13-11-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - పగటి పూట శరీర నిర్వహణార్థము కర్మలు చేయండి, రాత్రి కూర్చొని జ్ఞాన స్మరణ చేయండి, తండ్రిని స్మృతి చేయండి, బుద్ధిలో స్వదర్శన చక్రాన్ని త్రిప్పండి అప్పుడు నషా ఎక్కుతుంది ''
ప్రశ్న :-
మాయ ఎలాంటి పిల్లలను తలంపులో కూర్చునే కూర్చోనివ్వదు ?
జవాబు :-
ఎవరి బుద్ధి అయితే ఎవరో ఒకరిలో చిక్కుకొని ఉంటుందో, ఎవరి బుద్ధికైతే తాళము వేయబడి ఉంటుందో, ఎవరైతే చదువును బాగా చదవరో, అటువంటివారిని మాయ స్మృతిలో కూర్చొనివ్వదు. వారు మన్మనాభవ స్థితిలో ఉండలేరు. తర్వాత సర్వీసు గురించి కూడా వారి బుద్ధి నడవదు. శ్రీమతమును అనుసరించనందున చెడ్డ పేరు తీసుకొస్తారు. మోసం చేస్తారు కనుక శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది.
పాట :-
నిన్ను పిలవాలని నా మనసు కోరుకుంటోంది,........ (తుమ్హారే బులానే కో జీ చాహతా హై.......... ) 
ఓంశాంతి.
పిల్లలు పాట విన్నారు. గాడ్ ఫాదర్నే(తండ్రినే) పిలుస్తారు, కృష్ణుని కాదు. ''రండి, మళ్లీ కంసపురిని పరివర్తన చేసి కృష్ణపురిగా చేయమని తండ్రిని పిలుస్తారు. కృష్ణుని ఇలా పిలువరు. కృష్ణపురిని స్వర్గమని అంటారు. అయితే ఇది ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే కృష్ణుని ద్వాపర యుగములోకి తీసుకెళ్ళారు. ఈ తప్పులన్నీ శాస్త్రాల వల్లనే జరిగాయి. ఇప్పుడు తండ్రి యధార్థమైన విషయము అర్థము చేయిస్తున్నారు. వాస్తవంగా పూర్తి ప్రపంచానికి వారు పెద్ద గాడ్ఫాదర్. అందరూ ఆ ఒక్క భగవంతుడినే స్మృతి చేయాలి. భలే మానవులు ఏసుక్రీస్తును, బుద్ధుడిని లేక దేవతలు మొదలైనవారిని స్మృతి చేస్తారు. ప్రతి ధర్మము వారు తమ తమ ధర్మస్థాపకులను స్మృతి చేస్తారు. ద్వాపరము నుండి స్మృతి చేయడము ప్రారంభమయ్యింది. దు:ఖములో అందరూ స్మృతి చేస్తారు. సుఖములో ఎవ్వరూ స్మృతి చేయరని భారతదేశములో గాయనము చేయబడింది. ఆ తర్వాతనే స్మృతి చేసే పద్ధతి కూడా ప్రారంభమవుతుంది. ఎందుకంటే అందరూ దు:ఖములో ఉన్నారు. మొట్టమొదట భారతవాసులే స్మృతి చేయడం ప్రారంభించారు. వారిని చూస్తూ ఇతర ధర్మస్థులు కూడా వారి ధర్మ స్థాపకులను తలంపు చేయడము ప్రారంభించారు. తండ్రి కూడా ధర్మస్థాపన చేసేవారెే. కాని మానవులు తండ్రిని మరచి శ్రీకృష్ణుని పేరు వేసేశారు. వారికి లక్ష్మీనారాయణులు ఏ ధర్మానికి చెందిన వారో, వారి ధర్మమును గురించి తెలియదు. లక్ష్మీనారాయణులను గాని, కృష్ణుని గాని స్మృతి చేయరాదు. