15-12-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - మీ శ్రేష్ఠ (రాయల్) నడవడికల ద్వారా సేవ చేయాలి. శ్రీమతానుసారముగా బుద్ధిని విశుద్ధముగా(రిఫైన్) చేసుకోవాలి, మాతలను గౌరవించాలి''
ప్రశ్న :-
ఏ కర్తవ్యము ఒక్క బాబాదే అయినది? ఏ మనుష్యులది కాదు?
జవాబు :-
పూర్తి విశ్వములో శాంతిని స్థాపించడమే తండ్రి కర్తవ్యము. మనుష్యులు భలే ఎన్ని సమావేశాలు మొదలైనవి చేసినా శాంతి స్థాపన జరగజాలదు. శాంతిసాగరులైన తండ్రి పిల్లల ద్వారా పవిత్రతా ప్రతిజ్ఞ చేయించినప్పుడే శాంతి స్థాపన జరుగుతుంది. పవిత్ర ప్రపంచములోనే శాంతి ఉంటుంది. ఈ విషయాన్ని పిల్లలైన మీరు చాలా యుక్తిగా మరియు ఆడంబరముతో అర్థము చేయించండి. అప్పుడు తండ్రి పేరు ప్రసిద్ధమౌతుంది.
పాట :-
నేను ఒక చిన్న బాలుడను,................... ( మై ఏక్ నన్హాసా బచ్చా హూ,............... ) 
ఓంశాంతి.
ఈ పాట భక్తిమార్గములో గాయనము చేయబడింది. ఎందుకంటే ఒకవైపు భక్తి ప్రభావముంటుంది. మరొకవైపు ఇప్పుడు జ్ఞాన ప్రభావము ఉంది. భక్తి మరియు జ్ఞానానికి రాత్రికి - పగలుకు ఉన్నంత వ్యత్యాసముంది. ఎటువంటి వ్యత్యాసము - ఇదైతే చాలా సహజము. భక్తి రాత్రి, జ్ఞానము పగలు. భక్తిలో దు:ఖముంది. భక్తులు దు:ఖితులైనప్పుడు భగవంతుని పిలుస్తారు. దు:ఖితుల దు:ఖమును దూరం చేసేందుకు భగవంతుడు రావలసి పడ్తుంది. అప్పుడు బాబాను డ్రామాలో ఏదైనా తప్పు జరిగిందా అని అడిగితే అవును, చాలా పెద్ద పొరపాటు ఉంది, మీరు నన్ను మర్చిపోవడమే పెద్ద పొరపాటు అని బాబా అంటారు. ఎవరు మరిపిస్తారు? మాయా రావణుడు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - పిల్లలారా, ఈ ఆట తయారు చేయబడింది. స్వర్గ - నరకాలు భారతదేశములోనే ఉంటాయి. భారతదేశములోనే ఎవరైనా మరణించినప్పుడు వైకుంఠ వాసులైనారని అంటారు. కాని స్వర్గము లేక వైకుంఠము ఎప్పుడుంటాయో తెలియదు. స్వర్గమున్నప్పుడు మనుష్యులు పునర్జన్మను కూడా తప్పకుండా స్వర్గములోనే తీసుకుంటారు. ఇప్పుడైతే ఉండేది నరకము. స్వర్గ స్థాపన అయినంత వరకు మనుష్యులు పునర్జన్మలు కూడా నరకములోనే తీసుకుంటారు. మనుష్యులకు ఈ విషయాలు తెలియవు. ఒకటి ఈశ్వరీయ లేక రామ సంప్రదాయము, రెండవది రావణ సంప్రదాయము. సత్య, త్రేతా యుగాలలో రామ సంప్రదాయముంటుంది. వారికి ఎటువంటి దు:ఖము ఉండదు. అశోకవాటికలో ఉంటారు. మళ్లీ అర్ధకల్పము తర్వాత రావణరాజ్యము ప్రారంభమౌతుంది. ఇప్పుడు తండ్రి మళ్లీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మమును స్థాపన చేస్తారు. అది సర్వోత్తమ ధర్మము. ధర్మములు అనేకము ఉన్నాయి కదా. ధర్మ సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి. భారతదేశములోకి అనేక ధర్మాల వారు వస్తారు. సమ్మేళనాలు చేస్తారు. ఇప్పుడు ధర్మాన్ని విశ్వసించని భారతవాసులు ఎవరైతే తమ ధర్మమునే తెలుసుకోకుండా ఉన్నారో, వారేం ధర్మ సమ్మేళనాలు చేస్తారు? వాస్తవానికి భారతదేశపు ప్రాచీన ధర్మము ఆది సనాతన దేవీ దేవతా ధర్మము, హిందూ ధర్మమైతే లేనే లేదు. సర్వోన్నతమైనది దేవీ దేవతా ధర్మము. సర్వోన్నతమైన ధర్మము వారిని సింహసనము పై కూర్చోబెట్టాలని నియమం చెప్తుంది. అందరికంటే ముందు ఎవరిని కూర్చోబెట్టాలి? దీనిని గురించి కూడా వారు ఘర్షణ పడుతూ ఉంటారు. ఇలాగే ఒకసారి కుంభమేళాలో గొడవ జరిగింది. మొదట మా వాహన ఉరేగింపు వెళ్లాలని వారు, లేదు మా వాహన ఊరేగింపు వెళ్లాలని వీరు................... పోట్లాట మొదలయ్యింది. సర్వ శ్రేష్ఠ ధర్మమేదో పిల్లలు ఈ కాన్ఫరెన్స్లో అర్థం చేయించాలి. వారికి తెలియదు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే అని తండ్రి చెప్తున్నారు. అది ఇప్పుడు ప్రాయ: లోపమైపోయింది. స్వయాన్ని హిందువులమని చెప్పుకుంటున్నారు. చైనాలో ఉన్నవారు మాది చైనా ధర్మమని చెప్పుకోరు కదా. వారైతే ఎవరు ప్రసిద్ధమైన వ్యక్తిగా కనిపిస్తారో వారిని ముఖ్యస్థులుగా భావించి సింహాసనము పై కూర్చోబెడ్తారు. నియమానుసారము సమ్మేళనాలకైతే చాలామంది రాలేరు. కేవలం ధర్మ పెద్దలకే నిమంత్రణ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ మంది ఉంటే మాటలు కూడా ఎక్కువైపోతాయి. కాని వారికిప్పుడు సలహానిచ్చేవారు ఎవ్వరూ లేరు. మీరు శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన దేవీ దేవతా ధర్మమువారు. ఇప్పుడు దేవతా ధర్మమును స్థాపన చేస్తున్నారు. భారతదేశములో ముఖ్య ధర్మమేదైతే ఉందో, ఏదైతే సర్వ ధర్మాలకు మాత-పిత వంటిదో ఆ ధర్మ పెద్దను ఈ కాన్ఫరెన్స్లో ముఖ్యులుగా(అధ్యక్ష స్థానములో) కూర్చోబెట్టాలి. ముఖ్య ఆసనము పై వారిని కూర్చోబెట్టాలి. మిగిలిన వారందరూ వారి కంటే క్రింద ఉన్నారు. కావున ముఖ్యమైన పిల్లల బుద్ధి దీనిని గురించి పని చేయాలి.
