16-11-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - మీరు ఆత్మిక మార్గదర్శకులుగా అయ్యి యాత్ర చేయాలి, చేయించాలి. స్మృతియే మీ యాత్ర. స్మృతి చేస్తూ ఉంటేే ఖుషీ పాదరస మట్టము పైకి ఎక్కుతుంది''
ప్రశ్న :-
నిరాకారి ప్రపంచములోకి వెళ్తూనే ఏ సంస్కారము సమాప్తమైపోతుంది? ఏ సంస్కారము మిగిలిపోతుంది?
జవాబు :-
అక్కడ జ్ఞాన సంస్కారాలు సమాప్తమైపోతాయి. ప్రాలబ్ధ సంస్కారాలు మిగిలి ఉంటాయి. ఆ సంస్కారాల ఆధారము పై పిల్లలైన మీరు సత్యయుగములో ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. అక్కడ మళ్లీ చదువు సంస్కారాలు గాని, పురుషార్థ సంస్కారాలు గాని ఉండవు. ప్రాలబ్ధము లభించగానే జ్ఞానము సమాప్తమైపోతుంది.
పాట :-
రాత్రి ప్రయాణీకుడా! అలసిపోకు,..................(రాత్ కే రాహీ థక్ మత్ జానా,....................) 
ఓంశాంతి.
ఇక్కడ సన్ముఖంలో ''శివ భగవానువాచ'' అని ఉంది. ''శ్రీ కృష్ణ భగవానువాచ'' అని గీతలో చూపించారు. కాని కృష్ణుడు ఆ నామ-రూపాలలో సన్ముఖములో ఉండజాలడు. ఇక్కడ సన్ముఖములో నిరాకార భగవానువాచ, కృష్ణ ఉవాచ అని అంటే అది సాకారమైపోతుంది. వేద శాస్త్ర్రాలు మొదలైనవి వినిపించే వారెవ్వరూ భగవానువాచ అని అనలేరు. ఎందుకంటే ఆ సాధు - సన్యాస మహాత్ములు మొదలైన వారందరూ సాకారములో కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఓ ఆత్మిక ప్రయాణికులారా! అని తండ్రి చెప్తున్నారు. ఆత్మిక తండ్రి తప్పకుండా - పిల్లలారా! అలసిపోకండి అని ఆత్మలతోనే అంటారు. యాత్రలో ఎవరైనా అలసిపోయినట్లైతే తిరిగి వాపస్ వచ్చేస్తారు. అది శారీరిక యాత్ర, భిన్న-భిన్న మందిరాలకు శారీరిక యాత్రలు చేసేందుకు వెళ్తారు. కొందరు శివుని మందిరానికి వెళ్తారు. అక్కడ అన్ని భక్తిమార్గపు శరీరధారి చిత్రాలే ఉంచబడి ఉంటాయి. ఇక్కడ సుప్రీమ్ ఆత్మ అయిన పరమపిత పరమాత్మ - ''ఓ పిల్లలారా! ఇప్పుడు నా ఒక్కరితోనే బుద్ధియోగము జోడించండి అని ఆత్మలకు చెప్తున్నారు. అంతేకాక జ్ఞానాన్ని కూడా ఇస్తున్నారు.'' తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా బ్రాహ్మణులు కథా-కీర్తనలు పాడుతూ ఉంటారు. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు మీ సత్యనారాయణుని కథ ఒక్కటే ఉంది. మొదట మధురమైన ఇంటికి వెళ్తాము. తర్వాత మళ్లీ విష్ణుపురికి వస్తామని మీకు తెలుసు. ఈ సమయములో మీరు బ్రహ్మపురిలో ఉన్నారు. దీనిని పుట్టినిల్లు అని అంటారు. మీకు ఆభరణాలు మొదలైనవి ఏవీ లేవు ఎందుకంటే మీరు అమ్మగారింటిలో ఉన్నారు. అత్తగారింటిలో అపార సుఖము లభిస్తుందని మీకు తెలుసు. ఇక్కడ కలియుగీ అత్తగారింటిలో అపారమైన దు:ఖముంది. మీరు ఆవలి వైపున్న సుఖధామానికి వెళ్లాలి. ఇక్కడ నుండి బదిలీ అవ్వాలి. తండ్రి అందరినీ కనుల పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్తారు. కృష్ణుని తండ్రి అతడిని బుట్టలో పెట్టుకుని ఆవలి తీరానికి తీసుకెళ్లారని చూపిస్తారు. ఈ బేహద్ తండ్రి పిల్లలైన మిమ్ములను ఆవలి తీరాన ఉన్న అత్తగారింటికి తీసుకెళ్తారు. మొదట మన నిరాకార ఇంటికి తీసుకెళ్తారు. తర్వాత మళ్లీ అత్తగారింటికి పంపిస్తారు. అక్కడ శాంతిధామంలో అమ్మగారిల్లు, అత్తగారిల్లు అనే ఈ మాటలన్నీ మీరు మర్చిపోతారు. అది నిరాకారి పుట్టినిల్లు, అక్కడ ఈ జ్ఞానాన్ని మర్చిపోతారు. జ్ఞాన సంస్కారము తొలగిపోతుంది. ప్రాలబ్ధ సంస్కారము మిగిలి ఉంటుంది. తర్వాత పిల్లలైన మీకు ప్రాలబ్ధమే గమనములో ఉంటుంది. ప్రాలబ్ధము అనుసారముగా వెళ్లి సుఖప్రదమైన జన్మలు తీసుకుంటారు. సుఖధామానికి వెళ్లాలి. ప్రాలబ్ధము లభించిన తర్వాత జ్ఞానము సమాప్తమైపోతుంది. ప్రాలబ్ధములో మళ్లీ మన అదే పాత్ర అభినయించబడ్తుందని మీకు తెలుసు. మీ సంస్కారమే ప్రాలబ్ధ సంస్కారముగా అవుతుంది. ఇప్పుడు పురుషార్థ సంస్కారముంది. అక్కడ పురుషార్థము మరియు ప్రాలబ్ధము రెండు సంస్కారాలు ఉంటాయని కాదు. అక్కడ ఈ జ్ఞానము ఉండదు(అక్కడ కేవలం ప్రాలబ్ధ సంస్కారమే ఉంటుంది). ఇది మీ ఆత్మికయాత్ర. మీ ముఖ్య మార్గదర్శకులు తండ్రి. వాస్తవానికి మీరు కూడా ఆత్మిక మార్గదర్శకులుగా అవుతారు. అందరినీ మీ జతలో తీసుకెళ్తారు. వారు శారీరిక మార్గదర్శకులు. మీరు ఆత్మిక మార్గదర్శకులు. వారు ప్రత్యేకంగా అమరనాథ్కు చాలా వైభవోపేతంగా వెళ్తారు. గుంపులు గుంపులుగా విశేషంగా అమరనాథ్కు చాలా ధూంధాంగా వెళ్తారు. ఎంతమంది సాధు సన్యాసులు మేళ-తాళాల సమేతంగా వెళ్తారో బాబా చూశారు. చలికాలమైతే జతలో డాక్టరు మొదలైనవారిని కూడా తీసుకెళ్తారు. కొందరు అనారోగ్య పాలవుతారు. మీ యాత్ర చాలా సహజమైనది. స్మృతిలో ఉండడమే మీ యాత్ర. స్మృతి ముఖ్యమైనది. పిల్లలు స్మృతి చేస్తూ ఉంటే సంతోష పాదరస మట్టము పైకెక్కి ఉంటుంది. మీ జతలో ఇతరులను కూడా యాత్రకు తీసుకెళ్లాలి. ఈ యాత్ర ఒకేసారి జరుగుతుంది. ఆ శారీరిక యాత్రలైతే భక్తిమార్గము నుండి ప్రారంభమౌతాయి. అవి కూడా ప్రారంభములో ఉండవు. వెంటనే మందిరాలు, చిత్రాలు మొదలైనవి తయారవుతాయని కాదు. అవి తర్వాత నెమ్మది నెమ్మదిగా తయారవుతూ ఉంటాయి. మొట్టమొదట శివుని మందిరము తయారౌతుంది. అది కూడా మొదట ఇంట్లోనే సోమనాథుని మందిరము తయారు చేస్తారు. కనుక ఎక్కడికీ వెళ్ళే అవసరముండదు. ఈ మందిరాలు మొదలైనవి తర్వాత తయారవుతాయి. సమయము పడ్తుంది. నెమ్మది నెమ్మదిగా నూతన శాస్త్రాలు, నూతన చిత్రాలు, నూతన మందిరాలు మొదలైనవి తయారవుతాయి. సమయము పడ్తుంది. ఎందుకంటే శాస్త్రాలు చదివేవారు కూడా ఉండాలి కదా. మఠాలు ఎప్పుడు వృద్ధి అవుతాయో అప్పుడు శాస్త్ర్రాలు తయారు చేయాలనే ఆలోచన వస్తుంది. ఇన్ని తీర్థ స్థానాలు, మందిరాలు, చిత్రాలు తయారవ్వడానికి సమయము పడ్తుంది కదా. భక్తిమార్గము ద్వాపరము నుండి ప్రారంభమౌతుందని అంటారు. కాని సమయమైతే పడ్తుంది కదా. తర్వాత కళలు తగ్గిపోతూ వస్తాయి. మొదట అవ్యభిచారి భక్తి, తర్వాత వ్యభిచారి భక్తిగా అవుతుంది. ఈ విషయాలన్నీ చిత్రాల ద్వారా బాగా నిరూపణ చేసి తెలియచేయబడ్తాయి. ఇలాంటి ఇలాంటి చిత్రాలు తయారుచేయాలి, ఇలా అర్థము చేయించాలి అని అర్థం చేయించే వారి బుద్ధిలో ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. అందరి బుద్ధిలో ఇలా నడవదు. నంబరువారుగా ఉన్నారు కదా. కొందరి బుద్ధి అసలు పని చేయదు. వారు అలాంటి పదవినే పొందుతారు. వీరు ఏమి అవుతారో తెలిసిపోతుంది. మీరు ఎంత ముందుకు వెళ్తుంటారో అంత మీరు అర్థము చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు యుద్ధాలు మొదలైనవి ప్రారంభమౌతాయో అప్పుడు మీరు ప్రత్యక్షంగా చూస్తారు. తర్వాత చాలా పశ్చాత్తాపపడ్తారు. ఆ సమయములో చదువు సాగదు. యుద్ధ సమయములో త్రాహి-త్రాహి(రక్షించండి - రక్షించండి) అని బిగ్గరగా అరుస్తూ ఉంటారు. వినుటకు కూడా సాధ్యము కాదు. ఏమౌతుందో తెలియదు. పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు ఏమయ్యిందో చూశారు కదా. ఈ వినాశ సమయము చాలా కఠినమైనది. సాక్షాత్కారాలు మొదలైనవి చాలా జరుగుతాయి. దీని ద్వారా ఎవరు ఎంత చదివారో తెలుసుకుంటారు. చాలా పశ్చాత్తాపపడ్తారు కూడా. మీరు చదువును వదిలేశారు అందుకే ఈ పరిస్థితి వచ్చింది చూడండని సాక్షాత్కారము చేయిస్తారు. ధర్మరాజు సాక్షాత్కారాలు చేయించకుండా శిక్షలు ఎలా ఇస్తారు? అన్నీ సాక్షాత్కారాల ద్వారా చూపిస్తారు. ఇక ఆ సమయములో ఏమీ చేయలేరు. అయ్యో! నా భాగ్యము(ఇంతే తయారైనది కదా) అని అంటారు. పురుషార్థము చేసే సమయమైతే అయిపోయింది కదా అని