28-12-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - పాత ప్రపంచము నుండి మమకారాన్ని వదిలి సేవ చేసే ఉత్సాహమును ఉంచుకోండి. ఉల్లాసంగా ఉండండి, సేవలో ఎప్పుడూ అలసిపోరాదు''

ప్రశ్న :-

జ్ఞాన నషా ఎక్కి ఉన్న పిల్లల గుర్తులు ఏమిటి ?

జవాబు :-

వారికి సేవ చేసే అభిరుచి ఎంతగానో ఉంటుంది. వారు సదా మనసా మరియు వాచా సేవలో తత్పరులై ఉంటారు. అందరికీ తండ్రి పరిచయమును ఇచ్చి ఋజువు ఇస్తారు. సామ్రాజ్యాన్ని స్థాపన చేసేందుకు సహించవలసి వచ్చినా సహిస్తారు. తండ్రికి పూర్తి సహాయకులుగా అయ్యి భారతదేశాన్ని స్వర్గంగా చేసే సేవను చేస్తారు.

పాట :-

మాతా ఓ మాతా! నీవు సర్వుల భాగ్యవిధాతవు.. (మాతా ఓ మాతా! తూ సబ్‌కీ భాగ్యవిధాతా ....)  

ఓంశాంతి.

ఇప్పుడు నెంబర్‌వారీగా, పురుషార్థానుసారంగా పిల్లలకు మాత ఎవరో తెలుసు. తల్లిని తెలుసుకున్నప్పుడు తప్పకుండా తండ్రిని గురించి తెలుసుకుంటారు. ఇక్కడ మాత-పితలు సౌభాగ్యవిధాతలు మరియు భాగ్యవిధాతలు. ఎవరైతే పురుషార్థము చేసి పూర్తి సౌభాగ్యాన్ని తయారు చేసుకుంటారో, వారే సౌభాగ్యవిధాతలు. సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్యవంశములో వారసత్వము తీసుకుంటారు, వారు కూడా నంబరువారుగా ఉంటారు. చాలామంది ఆటవికుల వలె కూడా ఉంటారు. వారు వెళ్లి చాలా సాధారణ ప్రజలలో జన్మ తీసుకుంటారు. వారు మంచి పదవిని పొందలేరు. పిల్లలూ! ఈ పాత ప్రపంచము పై మమకారమును ఉంచకండి అని తండ్రి అర్థము చేయిస్తారు. పాపం ప్రపంచంలోని వారు ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. పిల్లలలో సేవ చేసే అభిరుచి మరియు ఉత్సాహము ఉండాలి. కొందరికి ఉత్సాహము ఉండినా సేవ చేసే విధానము తెలియదు. ఆదేశాలైతే అనేకము లభిస్తాయి. చాలా రిఫైన్‌గా వ్రాయబడి ఉండాలి. త్రిమూర్తి మరియు వృక్షముల చిత్రాలు 30'' I 40'' సైజులో ఉండాలి. ఇది చాలా ఉపయోగపడే చిత్రము. కాని పిల్లలలో వాటికి అంతటి విలువ లేదు. సంజయునికి ఎంతో గౌరవమున్నా అది చివరి సమయంలోని మహిమమే. ఉదాహరణానికి అతీంద్రియ సుఖమును గూర్చి గోప-గోపికలను అడగండి అని అంటారు. అది కూడా చివరి స్థితి యొక్క గాయనమే. ఇప్పుడు ఆ సుఖము ఎవ్వరికీ లేదు. ఇప్పుడింకా ఏడుస్తూ, పడుతూ ఉంటారు. మాయ చెంపదెబ్బ వేస్తూనే ఉంటుంది. రోజూ వస్తూ ఉంటారు కాని ఆ నషా ఎక్కదు. మీకు సేవ చేసేందుకు చాలా అవకాశాలు లభిస్తూ ఉంటాయి.

