02-11-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - మనుష్యులను దేవతలుగా తయారుచేసే సేవలో తప్పకుండా విఘ్నాలు వస్తాయి. మీరు కష్టాలను సహించి అయినా ఈ సేవలో తత్పరులుగా ఉండాలి. దయా హృదయులుగా అవ్వాలి. ''
ప్రశ్న :-
ఇది అంతిమ జన్మ అనే స్మృతి ఎవరికి ఉంటుందో వారి గుర్తులు ఎలా ఉంటాయి?
జవాబు :-
వారి బుద్ధిలో - '' ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో మేము మరో జన్మ తీసుకోరాదు, ఇతరులకెవ్వరికీ జన్మనివ్వరాదు అని ఉంటుంది. ఇది పాపాత్మల ప్రపంచము. ఇప్పుడిక దీని వృద్ధి అవసరము లేదు. ఇది వినాశనమవ్వాలి. ఇప్పుడు పాత వస్త్రాలను వదిలి మన ఇంటికి వెళ్తాము. ఇప్పుడీ నాటకము పూర్తి అయ్యింది. ''
పాట :-
నూతన ప్రాయపు మొగ్గలము,................... ( నయీ ఉమర్ కీ కలియా,...................) 
ఓంశాంతి.
పిల్లలైన మీరు ప్రతి ఒక్కరి జ్యోతిని వెలిగించాలని తండ్రి కూర్చుని పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. ఇది మీ బుద్ధిలో ఉంది. మనుష్యమాత్రులందరికీ ముక్తి మార్గాన్ని తెలియజేయాలని తండ్రికి కూడా బేహద్ ఆలోచన ఉంటుంది. పిల్లల సేవ చేసేందుకు, దు:ఖము నుండి ముక్తులుగా చేసేందుకే తండ్రి వస్తారు. ఇక్కడ దు:ఖముందంటే సుఖానికి కూడా ఏదో స్థానముంటుందని మనుష్యులకు అర్థము కాదు. దీనిని గురించి వారికి తెలియదు. శాస్త్రాలలో సుఖ స్థానాన్ని కూడా దు:ఖ స్థానంగా చేసేశారు. ఇప్పుడు బాబా దయాహృదయులు. మేమిప్పుడు దు:ఖితులుగా ఉన్నామని కూడా మనుష్యులకు తెలియదు. ఎందుకంటే వారికి సుఖము గురించి, సుఖమునిచ్చేవారి గురించి తెలియనే తెలియదు. ఇది కూడా డ్రామాలోని నిర్ణయమే. సుఖము అని దేనినంటారో, దు:ఖమని దేనినంటారో వారికి తెలియదు. ఈశ్వరుడే సుఖ-దు:ఖాలను ఇస్తారని అంటారు అనగా వారికి కళంకాన్ని ఆపాదిస్తారు. ఎవరినైతే తండ్రీ అని పిలుస్తారో ఆ ఈశ్వరుని గురించి తెలియనే తెలియదు. తండ్రి చెప్తారు - నేను పిల్లలకు సుఖాన్నే ఇస్తాను. పతితులను పావనంగా చేసేందుకు ఇప్పుడు బాబా వచ్చారని మీకు తెలుసు. ఇప్పుడు అందరినీ మధురమైన ఇంటికి తీసుకెళ్తానని వారు చెప్తున్నారు. ఆ మధురమైన ఇల్లు కూడా పావనమైనదే. అక్కడ పతితాత్మలు ఎవ్వరూ ఉండరు. ఆ స్థానాన్ని గూర్చి ఎవ్వరికీ తెలియదు. ఫలానావారు దూరంగా ఉన్న నిర్వాణానికి వెళ్లారని అంటారు. కాని దాని అర్థము తెలియదు. బుద్ధుడు నిర్వాణమైనప్పుడు తప్పకుండా వారు అక్కడ నివసించేవారే అయ్యి ఉండాలి. అక్కడకే వెళ్ళారు. మంచిది. వారైతే వెళ్ళారు మిగిలినవారు ఎలా వెళ్ళాలి? జతలో ఎవ్వరినీ తీసుకెళ్ళలేదు కదా. వాస్తవానికి వారు వెళ్ళలేదు అందుకే అందరూ పతితపావనులైన తండ్రిని స్మృతి చేస్తారు. పావన ప్రపంచాలు రెండు ఉన్నాయి. ఒకటి ముక్తిధామము, రెండవది జీవన్ముక్తిధామము. శివపురి మరియు విష్ణుపురి. ఇది రావణపురి. పరమపిత పరమాత్మను రాముడని కూడా అంటారు. రామరాజ్యమని అన్నప్పుడు బుద్ధి పరమాత్ముని వైపుకు వెళ్తుంది. మనుష్యులనైతే అందరూ పరమాత్ముడని అంగీకరించరు. కనుక మీకు దయ కలుగుతుంది. కష్టాలను సహించవలసి వస్తుంది.