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. వారే ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. ఎప్పుడైతే మళ్లీ భక్తిమార్గములో శివుని పూజ చేస్తారో అప్పుడు గీతా భగవానుడు కృష్ణుడని భావించి వారిని స్మృతి చేస్తారు. వారిని చూసి వీరు కూడా వారి ధర్మ స్థాపకులను స్మృతి చేస్తారు. ఈ దేవతా ధర్మాన్ని భగవంతుడు స్థాపన చేశారని మర్చిపోతారు. గీతా సెర్మనైజర్(గీతా భగవంతుడు) కృష్ణుడు కాదు, శివుడు అని మనము వ్రాయవచ్చు. వారు నిరాకారులు. ఇది అద్భుతమైన విషయము కదా! ఎవరి వద్ద కూడా శివబాబా పరిచయము లేదు. వారు నక్షత్ర సమానమైనవారు. అన్ని స్థలాలలో శివుని మందిరము ఉంటుంది. వారు ఇంత పెద్ద అఖండ జ్యోతితత్వమని భావిస్తారు. కాని వారు మహాతత్వములో ఉంటారు. అక్కడ ఆత్మలు కూడా ఉంటాయి. ఆత్మ రూపము సరిగ్గా నక్షత్రము వలె ఉంటుంది. పరమపిత పరమాత్మ కూడా నక్షత్రము వలె ఉంటారు. కాని వారు జ్ఞానసాగరులు, బీజరూపుడైన కారణంగా వారిలో శక్తి ఉంది. ఆత్మల తండ్రి(బీజము) అని పరమాత్మనే అంటారు. వారు నిరాకారులు. మనుష్యులను జ్ఞానసాగరులు, ప్రేమసాగరులు అని అనలేరు. కావున అర్థము చేయించే పిల్లలలో శక్తి(అథారిటి) ఉండాలి, వారి బుద్ధి విశాలంగా ఉండాలి. మీ అందరిలో ముఖ్యమైనవారు మమ్మా. వందేమాతరమ్ అని కూడా గాయనముంది. కన్యల ద్వారా బాణము వేయించారు. అధర్ కన్య, కుమారీ కన్యల(ఈ రెండు పేర్లు కలిగిన మూర్తులు, మందిరాలు మౌంట్ ఆబూలో ఉన్నాయి) రహస్యము ఎక్కడా లేదు. కేవలం మందిరము ద్వారానే నిరూపించబడ్తుంది. జగదంబ అనే పేరు కూడా తప్పకుండా ఉంది. కాని వారు ఎవరో ఎవ్వరికీ తెలియదు.
తండ్రి చెప్తున్నారు - నేను బ్రహ్మ ముఖ కమలము ద్వారా రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల రహస్యాన్ని తెలియజేస్తున్నాను. డ్రామాలో ఏముందో మానవుల బుద్ధిలోకి రావాలి. ఇది అనంతమైన డ్రామా. ఇందులో మనము అనంతమైన పాత్రధారులము. కనుక డ్రామా ఆదిమధ్యాంతాల రహస్యము బుద్ధిలో ఉండాలి. ఎవరి బుద్ధిలో ఇది ఉంటుందో వారికి చాలా నషా ఉంటుంది. పూర్తి రోజంతా శరీర నిర్వహణార్థము కర్మలు చేసి రాత్రి కూర్చొని స్మృతి చేయండి. ఈ డ్రామా చక్రము ఏ విధంగా తిరుగుతూ ఉందో స్మృతిలోకి రావాలి. ఇదే 'మన్మనాభవ.' కాని మాయ రాత్రి కూడా కూర్చోనివ్వదు. పాత్రధారుల బుద్ధిలో అయితే డ్రామా రహస్యముండాలి కదా. కాని చాలా కష్టము. ఎవరిలోనైనా బుద్ధి చిక్కుకున్నప్పుడు బాబా బుద్ధి తాళాన్ని మూసేస్తారు. ఇది చాలా పెద్ద లక్ష్యము. బాగా