09-10-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - ఇప్పుడు మానవుల ద్వారా లభించిన మంత్ర - తంత్రాలు పనికి రావు, ఉపయోగపడవు కావున వాటన్నింటి నుండి మీ బుద్ధియోగాన్ని తొలగించి ఒక్క తండ్రినే స్మృతి చేయండి ''
ప్రశ్న :-
భక్తిలోని ఏ విషయము జ్ఞాన మార్గములో పని చేయదు, నడవజాలదు ?
జవాబు :-
భక్తిమార్గములో భగవంతుని నుండి కృప లేక ఆశీర్వాదాలు ఇవ్వమని వేడుకుంటారు. జ్ఞాన మార్గములో ఆశ్వీరాదాలు లేక కృప చూపే మాటే లేదు. ఇది చదువు. తండ్రి శిక్షకుడై(టీచరై) మమ్ములను చదివిస్తున్నారు. భాగ్యము చదువు పై ఆధారపడి ఉంది. తండ్రి కృప చూపిస్తే మొత్తం క్లాసు(తరగతి) అంతా పాస్ అయిపోతారు. కావున జ్ఞాన మార్గములో కృప లేక ఆశీర్వాదాల ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరూ తమ-తమ పురుషార్థము(వ్యక్తిగతంగా) తప్పకుండా చేయాలి.
పాట :-
నేనొక చిన్న బాలుడను,............. ( మై ఏక్ నన్నాసా బచ్ఛా హూ!,............ ) 
ఓంశాంతి.
ఇది భక్తిమార్గపు పిలుపు. పిల్లలు, పెద్దలు అందరూ పిలుస్తారు. భక్తిమార్గములో యజ్ఞము, జపము, తపము మొదలైనవి చేస్తారు. వీటి ద్వారా పరమాత్మను మిలనము చేసే మార్గము లభిస్తుందని వారు భావిస్తారు. తర్వాత ఈశ్వరుని సర్వవ్యాపి అని అనడం, నేను కూడా వారి రూపాన్నే, నాలో కూడా భగవంతుడున్నాడని అనడం అసత్యము కదా! తాను దు:ఖమునేమీ సహించడు. భగవంతుడు వేరు. ఇదే మనుష్యుల పొరపాటు! ఈ కారణంగానే మానవులు దు:ఖాన్ని అనుభవిస్తున్నారు. మీలో కూడా కొందరికి మాత్రమే తండ్రిని గురించి పూర్తిగా తెలుసు. మాయ పదే పదే మరపింపజేస్తుంది. తండ్రి మాటిమాటికి చెప్తున్నారు, మీకు శ్రీమతమునిస్తున్నారు - స్వయాన్ని 'ఆత్మ'గా భావించి తండ్రి అయిన నన్ను స్మృతి చేయండి. ఇది శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన మతము. తండ్రి శ్రీమతము ద్వారా మనుష్యులు నరుని నుండి నారాయణునిగా, పతితుల నుండి పావనంగా అవుతారు. ఈ సమయములో ఉన్న పతిత మానవుల మతము శ్రేష్ఠమైనదని కాదని భగవంతుడు కూడా ఇది భ్రష్ఠాచార ఆసురీ సంప్రదాయమని అంటున్నారు. మీ దేవీ దేవతా ధర్మము చాలా సుఖమునిచ్చేదని కూడా చెప్తున్నారు. మీరు అపారమైన సుఖాన్ని పొందారు. ఇది తయారైన (రచింపబడిన) డ్రామా. అంతేగాని భగవంతుడు ఎందుకిలా తయారుచేశాడని కాదు. వారు ఈ డ్రామాను తయారు చేయలేదు. ఇది అనాది డ్రామా కదా! జ్ఞానమనగా పగలు. భక్తి అనగా రాత్రి. జ్ఞానము ద్వారా ఇప్పుడు మీరు స్వర్గవాసులుగా అవుతున్నారు. భక్తి ద్వారా నరకవాసులుగా అయ్యారు. కాని మానవులు రాతి బుద్ధిగల వారుగా ఉన్నందున అర్థము చేసుకోలేరు. క్రోధము ఎంత ఎక్కువగా ఉంది. ఎన్ని బాంబులు తయారు చేస్తున్నారు! వాటి వలన వినాశనము తప్పకుండా జరుగుతుందని తెలుసు. కావున ఇది భ్రష్ఠాచారీ బుద్ధి కదా! కలియుగాన్ని 'రావణ రాజ్యము' అని అంటారు. రావణుడే భ్రష్ఠాచారంగా తయారు చేస్తాడు. తండ్రి వచ్చి ఇప్పుడు భ్రష్ఠాచారాన్ని సమాప్తము చెయ్యమని ఆర్డినెన్స్ (అత్యంత ప్రమాద సమయములో దేశాధ్యక్షుల స్వయం సంతకము చేసి విడుదల చేయు ఆజ్ఞ జారీ చేస్తున్నారు. నెంబరువన్ భ్రష్ఠాచారము - ' ఒకరినొకరు పతితంగా చేసుకోవడం.' ఇది వేశ్యాలయము. కలియుగములోని భారతదేశాన్ని వేశ్యాలయమని అంటారు. అందరూ విషము ద్వారా జన్మ తీసుకున్నవారే. సత్యయుగాన్ని 'శివాలయము' అని అంటారు. ఇది శివబాబా ద్వారా స్థాపన చేయబడిన పవిత్ర భారతదేశము. లక్ష్మీనారాయణులు మొదలైనవారు సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులు అని పిలువబడ్తారు. అయితే అచ్చట సంతానము ఎలా కలుగుతుంది? అను ప్రశ్న రాకూడదు. యోగబలము ద్వారా పిల్లలైన మీరు ఈ విశ్వానికే అధిపతకులుగా అవుతూ ఉంటే, ఆ యోగబలము ద్వారా ఏమి జరగజాలదు? ఈ రోజులలో పవిత్ర కుమారీలు కూడా ఏ మందు లేకుండా, ఇంజక్షన్ మొదలైన వాటి ద్వారా పిల్లలను కంటున్నారని వార్తాపత్రికలలో వార్తలు కూడా వస్తున్నాయి. బాబా చెప్తున్నారు - '' మీరు యోగబలము ద్వారా శ్రీమతముననుసరించి స్వర్గానికి అధిపతులుగా అవుతారు. కావున అక్కడ యోగబలము ద్వారా సంతానము కూడా లుగుతుంది. బాహుబలముతో ఈ మొత్తం సృష్టి పై రాజ్యపాలన చెయ్యలేరు. వారిది బాహుబలము, మీది యోగబలము.'' మీరు సర్వశక్తివంతులైన తండ్రితో యోగము జోడిస్తారు. స్వయం సర్వ శక్తివంతులైన తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమౌతాయి. అయితే ఈ విషయము ఎవరి బుద్ధిలోనూ స్థిరంగా నిలువదు. ఆ సమయములో 'సరే-సరే ' అని అంటారు. ఆ తర్వాత మర్చిపోతారు.
