త్రాలలో కూడా స్వస్తిక్‌ను వ్రాస్తారు. కావున పిల్లలైన మీకు కూడా ఇది గుర్తున్నట్లయితే ఎంత సంతోషం ఉండాలి! విద్యార్థులకు సంతోషం కలుగుతుంది కదా. విద్యార్థి జీవితము అన్నిటికంటే శ్రేష్ఠమైన జీవితము. ఇది సంపాదనకు ఆధారము. ఇది మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే పాఠశాల. దేవతలైతే విశ్వాధిపతులుగా ఉండేవారు. ఇది కూడా మీకు తెలుసు. కావున మీకు అపారమైన సంతోషము ఉండాలి. అందుకే అతీంద్రియ సుఖమును గురించి గోపీవల్లభుని గోప-గోపికలను అడగండి అన్న గాయనము ఉంది. టీచరు అంతిమం వరకు చదివిస్తారు. కావున వారిని చివరివరకు స్మృతి చేయాలి. భగవంతుడు చదివిస్తారు, అంతేకాక వారు తమ వెంట కూడా తీసుకెళ్తారు. వారిని ముక్తిప్రదాత, మార్గదర్శకులు అని కూడా పిలుస్తారు. దు:ఖము నుండి విడిపించమని కోరుకుంటారు. సత్యయుగములో అసలు దు:ఖమే ఉండదు. విశ్వంలో శాంతి ఏర్పడాలి అని అంటారు. ఇంతకుముందు శాంతి ఎప్పుడు ఉండేది? అది ఏ యుగము? అని అడగండి. ఎవ్వరికీ తెలియదు. రామరాజ్యము సత్యయుగము, రావణ రాజ్యము కలియుగము. ఇదైతే తెలుసు కదా. పిల్లలు అనుభవాన్ని వినిపించాలి. నా హృదయ అనుభూతిని ఏమని చెప్పను! బేహద్‌ రాజ్యాధికారాన్నిచ్చే బేహద్‌ తండ్రి లభించారు. ఇక ఏమి వినిపించను. తర్వాత ఇంకే విషయమూ లేదు. ఇంతటి సంతోషము ఇంకెక్కడా ఉండనే ఉండదు..... ఎవరితోనైనా అలిగి ఎప్పుడూ ఇంట్లో కూర్చుండిపోరాదు. అలా చేయడమంటే మీ భాగ్యము పై అలగడమే. చదువు పై అలిగితే ఇంకేం నేర్చుకుంటారు. తండ్రి బ్రహ్మ ద్వారా చదివించవలసిందే. కావున ఎప్పుడూ పరస్పరంలో అలగరాదు. ఇదంతా మాయ. యజ్ఞములో అసురుల విఘ్నాలైతే పడ్తూ ఉంటాయి కదా! అచ్ఛా! గుడ్‌నైట్‌!

మధురాతి మధురమైన పిల్లలకు ఆత్మిక బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌నైట్‌

ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేయరాదు. జ్ఞానము యొక్క నషాలో ఉంటూ అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయాలి.

2. అందరికీ సెకండులో ముక్తి జీవన్ముక్తుల అధికారాన్ని ఇచ్చేందుకు దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను త్యజించి ఒక్క బాబానే స్మృతి చేయండి అన్న మహామంత్రాన్నే వినిపించాలి.

వరదానము :-

'' బ్రహ్మాబాబాను అనుసరించి ఫస్ట్‌ గ్రేడ్‌లోకి వచ్చే సమాన్‌ భవ ''

బ్రహ్మాబాబా అంటే పిల్లలందరికి చాలా ప్రేమ ఉంది. ప్రేమకు గుర్తు - సమానంగా అవ్వడం. ఇందులో సదా ''ముందు నేను'' అనే లక్ష్యముంచుకోండి. ఈర్ష్యకు వశమై ''ముందు నేను'' అని అనడం కాదు, అది నష్టపరుస్తుంది. కాని తండ్రిని అనుసరించడంలో ''ముందు నేను'' అని అనుసరిస్తే ఫస్టుతో(బ్రహ్మబాబాతో) పాటు మీరు కూడా ఫస్ట్‌గా అవుతారు. ఎలాగైతే బ్రహ్మబాబా నంబరువన్‌గా అయ్యాడో అలా వారిని అనుసరించేవారు కూడా నంబరువన్‌గా అవ్వాలనే లక్ష్యముంచుకోండి. మొదట ఎవరు చేస్తారో, వారే అర్జునుడు. ఫస్ట్‌లో వచ్చేందుకు అందరికీ అవకాశముంది. అనంతములో ఫస్ట్‌గ్రేడ్‌ తక్కువైనది కాదు.

స్లోగన్‌ :

'' సఫలతామూర్తులుగా అవ్వాలంటే స్వంత సేవ మరియు ఇతరుల సేవను జత జతలో చేయండి ''