ఒకే ధర్మము ఉండాలని అంటూ ఉంటారు. భారతదేశములో ఒకే ప్రభుత్వం ఉండేది. దానినే స్వర్గము అని అనేవారు. కాని ఇది ఎవ్వరికీ తెలియదు. 5 వేల సంవత్సరాల క్రితం నాటి మాట. అప్పుడు ఒకే ప్రభుత్వం ఉండేది. 2500 సంవత్సరాలు అని కూడా అనవచ్చు. ఎందుకంటే రాముని రాజ్యంలో కూడా ఒకే ప్రభుత్వము ఉండేది. 2500 సంవత్సరాల ముందు సత్య త్రేతా యుగాలలో ఒకే ప్రభుత్వముండేది. చప్పట్లు మ్రోగేందుకు అసలు రెండు ఉండేవి కావు. హిందూ-చీనీ, భాయీ - భాయీ అని ఇక్కడ కూడా అంటూ ఉంటారు. అయినా ఏం చేస్తూ ఉంటారో చూడండి! ఒకరినొకరు తుపాకులతో కాల్చుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచమే అటువంటిది. స్త్రీ-పురుషులు కూడా పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటారు. స్త్రీ భర్తకు కూడా చెంపదెబ్బ వేసేందుకు వెనుకాడదు. ఇంటింటిలో ఎన్నో గొడవలు ఉంటాయి. 2500 సంవత్సరాల క్రితం ఒకే ప్రభుత్వం ఉండేదని భారతవాసులు కూడా మర్చిపోయారు. ఇప్పుడైతే అనేక ప్రభుత్వాలు, అనేక ధర్మాలు ఉన్నాయి. కనుక తప్పకుండా పోట్లాటలు ఉంటాయి. భారతదేశంలో ఒకే ప్రభుత్వము ఉండేదని మీరు తెలుపుతారు. దానిని భగవాన్‌, భగవతీల ప్రభుత్వము అని అంటారు. భక్తిమార్గము ఆ తర్వాతనే వస్తుంది. సత్య, త్రేతా యుగాలలో భక్తి ఉండదు. మనుష్యులు ఎంతగానో తమ అహంకారాన్ని చూపిస్తారు. కాని జ్ఞానము కొంచెము కూడా లేదు. జ్ఞానమైతే ఎన్నో రకాలుగా ఉంది కదా. వైద్య జ్ఞానము, బ్యారిస్టరు జ్ఞానము (న్యాయశాస్త్రము) .......... ఎవరైతే డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ(పి.హెచ్‌.డి) అని పిలవబడ్తారో వారి వద్ద ఈ జ్ఞానము కొద్దిగా కూడా లేదు. ఫిలాసఫీ(తత్వశాస్త్రము) అని దేనిని అంటారో కూడా వారు అర్థము చేసుకోరు. కావున పిల్లలైన మీరు సేవ చేయు అభిరుచిని ఉంచుకోవాలి. స్థాపనలో సహాయకులుగా అవ్వాలి. మంచి వస్తువులను తయారు చేసి ఇవ్వాలి. మనుష్యులను బట్టి అటువంటి ఆహ్వానము ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణానికి ప్రభుత్వంలో ఎంతో మంది ఆఫీసర్లు ఉంటారు. ఎడ్యుకేషన్‌ మినిష్టర్‌, చీఫ్‌ మనిష్టర్‌ మొదలైనవారు ఉంటారు. ఇక్కడ కూడా ఆఫీస్‌ ఉండాలి. డైరెక్షన్‌ వెలువడగానే దానిని అమలులోకి తీసుకురావాలి. ఇప్పుడు గోరక్‌పూర్‌ నుండి 'గీత' (పుస్తకములు)లు వెలువడ్తాయి. ఉచితంగా ఇచ్చేందుకు అందరూ తయారుగా ఉంటారు. ఏ ఏ సంస్థలైతే ఉన్నాయో వారికి ఫండ్స్‌ (నిధులు, మూలధనము) ఎన్నో ఉంటాయి. కాశ్మీరులో మహారాజు చనిపోయినప్పుడు, వారి ఆస్తి అంతా అర్య సమాజం వారికి లభించింది. ఎందుకంటే తాను స్వయం ఆర్య సమాజానికి చెందినవాడు. సన్యాసులు మొదలైనవారి వద్ద కూడా చాలా ధనము ఉంటుంది. మీ వద్ద కూడా ధనము మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సేవలో వినియోగిస్తున్నారు. తద్వారా భారతదేశము స్వర్గంగా అవుతుంది. మీరు స్వర్గమును తయారు చేయడంలో సహాయం చేస్తారు. రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. వారైతే రోజు రోజుకు