బాబా చెప్తారు - మధురమైన పిల్లలూ, మనుష్యులను దేవతలుగా చేయడములో ఈ జ్ఞాన యజ్ఞములో విఘ్నాలు చాలానే వస్తాయి. గీతా భగవానుడే నిందలపాలయ్యారు కదా. తిట్లు వారికిి మరియు మీకు కూడా లభిస్తాయి. ఇతడు బహుశా చవితి చంద్రుని చూసి ఉండవచ్చు అని అంటారు కదా. ఇవన్నీ కల్పిత(కట్టు) కథలు. ప్రపంచములో ఎంత మురికి ఉంది! మనుష్యులు ఏమేమో తింటున్నారు. జంతువులను చంపుతున్నారు. ఏమేమో చేస్తున్నారు! తండ్రి వచ్చి ఈ విషయాలన్నిటి నుండి విడుదల చేస్తారు. ప్రపంచములో ఎంతటి మారణహోమము జరుగుతోంది! మీ కొరకు తండ్రి ఎంత సహజము చేస్తున్నారు! తండ్రి చెప్తున్నారు - '' మీరు కేవలం నన్ను స్మృతి చేయండి, వికర్మలు వినాశమవుతాయి.'' అందరికీ ఒకే విషయాన్ని అర్థము చేయించండి - మీ శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి. వాస్తవానికి మీరు అక్కడి నివాసులని తండ్రి చెప్తున్నారు. సన్యాసులు కూడా అక్కడికే దారి చూపుతారు. ఒకవేళ ఒకరు నిర్వాణధామానికి వెళ్లిపోయారంటే మరి ఇతరులను ఎలా తీసుకెళ్తారు? వారిని ఎవరు తీసుకెళ్తారు? బుద్ధుడు నిర్వాణానికి వెళ్ళారనుకోండి. వారి బౌద్ధులు ఇక్కడే ఉన్నారు. వారిని వాపస్ తీసుకెళ్లాలి కదా. సందేశకులందరి ఆత్మలు ఇక్కడే ఉన్నాయని గానము కూడా చేస్తారు. అనగా ఏదో ఒక శరీరములో ఉన్నారు. అయినా వారి మహిమను పాడుతూ ఉంటారు. మంచిది. ధర్మస్థాపన చేసి వెళ్లారు. తర్వాత ఏమయింది? ముక్తికి వెళ్లేందుకు మనుష్యులు ఎంతగా తల బాదుకుంటారు. వారు ఈ జప, తప, తీర్థయాత్రలు మొదలైనవి నేర్పించలేదు. నేను వచ్చేదే సర్వులకు గతి-సద్గతిని ఇచ్చేందుకు. అందరినీ తీసుకెళ్తానని తండ్రి అంటున్నారు. సత్యయుగములో జీవన్ముక్తి ఉంటుంది. ఒకే ధర్మముంటుంది. మిగిలిన ఆత్మలందరినీ వాపసు తీసుకెళ్తాను. ఆ బాబా(శివబాబా) తోట యజమాని అని, మనమంతా తోటమాలురమని మీకు తెలుసు. మమ్మా, బాబా మరియు పిల్లలందరూ బీజము నాటుతూ ఉంటారు. బీజము ఎలా వేయాలో పెద్ద పెద్ద తోటమాలులు నేర్పుతూ ఉంటారు. మొలకలు వెలువడ్తాయి. అనేక ప్రకారాలైన తుఫానులు వస్తాయి. ఇవి మాయా విఘ్నాలు. తుఫానులు వచ్చినప్పుడు, బాబా ఇప్పుడేం చెయ్యాలి? అని