27-12-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - నేను మీకు మళ్లీ రాజయోగాన్ని నేర్పించి, రాజాధి రాజులుగా తయారు చేస్తాను. ఈ ' మళ్లీ ' అను పదములోనే మొత్తం చక్రమంతా ఇమిడి ఉంది''

ప్రశ్న :-

తండ్రి కూడా శక్తివంతమైనవారే, మాయ కూడా శక్తివంతమైనదే. ఇరువురి శక్తి ఏమిటి ?

జవాబు :-

తండ్రి మిమ్ములను పతితుల నుండి పావనులుగా చేస్తారు. పావనంగా తయారు చేయడంలో తండ్రి శక్తివంతముగా ఉన్నారు. అందుకే వారిని పతితపావనుడు, సర్వశక్తివంతుడు అని అంటారు. మాయ పతితంగా చేయడంలో శక్తివంతముగా ఉంటుంది. సత్యమైన సంపాదనలో ఎటువంటి గ్రహచారం కూర్చుంటుందంటే దానితో లాభానికి బదులు నష్టం వాటిల్లుతుంది. వికారాల వెనుక మాయ పెనములా చేసేస్తుంది. కావున '' పిల్లలూ! దేహీ-అభిమానులుగా అయ్యేందుకు పురుషార్థం చేయండి '' అని బాబా అంటారు.

పాట :-

మనము ఆ మార్గంలో ప్రయాణించాలి,.........( హమే ఉన్‌ రాహోం పర్‌ చల్‌నా హై,............. )   

ఓంశాంతి.

