18-10-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - మనమంతా ఆత్మలము, ఇవి మన శరీరాలు అని నిశ్చయము చేసుకోండి. ఇందులో సాక్షాత్కారాల మాటే లేదు. ఆత్మ సాక్షాత్కారమైనా అర్థము చేసుకోలేరు ''

ప్రశ్న :-

తండ్రి ఇచ్చిన ఏ శ్రీమతమును అనుసరిస్తే గర్భజైలులోని శిక్షల నుండి విడుదల అవ్వగలరు?

జవాబు :-

తండ్రి శ్రీమతము - పిల్లలూ! నిర్మోహులుగా అవ్వండి. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అని భావిస్తూ మీరు కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఏ పాప కర్మలూ చేయకుండా ఉంటే గర్భజైలులోని శిక్షల నుండి విడుదలైపోతారు. ఇక్కడ మీరు జన్మ-జన్మాంతరాలుగా జైలు పక్షులుగా అవుతూ వచ్చారు. ఇప్పుడు తండ్రి ఆ శిక్షల నుండి రక్షించేందుకు వచ్చారు. సత్యయుగములో గర్భజైలు ఉండదు.

ఓంశాంతి.

ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు ఆత్మ అనగా ఏమిటో, ఆత్మల తండ్రి అయిన పరమాత్మ ఎవరో అర్థము చేయిస్తారు. ఇది మళ్లీ అర్థము చేయిస్తారు ఎందుకంటే ఇది పతిత ప్రపంచము. పతితులు ఎప్పుడూ తెలివిలేనివారిగా ఉంటారు. పవిత్ర ప్రపంచము తెలివిగలదిగా ఉంటుంది. భారతదేశము పావన ప్రపంచము అనగా దేవీ దేవతల రాజ్యముగా ఉండేది. అప్పుడు ఈ లక్ష్మీనారాయణుల రాజ్యము ఉండేది. చాలా ధనవంతులుగా, సుఖంగా ఉండేవారు. కాని భారతవాసులు ఈ విషయాలను అర్థము చేసుకోరు. తండ్రి పరమపిత అనగా రచయితను గూర్చి కూడా వారికి తెలియదు. ఈ విషయాలను మనుష్యులే తెలుసుకోగలరు. జంతువులు తెలుసుకోలేవు కదా! ఓ పరమపిత పరమాత్మా! అంటూ స్మృతి కూడా చేస్తారు. వారు పారలౌకిక తండ్రి. ఆత్మ తన పరమపిత పరమాత్మను స్మృతి చేస్తుంది. ఈ శరీరానికి జన్మనిచ్చేవారు లౌకిక తండ్రి. ఆ పరమపిత పరమాత్మ పారలౌకిక తండ్రి, ఆత్మలకు తండ్రి. మానవులు లక్ష్మీనారాయణులను పూజిస్తారు. వీరు సత్యయుగములో ఉండేవారని, సీతా-రాములు త్రేతా యుగములో ఉండేవారని కూడా భావిస్తారు. తండ్రి వచ్చి అర్థము చేయిస్తున్నారు - పిల్లలూ! మీరు పారలౌకిక తండ్రినైన నన్ను జన్మ-జన్మాంతరాలుగా స్మృతి చేస్తూ వచ్చారు. గాడ్‌ఫాదర్‌ అయితే తప్పకుండా నిరాకారులే కదా. మన ఆత్మలు కూడా నిరాకారమే కదా. ఇచ్చటకు వచ్చి సాకారంగా అయ్యాయి. ఈ చిన్న విషయము కూడా ఎవరి బుద్ధికి తోచదు. వారు మీ అనంతమైన తండ్రి, రచయిత. వారిని మీరే మాతా-పిత,............ అని కూడా పిలుస్తారు. మేము మీవారిగా అయితే, మేము స్వర్గానికి అధిపతులుగా అవుతాము, మళ్లీ మిమ్ములను మర్చిపోయినందున నరకానికి అధిపతులుగా అవుతామని అంటారు. ఇప్పుడు ఆ తండ్రి ఇతని ద్వారా కూర్చుని అర్థము చేయిస్తున్నారు - నేను రచయితను, ఇతడు(బ్రహ్మ) నా రచన. ఏ రహస్యాలను మీకు అర్థము చేయిస్తున్నానో వాటిని ఇతడు కూడా అర్థము చేసుకుంటాడు. ఆత్మను ఎవ్వరూ చూడలేదు. అయితే నేను ఆత్మను అని ఎందుకు అంటున్నారు? నేను ఆత్మను, ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటానని అర్థము చేసుకుంటారు కదా! మహాత్మ, పుణ్యాత్మ అని అంటారు కదా! నేను ఆత్మను, ఇది నా శరీరము అని నిశ్చయము చేసుకుంటారు. శరీరము వినాశనమయ్యేది. ఆత్మ అవినాశి. ఆత్మ, ఆ పరమపిత పరమాత్ముని సంతానము. ఈ విషయాలు ఎంత సులభమైనవి. అయితే మంచి-మంచి వివేకవంతులు కూడా అర్థము చేసుకోలేరు. మాయ బుద్ధికి తాళము వేసేసింది. మీకు మీ ఆత్మ సాక్షాత్కారము కూడా జరగదు. ఆత్మనే కదా అనేక జన్మలు తీసుకుంటుంది! ప్రతి జన్మలో తండ్రి మారిపోతూ ఉంటాడు. మీరు స్వయాన్ని ఆత్మ అని ఎందుకు నిశ్చయము చేసుకోరు? ఆత్మ సాక్షాత్కారము అవ్వాలని అంటారు. అరే! ఇన్ని జన్మల నుండి ఆత్మ సాక్షాత్కారము అవ్వాలని ఎవరైనా అడిగారా? కొంతమందికి ఆత్మ సాక్షాత్కారము జరిగినా అర్థము చేసుకోలేరు. తండ్రి గురించి మీకు తెలియదు. అనంతమైన తండ్రి తప్ప మరెవ్వరూ ఆత్మలకు పరమాత్మ సాక్షాత్కారము చేయించలేరు. ఓ భగవంతుడా! అని అంటారు. కావున వారు తండ్రి అయ్యారు కదా! మీకు ఇద్దరు తండ్రులున్నారు. ఒకరేమో వినాశీ శరీరానికి జన్మనిచ్చిన వినాశీ తండ్రి. రెండవవారు అవినాశి ఆత్మల అవినాశి తండ్రి. మీరే మాత-పిత,........... అంటూ వారిని స్మృతి చేస్తున్నారంటే వారు తప్పకుండా వచ్చి ఉంటారు కదా! జగదంబ మరియు జగత్పితలు కూర్చుని ఉన్నారు, రాజయోగము నేర్చుకుంటున్నారు. వైకుంఠములో లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. వారు కూడా భారతదేశములోనే ఉండేవారు కదా! స్వర్గము ఎక్కడో పైన ఉందని మానవులు భావిస్తారు. అరే! లక్ష్మీనారాయణుల స్మృతిచిహ్నము ఇక్కడ ఉంది. కనుక తప్పకుండా వారు ఇక్కడనే రాజ్యము చేసి ఉంటారు కదా. ఈ దిల్‌వాడా మందిరము ఇప్పటి మీ స్మృతిచిహ్నంగా తయారు చేయబడి ఉంది. మీరు రాజయోగులు. 