అడగాలి. శ్రీమతమిచ్చేవారు తండ్రి. తుఫానులైతే రానే వస్తాయి. మొదటిది దేహాభిమానము. ఆత్మనైన నేను అవినాశి, ఈ శరీరము వినాశి, మా 84 జన్మలు పూర్తయ్యాయని అర్థము చేసుకోరు. ఆత్మయే పునర్జన్మ తీసుకుంటుంది. మాటిమాటికీ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకోవడము ఆత్మ పనే. ఇది మీ అంతిమ జన్మ. ఈ ప్రపంచములో మరో జన్మ తీసుకోరాదు, ఎవ్వరికీ జన్మనివ్వరాదని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. మరి సృష్టి ఎలా వృద్ధి చెందుతుందని మనుష్యులు అడుగుతారు. అరే! ఈ సమయములో సృష్టి వృద్ధి చెందనవసరము లేదు. ఇది భ్రష్ఠాచారపు వృద్ధి. ఈ పద్ధతి ఆచారము రావణుని నుండి ప్రారంభమయ్యింది. ప్రపంచాన్ని భ్రష్ఠాచారిగా చేసేవాడు రావణుడు. రాముడు శ్రేష్ఠాచారిగా చేస్తారు. ఇందులో కూడా మీరు చాలా శ్రమ పడవలసి ఉంటుంది. క్షణ-క్షణము దేహాభిమానములోకి వచ్చేస్తారు. దేహాభిమానములోకి రాలేదంటే స్వయాన్ని ఆత్మగా భావించాలి. సత్యయుగములో కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తారు కదా. ఇప్పుడు మా శరీరము ముసలిదైపోయింది. దీనిని వదిలి కొత్తది తీసుకోవాలని అర్థము చేసుకుంటారు. ఇక్కడైతే ఆత్మ జ్ఞానము కూడా లేదు. స్వయాన్ని దేహముగా భావించి కూర్చున్నారు. ఎవరైతే దు:ఖితులుగా అవుతారో వారు ఈ ప్రపంచము నుండి వెళ్ళిపోవాలని అనుకుంటారు. అక్కడ ఉన్నదంతా సుఖమే. అక్కడ కేవలం ఆత్మ జ్ఞానమే ఉంటుంది. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు కనుక అక్కడ దు:ఖము ఉండదు. అది సుఖ ప్రాలబ్ధము. ఇక్కడ కూడా ఆత్మ అని అంటారు. అయినా కొందరు ఆత్మయే పరమాత్మ అని అనేస్తారు. ఆత్మ ఉంది అనే జ్ఞానమైతే ఉంది కదా. కాని మనము ఈ పాత్ర నుండి వాపస్ వెళ్ళలేమని వారికి తెలియదు. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తప్పకుండా తీసుకోవాలి. పునర్జన్మనైతే అందరూ అంగీకరిస్తారు. నా కర్మ అని అందరూ నిందించుకుంటూ ఉంటారు కదా. మాయా రాజ్యములో కర్మలు వికర్మలుగానే అవుతాయి. కనుక కర్మలను నిందించుకుంటూ ఉంటారు. అక్కడ అలా నిందించుకునే, పశ్చాత్తాపపడే కర్మలేవీ ఉండవు.
