04-12-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - సదా పవిత్రంగా అయ్యేందుకు మీది ఆత్మిక యోగము. ఎందుకంటే మీరు పవిత్రతా సాగరునితో యోగము జోడిస్తారు, పవిత్ర ప్రపంచాన్నిస్థాపన చేస్తారు ''
ప్రశ్న :-
నిశ్చయ బుద్ధి గల పిల్లలకు మొట్టమొదట ఏ నిశ్చయము పక్కాగా ఉండాలి. ఆ నిశ్చయానికి గుర్తు ఏమిటి ?
జవాబు :-
మేము ఒక్క తండ్రి పిల్లలము. తండ్రి నుండి మాకు దైవీ స్వరాజ్యము లభిస్తుంది అన్న మొట్టమొదటి నిశ్చయము పక్కాగా ఉండాలి. ఎప్పుడైతే నిశ్చయం ఏర్పడ్తుందో వెంటనే మేము ఏ భక్తినైతే చేశామో, అది ఇప్పుడు పూర్తయ్యింది, ఇప్పుడు స్వయం భగవంతుడే మాకు లభించాడు అని బుద్ధిలోకి వెంటనే వస్తుంది. నిశ్చయబుద్ధి గల పిల్లలే వారసులుగా అవుతారు.
పాట :-
ఓ దూరదేశ యాత్రికుడా!.....................( ఓ దూర్ కే ముసాఫిర్ ..........) 
ఓంశాంతి.
తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. నిజానికి అందరూ దూరదేశ యాత్రికులే. ఆత్మలందరూ అత్యంత దూరమైన పరంధామ నివాసులే. ఇది కూడా శాస్త్రాలలో ఉంది. ఎక్కడైతే సూర్య, చంద్రాదుల ప్రకాశం కూడా ఉండదో, అక్కడ ఎంతో దూర దేశంలో ఆత్మ ఉంటుంది. మూల వతనములో గాని, సూక్ష్మ వతనంలో గాని ఏ డ్రామా ఉండదు. డ్రామా ఈ స్థూల వతనములో ఉంటుంది. దానినే మనుష్య సృష్టి అని అంటారు. మూలవతనము మరియు సూక్ష్మవతనంలో 84 జన్మల చక్రము ఉండదు. చక్రమును మనుష్య సృష్టిలో చూపించడం జరుగుతుంది. అసలు మనుష్య సృష్టి ఏమిటి, మనుష్యులు దేనితో తయారు చేయబడ్డారు? మనుష్యులలో ఒకటేమో ఆత్మ. ఇంకొకటి శరీరము ఉంటుంది. పంచ తత్వాలతో ఈ బొమ్మ(శరీరము) తయారవుతుంది. అందులో ఆత్మ ప్రవేశించి పాత్రను అభినయిస్తుంది. కావున అందరూ దూరదేశవాసులే. కాని మీకు నిశ్చయముంది, మనుష్యులకు ఈ నిశ్చయం లేదు. తండ్రి అర్థము చేయిస్తున్నారు - నన్ను దూరదేశవాసి అని అంటారు కానీ ఆత్మలైన మీ అందరి నివాసస్థానము ఒక్కటే. ఆ నాటకంలో ఏ పాత్రనైతే అభినయిస్తారో, అందులో ప్రతి ఒక్కరికీ తమ తమ ఇల్లు ఉంటుంది కదా! అక్కడ నుండి వచ్చి పాత్రను అభినయిస్తారు. ఇక్కడ మేమంతా ఒక్క తండ్రి పిల్లలమే. ఒకే ఇల్లయిన పరంధామంలో ఉండేవారమని పిల్లలైన మీరు భావిస్తారు. అది బ్రహ్మమహాతత్వము. ఇది ఆకాశ తత్వము. ఇక్కడ పాత్రను అభినయిస్తారు. ఇక్కడ రాత్రి, పగలు ఉంటాయి. అందుకే ఈ సూర్యచంద్రులు ఉన్నారు. మూలవతనములో అయితే రాత్రింబవళ్ళు ఉండవు. ఈ సూర్యచంద్రులు దేవతలేమీ కారు. ఇవి రంగస్థలాన్ని ప్రకాశవంతం చేసే దీపాలు. పగలు సూర్యుడు ప్రకాశమును ఇస్తే, రాత్రి చంద్రుని ప్రకాశము ఉంటుంది. ఇప్పుడు మనుష్యులందరూ ముక్తిధామానికి వెళ్ళాలని కోరుకుంటారు. భగవంతుడు పైన ఉంటాడని వారికి తెలుసు. ఓ పరమపిత