చదివినవారు జీతము కూడా ఎక్కువగా తీసుకుంటారు కదా. ఇది చదువు. కాని బయటకు వెళ్లిపోగానే మర్చిపోతారు. మళ్లీ వారి మతమునే అనుసరిస్తారు. తండ్రి అంటారు - మధురమైన పిల్లలారా! శ్రీమతమును ఆనుసరించడంలోనే మీకు కళ్యాణముంది. ఇది పతిత ప్రపంచము. వికారాలను విషము అని అంటారు. దీనిని సన్యాసులు సన్యసిస్తారు. ఈ రావణ రాజ్యము ద్వాపర యుగము నుండి ప్రారంభమౌతుంది. ఈ వేదశాస్త్రాలన్నీ భక్తిమార్గపు సామగ్రి. సర్వీసు కొరకు పిల్లల బుద్ధి నడవాలి. శ్రీమతమును అనుసరిస్తే ధారణ కూడా జరుగుతుంది. వినాశనము ఎదురుగా నిలబడి ఉందని పిల్లలకు తెలుసు. దు:ఖితులు విలపిస్తారు ఓ భగవంతుడా! దయ చూపండి, త్రాహి - త్రాహి అని ఈ సమయములో భగవంతుని స్మరణ చేస్తారు. విభజన సమయములో(భారతదేశము, పాకిస్తాన్ విడిపోయినప్పుడు) '' ఓ భగవంతుడా! మా పై దయ చూపండి, రక్షించండి'' అని ఎంతగా స్మృతి చేసేవారు! ఇప్పుడు ఏమి రక్షణ చేస్తారు? ఎవరు రక్షణ చేస్తారో, వారి గురించే తెలియకుంటే ఏం రక్షణ చేయగలరు? ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారని చాలా కష్టము మీద ఏ కొద్దిమంది బుద్ధిలోనో కూర్చుంటుంది. ఇలా ఇలా సర్వీసు చేయండని బాబా అర్థము చేయిస్తారు. ఈ శ్రీమతము తండ్రి నుండే లభిస్తుంది. ఇలాంటి తండ్రిని తెలుసుకోలేదంటే ఇది కూడా ఎంతో విచిత్రము కదా! ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. పూర్తి రోజంతా శివబాబా స్మృతి బుద్ధిలో ఉండాలి. ఇతడు వారి రథము. సాథీ అయినాడు కదా.
పిల్లలు ఈ రోజు చాలా నిశ్చయబుద్ధి కలిగి ఉంటారు. రేపు సంశయబుద్ధి గలవారైపోతారు అని తండ్రి గమనిస్తున్నారు. మాయా తుఫానులు తగలడంతో స్థితి దిగజారిపోతుంది. ఇందులో తండ్రి ఏం చేయగలరు? మీరు జ్ఞానములోకి వచ్చారు, సమర్పితులైనారు అంటే మీరు నిమిత్తులు కదా. మీరెందుకు చింత చేస్తారు? సమర్పణ చేశారన్న తర్వాత సర్వీసు కూడా చేయాలి. అప్పుడే ప్రతిఫలము లభిస్తుంది. సమర్పితులైన తర్వాత సర్వీసు చేయకున్నా వారికి తినిపించవలసి వస్తుంది కదా. కనుక ఆ ధనముతోనే తింటూ, తింటూ తమదంతా సమాప్తము చేసేసుకుంటారు. సర్వీసు చేయరు. మీరు మనుష్యులను వజ్ర సమానంగా తయారు చేసే సర్వీసు చేయాలి. మనుష్యులను వజ్ర తుల్యంగా చేసే సేవ చేయండి. మఖ్యంగా బాబా ఆత్మిక సర్వీసు చేయాలి. సర్వీసు చేయలేదంటే వెళ్లి దాస-దాసీలుగా అవుతారు. ఎవరైతే బాగా చదువుకుంటారో, వారికి మంచి గౌరవముంటుంది. ఎవరైతే పాస్ అవ్వరో, వారు వెళ్లి దాస-దాసీలుగా అవుతారు.
