25-10-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - ఈ చదువు చాలా చౌకయే కాక చాలా సులభము. పదవికి ఆధారము పేదరికము గాని, సంపన్నత్వము గాని కాదు. చదువు పై ఆధారపడి ఉంటుంది. అందువలన చదువు పై పూర్తి గమనముంచండి ''
ప్రశ్న :-
జ్ఞానీ ఆత్మల మొదటి లక్షణము ఏది ?
జవాబు :-
వారు అందరితో చాలా మధురంగా వ్యవహరిస్తారు. కొందరితో స్నేహము, కొందరితో శతృత్వము ఉంచడం జ్ఞానీ ఆత్మల లక్షణము కాదు. పిల్లలూ! అతిమధురంగా అవ్వండి అని బాబా శ్రీమతమును ఇచ్చారు. నేను ఒక ఆత్మను, ఈ శరీరమును నడుపుతున్నాను, ఇప్పుడు నేను ఇంటికి వెళ్లాలి - అనే అభ్యాసమును చేయండి.
పాట :-
నీవు ప్రేమ సాగరుడవు,..................(తూ ప్యార్కా సాగర్ హై,..................)
ఓంశాంతి.
పిల్లలు ఎవరి మహిమను విన్నారు? నిరాకారకుడైన, అనంతమైన తండ్రి మహిమను విన్నారు. వారు జ్ఞానసాగరులు, ఉన్నతోన్నతులు. వారినే ఉన్నతోన్నతుడైన తండ్రి అని అంటారు. పరమ శిక్షకుడు అనగా జ్ఞానసాగరుడని కూడా అంటారు. ఈ మహిమ మన తండ్రిదని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. వారి ద్వారా పిల్లలైన మన స్థితి కూడా అలాగే ఉండాలి. వారు ఉన్నతోన్నతులైౖన తండ్రి, సాధు-సన్యాసి కాదు. వీరు అనంతుడైన తండ్రి. నిరాకార పరమపిత పరమాత్మ. వీరు మన అనంతమైన తల్లి-తండ్రి, పతియే కాక మన సర్వస్వమూ అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. అయితే ఆ నషా స్థిరంగా ఉండడం లేదు. ఘడియ-ఘడియ పిల్లలు మర్చిపోతారు. వీరు ఉన్నతోన్నతమైన, అతిమధురాతి మధురమైన తండ్రి. వారిని అందరూ అర్ధకల్పం స్మృతి చేస్తారు. లక్ష్మీనారాయణులను అంతగా స్మృతి చేయరు. భక్తుల భగవంతుడు ఒక్క నిరాకారుడే. వారినే అందరూ స్మృతి చేస్తారు. కొందరు లక్ష్మీనారాయణులను, కొందరు గణేశ్ మొదలైనవారిని విశ్వసించేవారిగా ఉంటారు. అయినా వారి నోటి నుండి ఓ భగవంతుడా! అన్న శబ్ధమే వెలువడ్తుంది. ఓ పరమాత్మా అన్న పదము అందరి నోటి నుండి తప్పకుండా వెలువడ్తుంది. ఆత్మ వారిని స్మృతి చేస్తుంది. దైహికమైన భక్తులు దేహ సంబంధమైన వస్తువులను స్మృతి చేస్తారు. అయినా ఆత్మ ఎంత పితావ్రతునిగా ఉంటుందంటే, తన తండ్రిని తప్పకుండా తల్చుకుంటుంది. దు:ఖములో ఉన్నప్పుడు హే పరమాత్మా! అన్న పదము వెంటనే వెలువడ్తుంది. ఆ పరమాత్మ నిరాకారుడని తప్పకుండా భావిస్తారు. కానీ వారి మహత్వాన్ని గూర్చి తెలియదు. ఇప్పుడు వారు మన సన్ముఖములోకి వచ్చారు. కావున వారి మహత్యము మీరు తెలుసుకున్నారు. వారు స్వర్గ రచయిత మనలను సన్ముఖంగా చదివిస్తున్నారు. ఇది ఒకే చదువు. ఆ భౌతికమైన చదువులు రకరకాలుగా ఉంటాయి. ఎవరి మనస్సైనా చదువులో నిమగ్నమవ్వకపోతే ఇక దానిని వదిలివేస్తారు కూడా! ఇక్కడ ఈ చదువులో డబ్బు మొదలైనవాటి విషయమేదీ లేదు. ఆ ప్రభుత్వము కూడా పేదవారిని