పరమాత్మ! అని భగవంతుని కూడా తల్చుకుంటారు. తద్వారా బుద్ధి పైకి వెళ్లిపోతుంది. ఆత్మ అర్థం చేసుకుంటుంది. కాని అజ్ఞానపు నీడ కమ్ముకొని ఉంది. మేము ఇక్కడి నివాసులము కాము అని కూడా వారికి తెలుసు. వీరు మన తండ్రి. వారి నోటి నుండి ''ఓ గాడ్ఫాదర్'' అని కూడా అంటారు. ఆ తర్వాత అందరూ తండ్రులే. భగవంతుడు సర్వవ్యాపి అని అనేస్తారు. అందరూ తండ్రులు కారని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఆత్మలందరూ పరస్పరం సోదరులు. ఇది తెలియని కారణంగా పోట్లాడుకుంటూ ఉంటారు. ఆత్మలైన మీరంతా సోదరులు. ఒక్క తండ్రి సంతానంగా అయ్యారు. నిశ్చయబుద్ధి గలవారుగా కూడా నెంబరువారీగా ఉన్నారు. తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలని లౌకిక సంబంధములో నిశ్చయముంటుంది. ఇక్కడ మాయ ఘడియ ఘడియ తండ్రి నుండి ముఖం తిప్పేస్తుంది. సర్వశక్తివంతుడైన తండ్రికి చెందినవారిగా అవ్వడంతో మాయ కూడా సర్వశక్తివంతమై పోట్లాడ్తుంది. ఇది పంచ వికారాల పై విజయం పొందేందుకు యుద్ధము. యుద్ధము ఎంతో ప్రసిద్ధమైనది. పోతే శాస్త్రాలలో కౌరవులు, పాండవుల విషయాలను ఏవైతే చూపించారో అవేవీ లేవు. ఈ రావణునితో చేసే యుద్ధము చాలా భారీ యుద్ధము. తండ్రి స్మృతిలో ఉంటూ మనం సంపూర్ణంగా అవ్వాలని, ఆత్మ పవిత్రంగా అవ్వాలని కోరుకుంటాము. యోగము తప్ప ఇంకే మార్గమూ లేదు. ఇతర యోగాలేవైతే నేర్పిస్తారో అవి పవిత్రత కొరకు కాదు. అవన్నీ స్థూల యోగాలు. అల్పకాలికంగా ఉండే యోగాలు మాత్రమే. ఈ ఆత్మిక యోగము సదా పవిత్రంగా అయ్యేందుకు. పవిత్రతా సాగరునితో మనము యోగమును జోడించడం ద్వారా పవిత్రంగా అవుతాము. ఈ యోగాగ్ని ద్వారా మీ జన్మ-జన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి. ఇది పతిత ప్రపంచము అని బుద్ధి కూడా చెప్తుంది. ఇది సత్యయుగమా లేక కలియుగమా? అని ఎవరిని అడిగినా, దీనిని సత్యయుగమని ఎవ్వరూ అనరు. సత్యయుగము కొత్త ప్రపంచముగా ఉండేది. దానిని స్వర్ణ యుగమని, దీనిని ఇనుప యుగమని అంటారు. పాత ప్రపంచాన్ని కలియుగమని, కొత్త ప్రపంచాన్ని సత్యయగమని అంటారు. ఇప్పుడిది సత్యయుగము మరియు కలియుగము కూడా అని ఎవ్వరూ అనజాలరు. నరకవాసులంటే నరకవాసులే. పురాతన ప్రపంచాన్ని పతిత ప్రపంచమని, కొత్త ప్రపంచమును పావన ప్రపంచమని అంటారు. ఈ విషయాలు మనుష్యులకే అర్థం చేయించబడ్తాయి. జంతువులు ''పతిత పావనా! రా!'' అనైతే అనవు కదా! ఎవరిని అడిగినా, ఇది నరకము అనే అంటారు. భారతదేశమే కొత్త ప్రపంచమైన స్వర్గంగా ఉండేది. భారతదేశమే పాత ప్రపంచమైన నరకంగా ఉంది. మీరు ఎక్కువగా భారతదేశం గూర్చే చెబుతూ ఉండండి. మిగిలిన వారంతా మధ్యలో వస్తారు. వారితో మనకు సంబంధం లేదు. మన ధర్మమే వేరు. అది ఇప్పుడు ప్రాయ: లోపమైపోయింది.