స్వయం భగవంతుడైన అనంతమైన తండ్రి. రాజయోగము నేర్పించి జ్ఞానముతో మనలను అలంకరిస్తున్నారు. అయినా బుద్ధిలో స్థిరపడకపోతే వారి అదృష్టములో లేదని అందుకే వారు పురుషార్థము చెయ్యడం లేదని అనడం జరుగుతుంది. టీచరు అందరినీ చదివిస్తారు. కాని ఒక్కొక్కరు ఒక్కోలా చదువుతారు. సరిగ్గా చదవకపోతే కొంతమంది ఫెయిల్ అయిపోతారు. టీచరును ఆశీర్వాదాలు కృప మొదలైనవి అడగరు కదా. చదువులో ఆశీర్వాదాలు, కృప మొదలైనవి ఉండవు. జ్ఞానమార్గములో స్వయంగా తండ్రి మీకు నమస్కరిస్తారు. కృప, ఆశీర్వాదాలు వేడుకోరాదు. తండ్రి వద్దకు కొడుకు వచ్చాడంటే అధికారిగానే అవుతాడు. ఇతడు అధికారి. కృప చూపించే మాటే లేదని తండ్రి అంటారు. తండ్రి వారసత్వమంతా కొడుకుకు చెంది తీరుతుంది. కాని పిల్లలను సరి దిద్దడం టీచరు కర్తవ్యము. టీచరు చదవమని చెప్తాడు. చదవడం మీ కర్తవ్యము. ఇందులో కృప చూపించేది ఏముంది? అలాగే సద్గతికి దారి చూపించడం గురువు కర్తవ్యము, బాధ్యత. ఆశీర్వాదాల మాట లేదు. ఇచ్చట తండ్రి, టీచరు, గురువు అన్నీ ఒక్కరే. ముగ్గురి నుండి కూడా కృప చూపమని వేడుకొనే మాటే లేదు. తెలివిహీనులైన మానవులకు తండ్రి కూర్చుని వివేకమునిస్తారు. ఇదే వారిచ్చే ఆశీర్వాదము! కాని దానిని అనుసరించడం పిల్లల కర్తవ్యము. 'శ్రీమత్ భగవానువాచ ' అని గాయనం చేయబడింది. వారు అత్యంత ఉన్నతులు. కావున వారి మతము కూడా ఉన్నతంగానే ఉంటుంది కదా! శ్రీమతము ద్వారా మీరు శ్రేష్ఠమైన దేవీ దేవతలుగా నెంబరువారీ పురుషార్థానుసారము తయారవుతున్నారు. మీరు కూడా ఎన్ని మార్కులతో పాస్ అవ్వగలమో అర్థము చేసుకోగలరు. పాఠశాలలో విద్యార్థులు కూడా మేము బాగా చదవలేదు కనుక పాస్ కాలేమని భావిస్తారు. తండ్రి కూడా రిజిస్టర్ ద్వారా వీరు పాస్ అవ్వలేరని అర్థము చేసుకుంటారు. ఈ బేహద్ తండ్రి, టీచరు, గురువు అన్నీ ఒక్కరే. పిల్లలు చదవడం లేదని వారికీ తెలుసు. పిల్లలకు కూడా తెలుసు. సరిగ్గా చదవకుంటే పదవి తప్పక తగ్గిపోతుంది. 'మేము బాగా చదవాలి' - అన్న పురుషార్థము కూడా చేయరు. ఎంత తల కొట్టుకున్నా(కష్టపడినా), ఎంత బాగా అర్థము చేయించినా, పురుషార్థము చేయరు. శ్రీమతమును అనుసరించనందున తక్కువ(నీచ) పదవిని పొందుతారు. ఇప్పుడు ఎవరైతే పిల్లలుగా అవుతారో వారు రాజ్య వంశములోకి అయితే వస్తారు, కాని అందులో కూడా చాలా పదవులున్నాయి కదా! కొందరు దాస-దాసీలుగా కూడా అవుతారు. బాగా చదివి చదివించకపోతే దాస-దాసీలుగా అవుతామని పిల్లలకు తెలుసు. అయితే వారు కూడా రాయల్గా ఉంటారు. లక్ష్మీనారాయణులకు వజ్ర వైడూర్యాల మహళ్ళు ఉంటే, దాస-దాసీలు కూడా అక్కడే ఉంటారు కదా! మళ్ళీ నెంబరువారుగా ముందుకు వెళ్లి పదవి పొందగలరు. ప్రజలలో కూడా నెంబరువారుగా ఉంటారు. భక్తిమార్గములో మానవులు ఇన్ష్యూర్(భీమా) చేస్తారు కదా! ఈశ్వరార్థము దానము చేస్తారు. ఎవరైనా ఆసుపత్రి కట్టించారనుకోండి, మరుసటి జన్మలో వారికి మంచి నిరోగి శరీరము లభిస్తుంది. అల్పకాలానికి ఫలమైతే లభిస్తుంది కదా! ఎవరైనా పాఠశాల తెరిచినట్లయితే మరుసటి జన్మలో వారికి చదువు బాగా వస్తుంది. అలాగే ధర్మశాల(సత్రము) కట్టిస్తే మరుసటి జన్మలో వారు నివసించేందుకు మంచి ఇల్లు లభిస్తుంది. కావున ఇది ఇన్ష్యూర్ చేసుకోవడమే అవుతుంది కదా! ప్రతి ఒక్కరు తమను తాము ఇన్ష్యూర్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు నేరుగా ఈశ్వరునితో ఇన్ష్యూర్ చేసుకుంటారు. వారిది అప్రత్యక్షము అనగా పరోక్షము(ఇన్డైరెక్ట్). కాని మీది డైరెక్ట్ (నేరుగా)గా బీమా చేయడం. ''బాబా, ఈ సర్వస్వమూ మీదే. మేము కేవలం నిమిత్తము. దీనికి బదులుగా మీరు మాకు 21 జన్మలకు స్వరాజ్యమును ఇవ్వండి'' అని అంటారు. ఇది నేరుగా తండ్రి వద్ద 21 జన్మల కొరకు భీమా చేయడం. తండ్రి చెప్తున్నారు - '' మీ సామాగ్రినంతా సత్యయుగములోకి బదిలీ చేసేయండి. ఉదాహరణానికి యుద్ధము జరిగినప్పుడు చిన్న-చిన్న రాజులు పెద్ద రాజుల వద్ద తమ ఆస్తి పాస్తులను దాచుకుంటారు. యుద్ధము పూర్తి అయిన తర్వాత మళ్ళీ పెద్ద వారి నుండి వాపస్ తీసుకుంటారు.'' బాబాకైతే(బ్రహ్మాబాబా) ఈ విషయాలన్నిటి అనుభవం ఉంది కదా! తండ్రికి కూడా తెలుసు, ఈ దాదా(బ్రహ్మ)కు కూడా తెలుసు. మాకు దాదా(తాత) ద్వారా తండ్రి నుండి వారసత్వము లభిస్తుందని అర్థము చేసుకోవాలి. తండ్రి చదివిస్తారు. ఆ తండ్రే స్వర్గ స్థాపన చేస్తారు. తండ్రి హెవెన్లీ గాడ్ ఫాదర్. ఇతను(బ్రహ్మ) తండ్రి కాదు, ఇతను దాదా(అన్న). మొదట తప్పకుండా ఈ దాదాకు చెందినవారిగా అవ్వవలసి ఉంటుంది. బాబా, మేము మీ వారము. మీ నుండి మేము వారసత్వము తీసుకుంటామని అంటారు. మిగిలిన అన్ని వైపుల నుండి బుద్ధియోగాన్ని తెంచాలి. శ్రమ అంతా ఇందులోనే ఉంది.
తండ్రి చెప్తున్నారు - '' ఇప్పుడు ఇతర గురువులు మొదలైనవారి మంత్రాలు ఏవీ పని చేయవు, ఏ మానవుల మంత్రాలు ఇప్పుడు పనికి రావు.'' నేను మీకు చెప్తున్నాను - '' ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే మీకు విజయము లభిస్తుంది. మీ తల పై పాపభారము చాలా ఉంది. నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. తర్వాత మళ్ళీ మిమ్ములను స్వర్గములోకి పంపిస్తాను.'' మొట్టమొదట ఈ నిశ్చయము ఉండాలి కదా! నిశ్చయము