ఉచితంగా చదివిస్తుంది. ఇక్కడ ఇది ఉచితంగా చదువుకునే చదువు. ఇందులో ఫీజు మొదలైనవేవీ లేవు. బాబాను పేదలపాలిటి పెన్నిధి అని అంటారు. పేదవారే చదువుతారు. స్మృతి చాలా సులభమైనది. చదువు చాలా చవకైనది. మనుష్యులు తమను ఇన్ష్యూర్(భీమా) కూడా చేసుకుంటారు. ఇక్కడ కూడా మీరు ఇన్ష్యూర్ చేసుకుంటారు. బాబా మీరే స్వర్గములో 21 జన్మల ప్రతిఫలమును ఇవ్వాలని అంటారు. ఓ పరమపిత పరమాత్మా, మాకు 21 జన్మల కొరకు వారసత్వమును ఇవ్వు అని భక్తిమార్గములో అనరు. మనము డైరక్ట్గా స్వయాన్ని ఇన్ష్యూర్(భీమా) చేసుకుంటున్నామని మీకు ఇప్పుడు తెలుసు. ఫలమును ఇచ్చేవాడు ఈశ్వరుడే అని సదా అంటూ ఉంటారు. అందరికీ ఈశ్వరుడే ఇస్తాడు. సాధు-సన్యాసులు లేక రిద్ధి-సిద్ధి గలవారు ఎవరైనా, అందరికీ ఇచ్చేవారు ఈశ్వరుడే. ఇచ్చేవాడు ఈశ్వరుడే అని ఆత్మ అంటుంది. దాన-పుణ్యాదులు చేస్తారు. దానికి ఫలితాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడే.
ఈ చదువులో ఖర్చు ఏమీ లేదు. పేదవారికి కూడా అంతే ఇన్ష్యూర్(భీమా) అవుతుంది అని బాబా అర్థం చేయించారు. షాహుకార్లు లక్ష చేస్తే అతడికి లక్షగా లభిస్తుంది. పేదవాడు ఒక రూపాయి చేసినా, షాహుకారు 5 వేలు చేసినా దానికి ప్రతి ఫలము ఇరువురికి సమానంగా లభిస్తుంది. పేదల కొరకు ఇది చాలా సులభము. ఇందులో ఫీజు ఏమీ ఉండదు. పేదలు లేక షావుకార్లు ఇరువురూ బాబా నుండి వారసత్వాన్ని పొందేందుకు హక్కుదార్లే. మొత్తం ఆధారమంతా చదువు పైనే ఉంది. పేదవారు బాగా చదివితే వారి పదవి షావుకార్లకన్నా ఎక్కువగా అయిపోతుంది. చదువే సంపాదన. ఇది చాలా చవకైన సహజమైన చదువు. కేవలం ఈ మనుష్యసృష్టి యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకోవాలి. దానిని గూర్చి మనుష్యమాత్రులెవ్వరికీ తెలియదు. త్రికాలదర్శులుగా ఎవ్వరూ అవ్వలేరు. అందరూ అనంతుడు అని అనేస్తారు. పరమాత్మ మనుష్య సృష్టికి బీజరూపుడు అని భావిస్తారు. ఇది తలక్రిందుల వృక్షము అయినా మాకు దీని అర్థము యదార్థ రీతిగా తెలియదు అని అంటారు. తప్పకుండా యదార్థాన్ని జ్ఞానసాగరుడైన తండ్రియే తెలియజేస్తారు. మొత్తం ఆధారమంతా పిల్లలైన మీ చదువు పై ఉంది. ఇప్పుడు మీకు నెంబరువారిగా పురుషార్థానుసారముగా తెలుసు. మీరు మాస్టర్ జ్ఞానసాగరులు. అందరూ ఒకేలా లేరు కదా! కొందరు పెద్ద నదులుగా, కొందరు చిన్న నదులుగా ఉన్నారు. అందరూ తమ పురుషార్థానుసారముగానే చదువుతారు. వీరు అనంతమైన తండ్రి అని పిల్లలైన మీకు తెలుసు. వారికి చెందినవారిగా అయ్యి వారి శ్రీమతమును అనుసరించాలి. పాపం వారు పరవశులుగా ఉన్నారని కొందరిని గూర్చి అనడం జరుగుతుంది. మాయకు వశమై ఉల్టా మతమును అనుసరిస్తారు. శ్రీమత్ భగవానువాచ ఉంది కదా! వారి ద్వారా శ్రేష్ఠాతి శ్రేష్ఠులైన దేవీదేవతలుగా అవ్వాలి. నిశ్చయం ఏర్పడిన తర్వాతనే శివబాబాను