12-12-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - శివబాబా తప్ప మీకిక్కడ ఇంకేమీ లేదు. కనుక ఈ దేహ భావం నుండి కూడా దూరమై ఏమీ లేని భికారులుగా అవ్వాలి. భికారులే యువరాజులుగా అవుతారు''
ప్రశ్న :-
డ్రామా యథార్థమైన జ్ఞానము ఎటువంటి ఆలోచనలను సమాప్తము చేస్తుంది ?
జవాబు :-
ఈ జబ్బు ఎందుకు వచ్చింది, ఇలా చేయకుండా ఉంటే, ఇలా జరిగేది కాదు. ఈ విఘ్నము ఎందుకు వచ్చింది...... బంధనము ఎందుకు వచ్చింది...... ఇటువంటి ఆలోచనలన్నీ డ్రామా యథార్థ జ్ఞానము ద్వారా సమాప్తమైపోతాయి. ఎందుకంటే డ్రామానుసారం ఏమి జరగాలో, అదే జరిగింది. కల్పక్రితమ కూడా ఇదే జరిగింది. పాత శరీరమైన కారణంగా దీనికి అతుకులు కూడా పడాల్సిందే. కనుక ఎటువంటి ఆలోచనలు నడువజాలవు.
పాట :-
మనము ఆ మార్గములో నడవాలి,........... (హమే ఉన్ రాహొ౦ పర్ చల్నా హై,..........) 
ఓంశాంతి.
మనం ఆ మార్గాలలో నడవాలి అని పాటలో విన్నారు. ఏ మార్గములో? మార్గాన్ని తెలిపించేవారు ఎవరు? మనమెవరి మార్గములో నడుస్తున్నామో పిల్లలకు తెలుసు. సలహా అనండి, మార్గమని అనండి, శ్రీమతమని అనండి విషయమంతా ఒక్కటే. ఇప్పుడు శ్రీమతము అనుసరించాలి. కాని ఎవరి శ్రీమతము? శ్రీమత్ భగవద్గీత అని లిఖింపబడి ఉంది. అంటే మన బుద్ధియోగము తప్పకుండా శ్రీమతము వైపే వెళ్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఎవరి స్మృతిలో కూర్చుని ఉన్నారు? శ్రీ కృష్ణుడని అంటే అతడిని అక్కడ స్మృతి చేయాల్సి ఉంటుంది. పిల్లలైన మీరు శ్రీ కృష్ణుని స్మృతి చేస్తారా? చేయరా? వారసత్వము రూపములో స్మృతి చేస్తారు. మనము రాకుమారులుగా అవుతామని మీకు తెలుసు. పుట్టగానే లక్ష్మీనారాయణులుగా అవ్వము. మనము తప్పకుండా శివబాబాను స్మృతి చేస్తాము, ఎందుకంటే శ్రీమతము వారిదే. కృష్ణ భగవానువాచ అని అనేవారు కృష్ణుని స్మృతి చేస్తారు. కాని ఎక్కడ స్మృతి చేస్తారు? అతడిని వైకుంఠములో స్మృతి చేయడం జరుగుతుంది. కావున 'మన్మనాభవ' అనే పదాన్ని కృష్ణుడు చెప్పజాలడు. మధ్యాజీభవ అని మాత్రము చెప్పగలడు. '' నన్ను స్మృతి చేయండి '' అతడు(కృష్ణుడు) వైకుంఠములో ఉంటాడు. ప్రపంచానికి ఈ విషయాలు తెలియవు. తండ్రి చెప్తున్నారు - పిల్లలారా! ఈ శాస్త్రాలన్నీ భక్తిమార్గములోవి, సర్వ ధర్మశాస్త్రాలలో గీత కూడా వచ్చేస్తుంది. గీత భారతదేశపు ధర్మశాస్త్రము. వాస్తవానికి ఇది అందరి శాస్త్రము. అందుకే శ్రీ మత్ సర్వశాస్త్రశిరోమణి గీత అని అంటారు. అంటే సర్వోత్తమమైనది. సర్వోత్తములు శ్రీ శ్రీ శివబాబా. వారు శ్రేష్ఠాతి