నరకవాసులుగా అవుతూ ఉంటారు. మిమ్ములను తండ్రి ఇక్కడ స్వర్గవాసులుగా తయారు చేస్తారు. అందరూ నిరుపేదలుగా ఉన్నారు. మనం డబ్బు ప్రోగు చేసుకుంటున్నామని కాదు. బాబా! ఈ అల్పధనాన్ని యజ్ఞంలో సేవలో వినియోగించండి అని మీరంటారు. ఈ సమయంలో అయితే పరస్పరం అందరూ పోట్లాడుకుంటూ ఉంటారు. ఒకే ప్రభుత్వం అయితే ఉండజాలదు. కావున సూర్య వంశీయులు, చంద్ర వంశీయులు ఉన్నప్పుడు తప్పకుండా ఒకే ప్రభుత్వం ఉండేదని, మీరు కూడా కోరుకుంటే అది తప్పకుండా వస్తుంది అని గవర్నమెంటువారికి తెలియజేయాలి. తండ్రి స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. వారు స్వర్గస్థాపకుడైన తండ్రి(హెవెన్లీ గాడ్‌ఫాదర్‌). మేము ఒకే దైవీ ప్రభుత్వ స్థాపనను చేస్తున్నాము. అక్కడ ఆసురీ ప్రభుత్వము ఉండదు. అవన్నీ నాశనమైపోతాయి. మీ వద్ద ఎంతో మంచి జ్ఞానము ఉంది. చాలా పని జరుగుతుంది. ఢిల్లీ హెడ్‌ ఆఫీస్‌. వారు ఎంతో సేవ చేయవచ్చు. అక్కడ ఎంతో మంచి పిల్లలు కూడా ఉన్నారు. సంజయుడైన జగదీష్‌ కూడా ఉన్నాడు. కాని నిజానికి అందరూ సంజయులే కదా. ఒక్కడే కాదు. మీరు ప్రతి ఒక్కరూ సంజయులే. అందరికీ దారి చూపించడం మీ పని. తండ్రి అయితే ఎంతో బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. కాని పిల్లలైతే తమ వ్యాపార వ్యవహారాలలోనే పిల్లలు మొదలైనవారి సంభాళనలోనే చిక్కుకొని ఉన్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ తండ్రికి సహాయకులుగా అవ్వడం అనేది జరగడం లేదు. ఇక్కడైతే సేవ చేసి చూపించాలి. ఒకే ప్రభుత్వం ఎలా స్థాపన అవుతుందో చూడండి. ఈ చక్రము, డ్రామాను చూడండి. సమయాన్ని చూపిస్తోంది. ఏ విధంగా రావణుని చిత్రమును తయారు చేశారో అలా పెద్ద చక్రాన్ని తయారు చేసి - ''ఇప్పుడు ఈ ముల్లు వచ్చి చేరుకుంది''. ఇక ఆ పై ఒకే ప్రభుత్వము రానున్నది అని వ్రాయాలి. బాబా డైరెక్షన్‌ ఇస్తారు. శివబాబా అయితే వీధులలోకి వెళ్ళి ఎదురు దెబ్బలు తినరు కదా! ఇతడు (బ్రహ్మాబాబా) వెళ్ళినట్లయితే శివబాబా కూడా ఎదురు దెబ్బలు తినవలసి వస్తుంది. పిల్లలు గౌరవము ఉంచాలి. ఈ సేవ చేయడం పిల్లల పని. ''ఒకే ప్రభుత్వమేదైతే భారతదేశములో ఉండేదో అది మళ్ళీ స్థాపనవుతోంది'' - అని వ్రాయాలి. ఎన్ని సంవత్సరాల(82 సంవత్సరాల) నుండి ఈ యజ్ఞం రచింపబడి ఉంది! మొత్తం ప్రపంచములోని చెత్త ఏదైతే ఉందో అదంతా ఇందులో ఇమిడిపోనున్నది. ఇది చాలా సహజము కాని అందరికీ అర్థం చేయించేందుకు సమయమైతే కావాలి. రాజులైతే ఎవ్వరూ లేరు. ఏ ఒక్కరినో అందరూ అంగీకరించరు. ఇంతకు ముందు ఏదైనా కొత్త ఇన్వెన్షన్‌ వెలువడితే దానిని రాజుల ద్వారా విస్తరింపజేసేవారు. ఎందుకంటే రాజులలో శక్తి ఉంటుంది. రాజయోగము ద్వారా గాని లేక దాన-పుణ్యాదుల ద్వారా గాని రాజులుగా అవుతారు. ఇక్కడ ఉండేది ప్రజా రాజ్యము. ఒకే ప్రభుత్వము లేదు. ఒక్క ఫకీరైన సిపాయి కూడా ప్రభుత్వమే. ఎవరి పదవినైనా తొలగించడంలో పెద్ద సమయము పట్టదు. ఇలా ఎన్నో పనులు జరుగుతూ ఉంటాయి. కాస్త డబ్బు ఇస్తే పెద్ద మినిష్టర్‌ను కూడా హతమార్చేస్తారు.