పిల్లలారా, నన్ను స్మృతి చేయండి, వారసత్వాన్ని తీసుకోండని బాబా చెప్తున్నారు. ఈ మన్మనాభవ అను పదమే కరెక్టు. జ్ఞానసాగరులు చెప్తున్నారు - నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమౌతాయి. ఇలా కృష్ణుడు చెప్పలేడు. తండ్రియే చెప్తున్నారు - నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, భవిష్య రాజ్యపదవిని కూడా స్మృతి చేయండి. ఇది రాజయోగము కదా. దాని ద్వారా ప్రవృత్తి మార్గము ఋజువౌతుంది. ఇది మీరే అర్థము చేయించగలరు. మీలో కూడా ఎవరైతే సర్వీసు యోగ్యులుగా, చురుకుగా ఉంటారో వారినే పిలవడం జరుగుతుంది. వీరు తెలివైనవారని భావించబడ్తుంది. పిల్లలు యోగయ్తుంగా అవ్వాలి. శ్రీమతమును అనుసరించలేదంటే చెడ్డ పేరు తీసుకొస్తారు. మోసము చేశారంటే తర్వాత శిక్షలు తినవలసి ఉంటుంది. ట్రిబ్యునల్ కూడా కూర్చుంటుంది కదా. అచ్ఛా!
రాత్రి క్లాసు :-
పిల్లలు మొట్టమొదట తండ్రి పరిచయమును ఇవ్వాలి. అనంతమైన తండ్రే మనలను చదివిస్తున్నారు. గీతను చదివేవారు కృష్ణుని భగవంతుడని అనేస్తారు, భగవంతుడంటే నిరాకారుడని వారికి అర్థము చేయించాలి. దేహధారులైతే చాలామంది ఉన్నారు. దేహము లేనివారు ఒక్కరే. వారు శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన శివబాబా. దీనిని బాగా బుద్ధిలో కూర్చోబెట్టాలి. బేహద్ తండ్రి నుండి బేహద్ వారసత్వము లభిస్తుంది. వారే ఉన్నతాతి ఉన్నతమైన నిరాకార పరమపిత పరమాత్మ. వారు అనంతమైన తండ్రి. ఇతడు(బ్రహ్మాబాబా) హద్దులోని తండ్రి. ఇతరులెవ్వరూ 21 జన్మల ఆస్తినివ్వలేరు. అలాగే అమర పదవిని ప్రాప్తింపజేసే తండ్రి కూడా ఎవ్వరూ లేరు. సత్యయుగము అమరలోకము. ఇది మృత్యులోకము. కనుక తండ్రి పరిచయమును ఇవ్వడం ద్వారా తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. దానినే దైవీ స్వరాజ్యమని అంటారు. దానిని తండ్రే ఇస్తారు. వారినే పతితపావనులని మహిమ చేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేస్తే పాపాలు కట్ అయిపోతాయని వారు చెప్తున్నారు. పతితుల నుండి పావనులుగా అయ్యి పావన ప్రపంచానికి వెళ్లేందుకు యోగ్యులైపోతారు. కల్ప-కల్పము సదా నన్ను స్మృతి చేయండని తండ్రి చెప్తారు. స్మృతియాత్రతోనే పవిత్రులుగా అవ్వాలి. ఇప్పుడు పావన ప్రపంచము రాబోతోంది. పతిత ప్రపంచము వినాశనమవ్వనున్నది. మొట్టమొదట తండ్రి పరిచయాన్నిచ్చి పక్కా చేయించాలి. తండ్రిని పక్కాగా అర్థము చేసుకున్నప్పుడు తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. ఇందులో మాయ చాలా మరిపింపజేస్తుంది. మీరు బాబాను స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తారు. మళ్లీ మర్చిపోతారు. శివబాబాను స్మృతి చేస్తేనే పాపాలు సమాప్తమౌతాయి. పిల్లలారా, నన్ను స్మృతి చేయండని బాబా ఇతని ద్వారా చెప్తున్నారు. అయినా వ్యాపారాలు మొదలైన వాటిలో మునిగి మర్చిపోతారు. ఇది మర్చిపోరాదు. ఇదే బాగా కష్టపడవలసిన విషయము. