20-12-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - ప్రశ్నలలో తికమకపడుట మాని మన్మనాభవగా ఉండండి, తండ్రిని మరియు వారసత్వమును స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి, ఇతరులను పవిత్రంగా చేయండి''

ప్రశ్న :-

శివబాబా పిల్లలైన మీ చేత తమ పూజను చేయించుకోరు, ఎందుకు ?

జవాబు :-

బాబా చెప్తున్నారు - '' నేను పిల్లలైన మీకు అత్యంత వినయ, విధేయతలు గల సేవకుడను . పిల్లలైన మీరు నా యజమానులు, నేను మీకు నమస్కరిస్తాను.'' తండ్రి నిరహంకారి, పిల్లలు కూడా తండ్రి సమానంగా అవ్వాలి. నేను పిల్లలైన మీతో నా పూజ ఎలా చేయించుకుంటాను. కడిగేందుకు నాకు కాళ్లు కూడా లేవు, మీరు ఈశ్వరీయ సేవాధారులగా అయ్యి విశ్వ సేవ చేయాలి.

పాట :-

నిర్బలులతో బలశాలుర యుద్ధము,......... (నిర్బల్‌ సే లడాయి బల్‌వాన్‌ కీ,.............)   

ఓంశాంతి.

నిరాకార శివభగవానువాచ. శివబాబా నిరాకారులు అంతేకాక ఏ ఆత్మలైతే శివబాబా అని అంటాయో, అవి కూడా నిజానికి నిరాకారమే. వారు కూడా నిరాకార ప్రపంచములో నివసించేవారు. పాత్ర చేసేందుకు ఇక్కడ సాకారాలుగా అయ్యారు. మనందరికీ కాళ్లు ఉన్నాయి. కృష్ణునికి కూడా పాదాలున్నాయి. పాద పూజ చేస్తారు కదా. శివబాబా అంటున్నారు - నేను వినమ్రుడను, మీతో కడిగించుకునేందుకు నాకు అసలు కాళ్లు కూడా లేవు. సన్యాసులు కాళ్లు కడిగించుకుంటారు కదా. గృహస్థులు వెళ్లి వారి కాళ్లు కడుగుతారు. కాళ్లు అయితే మనుష్యులవే. మీరు పాద పూజ చేసేందుకు శివబాబాకు అసలు కాళ్లే లేవు. ఇదంతా పూజా సామాగ్రి. తండ్రి అంటున్నారు - నేను జ్ఞాన సాగరుడను, నా పిల్లలతో నేను కాళ్లు ఎలా కడిగించుకుంటాను? తండ్రి ''వందేమాతరమ్‌'' అని అంటున్నారు. దీనికి జవాబుగా మాతలేమనాలి? మాతలు నిలబడి, నమస్తే శివబాబా! అని అంటారు. సలామ్‌ మాలేకమ్‌(సలామాలేకమ్‌) అని అన్నట్లు మాతలు నమస్తే అంటారు. అది కూడా మొదట తండ్రియే నమస్కరించవలసి వస్తుంది. నేను అత్యంత వినమ్రుడను, అనంతమైన సేవకుడను అని తండ్రి అంటున్నారు. వారు నిరాకారులే కాక ఎంతో నిరహంకారులు. ఇచ్చట పూజించే విషయమే లేదు. అత్యంత ప్రియమైన పిల్లలు, ఎవరైతే నా ఆస్తికి యజమానులుగా అవుతారో, వారితో నేను పూజ ఎలా చేయించుకుంటాను? పిల్లలు తండ్రి కాళ్లకు నమస్కరిస్తారు. ఎందుకంటే తండ్రి పెద్దవారు కదా. కాని వాస్తవానికి తండ్రి కూడా తన పిల్లలకు సేవకుడు. పిల్లలను మాయ చాలా విసిగిస్తుందని తండ్రికి తెలుసు. ఇది చాలా కఠినమైన పాత్ర. చాలా అపారమైన దు:ఖాలు రానున్నాయి. ఇవన్నీ అనంతమైన విషయాలు. అప్పుడే అనంతమైన తండ్రి వస్తారు. తండ్రి అంటున్నారు - నేను ఒక్కరినే దాతను. ఇతరులెవ్వరినీ '' దాత '' అని అనజాలరు. తండ్రి నుండే అందరూ కోరుకుంటారు. సాధువులు కూడా ముక్తిని కోరుకుంటారు. భారతదేశములోని గృహస్థులు భగవంతుని నుండి జీవన్ముక్తిని కోరుకుంటారు. కావున దాత ఒక్కరే కదా. ''సర్వుల సద్గతిదాత ఒక్కరే'' అన్న మహిమ కూడా ఉంది. సాధువులు స్వయంగా వారే సాధన చేస్తున్నారు, మరి ఇతరులకు గతి - సద్గతులను ఎలా ఇవ్వగలరు? ముక్తిధామానికి, జీవన్ముక్తిధామానికి రెండిటికి యజమాని తండ్రియే. వారు కల్పానికి ఒక్కసారి మాత్రమే సరిగ్గా తమ సమయానికి వస్తారు, మిగిలిన వారందరూ జనన-మరణాలలోకి వస్తూ ఉంటారు. వీరు ఒక్కసారి మాత్రమే రావణ రాజ్యము సమాప్తము అవ్వవలసి ఉన్నప్పుడు ఇచ్చటకు వస్తారు. అంతకంటే ముందు వారు రాజాలరు. డ్రామాలో పాత్రయే లేదు. అందువలన మీరు నా ద్వారా నన్ను గుర్తించారని తండ్రి అంటున్నారు. మనుష్యులకు తెలియనందున వారు నన్ను సర్వవ్యాపి అనేశారు.

ఇప్పుడిది రావణ రాజ్యము. రావణుని తగులబెట్టేది భారతవాసులే. అందువలన రావణ రాజ్యము, రామ రాజ్యము రెండూ భారతదేశములోనే ఉన్నాయని ఋజువవుతుంది. ఈ విషయాలు అనగా ఇప్పుడిది ఏ విధంగా రావణ రాజ్యమో, రామరాజ్యమును స్థాపన చేయువారే వివరిస్తారు. ఇది అర్థము చేయించేదెవరు? నిరాకార శివభగవానువాచ! ఆత్మను శివుడు అని అనరు. ఆత్మలన్నీ సాలిగ్రామాలు. శివుడని ఒక్కరినే అంటారు. సాలిగ్రామాలైతే అనేకముంటాయి. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. ఆ బ్రాహ్మణులు ఏ యజ్ఞాలనైతే రచిస్తారో, అందులో ఒక పెద్ద శివలింగము, దానితో పాటు చిన్న చిన్న సాలిగ్రామాలను తయారు చేసి పూజిస్తారు. దేవీలు మొదలైనవారి పూజ అయితే ప్రతి సంవత్సరము జరుగుతూ ఉంటుంది. ఇక్కడైతే ప్రతి రోజూ మట్టితో తయారుచేసి పూజిస్తూ ఉంటారు. రుద్రుని పై చాలా గౌరవము ఉంటుంది. సాలిగ్రామాలంటే ఎవరో వారికి తెలియదు. శివశక్తి సైన్యమైన మీరు పతితులను పావనంగా తయారుచేస్తారు. శివుని పూజ అయితే జరుగుతుంది. మరి సాలిగ్రామాలు ఎక్కడకెళ్లాలి? అందువలన చాలామంది మనుష్యులు రుద్ర యజ్ఞమును రచించి సాలిగ్రామాలను కూడా పూజిస్తారు. శివబాబాతో పాటు పిల్లలు కూడా కష్టపడ్డారు. శివబాబాకు సహాయకారులుగా ఉన్నారు. వారిని ఈశ్వరీయ సేవాధారులు(ఖుదాయి కిద్‌మత్‌గార్‌) అని అరటారు. స్వయం నిరాకారులు కూడా తప్పకుండా ఏదో ఒక శరీరములో వస్తారు కదా. స్వర్గములో అయితే సేవ చేయవలసిన అవసరమే ఉండదు. శివబాబా చెప్తున్నారు - చూడండి, మీరు నా సేవాధారులైన పిల్లలు. నంబరువారుగా ఉంటారు కదా. అందరినీ పూజించలేరు కదా. ఈ యజ్ఞము కూడా భారతదేశములోనే జరుగుతుంది. ఈ రహస్యాన్ని తండ్రియే అర్థము చేయిస్తారు. ఆ బ్రాహ్మణులు లేక యజ్ఞమును చేయించు ధనవంతులకు ఈ విషయాలేవీ తెలియవు. వాస్తవానికి ఇది రుద్ర యజ్ఞము. పిల్లలు పవిత్రముగా తయారై భారతదేశమును స్వర్గంగా తయారుచేస్తారు. ఇది చాలా పెద్ద ఆసుపత్రి. ఇచ్చట యోగము ద్వారా మనము సదా నిరోగులుగా అవుతాము. నన్ను స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. యోగమును తెంచి వేసే మొదటి నంబరు వికారము దేహ అహంకారము. దేహాభిమానులుగా అవుతారు. తండ్రినే మర్చిపోతారు. అప్పుడే ఇతర వికారాలు వచ్చేస్తాయి. ఈ యోగమును నిరంతరము జోడించడం చాలా కష్టము. మనుష్యులు కృష్ణుని భగవంతుడని భావించి వారిని పూజిస్తారు. అయితే వారి పాద పూజ చేసేందుకు కృష్ణుడు పతితపావనుడేమీ కారు. శివునికైతే పాదాలే లేవు. వారు వచ్చి మాతలకు సేవకునిగా అయ్యి తండ్రిని, స్వర్గమును స్మృతి చేస్తే మళ్లీ 21 జన్మలకు రాజ్యపాలన చేస్తారని చెప్తున్నారు. 21 తరాలు అని గాయనము చేయబడింది. ఇతర ధర్మాలలో ఈ గాయనము లేదు. ఏ ఇతర ధర్మాల వారికి కూడా 21 జన్మల స్వర్గ చక్రవర్తి పదవి లభించదు. డ్రామా ఈ విధంగా తయారై ఉంది. ఇతర ధర్మాలలో కలిసిపోయిన దేవతా ధర్మము వారు తిరిగి ఈ ధర్మములోకి వాపస్‌ వస్తారు. స్వర్గ సుఖాలు అపారమైనవి. నూతన ప్రపంచము నూతన భవనములో చాలా మంచి సుఖము ఉంటుంది. కొద్దిగా పాతదవుతూనే ఏదో కొంత లోటు ఏర్పడుతుంది. మరమ్మత్తు చేయించబడ్తుంది. ఎలాగైతే తండ్రి మహిమ అపారమైనదో అలాగే స్వర్గ మహిమ కూడా అపారమైనది. దానికి అధికారులుగా అయ్యేందుకు ఇప్పుడు మీరు పురుషార్థము చేస్తున్నారు. ఇతరులెవ్వరూ స్వర్గానికి యజమానులుగా చేయలేరు.