విలపిస్తారు. కనుక పురుషార్థము ఇప్పుడే ఎందుకు చేయరు? అని తండ్రి అడుగుతారు. సర్వీసు ద్వారానే తండ్రి హృదయములో స్థానము లభిస్తుంది. ఈ పిల్లలు బాగా సర్వీసు చేస్తారని తండ్రి చెప్తారు. సైన్యములో ఎవరైనా మరణిస్తే వారి బంధు-మిత్రులు మొదలైన వారికి కూడా బహుమతులిస్తారు. ఇక్కడ మీకు బహుమానమిచ్చేవారు అనంతమైన తండ్రి. తండ్రి ద్వారా భవిష్య 21జన్మలకు బహుమతి లభిస్తుంది. నేను ఎంత చదువుతున్నాను? అనేది ప్రతి ఒక్కరు వారి హృదయము పై చెయ్యి ఉంచుకొని ప్రశ్నించుకోవాలి. ధారణ జరగలేదంటే అదృష్టములో లేదని అర్థము. కర్మలే అలా ఉన్నాయని అంటారు. చాలా చెడ్డ కర్మలు చేసేవారు ఏమీ తీసుకోలేరు, కొద్దిగా కూడా ధారణ చేయలేరు.
మధురమైన పిల్లలారా! మీరు మీ తోటివారిని కూడా ఈ ఆత్మిక యాత్రకు తీసుకెళ్లాలని తండ్రి చెప్తున్నారు. ఈ యాత్ర గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయడమే మీ కర్తవ్యము. ఇది మా ఆత్మికయాత్ర అని చెప్పండి. అది శారీరిక యాత్ర. రంగూన్ వద్ద ఒక మంచి సరోవరముందని అందులో స్నానము చేయడం వలన దేవ కన్యలైపోతారని చెప్తారు. కాని అలా ఏమీ జరగదు. ఇది జ్ఞాన స్నానానికి సంబంధించిన విషయము. దీని ద్వారానే మీరు స్వర్గానికి రాణిగా(బీబీ) అవుతారు అంతేకాక జ్ఞాన-యోగాల శక్తి ద్వారా వైకుంఠములోకి వస్తూ - వెళ్తూ ఉండడము మీకు సామాన్యమైన విషయము. ఇక్కడ మాటి మాటికి ధ్యానము(ట్రాన్స్)లోనికి వెళ్ళకండి. అదే అలవాటైపోతుంది అని మిమ్ములను ఆపడం జరుగుతుంది. ఇది జ్ఞాన మానస సరోవరము. పరమపిత పరమాత్మ వచ్చి ఈ మనుష్య తనువు ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తారు. కనుక దీనిని మానస సరోవరము అని అంటారు. మానస సరోవరము అను పదము సాగరము నుండి వెలువడింది. జ్ఞాన సాగరములో జ్ఞాన స్నానము చేయడము చాలా మంచిది. స్వర్గములో అధికారిణికి(బీబీకి) మహారాణి అని అంటారు. మీరు కూడా స్వర్గానికి యజమానులుగా అవ్వండి అని తండ్రి అంటారు. పిల్లల పై ప్రేమ ఉంటుంది. ప్రతి ఒక్కరి పై దయ కలుగుతుంది. సాధువుల పై కూడా దయ కలుగుతుంది. సాధువులను కూడా ఉద్ధారము చేస్తారని గీతలో వ్రాయబడి ఉంది. జ్ఞాన-యోగాల ద్వారా ఉద్ధారము జరుగుతుంది. పిల్లలైన మీరు ఇతరులకు అర్థము చేయించే చురుకుదనము చాలా అవసరము. వారికి చెప్పండి - మీరు అన్నీ తెలుసుకున్నారు కాని అదంతా మజ్జిగ వంటిదే(భక్తి). వెన్నను తినిపించేవారి గురించి మీకు తెలియనే తెలియదు. తండ్రి ఎంత బాగా అర్థము