ఇప్పుడు మనము వాపస్ వెళ్ళాలని మీకు తెలుసు. వినాశనము జరిగే తీరాలి. బాంబుల ట్రయల్(రిహార్సల్) కూడా చేస్తున్నారు. కోపములోకి వచ్చి వాటిని వేసేస్తారు. ఇవి శక్తిశాలి బాంబులు. యూరోపువాసులకు యాదవులు అనే గాయనము కూడా ఉంది. భలే మనము సర్వ ధర్మాల వారిని యూరోపు వాసులనే అంటాము. భారతదేశము ఒకవైపు ఉంది. మిగిలిన వారందరిని మరొకవైపు కలిపేశారు. వారి ఖండము పై వారికి చాలా ప్రీతి ఉంది. కాని డ్రామా నిర్ణయము ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారు? బాబా శక్తినంతా మీకిస్తున్నారు. యోగబలము ద్వారా మీరు రాజ్యాన్ని తీసుకుంటారు. మీకు ఏ కష్టమునూ ఇవ్వరు. తండ్రి చెప్తున్నారు - ''కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, దేహాభిమానము వదిలేయండి.'' నేను రాముని స్మృతి చేస్తాను, శ్రీ కృష్ణుని స్మృతి చేస్తానని అంటారు. కనుక వారు స్వయాన్ని ఆత్మగా భావించరు. ఆత్మగా భావిస్తే ఆత్మల తండ్రిని ఎందుకు స్మృతి చేయరు? పరమపిత పరమాత్మనైన నన్ను స్మృతి చేయండి. మీరు జీవాత్మలను ఎందుకు స్మృతి చేస్తారు? అని తండ్రి అంటున్నారు. మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. నేను ఆత్మను, తండ్రిని స్మృతి చేస్తాను. స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనమౌతాయి, వారసత్వము కూడా బుద్ధిలోకి గుర్తు వస్తుందని తండ్రి ఆజ్ఞాపించారు. తండ్రి మరియు వారసత్వము అనగా ముక్తి-జీవన్ముక్తులు. దీని కొరకెే ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. యజ్ఞము, జపము, తపము మొదలైనవి చేస్తూ ఉంటారు. పోప్ నుండి కూడా ఆశీర్వాదాలు తీసుకునేందుకు వెళ్తారు. ఇక్కడ తండ్రి చెప్తున్నారు - కేవలం దేహాభిమానాన్ని వదలండి. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయము చేసుకోండి. ఈ నాటకము పూర్తయ్యింది. కనుక 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు వాపస్ వెళ్లాలి. ఎంత సహజము చేసి అర్థము చేయిస్తున్నారు! గృహస్థ వ్యవహారములో ఉంటూ ఇది బుద్ధిలో ఉంచుకోండి. ఉదాహరణానికి నాటకము పూర్తి కావస్తున్న సమయములో ఇక 15 నిముషములే ఉందని, ఇప్పుడు ఈ సీన్(దృశ్యము) పూర్తవుతుంది, మేము ఈ దుస్తులను తొలగించి ఇంటికి వెళ్తామని అందులోని పాత్రధారులు భావిస్తారు. ఇప్పుడు అందరూ వాపస్ వెళ్లాలి. ఇలా మీతో మీరే మాట్లాడుకోవాలి. ఎంత సమయము మనము సుఖ-దు:ఖాల పాత్ర అభినయించామో మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి. ప్రపంచములో ఏమేమి జరుగుతున్నాయో వాటన్నింటిని మర్చిపోండి. ఇదంతా సమాప్తమవ్వనున్నది. ఇప్పుడిక వాపస్ వెళ్ళాలి. కలియుగము ఇంకా 40 వేల సంవత్సరాలు నడుస్తుందని వారు అనుకుంటారు. దీనిని ఘోర అంధకారమని అంటారు. తండ్రి పరిచయము లేదు. జ్ఞానము అనగా తండ్రి పరిచయము. అజ్ఞానము అనగా తండ్రి పరిచయము లేకపోవడం అనగా ఘోర అంధకారములో ఉన్నారు. ఇప్పుడు మీకు నంబరువారు పురుషార్థానుసారము అత్యంత ప్రకాశములోకి వచ్చారు. ఇప్పుడు రాత్రి పూర్తి అవ్వనున్నది. మనము వాపస్ వెళ్తాము. నేడు బ్రహ్మ రాత్రి, రేపు బ్రహ్మ పగలు అవుతుంది. పరివర్తన అయ్యేందుకు సమయము పడ్తుంది కదా. ఇప్పుడు మనము మృత్యు లోకములో ఉన్నాము, రేపు అమరలోకములో ఉంటామని మీకు తెలుసు. మొదట వాపస్ వెళ్లాలి. ఇలా ఈ 84 జన్మల చక్రము తిరుగుతుంది. ఈ తిరగడము సమాప్తమవ్వదు. మీరు నాతో ఎన్నిసార్లు కలిశారు? అని బాబా అడుగుతున్నారు. అనేకసార్లు కలిశాము అని పిల్లలు చెప్తారు. మీ 84 జన్మల చక్రము పూర్తి అవుతే అందరిదీ పూర్తి అయిపోతుంది. దీనిని జ్ఞానము అని అంటారు. జ్ఞానమిచ్చేవారు జ్ఞానసాగరులు. పరమపిత పరమాత్మ పతితపావనులు. పతితపావనులు అని ఎవరిని అంటారు? అని మీరు అడగవచ్చు. భగవంతుడని నిరాకారుడినే అంటారు. మరి మీరు రఘుపతి రాఘవ రాజారామ్........... అని ఎందుకు అంటున్నారు? ఆత్మల తండ్రి ఆ నిరాకారుడే. ఇది తెలిపించేందుకు చాలా యుక్తి కావాలి.