వినాశ దృశ్యము చాలా భయంకరమైనది, బాధ కలిగించే విధంగా ఉంటుందని పిల్లలైన మీకు తెలుసు. వినాశనానికి ముందే తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి. తండ్రి చెప్తున్నారు - ఇప్పుడు మీరు నా వారుగా అవ్వండి అనగా ఈశ్వరీయ ఒడిని పొందండి. శివబాబా పెద్దవారు కదా. అందువలన మీకు చాలా ప్రాప్తి కలుగుతుంది. స్వర్గ సుఖము అపరం అపారమైనది. పేరు వినగానే నోటిలో నీళ్లు ఊరుతాయి. ఫలానావారు స్వర్గస్థులైనారని అంటారు, మరి స్వర్గము ప్రియమనిపిస్తున్నట్లే కదా. ఇది నరకము. సత్యయుగము రానంతవరకు స్వర్గానికి ఎవ్వరూ వెళ్లలేరు. తండ్రి అర్థము చేయిస్తున్నారు - ఈ జగదంబ వెళ్లి స్వర్గ మహారాణి లక్ష్మిగా అవుతుంది. తర్వాత పిల్లలు కూడా నంబరువారుగా అలా అవుతారు. మమ్మా-బాబాలు ఎక్కువగా పురుషార్థము చేస్తారు. అక్కడ కేవలం లక్ష్మీనారాయణులే కాదు, పిల్లలు కూడా రాజ్యము చేస్తారు కదా. తండ్రి వచ్చి మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు. చదివిస్తారు, ఒకవేళ కృష్ణుడు తయారు చేస్తారని అన్నట్లయితే మరి కృష్ణుని ద్వాపర యుగములోకి తీసుకెళ్లారు కదా. ద్వాపర యుగములో దేవతలైతే ఉండరు. మేము స్వర్గానికి వెళ్లేందుకు మార్గాన్ని తెలియజేస్తారని సన్యాసులు అనజాలరు. దాని కొరకు భగవంతుడే కావాలి. ముక్తి-జీవన్ముక్తుల ద్వారాలు కలియుగ అంతములోనే తెరవబడ్తాయని చెప్తారు. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. నేను శివుడిని, రుద్రుడను. మీరు సాలిగ్రామాలు, శరీరధారులు. నేను శరీరమును లోను(ఋణము)గా తీసుకున్నాను. వీరంతా బ్రాహ్మణులు. ఈ జ్ఞానము బ్రాహ్మణులకు తప్ప ఇంకెవ్వరికీ ఉండదు. శూద్రులలో కూడా ఉండదు. సత్యయుగములో దేవీదేవతలు పారస(బంగారు) బుద్ధిగలవారుగా ఉండేవారు. తండ్రియే వారిని ఇప్పుడు అలా తయారుచేస్తున్నారు. సన్యాసులెవ్వరినీ పారస బుద్ధిగలవారిగా తయారు చేయలేరు. భలే వారు స్వయం పవిత్రంగా ఉంటారే గాని, వారు కూడా రోగులుగా అవుతూ ఉంటారు కాని సత్యయుగములో ఎప్పుడూ రోగులుగా అవ్వరు. అక్కడైతే అపారమైన సుఖముంటుంది. అందువల్లనే తండ్రి చెప్తున్నారు - పూర్తి పురుషార్థము చేయండి. పరుగు పందెముంటుంది కదా. ఇది రుద్ర మాలలో తిప్పబడేందుకు పరుగు పందెము(రేస్‌). అహమ్‌ ఆత్మనే యోగ పరుగు తీయాలి. ఎంతెంత యోగము జోడిస్తారో అంత వారిని - ''వీరు చాలా వేగంగా పరుగు తీస్తున్నారు'' అని భావిస్తారు. వారి వికర్మలు వినాశనమవుతూ ఉంటాయి. మీరు లేస్తూ-కూర్చుంటూ-నడుస్తూ -తిరుగుతూ యాత్రలో ఉంటారు. బుద్ధి యోగానికి చెందిన ఈ యాత్ర చాలా మంచిది. మరి అటువంటి అపారమైన స్వర్గ సుఖమును పొందేందుకు పవిత్రంగా ఎందుకు ఉండము. మమ్ములను మాయ కదిలించలేదని మీరంటారు. ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది. ఇది అంతిమ జన్మ. మరణమైతే తప్పనిసరి మరి తండ్రి నుండి వారసత్వమును ఎందుకు తీసుకోరాదు? ఎంతోమంది బాబా పిల్లలున్నారు. ప్రజాపిత కనుక తప్పకుండా నూతన రచననే రచిస్తారు. నూతన రచన బ్రాహ్మణులదే జరుగుతుంది. బ్రాహ్మణులు ఆత్మిక సమాజ సేవకులు. దేవతలైతే ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. మీరు భారతదేశానికి సర్వీసు చేస్తున్నారు అందువలన మీరే స్వర్గానికి అధిపతులుగా అవుతారు. భారతదేశానికి సేవ చేయడం అనగా సర్వులకు సేవ చేసినట్లే. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. రుద్రడని, శివుడని అంటారు, కృష్ణుని అనరు. కృష్ణుడు సత్యయుగ రాకుమారుడు. అక్కడ ఈ యజ్ఞము మొదలైనవేవీ ఉండవు. ఇప్పుడిది రావణ రాజ్యము. ఇది వినాశనమవ్వాలి. ఆ తర్వాత ఇంకెప్పుడూ (సత్య-త్రేతా యుగాలలో) రావణుని తయారు చేయరు. తండ్రియే వచ్చి ఈ సంకెళ్ల నుండి విముక్తులుగా చేస్తారు. సంకెళ్ల నుండి ఈ బ్రహ్మను కూడా విడిపించారు కదా. శాస్త్రాలు చదువుతూ చదువుతూ ఏ గతి పట్టిందో చూడండి. అందువల్ల తండ్రి చెప్తున్నారు - ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేసే ధైర్యము లేదు, పవిత్రంగా ఉండరు. కాని వ్యర్థమైన ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు - '' మన్మనాభవ .'' ఒకవేళ ఏదైనా విషయములో తికమకపడ్డారంటే దానిని వదిలేయండి. మన్మనాభవగా ఉండండి. ప్రశ్నకు సమాధానము లభించలేదని చదువు వదిలేయరాదు. భగవంతుడు కదా, మరి సమాధానము ఎందుకు ఇవ్వడం లేదని అంటారు. ఇప్పుడు తండ్రి మరియు వారసత్వములతో మాత్రమే పని. చక్రాన్ని కూడా స్మృతి చేయవలసి ఉంటుంది. గవర్నమెంటు వారు కూడా త్రిమూర్తి మరియు చక్రమును(ప్రభుత్వ ముద్రిక మూడు సింహాల బొమ్మ, దానికి క్రింద అశోక చక్రము) చూపిస్తారు. సత్యమేవ జయతే అని వ్రాస్తారు కాని అర్థము చేసుకోరు. మీరు అర్థమును తెలిపించగలరు. శివబాబాను స్మృతి చేసినట్లయితే సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ-విష్ణు- శంకరులు కూడా స్మృతిలోకి వస్తారు. స్వదర్శన చక్రాన్ని స్మృతి చేయడం ద్వారా విజయము కలుగుతుంది. ''జయతే'' అనగా మాయ పై విజయము పొందుతారు. ఇది చాలా బాగా అర్థము చేసుకోవలసిన విషయము. ఇక్కడ నియమము - హంసల సభలో కొంగలు కూర్చోలేరు. బి.కెలు ఎవరైతే స్వర్గ దేవకాంతలుగా తయారు చేస్తారో వారి పై చాలా గొప్ప బాధ్యత ఉంటుంది. కొత్తగా వచ్చినవారిని మొదట సదా ఇలా అడగండి - ఆత్మల తండ్రిని గురించి తెలుసా? ప్రశ్నిస్తున్న వారికి తప్పక తెలిసే ఉంటుంది కదా. సన్యాసులు మొదలైనవారు ఎప్పుడూ ఈ విధంగా ప్రశ్నించలేరు. వారికి తెలియనే తెలియదు. అనంతమైన తండ్రిని తెలుసుకున్నారా? అని మీరు ప్రశ్నిస్తారు. మొదట నిశ్చితార్థము చేయండి. బ్రాహ్మణుల వ్యాపారమే ఇది. తండ్రి చెప్తున్నారు - ఓ ఆత్మలారా! నా జతలో యోగము జోడించండి ఎందుకంటే మీరు నా వద్దకు రావాలి. సత్యయుగ దేవీ దేవతలు చాలాకాలము నుండి వేరుగా ఉన్నారు. కనుక మొట్టమొదట జ్ఞానము కూడా వారికే లభిస్తుంది. లక్ష్మీనారాయణులు 84 జన్మలు పూర్తి చేశారు కనుక మొదట వారికే జ్ఞానము లభించాలి కదా.