భగవంతుడు అర్జునునికి కూర్చుని అర్థము చేయిస్తారు. ఇతడు సంజయుడు. అర్జునుడైతే రథికుడు. అతనిలో రథసారథి తండ్రి అయిన శివబాబా. కాని వారు భగవంతుడు రూపము మార్చుకొని కృష్ణుని తనువులో వచ్చి జ్ఞానమునిచ్చారని భావిస్తారు. కాని నిజానికి అలా కాదు. ఇప్పుడు ప్రజాపిత కూడా ఉన్నారు. త్రిమూర్తి చిత్రము ద్వారా చాలా బాగా అర్థము చేయించవచ్చు. త్రిమూర్తి పైన శివబాబా చిత్రము తప్పకుండా ఉంచాలి. వారు సూక్మ్ష వతనములోని రచన. ఈ విష్ణువు పాలనకర్త అని పిల్లలు అర్థం చేసుకున్నారు. ప్రజాపిత బ్రహ్మ స్థాపన కర్త. కావున వారి చిత్రము కూడా ఉండాలి. ఇవి చాలా అర్థము చేసుకోవలసిన విషయాలు. ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ఉన్నారని బుద్ధిలో ఉండాలి. విష్ణువు కూడా కావాలి. ఎవరి ద్వారా స్థాపన చేయిస్తారో, వారి ద్వారానే పాలన కూడా చేయిస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు. బ్రహ్మతో పాటు సరస్వతి మొదలైన పిల్లలు చాలా మంది ఉన్నారు. వాస్తవానికి వారు కూడా పతితుల నుండి పావనముగా అవుతున్నారు. కావున సమ్మేళనాలలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మపు పెద్దగా జగదంబ ఉండాలి. ఎందుకంటే మాతలకు చాలా గౌరవముంటుంది. జగదంబకు చాలా పెద్ద మేళా జరుగుతుంది. ఆమె జగత్పిత పుత్రిక. ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన జరుగుతోంది. గీతా అధ్యాయము పునరావృతమవుతోంది. ఇది అదే మహాభారత యుద్ధము. ఇప్పుడు ఎదురుగా నిల్చొని ఉంది. తండ్రి కూడా చెప్తున్నారు - నేను కల్ప-కల్పము, కల్పపు సంగమ యుగములో భ్రష్ఠాచారి ప్రపంచాన్ని శ్రేష్ఠాచారి ప్రపంచంగా పరివర్తన చేసేందుకు వస్తాను. జగదంబ జ్ఞానదేవిగా మహిమ చేయబడింది. ఆమెతో పాటు జ్ఞాన గంగలు కూడా ఉన్నారు. వారికి ఈ జ్ఞానము ఎక్కడ నుండి లభించిందని వారిని అడగవచ్చు. జ్ఞాన సాగరులైన గాడ్ఫాదర్ ఒక్కరే. వారు జ్ఞానాన్ని ఎలా ఇవ్వాలి? తప్పకుండా శరీరాన్ని తీసుకోవలసి వస్తుంది. కావున బ్రహ్మ ముఖ కమలము ద్వారా వినిపిస్తారు. ఈ మాతలు కూర్చుని అర్థము చేయిస్తారు. కాన్ఫరెన్స్లో వారికి గొప్ప ధర్మమేదో తెలియాలి కదా. మనము ఆది సనాతన దేవీదేవతా ధర్మమువారమని ఎవ్వరూ భావించరు. ఈ ధర్మము ప్రాయ: లోపమైపోయినప్పుడు నేను వచ్చి మళ్లీ స్థాపన చేస్తానని తండ్రి అంటున్నారు. ఇప్పుడు దేవతా ధర్మము లేదు. మిగిలిన మూడు ధర్మాల వృద్ధి జరుగుతూ ఉంది. కనుక మళ్లీ దేవీ దేవతా ధర్మమును తప్పకుండా స్థాపించాల్సి ఉంటుంది. తర్వాత మళ్లీ మిగిలిన ఈ ధర్మాలేవీ ఉండనే ఉండవు. ఆది సనాతన దేవీదేవతా