108 గదులు నిర్మించబడ్డాయి. అధర్‌ కుమారీలు మరియు కుమారీలైన మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. దీని స్మృతిచిహ్నమే భక్తిమార్గములో మళ్లీ తయారవుతుంది. దిల్‌వాడా మందిరము చాలా ఖచ్ఛితంగా(సరిగ్గా) ఉంది. కాని ఆ మందిరము ట్రస్టీలు మొదలైనవారికి ఈ మందిరము ఎవరిదో తెలియదు. దిల్‌వాడా పేరుకు కూడా ఏదో అర్థముంటుంది కదా! దిల్‌ అనగా హృదయాన్ని తీసుకునేవారెవరు? ఈ ఆదిదేవుడు, ఆదిదేవి కూడా రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. వీరు కూడా ఆ నిరాకార పరమపిత పరమాత్మను స్మృతి చేస్తారు. వారు అత్యంత ఉన్నతమైన జ్ఞాన సాగరులు. ఈ ఆదిదేవుని శరీరములో కూర్చుని పిల్లలందరికీ అర్థము చేయిస్తారు. ఈ మందిరము ఎప్పుడు తయారయ్యిందో, ఎందుకు నిర్మింపబడిందో, ఇది ఎవరి జ్ఞాపక చిహ్నమో - ఈ విషయాలు బొత్తిగా తెలియవు. దేవీలు మొదలైన వారి పేర్లను ఎంతగానో తల్చుకుంటూ ఉంటారు. కాళికా దేవి, దుర్గ, అన్నపూర్ణ.............. ఇప్పుడు విశ్వమంతటికీ అన్నపూర్ణ ఎవరు? ఏ దేవీలు ఆహారాన్ని నింపుతారో మీకు తెలుసా? భారతదేశము స్వర్గముగా ఉండేది. అక్కడ అపారమైన వైభవాలుంటాయి. ఇప్పుడు కూడా 80-90 సంవత్సరాల క్రితము 10-12 అణాలకు ఒక మణుగు (సుమారు 10 కిలోలు) ధాన్యము మొదలైనవి లభించేది. కావున దానికంటే ముందు ఇంకా ఎంత చౌకగా ఉండేవి! సత్యయుగంలో అయితే ధాన్యము మొదలైనవి చాలా చౌకగా, మంచి నాణ్యత గలవిగా ఉంటాయి. అయితే ఇది కూడా ఎవ్వరూ అర్థము చేసుకోరు. తండ్రి వచ్చి ఆత్మలైన మిమ్ములను చదివిస్తారు. ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా వింటుంది. చూచేందుకు ఈ కనులు, వినేందుకు చెవులు ఆత్మకు లభించాయి. తండ్రి చెప్తున్నారు - నేను నిరాకారుడను. నేను కూడా ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకుంటాను. నన్ను సదా శివుడు అనే అంటారు. మానవులు నాకు అనేక పేర్లు పెట్టారు - రుద్రుడు, శివుడు, సోమనాథుడు............ అయితే నా పేరు ఒక్కటే 'శివుడు.' ఓం నమ: శివాయ అంటూ భక్తులు భగవంతుని స్మృతి చేస్తూ వచ్చారు. వారు(భక్తులు) వచ్చి 2500 సంవత్సరాలు అయ్యింది. భక్తిమార్గములో మొదట అవ్యభిచారి భక్తి ఉండేది. ఇప్పుడైతే మీరు వారిని రాయి-రప్పలలో వేసేశారు. ఇప్పుడు భక్తి సమాప్తమౌతుంది. అందరినీ వాపస్‌ తీసుకెళ్లేందుకు నేను వచ్చాను. ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. బాంబులు తయారై ఉన్నాయి. కనుక ఎంతలో అంతా సమాప్తమైపోతుంది! సత్యయుగములో చాలా కొద్దిమంది మాత్రమే, కేవలం 9 లక్షల మందే ఉంటారు. మిగిలినవారంతా ఎక్కడికి వెళ్తారు? ఈ యుద్ధాలు, భూకంపాలు మొదలైనవి జరుగుతాయి. వినాశనమైతే తప్పకుండా జరుగుతుంది.