పిల్లలైన మీరు ఏ మార్గములో ప్రయాణించాలి? దారి చూపించేవారు తప్పకుండా ఉంటారు. మనుష్యులు చెడుమార్గంలో వెళ్లినప్పుడేే దు:ఖితులుగా అవుతారు. ఇప్పుడు ఎంతో దు:ఖితులుగా ఉన్నారు. ఎందుకంటే వారి(పరమాత్ముని) మతము పై నడవరు. ''ఎప్పటి నుండి చెడు (వ్యతిరేక) మతమును ఇచ్చే రావణుని రాజ్యము ప్రారంభమయ్యిందో అప్పటి నుండి అందరూ తప్పుడు మతము పై నడుస్తూ వచ్చారు. మీరు ఈ సమయంలో రావణుని మతమును అనుసరిస్తున్నారు. అందుకే అందరి పరిస్థితి పాడైపోయిందని తండ్రి అర్థము చేయిస్తారు. అందరూ స్వయాన్ని పతితులమని చెప్పుకుంటారు కూడా. బాపూ గాంధీజీ కూడా ''పతిత పావనా రండి!'' అని పిలిచేవారు అనగా మేము పతితులమనే కదా! కాని పతితులుగా ఎలా అయ్యారో ఎవ్వరూ అర్థం చేసుకోరు. భారతదేశంలో రామరాజ్యము ఉండాలని కోరుకుంటారు కాని ఆ రాజ్యాన్ని ఎవరు తయారు చేస్తారు? గీతలో తండ్రి అన్ని విషయాలను అర్థం చేయించారు. కాని గీతా భగవానుని పేరునే తలక్రిందులు చేసేశారు. మీరు ఏం చేశారో తండ్రి అర్థం చేయిస్తారు. 'క్రీస్తు బైబిల్‌'లో పోప్‌ పేరు వ్రాసేస్తే ఎంత నష్టం జరుగుతుంది! ఇది కూడా డ్రామాయే. తండ్రి అన్నింటికంటే పెద్ద పొరపాటు ఏదో అర్థము చేయిస్తారు. ఈ ఆదిమధ్యాంతాల జ్ఞానము గీతలో ఉంది. ''నేను మిమ్ములను మళ్లీ రాజాధి రాజులుగా తయారు చేస్తాను'' అని బాబా అర్థం చేయిస్తారు. మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారో మీకు తెలియదు. అది నేను తెలిపిస్తాను. ఇది ఏ శాస్త్రములోనూ లేదు. శాస్త్రాలైతే అనేకమున్నాయి. భిన్న-భిన్న మతాలున్నాయి. గీత అంటే గీతయే. ఎవరైతే గీతను గానం చేశారో వారే సలహా ఇచ్చారు. '' నేను మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు మళ్లీ వచ్చానని వారు అంటారు.'' మీ పై మాయ నీడ పడింది. ఇప్పుడు నేను మళ్లీ వచ్చాను. పాటలో కూడా - ''ఓ భగవంతుడా! మళ్లీ వచ్చి గీతను వినిపించు అనగా మళ్లీ గీతా జ్ఞానమును ఇవ్వు'' అని అంటారు. ఆసురీ సృష్టి వినాశనము మరియు దైవీ సృష్టి స్థాపన మళ్లీ జరుగుతుంది అని గీతలోనే ఉంది. మళ్లీ అన్న పదమును తప్పకుండా వాడ్తారు. గురునానక్‌ మళ్లీ తన సమయానికి వస్తారు. చిత్రాలను కూడా చూపిస్తారు. కృష్ణుడు కూడా మళ్లీ అదే నెమలి పింఛముతో ఉంటాడు కావున ఈ రహస్యాలన్నీ గీతలో ఉన్నాయి. కాని భగవంతుని పేరు మార్చేశారు. ''మేము గీతను నమ్మము'' - అని అనము కానీ ఈ తప్పు పేర్లు ఏవైతే మనుష్యులు వేశారో వాటిని తండ్రి వచ్చి సరిదిద్ది అర్థం చేయిస్తారు. ప్రతి ఆత్మలో తన తన పాత్ర నిండి ఉందని కూడా అర్థం చేయిస్తారు. అందరూ ఒకేలా ఉండరు. ఉదాహరణానికి మనుష్యులు అంటే మనుష్యులు, అలా ఆత్మ అనగా ఆత్మయే. అయితే ప్రతి ఆత్మలో వారి వారి పాత్ర నిండి ఉంది. ఈ విషయాలను అర్థం చేయించేవారు చాలా వివేకవంతులుగా ఉండాలి. ఎవరు అర్థం చేయించగలరో, ఎవరు సేవ చేయడంలో వివేకవంతులో, ఎవరి లైన్‌ క్లియర్‌గా ఉందో, ఎవరు దేహీ-అభిమానులుగా ఉంటారో బాబాకు తెలుసు. అందరూ పరిపూర్ణులుగా, దేహీ-అభిమానులుగా అవ్వలేదు. ఈ ఫలితము అంతిమములోనే వస్తుంది. పరీక్షలు సమీపంగా వచ్చినప్పుడు ఎవరెవరు పాస్‌ అవుతారో తెలిసిపోతుంది. టీచర్‌ కూడా అర్థం చేసుకోగలడు. అలాగే పిల్లలు కూడా వీరు అందరికన్నా చురుకుగా ఉన్నారని అర్థం చేసుకోగలరు. అక్కడైతే మోసం మొదలైనవి కూడా జరగగలవు, ఇక్కడైతే అలా జరగజాలదు. ఇది డ్రామాలో రచింపబడి ఉంది, కల్ప పూర్వం వారే వెలువడ్తారు. సేవ చేయు వేగం ద్వారా మనకు అర్థం అవుతుంది. ఈ సత్యమైన సంపాదనలో లాభ-నష్టాలు, గ్రహచారం మొదలైనవి వస్తాయి. నడుస్తూ-నడుస్తూ కాళ్ళు విరిగిపోతాయి. గాంధర్వ వివాహం చేసుకున్న తర్వాత మళ్లీ మాయ పూర్తిగా పెనములా చేసేస్తుంది. మాయ కూడా చాలా శక్తివంతమైనది. బాబా పావనంగా చేయడంలో