చేయిస్తున్నారు! కాని ఎవరి బుద్ధిలోనైనా కూర్చోవాలి కదా. తండ్రిని తెలుసుకోవడం వలన మనుష్యులు వజ్ర సమానంగా అవుతారు. తెలుసుకుంటే మనుష్యులు గవ్వ సమానంగా పూర్తి పతితులైపోతారు. తండ్రిని తెలుసుకోవడం ద్వారానే పావనంగా అవుతారు. పతిత ప్రపంచములో పావనులెవ్వరూ ఉండరు కావున ఎవరైతే మహారథీ¸ పిల్లలో వారు చాలా బాగా అర్థము చేయించగలరు. ఎంతమంది బ్రహ్మకుమార-బ్రహ్మకుమారీలున్నారు! ప్రజాపిత బ్రహ్మ అను పేరు కూడా ప్రసిద్ధమైనది. వీరు ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి. బ్రహ్మకే నూరు భుజాలు, వెయ్యి భుజాలు చూపిస్తారు. ఇన్ని భుజాలు ఉండవని కూడా అర్థము చేయించబడింది. పోతే బ్రహ్మ చాలామంది పిల్లలు కలిగినవారు. బ్రహ్మ ఎవరి సంతానము? ఇతనికి తండ్రి ఉన్నారు కదా, బ్రహ్మ శివబాబా కుమారుడు. ఇతనికి ఇక ఏ తండ్రి ఉండగలడు? మానవులు తండ్రిగా అవ్వడానికి సాధ్యము లేదు. సూక్ష్మవతన వాసులని బ్రహ్మ-విష్ణు-శంకరులకు గాయనముంది. వారైతే ఇక్కడకు రాలేరు. ప్రజాపిత బ్రహ్మ అయితే తప్పకుండా ఇక్కడే ఉంటారు కదా. సూక్ష్మ వతనములో అయితే ప్రజలను రచించరు కనుక పరమపిత పరమాత్మ వచ్చి ఈ బ్రహ్మ నోటి ద్వారా శక్తి సైన్యాన్ని రచిస్తారు. మేము బ్రహ్మ ముఖ వంశావళి వారమని మొట్టమొదట పరిచయమునివ్వాలి. మీరు కూడా బ్రహ్మ పిల్లలే కదా. ప్రజాపిత బ్రహ్మ అందరికీ తండ్రి. మళ్లీ వారి నుండి అనేక వంశాలు(కొమ్మలు-రెమ్మలు) వెలువడ్తాయి. పేర్లు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు. ప్రజాపిత బ్రహ్మకు ఎంతమంది పిల్లలున్నారో ప్రత్యక్షంగా చూడండి! వారసులకు తప్పకుండా వారసత్వము లభిస్తుంది. బ్రహ్మ వద్ద ఏ ఆస్తీ లేదు. ఆస్తి శివబాబా వద్ద ఉంది. శివుని కుమారుడు బ్రహ్మ. బేహద్ తండ్రి నుండే వారసత్వము లభిస్తుంది. బ్రహ్మ ద్వారా శివబాబా కూర్చొని చదివిస్తారు. మనకు తాతగారి ఆస్తి లభిస్తుంది. బాబా చాలా విషయాలు అర్థము చేయిస్తారు. కాని యోగము లేదు, నియమానుసారము నడవకుంటే తండ్రి కూడా ఏమి చేయగలరు - అది వారి భాగ్యము అని తండ్రి అంటారు. ఈ పరిస్థితిలో మీకు ఏ పదవి లభిస్తుంది? అని బాబాను అడిగితే బాబా చెప్పగలరు. మనస్సు కూడా సాక్ష్యమిస్తుంది. నేను ఎంత సర్వీసు చేశాను? శ్రీమతము పై ఎంతవరకు నడుస్తున్నాను? శ్రీమతము ''మన్మనాభవ'' అని చెప్తుంది. అందరికీ తండ్రి మరియు వారసత్వముల పరిచయమిస్తూ ఉంటారు. దండోరా కూడా వేస్తుంటారు. మీరు ప్రభుత్వానికి కూడా అర్థము