శ్రేష్ఠులు. శ్రీ శ్రీ అని కృష్ణుని అనరు. శ్రీ శ్రీ కృష్ణుడు లేక శ్రీ శ్రీ రాముడు అని అనరు. వారిని కేవలం శ్రీ అని అంటారు. శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారే వచ్చి మళ్ళీ శ్రేష్ఠంగా తయారు చేస్తారు. సర్వ శ్రేష్ఠులు అంటే భగవంతుడు. శ్రీ శ్రీ అంటే అందరికంటే శ్రేష్ఠుడు. శ్రేష్ఠుల పేరే ప్రసిద్ధమౌతుంది. శ్రేష్ఠులని తప్పకుండా దేవతలనే అంటారు. వారిప్పుడు లేరు. ఈ రోజుల్లో శ్రేష్ఠులుగా ఎవరిని భావిస్తారు? నేటి నాయకులు మొదలైనవారిని ఎంతగా గౌరవిస్తారు! కాని వారిని శ్రీ అని అనజాలరు. మహాత్ముడు మొదలైనవారిని కూడా శ్రీ అని అనరాదు. ఇప్పుడు మీకు ఉన్నతోన్నతమైన పరమాత్ముని నుండి జ్ఞానము లభిస్తోంది. సర్వోత్తములు పరమపిత పరమాత్మ. తర్వాత వారి రచన. మళ్ళీ రచనలో శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు బ్రహ్మ-విష్ణు-శంకరులు. ఇక్కడ కూడా పదవులు నంబరువారుగా ఉన్నాయి. దేశాధ్యక్షుడు అత్యంత ఉన్నతుడు, తర్వాత ప్రధానమంత్రి, యూనియన్ మంత్రి.
తండ్రి కూర్చుని సృష్టి ఆదిమధ్యాంత రహస్యాలను అర్థము చేయిస్తున్నారు. భగవంతుడు రచయిత. రచయిత అనగానే సృష్టి ఎలా రచింపబడింది? అని మనుష్యులు ప్రశ్నిస్తారు. కనుక త్రిమూర్తి శివడు రచయిత అని తప్పకుండా అనవలసి ఉంటుంది. వాస్తవానికి రచయిత అనేందుకు బదులు రచన చేయించువారు అని అనడం సరైనది. బ్రహ్మ ద్వారా దైవీ కులాన్ని స్థాపన చేయిస్తారు. బ్రహ్మ ద్వారా దేనిని స్థాపిస్తారు? - దైవీ సంప్రదాయాన్ని. మీరిప్పుడు బ్రహ్మ యొక్క బ్రాహ్మణ సంప్రదాయమువారు. వారు ఆసురీ సంప్రదాయంవారు అని శివబాబా అంటున్నారు. మళ్ళీ దైవీ సంప్రదాయస్థులుగా అవుతారు. తండ్రి బ్రహ్మ ద్వారా అన్ని వేదశాస్త్రాల సారమును కూడా అర్థము చేయిస్తారు. మనుష్యులు చాలా తికమక పడి ఉన్నారు. జనాభా నియంత్రణ జరగాలని ఎంతగా తలకొట్టుకుంటారు! నేను వచ్చి భారతదేశానికి ఈ సేవ చేస్తున్నానని తండ్రి అంటున్నారు. ఇక్కడ ఉండేదే తమోప్రధాన మనుష్యులు. 10-12 మంది సంతతికి జన్మనిస్తూ ఉంటారు. వృక్షము తప్పకుండా వృద్ధి అవ్వాల్సిందే. ఆకులు వెలువడుతూ ఉంటాయి. దీనినెవ్వరూ నియంత్రించజాలరు. సత్యయుగములో నియంత్రణ ఉంటుంది - ఒక కొడుకు, ఒక కూతురు అంతే. ఈ విషయాలు పిల్లలైన మీరే అర్థము చేసుకుంటారు. పోను పోను అనేకమంది వచ్చి అర్థము చేసుకుంటూ ఉంటారు. అతీంద్రియ సుఖము గురించి గోప-గోపికలను అడగమని గాయనము కూడా ఉంది. ఇక్కడ మీరు సన్ముఖములో విన్నప్పుడు సుఖము అనుభవమవుతుంది. మళ్ళీ వ్యాపార-వ్యవహారాలలోకి వెళ్ళగానే అంత సుఖము అనుభవమవ్వదు. ఇక్కడ మిమ్ములను త్రికాలదర్శులుగా చేయడం జరుగుతుంది. త్రికాలదర్శులను స్వదర్శన చక్రధారులని కూడా అంటారు. ఫలానా మహాత్ముడు త్రికాలదర్శిగా ఉండేవాడని మనుష్యులు అంటారు. వైకుంఠనాథులైన రాధా-కృష్ణులనకు కూడా స్వదర్శన చక్రము లేక మూడు కాలాల జ్ఞానము లేదని మీరు అంటారు. కృష్ణుడు సర్వులకు ప్రియమైన సత్యయుగపు ప్రప్రథమ రాకుమారుడు. కాని మనుష్యులు అర్థము చేసుకోని కారణంగా, మీరు శ్రీ కృష్ణుని భగవంతునిగా ఒప్పుకోరు. కనుక మీరు నాస్తికులు అని అనేస్తారు. మళ్ళీ విఘ్నాలు కలిగిస్తారు. అవినాశి జ్ఞాన యుగములో విఘ్నాలు వస్తాయి. కన్యలు, మాతల పై కూడా విఘ్నాలు వస్తాయి. బంధనములో ఉన్నవారు ఎంతో సహనము చేస్తారు. కనుక డ్రామానుసారముగా మా పాత్ర ఇలాగే ఉందని అర్థము చేసుకోవాలి. ఇలా చేయకుండా ఉంటే ఇలా అయ్యేది కాదేమో, ఇలా చేయకుంటే జ్వరము వచ్చేది కాదు...... అన్న ఆలోచనలు రాకూడదు. ఇలా ఆలోచించరాదు. డ్రామానుసారంగా ఇలా చేశాము. కల్పక్రితము కూడా ఇలాగే చేశాము. అప్పుడు కూడా కష్టమొచ్చింది. పాత శరీరానికి అతుకులు పడనే పడాల్సిందే. చివరి వరకు మరమత్తులు జరుగుతూనే ఉంటాయి. ఇది కూడా ఆత్మకు పాత ఇల్లు. ఆత్మ చెప్తుంది - నేను కూడా చాలా పాత దానిని. నాలో ఎటువంటి శక్తి లేనందున బలహీన వ్యక్తులు దు:ఖాన్ని అనుభవిస్తారు. మాయ బలహీనులకు చాలా దు:ఖాన్నిస్తుంది. భారతవాసులైన మనలను మాయ తప్పకుండా చాలా బలహీనపరచింది. చాలా శక్తి కలిగి ఉన్న మనలను మాయ బలహీనపరిచింది. ఇప్పుడు దాని పై విజయము పొందుతాము. భారతదేశానికే ఎక్కువ దు:ఖము లభిస్తుంది. అందరి నుండి అప్పులు తీసుకుంటుంది. భారతదేశము పూర్తిగా పాతదైపోయింది. ఎవరైతే చాలా ధనవంతులుగా ఉండేవారో వారు పూర్తి భికారులుగా అవ్వాలి. మళ్ళీ భికారుల నుండి రాకుమారులుగా అవుతారు. బాబా చెప్తున్నారు - ఈ శరీర భావం నుండి కూడా దూరంగా ఖాళీగా అయిపోండి. ఇక్కడ మీదంటూ ఏమీ లేదు. ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. కనుక మీరు చాలా నిరుపేదలుగా, భికారులుగా అవ్వవలసి ఉంటుంది. యుక్తులు కూడా చాలా తెలిపిస్తూ ఉంటారు. జనకుని వలె గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండాలి. శ్రీమతాన్ని పాటించాలి. సర్వము సమర్పణ కుడా చెయ్యాలి. జనకుడు సర్వస్వము ఇచ్చేశాడు. మళ్ళీ - '' నీ సంపత్తిని నీవే సంభాళించు. అయితే నిమిత్తంగా ఉండు '' అని చెప్పబడింది. హరిశ్చంద్రుని దృష్టాంతము కూడా ఉంది.