లేకుంటే బాబా బుద్ధికి వేయబడిన తాళాన్ని కూడా తెరవరు, ధారణ జరగదు. తండ్రికి చెందినవారిగా అయితే వారసత్వానికి కూడా హక్కుదారులుగా అవుతారు. బుద్ధిలో నిలువదు. కొంతమంది క్రొత్తవారు కూడా పాతవారికంటే వేగంగా ముందుకు వెళ్లిపోతారు. తండ్రి అయితే చాలా బాగా అర్థము చేయిస్తున్నారు - ''ఎంత బాగా చదివితే అంత సంపాదన ఉంటుంది''. ఈ ఈశ్వరీయ జ్ఞానము సంపాదనకు మూలము. మీరు జ్ఞానము ద్వారా విశ్వానికి అధిపతులుగా అవుతారు. మానవులలో ఈ జ్ఞానము లేదు. ఇప్పుడు మీరు నా పిల్లలు. ఆసురీ సంప్రదాయము నుండి దైవీ సంప్రాదాయులుగా, భ్రష్ఠాచారుల నుండి శ్రేష్ఠాచారులుగా అవుతున్నారు. శ్రీమతము ద్వారా తప్ప ఇతర ఏ విధంగానూ ఎవ్వరూ శ్రేష్ఠాచారులుగా అవ్వలేరు. లేకుంటే చివరిలో శిక్షలు అనుభవించి వాపస్ వెళ్తారు. భలే కొద్దో, గొప్పో జ్ఞానము విన్నవారు కూడా స్వర్గములోకి వస్తారు. అయితే అతిసాధారణ ప్రజలలోకి వెళ్తారు. పదవులైతే నెంబరువారుగా ఉంటాయి కదా! అక్కడ భోజనము కూడా లభించని పేదవారు ఉండనే ఉండరు. ఇక్కడ గల నిరుపేదల వంటివారు అక్కడ ఉండరు. అందరికీ సుఖముంటుంది. కాని ప్రజలుగా అయినా ఫర్వాలేదు అని భావించకండి. అది బలహీనత కదా! మొదట నిశ్చయము పక్కాగా ఉండాలి. ఇది నిరాకార భగవానువాచ. భగవంతుడు చెప్తున్నారు - ''నాకు మానవ శరీరమైతే లేదు, నా పేరు శివుడు''. పోతే దేవతలకు గాని, మనుష్యులకు గాని వారి శరీరాలకు పేరుంటుంది. కాని నా పేరు శరీరానికి సంబంధించింది కాదు. నాకు స్వంత శరీరము లేనే లేదు. శరీరధారులను 'భగవంతుడు' అని అనరు, మనుష్యులని అంటారు. మానవులను 'భగవంతుడు' అని భావించినందునే భారతీయులు తెలివిహీనులుగా అయిపోయారు. నిజానికి భారతవాసులు చాలా తెలివిగలవారుగా ఉండేవారు. మొదట భారతదేశములోని వస్త్రాలు మొదలైనవి చాలా రిఫైన్గా, సున్నితంగా తయారయ్యేవి. ఇప్పుడైతే అటువంటి మంచి వస్తువులు తయారవ్వజాలవు. స్వర్గములో సైన్సు (విజ్ఞానము) కూడా కేవలం సుఖము కొరకే ఉపయోగపడ్తుంది. ఇక్కడైతే సైన్సు సుఖము - దు:ఖము రెండిటినీ ఇస్తుంది. అల్పకాల సుఖము మాత్రమే లభిస్తుంది. కాని దు:ఖమైతే అపారంగా ఉంటుంది. ప్రపంచమంతా సమాప్తమౌతుందంటే అది దు:ఖమే కదా! అందరూ 'త్రాహి-త్రాహి(అయ్యో-అయ్యో)' అని వాపోతారు. అక్కడ సైన్సు ద్వారా సుఖమే సుఖము ఉంటుంది. దు:ఖానికి నామ-రూపాలు కూడా ఉండవు. ఇది కూడా ఎవరి భాగ్యము వికసిస్తుందో, వారే ఈ విషయాలను అర్థము చేసుకోగలరు. భాగ్యములో సుఖము లేకుంటే అర్థము చేసుకోలేరు. బ్యారిస్టర్లలో కూడా నెంబరువారుగా ఉంటారు కదా! కొందరైతే ఒక్కొక్క