రోజురోజుకు మీకు గుహ్య జ్ఞానము లభిస్తూ ఉన్నందున మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది. అర్థము చేయించవలసింది కేవలం పరమాత్మ గురించి మాత్రమే. పరమాత్మను మర్చిపోయినందున అనాథలైపోయారు. దు:ఖితులుగా అయిపోతూ ఉంటారు. ఒక్కరి ద్వారా ఆ ఒక్కరిని తెలుసుకుంటే మీరు 21 జన్మలు సుఖీలుగా అయిపోతారు. ఇది జ్ఞానము. అది అజ్ఞానము. వారు పరమాత్మ సర్వవ్యాపి అని అనేస్తారు. అరే! వారు తండ్రి కదా. మీలో భూతాలు సర్వవ్యాపిగా ఉన్నాయని తండ్రి చెప్తున్నారు. పంచ వికార రూపీ రావణుడు సర్వవ్యాపిగా ఉన్నాడు. ఈ విషయాలు అర్థం చేయించాల్సి వస్తుంది. మేము ఈశ్వరుని ఒడిలో ఉన్నామని చాలా గొప్ప నషా ఉండాలి. తర్వాత మళ్లీ భవిష్యత్తులో దేవతల ఒడిలోకి వెళ్తారు. అక్కడైతే సదా సుఖముంటుంది. శివబాబా మనలను దత్తత చేసుకున్నారు. వారిని స్మృతి చేయాలి. స్వయం మీ కళ్యాణము చేసుకొని ఇతరుల కళ్యాణము కూడా చేస్తే రాజ్యము లభిస్తుంది. ఇవి అర్థము చేసుకునేందుకు చాలా మంచి విషయాలు. శివబాబా నిరాకారులు. ఆత్మలమైన మనము కూడా నిరాకారులమే. అక్కడ మనము అశరీరులుగా, నగ్నముగా ఉంటాము. బాబా అయితే సదా అశరీరియే. బాబా ఎప్పుడూ శరీరమనే వస్త్రాన్ని ధరించి పునర్జన్మ తీసుకోరు. బాబా ఒక్కసారి మాత్రమే అవతరిస్తారు. మొట్టమొదట బ్రాహ్మణులను రచించాలంటే వారిని తమవారిగా చేసుకొని పేరు పెట్టవలసి ఉంటుంది కదా. బ్రహ్మ లేరంటే బ్రాహ్మణులు ఎక్కడ నుండి వస్తారు? ఎవరైతే 84 జన్మలు పూర్తిగా తీసుకున్నాడో, పవిత్రంగా ఉండి మళ్లీ వికారిగా అయ్యాడో, అతడే ఇతడు. సుందరము నుండి శ్యామంగా, శ్యామము నుండి సుందరంగా అవుతాడు. భారతదేశానికి కూడా శ్యామసుందరమని పేరు పెట్టవచ్చు. భారతదేశమునే శ్యామము అని, భారతదేశమునే స్వర్ణిమ యుగము, సుందరమని అంటారు. భారతదేశమే కామచితి పై కూర్చుని నల్లగా అయిపోతుంది. భారతదేశమే జ్ఞానచితి పై కూర్చుని సుందరంగా అవుతుంది. భారతదేశము గురించే ఆలోచించవలసి ఉంటుంది, కష్టపడవలసి వస్తుంది. భారతవాసులు మళ్లీ ఇతర ధర్మాలలోకి మారిపోయారు. యూరోపువాసులు మరియు భారతీయులలో వ్యత్యాసము కనిపించదు. అక్కడకెళ్ళి వివాహము చేసుకుంటే క్ర్రైస్తవులనబడ్తారు. వారి పిల్లలు మొదలైనవారు కూడా అదే రూపురేఖలతో ఉంటారు. ఆఫ్రికాలో కూడా వివాహము చేసుకుంటారు.