బాబా తెలిపిస్తున్నారు - పిల్లలారా! మీరు బీజము నాటకపోతే మీ పదవి తక్కువైపోతుంది. తండ్రిని అనుసరించండి. మీ ఎదురుగా ఈ దాదా కూర్చుని ఉన్నాడు. శివబాబాను మరియు శివశక్తులను పూర్తి నిమిత్తంగా చేసేశాడు. శివబాబా కూర్చుని సంభాళించరు. ఇతడు తన పై తానే బలి అవ్వడు. మాతల పై బలి అవ్వాల్సి వచ్చింది. మాతలనే ముందుంచాలి. తండ్రి వచ్చి మనుష్యులను దేవతలుగా చేసేందుకు జ్ఞానామృత కలశాన్ని మాతలకే ఇస్తారు. లక్ష్మికి ఇవ్వలేదు. ఈ సమయములో ఈమె జగదంబ. సత్యయుగములో లక్ష్మిగా అవుతుంది. జగదంబగారి గురించి పాట ఎంత బాగా రచింపబడింది! ఆమెకు చాలా గౌరవముంది. తాను సౌభాగ్యవిధాతగా ఎలా అవుతుంది. తనకు ధనము ఎక్కడి నుండి లభిస్తుంది? బ్రహ్మ ద్వారా లభిస్తుందా, కృష్ణుని నుండి లభిస్తుందా? వారి నుండి లభించదు. జ్ఞానసాగరుని నుండే ధనము లభిస్తుంది. ఇవి చాలా గుప్తమైన విషయాలు కదా. భగవానువాచ - సర్వుల కొరకు భగవంతుడు అందరివాడు కదా. అన్ని ధర్మస్థులకు చెప్తున్నారు. - ''నన్ను ఒక్కరినే స్మృతి చేయండి'' భలే అనేకమంది శివుని పూజారులు ఉన్నా, వారికి ఏమీ తెలియదు. అది భక్తి. ఇప్పుడు మీకు జ్ఞానాన్ని ఎవరు ఇస్తారు? అతిప్రియమైన తండ్రి. కృష్ణుడైతే ఇలా అనరు. అతడిని సత్యయుగ రాకుమారుడని అంటారు. భలే కృష్ణుని పూజిస్తారు కాని, అతడు సత్యయుగ రాకుమారునిగా ఎలా అయ్యాడు? ఇంతకు ముందు మనకు కూడా తెలిసేది కాదు. ఇప్పుడు మళ్ళీ మనము రాకుమార-రాకుమారీలుగా అవుతాము. తర్వాత లక్ష్మీనారాయణులను వరిస్తామని పిల్లలైన మీకు తెలుసు. ఇది భవిష్యత్తు కొరకు జ్ఞానము. దీని ఫలితము 21 జన్మలకు లభిస్తుంది. కృష్ణుడు ఆస్తినిస్తాడని అనరు. వారసత్వము తండ్రి నుండి లభిస్తుంది. శివబాబా రాజయోగాన్ని నేర్పిస్తారు. బ్రహ్మ నోటి ద్వారా వేలాది బ్రాహ్మణులు వెలువడ్డారు. వారికే ఈ శిక్షణ లభిస్తుంది. బ్రాహ్మణులైన మీరు మాత్రమే కల్పపు సంగమ యుగానికి చెందినవారు. మిగిలిన సృష్టి అంతా కలియుగములో ఉంది. మేమంతా కలియుగంలో ఉన్నామని వారు అంటారు. మేము సంగమ యుగములో ఉన్నామని మీరంటారు. ఈ విషయాలు ఇంకెక్కడా లేవు. ఈ కొత్త కొత్త విషయాలను మనుసులో ఉంచుకోవాలి. తండ్రిని మరియు వారసత్వమును స్మృతి చేయడమే ముఖ్యమైన విషయము. పవిత్రంగా ఉండకపోతే యోగము ఎప్పటికీ కుదరదు. నియమం అలా చెప్పదు, కనుక వారు ఉన్నత పదవిని కూడా పొందలేరు. కొద్దిగా యోగము చేసినా స్వర్గములోకైతే వెళ్తారు. పవిత్రంగా అవ్వకుంటే నా వద్దకు రాలేరని తండ్రి చెప్తున్నారు. ఇంట్లో కూర్చొని కూడా స్వర్గములోకి రావచ్చు. మంచి పదవిని పొందవచ్చు. కాని ఎప్పుడైతే యోగములో ఉండి పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే. పవిత్రత లేకుంటే యోగము కుదరదు. మాయ యోగము చెయ్యనివ్వదు. సత్యమైన హృదయం పై ప్రభువు(సాహెబ్) రాజీ అవుతారు. వికారాలలోకి వెళ్ళేవారు కూడా మేము శివబాబాను స్మృతి చేస్తామని అంటారు. ఇది కేవలం తమను తాము మభ్య పెట్టుకునేందుకు అంటారు. ముఖ్యమైనది పవిత్రత. జన సంఖ్యను నియంత్రించండి, పిల్లలకు జన్మనివ్వకండి అని అంటారు. ఇది తమోప్రధానమైన ప్రపంచము. ఇప్పుడు బాబా బర్త్కంట్రోల్ చేయిస్తున్నారు. మీరంతా కుమార-కుమారీలు, కనుక వికారాల మాటే లేదు. ఇక్కడైతే విష కారణంగా పిల్లలు ఎంత సహనం చేయవలసి ఉంటుంది. చాలా పథ్యాన్ని పాటించాలని బాబా చెప్తున్నారు. ఇక్కడ మద్యమును సేవించేవారు ఎవ్వరూ లేరు కదా! అని తండ్రి పిల్లలను అడుగుతున్నారు అసత్యం చెప్తే ధర్మరాజు అత్యంత కఠినంగా శిక్షిస్తాడు. భగవంతుని ముందు నిజమే చెప్పాలి. ఏ కారణంగానైనా లేక ఔషధ రూపములోనైనా ఎవరైనా మద్యమును సేవిస్తున్నారా? ఎవరూ చేతులెత్తలేదు. ఇక్కడ కూడా సత్యమే చెప్పాలి. ఏదైనా తప్పైతే బాబాకు వ్రాయాలి - ''బాబా నా ద్వారా ఈ తప్పు జరిగింది. మాయ చెంపదెబ్బ కొట్టింది. ఈ రోజు మాలోకి కోప భూతము వచ్చింది, కొట్టాము'' అని చాలామంది పిల్లలు బాబాకు వ్రాస్తారు. కొట్టరాదని మీ మతం, కృష్ణుని రోకటి బండకు బంధించారని చూపిస్తారు. ఇవన్నీ అసత్యమైన విషయాలు. పిల్లలకు ప్రీతితో శిక్షణను ఇవ్వాలి, కొట్టరాదు. భోజనము ఇవ్వపోవడం, మిఠాయిలు ఇవ్వకుండా ఉండడం,......... ఇలా వారిని బాగుచేయాలి. దెబ్బ వేయడం - కోపానికి గుర్తు. అది కూడా మహాత్ముల పై కోపం చేసుకుంటున్నారు. చిన్నపిల్లలు మహాత్మునితో సమానము కదా. కనుక కొట్టరాదు, తిట్టరాదు కూడా. మేము ఈ వికర్మ చేశామనే ఆలోచన కలిగించే కర్మలేవీ చేయరాదు. ఒకవేళ చేస్తే వెంటనే బాబా మేము ఈ తప్పు చేశాము, మమ్ములను క్షమించండి. ముందు ముందు చేయము అని ప్రమాణము చేస్తారు కదా. అక్కడ కూడా ధర్మరాజు శిక్షను ఇస్తారు. ఇక నుండి చేయము అని ప్రమాణము చేస్తారు. బాబా చాలా ప్రీతితో - అపురూపమైన సుపుత్ర పిల్లలారా! ప్రియమైన పిల్లలారా! - ఎప్పుడూ అసత్యము చెప్పరాదు అని అంటారు. అడుగడుగులో సలహాను అడగాలి. భారతదేశాన్ని స్వర్గంగా చేయడంలో మీ ధనమును ఉపయోగిస్తారు. కనుక ప్రతి గవ్వ కూడా వజ్ర సమానమైనది. మేము సన్యాసులకు మొదలైనవారికి దాన-పుణ్యాలు చేస్తామని కాదు. మనుష్యులు హాస్పిటల్ లేక కళాశాలలు మొదలైనవి నిర్మిస్తారు. దాని నుండి ఏం లభిస్తుంది? కళాశాలలు తెరవడం ద్వారా వచ్చే జన్మలో మంచి విద్య లభిస్తుంది. ధర్మశాలలు నిర్మిస్తే మహళ్ళు