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ కర్మాతీత స్థితికి చేరుకోవాలి. కర్మాతీత స్థితి గలవారినే ఫరిస్తాలని అంటారు. ఎవరికి ఎలా అర్థము చేయించాలో బాగా విచార సాగర మథనము చేయండి. మేము మా సోదరులకు(ఆత్మలకు) తెలియజేస్తున్నామని పక్కా నిశ్చయము కూడా ఉండాలి. అందరికీ తండ్రి సందేశాన్నివ్వాలి. బాబా వద్దకు వెళ్ళాలి, సాక్షాత్కారము చేసుకోవాలి........ అని చాలా మంది అంటారు. కాని ఇందులో సాక్షాత్కారాలు మొదలైనవాటి ప్రస్తావనే లేదు. భగవంతుడు వచ్చి నేర్పిస్తారు. మీరు మీ నిరాకార తండ్రినైన నన్ను స్మృతి చేయండని నోటి ద్వారా చెప్తున్నారు. స్మృతి చేయడం ద్వారా పాపాలన్నీ తొలగిపోతాయి. ఎక్కడ ఏ పని చేస్తున్నా క్షణ క్షణము తండ్రిని స్మృతి చేయాలి. నన్ను స్మృతి చేయండని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు. నిరంతరము స్మృతి చేసేవారే విజయము పొందుతారు. స్మృతి చేయకుంటే మార్కులు తక్కువైపోతాయి. ఇది మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే చదువు. దీనిని ఒక్క తండ్రే మాత్రమే చదివిస్తారు. మీరు చక్రవర్తి రాజులుగా అవ్వాలి. కనుక 84 జన్మల చక్రమును కూడా స్మృతి చేయాలి. కర్మాతీత స్థితికి చేరుకునేందుకు కష్టపడాలి. అది అంత్యములో జరుగుతుంది. అంత్య సమయము ఎప్పుడైనా రావచ్చు. కనుక మీ పురుషార్థము సదా కొనసాగుతూ నిరాటంకంగా జరుగుతూ ఉండాలి. నిత్యము మీ పురుషార్థము నడుస్తూ ఉండాలి. దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మ అని భావించమని లౌకిక తండ్రి చెప్పరు. శరీరమనే భావము వదిలి నన్ను స్మృతి చేస్తే పాపము కట్ అవుతుంది. అనంతమైన తండ్రి మాత్రమే ఇలా చెప్తారు - పిల్లలూ, నా ఒక్కరి స్మృతిలో ఉంటే మీ పాపాలన్నీ సమాప్తమైపోతాయి, మీరు సతోప్రధానమైపోతారు. ఈ వ్యాపారాన్ని సంతోషంగా చేయాలి కదా. భోజనము తినే సమయములో కూడా తండ్రిని స్మృతి చేయాలి. స్మృతిలో ఉండే గుప్త అభ్యాసము పిల్లలైన మీరు చేస్తూ ఉంటే మంచిది. మీకే కళ్యాణము జరుగుతుంది. నేను ఎంత సమయము తండ్రిని స్మృతి చేస్తున్నాను? అని మిమ్ములను మీరు పరిశీలించుకోవాలి. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మనుష్యులను వజ్ర సమానంగా తయారుచేయు ఆత్మిక సర్వీసు చేయాలి. ఎప్పుడూ కూడా సంశయబుద్ధి గలవారిగా అయ్యి చదువును వదలరాదు. నిమితులుగా(ట్రస్టీలుగా) అయ్యి ఉండాలి.
2. శరీర నిర్వహణార్థము కర్మ చేస్తూ కూడా తండ్రిని స్మృతి చేయాలి. శ్రీమతములో మీ కళ్యాణముందని భావిస్తూ నడుస్తూ ఉండాలి. తమ మతమును అనుసరించరాదు.