ఇప్పుడు మీరు నిశ్చయబుద్ధి గలవారిగా అయ్యారు. మనమంతా ఒకే తండ్రి పిల్లలమని మీకు తెలుసు. తండ్రి ద్వారా మనకు స్వరాజ్యం లభిస్తుంది. మొదట ఈ నిశ్చయం పక్కాగా ఉండాలి. జ్ఞానాన్ని వింటారు. అదైతే బాగానే ఉంది. ప్రజలుగా అవుతారు. మేము అనంతమైన తండ్రి పిల్లలము అను నిశ్చయము ఏర్పడాలి. మేము భగవంతుని కలుసుకునేందుకు భక్తి చేశాము, ఇప్పుడు ఆ భక్తి పూర్తయ్యింది, ఇప్పుడు భగవంతుడే స్వయంగా వచ్చి మాతో కలిశారని అర్థం చేసుకోవాలి. వారి ద్వారా సూర్యవంశ స్వరాజ్య పదవి లభిస్తుంది. మనము ఇంత శ్రేష్ఠమైన పదవిని పొందుతాము. ఉదాహరణానికి షావుకార్లు పిల్లలను దత్తత తీసుకుంటారు కదా! వారైతే ఏ ఒక్కరినో తీసుకుంటారు. ఇక్కడైతే అనంతమైన తండ్రికి అనేకమంది పిల్లలు కావాలి. ఎవరైతే నా కొడుకుగా అవుతారో, వారికి స్వర్గ వారసత్వం లభిస్తుంది. ఎవరైతే అలా నా వారిగా అవ్వరో, వారు వారసత్వాన్ని తీసుకోలేరని చెప్తారు. వారు శ్రీమతము పై నడవరు. ఎవరికైతే నిశ్చయమేర్పడ్తుందో వారు, ''బాబా మీరు మళ్ళీ వచ్చారు చాలు, మేమిక మీ చేతిని వదలమని అంటారు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. మళ్ళీ '' మేము పారలౌకిక తండ్రి పిల్లలుగా అయ్యాము, వారి శ్రీమతము పై నడుస్తున్నాము, మమ్ములను పరమపిత పరమాత్మ చదివిస్తున్నారు'' అని పిల్లలు ఇతరులకు అర్థం చేయిస్తారు. ఇంతమంది బి.కె.లుగా అయ్యారంటే తప్పకుండా నిశ్చయముంది. మరి మనం కూడా ఎందుకు అవ్వరాదు? మేము మీ వారిగా అయ్యామని వ్రాసి పంపాలి. నేను దూరంగా ఏమీ లేను. నేను ఇక్కడే కూర్చున్నాను. మీ ముందు హాజరుగా ఉన్నాను. ఇక్కడ ప్రత్యక్షంగా కూర్చున్నాను. ప్రెసిడెంట్ కూడా ఈ సృష్టి పై హాజరై ఉన్నాడు, మరి అతడు సర్వవ్యాపి కాజాలరు కదా. అలాగే ఎవరినైతే దు:ఖహర్త - సుఖకర్త అని అంటారో, ఆ పరమపిత పరమాత్మ కూడా సర్వవ్యాపి కాజాలరు. మరి వారు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు ఇంత దు:ఖితులుగా ఎలా అవ్వగలరు? నిజానికి తండ్రి లేనప్పుడు(స్వర్గంలో) కూడా ఎవ్వరూ దు:ఖితులుగా ఉండరు.
