28-11-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - మనుష్యులను దేవతలుగా తయారుచేసే సేవ చేయాలని మీకు అత్యంత ఆసక్తి ఉండాలి. అయితే ఈ సేవ చేసేందుకు స్వయములో దృఢమైన ధారణ ఉండాలి''
ప్రశ్న :-
ఆత్మ మలినమైనదిగా ఎలా అవుతుంది? ఆత్మ పైన ఎలాంటి మురికి ఏర్పడ్తుంది ?
జవాబు :-
బంధు-మిత్రుల స్మృతి వలన ఆత్మ మలినమైపోతుంది. మొదటి నంబరు మాలిన్యము దేహాభిమానము. తర్వాత లోభము, మోహముల మాలిన్యము చేరడం ప్రారంభమవుతుంది. ఈ వికారాల మాలిన్యము ఆత్మ పై ఏర్పడ్తుంది. ఆ తర్వాత ఆత్మ తన తండ్రి స్మృతిని మర్చిపోతుంది. ఇక వారు సర్వీసు చేయలేరు.
పాట :-
మిమ్ములను పిలవాలని మనసు కోరుకుంటోంది,................(తుమ్హారే బులానే కో జీ చాహ్తా హై,..............) 
ఓంశాంతి.
ఈ పాట చాలా బాగుంది. మీ నుండి(జ్ఞానమును) విని, దానిని ఇతరులకు వినిపించాలని నా హృదయము కోరుకుంటోందని పిల్లలు గ్యారెంటీ కూడా ఇస్తారు. పిల్లలు స్మృతి చేస్తారు. ఇది అవసరము కూడా. కొందరు స్మృతి చేస్తూ ఉండవచ్చు. అంతే కాకుండా వారు మిలనము కూడా చేసి ఉండవచ్చు. కోటిలో కొందరు మాత్రమే వచ్చి ఈ వారసత్వాన్ని తీసుకుంటారని అనబడ్తుంది. ఇప్పుడైతే మీ బుద్ధి చాలా విశాలమైపోయింది. 5 వేల సంవత్సరాల క్రితము కూడా తప్పకుండా తండ్రి రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చి ఉంటారు. జ్ఞానాన్ని వినిపించిందెవరు? అనేది మొట్టమొదట అర్థము చేయించాలి. ఎందుకంటే ఈ విషయములోనే చాలా పెద్ద పొరపాటు జరిగింది. మనుష్యులు కేవలం ఇదే మర్చిపోయారు - సర్వ శాస్త్రాల మాత అయిన గీతను ఎవరు గానం చేశారు? మరియు దాని ద్వారా ఏ ధర్మస్థాపన జరిగింది అన్నది మనుష్యులు మర్చిపోయారు. పోతే ఓ భగవంతుడా! మీరు రండి అని తప్పకుండా పాడుతూ ఉంటారు. నూతన పావన ప్రపంచాన్ని రచించేందుకు భగవంతుడు తప్పకుండా వస్తారు. వారు ప్రపంచానికంతా తండ్రి కదా. భక్తులు గానము కూడా చేస్తారు - మీరు వచ్చారంటే సుఖము, శాంతి లభిస్తాయి. సుఖము మరియు శాంతి అనేవి రెండు గుణాలు. సత్యయుగములో తప్పకుండా సుఖము కూడా ఉంటుంది. ఆ సమయములో మిగిలిన ఆత్మలందరూ శాంతి దేశములో ఉంటారు. ఈ పరిచయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. నూతన ప్రపంచములో నూతన భారతదేశము, రామరాజ్యము ఉండేది. అక్కడ సుఖముండేది. అందుకే రామరాజ్యానికి మహిమ జరుగుతుంది. దానిని రామరాజ్యమని అన్నట్లయితే దీనిని రావణరాజ్యమని అనవలసి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా దు:ఖముంది. అక్కడ సుఖముంది. తండ్రి వచ్చి సుఖమునిస్తారు. మిగిలిన వారికి శాంతిధామములో శాంతి