ధర్మాన్ని స్థాపన చేసేందుకే తండ్రి వస్తారు. శాంతి స్థాపన ఎలా అవుతుందో పిల్లలైన మీరే తెలియజేయగలరు. శాంతి సాగరులు ఒక్క పరమపిత పరమాత్మయే. కనుక వారే తప్పకుండా శాంతిని స్థాపన చేస్తారు. జ్ఞాన సాగరులు, సుఖసాగరులు వారే. ''ఓ పతిత పావనా! రండి, వచ్చి భారతదేశాన్ని పావన రామరాజ్యంగా చేయండని కూడా పాడ్తారు. శాంతిమయముగా అయితే వారే తయారుచేస్తారు. ఇది తండ్రి కర్తవ్యమే. మీరు వారి మతముననుసరిస్తే శ్రేష్ఠ పదవిని పొందుతారు. ఎవరైతే నా వారిగా అవుతారో, రాజయోగాన్ని నేర్చుకుంటారో మరియు ఎవరైతే ''బాబా, మేము పవిత్రంగా అయ్యి 21 జన్మలకు వారసత్వాన్ని తీసుకుంటామని పవిత్రతా ప్రతిజ్ఞను చేస్తారో వారే యజమానులుగా అవుతారు.'' పతితుల నుండి పావనంగా అవుతారు. పావనులైన లక్ష్మీనారాయణులే సర్వ శ్రేష్ఠులు. ఇప్పుడు మళ్లీ పావన ప్రపంచము స్థాపన జరుగుతోంది. మీరు శాంతి కొరకు సమ్మేళనాలు చేస్తున్నారు. కాని మనుష్యులు శాంతి స్థాపన చేయలేరు. ఇది శాంతిసాగరుడైన తండ్రి కర్తవ్యము. సమ్మేళనాలలో గొప్ప-గొప్ప వ్యక్తులు వస్తారు. చాలామంది సభ్యులుగా అవుతారు. వారికి సలహా కూడా ఇవ్వవలసి ఉంటుంది. పిల్లలను తండ్రి ప్రత్యక్షము చేస్తారు. శివబాబా పౌత్రులు, బ్రహ్మ పిల్లలు జ్ఞానదేవీలు. వారికి భగవంతుడు జ్ఞానమునిచ్చారు. మనుష్యులైతే శాస్త్రాల జ్ఞానమును చదువుతారు. ఇలా అథారిటీతో తెలిపిస్తే ఆనందం కలుగుతుంది. యుక్తిని తప్పకుండా రచించాల్సి ఉంటుంది. ఒకవైపు వారి సమ్మేళనాలు, మరొకవైపు అత్యంత వైభవముతో మీ సమ్మేళనాలు కూడా జరగాలి. సహజంగా అర్థము చేసుకునేందుకు చిత్రాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. వాటి ద్వారా వె౦టనే అర్థము చేసుకుంటారు. వారి కర్తవ్యము వేరు, వీరి కర్తవ్యము వేరు. అందరూ ఒక్కటే అవ్వజాలరు. ధర్మాలన్నింటి పాత్ర వేరు వేరుగా ఉంటుంది. శాంతి కొరకు పరస్పరము కలిసి కార్యమును చేస్తారు. ధర్మము ఒక శక్తి అని అంటారు. కాని అందరికంటే శక్తివంతుడు ఎవరు? వారే వచ్చి మొదటి నంబరు ధర్మమైన దేవీ దేవతా ధర్మమును స్థాపన చేస్తారు. ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. రోజురోజుకు పిల్లలైన మీకు పాయింట్లు లభిస్తూ ఉంటాయి. అర్థము చేయించే శక్తి కూడా ఉంది. యోగశక్తి బాగుంటుంది. జ్ఞానీ ఆత్మలే నాకు ప్రియులని బాబా అంటారు. అలాగని యోగులు ప్రియమైనవారు కాదని కాదు. ఎవరైతే జ్ఞానులుగా ఉంటారో, వారు తప్పకుండా యోగులుగా కూడా ఉంటారు. యోగము పరమపిత పరమాత్మునితో జోడిస్తారు. యోగము లేకుండా ధారణ జరగదు. ఎవరికైతే యోగము ఉండదో, వారికి ధారణ జరగదు ఎందుకంటే దేహాభిమానము చాలా ఉంటుంది. ఆసురీ బుద్ధి గలవారిని దైవీ బుద్ధిగలవారిగా తయారు చేయాలని తండ్రి అర్థము చేయిస్తారు. రాతిబుద్ధిని బంగారు బుద్ధిగా చేయువారు తండ్రి అయిన ఈశ్వరుడు. రావణుడు వచ్చి రాతిబుద్ధి గలవారిగా చేస్తాడు. వారి పేరే ఆసురీ సంప్రదాయము. దేవతల ముందుకు వెళ్ళి మాలో ఏ గుణాలు లేవు, మేము కామకులము, కపటులము అని అంటారు. మాతలైన మీరు చాలా బాగా అర్థము చేయించగలరు. మురళిని నడిపించేందుకు చాలా ఉమంగముండాలి. పెద్ద పెద్ద సభలలో ఇటువంటి విషయాలు తెలిపించాల్సి ఉంటుంది. మమ్మా జ్ఞానదేవి. బ్రహ్మను ఎప్పుడూ జ్ఞానదేవుడని అనరు. సరస్వతి పేరు గాయనం చేయబడింది. ఎవరికి ఏ పేరుంటుందో ఆ పేరునే పెడ్తారు. మాతల పేరును ప్రసిద్ధము చేయాలి. చాలామంది గోపకులకు చాలా దేహాభిమానముంది. బ్రహ్మకుమారులైన మేము జ్ఞాన దేవులము కామా అని అనుకుంటారు. అరే! స్వయం ఈ బ్రహ్మయే తనను తాను జ్ఞాన దేవునిగా చెప్పుకోవడం లేదు. మాతలను చాలా గౌరవించాల్సి ఉంటుంది. ఈ మాతలే జీవితాన్ని పరివర్తన చేయువారు. మనుష్యుల నుండి దేవతలుగా చేయువారు. మాతలూ ఉన్నారు, కన్యలూ ఉన్నారు. అధర్ కుమారీల రహస్యమునైతే ఎవ్వరూ అర్థం చేసుకోరు. భలే వివాహితులై ఉన్నా, బ్రహ్మకుమారీలే కదా. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. ఎవరైతే తండ్రి నుండి వారసత్వమును పొందవలసి ఉందో వారే అర్థము చేసుకుంటారు. అదృష్టములో లేని వారు ఏమి అర్థము చేసుకుంటారు. హోదాలు తప్పకుండా నంబరువారుగా ఉన్నాయి. అక్కడ కూడా కొందరు దాస-దాసీలు, కొందరు ప్రజలుగా ఉంటారు. ప్రజలు కూడా కావాలి. మనుష్య సృష్టి వృద్ధి చెందుతూ ఉంటుంది. కనుక ప్రజలు కూడా వృద్ధి చెందుతూ ఉంటారు. కావున ఇటువంటి సమ్మేళనాలు జరిగినప్పుడు తమను తాము ముఖ్యులుగా భావించువారు తయారుగా ఉండాలి. జ్ఞానము లేనివారు చిన్నవారితో సమానము. అంత బుద్ధి ఉండదు. చూచేందుకు పెద్దవారే కాని బుద్ధి ఉండదు. అటువంటివారు చిన్నవారే. కొందరి బుద్ధి చాలా బాగుంటుంది. ఆధారమంతా బుద్ధి పైనే ఉంది. చిన్న చిన్నవారు కూడా చాలా తీక్షణంగా వెళ్తారు. కొందరు తెలిపిస్తుంటే చాలా మధురంగా అనిపిస్తుంది. చాలా రాయల్గా సంభాషిస్తూ ఉంటారు. వీరు చాలా మంచి పిల్లలని(రిఫైన్ పిల్లలని) అర్థమౌతుంది. నడవడికల ద్వారా కూడా ప్రత్యక్షమౌతారు కదా. పిల్లల నడవడికలు చాలా శ్రేష్ఠంగా(రాయల్గా) ఉండాలి. ఎటువంటి అమర్యాదకరమైన కార్యము చేయరాదు. చెడు పేరును తెచ్చేవారు ఉన్నతమైన పదవిని పొందలేరు. శివబాబా పేరును చెడుపుతున్నారంటే తెలిపించే హక్కు తండ్రికి కూడా ఉంది. అచ్ఛా!
