30-10-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


''మధురమైన పిల్లలారా - జ్ఞానము వలన లభించే సుఖము 21 తరాల వరకు కొనసాగుతుంది. అది సదా కాలము ఉండే స్వర్గ సుఖము, భక్తిమార్గములో తీవ్ర భక్తి ద్వారా అల్పకాల క్షణభంగుర సుఖము లభిస్తుంది ''

ప్రశ్న :-

ఏ శ్రీమతమును అనుసరిస్తూ పిల్లలైన మీరు సద్గతిని ప్రాప్తి చేసుకోగలరు ?

జవాబు :-

తండ్రి శ్రీమతము - ఈ పురాతన ప్రపంచాన్ని మరచి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. దీనినే సమర్పణమవ్వడం(బలిహారమవ్వడం) లేక జీవించి ఉండే మరణించడం(జీతే జీ మర్‌నా) అని అంటారు. ఈ శ్రీమతము ద్వారా మీరు అత్యంత శ్రేష్ఠంగా అవుతారు. మీకు సద్గతి లభిస్తుంది. సాకార మానవులు, మనుష్యులకు సద్గతినివ్వలేరు. సర్వుల సద్గతిదాత తండ్రి ఒక్కరే.

పాట :-

ఓం నమ: శివాయ...........................   

ఓంశాంతి.