తండ్రి పిల్లల కొరకు గోశాలను నిర్మించారు. పిచుకలు తమ పిల్లల కొరకు గూడును నిర్మించుకుంటాయి కదా! అలా తండ్రి మీ కొరకు మీ ద్వారానే గూళ్ళను(గోశాలలు) నిర్మింపజేస్తారు. మీరు ఉండేందుకే స్వర్గం యొక్క గూళ్ళు తయారవుతున్నాయి. మీరు నా సలహా పై నడిచినట్లయితే స్వర్గంలో రాజ్యం చేస్తారు. పూర్తి నిశ్చయమున్నట్లయితే గట్టిగా పట్టుకోవాలి. అలాగని ఇక్కడే కూర్చుండిపోవడం కాదు. ఇళ్ళూ - వాకిళ్ళను వదలరాదు. వారైతే ఇళ్ళూ-వాకిళ్ళను వదిలేస్తారు. గురువును భగవంతునిగా భావిస్తారు. వారు జీవిస్తూనే మరణించరు. మీరైతే జీవిస్తూనే మరణించి మళ్లీ సత్యయుగంలో జీవించాలి. మీరు తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటారు. ఎప్పుడైతే అనంతమైన తండ్రి చదివిస్తున్నారని, 21 జన్మల వారసత్వాన్ని ఇస్తున్నారని నిశ్చయమవుతుందో వారి శ్రీమతం పై నడవవలసి ఉంటుంది. పిల్లలుగా అయితే తండ్రి డైరెక్షన్ ఇస్తారు. మొదట ఒక వారం రోజులు భట్టీలో కూర్చోండి. మీకు రోజూ జ్ఞానము లభిస్తూ ఉంటుంది. అందరూ ఒకేలా అర్థం చేసుకోరు. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థము మరియు భాగ్యము అనుసారంగా పొందుతారు. పురుషార్థం మరియు భాగ్యము పైనే అంతా ఆధారపడి ఉంటుంది. వారి భాగ్యములో ఏముందో, వారు ఏ పదవి పొందుతారో తెలిసిపోతుంది. తండ్రికి చెందినవారిగా అయ్యి మళ్ళీ గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి. అచ్ఛా. గృహస్థ వ్యవహారంలో లేకుంటే వెళ్లి అంధులకు చేతికర్రగా అవ్వండి. సత్యనారాయణ కథను వినిపించేందుకు తప్పకుండా వెళ్లాలి.
ఇప్పుడు చూడండి! ప్రేమ బచ్చీ సేవ చేసేందుకు వెళ్ళింది. ఎవరైతే ఆహ్వానము ఇచ్చారో వారు స్వాగత ఏర్పాట్లు చేశారు. చాలామందితో కలిపించారు. వారంతా ప్రభావితమయ్యారు. కాని వీరిని అనంతమైన తండ్రి చదివిస్తున్నారని, వారి ద్వారా 21 జన్మల వారసత్వం లభిస్తుందనే నిశ్చయబుద్ధి గలవారు ఒక్కరు కూడా లేరు. ప్రభావితమైతే అవుతారు. కాని తప్పకుండా జ్ఞానసాగరుడే చదివిస్తున్నారని నిశ్చయము ఏర్పడలేదు. కేవలం చాలా బాగుంది అని అంటారు కాని మళ్ళీ బయటకు వెళ్ళగానే అంతా పోతుంది. ఏ ఒక్కరో పురుషార్థం చేస్తారు. పరస్పరం సత్సంగాలు జరుపుతారు కాని ఎవరైతే జరుపుతారో, వారు కూడా నిశ్చయబుద్ధి గలవారిగా లేరు. వారిని హాఫ్కాస్ట్ అని అంటారు. నిశ్చయము మరియు సంశయము. తండ్రి చదివిస్తున్నారని ఒక్కొక్కసారి అంటారు. ఇదెలా సాధ్యపడుతుందని మరోసారి అంటారు. అవును! పవిత్రంగా అవ్వడమైతే మంచిదే. కాని పవిత్రంగా ఉండడం చాలా కష్టమని అంటారు. మొదట నిశ్చయం కావాలి. ఎంతగానో పులకరిస్తూ వ్రాయాలి. ఎలాగైతే బంధనాలలో ఉన్న గోపికలు ఉత్తరాలు వ్రాస్తారో, ఆ విధంగా విముక్తులై