కేసుకు 10-20 వేల రూపాయలు తీసుకుంటారు. కొంతమంది బ్యారిష్టర్లకు ధరించేందుకు మంచి కోటు కూడా ఉండదు. ఇక్కడ కూడా అలాంటివారు ఉన్నారు కదా! రాజాధి రాజులుగానైనా అవుతారు, లేకుంటే పైసా విలువకు సమానమైన ప్రజలుగా అవుతారు. కావున తండ్రి కూర్చుని పిల్లలకు అర్థము చేయిస్తున్నారు - భారతదేశమే ఇప్పుడు అన్నింటికంటే నిరుపేద దేశము. ఈ భారతదేశమే మళ్ళీ అత్యంత ధనవంతముగా, సంపన్నంగా అవుతుంది. సదా పేదలకే దానము ఇవ్వబడ్తుంది. ధనవంతులు ఇంత లబ్ధిని తీసుకోలేరు. సాధారణమైనవారు, పేదవారే ఈ జ్ఞానము తీసుకుంటారు ధనవంతులకు దానమివ్వడం నియమము కాదు. మీరు పేదవారు కదా! మీ మమ్మా అందరికంటే నిరుపేద. కాని ఆమె మళ్ళీ విశ్వమహారాణిగా అవుతుంది. డ్రామాయే ఇలా తయారై ఉంది. నిరుపేదలు ఎక్కువగా జ్ఞానము తీసుకుంటారు. ఎందుకంటే దు:ఖములో ఉన్నారు కదా! ధనవంతులైతే చాలా సుఖంగా ఉంటారు. మాకు ఇక్కడే స్వర్గముందని ధనవంతులు భావిస్తారు. కార్లు, వాహనాలు, ధనము మొదలైనవి మాకున్నాయని అంటారు. ఎవరి వద్ద ధనము లేదో, నరకములో ఉన్నారో వారికి మీరు జ్ఞానమివ్వండని కూడా ధనవంతులంటారు. ఇప్పుడు మీది భగవంతుడైన తండ్రి సేవ. మీరు భారతదేశానికి సత్యమైన సేవాధారులు. వారు దేహ సంబంధమైన సమాజ సేవకులు. వారు మానవులకు ఏదో కాస్త సుఖాన్ని ఇస్తారు. కాని ఇక్కడైతే ఈ మొత్తము సృష్టినంతా పరిశుభ్రము చేసిి పవిత్రంగా, సుఖవంతముగా చేస్తారు. తనువు-మనసు-ధనముల ద్వారా భారతదేశ సేవ చేస్తున్నారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మీ పాత సామాగ్రినంతా(బ్యాగ్-బ్యాగేజ్) 21 జన్మల కొరకు బదిలీ చేసుకోవాలి. భీమా చేసి ట్రస్టీలు(నిమిత్తులు)గా ఉంటూ సంభాళించాలి.
2. నిశ్చయ బుద్ధి గలవారిగా అయ్యి బాగా చదువుకోవాలి. పేదలకు జ్ఞాన దానమునివ్వాలి. భారతదేశాన్ని పవిత్రంగా తయారు చేసే సత్యమైన ఆత్మిక సేవ చేయాలి.
వరదానము :-
'' సర్వ ఖజానాల సంపన్నత ద్వారా సంపూర్ణతను అనుభవం చేసే ప్రాప్తి స్వరూప భవ ''
చంద్రుడు సంపన్నమైనప్పుడు సంపన్నత అతని సంపూర్ణతకు గుర్తుగా ఉంటుంది. అంతకంటే ముందుకు వెళ్ళడు. అదే సంపూర్ణతగా ఉంటుంది. కొంచెము కూడా అంచుభాగము తక్కువగా ఉండదు(కనిపించదు). అలా పిల్లలైన మీరు జ్ఞాన, యోగ, ధారణ మరియు సేవ అనగా అన్ని ఖజానాలతో సంపన్నమవుతారు. కనుక ఈ సంపన్నతనే సంపూర్ణత అని అంటారు. ఇటువంటి సంపన్న ఆత్మలు ప్రాప్తి స్వరూపులైనందున స్థితిలో కూడా సదా సమీపంగా ఉంటారు.
స్లోగన్ :-
'' దివ్య బుద్ధి ద్వారా సర్వ సిద్ధులను ప్రాప్తి చేసుకోవడమే సిద్ధి స్వరూపులుగా అవ్వడం ''