లభిస్తాయి. ఇక్కడైతే మీకు జన్మ-జన్మల కొరకు తండ్రి ద్వారా అనంతమైన సుఖము లభిస్తుంది. అనంతమైన ఆయువు ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ ఆయువు ఏ ధర్మం వారికి ఉండదు. తక్కువ ఆయువు కూడా ఇక్కడిదే లెక్కింపబడ్తుంది. కావున ఇప్పుడు బేహద్ తండ్రిని నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ స్మృతి చేసినప్పుడే ఖుషీగా ఉంటారు. ఏదైనా కష్టంగా ఉంటే అడగండి అంతేకాని బాబా మేము పేదవారము, మీవారము, మీ వద్దనే ఉండిపోతామని కాదు. అలాగైతే ప్రపంచములో అనేకమంది పేదవారున్నారు. అందరూ మమ్ములను మధువనంలో ఉంచుకోండి అని అంటారు. అలా అనుమతిస్తే లక్షల మంది చేరిపోతారు. ఇది కూడా నియమం కాదు. మీరు గృహస్థ వ్యవహారములో ఉండాలి. ఇక్కడ అలాగే ఉండేందుకు లేదు. వ్యాపారములో సదా ఈశ్వరార్థము 1-2 పైసలైనా తీసి పక్కన పెడ్తారు. బాబా చెప్తున్నారు - మంచిది, మీరు పేదవారైతే ఏమీ తీయకండి. జ్ఞానాన్ని అర్థము చేసుకోండి మరియు 'మన్మనాభవ' గా ఉండిపోండి. మీ మమ్మా ఏమిచ్చారు(ధనము) ? - ఏమీ ఇవ్వలేదు. కాని జ్ఞానములో తీక్షణంగా ఉంది. తనువు-మనసు ద్వారా సేవ చేస్తోంది. ఇందులో ధనము మాటే లేదు. ఎక్కువంటే ఒక్క రూపాయి అయినా ఇవ్వండి. మీకు ధనవంతులకు ప్రాప్తించినంత ప్రాప్తి లభిస్తుంది. మొదట తమ గృహస్థ వ్యవహారాన్ని సంభాళించాలి. పిల్లలు దు:ఖీలుగా అవ్వరాదు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. చివర్లో పశ్చాత్తాపపడవలసి వచ్చే కర్మలేవీ చేయకండి. అసత్యము చెప్పరాదు. సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి.
2 భారతదేశాన్ని స్వర్గంగా చేయడంలో తమ ఒక్కొక్క పైపాను(గవ్వను) సఫలము చేసుకోవాలి. బ్రహ్మాబాబా సమానంగా సమర్పితులై నిమిత్తంగా ఉండాలి.
వరదానము :-
''నిమిత్తంగా ఉన్న ఆత్మల ఆదేశము యొక్క మహత్యాన్ని తెలుసుకొని పాపాల నుండి ముక్తముగా అయ్యే సెన్సిబుల్ (వివేకవంతులు) భవ ''
ఎవరైతే వివేకవంతమైన పిల్లలుగా ఉంటారో వారికి ''నిమిత్తంగా ఉన్న ఈ ఆత్మలు ఏ ఆదేశాన్ని ఇస్తున్నారు, అది బహుశా ఎవరు చెప్పినందువలన ఇస్తున్నారు?'' అని నిమిత్తంగా ఉన్న ఆత్మల పట్ల ఎప్పుడూ ఇటువంటి వ్యర్థ సంకల్పాలు ఉత్పన్నమవ్వరాదు. మీకు నచ్చని, సరిగ్గా తోచని ఏదైనా నిర్ణయము ఇచ్చినా అందుకు మీరు బాధ్యులు కారు. మీకు పాప ఖాతా జమ అవ్వదు. ఎందుకంటే వారిని నిమిత్తంగా చేసినవారు తండ్రి. వారు పాపాన్ని కూడా మార్చేస్తారు. ఇది గుప్త రహస్యము. గుప్త మెషీనరి.
స్లోగన్ :-
''ఎవరైతే ఆరామ్ పసంద్గా కాక ప్రభు పసందుగా, విశ్వపసందుగా ఉన్నారో, వారే ఆనెస్ట్ (నిజాయితీపరులు)''