ఉన్నవారు ఎప్పుడూ వ్రాయరు. ఒక్కరిని కూడా నిశ్చయబుద్ధి గలవారిగా చేయలేదు, సాధారణ ప్రజలను తయారు చేశారు కాని వారసులను తయారు చేయలేదు, ఒక్కరు కూడా నిశ్చయబుద్ధి గలవారిగా అవ్వలేదని బాబా వ్రాసేస్తారు. నిశ్చయబుద్ధి గలవారే వారసులుగా అవుతారు. కొందరు భలే నిశ్చయబుద్ధి గలవారిగా ఉన్నారు కాని జ్ఞానము తీసుకోరు, అదే వంశములోకి వెళ్ళి దాస-దాసీలుగా అవుతారు. పోను పోను ఖచ్ఛితంగా సాక్షాత్కారాలవుతాయి. తాము దాస-దాసీలుగా ఏ నెంబరులో అవుతారో కూడా తెలిసిపోతుంది. అప్పుడు ఎంతగానో పశ్చాత్తాపపడ్తారు. మేము శ్రీమతం పై నడవలేదు. అందుకే ఈ పరిస్థితి ఏర్పడింది అని వారు అంటారు. అయినా ప్రతి పరిస్థితిలో డ్రామా అనే అంటారు. వీరి డ్రామాలో కల్ప-కల్పాంతరాలు ఇటువంటి పాత్రయే ఉంది. సాక్షాత్కారాలైతే జరగాల్సిందే. చివర్లో రిజల్టు వెలువడ్తుంది. అప్పుడు విధి అని అంటారు. మా అదృష్టములో ఇదే ఉందని అంటారు. మీ చదువుకు ఫలితము వెలువడ్తుంది. ఇది చాలా పెద్ద స్కూలు. చదివించేవారు ఒక్కరే. చదువు కూడా ఒక్కటే. పరీక్ష కూడా ఒక్కటే. ఈ విద్యార్థులు ఎలా ఉన్నారో టీచర్లకు తెలుసు. అందరూ ముందుకు వెళ్తూ ఉంటారు. పోను పోను అన్నీ తెలుస్తూ ఉంటాయి. క్షణ-క్షణం మీరు ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ప్రారంభములో వెళ్ళేవారు కదా! మీరు కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు. తండ్రి కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు పొరపాట్లు చేస్తున్నారు. శ్రీమతము పై నడవడం లేదు. ఇలా నడుస్తూ నడుస్తూ అలా అలవాటైపోతుంది. శివబాబా, మేము మీ శ్రీమతం పై నడుస్తున్నామా? అని అడగండి. అప్పుడు మీరు నడవడం లేదు అందుకే మీ భాగ్యం ఇలా కనిపిస్తోంది అని బాబా చెప్తారు. ఇప్పుడు చెడు దశ ఉంది. ముందు ముందు బాగుపడవచ్చు అని భావించబడ్తుంది. కొందరు కామం యొక్క హల్కా(తేలిక) నషాలో పడిపోతారు. భారతదేశం పావనంగా ఉండేది, శ్రేష్ఠాచారంగా ఉండేది. అది ఇప్పుడు భ్రష్ఠాచారిగా ఉంది. ఆ శ్రేష్ఠ దేవతల మహిమ అయితే ఉంది కదా! ఇదంతా ఆసురీ సాంప్రదాయము. నేను దైవీ సాంప్రదాయాన్ని స్థాపన చేసేందుకు వచ్చాను అని బాబా అంటారు. ఈ దేవీ దేవతా ధర్మము ఉన్నతోన్నతమైనది. ఒక్క తండ్రియే పతితపావనుడు. కాని మనుష్యులు ఏమీ అర్థం చేసుకోరు. ధర్మస్థాపన చేసేందుకు ఎవరు వచ్చినా వారు పవిత్రంగా తప్పకుండా అవుతారు. ప్రతి విషయంలోనూ మంచి, చెడు రెండూ ఉంటాయి. తక్కువ భాగ్యము, మంచి భాగ్యము గలవారు కూడా ఉంటారు. ఇప్పుడు ఈ రావణ రాజ్యము అంతమవ్వనున్నది. ఈ రావణ నగరానికి ఇప్పుడు మంటలు అంటుకోనున్నాయి. రాముని సైన్యమైన మీరు కూర్చుని ఉన్నారు. ఎవరైతే ఈ ధర్మానికి చెందినవారో, వారు అర్థం చేసుకుంటూ ఉంటారు. నెంబర్వారీగా అర్థం చేసుకుంటారు. కొందరికైతే జనకునిలా ఒక్క బాణం తగల్తూనే సరెండరైపోతారు. వారు ఇక ఎటువంటి సాకులు చెప్పరు. ఇందులో సాకులు నడవజాలవు. కాని మాయ తుఫానులు కూడా చాలా వస్తాయి. తాము ఈశ్వరీయ సంతానమని తమ వంశాన్నే మర్చిపోతారు. పిల్లలు చాలా మధురంగా అవ్వాలి. కామం నషా కొద్దిగా కూడా ఉండరాదు. కామం చాలా మహాశత్రువు. ఇదే అన్నింటికన్నా పెద్ద పరీక్ష. పిల్లలూ! కలిసి ఉంటూ పవిత్రంగా అయ్యి చూపించండి అని తండ్రి అంటారు. తండ్రికి పిల్లల స్థితి తెలుసు. బాబా, నేను మిమ్ములను స్మృతి చేస్తున్నాను, మీ సేవను చేస్తున్నానని నిశ్చయబుద్ధి గల పిల్లలు సమాచారమును ఇస్తారు. సేవా సమాచారమును వ్రాస్తేనే సేవకు ప్రమాణము ఇచ్చినట్లు. వీరిలో మంచి ఆశ కనిపిస్తోంది అని భావించగలను. అలాగే బాబా ఒక్కరు, పిల్లలైన మేము చాలామంది ఉన్నామని కూడా అర్థం చేసుకోవాలి. రోజూ బాబా రెస్పాన్స్ ఇవ్వవలసి ఉంటుందని భావించడం కాదు. బాబా పేదలపాలిటి పెన్నిధి. దానము పేదలకే ఇవ్వడం జరుగుతుంది. ఈ భారతఖండము పేదగా ఉంది. భారతఖండమే ధనిక ఖండముగా ఉండేది. అదే నిరుపేదగా అయ్యింది. ఇది ఎవ్వరికీ తెలియదు. ఈ భారతదేశమే అవినాశీ ఖండము. ఇక్కడ భగవంతుడు అవతరిస్తారు. భారతదేశం బంగారు పిచుకలా ఉండేది. అనగా సర్వ సుఖాల భండారంగా ఉండేది. ఇప్పుడు ఆ సుఖధామములోకి వెళ్ళేందుకు మనమంతా పురుషార్థం చేస్తున్నాము. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఏ విధమైన సాకులు చెప్పకుండా తండ్రి శ్రీమతమును అనుసరిస్తూ ఉండాలి. సేవకు ప్రమాణమును (ఋజువును) ఇవ్వాలి.
2. మనము ఈశ్వరీయ సంతానము, మనది ఉన్నతోన్నతమైన వంశము - ఇది ఎప్పుడూ మర్చిపోరాదు. నిశ్చయబుద్ధి గలవారిగా అవ్వాలి, ఇతరులను అలా తయారుచేయాలి.
వరదానము :-
'' బ్రాహ్మణ జన్మ యొక్క విశేషతను, విచిత్రతను స్మృతిలో ఉంచుకొని సేవ చేసే సాక్షీ భవ ''
ఈ బ్రాహ్మణ జన్మ దివ్య జన్మ. సాధారణ జన్మధారీ ఆత్మలు తమ బర్త్ డే, మ్యారేజ్ డేను, ఫ్రెండ్స్ డేను వేరు వేరుగా జరుపుకుంటారు. కాని మీకు బర్త్ డే, మ్యారేజ్ డే, మదర్ డే, ఫాదర్ డే, ఎంగేజ్మెంట్ డే అన్నీ ఒక్కటే. ఎందుకంటే మీ అందరి ప్రతిజ్ఞ ఏమంటే - '' ఏక్ బాప్ దూస్రా న కోయీ(ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు). '' కనుక ఈ జన్మ యొక్క విశేషతను, విచిత్రతను స్మృతిలో ఉంచుకొని సేవ చేసే పాత్రను అభినయించండి. సేవలో ఒకరికొకరు సాథీలుగా (తోడుగా, స్నేహితులుగా) అవ్వండి. కాని సాక్షిగా ఉంటూ సాథీలుగా అవ్వండి. కొంచెం కూడా ఎవ్వరిలోనూ విశేషమైన లొంగుబాటు(ఝుకావ్) ఉండరాదు.
స్లోగన్ :-
''ఎవరి జీవితంలో నిరహంకారత మరియు అథారిటీల బ్యాలన్స్ ఉంటుందో, వారే చింతలేని చక్రవర్తులు ''