పిల్లలు పాట విన్నారు. భగవంతుడు అత్యంత ఉన్నతులని మహిమ చేస్తారు. అయితే ఇప్పుడు మానవ మాత్రులకు భగవంతుని పేరు తెలియదు. భక్తులకు భగవంతుని గూర్చి తెలియదు. భగవంతుడే స్వయంగా వచ్చి తమ పరిచయమిచ్చినంతవరకు వారిని గురించి తెలియదు. జ్ఞానము, భక్తి అనగా ఏమో అర్థము చేయించబడింది. సత్య, త్రేతా యుగాలలో జ్ఞాన ప్రాలబ్ధముంటుంది. ఇప్పుడు మీరు జ్ఞానసాగరుని నుండి జ్ఞానము పొంది పురుషార్థము ద్వారా మీ కొరకు సదా సుఖ ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుంటున్నారు. మళ్లీ ద్వాపర-కలియుగాలలో భక్తి ఉంటుంది. జ్ఞాన ప్రాలబ్ధము సత్య, త్రేతా యుగాల వరకు కొనసాగుతుంది. జ్ఞానము వలన కలిగే సుఖమైతే 21 తరాల వరకు ఉంటుంది. అది సదాకాలము ఉండే స్వర్గ సుఖము. నరకములోని సుఖము అల్పకాల క్షణభంగుర సుఖము. సత్య, త్రేతా యుగాలలో జ్ఞాన మార్గములో నూతన ప్రపంచంగా నూతన భారతదేశముండేదని పిల్లలకు అర్థము చేయించడం జరుగుతుంది. దానినే స్వర్గమని అంటారు. ఇప్పుడిది తమోప్రధాన భారతదేశంగా, నరకంగా అయిపోయింది. అనేక ప్రకారాల దు:ఖముంది. స్వర్గములో దు:ఖానికి నామ-రూపాలే ఉండవు. గురువులను ఆశ్రయించే పనే ఉండదు. భక్తులను భగవంతుడే ఉద్ధరించాలి. ఇప్పుడు కలియుగ అంతిమ సమయము. వినాశనము అతిసమీపంగా ఎదురుగా నిల్చొని ఉంది. తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా జ్ఞానమిచ్చి స్వర్గ స్థాపన చేస్తారు. శంకరుని ద్వారా వినాశనము. విష్ణువు ద్వారా పాలన చేయిస్తారు. పరమాత్మ కర్తవ్యాలను గురించి ఎవ్వరికీ అర్థము కాదు. మనుష్యులను పాపాత్మ, పుణ్యాత్మ అని అంటారు. కాని పాప పరమాత్మ, పుణ్య పరమాత్మ అని ఎప్పుడూ అనరు. ఆత్మ పవిత్రంగా అవుతుంది. మొట్టమొదట ముఖ్యమైన ధర్మము దేవీ దేవతా ధర్మము. ఆ సమయంలో సూర్యవంశము వారే రాజ్యపాలన చేసేవారు. చంద్రవంశము వారు లేరు. ఒకే ధర్మముండేది. భారతదేశములో బంగారు, వెండి భవనాలుండేవి. వజ్ర వైఢూర్యాలతో ఇంటి గోడలు, పైకప్పులు అలంకరించబడి ఉండేవి. భారతదేశము వజ్ర తుల్యంగా ఉండేది. అదే భారతదేశమిప్పుడు గవ్వ సమానంగా తయారయ్యింది. తండ్రి చెప్తున్నారు - నేను కల్పాంతములో సత్యయుగ ప్రారంభములో సంగమ యుగంలో వస్తాను. మాతల ద్వారా భారతదేశాన్ని మళ్లీ స్వర్గంగా తయారుచేస్తాను. ఇది శివశక్తి పాండవ సైన్యము. పాండవుల ప్రేమ ఒక్క తండ్రి పైనే ఉంది. వారిని స్వయం తండ్రే చదివిస్తున్నారు. శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తిమార్గపు సామాగ్రి. అది భక్తి సంప్రదాయము. ఇప్పుడు తండ్రి వచ్చి అందరికీ వారి భక్తికి ఫలితంగా జ్ఞానమునిస్తున్నారు. ఆ జ్ఞానము ద్వారా మీరు సద్గతిలోకి వెళ్తారు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. ఆ తండ్రినే జ్ఞానసాగరులని అంటారు. పోతే మనుష్యులు మనుష్యులకు ముక్తి-జీవన్ముక్తినివ్వలేరు. ఈ జ్ఞానము ఏ శాస్త్రాలలోనూ లేదు. తండ్రి ఒక్కరిని మాత్రమే జ్ఞానసాగరులని అంటారు. వారి నుండి మీరు వారసత్వము తీసుకొని సర్వ గుణ సంపన్నులుగా, 16 కళా సంపూర్ణులుగా అవుతారు. ఇది దేవతల మహిమ. లక్ష్మీనారాయణులు 16 కళా సంపూర్ణులు, సీతా-రాములు 14 కళలు గలవారు. ఇది చదువు. ఇది సాధారణ సత్సంగము కాదు. సత్యమైనవారు ఒక్కరు మాత్రమే. వారే వచ్చి సత్యాన్ని అర్థము చేయిస్తారు. ఇది పతిత ప్రపంచము. పావన ప్రపంచములో పతితులుండనే ఉండరు. అలాగే పతిత ప్రపంచములో పావనులుండనే ఉండరు. పావనంగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. ఆత్మ ఓం నమ: శివాయ అని అంటుంది. ఆత్మ తన తండ్రికి నమస్తే అని చెప్తుంది. ఒకవేళ ఎవరైనా శివుడు నాలోనే ఉన్నాడంటే, వారు ఎవరికి నమస్కరించినట్లు? ఈ అజ్ఞానము బాగా వ్యాపించి ఉంది. ఇప్పుడు పిల్లలైన మిమ్ములను తండ్రి త్రికాలదర్శులుగా చేస్తారు. సర్వాత్మల నివాస స్థానము నిర్వాణధామము. అది స్వీట్‌హోమ్‌ అని పిల్లలైన మీకు తెలుసు. ముక్తిని అందరూ తలుస్తారు. అక్కడ మనము తండ్రి జతలో ఉంటాము. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేస్తారు. సుఖధామానికి వెళ్తే తండ్రిని స్మృతి చేయరు. ఇప్పుడిది దు:ఖధామము. అందరూ దుర్గతిలో ఉన్నారు. నూతన ప్రపంచములో భారతదేశము కొత్తదిగా ఉండేది. సుఖధామంగా ఉండేది. సూర్య వంశము, చంద్ర వంశాల వారి రాజ్యముండేది. లక్ష్మీనారాయణులకు, రాధా-కృష్ణులకు గల సంబంధమేమిటో మానవులకు తెలియదు. వారు వేరు వేరు రాజ్యాల రాకుమార-రాకుమారీలు. అంతేగాని ఇరువురూ పరస్పరము సోదరీ-సోదరులు కారు. ఆమె వేరుగా తన రాజధానిలో ఉండేది, కృష్ణుడు తన రాజధానిలో రాకుమారునిగా ఉండేవాడు. వారికి స్వయంవరమైన తర్వాత లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. సత్యయుగములోని ప్రతి వస్తువు సుఖమిస్తుంది. కలియుగములో ప్రతి వస్తువు దు:ఖమునిచ్చేది. సత్యయుగములో ఎవ్వరూ అకాల మృత్యువు చెందరు. నరుని నుండి నారాయణునిగా, నారి నుండి శ్రీ లక్ష్మిగా తయారయ్యేందుకు మనము మన తండ్రి పరమపిత పరమత్మ ద్వారా రాజయోగము నేర్చుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఇది పాఠశాల. ఆ సత్సంగాలలో ఏ లక్ష్యమూ ఉండదు. వేదశాస్త్రాలు మొదలైనవి వినిపిస్తూ ఉంటారు. తండ్రి ద్వారా మీరిప్పుడు ఈ మనుష్య సృష్టి చక్రమును తెలుసుకున్నారు. తండ్రినే జ్ఞానసాగరులు, ఆనందసాగరులు, దయాహృదయులు అని అంటారు. ఓ తండ్రీ! వచ్చి దయ చూపండి అని పాడుతూ ఉంటారు. హెవెన్లీ గాడ్‌పాదరే(స్వర్గ రచయితయే) స్వయంగా వచ్చి సంగమ యుగములో హెవెన్‌ను(స్వర్గాన్ని) స్థాపన చేస్తారు.

హెవెన్‌లో చాలా కొద్దిమంది మనుష్యులే ఉంటారు. అయితే మిగిలినవారంతా ఎక్కడికి వెళ్లిపోతారు? తండ్రి అందరినీ ముక్తధామములోకి తీసుకెళ్తారు. స్వర్గములో కేవలం భారతదేశమొక్కటే ఉండేది. మళ్లీ భారతదేశమే ఉంటుంది. ఇక్కడ భారతదేశము సత్య ఖండంగా మహిమ చేయబడింది. ఇప్పుడైతే భారతదేశము నిరుపేదగా అయిపోయింది. పైసా పైసాకు అడుక్కుంటూ ఉంటారు. భారతదేశము వజ్ర సమానంగా ఉండేది. ఇప్పుడు గవ్వ సమానంగా ఉంది. ఈ డ్రామా రహస్యాన్ని అర్థము చేసుకోవాలి. మీకిప్పుడు రచయిత అయిన తండ్రిని, వారి రచనల ఆదిమధ్యాంతాలు తెలుసు. కాంగ్రెస్‌వారు వందేమాతరమ్‌ అని పాడ్తారు కూడా. కాని పవిత్రులకు మాత్రమే వందనము చేయబడ్తుంది. పరమాత్మయే వచ్చి 'పందేమాతరమ్‌' అనడం ప్రారంభిస్తారు. శివబాబాయే వచ్చి నారి స్వర్గానికి ద్వారము అని అన్నారు. శక్తిసేన కదా! వీరు స్వర్గ రాజ్యమునిప్పించేవారు. దానినే వరల్డ్‌ ఆల్‌మైటీ అథారిటీ రాజ్యమని అంటారు. శక్తులైన మీరు స్వరాజ్యాన్ని స్థాపన చేశారు. ఇప్పుడు మళ్లీ స్థాపన అవుతూ ఉంది. సత్యయుగమును రామరాజ్యమని అంటారు. ఇప్పుడు కూడా రామరాజ్యము రావాలని అంటారు. అయితే దానిని మానవమాత్రులెవ్వరూ స్థాపించలేరు. నిరాకార గాడ్‌ఫాదరే స్వయంగా వచ్చి చదివిస్తారు. వారికి కూడా శరీరము తప్పకుండా కావాలి. బ్రహ్మ శరీరములో తప్పకుండా రావాల్సి వచ్చింది. శివబాబా ఆత్మలైన మీ అందరికి తండ్రి. ప్రజాపితకు కూడా మహిమ ఉంది. పిత అనగా తండ్రి కదా! బ్రహ్మను గ్రేట్‌ గ్రేట్‌ గ్రాండ్‌ఫాదర్‌ అని అంటారు. ఆదిదేవుడు, ఆదిదేవి ఇరువురూ కూర్చొని తపస్సు చేస్తున్నారు. మీరు కూడా తపస్సు చేస్తున్నారు. ఇది రాజయోగము, సన్యాసులది హఠయోగము. వారెప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. గీత మొదలైన శాస్త్రాలన్నీ భక్తిమార్గపు సామాగ్రి. వాటిని చదువుతూ వచ్చారు. కాని తమోప్రధానమైపోయారు. దేని ద్వారా వినాశనము జరగబోతుందో ఆ మహాభారత యుద్ధమిదే. సైన్స్‌(విజ్ఞానము) ఏ వేదాలలోనూ లేదు. వాటిలో జ్ఞానానికి సంబంధించిన విషయాలున్నాయి. సైన్స్‌ బుద్ధి చూపే చమత్కారము ద్వారా నూతన వస్తువులను అన్వేషించి కనుగొంటారు. సుఖము కొరకు విమానాలు మొదలైనవి తయారు చేస్తారు. చివరిలో వీటి ద్వారానే వినాశనమౌతుంది. సుఖమునిచ్చే నైపుణ్యము భారతదేశములో నిలబడ్తుంది. దు:ఖమునిచ్చే యుక్తులు మారణాయుధాలు, హతమార్చుట మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. సైన్స్‌(విజ్ఞానపు) తెలివి కొనసాగుతూ ఉంటుంది. ఈ బాంబులు మొదలైనవి కల్పక్రితము కూడా తయారయ్యాయి. పతిత ప్రపంచము వినాశనము తర్వాత నూతన ప్రపంచ స్థాపన జరుగనున్నది. తండ్రి చెప్తున్నారు - మీరు 84 జన్మలు పూర్తి చేశారు. ఇప్పుడు దేహ అహంకారమును వదిలి తండ్రి అయిన నన్ను స్మృతి చేస్తే స్మృతి అనే యోగాగ్నిలో వికర్మలు వినాశనమవుతాయి. రావణుడు మీ ద్వారా అనేక వికర్మలు చేయించాడు. పవిత్రంగా అయ్యేందుకు ఒకే ఒక ఉపాయముంది. మీరూ ఆత్మయే, నేను ఆత్మనని అంటారే గాని నేను పరమాత్మనని అనరు. నా ఆత్మకు కోపము తెప్పించకు, విసిగించకు అని అంటారు. ఆత్మయే పరమాత్మ అని అనడం చాలా పెద్ద తప్పు. ఇప్పుడున్నది తమోప్రధాన వ్యభిచారి భక్తి. ఎవరిని పడితే వారిని కూర్చుని పూజిస్తూ ఉంటారు. అవ్యభిచారి స్మృతి అనగా ఒక్కరినే స్మృతి చేయడం. ఇప్పుడు వ్యభిచారి భక్తి కూడా అంతమవ్వనున్నది. తండ్రి వచ్చి అనంతమైన వారసత్వమునిస్తారు. అందరికీ సుఖమునిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి చెప్తున్నారు - నా ఒక్కరితో మీ బుద్ధియోగాన్ని జోడించడం ద్వారానే అంతమతి సో గతి(చివరి సమయములో స్మృతి ఎలా ఉంటుందో అలా) అయిపోతుంది. నేను స్వర్గ రచయితను. ఇది ముళ్ల ప్రపంచము ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు పాత ప్రపంచము పరివర్తనవుతూ ఉంది. జ్ఞానామృత కళశాన్ని మాతల పై ఉంచుతారు. ఇది జ్ఞానము కానీ అజ్ఞానాన్ని విషముతో పోల్చి జ్ఞానమును అమృతమని అన్నారు. అమృతము వదిలి విషమునెందుకు త్రాగుతారని అంటారు. శ్రీమతము ద్వారానే మీరు శ్రేష్ఠంగా అవుతారు. పరమపిత పరమాత్మ వచ్చి శ్రీమతమునిస్తారు. కృష్ణుడు కూడా శ్రీమతము ద్వారానే ఇంత శ్రేష్ఠంగా అయ్యాడు. ఇవి అర్థము చేసుకునే విషయాలు. ఈ పాత ప్రపంచాన్నంతా మరిచి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. బలిహారము(సమర్పణ) కూడా ఇప్పుడే కావలసి ఉంటుంది. దీనినే 'జీవించి ఉండే మరణించుట' అని అంటారు. భక్తిమార్గములోని విషయాలు వేరుగా ఉంటాయి. అది భక్తి సంప్రదాయము. భక్తిమార్గములో అనేకమంది గురువులున్నారు. కాని సద్గతిదాత ఒక్క నిరాకార పరమపిత పరమాత్మ మాత్రమే. సాకార మనుష్యులు మనుష్యులకు సద్గతినివ్వలేరు. సదా కొరకు సుఖమునివ్వలేరు. సదా సుఖమునిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇది ఒక పాఠశాల. లక్ష్యము, ఉద్ధేశ్యాన్ని కూడా తండ్రి తెలుపుతారు. మీకు స్వర్గ సుఖపు వారసత్వము లభిస్తుందని తండ్రి చెప్తున్నారు. మిగిలిన వారంతా ముక్తిధామములోకి వెళ్లిపోతారు. శాంతిధామము, సుఖధామము ఇదేమో దు:ఖధామము. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. దీనిని స్వదర్శన చక్రమని అంటారు. ఈ డ్రామా చక్రము నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు అనగా పాత్ర చేయకుండా ఉండేందుకు వీలు లేదు. ప్రతి ఒక్కరిది తయారైన అవినాశి పాత్ర. తండ్రి మిమ్ములను చదివించి మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు. ఎవరెంత బాగా చదువుకుంటే అంత మంచి పదవి పొందుతారు. కొంతమంది రాజులుగా అవుతారు, కొంతమంది ప్రజలుగా అవుతారు. సూర్యవంశీయుల రాజ్యము కదా! సత్యయుగములో సూర్యవంశీయులు ఉండేవారు. అప్పుడు ఇతరులెవ్వరూ లేరు. భారత ఖండమే అత్యంత ఉన్నతమైన సత్య ఖండంగా ఉండేది. ఇప్పుడు అసత్య ఖండమైపోయింది. దీనినే రౌరవ నరకమని అంటారు. ధనము కొరకు ఎన్ని జగడాలు, కొట్లాటలు, మారణహోమాలు జరుగుతున్నాయి! అచ్చట మీకు లభించని వస్తువే ఉండదు. ఆ వస్తువులను పొందేందుకు పాపము చేసే అవసరము ఉండదు. ఆ తండ్రియే ఈ మాతల ద్వారా ఈ భ్రష్ఠాచార ప్రపంచాన్ని శ్రేష్ఠాచార ప్రపంచంగా చేస్తున్నారు. ఈ మాతలకే తండ్రి వందేమాతరమ్‌ అని అంటున్నారు. సన్యాసులు వందేమాతరమ్‌ అని అనరు. వారిది హద్దు సన్యాసము. ఇది అనంతమైన సన్యాసము. బుద్ధి ద్వారా మొత్తం ప్రపంచాన్నంతా సన్యసించాలి. శాంతిధామము, సుఖధామాలను స్మృతి చేయాలి. దు:ఖధామాన్ని మర్చిపోవాలి. ఇది తండ్రి ఆజ్ఞ. తండ్రి ఆత్మలకు అర్థము చేయిస్తున్నారు - మీరు ఈ చెవుల ద్వారా వింటున్నారు. శివబాబా ఈ అవయవాల ద్వారా అర్థము చేయిస్తున్నారు. వారు జ్ఞానసాగరులు. ఇతడు ఏ సాధువు, సత్పురుషుడు, మహాత్ముడు కాదు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. తండ్రి పై సంపూర్ణ బలిహారమవ్వాలి(సమర్పణవ్వాలి). దేహ అహంకారాన్ని వదిలి యోగాగ్ని ద్వారా వికర్మలు వినాశనం చేసుకోవాలి.