మిలనము చేయాలి. వీరికి యదార్థమైన నిశ్చయము లేదని బాబా అర్థము చేసుకోగలరు. ఆత్మలకు తండ్రి ఒక్కరే అని అర్థము చేసుకుంటారు. కానీ వారు వీరిలోకి వచ్చి వారసత్వాన్ని ఇస్తున్నారు అన్న నిశ్చయం కూర్చోవడం చాలా కష్టము. ఇది బుద్ధిలో కూర్చున్న తర్వాత వ్రాసి ఇచ్చినప్పుడు బాబా వద్దకు వారు వ్రాసి ఇచ్చిన దానిని వారిని తీసుకు రావాలి. వీరు చెప్పేది యదార్థంగా ఉంది అని అర్థము చేసుకుంటారు. ఇంతకాలము ఏదైతే భావిస్తూ వచ్చామో అది తప్పు అని అప్పుడు అర్థం చేసుకుంటారు. ఈశ్వరుడు సర్వవ్యాపి కారు. వారు అనంతమైన తండ్రి తప్పకుండా భారతదేశానికి కల్ప-కల్పము సంగమ యుగములో అనంతమైన తండ్రి ద్వారా వారసత్వము లభిస్తుంది. సంగమ యుగంలో ఇదే సమయంలో లభించింది. ఇప్పుడు మళ్లీ లభిస్త్తోందని వ్రాయించాలి. తప్పకుండా తండ్రి సంగమ యుగములోనే వస్తారు. వారు వచ్చి బి.కెల ద్వారా స్వర్గ రచనను రచిస్తారు. ఎప్పుడైతే ఈ విషయాన్ని వ్రాసి ఇస్తారో, అప్పుడు వారు ఎవరి వద్దకు వచ్చారో, ఏమి తీసుకునేందుకు వచ్చారో అర్థం చేయించగలరు.
ఈశ్వరుని రూపము నిరాకారము. ఈశ్వరుని రూపము తెలియని కారణంగా బ్రహ్మతత్వము అని అనేస్తారు. వారు ఒక బిందువని పిల్లలకు అర్థము చేయించడం జరిగింది. పరమాత్మ ఒక బిందువు అన్న విషయం ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. భృకుటి మద్యలో మెరుస్తున్న నక్షత్రము అని ఆత్మను గూర్చి అంటారు. అది చాలా చిన్నది. కావున పాత్రధారి ఎవరు? అని ఆలోచించాలి. ఇంత చిన్న ఆత్మలో ఎంతటి అవినాశి పాత్ర నింపబడి ఉంది? ఆ విషయాలలోకి ఎవరైనా లోతుగా వెళ్తే అప్పుడు వారికి అర్థం చేయించాలి. నేను 84 జన్మలను తీసుకున్నానని మీ ఆత్మ అంటుంది. ఇంత చిన్న బిందు రూపమైన ఆత్మలో ఆ పాత్ర అంతా ఇమిడి ఉంది. అది మళ్లీ ప్రత్యక్షం(ఎమర్జ్) అవుతుంది. ఈ విషయం వింటే మనుష్యులు ఆశ్చర్యపడ్తారు. ఈ విషయాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. మన 84 జన్మలు పునరావృతమౌతాయి. ఇది తయారై ఉన్న డ్రామా. ఆత్మలో పాత్ర ఎలా రచింపబడి ఉందో విని మనుష్యులు ఆశ్చర్యపడ్తారు. తప్పకుండా ఆత్మనైన నేను మాట్లాడ్తాను. ఆత్మనైన నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాను. నా ఈ పాత్ర నిర్ణయింపబడి ఉంది. అది డ్రామానుసారముగా పునరావృతమౌతుంది అని అర్థం చేసుకుంటారు. ఈ విషయాలను బలహీన బుద్ధి గలవారు ఎప్పుడూ ధారణ చేయలేరు. మనం 84 జన్మలు తీసుకొని పాత్రను అభినయిస్తాము. శరీరాన్ని ధారణ చేస్తాము - ఎప్పుడైతే ఈ స్మరణ నడుస్తూ ఉంటుందో అప్పుడు వీరు పూర్తి త్రికాలదర్శులని, ఇతరులను కూడా త్రికాలదర్శులుగా చేసే పురుషార్థము చేస్తున్నారని అంటారు. అర్థం చేయించేందుకు కూడా పిల్లలల్లో ధైర్యముండాలి. అంధులకు ఊతకర్రగా అయ్యి నిదురిస్తున్న వారిని మేల్కొలపండి.