శక్తివంతమైనవారు అందుకే వారిని సర్వశక్తివంతుడు, పతితపావనుడు అని అంటారు. అలాగే మాయ మళ్లీ పతితులుగా చేయడంలో శక్తివంతమైనది. సత్యయుగంలో అయితే మాయ ఉండదు. అది నిర్వికారీ ప్రపంచము. ఇప్పుడిది పూర్తిగా వికారీ ప్రపంచము. ఇది ఎంత అద్భుతమైన శక్తి! నడుస్తూ-నడుస్తూ మాయ పూర్తిగా ముక్కుతో పట్టుకొని పెనము వలె చేసేస్తుంది. విడాకులిప్పించి వదిలి వెళ్లిపోయేలా చేసేస్తుంది. అది అంతటి శక్తివంతమైనది. భలే పరమపిత పరమాత్మను సర్వశక్తివంతుడని అంటారు కాని మాయ కూడా తక్కువేమీ కాదు. అర్ధకల్పం మాయ రాజ్యము కొనసాగుతుంది. ఇది ఎవ్వరికీ తెలియదు. రాత్రి, పగలు సగం-సగం ఉంటాయి. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అయినా, సత్యయుగానికి లక్షల సంవత్సరాలు, కలియుగానికి ఇంకెన్నో సంవత్సరాలు ఇచ్చేశారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు కనుక అర్థమవుతుంది. ఇది పూర్తిగా సరైనది. తండ్రి కూర్చుని చదివిస్తారు. కలియుగంలో మనుష్యులు గీతా రాజయోగాన్ని నేర్పించి రాజాధి రాజులుగా తయారు చేయరు. మేము రాజయోగాన్ని నేర్చుకొని రాజాధి రాజులుగా అవుతామని ఎవరి బుద్ధిలోనూ లేదు. ఆ గీతా పాఠశాలలైతే అనేమున్నాయి. కానీ ఎవ్వరూ రాజయోగాన్ని నేర్చుకొని రాజాధి రాజులుగా లేక రాణులుగా అవ్వలేరు. అక్కడ రాజ్యమును పొందే లక్ష్యము, ఉద్ధేశ్యమేదీ లేదు. ఇక్కడైతే మేము అనంతమైన తండ్రి నుండి భవిష్య సుఖ రాజ్యము పొందేందుకు చదువుతున్నామని అంటారు. మొట్టమొదట తండ్రిని గురించి అర్థం చేయించాలి. గీత పైనే అంతా ఆధారపడి ఉంది. సృష్టిచక్రం ఎలా తిరుగుతుందో, తాము ఎక్కడి నుండి వచ్చారో, మళ్లీ ఎక్కడకు వెళ్లాలో మనుష్యులకు ఎలా తెలియాలి? ఏ దేశము నుండి వచ్చారో ఏ దేశములోకి వెళ్లాలో,................ పాట కూడా ఉంది కదా. మనుష్యులకు ఏమీ తెలియదు, కేవలం చిలకల్లా పాడుతూ ఉంటారు, ఆత్మలో ఏ బుద్ధి అయితే ఉందో, దానికి పరమపిత పరమాత్మ అని ఎవరిని అంటారో, వారెవరో తెలియదు. వారిని చూడలేరు, తెలుసుకోలేరు కూడా. తండ్రిని తెలుసుకోవడం, చూడడం ఆత్మ బాధ్యత కదా! ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మనం ఆత్మలము, పరమపిత పరమాత్మ అయిన తండ్రి మనలను చదివిస్తున్నారని తెలుసుకున్నారు. తండ్రి వచ్చి చదివిస్తారని బుద్ధి చెప్తుంది. ఉదాహరణానికి ఎవరి ఆత్మనైనా పిలిస్తే తన ఆత్మ వచ్చిందని భావిస్తారు కదా! మనం ఆత్మలమని వారు మన తండ్రి అని మీరు అర్థము చేసుకున్నారు. తండ్రి నుండి తప్పకుండా వారసత్వము లభించాలి. మనం దు:ఖితులుగా ఎందుకు అయ్యాము? తండ్రియే సుఖ-దు:ఖాలను ఇస్తారని మనుష్యులు అనేస్తారు. భగవంతుని నిందిస్తూ ఉంటారు, వారు ఆసురీ సంతానము. కల్ప పూర్వము ఎలా అన్నారో అలాగే ఇప్పుడూ అంటారు. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా(ప్రాక్టికల్‌గా) ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. ఇంతకుముందు మీరు ఆసురీ సంతానంగా ఉండేవారు, నిరంతరం నన్ను స్మృతి చేయండి అని ఇప్పుడు తండ్రి అంటారు. ఎవరికైనా ఈ రెండు పదాలను అర్థం చేయించడం చాలా సహజము. మీరు భగవంతుని పిల్లలు. భగవంతుడు స్వర్గాన్ని రచించారు, అది ఇప్పుడు నరకంగా అయ్యింది, మళ్లీ స్వర్గమును తండ్రియే రచిస్తారు. తండ్రి మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. స్వర్గ స్థాపన చేస్తున్నారు. అచ్ఛా! శివుని గురించి మీకు తెలియదు. ప్రజాపిత బ్రహ్మను కూడా రచించేవారు ఆ తండ్రియే. కావున తప్పకుండా తండ్రి బ్రహ్మ ద్వారానే నేర్పిస్తారు. ఇప్పుడిది శూద్ర వర్ణము, మనం బ్రాహ్మణుల నుండి దేవతలుగా, క్షత్రియులుగా అవుతాము. లేకపోతే విరాట రూపాన్ని ఎందుకు తయారు చేశారు? చిత్రాలు సరిగ్గానే ఉన్నాయి కాని అర్థం చేసుకోలేరు.