రాత్రి క్లాసు :-
జీవాత్మలమైన మనము పరమపిత పరమాత్ముని సన్ముఖములో కూర్చుని ఉన్నామని ఇప్పుడు పిల్లలైన మీరు భావిస్తారు. దీనినే మంగళ మిలనము అని అంటారు. మంగళమ్ భగవాన్ విష్ణు.......... అని మహిమ చేస్తారు కదా. ఇప్పుడిది మంగళ మిలనము కదా. భగవంతుడు విష్ణు కులపు వారసత్వమునిస్తారు. అందుకే వారిని మంగళమ్ భగవాన్ విష్ణువు అని అంటారు. తండ్రి జీవాత్మలతో కలిసినప్పుడు అది చాలా సుందరంగా ఉంటుంది. ఇప్పుడు ఈశ్వరుని నుండి మన వారసత్వమును తీసుకునేందుకు ఈశ్వరీయ సంతానంగా అయ్యామని మీరు భావిస్తారు. ఈశ్వరీయ వారసత్వము తర్వాత దైవీ వారసత్వము లభిస్తుందని అంటే స్వర్గములో పునర్జన్మ లభిస్తుందని పిల్లలకు తెలుసు కావున పిల్లలలో ఖుషీ పాదరస మట్టము పైకెక్కి ఉండాలి. మీ వంటి అదృష్టవంతులు లేక సౌభాగ్యశాలురైతే మరెవ్వరూ లేరు. ప్రపంచములో బ్రాహ్మణ కులస్థులైన మీరు తప్ప మరెవ్వరూ భాగ్యశాలురుగా అవ్వజాలరు. విష్ణు కులము సెకెండు నెంబరు అవుతుంది. అది దైవీ ఒడి. ఇప్పుడిది ఈశ్వరీయ ఒడి అంటే ఇది శ్రేష్ఠమైనది కదా. దిల్వాడా మందిరము అనగా ఈశ్వరీయ ఒడిలోని మందిరము. అంబ మందిరము కూడా ఉంది. అది సంగమయుగ సాక్షాత్కారమును అంతగా చేయించదు. ఈ దిల్వాడా మందిరము సంగమ యుగమును సాక్షాత్కారము చేయిస్తుంది. పిల్లలు అర్థము చేసుకున్నంతగా ఇతర ఏ మానవ మాత్రులు అర్థము చేసుకోలేరు. బ్రాహ్మణులైన మీకున్నంత జ్ఞానము దేవతలకు కూడా లేదు. పిల్లలకున్నంత తెలివి కూడా ఉండదు. మీరు సంగమ యుగపు బ్రాహ్మణులు. వారు మిమ్ములనే '' బ్రాహ్మణ సో దేవత '' అని మహిమ చేస్తారు. బ్రాహ్మణులే దేవతలుగా అవుతారని అంటారు. అటువంటి బ్రాహ్మణులకు నమస్కారము. బ్రాహ్మణులే నరకాన్ని స్వర్గంగా తయారు చేసే సేవ చేస్తారు. అటువంటి పిల్లలకు(బ్రాహ్మణులకు) నమస్కారము. మంచిది. గుడ్ నైట్ .
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రికి ప్రియమైన వారిగా అయ్యేందుకు జ్ఞానులుగా, యోగులుగా అవ్వాలి. దేహాభిమానములోకి రాకూడదు.
2. మురళిని నడిపించే ఉత్సాహము కలిగి ఉండాలి. తమ నడవడిక ద్వారా తండ్రిని ప్రత్యక్షము చేయాలి, చాలా మధురంగా మాట్లాడాలి.
వరదానము :-
''మనసా మరియు వాచా శక్తులను యథార్థమైన సమర్థ రూపంతో కార్యంలో ఉపయోగించే తీవ్ర పురుషార్థి భవ''
తీవ్ర పురుషార్థులనగా ఫస్ట్ డివిజన్లో వచ్చే పిల్లలు. వారి సంకల్ప శక్తిని, వాచా శక్తిని యథార్థమైన సమర్థ రీతి ద్వారా కార్యములో ఉపయోగించేవారు. వారు ఇందులో లూజ్గా అవ్వరు. వారికి సదా తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి, మధురంగా మాట్లాడండి అనే స్లోగన్ గుర్తు ఉంటుంది. వారు అవసరమైనంత వరకే మాట్లాడ్తారు. వ్యర్థ మాటలు మాట్లడడం వలన, విషయాన్ని విస్తారము చేసి మాట్లాడడం ద్వారా మీ శక్తిని సమాప్తం చేసుకుంటారు. వారు సదా ఏకాంత ప్రియులుగా ఉంటారు.
స్లోగన్ :-
''ఎవరైతే 'నాది' అనే అధికారాన్ని కూడా త్యాగం చేసినవారే సంపూర్ణ నిర్మోహులు''