ప్రేయసులారా మేల్కొనండి! ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది. పాత ప్రపంచ వినాశనము జరుగుతోంది. మీరు త్రిమూర్తి బ్రహ్మ-విష్ణు-శంకరుల పేరును వినలేదా? బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. వీరంతా బ్రహ్మకుమారి-కుమారులే కదా! ఒంటరిగా బ్రహ్మ ఒక్కరే చేయరు కదా! ప్రజాపితతో పాటు తప్పకుండా బ్రహ్మకుమారీ-కుమారులు కూడా ఉంటారు. వీరి తండ్రి కూడా తప్పకుండా ఉంటారు. వారు వీరికి నేర్పిస్తారు. ఈ బ్రహ్మను జ్ఞానసాగరుడని అనరు. బ్రహ్మ చేతిలో శాస్త్రాలను చూపిస్తారు. కాని పరమపిత పరమాత్మ వీరిలోకి వచ్చి వీరి ద్వారా అన్ని వేదశాస్త్రాల సారాన్ని తెలియజేస్తారు. శాస్త్రాల సారాంశాన్ని బ్రహ్మ వినిపించరు. వారెక్కడ నుండి నేర్చుకుంటారు? వారికి ఎవరైనా తండ్రి లేక గురువు ఉంటారు కదా! ప్రజాపిత తప్పకుండా మనిషిగానే ఉంటాడు, ఇక్కడే ఉంటాడు. అతడు ప్రజలను రచిస్తారు. వారిని క్రియేటర్, జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ఫుల్ అని అనజాలరు. జ్ఞానసాగరుడు పరమపిత పరమాత్మ ఒక్కరు మాత్రమే. వారు వచ్చి ప్రజాపిత బ్రహ్మ ద్వారా చదివిస్తారు. దీనిని జ్ఞాన కలశము అని అంటారు. మొత్తం ఆధారమంతా ధారణ పైనే ఉంది. ఇన్ష్యూర్ చేసుకోండి, చేసుకోకపోండి, అది మీ పై ఉంది. బాబా ఎంతో బాగా ఇన్ష్యూర్ చేస్తారు. వారు ఇన్ష్యూరెన్స్ మ్యాగెట్, భక్తిమార్గములోనూ, జ్ఞానమార్గములోనూ వారు(బాబా) ఇన్ష్యూరెన్స్ మాగ్నెట్. తండ్రిని భక్తిమార్గములో ఆత్మలందరూ స్మృతి చేస్తారు - తండ్రీ! మీరు వచ్చి మమ్ములను దు:ఖాల నుండి విడిపించండి అని అంటారు. తండ్రి వచ్చి వారసత్వాన్ని ఇస్తారు. శాంతిధామములోకో, లేక సుఖధామములోకి పంపిస్తారు. ఎవరికైతే శాంతి వారసత్వము లభించాలో వారు కల్ప-కల్పమూ అదే శాంతి వారసత్వాన్ని తీసుకుంటారు. ఇప్పుడు మీరు సుఖ వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థము చేస్తున్నారు. ఇందులో చదవాలి, ఇతరులను చదివించాలి. ఎలాగైతే తండ్రి మధురాతి మధురమైనవారో, అలా వారి రచన కూడా మధురాతి మధురమైనదే. స్వర్గము ఎంత మధురమైనదో, అలాగే వారి రచన కూడా మధురాతి మధురమైనదే. స్వర్గము ఎంత మధురమైనది! అలాగే స్వర్గము అన్న పదమును అందరూ ప్రస్తావిస్తూ ఉంటారు. ఎవరైనా మరణిస్తే వారు స్వర్గస్థులయ్యారని అంటారు. కనుక తప్పకుండా అంతవరకు నరకంలో ఉండి ఇప్పుడు స్వర్గములోకి