శూద్రులను బ్రాహ్మణులుగా ఎవరు తయారు చేస్తారు? తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ కావాలి. వారిని ఎలా దత్తత చేసుకున్నారు? ఎలాగైతే మీరు ఈమె నా స్త్రీ అని అంటారు కదా. మరి ఆమెను మీదానిగా ఎలా చేసుకున్నారు? దత్తత చేసుకున్నారు కదా! నన్ను కూడా మాత-పిత అని అంటారు. నేను తండ్రిని, మరి నా స్త్రీని ఎక్కడ నుండి తేవాలి? కావున ఇతనిలో ప్రవేశించి ఇతడికి బ్రహ్మ అన్న పేరు పెడ్తాను. స్త్రీ అడాప్ట్‌ చేసుకోబడ్తుంది. ఏ విధంగా లౌకిక తండ్రి స్త్రీని దత్తత చేసుకొని కుఖవంశావళిని రచిస్తారో, అలా బాబా ఇతడిలో ప్రవేశించి ఇతడిని దత్తత చేసుకొని ఇతని ముఖము ద్వారా ముఖవంశావళిని రచించారు. మేము బ్రాహ్మణ, బ్రాహ్మణీలము అని మీరు అంటారు. ఇతని పేరే బ్రహ్మ. బ్రహ్మ ఎవరి కొడుకు? శివబాబా కొడుకు. ఇతనిని ఎవరు దత్తత తీసుకున్నారు? అనంతమైన తండ్రి. ఈ ఉదాహరణ చాలా బాగుంది కాని ఎవరి బుద్ధిలో కూర్చుని ఉంటుందో వారే అర్థం చేయించగలరు. బుద్ధిలో లేకపోతే వారికి అర్థం చేయించడం కూడా రానే రాదు. లౌకిక మరియు పారలౌకిక తండ్రులైతే ఉన్నారు కదా! వారు కూడా స్త్రీని దత్తు చేసుకొని ఆమెను ''నాది'' అని అంటారు. అలాగే వీరు కూడా ఇతనిలో పవేశించి దత్తత చేసుకుంటారు. నిరాకారుడినైన నేను ఇతని ఆధారము తీసుకోవలసి ఉంటుందని వారు స్వయం చెప్తారు. కావున పేరును కూడా మారుస్తాను. ఒకేసారి ఎంత మంది పేర్లను పెట్టగలరు? పేర్ల లిస్టు కూడా మీ వద్ద ఉండాలి. ప్రదర్శినీలో పేర్ల లిస్టును కూడా చూపించాలి. బాబా ఒకే సమయములో పేర్లు ఎలా పెట్టారో చూడండి! బాబా నన్ను తనవానిగా చేసుకున్నారు కనుక నా పేరును మార్చారు, వారిని భృగు ఋషి అని అంటారు. జన్మపత్రి అయితే భగవంతుని వద్దే ఉంది. అద్భుతమైన పేర్లు ఉన్నాయి. ఇప్పుడు అందరూ లేరు, కొందరు ఆశ్చర్యపడునట్లు పారిపోయారు. ఈ రోజు ఉంటారు, రేపు ఉండరు. కామమే మొట్టమొదటి శత్రువు. ఈ కామ వికారము చాలా విసిగిస్తుంది, దాని పై విజయం పొందాలి. గృహస్థ వ్యవహారములో కలిసి ఉంటూ దాని పై విజయం పొందడమే ప్రతిజ్ఞ. మీ వృత్తి(మనోభావాలను)ని గమనించాలి. కర్మేంద్రియాలతో వికర్మలు చేయరాదు. తుఫానులైతే అందరికీ వస్తాయి, అందులో భయపడరాదు.

''ఈ వ్యాపారం చెయ్యాలా, వద్దా?'' అని చాలా మంది పిల్లలు బాబాను అడుగుతారు. ''నేను మీ వ్యాపారాలు మొదలైనవి చూచేందుకు వచ్చానా?'' అని బాబా వ్రాస్తారు. నేను టీచరును, చదివించేందుకే ఉన్నాను. మరి ఈ వ్యాపార విషయాలను గూర్చి నన్నెందుకు అడుగుతారు?'' అని బాబా వ్రాస్తారు. ''నేను రాజయోగాన్ని నేర్పిస్తాను. రుద్ర యజ్ఞం అని కూడా గానం చేయబడింది. కృష్ణ యజ్ఞం లేదు, లక్ష్మీనారాయణులకు ఈ సృష్టి చక్ర జ్ఞానమే లేదు'' అని తండ్రి అంటారు. తాము 16 కళల నుండి 14 కళల వారిగా అవ్వాలని తెలిస్తే వెంటనే రాజ్య నషా ఎగిరిపోతుంది. అక్కడ సద్గతియే ఉంది. సద్గతిదాత అయితే ఒక్కరే. వారు వచ్చి యుక్తిని తెలియజేస్తారు, ఇతరులెవ్వరూ తెలియజేయలేరు. ''కామము మహాశత్రువు'' అని ఎవరు అన్నారు? అని మొట్టమొదట ఈ విషయాన్ని లేవనెత్తండి. వికారీ ప్రపంచం మరియు నిర్వికారీ ప్రపంచం అని కూడా గానం చేస్తారు. భారతదేశంలోనే రావణుడిని తగులబెడ్తూ ఉంటారు. అలా సత్యయుగంలోనైతే తగులబెట్టరు. అది అనాది అని అన్నట్లయితే మరి సత్యయుగంలో కూడా ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు అన్నిచోట్ల దు:ఖమే దు:ఖముంటుంది. మరి దానిని స్వర్గం అని ఎలా అనగలరు? ఈ విషయాలను అర్థం చేయించాలి. ప్రతి ఒక్కరి వేగం ఎవరిది వారిదే. ఎవరు మంచి వేగం గలవారో తెలిసిపోతుంది. సంపూర్ణులుగా అయితే ఎవ్వరూ అవ్వలేదు. పోతే సతో, రజో, తమోలైతే తప్పకుండా ఉంటాయి. ప్రతి ఒక్కరి బుద్ధి వేరు వేరుగా ఉంటుంది. ఎవరైతే శ్రీమతం పై నడవరో, వారు తమోప్రధాన బుద్ధి గలవారు. తమను తాము ఇన్సూరెన్సు(భీమా) చేసుకోకపోతే భవిష్య 21 జన్మల కొరకు ఎలా లభిస్తుంది? తప్పకుండా మరణించాల్సిందే. మరి ఎందుకు ఇన్‌ష్యూర్‌ చేసుకోరాదు? అంతా వారిదే. కనుక వారే పోషిస్తారు. భలే కొందరు సర్వస్వమూ ఇస్తారు కాని సేవ చేయకపోతే ఇచ్చిన దానిని తినేస్తూ ఉంటారు, మరి అలాంటప్పుడు జమ ఏమౌతుంది? ఏమీ జమ కాదు. సేవకు ప్రమాణం కావాలి. ఎవరెవరు మార్గదర్శులుగా అయ్యి వస్తారో గమనించబడ్తుంది. కొత్త బి.కెలు కూడా పరస్పరం సెంటర్‌ను నడుపుతూ ఉంటారు. వారికి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఈ జ్ఞానం అయితే చాలా సహజమైనది. వానప్రస్థములో ఉన్నవారి వద్దకు వెళ్లి అర్థం చేయించండి. వానప్రస్థ అవస్థ ఎప్పుడు ఉంటుందో అర్థం చేయించండి. తండ్రియే మార్గదర్శకులుగా అయ్యి అందరినీ తీసుకెళ్తారు. తండ్రియే మహాకాలుడని మీకు తెలుసు. మనమైతే సంతోషంగా బాబాతో కలిసి వెళ్లాలనుకుంటాము.