ఇతడు ప్రజాపిత, అనేకమంది బ్రహ్మకుమార-కుమారీలు ఉన్నారు. బ్రహ్మ తండ్రి ఎవరు? నిరాకార శివుడు. మనము వారి పౌత్రులము. శివబాబా నుండి మనము వారసత్వము తీసుకుంటాము. కావున వారినే స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే పాప భారము దిగిపోతుంది. ఇది పతిత ప్రపంచమని, వికారీ ప్రపంచమని మీకు తెలుసు. సత్యయుగము నిర్వికారీ ప్రపంచము. అక్కడ విషము(వికారము) ఉండదు. నియమానుసారము ఒక్క పుత్రుడే ఉంటాడు. ఎప్పుడూ అకాలమృత్యువు జరగదు. అది సుఖధామము. ఇక్కడైతే ఎంత దు:ఖముంది! అయితే ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. గీత వినిపిస్తారు. శ్రీమద్భగవద్గీత 'భగవానువాచ' అని అంటారు. మంచిదే. అయితే భగవంతుడు ఎవరు? అని అడిగితే వెంటనే శ్రీ కృష్ణుడు అని అంటారు. అరే! అతడైతే చిన్న బాలుడు. రాజయోగాన్ని అతనెలా నేర్పిస్తాడు? అప్పుడు అసలు ఆ సమయములో పతిత ప్రపంచమే లేదు. సద్గతి కొరకు రాజయోగము నేర్పించేవారు ఇక్కడ కావాలి. గీతలో కూడా రుద్ర గీతా జ్ఞాన యజ్ఞము అని వ్రాయబడి ఉంది. కృష్ణ గీతా జ్ఞాన యజ్ఞము లేనే లేదు. ఈ జ్ఞాన యజ్ఞము ఎన్ని సంవత్సరాల నుండి జరుగుతూ వస్తోంది. ఇది ఎప్పుడు సమాప్తమవుతుంది? మొత్తం సృష్టి అంతా ఈ యజ్ఞములో స్వాహా అయినప్పుడు. యజ్ఞం సమాప్తమగునప్పుడు అందులో అన్నీ స్వాహా చేస్తారు కదా! ఈ యజ్ఞం కూడా అంత్యము వరకు నడుస్తూ ఉంటుంది. ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. తండ్రి చెప్తున్నారు - నేను కాలులకు కాలుడను. అందరినీ తీసుకెళ్లేందుకు వచ్చాను. మీరు స్వర్గానికి అధిపతులుగా అయ్యేందుకు మిమ్ములను చదివిస్తున్నాను. ఇప్పుడు మానవ మాత్రులందరూ సదా దుర్భాగ్యశాలురుగా ఉన్నారని మీకు తెలుసు. సత్యయుగములో సదా సౌభాగ్యశాలురుగా ఉండేవారు. ఈ భేదము అందరికీ అర్థము చేయించాలి. ఇక్కడకు వచ్చినప్పుడు చాలా బాగా అర్థం చేసుకుంటారు. మళ్లీ ఇంటికి వెళ్తూనే అంతా సమాప్తమైపోతుంది. ఉదాహరణకు గర్భ జైలులో - మేము ఇక మీదట పాపాలు చెయ్యమని ప్రమాణము చేస్తారు. కాని బయటకు వస్తూనే పాపాలు చేయడం ప్రారంభిస్తారు. జైలు పక్షులుంటారు కదా! ఇప్పుడున్న మానవ మాత్రులందరూ జైలు పక్షులే. పదే పదే గర్భజైలులోకి వెళ్లి శిక్షలు అనుభవిస్తారు. తండ్రి చెప్తున్నారు - ఇప్పుడు నేను గర్భజైలు పక్షులుగా అవ్వడం నుండి విడిపిస్తాను. సత్యయుగములో గర్భాన్ని జైలు అని అనరు. మిమ్ములను ఈ శిక్షల నుండి రక్షించేందుకు వచ్చాను. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. ఎలాంటి పాపము చేయకండి. నిర్మోహులుగా అవ్వండి. నాకు ఒక్కరు తప్ప మరెవ్వరూ లేరు............ అని పాట కూడా పాడతారు. ఈ పాట కృష్ణుని గురించి కాదు. కృష్ణుడైతే 84 జన్మలు తీసుకుని ఇప్పుడు బ్రహ్మగా అయ్యాడు. మళ్లీ అతడే కృష్ణునిగా అవ్వాలి. అందుకే ఈ శరీరములోనే ప్రవేశించారు. ఇది బనా-బనాయా(తయారు చేయబడిన) డ్రామా. ఇప్పుడు భగవంతుడు ఈ సూర్యవంశ, చంద్రవంశ రాజధానులను స్థాపన చేస్తున్నాడు. మీ భవిష్యత్తు కొరకు ప్రాలబ్ధాన్ని తయారు చేస్తారు. ఇప్పుడు మీరు పురుషార్థము చేసి అనేక జన్మలకు ప్రాలబ్ధాన్ని అనంతమైన తండ్రి ద్వారా తయారు చేసుకుంటున్నారు. ఆ తండ్రి స్వర్గ రచయిత. ఇవి అర్థము చేసుకోవలసిన విషయాలు. డ్రామాలోని ప్రతి పాత్రధారికీ తమ తమ పాత్ర ఉంది. ఇందులో మనమెందుకు ఏడ్చి గుండెలు బాదుకోవాలి? మనము జీవించి ఉన్నప్పుడే ఆ ఒక్క తండ్రిని స్మృతి చేస్తాము. ఈ శరీరాన్ని గురించి కూడా మనకు చింత లేదు. ఈ పాత శరీరము వదిలిపోతే మనము బాబా