మనుష్య సృష్టి వృక్షమేదైతే ఉందో, దానికి పిత బ్రహ్మ. ఇక ఆత్మల పిత శివుడు. కనుక బాప్‌ మరియు దాదా అయినారు కదా. మీరు వారికి పౌత్రులు. వారి నుండి మీకు జ్ఞానము లభిస్తుంది. తండ్రి చెప్తున్నారు - నేను నరకములో వచ్చినప్పుడే కదా స్వర్గాన్ని రచిస్తాను. శివభగవానువాచ - లక్ష్మీనారాయణులు త్రికాలదర్శులు కారు. వారికి ఈ రచయిత - రచనల జ్ఞానమే లేదు. మరి ఈ జ్ఞానము పరంపరగా ఎలా వస్తుంది? మీరు మృత్యువు ఇక రానే వచ్చేసిందని చెప్తూనే ఉంటారు. కాని అలా ఏమీ జరగదని చాలామంది భావిస్తారు. దీని పైనే ఒక ఉదాహరణ కూడా ఉంది కదా - అయ్యో! పులి వచ్చింది, పులి వచ్చింది,............ అని అన్నాడు కాని పులి రాలేదు. చివరికి ఒక రోజు పులి రానే వచ్చింది, మేకలన్నిటినీ తినేసింది. ఈ విషయాలన్నీ ఇక్కడివే. ఒక రోజు తప్పకుండా మృత్యువు కబళించి వేస్తుంది. అప్పుడేం చేస్తారు? భగవంతునిచే రచింపబడిన ఈ యజ్ఞము ఎంత గొప్పది! పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఇంత పెద్ద యజ్ఞాన్ని రచించలేరు. బ్రహ్మ వంశీ బ్రాహ్మణులు అని పిలువబడ్తూ పవిత్రంగా అవ్వలేదంటే ఇక వారు మరణించినట్లే. శివబాబాతో ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది - '' మధురమైన బాబా, స్వర్గానికి అధిపతులుగా చేసే బాబా, నేనైతే మీ వాడిని, చివరి వరకు మీకు చెందినవారిగానే ఉంటాను. '' ఇటువంటి తండ్రికి లేక ప్రియుడికి విడాకులిచ్చేశారంటే మహారాజ - మహారాణులుగా అవ్వలేరు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. సత్యమైన ఈశ్వరీయ సేవాధారులుగా అయ్యి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయుటలో పవిత్రంగా ఉండి తండ్రికి సహాయము చేయాలి. ఆత్మిక సమాజ సేవకులుగా అవ్వాలి.