కావున పిల్లలైన మీరు సేవ చేసే అవకాశము తీసుకోవాలి, నిదురించరాదు. ఉదాహరణానికి సత్సంగాలలో కథలు విని మళ్లీ ఇంటికి వెళ్లి ఎలా ఉండివారు అలాగే అయిపోతారు. ఎటువంటి ఉల్లాసమూ ఉండదు. అలా పిల్లలలో కూడా ఉల్లాసము తక్కువగా ఉంది. గవర్నమెంటు వారి ఉద్యానవనముంటుంది. అందులో చాలా మంచి ప్రథమ శ్రేణిలోని(ఫస్ట్‌క్లాసైన) పుష్పాలుంటాయి. దాని విభాగమే వేరుగా ఉంటుంది. ఎవరు వెళ్ళినా మొదట చాలా ఫస్ట్‌క్లాస్‌ పూలు తీసుకొచ్చి ఇస్తారు. ఇది కూడా తండ్రి పూదోట. ఎవరైనా వస్తే మనము విహారము(షికారు) చేయిస్తామా? వీరు మరచి, మంచి పుష్పాలు అని పేర్లు చెప్తాము. టాంగర్‌(ఒక రకమైన సువాసనలేని విష పుష్పము), జిల్లేడు పూలు(అక్‌ కే పూల్‌) కూడా కూర్చుని ఉన్నారు. వారు ప్రకాశించరు. సేవ చేయరు. ప్రతిరోజు ఎవరో ఒకరికి తండ్రి పరిచయమును తప్పకుండా ఇవ్వాలి. మీరైతే గుప్తమైనవారు. ఎన్ని విఘ్నాలు కలుగుతాయి! సేవాయోగ్యులుగా ఇంకా అవ్వలేదు. మందిరాలలోకి వెళ్లండి. శ్మశానాలలోకి వెళ్లండి. వెళ్ళి భాషణ చేయాలని పదే పదే చెప్తారు. పిల్లలు సేవకు ఋజువునివ్వాలి. కోట్లాది మందిలో ఏ ఒక్కరో వెలువడ్తారు. బంధు-మిత్ర్రులు మొదలైనవారికి కూడా అర్థము చేయించాలి. ఇక్కడకు వచ్చేందుకు భయపడుతూ ఉంటే వారి ఇళ్ళకు వెళ్ళి అర్థం చేయించవచ్చు. తండ్రి పరిచయము లభించడంతో చాలా సంతోషిస్తారు. సేవలో అలసట రాకూడదని తండ్రి చెప్తారు. 100 మందిలో ఏ ఒక్కరో వెలువడ్తారు. సామ్రాజ్యాన్ని స్థాపించడంలో తప్పకుండా సహించవలసి ఉంటుంది. ఎప్పటివరకైతే తిట్లు తినరో అప్పటి వరకూ నెమలి సింహాసనాధికారులుగా అవ్వరు. జ్ఞాన నషా ఎక్కి ఉంది. కాని రిజల్టు(ఫలితము) ఎక్కడ? అచ్ఛా! 10-20 మందికి జ్ఞానమిస్తే వారిలో ఒకరిద్దరు మేల్కొంటే అది కూడా తెలియజేయాలి కదా! సేవ చేసే అభిరుచి ఉండాలి. అప్పుడు బాబా బహుమతినిస్తారు. తండ్రి పరిచయమును ఇవ్వండి - మీ తండ్రి ఎవరు? అని అడగండి. అప్పుడే మళ్లీ వారసత్వ నషా ఎక్కుతుంది. ప్రపంచములో బ్రహ్మకుమారీ-కుమారులకు తప్ప ప్రపంచ చరిత్ర-భూగోళాల గురించి ఎవ్వరికీ తెలియదని ఉపన్యసించండి. మీరు ఛాలెంజి(సవాలు) చేయండి. బాబా శ్మశానము విషయాన్ని ప్రస్తావించారు కనుక మీరు శ్మశానంలోకి వెళ్ళి సేవ చేయండి. వ్యాపార-వ్యవహారాలైతే 6-8 గంటలు చేస్తారు. మిగిలిన సమయము ఏమైపోతుంది. అలాంటివారు ఉన్నత పదవిని పొందలేరు. బాబా అంటారు - మీరు నారాయణుని లేక లక్ష్మిని వరించేందుకు వచ్చారు. కాని మీ ముఖాన్ని చూసుకోండి. బాబా అయితే బాగా అర్థము చేయిస్తారు కదా! ప్రపంచ చరిత్ర-భూగోళాలు ఎలా పునారావృతమవుతాయో వచ్చి అర్థం చేసుకోండి అని ఈ ఒక్క అంశము(టాపిక్‌) పై వివరించండి. వార్తాపత్రికల్లో వేయండి. హాలు తీసుకునేందుకు ప్రయత్నించండి. మీకు మూడడుగుల నేల కూడా దొరకదు. మిమ్ములను గుర్తించరు.