వద్దకు వెళ్లిపోతాము. ఇప్పుడు మీరు భారతదేశానికి ఎంత సేవ చేస్తున్నారు! అన్నపూర్ణ, దుర్గ, కాళీ మొదలైన మీ పేర్లే మహిమ చేయబడ్డాయి. అంతేకాని భయము గొలిపించే ముఖము గల కాళికా దేవి లేక తొండము గల గణేశుడు ఉండరు. మనుష్యులు మనుష్యులుగానే ఉంటారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేను పిల్లలైన మిమ్ములను ఈ లక్ష్మీనారాయణుల వలె తయారు చేస్తున్నాను. మనము బాబా నుండి వారసత్వము తీసుకుంటున్నామని తర్వాత మళ్లీ భవిష్యత్తులో రాకుమార-రాకుమారీలుగా అవుతామని మీరు నిశ్చయము చేసుకోండి. స్వర్గ రచయిత అయిన తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు. జగదంబను కూడా మర్చిపోయారు. ఏ జగదంబ మందిరము నిర్మించబడిందో ఆమె ఇప్పుడు చైతన్యములో కూర్చుని ఉంది. కలియుగము తర్వాత మళ్లీ సత్యయుగము వస్తుంది. వినాశనము ఎప్పుడు అని మానవులు అడుగుతారు. అరే! మొదట మీరు చదువుకొని వివేకవంతులుగా అవ్వండి. మహాభారత యుద్ధమైతే తప్పకుండా జరిగింది. దాని తర్వాతనే స్వర్గ ద్వారాలు తెరుచుకున్నాయి. కావున ఇప్పుడు ఈ మాతల ద్వారా స్వర్గ ద్వారము తెరవబడుతోంది. వందేమాతరం అనే మహిమ చేస్తారు కదా! పవిత్రులకే వందనము చేస్తారు. మాతలు రెండు రకాలున్నారు. శారీరిక సమాజ సేవకులు మొదటి రకము. ఆత్మిక సమాజ సేవకులు రెండవ రకము. ఇది మీ ఆత్మిక యాత్ర. మనము ఈ శరీరాన్ని వదిలి వాపస్‌ వెళ్లేవారమని మీకు తెలుసు. భగవానువాచ - ''మన్మనాభవ! మీ తండ్రినైన నన్ను స్మృతి చేయండి.'' బాలుడైన కృష్ణుడు ఇలా అనలేడు కదా! అతనికి అతని తండ్రి ఉన్నాడు. మన్మనాభవ అర్థము కూడా ఎవ్వరికీ తెలియదు. నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమౌతాయి. ఎగిరేందుకు రెక్కలు లభిస్తాయని తండ్రి అంటున్నారు. ఇప్పుడు మీరు రాతి బుద్ధి నుండి బంగారు(పారస్‌) బుద్ధిగా అవుతారు. అందరి రచయిత అయిన తండ్రి ఒక్కరే. ఆదిదేవుడు మరియు ఆదిదేవీల మందిరాలు కూడా ఉన్నాయి. వారి పిల్లలైన మీరు ఇక్కడ రాజయోగము నేర్చుకుంటున్నారు. ఇక్కడే మీరు తపస్సు చేశారు. మీ స్మృతిచిహ్నము మీ ముందే నిలబడి ఉంది. లక్ష్మీనారాయణులు మొదలైనవారికి రాజ్యమెలా లభించింది? ఈ మందిరాలు వారివే. మీరు రాజఋషులు రాజ్యమును ప్రాప్తి చేసుకునేందుకు లేక భారతదేశము మళ్లీ రాజ్యభాగ్యాన్ని పొందేందుకు మీరు పురుషార్థము చేస్తున్నారు. మీరు భారతదేశములో స్వర్గ రాజ్యాన్ని, మీ తనువు-మనసు-ధనముల ద్వారా సేవ చేసి స్థాపన చేస్తారు. తండ్రి శ్రీమతము ద్వారా మీరు పతిత రావణరాజ్యము నుండి అందరినీ ముక్తులుగా చేస్తారు. తండ్రి ముక్తిదాత, దు:ఖహర్త-సుఖకర్త. మీ దు:ఖమును హరించేందుకు పాత ప్రపంచాన్ని వినాశనము చేయిస్తారు. మీకు మీ శత్రువుల పై విజయము చేకూరుస్తారు. కావున మీరు మాయాజీత్‌లు, జగజ్జీత్‌లుగా అవుతారు. మీరు కల్ప-కల్పము రాజ్యాన్ని తీసుకుంటారు, మళ్లీ పోగొట్టుకుంటారు. ఇది రుద్ర శివుని జ్ఞాన యజ్ఞము. దీని ద్వారా వినాశ జ్వాల వెలువడింది. వారంతా వినాశనమైపోతారు. మీరు సదా సుఖవంతులుగా అవుతారు. ద్వాపరము నుండి దు:ఖము మొదలవుతుంది. తండ్రి చెప్తున్నారు - నేను వచ్చి నరక వాసులను స్వర్గ వాసులుగా చేస్తాను. కలియుగము వేశ్యాలయము, సత్యయుగము శివాలయము. మీరు అనంతమైన తండ్రి ద్వారా స్వర్గానికి అధిపతులుగా అవుతారు. కనుక మీ సంతోషపు పాదరస మట్టము పెరగాలి కదా! అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. జీవించి ఉండే తండ్రిని స్మృతి చేసి వారసత్వ అధికారం తీసుకోవాలి. ఏ విషయము గురించీ చింత చేయరాదు.

2. శ్రీమతమును అనుసరిస్తూ మీ తనువు-మనసు-ధనముల ద్వారా భారతదేశాన్ని స్వర్గంగా తయారుచేసే సేవ చేయాలి. అందరికీ రావణుని నుండి ముక్తులుగా అయ్యే యుక్తిని తెలియజేయాలి.

వరదానము :-

'' అనంతమైన స్మృతి స్వరూపము ద్వారా హద్దు విషయాలను సమాప్తము చేసే అనుభవీమూర్త్‌ భవ ''

శ్రేష్ఠ ఆత్మలైన మీరు డైరక్టు బీజము మరియు ముఖ్యమైన రెండు ఆకులైన త్రిమూర్తితో సమీప సంబంధము గల కాండము. ఇదే ఉన్నతమైన స్థితిలో స్థితమై ఉండండి. అనంతమైన స్మృతి స్వరూపులుగా అవ్వండి. తద్వారా హద్దులోని వ్యర్థ విషయాలు సమాప్తమైపోతాయి. మీ అనంతమైన అనుభవీ స్వరూపంలోకి వస్తే సదా సర్వ అనుభవీమూర్తులుగా అయిపోతారు. అనంతమైన పూర్వజుల కర్తవ్యము ఏదైతే ఉందో దానిని సదా స్మృతిలో ఉంచుకోండి. అంధకారములో వెతుకుచున్న ఆత్మలను స్థిరమైన స్థానానికి చేర్చడమే పూర్వజులైన మీ కర్తవ్యము.

స్లోగన్‌ :-

'' ఏ విషయములోనైనా తికమక చెందేందుకు బదులు ఆనందాన్ని అనుభవం చేయడమే మస్త్‌ యోగులుగా అవ్వడం ''