లభిస్తుంది. సుఖ-శాంతుల దాత అయితే తండ్రియే కదా. ఇక్కడ అశాంతి, దు:ఖము ఉంది. కనుక బుద్ధిలో ఈ జ్ఞానము మెదులుతూ ఉండాలి. దీనికి చాలా మంచి స్థితి అవసరము. ఇలా చిన్న పిల్లలకు కూడా నేర్పించబడ్తుంది. కాని వారు అర్థము చేయించలేరు. అందుకు అణువణువునా(దృఢమైన) ధారణ అవసరము. ఎవరైనా ప్రశ్నిస్తే అర్థము చేయించగలగాలి కూడా. మంచి స్థితి అవసరము. లేనట్లయితే ఒకసారి దేహాభిమానములో, ఒకసారి క్రోధ, మోహాలలో పడిపోతూ ఉంటారు. బాబా, మేము ఈ రోజు క్రోధములో, ఈ రోజు లోభములో పడిపోయామని వ్రాస్తూ ఉంటారు. స్థితి శక్తిశాలిగా అయినప్పుడు పడిపోయే మాటే ఉండదు. మనుష్యులను దేవతలుగా తయారుచేసే సేవ చేయాలని చాలా ఆసక్తి ఉంటుంది. పాట కూడా చాలా బాగుంది - బాబా, మీరు వచ్చారంటే మేము చాలా సుఖవంతులుగా అవుతాము. తండ్రి అయితే తప్పకుండా రావలసి ఉంటుంది. లేకుంటే పతిత సృష్టిని పావనంగా ఎవరు తయారుచేస్తారు. కృష్ణుడైతే దేహధారి. వారి పేరు గాని, బ్రహ్మ-విష్ణు-శంకరుల పేరు గాని చెప్పుటకు వీలు లేదు. పతితపావనా! రండి అని పాడుతూ కూడా ఉంటారు. ఇది మీరు ఎవరి గురించి పాడుతున్నారు? అని వారిని అడగండి. పతితపావనుడు ఎవరు? మరియు వారు ఎప్పుడు వస్తారు? అని అడగండి. పతితపావనులు వారే. వారిని పిలుస్తున్నారంటే తప్పకుండా ఇది పతిత ప్రపంచమే కదా. పావన ప్రపంచమని సత్యయుగాన్ని అంటారు. పతిత ప్రపంచాన్ని పావనంగా ఎవరు తయారుచేస్తారు? భగవంతుడే రాజయోగాన్ని నేర్పించారు మరియు ఈ వికారాల పై కూడా విజయాన్ని ప్రాప్తి చేయించారని గీతలో కూడా ఉంది. కామము మహాశత్రువు అని గీతలో కూడా ఉంది. నేను రాజయోగాన్ని నేర్పిస్తాను. కామము మహాశత్రువని ఎవరన్నారు? నేను సర్వవ్యాపినని ఎవరు చెప్పారు? ఏ శాస్త్రములో లిఖింపబడి ఉంది? పతితపావనా అని ఎవరి గురించి అంటారు? పతితపావని గంగయా లేక ఇంకెవరైనా ఉన్నారా? అని అడగాలి. పతితపావనా రండి అని గాంధీజీ కూడా పిలిచేవారు. గంగా నది అయితే సదా ఉండనే ఉంది. అదేమీ కొత్త కాదు. గంగానదిని అవినాశి అని అంటారు. కాని కేవలం తమోగుణి తత్వంగా తయారైనప్పుడు దానిలో చంచలత్వము వచ్చేస్తుంది, వరదలు వచ్చేస్తాయి. తన మార్గాన్ని వదిలేస్తుంది. సత్యయుగములో అన్నీ నియమానుసారము రెగ్యులర్గా నడుస్తాయి. వర్షాలు మొదలైనవి కూడా అధికంగా, అల్పంగా కురవవు. అక్కడ దు:ఖమనే మాటే లేదు. పతితపావనుడు మా తండ్రియేనని సదా బుద్ధిలో ఉండాలి. పతితపావనుని స్మృతి చేసినప్పుడు ఓ భగవంతుడా! ఓ తండ్రీ! అని అంటారు. ఇలా ఎవరన్నారు? - ఆత్మ. పతితపావనుడైన శివబాబా వచ్చారని మీకు తెలుసు. నిరాకారుడనే పదము తప్పకుండా వ్రాయాలి. లేకుంటే సాకారుడని భావిస్తారు. ఆత్మ పతితంగా అయిపోయింది. అందరూ ఈశ్వరులే అని అనలేము. అహమ్ బ్రహ్మస్మి అని అనడం లేక శివోహమ్ అని అనడం రెండూ ఒక్కటే. కాని రచనకు అధిపతి ఒకే రచయితయే. భలే మనుష్యులు ఎంతో విస్తారమైన అర్థము చెప్తారు. మనది ఒక్క సెకండులోని విషయమే. సెకండులో తండ్రి ఆస్తి లభిస్తుంది. స్వర్గ సామ్రాజ్యమే తండ్రి ఇచ్చే వారసత్వము. దానిని జీవన్ముక్తి అని అంటారు. ఇది జీవన బంధనము. ఎప్పుడైతే మీరు వస్తారో అప్పుడు మాకు తప్పకుండా స్వర్గము, ముక్తి-జీవన్ముక్తుల వారసత్వమునిస్తారు. అందువల్లనే ముక్తి-జీవన్ముక్తుల దాత ఒక్కరేనని వ్రాస్తారని కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. సత్యయుగములో ఒకే ఆదిసనాతన దేవీదేవతా ధర్మము ఉంటుంది. అక్కడ దు:ఖమనే మాటే ఉండదు. అది సుఖధామము. సూర్యవంశ రాజ్యము నడుస్తుంది. తర్వాత త్రేతా యుగములో చంద్రవంశీ రాజ్యము. మళ్లీ ద్వాపరములో ఇస్లామీలు, బౌద్ధులు మొదలైనవారు వస్తారు. పూర్తి పాత్ర అంతా నిర్ణయమై ఉంది. బిందువైన ఆత్మ మరియు పరమాత్మలో ఎంత పాత్ర నిండి ఉంది! శివుని చిత్రములో కూడా స్పష్టంగా నేను నక్షత్ర సమానంగా ఉన్నాను, జ్యోతిర్లింగమంత పెద్దగా లేను అని వ్రాయాలి. ఆత్మ కూడా నక్షత్రము వంటిదే. భృకుటి మధ్యలో ఒక అద్భుతమైన నక్షత్రము మెరుస్తూ ఉందని పాడతారు కూడా. కనుక అది ఆత్మయే. నేను కూడా పరమపిత పరమ ఆత్మను. కాని నేను సుప్రీమ్ సోల్, పతితపావనుడను. నా గుణాలు వేరే. కావున గుణాలన్నింటిని కూడా వ్రాయాల్సి ఉంటుంది. ఒకవైపు శివుని మహిమ, మరొకవైపు శ్రీ కృష్ణుని మహిమ వ్రాయాలి. వీరిద్దరి వ్యత్యాసాన్ని స్పష్టమైన శబ్ధాలలో వ్రాయవలసి ఉంటుంది. వాటిని మనుష్యులు చదివి బాగా అర్థము చేసుకోగలగాలి. స్వర్గము మరియు నరకము. సుఖము - దు:ఖము. కృష్ణుని పగలు మరియు రాత్రి అనండి, బ్రహ్మదైనా అనండి. సుఖ-దు:ఖాలు ఎలా నడుస్తాయో మీకు తెలుసు. సూర్య వంశములో 16 కళలు ఉంటాయి. చంద్ర్రవంశములో 14 కళలు. వారు సంపూర్ణ సతోప్రధానులు, వీరు(చంద్రవంశీయులు) సతో. సూర్యవంశీయులే మరలా చంద్రవంశీయులుగా అవుతారు. సూర్య వంశీయులు మళ్లీ త్రేతా యుగములోకి వచ్చినప్పుడు తప్పకుండా చంద్రవంశీ కులములో జన్మ తీసుకుంటారు. భలే రాజ్యపదవిని పొందుతారు. ఈ విషయాలన్నీ బుద్ధిలో బాగా కూర్చోబెట్టాలి. ఎవరు ఎంత స్మృతిలో ఉంటారో, ఎంత ఆత్మాభిమానులుగా అవుతారో అంత ధారణ అవుతుంది. వారు సర్వీసు కూడా బాగా చేస్తారు. మేము ఇలా కూర్చుంటాము, ఇలా ధారణ చేస్తాము, ఇలా అర్థము చేయిస్తాము, ఇలా విచార సాగర మథనము చేస్తామని స్పష్టము చేసి ఇతరులకు వినిపిస్తారు. పూర్తి సమయమంతా విచార సాగర మథనము నడుస్తూ ఉంటుంది. ఎవరిలో జ్ఞానము లేదో వారి మాట వేరు. ధారణ కూడా జరగదు. ధారణ జరిగినట్లయితే సర్వీసు చేయాలి కదా. ఇప్పుడైతే సర్వీసు చాలా వృద్ధి చెందుతూ వెళ్తోంది. రోజురోజుకు మహిమ కూడా పెరుగుతూ ఉంటుంది. మీ ప్రదర్శినీలలో కూడా ఎంతోమంది వస్తారు. ఎన్నో చిత్రాలను తయారుచేయవలసి ఉంటుంది. చాలా పెద్ద మండపాన్ని తయారుచేయాల్సి ఉంటుంది. ఇందులో అర్థము చేయించేందుకు ఏకాంతము అవసరము. మన ముఖ్యమైన చిత్రాలు - కల్పవృక్షము, సృష్టిచక్రము మరియు లక్ష్మీనారాయణుల చిత్రాలు. రాధాకృష్ణుల చిత్రము ద్వారా వీరు ఎవరు అని అంత బాగా అర్థము చేసుకోలేరు. ఇప్పుడు మనలను తండ్రి ఎంత పావనంగా చేస్తున్నారో మీకు తెలుసు. అందరూ ఒకే విధంగా సంపూర్ణులు అవ్వలేరు. ఆత్మ పవిత్రంగా అవుతుంది. కాని అందరూ జ్ఞాన ధారణ చేయలేరు. ధారణ అవ్వలేదంటే తక్కువ పదవిని పొందుకుంటారని అర్థము చేసుకోవడం జరుగుతుంది.
ఇప్పుడు మీ బుద్ధి ఎంతో తీక్షణమైపోయింది. ప్రతి క్లాసులో నంబరువారుగా ఉండనేే ఉంటారు. కొందరు తీక్షణంగా(చురుకుగా), కొందరు ఢీీలాగా ఉంటారు. ఒకవేళ ఎవరైనా మంచి వ్యక్తికి థర్డ్(తృతీయ) గ్రేడ్లో ఉన్నవారు, అర్థము చేయించేవారు లభిస్తే అసలు ఇక్కడ ఏమీ లేదని వారు భావిస్తారు. కనుక మంచి వ్యక్తులకు అర్థం చేయించేవారు కూడా మంచిగా ఉండాలని పురుషార్థము చేయబడ్తుంది. అందరూ ఒకే విధంగా అయితే పాస్ అవ్వలేరు. బాబా వద్ద పరిమితి ఉంది. కల్ప-కల్పము ఈ చదువుకు ఫలితము కూడా వెలువడ్తుంది. ముఖ్యంగా 8 మంది పాసవుతారు. తర్వాత 100, తర్వాత 16000, తర్వాత ప్రజలు. వారిలో కూడా ధనవంతులు, పేదవారు అందరూ ఉంటారు. ఈ సమయములో వీరు ఎలాంటి పురుషార్థములో ఉన్నారో, ఏ పదవిని పొందేందుకు యోగ్యులుగా ఉన్నారో అర్థము చేసుకోబడ్తుంది. టీచరుకు తెలుస్తుంది. టీచర్లలో కూడా నంబరువారుగా ఉంటారు. కొందరు టీచర్లు బాగా ఉంటారు. వీరు బాగా చదివిస్తారని ప్రీతి కూడా బాగా చూపుతారని, అందరూ సంతోషిస్తారు. చిన్న సెంటరును పెద్ద టీచరే పెద్దగా తయారు చేయగలరు కదా. బుద్ధి ద్వారా ఎంతో పని చేయవలసి ఉంటుంది. జ్ఞాన మార్గములో అతిమధురంగా తయారవ్వాలి. ఎప్పుడైతే మధురమైన తండ్రి జతలో పూర్తి యోగముంటుందో అప్పుడు మధురంగా అవుతారు, ధారణ కూడా జరుగుతుంది. ఇలాంటి మధురమైన బాబాతో చాలామందికి యోగము లేదు. గృహస్థ వ్యవహారములో ఉంటూ తండ్రితో పూర్తి యోగము జోడించాలని అర్థమే చేసుకోరు. మాయా తుఫానులైతే రానే వస్తాయి. కొందరికి పాత బంధుమిత్రులు గుర్తుకొస్తారు. మరి కొందరు ఇంకేెవరినో స్మృతి చేస్తూ ఉంటారు. కనుక బంధు-మిత్రులు మొదలైనవారి స్మృతి ఆత్మను మలినంగా చేసేస్తుంది. చెత్త