మీరు పరంధామవాసులైన విదేశీయులు. ఆత్మలన్నీ పరంధామము నుండి వచ్చాయి కనుక ఇక్కడ అందరూ విదేశీయులే కదా. అయితే మీ భాషను ఇక్కడ ఎవ్వరూ అర్థం చేసుకోరు. కాళ్ళు పట్టుకోండి. ఇది చెయ్యండి. అది చెయ్యండి............ అని ఇక్కడ సాకారములో చెప్పబడదు. ఉదాహరణానికి సాధువుల, మహాత్ముల కాళ్ళను ముద్దు పెట్టుకొని వాటిని కడిగి ఆ నీటిని తాగుతారు. దానిని తత్వ పూజ అని అంటారు. శరీరము పంచ తత్వ నిర్మితమైనది కదా! భారతదేశ పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి! కావున సేవకు(ప్రమాణమును చూపమని) ఫలితమును ఇవ్వండి. అందరికీ సుఖమునివ్వండి అని బాబా అంటారు. ఇక్కడ ఇదే ధ్యాస ఉండాలి. ఇదే చింత ఉండాలి. బుద్ధియోగము తండ్రితో ఉండాలి.

పాట :- మాతా! నీవు సర్వుల భాగ్యవిధాతవు,................ మాత అయిన జగదంబ, భాగ్యవిధాత. మాతయే పదవిని పొందుతుంది. ఆమె కూడా శివబాబాను స్మృతి చేయమని చెప్తుంది. నేను కూడా వారి ద్వారా ధారణ చేసి ఇతరులచే ధారణ చేయించి వారి సౌభాగ్యమును తయారు చేస్తానని తాను కూడా అంటుంది. మీరు భారతదేశ సౌభాగ్య విధాతలు. కనుక మీకు ఎంతటి నషా ఉండాలి! మమ్మా మహిమ ఏదైతే ఉందో, అదే తండ్రి-తాతల మహిమ. పిల్లలైన మీరు యజ్ఞములో స్థూల సేవ కూడా చేయాలి. అలాగే ఆత్మిక సేవ కూడా తప్పకుండా చేయాలి. మన్మనాభవ మంత్రమును అందరికీ ఇవ్వాలి. మన్మనాభవ అన్నది మనసా, మధ్యాజీభవ అన్నది వాచా. ఇందులో కర్మణా సేవ కూడా వచ్చేసింది. కన్యలు సేవలో లగ్నమైపోవాలి.