2. లక్ష్యమును, ఉద్ధేశ్యాన్ని బుద్ధిలో ఉంచుకొని బాగా చదువుకోవాలి. తయారై తయారవుతున్న డ్రామాను బుద్ధిలో ఉంచుకొని స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి.

వరదానము :-

''సంతుష్టత(తృప్తి) సర్టిఫికెట్‌ ద్వారా భవిష్య రాజ్య భాగ్య సింహాసనాన్ని ప్రాప్తి చేసుకునే సంతుష్టమూర్త్‌ భవ ''

'' సంతుష్టంగా(తృప్తిగా) ఉండాలి, అందరినీ సంతుష్ట(తృప్తి) పరచాలి'' - ఈ స్లోగన్‌ సదా మీ మస్తకమనే బోర్డు పై వ్రాయబడి ఉండాలి. ఎందుకంటే ఈ సర్టిఫికెట్‌ ఉన్నవారే భవిష్యత్తులో రాజ్య భాగ్య సర్టిఫికెట్‌ను తీసుకుంటారు. కనుక ప్రతిరోజు అమృతవేళలో ఈ స్లోగన్‌ను స్మృతిలోకి తెచ్చుకోండి. ఎలాగైతే బోర్డు పైన స్లోగన్‌ వ్రాస్తారో, అలా సదా మీ మస్తకమనే బోర్డు పై ఈ స్లోగన్‌ను పరుగు తీయించండి. అప్పుడు అందరూ సంతుష్టమూర్తులుగా అవుతారు. ఎవరైతే సంతుష్టంగా ఉంటారో వారు సదా ప్రసన్నంగా ఉంటారు.

స్లోగన్‌ :-

''పరస్పరము స్నేహము మరియు సంతుష్టతా సంపన్నమైన వ్యవహారము చేయువారే సఫలతా మూర్తులుగా అవుతారు ''