చేరినందున గాభరాపడ్తారు. ఇందులో గాభరా పడరాదు, భయపడరాదు. ఇది మాయ చేస్తుంది. మన పైననే మురికి చెత్త పడ్తుంది. హోలీలో(మంటలో) చెత్త పడ్తుంది కదా. మనం బాబా స్మృతిలో ఉన్నట్లయితే ఈ మలినము ఉండదు. బాబాను మర్చిపోతే దేహాభిమానమనే మొదటి నెంబరు చెత్త పడ్తుంది. తర్వాత లోభ-మోహాలు మొదలైనవన్నీ వచ్చేస్తాయి. మీ కొరకు మీరు శ్రమపడాలి. సంపాదన చేసుకోవాలి అంతేకాక మీ సమానంగా తయారుచేసే శ్రమ చేయాలి. సెంటర్లలో సర్వీసు బాగా జరుగుతుంది. మేము వెళ్ళి ఏర్పాట్లు చేస్తాము, సెంటరు తెరుస్తామని ఇక్కడకు వచ్చినప్పుడు చెప్తారు. ఇక్కడ నుండి వెళ్లాక సమాప్తమైపోతుంది. మీరందరూ ఈ మాటలన్నీ మర్చిపోతారని బాబా కూడా స్వయంగా చెప్తారు. అర్థము చేయించేందుకు యోగ్యులుగా అయ్యేంతవరకు భట్టీలో ఉండవలసి వస్తుంది. శివబాబాకైతే అందరితో మధురమైన సంబంధముంది కదా. ఏ విధమైన సర్వీసు చేస్తారో అర్థము చేసుకోగలరు. స్థూలమైన సర్వీసుకు ప్రతిఫలము తప్పకుండా లభిస్తుంది. అత్యంత తీవ్రమైన సర్వీసు చేస్తారు. కాని సబ్జెక్టులైతే ఉన్నాయి కదా. ఆ చదువులో కూడా సబ్జెక్టులు ఉంటాయి. ఈ ఆత్మిక చదువులో కూడా సబ్జెక్టులున్నాయి. మొదటి నెంబరు సబ్జెక్టు స్మృతి. తర్వాత జ్ఞానము. మిగిలినదంతా గుప్తము. ఈ డ్రామాను కూడా అర్థము చేసుకోవలసి ఉంటుంది. ప్రతి యుగము 1250 సంవత్సరాలు ఉంటుందని కూడా ఎవ్వరికీ తెలియదు. సత్యయుగము ఎంత సమయము ఉండేది. అక్కడ ఏ ధర్మము ఉండేది? అందరికన్నా ఎక్కువ జన్మలు ఇక్కడ ఎవరికి ఉండాలి? బౌద్ధులు, ఇస్లామీలు మొదలైనవారు ఇన్ని జన్మలు తీసుకోరు. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. మీరు భగవానువాచ అని ఎవరిని అంటారు? అని శాస్త్రవాదులను అడగాలి. సర్వశాస్త్రమయి శిరోమణి గీతయే. భారతదేశములో మొట్టమొదట దేవీదేవతా ధర్మముండేది. దాని శాస్త్రము ఏది? గీతను ఎవరు గానము చేశారు? అని శాస్త్రవాదులను ప్రశ్నించాలి. కృష్ణ భగవానువాచ అయితే ఉండజాలదు. స్థాపన మరియు వినాశనము చేయించు కర్తవ్యము భగవంతునిదే. కృష్ణుని భగవంతుడని అనరు. మరి వారెప్పుడు వచ్చారు? ఇప్పుడు ఏ రూపములో ఉన్నారు? శివబాబా మరియు కృష్ణుని మహిమల వ్యత్యాసాన్ని తప్పకుండా వ్రాయాల్సి ఉంటుంది. శివుడు గీతా భగవానుడు. వారి ద్వారా శ్రీకృష్ణునికి పదవి లభించింది. కృష్ణుని 84 జన్మలు కూడా చూపిస్తారు. చివర్లో బ్రహ్మ దత్తత తీసుకోబడ్డ చిత్రమును కూడా చూపాల్సి ఉంటుంది. మన బుద్ధిలో 84 జన్మల మాల ఉంది. లక్ష్మీనారాయణుల 84 జన్మలు కూడా తప్పకుండా చూపాల్సి ఉంటుంది. రాత్రి సమయములో విచార సాగర మథనము చేసి ఆలోచించాల్సి