వెళ్ళారు అనే కదా! నిజానికి అలా వెళ్ళరు, అయినా అలా అంటారు. మీరు వ్రాయాలి, తప్పకుండా వారు నరకములో ఉన్నారనే కదా! ఇది నరకము, మరి వారిని మీరు పిలిచి వారికి ఈ నరకంలో తినిపించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? పిత్రులను పిలుస్తారు కదా! ఆత్మలను పిలవడమే పిత్రులను పిలవడము. మీరైతే ఆ పిత్రులందరి తండ్రిని పిలుస్తారు. ఆత్మలందరి తండ్రి కూర్చొని మిమ్ములను చదివిస్తారు. శివశక్తులైన మీరు ఎంతటి గుప్తమైన సైన్యము! శివుడైతే నిరాకారుడు కదా! శక్తులైన మీరు వారి పిల్లలు. శక్తి ఆత్మలోకి వస్తుంది. మనుష్యులు శారీరిక శక్తిని చూపిస్తారు. మీరు ఆత్మిక శక్తిని చూపిస్తారు. మీది యోగబలము, యోగము చేయడం ద్వారా మీ ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఆత్మలోకి శక్తి(పదును) వస్తుంది. మీ అందరికంటే మమ్మా జ్ఞానఖడ్గము చాలా పదునైనది. ఇది స్థూలమైన ఖడ్గము గురించిన విషయము కాదు.
నాలో జ్ఞాన శంఖ ధ్వనిని చేసే శక్తి చాలా బాగుంది అన్న జ్ఞానము ఆత్మకు ఉంటుంది. మనం శంఖు ధ్వనిని చేయగలము. నేను శంఖు ధ్వనిని చేయలేనని కొందరు అంటారు. జ్ఞాన శంఖు ధ్వనిని చేసేవారే నాకు అతిప్రియమైనవారు అని తండ్రి అంటారు. నా పరిచయమును కూడా జ్ఞానము ద్వారానే ఇస్తారు కదా! అనంతమైన తండ్రిని స్మృతి చేయండి అని చెప్పడం కూడా జ్ఞానాన్ని ఇవ్వడమే కదా! తండ్రిని స్మృతి చేయాలి. ఇందులో నోటితో మాట్లాడేది ఏమీ లేదు. తండ్రి మాకు జ్ఞానమునిస్తున్నారని లోలోపల భావించాలి. మీరు వాపస్ ఇంటికి రావాలని తండ్రి చెప్తున్నారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమౌతాయి. భగవానువాచ - మన్మనాభవ! తప్పకుండా వారు ఆ నిరాకారుడే కదా! నన్ను స్మృతి చేయండి అని సాకారుడు ఎలా అనగలరు? హే ఆత్మలారా! నన్ను స్మృతి చేయండి. నేను మీ తండ్రిని అని నిరాకారుడే అంటారు. నన్ను స్మృతి చేసినట్లయితే అంతిమ మతిని బట్టి గతి ఏర్పడ్తుంది. కృష్ణుడైతే ఇలా అనలేడు. అతడు మనుష్యుడే కదా! మీ తండ్రిని స్మృతి చేయమని ఆత్మలైన మీరు ఈ శరీరము ద్వారా జీవాత్మలతో అంటారు. తండ్రి కూడా ఆత్మలకు ''మన్మనాభవ'' అని చెప్తారు. ఆత్మలైన మీరు నా వద్దకే రావాలి. దేహీ-అభిమానులుగా అవ్వాలి. ఆత్మనైన నేను ఈ శరీరాన్ని నడిపించేవాడిని, ఇప్పుడు నేను మళ్లీ తండ్రి వద్దకు వెళ్లాలని మీరు బాగా అభ్యాసము చేయాలి. నడుస్తూ-తిరుగుతూ, లేస్తూ-కూర్చుంటూ నన్ను స్మృతి చేయండి అని తండ్రి అంటారు. ఎవరైతే అశాంతిని వ్యాపింపజేస్తారో వారు తమ పదవిని భ్రష్టము చేసుకుంటారు. ఇందులో చాలా చాలా మధురంగా అవ్వాలి. శివభోళాభగవానుడు ఎంత మధురమైనవారు, ఎంత ప్రియమైనవాడు....... అన్న పాట కూడా ఉంది కదా! వారి పిల్లలైన మీరు కూడా ఎంతో భోళా పిల్లలు. తండ్రిని స్మృతి చేసినట్లయితే స్వర్గానికి అధిపతులుగా అవుతారని మీరు ఫస్ట్క్లాస్ దారిని తెలుపుతారు. ఇంకెవ్వరూ ఇటువంటి బేరాన్ని ఇవ్వలేరు. కావున తండ్రిని ఎంతగానో స్మృతి చేయాలి. ఎవరి నుండి అయితే ఇంత సుఖము లభిస్తుందో వారినే పతితపావనా! రండి అని పిలుస్తారు. ఆత్మలు పతితంగా అయ్యాయి. వాటితో పాటు శరీరాలు కూడా పతితంగా అయ్యాయి. ఆత్మ, శరీరము రెండూ పతితంగా అయ్యాయి. వారైతే ఆత్మ నిర్లేపి, పతితముగా అవ్వదని అంటారు. కానీ అలా కాదు. ఒక్క పరమపిత పరమాత్మలో మాత్రమే ఎప్పుడూ మలినాలు ఏర్పడవు. మిగిలిన ఆత్మలన్నింటిలోనూ మలినాలు కలిసే తీరాలి. ప్రతి ఒక్కరూ సతో, రజో, తమోలలోకి రావలసిందే. ఈ పాయింట్లన్నీ ధారణ చేసి చాలా మధురంగా అవ్వాలి. కొందరితో శత్రుత్వము, కొందరితో స్నేహము కాదు. దేహాభిమానములోకి వచ్చి ఇక్కడే కూర్చుండిపోయి ఎవరితోనైనా సేవను తీసుకోవడము పూర్తిగా తప్పే అవుతుంది. అచ్ఛా! మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. జ్ఞానాన్ని స్మరిస్తూ త్రికాలదర్శులుగా అవ్వాలి, ఇతరులను తయారు చేయాలి. అంధులకు ఊతకర్రగా అయ్యి వారిని అజ్ఞాన నిద్ర నుండి జాగృతులుగా చేయాలి.
2. 21 జన్మల కొరకు మీ సర్వస్వాన్ని ఇన్ష్యూర్ చేసుకోవాలి. దానితో పాటు జ్ఞాన శంఖు ధ్వని కూడా చేయాలి.
వరదానము :-
'' అప్సెట్ అయ్యేందుకు బదులు లెక్కాచారాలను సంతోషంగా చుక్త చేసుకునే నిశ్చింత ఆత్మా భవ ''
ఒకవేళ ఎవరైనా ఎప్పుడైనా, ఏమైనా అన్నారంటే అందుకు వెంటనే అప్సెట్ అవ్వకండి. మొదట ఏ భావముతో అన్నారో స్పష్టపరచుకోండి లేక వెరిఫై చేయించండి. ఒకవేళ మీ తప్పు లేకుంటే నిశ్చింతులుగా అయిపోండి. బ్రాహ్మణాత్మల ద్వారా ఇక్కడే లెక్కాచారాలన్నీ చుక్త అవ్వాలనే విషయాన్ని స్మృతిలో ఉంచుకోండి. ధర్మరాజపురి నుండి రక్షించుకునేందుకు బ్రాహ్మణులు ఎక్కడో అక్కడ నిమిత్తులుగా అవుతారు. అందువలన భయపడకండి. సంతోషంగా చుక్త చేసుకోండి. ఇందులో మీ ఉన్నతియే జరుగుతుంది.
స్లోగన్ :-
'' తండ్రే నా ప్రపంచమనే స్మృతిలో సదా ఉండడమే సహజ యోగము ''