ఇప్పుడు చక్రాన్ని అర్థము చేసుకునే విశాలబుద్ధిని బాబా ఇస్తారు. వినాశకాలే విపరీత బుద్ధి అని కూడా వ్రాయబడి ఉంది. యాదవులు మరియు కౌరవులు ప్రీతి ఉంచలేదు. ఎవరు ప్రీతినుంచారో వారికి విజయము లభించింది. శత్రువులను విపరీత బుద్ధి అని అంటారు. ఈ సమయములో అందరూ పరస్పరములో శత్రువులే. తండ్రినే సర్వవ్యాపి అని నిందిస్తారు లేకుంటే జనన-మరణ రహితులని అనేస్తారు. వారికి నామ-రూపాలేవీ లేవని అనేస్తారు. ఓ గాడ్ఫాదర్ అని కూడా అంటారు. ఆత్మ-పరమాత్మల సాక్షాత్కారము కూడా అవుతుంది. వారిలో మరియు పరమాత్మలో వ్యత్యాసముండదు. ఇక శక్తి నెంబరువారుగా తక్కువగా, ఎక్కువగా ఉండనే ఉంటుంది. మనుష్యులు భలే మనుష్యులే, కాని వారిలో కూడా పదవులుంటాయి. బుద్ధిలో వ్యత్యాసముంటుంది. జ్ఞానసాగరులు మీకు జ్ఞానమిచ్చారు కనుక వారిని స్మృతి చేస్తారు. అటువంటి స్థితి మీకు అంతిమములో తయారవుతుంది.
అమృతవేళ స్మరించి స్మరించి సుఖాన్ని పొందండి. భలే పడుకొని ఉండండి కాని నిదురించరాదు. హఠము చేసి కూర్చోవాలి. కష్టముంది. అమృతవేళ తీసుకునేందుకు వైద్యులు మందులు కూడా ఇస్తారు. ఇది కూడా ఔషధమే. రచయిత అయిన తండ్రి బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచించి చదివిస్తున్నారు - ఈ విషయము అందరికీ అర్థము చేయించాలి. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఇప్పుడు మనము ఈశ్వరుని ఒడిని స్వీకరించాము, తర్వాత మళ్లీ దేవతల ఒడిలోకి వెళ్తాము. ఈ ఆత్మిక నషాలో ఉండాలి. స్వయం మరియు ఇతరుల కళ్యాణము చేయాలి.
2. అమృతవేళలో లేచి జ్ఞానసాగరుని జ్ఞానాన్ని మననము చేయాలి. ఒక్కరి అవ్యభిచారి స్మృతిలో ఉండాలి. దేహాభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మ అని నిశ్చయము చేసుకోవాలి.
వరదానము :-
'' ప్రతి ఆత్మతో సంబంధ-సంపర్కములోకి వస్తూ అన్ని ప్రశ్నల నుండి దూరంగా ఉండే సదా ప్రసన్నచిత్త్ భవ ''
ప్రతి ఆత్మ సంబంధ - సంపర్కములోకి వస్తూ ఎప్పుడూ మనసులో, వీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు అంటున్నారు? ఈ విషయము ఇలా కాదు, ఇలా అయ్యి ఉండాలి అనే ప్రశ్నలు ఉత్పన్నమవ్వరాదు. ఎవరైతే ఈ ప్రశ్నలకు దూరంగా ఉంటారో, వారే సదా ప్రసన్నచిత్తులుగా ఉంటారు. కాని ఎవరైతే ఈ ప్రశ్నల క్యూ లోకి వెళ్తారో, రచనను రచించుకుంటే వాటి పాలన కూడా చేయాల్సి ఉంటుంది. సమయాన్ని మరియు శక్తిని కూడా ఇవ్వవలసి ఉంటుంది. అందువలన ఈ వ్యర్థ రచన జరగకుండా బర్త్ కంట్రోల్ చేయండి.
స్లోగన్ :-
'' మీ కనులలో బిందు రూపుడైన తండ్రిని ఇముడ్చుకుంటే వేరెవ్వరూ ఇమడలేరు ''