ఉంటుంది. సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది. దీని కొరకు మనము ఏం వ్రాయాలి? జీవన్ముక్తి అంటే స్వర్గములోకి వెళ్లడము. అది కూడా స్వర్గ రచయిత అయిన తండ్రి వచ్చి, వారి పిల్లలుగా అయినప్పుడే స్వర్గాధిపతులుగా అవ్వగలరు. సత్యయుగము పుణ్యాత్మల ప్రపంచము. ఈ కలియుగము పాపాత్మల ప్రపంచము. అది నిర్వికారి ప్రపంచము. అక్కడ మాయా రావణుని రాజ్యమే ఉండదు. భలే అక్కడ ఈ జ్ఞానమంతా లేకపోయినా నేను ఆత్మను, ఈ శరీరము ముసలిదైపోయింది, దీనిని ఇప్పుడు వదలాలి............ అన్న ఆలోచన అయితే ఉంటుంది కదా. ఇక్కడైతే ఆత్మ జ్ఞానము కూడా ఎవ్వరిలోనూ లేదు. తండ్రి ద్వారా జీవన్ముక్తి వారసత్వంగా లభిస్తుంది. కనుక స్మృతి కూడా వారినే చేయాలి కదా. తండ్రి మన్మనాభవ అని ఆజ్ఞాపిస్తున్నారు. గీతలో మన్మనాభవ అని ఎవరు అన్నారు? నన్ను స్మృతి చేయండి మరియు విష్ణుపురిని స్మృతి చేయండి అని ఎవరు అనగలరు? కృష్ణుడినైతే పతితపావనుడని అనలేరు. 84 జన్మల రహస్యము కూడా ఎవ్వరికీ తెలియదు. కనుక మీరు అందరికీ అర్థము చేయించాలి. మీరు ఈ విషయాలను అర్థము చేసుకొని స్వ మరియు సర్వుల కళ్యాణము చేస్తూ ఉంటే మీకు చాలా గౌరవము లభిస్తుంది. నిర్భయులై అన్నివైపులా తిరుగుతూ ఉండండి. మీరు చాలా గుప్తమైనవారు. భలే డ్రస్ మార్చుకొని కూడా సర్వీసు చేయండి. చిత్రాలు సదా మీ వద్ద ఉండాలి. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మధురమైన తండ్రితో పూర్తి యోగమును జోడించి అతిమధురంగా మరియు దేహీ- అభిమానులుగా(ఆత్మాభిమానులుగా) అవ్వాలి. విచార సాగర మథనము చేసి మొదట స్వయంలో ధారణ చేయాలి, తర్వాత ఇతరులకు అర్థము చేయించాలి.
2. మీ స్థితిని శక్తిశాలిగా చేసుకోవాలి. నిర్భయులుగా అవ్వాలి. మనుష్యులను దేవతలుగా తయారుచేసే సర్వీసు చేయాలనే ఆసక్తి ఉంచుకోవాలి.
వరదానము :-
''స్వరాజ్య సత్తా ద్వారా విశ్వరాజ్య సత్తాను ప్రాప్తి చేసుకునే మాస్టర్ సర్వశక్తివాన్ భవ''
ఎవరైతే ఈ సమయంలో స్వరాజ్య సత్తాధారి అనగా కర్మేంద్రియాజీత్గా ఉన్నారో వారే విశ్వరాజ్య సత్తాను ప్రాప్తి చేసుకుంటారు. స్వరాజ్య అధికారులే విశ్వరాజ్య అధికారులుగా అవుతారు. కనుక ఆత్మకు గల మూడు శక్తులైన మనసు, బుద్ధి, సంస్కారాలకు అధికారిగా ఉన్నానా? మనసు నన్ను నడిపిస్తోందా లేక నేను మనసును నడిపిస్తున్నానా? నా సంస్కారము ఎప్పుడైనా నన్ను తన వైపు ఆకర్షించుట లేదు కదా? అని చెక్ చేసుకోండి. స్వరాజ్య అధికారి స్థితి సదా మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి. ఏ శక్తి తక్కువగా ఉండదు.
స్లోగన్ :-
''అన్ని ఖజానాల తాళంచెవి అయిన 'నా బాబా' జతలో ఉంటే ఏ ఆకర్షణా ఆకర్షించలేదు.''