వరదానము :-
''అందరి పట్ల శుభప్రదమైన కళ్యాణకారి భావన ఉంచి పరివర్తన చేసే అనంతమైన సేవాధారీ భవ ''
మెజారిటి పిల్లలు నా ఫలానా బంధువు పరివర్తనవ్వాలని వారి ఆశను బాప్దాదా ముందుంచుతారు. పతి లేక పత్ని సాథీగా అయిపోవాలని కోరుకుంటారు. కాని కేవలం ఆ ఆత్మలను మాత్రమే తనవారిగా భావించి ఇలాంటి ఆశనుంచుతారు. కనుక ఈ హద్దు గోడల కారణంగా మీరు చేసే ఈ శుభప్రదమైన కళ్యాణకారి భావన ఆ ఆత్మల వరకు చేరదు. అనంతమైన సేవాధారులు అందరి పట్ల ఆత్మిక భావము లేక అనంతమైన ఆత్మిక దృష్టి, సోదర వృత్తి ద్వారా శుభ భావనలను ఉంచుతారు. కనుక దాని ఫలము తప్పకుండా ప్రాప్తిస్తుంది - ఇదే మనసా సేవ చేసే యధార్థమైన విధి.
స్లోగన్ :-
''జ్ఞానమనే బాణాలను బుద్ధి రూపీ అంబులపొదిలో నింపుకొని మాయను సవాలు చేసేవారే మహావీరులైన యోధులు ''
మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు
మానసిక అశాంతికి కారణం కర్మబంధనము, శాంతికి ఆధారము కర్మాతీతము
వాస్తవానికి ప్రతి మనిషికి నాకు మానసిక శాంతి ప్రాప్తి అవ్వాలనే కోరిక తప్పకుండా ఉంటుంది. దాని కొరకు అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కాని ఇంతవరకు మానసిక శాంతి ప్రాప్తి కాలేదు. అందుకు యధార్థమైన కారణమేది? మొదట మానసిక అశాంతికి మూలమేది? అని ఆలోచించడం అవసరం. మానసిక అశాంతికి ముఖ్యమైన కారణం - కర్మ బంధనంలో చిక్కుకోవడం. ఎంతవరకు మనుష్యులు ఈ పంచ వికారాల కర్మ బంధనము నుండి విడుదల అవ్వరో అంతవరకు అశాంతి నుండి విడుదల అవ్వలేరు. కర్మబంధనాలు తెగిపోయినప్పుడు మానసిక శాంతి అనగా జీవన్ముక్తిని ప్రాప్తి చేసుకోగలరు. అయితే ఇప్పుడు కర్మబంధనాలు ఎలా తెగిపోతాయో, వాటి నుండి ముక్తిని ఇప్పించేవారెవరు? అని ఆలోచించాలి. ఏ మనుష్యాత్మ మరో మనుష్యాత్మకు ముక్తి ఇప్పించలేరని మనకు తెలుసు. ఈ కర్మబంధనాల లెక్కాచారాన్ని తెంచేవారు కేవలం ఒక్క పరమాత్మ మాత్రమే. వారే వచ్చి ఈ జ్ఞాన-యోగాల బలము ద్వారా, కర్మబంధనాల నుండి విడిపిస్తారు. అందుకే పరమాత్మను సుఖదాత అని అంటారు. ఎంతవరకు నేను ఆత్మను, ఒరిజనల్గా నేనెవరి సంతానాన్ని, నా అసలు గుణాలేవి? అనే జ్ఞానము లేదో అంతవరకు కర్మబంధనాలు తెగిపోవు. ఎప్పుడైతే ఈ విషయాలు బుద్ధిలోకి వస్తాయో అప్పుడు కర్మబంధనాలు తెగిపోతాయి. ఇప్పుడు ఈ జ్ఞానము మనకు పరమాత్మ ద్వారానే ప్రాప్తి అవుతుంది అనగా పరమాత్మ ద్వారానే కర్మబంధనాలు తెగిపోతాయి. అచ్ఛా. ఓంశాంతి.