మొట్టమొదట గీతా భగవానుడు ఎవరు? గీతను రచించింది ఎవరు? ఈ ముఖ్యమైన విషయాన్ని తీసుకోండి. లక్ష్మీనారాయణులకు రాజయోగాన్ని ఎవరు నేర్పించారు? వారి రాజధాని కూడా స్థాపనవుతూ ఉంది. రాజధానిని స్థాపించేందుకు ఇంకెవ్వరూ రారు. తండ్రియే రాజధానిని స్థాపించేందుకు వస్తారు. పతితులందరినీ పావనంగా తయారు చేస్తారు. ఇది వికారీ ప్రపంచము, అది నిర్వికారీ ప్రపంచము. రెండింటిలోనూ నెంబరువారుగా పదవులుంటాయి. ఎవరైతే శ్రీమతమును అనుసరిస్తారో, వారి బుద్ధిలోనే ఈ విషయాలు కూర్చుంటాయి. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. బుద్ధి లైన్‌ సదా స్పష్టంగా ఉండేందుకు దేహీ-అభిమానులుగా ఉండాలి. సత్యమైన సంపాదనలో మాయ ఏ విధంగానూ నష్టపరచకుండా ఉండేందుకు స్వయాన్ని సంభాళించుకోవాలి.

2. కర్మేంద్రియాలతో ఎటువంటి వికర్మలు చేయరాదు. ఇన్‌ష్యూర్‌ చేసుకున్న తర్వాత సేవ కూడా తప్పకుండా చేయాలి.

వరదానము :-

''యోగమనే ఎండలో (సూర్యరశ్మిలో) కన్నీటి ట్యాంకును ఎండబెట్టి రోనాప్రూఫ్‌గా అయ్యే సుఖస్వరూప భవ''

చాలామంది పిల్లలు ఫలానా వారు దు:ఖమిస్తున్నారని, అందుకే ఏడ్పు వస్తుందని అంటారు. కాని వారు ఇస్తే మీరెందుకు తీసుకుంటారు? వారి పని ఇవ్వడం, మీరు తీసుకోకండి. పరమాత్ముని పిల్లలు ఎప్పుడూ ఏడ్వరు. ఏడ్పు సమాప్తం. కనుల ద్వారా ఏడ్వరాదు. మనసులో కూడా ఏడ్వరాదు. ఎక్కడైతే సంతోషముంటుందో అక్కడ ఏడ్పు ఉండదు. సంతోషము లేక ప్రేమ బాష్పాలను ఏడ్పు అని అనజాలరు. కనుక యోగమనే సూర్యరశ్మి(ఎండ)లో కన్నీటి ట్యాంకును ఎండబెట్టండి, విఘ్నాలను ఆటగా భావిస్తే సుఖస్వరూపులుగా అవుతారు.

స్లోగన్‌ :-

''సాక్షిగా ఉండి పాత్ర చేసే అభ్యాసముంటే టెన్షన్‌ లేకుండా స్వతహాగా అటెన్షన్‌లో ఉంటారు''