2. ఏ విధమైన ప్రశ్నలలోనూ తికమకపడి చదువును వదిలేయరాదు. ప్రశ్నలను వదిలి తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయాలి.

వరదానము :-

''స్వ పరివర్తన మరియు విశ్వపరివర్తన అనే బాధ్యతా కిరీటధారి నుండి విశ్వరాజ్య కిరీటధారీ భవ''

ఎలాగైతే తండ్రి పై, ప్రాప్తి పై ప్రతి ఒక్కరు తమకు అధికారముందని భావిస్తారో అలా స్వ పరివర్తన మరియు విశ్వ పరివర్తన రెండిటి బాధ్యతా కిరీటధారులుగా అవ్వండి. అప్పుడు విశ్వ రాజ్య కిరీటధారులుగా అవుతారు. వర్తమానమే భవిష్యత్తుకు ఆధారము. చెక్‌ చేసుకొని జ్ఞాన దర్పణములో - బ్రాహ్మణ జీవితంలో పవిత్రతా కిరీటము మరియు చదువు సేవల డబల్‌ కిరీటముందా అని చూసుకోండి. ఏదైనా కిరీటము అసంపూర్ణంగా ఉంటే అక్కడ కూడా చిన్న కిరీటానికే అధికారులుగా అవుతారు.

స్లోగన్‌ :-

''సదా బాప్‌దాదా ఛత్రఛాయలో ఉంటే విఘ్నవినాశకులుగా అవుతారు''