చేయించాలని బాబా సూచన ఇస్తూ ఉంటారు. భారతదేశపు శక్తియే సమాప్తమైపోయిందని వారు కూడా అర్థము చేసుకోవాలి. పరమపిత పరమాత్మ అయిన సర్వశక్తివంతునితో యోగమే లేదు. వారితో మీరు యోగాన్ని జోడిసే పూర్త్తి విశ్వాధికారులుగా అవుతారు. మాయ పై కూడా మీరు విజయము పొందుతారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ మాయ పై విజయము పొందాలి. స్వయం తండ్రియే మన సహయోగి. ఎంతగా అర్థము చేయించబడ్తుంది! ధారణ చేయాలి. జ్ఞాన ధనాన్ని దానము చేసినా ధనము తరగదు(ధన్ దియే ధన్ నా కూటే,..........) అని బాబా తెలియజేశారు. సర్వీసు చేసినప్పుడే బాబా హృదయములో స్థానము పొందగలరు. లేకుంటే అసాధ్యము అంటే బాబా ప్రేమించరని కాదు. బాబా సేవాధారి పిల్లలను ప్రేమిస్తారు. శ్రమ పడాలి. అందరినీ యాత్రకు యోగ్యులుగా తయారుచేస్తారు. '' మన్మనాభవ - ఇది ఆత్మిక యాత్ర, నన్ను స్మృతి చేసినట్లైతే మీరు నా వద్దకు చేరుకుంటారు.'' శివపురికి వచ్చి తర్వాత మళ్లీ విష్ణుపురిలోకి వెళ్తారు. ఈ విషయాలు కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. వేరెవ్వరికీ మన్మనాభవకు అర్థము తెలియదు. చదవడమైతే చాలా మంది చదువుతారు. నన్ను స్మృతి చేస్తే మీరు వికర్మాజీతులుగా అవుతారని బాబా మహామంత్రమునిస్తారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. జ్ఞాన స్నానము చేయాలి, ప్రీతిగా సర్వీసు చేసి తండ్రి హృదయ సింహాసనము పై కూర్చోవాలి. పురుషార్థ సమయములో సోమరులుగా అవ్వరాదు.
2. తండ్రి కంటి రెప్పల పై కూర్చొని కలియుగీ దు:ఖధామము నుండి సుఖధామానికి వెళ్ళాలి కనుక మీ సర్వస్వాన్ని బదిలీ చేసేయాలి.
వరదానము :-
'' స్నేహసాగరంలో ఇమిడిపోయి 'మేరేపన్(నాది)' అనే మైలను సమాప్తం చేసే పవిత్ర ఆత్మా భవ ''
ఎవరైతే సదా స్నేహసాగరంలో ఇమిడిపోయి ఉంటారో, వారికి ప్రపంచములోని ఏ విషయమూ గుర్తే ఉండదు. స్నేహంలో ఇమిడిపోయి ఉన్న కారణంగా వారు అన్ని విషయాల నుండి సహజంగా అతీతమైపోతారు. భక్తులను గురించి వీరు ఎప్పుడూ తన్మయమై ఉంటారని అంటారు. కాని పిల్లలు సదా ప్రేమలో మునిగిపోయి ఉంటారు. వారికి ప్రపంచము గుర్తుండదు. 'నాది, నాది' అనేవన్నీ సమాప్తమై ఉంటాయి. అనేకమైన మేరా(నాది) అనేవి మురికిగా చేసేస్తాయి. ఒక్క తండ్రే నావారు అని అన్నారంటే ఆ మైల, మురికి అంతా సమాప్తమైపోతుంది. ఆత్మ పవిత్రంగా అయిపోతుంది.
స్లోగన్ :-
''బుద్ధిలో జ్ఞాన రత్నాలను గ్రహించి, గ్రహింపజేయడమే హోలీహంసలుగా అగుట''