పల్లెలలో సేవ బాగా జరుగుతుంది. పెద్ద పట్టణాలలో చాలా ఫ్యాషన్లు ఉన్నాయి. ఎంతో టెంప్టేషన్‌(ఆకర్షణ) ఉంది. మరి ఏం చేయాలి? అలాగని పట్టణాలను వదిలేయాలా? అలా కూడా కాదు. పెద్ద పట్టణాల నుండి, షావుకారుల నుండి శబ్ధము వెలువడ్తుంది. మిగిలిన ప్రపంచమునంతా ఈ మన్మనాభవ అనే ఛూ మంత్రము ద్వారా స్వర్గంగా తయారు చేయాలి. ఈ జగదంబ ఎవరో తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. తాను భారతదేశ సౌభాగ్యవిధాత. తన శివశక్తి సైన్యం కూడా ఎంతో ప్రసిద్ధమైనది. జగదంబ అందరికీ పెద్ద అనగా తాను భారతదేశంలో ఏక ప్రభుత్వమును స్థాపన చేస్తుంది. భారతమాతలు శక్తి అవతారాలు. భారతదేశంలో ఏకప్రభుత్వ స్థాపనను శ్రీమతం ఆధారం పై చేశారు. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. బుద్ధియోగాన్ని ఒక్క బాబాతో జోడించాలి. మన్మనాభవ అనే ఛూ మంత్రం ద్వారా ఈ ప్రపంచాన్ని స్వర్గంగా తయారు చేయాలి.

2. సేవలో ఎప్పుడూ అలసిపోరాదు. స్థూల సేవతో పాటు ఆత్మిక సేవను కూడా చేయాలి. మన్మనాభవ మంత్రమును అందరికీ గుర్తు చేయించాలి.

వరదానము :-

''పరిశీలనా శక్తి మరియు నిర్ణయ శక్తుల ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే సఫలతామూర్త్‌ భవ''

పరిశీలనా శక్తి ద్వారా తండ్రిని, మిమ్ములను మీరు, సమయాన్ని, బ్రాహ్మణ పరివారాన్ని, మీ శ్రేష్ఠ కర్తవ్యాన్ని గుర్తించిన తర్వాత ఎలా తయారవ్వాలో, ఏమి చేయాలో నిర్ణయించి అదే సేవ చేస్తారు, కర్మ లేక సంబంధ-సంపర్కములోకి వస్తూ సదా సఫలతను ప్రాప్తి చేసుకుంటారు. మనసా, వాచా, కర్మణా అన్ని రకాల సేవలో సఫలతామూర్తిగా అయ్యేందుకు ఆధారము - పరిశీలనా శక్తి మరియు నిర్ణయం తీసుకునే శక్తి.

స్లోగన్‌ :-

''జ్ఞాన - యోగాల లైట్‌ ద్వారా సంపన్నమైతే, ఎటువంటి పరిస్థితినైనా